breaking news
National
-
అదీ భారతదేశమే కదా.. నన్ను రక్షించలేరా?: రాహుల్ గాంధీ
పంజాబ్ వరద ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. భద్రతా కారణాలను చూపిస్తూ ఆయన్ని పలు గ్రామాల్లోకి పోలీసులు అనుమతించలేరు. దీంతో అధికారులను ఆయన నిలదీయగా.. మరోవైపు పంజాబ్ పోలీసులు, ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.పంజాబ్లో భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి, ప్రజలకు అండగా నిలుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అయితే..बाढ़ ने पंजाब में भीषण तबाही मचाई है।आज घोनेवाल में गांववासियों से मिला - उजड़े आशियाने, बर्बाद खेत, बिखरी ज़िंदगियां। दर्द आंखों में साफ दिखता है, मगर हौसला अटूट है।राज्य और केंद्र सरकार दोनों हर हाल में ये सुनिश्चित करें कि राहत पैकेज और मुआवज़ा बिना देरी पीड़ितों के हाथों… pic.twitter.com/f1nUxJ945S— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2025గురుదాస్పూర్ జిల్లాలో రావి నది వరదలతో దెబ్బ తిన్న టూర్ గ్రామంలోకి వెళ్లనీయకుండా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులతో ఆయన సంభాషణ ఇలా సాగింది..రాహుల్ గాంధీ: మీరు చెబుతున్నది ఏమిటంటే, భారత భూభాగంలో మీరు నన్ను రక్షించలేరు. అదేనా?పోలీస్ అధికారి: మేము ఎప్పుడూ మీ రక్షణకు సిద్ధంగా ఉన్నాంరాహుల్ గాంధీ: మీరు చెబుతున్నది ఇది భారతదేశమే (రవి నదికి అటుపక్కనున్న గ్రామాన్ని చూపిస్తూ), కానీ మీరు నన్ను అక్కడ రక్షించలేరు. అది భారతదేశం కాదా?.. ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్లలేరు అంటే, పంజాబ్ పోలీస్ రక్షించలేరు అని అర్థమా?పోలీస్ అధికారి: అది భారత్ భూభాగమే అయినా, ప్రస్తుతం అక్కడ రక్షణ కల్పించడం కష్టంఅయినప్పటికీ రాహుల్ గాంధీ బోటు ద్వారా ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు వారించడంతో ఆయన మరోసారి వాళ్లను నిలదీశారు.నది ప్రశాంతంగానే ఉంది. ఇది నిజమైన కారణం కాదు అంటూ టూర్ గ్రామానికి వెళ్లకుండా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలు ఘోనేవాల్ (అమృత్సర్) మరియు గుర్చక్ (గుర్దాస్పూర్) గ్రామాల్లో పర్యటించారు. ఇక ఈ ఘటనపై పంజాబ్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భారతదేశంలోనే మనం సురక్షితంగా లేకపోతే.. మరెక్కడ సురక్షితంగా ఉంటాం? అని ప్రశ్నిస్తోంది.पंजाब: गुरदासपुर में राहुल गांधी पाकिस्तान सीमा के पास प्रभावित गांवों का दौरा करने गए◆ सुरक्षा कारणों से SP जुगराज सिंह ने उन्हें आगे जाने से रोका, दोनों में बहस हुई◆ राहुल गांधी गांवों का दौरा किए बिना लौट आए, सुरक्षा मुद्दों पर विवाद बना@RahulGandhi | Punjab | pic.twitter.com/n8OtBTUjOc— Zuber Chaudhary (@ZuberChaudhar18) September 16, 2025మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ.. అక్కడ మన ప్రజలే(భారతీయులే) ఉన్నారు. రాహుల్ గాంధీ వాళ్ల పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. మూడు రోజులుగా కాంగ్రెస్ తరఫున అక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. అలాంటిది ప్రజల్ని కలవనివ్వకపోవడం దురదృష్టకరం అని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ.. భారతదేశంలో రాహుల్ గాంధీకి పాకిస్తాన్ నుంచి ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాహుల్ గాంధీని రవి నదికి అటుపక్కనున్న గ్రామానికి వెళ్లనివ్వకుండా భద్రతా కారణాలు చూపడం సరైంది కాదు. ఇది భారతదేశమే, అక్కడ మన ప్రజలే ఉన్నారు. ఆయన వారి సమస్యలు తెలుసుకోవాలనుకున్నారు అని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పార్థాప్ సింగ్ బాజ్వా ఈ పరిణామంపై కాస్త తీవ్రంగానే స్పందించారు. ‘‘అధికారులు చెబుతున్నట్లు అది భద్రతా సమస్య కానేకాదు. ఇది రాజకీయ నిర్ణయం. బాధ్యత తప్పించుకునేందుకు ప్రభుత్వం నిరాధార భద్రతా కారణాలు చూపుతోంది. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని ఆయన అన్నారు.పంజాబ్ పోలీసులు ఏం చెబుతున్నారంటే..రాహుల్ గాంధీ పర్యటించాల్సిన టూర్ గ్రామం భారత్లోనే ఉంది. పంజాబ్ గుర్దాస్పూర్ జిల్లా రావి నది ఒడ్డున ఉంది. అయితే, ఆ ప్రాంతం ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఇటీవల వరదలతో బార్డర్ ఫెన్సింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి నిఘా పటిష్టం చేశారు. అందుకే పంజాబ్ పోలీస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రాహుల్ గాంధీకి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. రాహుల్కే కాదు.. మరేయితర పార్టీ నేతలకూ అక్కడికి వెళ్లేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదు. -
ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్.. రెడ్ అలర్ట్ జారీ
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల ధాటికి ఇద్దరు గల్లంతు కాగా.. వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. పలు నివాసాలు.. దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనం అయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.రాత్రి కురిసిన వానకు భారీగా వరద చేరడంతో తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో.. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) కుంకుమ్ జోషి పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీడబ్ల్యూడీ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంతో ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు సీఎం పుష్కర్ సింగ్ ధామీ అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 📍Uttarakhand | #Watch: Torrential rains cause the Tamsa River to overflow, submerging the Tapkeshwar Mahadev Temple in Dehradun📹: ANI/X pic.twitter.com/RPCN37x2k2— Ranveer Singh (@Ranveer6829) September 16, 2025మరోవైపు.. డెహ్రాడూన్ క్లౌడ్బరస్ట్తో రిషికేష్లోని చంద్రభాగా నది ప్రవాహం కూడా పెరుగుతోంది. దీంతో తీర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించే ఎన్డీఆర్ఎఫ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇంకోవైపు.. పితోరాఘడ్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉత్తరకాశీ, చమోలీ, రుద్రప్రయాగ, పౌరీ, భాగగేశ్వర్, నైనిటాల్ జిల్లాల్లో ఈ వర్షాకాలం సీజన్లో క్లౌడ్ బరస్ట్లు సంభవించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ప్రకృతి విపత్తులతో 85 మంది మరణించగా.. 128 మంది గాయపడ్డారు. మరో 94 మంది ఆచూకీ లేకుండా పోయారు. సెప్టెంబర్ 11వ తేదీన ప్రధాని మోదీ డెహ్రాడూన్ను సందర్శించి.. సహాయక చర్యలను సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు 1,200 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. -
పూజా ఖేడ్కర్ తండ్రి వీరంగం.. భారీ నష్టపరిహారం కోసమే ట్రక్కు హెల్పర్ కిడ్నాప్
ముంబై: సప్పెండ్ అయిన ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ వీరంగం సృష్టించారు. తన అసిస్టెంట్ సాయంతో ఒక ట్రక్కు హెల్పర్ను కిడ్నాప్ చేశాడు. తమ రెండు కోట్ల ఖరీదైన ఎస్యూవీ వాహనాన్ని ట్రక్కుతో ఢీకొని, అది డ్యామేజ్ అయ్యేందుకు కారణంగా నిలిచిన ట్రక్కు హెల్పర్ను భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, దిలీప్ ఖేడ్కర్ అతనిని కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు.ట్రక్కు హెల్పర్ కిడ్నాప్ కేసు విచారణకు పోలీస్స్టేష్టన్కు వస్తామని చెప్పిన పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్, తల్లి మనోరమ ఆ తరువాత పరారయ్యారని పోలీసులు తెలిపారు. ట్రక్కు హెల్పర్ ప్రహ్లాద్ కుమార్(22)ను దిలీప్ ఖేడ్కర్ ఇంటి నుంచి రక్షించేందుకు వెళ్లిన పోలీసు బృందంపై మనోరమ ఖేడ్కర్ కుక్కలను ఉసిగొల్పింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.నవీ ముంబైలోని ఐరోలి వద్ద దిలీప్ ఖేడ్కర్, అతని అంగరక్షకుడు ప్రఫుల్ సలుంఖే ప్రయాణిస్తున్న అత్యంత ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్ను సిమెంట్ మిక్సర్ ఢీకొట్టింది. ఈ నేపధ్యంలో ట్రక్కు హెల్పర్ ప్రహ్లాద్ కుమార్ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని దిలీప్ ఖేడ్కర్ పూణేలోని చతుర్శృంగిలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ప్రహ్లాద్ కుమార్పై దాడి చేశారనే ఆరోపణలున్నాయి. ‘ప్రమాదం జరిగినప్పుడు దిలీప్ ఖేద్కర్, అతని అంగరక్షకుడు కారులో ఉన్నారు. కారుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ వారు ట్రక్కు సహాయకుడిని కిడ్నాప్ చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ దహనే మీడియాకు తెలిపారు.ప్రహ్లాద్ కుమార్ కనిపించడం లేదంటూ ట్రక్కు యజమాని తమకు ఫిర్యాదు చేశారని, ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా పోలీసులు ఖేద్కర్ ఇంటికి చేరుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు. అక్కడ మనోరమ ఖేద్కర్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని. వారి ఇంటి గోడకు అతికించిన నోటీసును కూడా చింపివేశారని పేర్కొన్నారు. దిలీప్ ఖేడ్కర్ దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశీ విద్య: కొత్త కోర్సులు.. సరికొత్త దేశాలు
విదేశాల్లో చదువుకోవాలని ఎవరికి ఉండదు? అక్కడే చదువుకుని, స్థిరపడాలన్నదీ కోట్లాదిమంది భారతీయుల కల. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలోని పేరొందిన యూనివర్సిటీలకు వెళ్లడం అనేది గతం. ఇప్పుడు ట్రెండ్ క్రమంగా మారుతోంది. సంప్రదాయ దేశాలకు బదులుగా భారతీయ విద్యార్థులు నూతన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు.ఎంబీబీఎస్ విద్య కోసం మధ్య ఆసియాలోని కిర్గిస్తాన్ ఇంజనీరింగ్ కోసం కంబోడియా, సప్లై చైన్ మేనేజ్మెంట్ చదివేందుకు మాల్టా, సాంస్కృతిక అధ్యయనాల కోసం ఉత్తర కొరియాకు చలో అంటున్నారు మన విద్యార్థులు. దేశీయంగా తీవ్రమైన పోటీ, అమెరికాలో రోజుకో రకంగా మారుతున్న విధానాలు; ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో వలసలపై పెరుగుతున్న వ్యతిరేకత, వీసాల లభ్యత కఠినతరం కావడం; పలు ఇతర దేశాల్లో విద్యా వ్యయాలు పెరుగుతుండడం.. వీటన్నింటి కారణంగా నూతన కోర్సుల కోసం కొత్త దేశాల బాట పడుతున్నారు.సరికొత్త గమ్యస్థానాలుమాల్టా, పోలాండ్, లాత్వియా, సైప్రస్ వంటిచిన్న యూరోపియన్ దేశాలు వివిధ ప్రోగ్రామ్స్లో భారతీయులు సహా విదేశీయులకు సులభంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. అలా అక్కడ చదివిన గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు, అధునాతన డిగ్రీల కోసం ఫ్రాన్ ్స, జర్మనీ, యూకే, మధ్యప్రాచ్యాలకు వెళ్తున్నారు. రొమేనియా, బల్గేరియా, హంగేరీలలోని భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థులు చౌకైన స్థానిక ప్రోగ్రామ్స్లో చేరుతున్నారు. కానీ చాలామంది అధిక జీతాలు, అంతర్జాతీయ ఎక్స్పోజర్ కోసం జర్మనీ, నెదర్లాండ్స్, స్కాండినేవియాకు మారుతున్నారు. అలాగే బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్లలో ఎంబీబీఎస్ చేసినవాళ్లు.. ఎక్కువ జీతాల కోసం మధ్య ప్రాచ్యదేశాలకు మరలుతున్నారు.లైటింగ్, లైట్ డిజైన్ఆర్కిటెక్చరల్, వేడుకల కోసం వేదికలు, నగరాల్లోని భవంతుల్లో లైటింగ్ కోసం కళాత్మకతను సాంకేతికతతో జోడించేలా శిక్షణ పొందడం. కేంద్రాలు: మిలాన్ (ఇటలీ), బిల్బావ్ (స్పెయిన్ ), స్టాక్హోం (స్వీడన్ ).మ్యూజిక్ థెరపీ భావోద్వేగ,ఆలోచన, శారీరక స్వస్థత కోసంసంగీతాన్ని వైద్యసాధనంగాఉపయోగించడం.కేంద్రాలు: లిమెరిక్(ఐర్లాండ్), నెదర్లాండ్స్.క్రూజ్ లైన్ నిర్వహణ ప్రపంచ క్రూజ్ పరిశ్రమ కోసం రూపొందించినప్రత్యేక ఆతిథ్య, కార్యకలాపాలకు సంబంధించిన విద్యా కార్యక్రమాలు. కేంద్రాలు: స్పెయిన్,స్విట్జర్లాండ్మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ నురగ (ఫోమ్), జెల్స్తదితరాలతో రుచులు, భోజన అనుభవాలను మార్చడానికి శాస్త్రాన్ని ఉపయోగించడం.కేంద్రాలు:స్పెయిన్, జపాన్,నెదర్లాండ్స్గేమ్ డిజైనింగ్గ్రీన్ సప్లై చైన్ పర్యావరణ అనుకూల, సమర్థవంతమైన, తక్కువ కర్బన ఉద్గారాలున్న రవాణా వ్యవస్థల రూపకల్పనకేంద్రాలు: స్వీడన్,డెన్మార్క్, నెదర్లాండ్స్వీడియో గేమ్స్ను సృష్టించడం, అభివృద్ధి, తయారీ; కేంద్రాలు: ఫిన్లాండ్హ్యుమానిటేరియన్ లాజిస్టిక్స్ విపత్తుల నుంచి ఉపశమనం, సహాయం, పంపిణీ, సంక్షోభ సమయంలో ప్రతిస్పందన కోసం సరఫరా వ్యవస్థల నిర్వహణకేంద్రాలు: ఫిన్లాండ్, బెల్జియం,స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికాసరఫరాను మించిన డిమాండ్ఈ ఏడాది 22 లక్షలకు పైగా నీట్ అభ్యర్థులు.. భారత్లో కేవలం 1.18 లక్షల ఎంబీబీఎస్ సీట్ల కోసం పోటీ పడ్డారు. అంటే అంతరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే విద్యార్థులు సంప్రదాయేతర దేశాలవైపు చూస్తున్నారు.చౌకైన ఎంపికభారత్లోని ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే ‘చాలా తక్కువ ఖర్చు’తో.. ఎంబీబీఎస్విద్యార్థులను తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఉజ్బెకిస్తాన్ ఒక్కటే 6వేలకుపైగా విద్యార్థులకు ఆతిథ్యం ఇస్తోంది. విజయవాడ, వరంగల్, తిరుపతి వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఇప్పుడు విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఏజెన్సీలు చెబుతున్నాయి.ఖర్చు ఎంతంటే?భారత్ (ప్రైవేట్లో ఎంబీబీఎస్):పూర్తి డిగ్రీకి రూ.1 కోటికిపైగాఉజ్బెకిస్తాన్/రష్యా/ఫిలిప్పీన్పూర్తి ఎంబీబీఎస్కు రూ.15–35 లక్షలుపోలండ్/చెక్ రిపబ్లిక్: ఏడాదికి రూ.9.5–17.5 లక్షలు (ట్యూషన్+జీవన వ్యయం)జర్మనీ (ప్రభుత్వ విశ్వవిద్యాలయం):సంవత్సరానికి రూ.30,000-సాక్షి, స్పెషల్ డెస్క్ -
హీరోయిన్లా ఉన్నావంటూ..
శివాజీనగర: బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు తరచూ జరుగుతున్నాయి. కాలేజీ విద్యార్థినిని ఆటో డ్రైవర్ వేధించిన ఘటన వెలుగుచూసింది. 8న పుట్టేనహళ్లి ఠాణాలో యువతి (19) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్ హనుమంతప్ప తళవార్పై కేసు నమోదు చేశారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేందుకు విద్యారి్థని ర్యాపిడో ద్వారా ఆటోని బుక్ చేసింది. సాయంత్రం 5.15 గంటల సమయంలో ఆమెను ఇంటివద్ద డ్రాప్ చేసిన డ్రైవర్, నీవు సినిమా హీరోయిన్లా ఉన్నావు, బ్యాగ్ను ఇంటివరకు మోసుకురావాలా అని వ్యాఖ్యలు చేశాడు. ఆమెకు దగ్గరగా వెళ్లి నీకు జ్వరం ఉందా అని ఆమె చెంపను తాకాడు. యువతి అడ్డుచెబుతున్నా అసభ్యంగా ప్రవర్తించసాగాడు, ఆమె భయంతో ఆటో డ్రైవర్ను నెట్టివేసి ఇంటిలోకి పరుగులు తీసింది. ఆటోడ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
Indore: జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్లో మద్యం మత్తులో ట్రక్కును నడిపిన డ్రైవర్ వాహనాన్ని జనాలపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు త్రీవంగా గాయపడ్డారు.ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాల్లలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం, రక్తమోడుతున్న స్థితిలో కొందరు కాపాడాలని అరుస్తుండటం స్థానికుల హృదయాలను కలచివేసింది. ప్రమాదంలో బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయ రోడ్డులో శిక్షక్ నగర్లోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిన ట్రక్కు జనసమూహాన్ని దూసుకుంటూ వెళ్లడంతో పాటు10 వాహనాలను ఢీకొన్నదని పోలీసులు తెలిపారు.#WATCH | Indore, Madhya Pradesh: DCP Zone-1 Krishna Lalchandani says, "The driver was highly inebriated and lost control of the vehicle, which led to this accident. A bike also came under its grip and was dragged along. So far, two people have died. Nine people are injured,… https://t.co/rPBcsaVQUi pic.twitter.com/BqwlwNtBW3— ANI (@ANI) September 15, 2025‘డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. అతను మొదట రామచంద్ర నగర్ కూడలి వద్ద ఇద్దరు బైకర్లను ఢీకొని, వారి వాహనాలను ఈడ్చుకుంటూ వెళ్లి, ఆపై బడా గణపతి ప్రాంతం వైపు నిర్లక్ష్యంగా ట్రక్కును పోనిచ్చాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కృష్ణ లాల్చందాని తెలిపారు. ఆ ట్రక్కు డ్రైవర్ను పట్టుకుని, మల్హర్గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించామని తెలిపారు. కాగా ప్రమాదం స్థలంలో పలు మృతదేహాలు పడివున్నయని, ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. స్థానికులు ప్రమాదబాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం అనంతరం ట్రక్కు మంటల్లో చిక్కుకుంది. ఆగ్రహంతో స్థానికులు వాహనాన్ని తగలబెట్టారనే వాదన వినిపిస్తోంది. అయితే ట్రక్కు ముందుగా ఒక మోటార్ సైకిల్ను ఢీకొన్నప్పుడు.. బైక్ ఇంధన ట్యాంక్ పేలి, మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, పారామెడిక్స్తో పాటు అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఘటన దరిమిలా రెండు మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వివిధ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు.‘ఇండోర్లో జరిగిన ట్రక్కు ప్రమాదం చాలా విషాదకరం. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్నాక, అదనపు ప్రధాన కార్యదర్శి (హోం)ని ఇండోర్కు వెళ్లాలని ఆదేశించాను. రాత్రి 11 గంటలకన్నా ముందుగానే నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించడానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశించాను. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.आज इंदौर में हुई ट्रक दुर्घटना दुखद है। इस घटना की विस्तृत जानकारी प्राप्त कर मैंने निरीक्षण हेतु अपर मुख्य सचिव गृह को इंदौर जाने के निर्देश दिए हैं। साथ ही, रात 11 बजे से पहले शहर में भारी वाहनों के प्रवेश के कारणों की प्रारंभिक तथ्यपरक जाँच कराने के भी निर्देश दिए हैं।…— Dr Mohan Yadav (@DrMohanYadav51) September 15, 2025 -
మహాఘఠ్బంధన్లో లుకలుకలు..!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్బంధన్లో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మహాఘఠ్బంధన్ను వేరుపడి ఒంటరి పోరు చేసేందుకు ఆమ్ఆద్మీ పార్టీ నిర్ణయించగా, అదే దారిలో ఆర్జేడీ సైతం పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్ది వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నా..ఇప్పటివరకు సీట్ల పంపకాలు ఖరారు కాకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముఖం చాటేస్తుండటంతో కాంగ్రెస్పై గుర్రుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చేసిన ప్రకటన ఘట్బంధన్ మైత్రిని ప్రశ్నార్థకం చేస్తోంది. అవినీతి.. కులాల లెక్కలు బిహార్లో 1980 వరకు కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శక్తిగా ఉండేది. 1990లో లాలూప్రసాద్ యాదవ్, నితీశ్కుమార్ వంటి ప్రాంతీయ నేతల ఆవిర్భావంతో కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. చేసేది లేక వారి దయాదాక్షిణ్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతూ వస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మిత్రపక్షమైన ఆర్జేడీతో కలిసి ఈ ఎన్నికల్లో బిహార్లో తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంతో మొన్నటివరకు ముందుకెళ్లింది. గత ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు గాను 75 స్థానాల్లో గెలిచింది. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీకి గరిష్ట స్థానాలు దక్కుతాయని, తానే సీఎం అభ్యర్థిని అవుతాననే ఉత్సాహంతో తేజస్వీ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఇటీవలే ఓట్ చోరీపై రెండు వారాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహాఘఠ్బంధన్ తరఫున తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా తప్పించుకున్నారు. తేజస్వి స్వయంగా తనను తాను బిహార్ సీఎంఅభ్యర్థిగా ప్రకటించుకుంటున్నా, కాంగ్రెస్ మాత్రం మిన్నకుండిపోయింది. ఇటీవలే కాంగ్రెస్ బిహార్ ఇన్చార్జి కృష్ణ అల్లవేరు మాట్లాడుతూ ప్రజలే సీఎంను నిర్ణయిస్తారని ప్రకటించడంతో గందరగోళం ఇంకాస్త పెరిగింది. కాంగ్రెస్ అంచనా వేరే.. తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో కాంగ్రెస్కు బిహార్లో తమ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉండాలన్నది పార్టీ దీర్ఘకాలిక వ్యూహంలా ఉంది. గడిచిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ 9 స్థానాలకు గానూ 3 స్థానాలను గెలుచుకోవడం, ఇటీవలి ఓటర్ అధికార్ యాత్రతో కాంగ్రెస్పై ప్రజల్లో ఆదరణ పెరగడంతో కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే అదనుగా పార్టీని బలోపేతం చేసుకోవడం సులువని పార్టీ విశ్వసిస్తోంది. ఈ సమయంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఆర్జేడీ బలపడి, కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే భావన ఉంది. గత ఎన్నికల్లో కేవలం 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. తేజస్విని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తే సీట్ల బేరసారాల్లో కాంగ్రెస్కు నష్టం వాటిల్లుతుంది. అదీగాక లాలూప్రసాద్ యాదవ్తో పాటు తేజస్వియాదవ్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వయంగా తేజస్విపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద నేత నుంచి దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాల్లో గట్టి పట్టుంటే, కాంగ్రెస్కు అగ్రవర్ణాలతో పాటు ముస్లిం, దళిత ఓట్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా ఎన్డీఏ పక్షాల వైపు మొగ్గు చూపుతుంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తేజస్విని పక్కనపెడుతుండటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండ్రోజుల కిందట 243 స్థానాల్లో తాము పోటీలో ఉంటామనే ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించలేదు. ప్రస్తుత ఈ పరిణామాలు ఎటువైపు మళ్లుతాయన్నది ఆసక్తికరంగా మారింది. -
కార్లతో సమానంగా ఏసీల కాలుష్యం
న్యూఢిల్లీ: ఎండల తీవ్రత పెరిగిన కొద్దీ దేశంలో ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒకప్పటి విలాస ఉపకరణం నేడు ముఖ్యావసరంగా మారింది. ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఏసీ ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఇళ్లలోనూ కనిపిస్తోంది. అయితే, కారు మాదిరిగానే ఏసీకూడా వాతావరణం మరింత వేడెక్కేందుకు కారణమవుతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. వాతావరణం కోణంలో చూస్తే ఏసీ కూడా ప్రమాదకరమైన గృహోపకరణమేనని ఢిల్లీకి చెందిన ఐఫారెస్ట్ సంస్థ సర్వే తేల్చింది. ఇంకా ఏం చెప్పిందంటే.. 2030 నాటికి భారత్లో గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేసే అతిపెద్ద గృహోపకరణంగా ఎయిర్ కండిషనర్లు మారనున్నాయి. దేశంలో 2035 నాటికి వాతావరణంలో కలిసే కార్బన్ డయాక్సైడ్ రెట్టింపయ్యి 329 మిలియన్ టన్నులకు చేరుకోనుంది. 2024లో ఒక్క ఏడాదిలోనే ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) 156 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమాన ఉద్గారాలను విడుదల చేశాయని, ఇది దేశంలోని అన్ని ప్రయాణికుల కార్ల ఉద్గారాలకు సమానమని వెల్లడైంది. ఇందులో 52 మిలియన్ టన్నుల ఉద్గారాలు కూలింగ్ గ్యాస్ లీకేజీల (రెఫ్రిజిరెంట్లు) వల్లనే జరిగాయని పేర్కొంది. 2035 నాటికి ఏసీల వల్ల విడుదలయ్యే మొత్తం ఉద్గారాలు 329 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వాటితో పోలిస్తే రెట్టింపునకు మించి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఒక ఏసీని రెండేళ్లకోసారి గ్యాస్ రీఫిల్ చేయిస్తే, అది ఓ కారు విడుదల చేసేంత ఉద్గారాలను విడుదల చేస్తుంది. వాతావరణ పరంగా చూస్తే ఏసీ కూడా కారు లాంటిదే, అంతే ప్రమాదకరమైందని ఐఫారెస్ట్ అధ్యక్షుడు, సీఈవో చంద్ర భూషణ్ చెప్పారు. రెఫ్రిజిరెంట్ల తయారీదారులు ఉద్గారాలను మరింతగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఒత్తిడిపెంచాలి. ప్రభుత్వం జాతీయ రెఫ్రిజిరెంట్ డేటాబేస్ ఏర్పాటు చేయాలి. వాతావరణంపై తీవ్రప్రభావాన్ని తగ్గించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ చర్యలతో వచ్చే దశాబ్దంలో 500–650 మిలియన్ టన్నుల రెఫ్రిజిరెంట్ ఉద్గారాలను తగ్గించవచ్చని, వాటి విలువ 25 నుంచి 33 బిలియన్ల డాలర్ల కార్బన్ క్రెడిట్లుగా ఉండొచ్చని ఐఫారెస్ట్ నివేదిక పేర్కొంది. అలాగే, వినియోగదారులు 10 బిలియన్ డాలర్ల వరకు రీఫిల్లింగ్ ఖర్చులు ఆదా చేసుకోగలరని తెలిపింది. ఏసీ వాడకం ఎలా ఉంటుందంటే..2024లో 62 మిలియన్లు ఉన్న ఏసీలు, 2035 నాటికి 245 మిలియన్లకు చేరనున్నాయి. వార్షిక విక్రయాలు సైతం 14 మిలియన్ల నుంచి 40 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. 2020 నుంచి ఏసీల విక్రయాలు ఏడాదికి 15 నుంచి 20% చొప్పున పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో నగరీకరణ, వ్యక్తుల ఆదాయాల్లో పెరుగుదల, పెరిగిన ఎండల తీవ్రత తదితరాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి. సర్వే ఎలా జరిపారంటే..ఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, పుణె, జైపూర్ నగరాల్లో 3,100 కుటుంబాలపై ఈ సర్వే చేపట్టారు. ఆయా నివాసాలు, కార్యాలయాల్లోని 80% ఏసీలు ఐదేళ్ల లోపు తయారైనవి. ఇందులో 87% కుటుంబాలు ఒకే ఏసీ కలిగి ఉండగా, 13% మంది రెండు, అంతకంటే ఎక్కువ ఏసీలను వాడుతున్నారు. చెన్నై, జైపూర్, కోల్కతా, పుణెల్లోని ఎక్కువ కుటుంబాలు ఒకటికి మించి ఏసీలను కలిగి ఉన్నాయి. కోల్కతా, జైపూర్, పుణె వాసులు ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సైతం నివేదిక వెల్లడించింది. రెఫ్రిజిరెంట్ రీఫిల్లింగ్ భారత్లో రీఫిల్లింగ్ ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. సాధారణంగా ఏసీలను ఐదేళ్లకోసారి రీఫిల్ చేస్తే సరిపోతుంది. కానీ, భారత్లో సగటున 40% ఏసీలు ఏటా రీఫిల్ అవుతున్నాయి. ఐదేళ్లకు మించి ఉన్న ఏసీలలో 80%కు పైగా ఏటా రీఫిల్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. వినియోగదారులు 2024లో రూ.7,000 కోట్ల విలువైన రెఫ్రిజిరెంట్ల రీఫిల్లింగ్ చేసుకున్నారు. ఇది 2035 నాటికి రూ. 27,540 కోట్లకు పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది.హానికరమైన రెఫ్రిజిరెంట్లు దేశంలో ప్రధానంగా వాడే హెచ్ఎఫ్సీ–32 అనే గ్యాస్, కార్బన్ డయాక్సైడ్ కంటే 675 రెట్లు ఎక్కువ ఉష్ణతాపాన్ని కలుగ జేస్తుంది. 2024లో రెఫ్రిజిరెంట్ లీకేజీల వల్ల 52 మిలియన్ టన్నుల ఉద్గారాలు వెలువడగా, 2035 నాటికి ఇది 84 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది.వినియోగం తీరు ఎలా ఉంది? దేశంలో కుటుంబాలు సగటున ఏసీని రోజుకు 4 గంటల పాటు వాడుతున్నాయి. వేసవిలో ఎక్కువగా 7.7 గంటలపాటు వాడుతున్నారు. వర్షాకాలంలో 3.2 గంటలు మాత్రమే వినియోగించుకుంటున్నారు. దాదాపు 98% కుటుంబాలు 3 స్టార్ నుంచి 5 స్టార్ రేటెడ్ ఏసీలు వాడుతున్నారు. త్రీస్టార్ ఏసీలు 60% ఇళ్లలో ఉంటే 5 స్టార్ ఏసీలు 28% మంది వినియోగిస్తున్నారు.థర్మోస్టాట్ సెట్టింగ్స్ దేశంలో సగటున 67% కుటుంబాలు ఏసీని 23నిసెల్సియస్–25సెల్సియస్ మధ్య ఉంచుతున్నాయి. కేవలం 33% మాత్రమే 22 సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేస్తున్నారు. వీరిలో అత్యధికులు ఢిల్లీ, ముంబయి, పుణెకు చెందినవారేనని సర్వేలో తేలింది. విద్యుత్ వినియోగంపై ప్రజలు జాగ్రత్తగా ఉన్నా, రెఫ్రిజిరెంట్ల విషయంలో అవగాహన తక్కువగా ఉంది. ప్లాస్టిక్ లాగే రెఫ్రిజిరెంట్ల జీవిత కాలంపై కూడా సమగ్ర అవగాహన అవసరమని ఐఫారెస్ట్ చైర్మన్ చంద్ర భూషణ్ అంటున్నారు. -
నలుగురిలో ఒకరు ట్యూషన్కు!
పాఠశాల విద్యార్థుల్లో దాదాపు నలుగురిలో ఒకరు ఇప్పుడు ట్యూషన్లు లేదా ప్రైవేట్ కోచింగ్ మీద ఆధారపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంది. ట్యూషన్ల కోసం ఏటా ప్రతి విద్యార్థిపై చేస్తున్న సగటు వ్యయం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండింతలు అధికంగా ఉండడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్జాతీయ నమూనా సర్వే (ఎన్స్ ఎస్ఎస్) 80వ రౌండ్ కింద కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్–జూన్ మధ్య విద్యపై సమగ్ర సర్వే చేపట్టింది. అడ్మిషన్ల విషయంలో గ్రామీణ భారతంలో ప్రభుత్వ పాఠశాలలదే పైచేయిగా ఉందని సర్వే తేల్చింది. పట్టణ ప్రాంత కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నాయి అంతేకాదు మార్కుల వేటలో భాగంగా తమ పిల్లలను ట్యూషన్లకూ పంపిస్తున్నాయి.ట్యూషన్ల కోసం వ్యయంప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలో 27 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే పట్టణాల్లో 30.7%, గ్రామీణ భారత్లో 25.5% మంది ప్రైవేట్ కోచింగ్పై ఆధారపడ్డారు. దేశంలో సగటున ఒక్కో విద్యార్థి ట్యూషన్స్ కోసం రూ.2,409 వెచ్చిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్ కోసం సగటు ఖర్చు రూ.1,793 కాగా, పట్టణాల్లో రూ.3,988 అవుతున్నట్టు అంచనా. ఇంటర్ స్థాయిలో పట్టణ కుటుంబాలు కోచింగ్ కోసం ఒక్కో విద్యార్థికి రూ.9,950 ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.4,548.పట్టణాల్లో ప్రైవేట్ విద్యకు..గ్రామీణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 33.9% మంది ప్రైవేట్, ఇతర సంస్థలలో చదువుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 30.1% మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 70% మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. మొత్తంగా దేశ సగటు చూ స్తే.. అడ్మిషన్లలో 55.9% వాటా ప్రభుత్వ పాఠశాలలదేనని సర్వే పేర్కొంది.పట్టణ ప్రాంతాల్లో అధికంప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు ఉండవు. కానీ, ట్యూషన్లు, ర వాణా, స్టేషనరీ, ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రైవేటులో అయితే వీటికి ఫీజు, యూనిఫాం వంటివి అదనంగా చేరతాయి. దీంతో ప్రతి విద్యా ర్థికి అవుతున్న వార్షిక వ్యయం రూ.23,470గా సర్వే అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.8,382గా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే.. పట్టణ ప్రాంత విద్యార్థికి రూ.4,128, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,639 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వేతర పాఠశాలల విషయంలో ఇది.. పట్టణప్రాంతాల్లో రూ.31,782, గ్రామీణ ప్రాంతాల్లో 19,554గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఫీజుల కోసం చేస్తున్న సగటు వార్షిక వ్యయం రూ.15,143 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,979.⇒ ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థుల విషయంలో దేశంలో 37% మంది ప్రైవేట్ కోచింగ్కు సై అంటున్నారు. పట్టణాల్లోని ఇంటర్ స్టూడెంట్స్లో 44.6 మంది ట్యూషన్లకు వెళ్తున్నారు.⇒ ప్రైవేట్ ట్యూషన్స్ కోసం దేశంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు సగటున ఏటా రూ.6,384 ఖర్చు పెడుతున్నారు. ⇒ కోచింగ్ సంస్థలు చెల్లించిన వస్తు, సేవల పన్ను 2019–20లో రూ.2,240 కోట్లు. 2023–24కి వచ్చేసరికి ఇది రూ.5,517 కోట్లకు చేరింది.⇒ కోచింగ్ కోసం అమ్మాయిల కంటే అబ్బాయిలు కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఏటా అమ్మాయిలు రూ.2,227, అబ్బాయిలు రూ.2,572 వ్యయం చేస్తున్నట్టు సర్వే పేర్కొంది. -
దేశభద్రతలో ఆత్మనిర్భరత
కోల్కతా: దేశ భద్రత విషయంలో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం సైనిక దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. సైన్యం, నేవీ, వైమానిక దళాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగాలని సూచించారు. కోల్కతాలో సోమవారం ఆయన 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ (సీసీసీ)ను ప్రారంభించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు కోసం మార్పు: సీసీసీలో సైనిక దళాల్లో గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన సంస్కరణలను ప్రధాని సమీక్షించారు. వచ్చే రెండు సంవత్సరాల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్లో సైనిక దళాలు చూపిన తెగువను ప్రధాని ప్రశంసించారు. ‘సంస్కరణల సంవత్సరం– భవిష్యత్తు కోసం మార్పు’ అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో సైనిక, ఆయుధ పరంగా స్వయంసమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. భారత త్రివిధ దళాలు జాతి నిర్మాణంతోపాటు కల్లోల ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ప్రకృతి విపత్తుల సమయంలో దళాల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోవాలంటే దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని, సైనిక పరంగా స్వయంసమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. -
చట్టవిరుద్ధం అని తేలితే పక్కన పడేస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: బిహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ఏమాత్రం చట్టవిరుద్ధంగా అనిపించినా మొత్తం ప్రక్రియను పక్కన పడేస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఎస్ఐఆర్ చట్టవిరుద్ధంగా చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థగా ఎలక్షన్ కమిషన్ ప్రతి పనినీ చట్టప్రకారమే నిర్వర్తిస్తుందని మేం మొదట్నుంచీ భావిస్తున్నాం. అయితే కొత్తగా చేపట్టిన ఎస్ఐఆర్ ఏ దశలోనైనా చట్టవిరుద్ధమని తేలితే మొత్తం విధానాన్ని రద్దుచేస్తాం. ఇప్పటికిప్పుడే ఎస్ఐఆర్పై తుది నిర్ణయానికి రాబోం. కేసులో చివరి వాదోపవాదనలను అక్టోబర్ ఏడోతేదీన ఆలకిస్తాం. ఈ కేసులో మేం ఇచ్చే తుది తీర్పు బిహార్కు మాత్రమేకాదు యావత్భారతదేశానికి వర్తిస్తుంది. ప్రస్తుతానికి ఎస్ఐఆర్లాంటి ప్రక్రియను ఇతర రాష్ట్రాల్లో ఈసీ చేపట్టినా మేం అడ్డుచెప్పబోం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు తమ వాదనలను అక్టోబర్ ఏడో తేదీన వినిపించుకోవచ్చు. అక్టోబర్ ఏడున కేసు విచారణ ఉండబోతోంది ఆలోపే అంటే సెప్టెంబర్ 30వ తేదీన బిహార్ ఓటర్ల తుది జాబితా ముద్రణ ఉండబోతోంది. ఈ తేదీకి కేసు విచారణకు ఎలాంటి సంబంధం లేదు. ఆ తుది జాబితాలో ఏవైనా చట్టవిరుద్ధత కనిపిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియను అప్పడైనా రద్దుచేస్తాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది, పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోందని, ఈ విషయంలో ఈసీని అడ్డుకోవాలని న్యాయవాది గోపాల్ వాదించారు. ‘‘ అసలు ఈ విధానంలో చట్టబద్ధతను ఇంకా తేల్చాల్సి ఉంది. రాజ్యాంగంలో ఇలాంటి విధానం నియమనిబంధనలను పరిశీలించాల్సి ఉంది. ఆలోపే ఇతర రాష్ట్రాల్లో ప్రక్రియను ఆపాలని ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. దేశవ్యాప్త ఎస్ఐఆర్పై ఈసీ మరింత ముందుకు వెళ్లేలోపే ఈసీని నిలువరించాలని కాంగ్రెస్సహా పలు విపక్ష పార్టీల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్సిబల్ కోర్టును కోరారు. చట్టాన్ని తుంగలోతొక్కి ఈసీ తన సొంత నిర్ణయాలను అమలుచేస్తోందని రాష్ట్రీయ జనతాదళ్ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘జాబితాలో తప్పులుంటే 24 గంటల్లోపు వెబ్సైట్లో అభ్యంతరాలను అప్లోడ్చేయాలని ఈసీ చెబుతోంది. ఇది చాలా కష్టమైన పని’’ అని ఆయన వాదించారు. -
బిహార్ను బీడీతో పోలుస్తారా!
పుర్నియా: బిహార్ అభివృద్ధిబాటన సాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు ఓర్వలేని తనంతో చులకనగా మాట్లాడుతున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. అవమానించడమే ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకున్నారని ధ్వజమె త్తారు. మోదీ సోమవారం బిహార్లోని పుర్నియా లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిహార్ అంటే బీడీ అంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిహార్లో తయారైన రైలింజిన్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్, ఆర్జేడీ నేతలకు నచ్చడం లేదు. బిహార్లో అభివృద్ధి ఛాయలు కనిపించినప్పుడల్లా ఈ నేతలు చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఏకమై బిహార్ను బీడీతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్నారు’అని ఆయన అన్నారు. ‘ఈ రెండు పార్టీల నేతలు సొంత కుటుంబసభ్యుల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. మీ కుటుంబం సంక్షేమం వారికి పట్టదు. కానీ, మోదీకి మీరందరూ కుటుంబ సభ్యులే. అందుకే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని మోదీ అంటున్నారు. మీ కుటుంబం, సంక్షేమం, మీ బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు’అని తెలిపారు. బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నా యని, వీటి తీరుతో ఆయా రా ష్ట్రాల జనాభాలో తీరుతెన్నుల్లో తీ వ్రమైన మార్పులు సంభవిస్తున్నా యని ఆయన హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల్లోని వారు తమ తోబుట్టువులు, కుమార్తెల ఆత్మ గౌరవం గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు.దేశ భద్రత, వనరులను ప్రతిపక్షాలు ఫణంగా పెడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. విదేశాల నుంచి అందుతున్న మద్దతుతో వలసదారులకు మద్దతుగా యాత్రలు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహ రిస్తున్నారంటూ కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రనుద్దేశిస్తూ నిప్పులు చెరిగారు. ప్రతి చొరబాటుదారునూ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.40 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. పుర్నియా ఎయిర్పోర్టులో కొత్తగా అభివృద్ధి పర్చిన టెర్మినల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. పుర్నియా–కోల్కతా మార్గంలో మొదటి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మఖానా రంగం అభివృద్ధికి నేషనల్ మఖానా బోర్డు ద్వారా రూ.475 కోట్లు వెచ్చిస్తా మని ప్రకటించారు. భాగల్పూర్లో రూ.25 వేల కోట్లతో నిర్మించే ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, రూ.2,680 కోట్ల కోసి–మెచి ఇంట్రా స్టేట్ రివర్ లింకు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు. -
వక్ఫ్ సవరణ చట్టం: ఐదేళ్ల నిబంధన కుదరదు
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా తయారైన వక్ఫ్(సవరణ) చట్టం–2025 విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చట్టంలోని ఒక ముఖ్యమైన నిబంధనపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం 128 పేజీల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఒక వ్యక్తి తన ఆస్తిని వక్ఫ్ కోసం దానంగా ఇవ్వడం వంటికి చేయాలంటే కనీసం గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని సంబంధిత నిబంధనపై స్టే విధించింది. ‘‘ ఐదేళ్లుగా ఇస్లామ్ను పాటించాలి అనే నిబంధనలో స్పష్టత కరువైంది. సంపూర్ణ నిర్వచనంతో, సమగ్రస్థాయిలో ఈ అంశంపై స్పష్టత వచ్చేలా నిబంధనలు తయారుచేసేవరకు ఈ ప్రొవిజన్ అమలును నిలిపేస్తున్నాం. ఏదైనా చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందనే భావిస్తాం. కేవలం అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకోవడం సబబు. వక్ఫ్ చట్టంలోని అన్ని నిబంధనల అమలుపై స్టే విధించాలన్న వాదనల్లో పసలేదు. అందుకే మొత్తం చట్టంపై స్టే విధించట్లేము. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నాక రెండువైపులా సమతుల న్యాయం దక్కాలని చూస్తున్నాం. అందుకే వక్ఫ్ ఆస్తుల స్థితిని కలెక్టర్ మార్చే అధికారం అమలుకాకుండా స్టే విధిస్తున్నాం. అలాగే వక్ఫ్ బోర్డ్లలో ముస్లిమేతర సభ్యుల అంశంపై కలెక్టర్ నిర్ణయాలు తీసుకోకుండా స్టే విధిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు, ‘‘చాన్నాళ్లుగా వక్ఫ్ భూమిగా చెలామణి అయినంతమాత్రాన అది వక్ఫ్ భూమి కాబోదు. ప్రభుత్వ భూమి అయినాకూడా వక్ఫ్ ఆస్తిగా చెలామణిలో ఉన్నంత మాత్రాన అది వక్ఫ్ ఆస్తికాబోదు. వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగింపు సబబే’’ అని ధర్మాసనం మోదీ సర్కార్ చర్యను సమరి్థంచడం గమనార్హం. నాలుగు.. మూడుకు మించకూడదు ‘‘ కేంద్ర వక్ఫ్ మండలిలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య నాలుగుకు మించకూడదు. మొత్తం సభ్యుల సంఖ్య 20 దాటకూడదు. అలాగే రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డ్లలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య మూడుకు మించకూడదు. మొత్తం సభ్యుల సంఖ్య 11 దాటకూడదు. కనీసం ఐదేళ్లుగా ఒక వ్యక్తి ఇస్లాంను ఆచరిస్తున్నట్లు నిర్ధారించే కచ్చితమైన నిబంధనావళిని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించేదాకా ‘వక్ఫ్కు ఆస్తి ఇవ్వాలంటే ఐదేళ్లుగా ఇస్లాంను పాటించాలి’ అనే సెక్షన్3 లోని (ట) క్లాజుపై స్టే విధిస్తున్నాం. సంబంధిత అధికారి తన నివేదికను సమరి్పంచేదాకా ఏదైనా ఆస్తి ‘వక్ఫ్ ఆస్తి’ అని కొత్తగా ప్రకటించడానికి వీల్లేదు. ఏదైనా ఆస్తి ఒకవేళ ప్రభుత్వ ఆస్తి అయి ఉండవచ్చని ఆ అధికారి భావిస్తే ఆ మేరకు రెవిన్యూ రికార్డుల్లో సవరణ చేయొచ్చు, ఈ అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి అనే నిబంధనలపైనా స్టే విధిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 3సీ కింద వక్ఫ్ ఆస్తిగా ప్రకటించని సందర్భంలో, ట్రిబ్యునల్ ఆదేశంతో సవరణ చట్టంలోని సెక్షన్ 83ని అమలుచేసి సందర్భంలో, హైకోర్టు తదుపరి ఆదేశం కోసం వేచి ఉన్న సందర్భాల్లో అలాంటి ఆస్తులను ఇక వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించకూడదు, రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేయకూడదు’’ అని నిబంధనలపైనా స్టే విధిస్తున్నాం’’అని కోర్టు స్పష్టంచేసింది. వివాదాస్పద ఆస్తి ఎవరికి చెందుతుంది అనేది ట్రిబ్యునళ్లు, హైకోర్టుల్లో తేలేదాకా ఆ ఆస్తులపై మూడో పక్షానికి హక్కులు దఖలుపర్చకూడదు అని కోర్టు ఆదేశించింది. ముస్లింల వర్గానికి ఎక్స్–అఫీషియో కార్యదర్శిగా సేవలందించే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామానికి బాటలు వేసే సెక్షన్ 23పై కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. చట్టంలో పేర్కొన్న ప్రకారం వక్ఫ్ అనేది ముస్లింలు ఇచ్చే విరాళం, దానం. తమ భూములు, స్థిరాస్థులను దాతృత్వ, మత సంబంధ కార్యక్రమాల కోసం దానం(వక్ఫ్)గా ఇవ్వొచ్చు. ఈ భూముల్లో మసీదులు, పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజాసంస్థలు ఏర్పాటుచేసుకోవచ్చు. వక్ఫ్గా మారిన ఆస్తిని ఇతరులకు విక్రయించకూడదు, ఇంకొకరికి బహుమతిగా ఇవ్వకూడదు, వారసత్వంగా పొందకూడదు, ఆక్రమించకూడదు. వక్ఫ్ బై యూజర్ తొలగింపులో వివాదం లేదు ‘‘ పెద్ద మొత్తంలో ప్రభుత్వభూములు ఆక్రమణకు గురై చాన్నాళ్లుగా వక్ఫ్ వినియోగంలో ఉన్నాయి. నిరాటంకంగా వక్ఫ్ అ«దీనంలో ఉంటే అవి వక్ఫ్ బై యూజర్ నిబంధన ప్రకారం వక్ఫ్ ఆస్తులుగా మారుతున్నాయి. ఇది తప్పు అని భావించి ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఈ తొలగింపులో ఎలాంటి వివాదం లేదు’’ అని సీజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.స్వాగతించిన కాంగ్రెస్ ‘‘కీలక సెక్షన్లను నిలుపుదల చేస్తూ కోర్టు ఇచి్చన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ ఉత్తర్వు రాజ్యాంగ విలువలైన న్యాయం, సమానత్వ, సౌభ్రాతృత్వం గెలుపునకు నిదర్శనం. వాస్తవిక వక్ఫ్ చట్టాన్ని కాలరాస్తూ మోదీ సర్కార్ తీసుకొచి్చన తప్పుడు సవరణలను తొలగించేలా తుది తీర్పు వెలువడుతుందని ఆశిస్తున్నాం’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ‘‘ భారత్లో ఎప్పుడూ సద్దుమణిగిన అంశాలను మోదీ సర్కార్ ఎగదోస్తోంది. విద్వేషాలను పెంచేందుకు ఈ విభజన చట్టాన్ని బుల్డోజర్లా తీసుకొచి్చంది’’ అని అన్నారు. చాలావరకు ఆమోదించినట్లే: బీజేపీ‘‘మేం తెచి్చన సవరణలను కోర్టు ఆమోదించింది. మొత్తం చట్టంపై స్టే విధించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంచేసింది. అంటే మెజారిటీ చట్టం చట్టబద్ధంగా ఉందని కోర్టే స్పష్టంచేసినట్లయింది. వక్ఫ్ బై యూజర్ మాటున ఇకపై వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది ఇకపై ఆగుతుంది. కోర్టు నిర్ణయాలను మేం కూడా స్వాగతిస్తున్నాం’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులోని కీలకాంశాలు → ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్(దానం) ఇవ్వాలన్న సెక్షన్ 3(1)(ట)ను నిలుపుదల చేసింది→ ఐదేళ్లుగా ఇస్లాంలో కొనసాగుతున్నారో లేదో తేల్చే నిబంధనలు రూపొందేదాకా సెక్షన్ 3(1)(ట)పై స్టే అమలు→ సంబంధిత ఆఫీసర్ నివేదించాడన్న ఒకే ఒక్క కారణంగా వక్ఫ్ ఆస్తిని వక్ఫ్కాని ఆస్తిగా పనిగణించకూడదు→ అలాంటి నివేదికలను ఆధారంగా చేసుకుని వక్ఫ్ రికార్డులతోపాటు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో సవరణలు చేయకూడదు→ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద ఆస్తులపై సెక్షన్ 83 కింద వక్ఫ్ ట్రిబ్యునళ్లు ఇచ్చే నిర్ణయాలు అమలయ్యేలోపు వక్ఫ్ బోర్డ్లు ఎలాంటి ఆస్తులను తమ ఆస్తులుగా, తమవికాని ఆస్తులుగా ప్రకటించకూడదు→ సీఈవోగా నియమించబోయే వ్యక్తిని వీలైనంత వరకు ముస్లిం వర్గం నుంచే ఎంపికచేయాలి→ ఇవన్నీ మధ్యంతర ఉత్తర్వులే. ఈ ఉత్తర్వులు ఇచి్చనంత మాత్రాన సవరణ చట్టం చట్టబద్ధతపై తమ తమ వాదనలను ఇరుపక్షాలు వాదించే అవకాశం లేదని భావించకూడదు.ముస్లిం సంస్థల హర్షం వక్ఫ్ సవరణచట్టంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న కీలక నిబంధనల అమలుపై కోర్టు స్టే విధంచడంతో ముస్లిం సంఘాలు ఆనందం వ్యక్తంచేశాయి. తుది తీర్పు సైతం ముస్లింలకు అనుకూలంగా రావాలని ఆశాభావం వ్యక్తంచేశాయి. ‘‘ ఈ మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం’’ అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని నిబంధనలకు బదులు మొత్తం సవరణ చట్టాన్నే రద్దుచేయాలని ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డ్(ఏఐఎస్పీఎల్బీ) ఆశాభావం వ్యక్తంచేసింది. ‘‘ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తేనే వక్ఫ్ అనే నిబంధనపై స్టే విధించడం పెద్ద ఊరట. ఇక వక్ఫ్ బోర్డ్లో ముస్లిమేతర సభ్యుని అంశం అలాగే ఉండిపోయింది’’అని ఏఐఎంపీఎల్బీ కార్యనిర్వాహక సభ్యుడు ఖలీద్ రషీద్ ఫరాంగీ మహాలీ అన్నారు. -
పెన్షన్కు సర్వీస్ బ్రేక్ అడ్డంకి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పాక్షిక ఊరట లభించింది. ఉద్యోగంలో చేరడంలో పరిపాలన పరంగా జరిగిన జాప్యం వల్ల ఏర్పడిన సర్వీస్ అంతరాయాన్ని(సర్వీస్ బ్రేక్) పెన్షన్ ప్రయోజనాల కోసం పరిగణనలోకి తీసుకోవాలని, వారి సర్వీసును నిరంతరంగానే భావించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పనిచేయని ఆ కాలానికి కూడా పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. ‘నో వర్క్–నో పే’ అనే సూత్రం వర్తిస్తుందని తేల్చిచెబుతూ వారి పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. పనిచేయని కాలానికి జీతం ఇవ్వాలనే నిబంధన లేదు..2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 58 ఏళ్లకు పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులను.. ఏపీలో 60 ఏళ్ల పదవీ విరమణ వయసు ఉన్నందున తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే, తెలంగాణ నుంచి రిలీవ్ అవ్వడానికి, ఏపీలో పోస్టింగ్ ఇవ్వడానికి మధ్య.. కొన్ని నెలల నుంచి ఏడాదికి పైగా సమయం పట్టింది. ఈ కాలాన్ని సర్వీసుగా పరిగణించి పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.పనిచేయని కాలానికి కూడా జీతం చెల్లించడానికి చట్టంలో ఎలాంటి నిబంధన లేదని.. అందువల్ల ఆ డిమాండ్కు చట్టపరమైన బలం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యోగుల తప్పు లేకుండా జరిగిన పరిపాలన జాప్యం వల్ల.. వారి పెన్షన్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకూడదని అభిప్రాయపడింది. ఆ ఖాళీ సమయాన్ని కూడా పెన్షన్ లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. తద్వారా వారి 60 ఏళ్ల సర్వీస్కు గాను పూర్తి పెన్షన్ ప్రయోజనాలు పొందుతారని పేర్కొంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే.. తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ ఖాళీ సమయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
‘సాక్షి’పై కక్ష... పత్రికా స్వేచ్ఛపై దాడే!
సాక్షి, న్యూఢిల్లీ: ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ ధోరణి పత్రికా స్వేచ్ఛపై దాడి అని ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును అణచివేయడానికి ఏపీ ప్రభుత్వం క్రిమినల్ చట్టాలను ఆయుధంగా వాడుకుంటోందనేందుకు ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అని అభిప్రాయపడింది. అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించే వార్తలు రాసినందుకు దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై ఒకటికి రెండు కేసులు నమోదు చేసే ఆందోళనకర సంస్కృతి కొనసాగుతోందని పేర్కొంది.‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసుల నమోదు కూడా ఇందులో భాగమేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లహిరి, ప్రధాన కార్యదర్శి నీరజ్ ఠాకూర్ సోమవారం ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. ‘‘సాధారణ వార్తలు రాసినందుకే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై కేసులు బనాయించి, వ్యవస్థాగతంగా వేధిస్తున్నారు.ఏపీలోని వేర్వేరు జిల్లాల్లో భారతీయ న్యాయ సంహిత కింద 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తను ప్రచురించినందుకే రెండు స్టేషన్లలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అదే వార్తను ఇతర పత్రికలు, మీడియా సంస్థలు సైతం ఇచ్చాయి. కేవలం ‘సాక్షి‘ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని వేధించడం కక్షసాధింపు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్లను పరిశీలించిన తర్వాత, పత్రిక సంపాదకవర్గంపై క్రిమినల్ చట్టాలను అసంబద్ధంగా, ఎంపిక చేసినట్లుగా ప్రయోగించారని అర్థమవుతోంది’’ అని తెలిపారు. ⇒ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో ‘సాక్షి’ జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడాన్ని గమనించామని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్తలు రాసిన జర్నలిస్టులను వేధించకుండా... పోలీసులను కట్టడి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. సంపాదకీయపరమైన వివాదాలను సివిల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, క్రిమినల్ చట్టాల ద్వారా కాదని తాము విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. -
ఏసీ కోచ్లో యువతి స్మోకింగ్.. ‘నా డబ్బుతో కొనుక్కున్న సిగరెట్.. మీకెందుకంత బాధ?’
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం-గాంధీధామ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (20803)లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. ఏసీ కోచ్లో ఓ యువతి సిగరెట్ తాగుతూ ఇతర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక ఆ వీడియోను పరిశీలిస్తే.. యువతి సిగరెట్ తాగుతుండగా.. ఓ యువకుడు ఆమెను ప్రశ్నిస్తూ వీడియో తీస్తుంటారు. ‘ఏం చేస్తున్నారు మీరిక్కడ? ట్రైన్ లోపల ఎందుకు సిగరెట్ తాగుతున్నారు? ఇది ఏసీ కోచ్ మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తాడు. దీంతో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ ప్రయాణికురాలు.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నన్నెందుకు వీడియో తీస్తున్నారు. వెంటనే డిలీట్ చేయండి అంటూ బెదిరింపులకు దిగింది. అందుకు ఆ యువకుడు ఒప్పుకోకపోవడంతో.. నీకెందుకు బ్రదర్.. ఇది నీ ట్రైన్ కాదు కదా ప్రశ్నించింది. ఓ చేతిలో సిగరెట్ పట్టుకుని.. ఈ సిగరెట్ను నా సొంత డబ్బుతో కొనుక్కొని తాగుతున్నా మీకెందుకు అని మరింత గట్టిగా కేకలు వేసింది. కేకలు విన్న తోటి ప్రయాణికులు ..యువతిని ట్రైన్లో సిగరెట్ తాగడం ఆపాలని కోరారు. అయితే ఆమె వారి మాటలను పట్టించుకోకుండా.. ఇది మీ ట్రైన్ కాదు కదా, మీకు ఎందుకు బాధ? అని కసురుకుంది. నేను లోపలికి వెళ్లను. నా వీడియో ఎందుకు డిలీట్ చేయడం లేదు? అని ప్రశ్నించింది. అందుకు తోటి ప్రయాణికులకు చిర్రెత్తడంతో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక చివరికి ఆమె తన బెర్త్కి వెళ్లి ఇప్పుడు పోలీసులను పిలవండి అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియాల్సి ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. सिगरेट पीने की तलब, बेईज्जत करवा देती हैं. वायरल वीडियो में चलती ट्रेन में इस तरह धूम्रपान करेगी तो सामने वाला आपकी करतूतों को दिखाएगा?@RailMinIndia pic.twitter.com/mXHxy0715s— Tushar Rai (@tusharcrai) September 15, 2025 -
‘అయ్యో పాపం.. ప్రాణం పోగొట్టుకునేందుకేనా 600కిలోమీటర్లు ప్రయాణించింది’
జైపూర్: ప్రియుడిని పెళ్లికి ఒప్పించేందుకు 600 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ మహిళ… చివరికి శవమై కనిపించింది. ఈ విషాద కథపై నెటిజన్లు ‘అయ్యో పాపం..ప్రేమ కోసం అంత దూరం ప్రయాణించి చివరికి ప్రాణం పోగొట్టుకుందా?’ అంటూ నిట్టూరుస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం..రాజస్థాన్లోని ఝుంఝునుకు చెందిన ముఖేష్ కుమారి అంగన్వాడీ సూపర్వైజర్గా విధులు నిర్వహించేది. పదేళ్ల క్రితం తన భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమారి ఆమె భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్లో అదే రాష్ట్రంలోని బర్మార్లో టీచర్గా విధులు నిర్వహించే మనారామ్తో మెటాలో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో చాటింగ్, వాట్సాప్లో వీడియో కాలింగ్లతో ఏడాదిపాటు మునిగిపోయారు. చివరికి ఆ ప్రేమను పెళ్లిగా మారుద్దామని అనుకున్నారు.ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పించేందుకు ఝుంఝును నుంచి 600కిలోమీటర్ల దూరంలో ఉన్న మనారామ్ను కలిసేందుకు కుమారి కారులో బయలుదేరింది. మనారామ్ ఇంటికి చేరుకుని, అతని కుటుంబ సభ్యులకు వారి సంబంధం గురించి వివరించింది. దీంతో కుమారిపై మనారామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సమస్యను పరిష్కరించమని కోరుతూ స్థానిక పోలీసుల సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత సాయంత్ర రోజు అలా మాట్లాడుకుందాం పదా అంటూ కుమారిని బయటకు తీసుకుకెళ్లాడు మనారామ్. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. మనరామ్ ఓ రాడ్డుతో కుమారి తలపై మోదీ ప్రాణాలు తీశాడు. ఆనవాళ్లన్నీ ధ్వంసం చేశాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కుమారిని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ప్రమాదం జరిగిందని నమ్మేలా కారును సైడ్ కాలువలోకి పోనిచ్చాడు. ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు(ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తెలిపాడు). మరుసటి రోజు ఉదయం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తన తరుఫు లాయర్ను పురమాయించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తొలుత బాధితురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు భావించారు.అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కుమారి ప్రాణం తీసింది మనారామ్ అని నిర్ధారించుకున్నారు. కుమారి హత్య జరిగే సమయంలో నిందితుడు మనరామ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటం అనుమానం పోలీసులకు అతనిపై అనుమానం మొదలైంది. ఆ అనుమానంతో మనారామ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం భయట పడింది. కుమారిని హత్య చేసింది మనారామ్నేనని తేల్చారు. కుమారి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. -
‘ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి’
ఢిల్లీ: ‘సాక్షి’ జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు పెట్టడాన్ని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. సాక్షి జర్నలిస్టులను కేసులతో వేధించడం సరికాదని స్పష్టం చేసింది. ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేసింది. ‘సాక్షి జర్నలిస్టులపై వివిధ జిల్లాలలో నాలుగు కేసులు పెట్టారు. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ రిపోర్టు చేసినందుకు రెండు వేరువేరు పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు . ఈ మీడియా సమావేశాన్ని ఇతర న్యూస్ పేపర్లు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయిఅయినా కేవలం సాక్షి దినపత్రికనే టార్గెట్ చేస్తూ కేసులు పెట్టారు. సాక్షి పత్రిక పై ఎడిటోరియల్ స్టాఫ్పై ఉద్దేశపూర్వకంగానే సెలెక్టివ్గా క్రిమినల్ కేసులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి , పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కిందనడానికి ఇదొక కేస్ స్టడీ లాంటిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1 )ఏ నుంచి జి కింద ప్రసాదించిన వాక్ స్వాతంత్రపు హక్కును కాల రాస్తున్నారు. ఎడిటోరియల్ వివాదాలను క్రిమినల్ చట్టాల కింద కాకుండా సివిల్ చట్టాల కింద పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. -
పక్కనే ఆస్పత్రి ఉండగా.. 19 కిలోమీటర్ల దూరం ఎందుకు తీసుకెళ్లినట్లు!
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీ నవ్జ్యోత్సింగ్ (52) రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవ్జ్యోత్సింగ్ మరణానికి కారణమైన నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసినందుకు గుర్గావ్ పోలీసులు నిందితులపై అదనపు కేసులు నమోదు చేశారు.ఆదివారం ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రోస్టేషన్ సమీపంలో గగన్ప్రీత్ (38),పరిషిత్ మాక్కాడ్(40)లు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూకారు.. గురుద్వార్ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న నవ్జ్యోత్సింగ్, అతని భార్య సందీప్కౌర్ ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ్జ్యోత్సింగ్ మరణించగా.. సందీప్కౌర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గగన్ ప్రీత్ బీఎండబ్ల్యూకారు తమని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఢీకొట్టినట్లు సందీప్కౌర్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. నిందితులు నన్ను,నా భర్త నవజోత్ సింగ్ను ఓ వ్యానులో ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యానులో ఉన్న నేను మమ్మల్ని సమీప ఆస్పత్రికి తరలించమని నిందితుల్ని ప్రాధేయపడ్డ.. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 19కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీ నగర్ న్యూలైఫ్ ఆస్పత్రికి తరలించారు. ఫలితంగా నా భర్త వ్యాన్లోనే ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ప్రధాన నిందితురాలు గగన్ప్రీత్ తండ్రి సదరు న్యూలైఫ్ ఆస్పత్రికి సహయజమాని అని నిర్ధారించుకున్నారు. దీంతో కేసును కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందా అన్న కోణంలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సందీప్కౌర్కు ట్రీట్మెంట్ ఇచ్చిన రిపోర్టుతో పాటు కారు ప్రమాదంలో నిందితులకు కఠిన శిక్ష పడేందుకు ఉపయోగపడే ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నంలో న్యూలైఫ్ ఆసుపత్రికి తీసుకువచ్చారని అనుమానించారు.ఇదే అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ ఆస్పత్రి ప్రతినిధుల్ని పోలీసులు ప్రశ్నించారు. ట్రీట్మెంట్ విషయంలో సదరు ఆస్పత్రి వైద్యులు,యాజమాన్యం ప్రొటొకాల్ పాటించామని చెప్పాయి. కానీ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో ఆస్పత్రి ఉంచుకొని.. 19కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూలైఫ్ ఆస్పత్రికే ఎందుకు తరలించారు అనే అంశంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వంతారాకు ఊరట
అనంత్ అంబానీ (Anant Ambani) స్థాపించిన వంతారా (Vantara) సంస్థకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఆలయ ఏనుగుల (Elephants)ను తరలిస్తే.. అందులో ఎలాంటి తప్పూ లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏనుగుల తరలింపుపై సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.గుజరాత్ జామ్నగర్లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వంతారాకు క్లీన్చిట్ ఇచ్చినట్లు జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. ఏనుగుల తరలింపులో తప్పులేమీ లేదు, నిబంధనల ప్రకారం జరిగితే సరే. ఏనుగులు బాధపడుతున్నాయ్ అని చెప్పినప్పుడు.. దానికి ఆధారాలేమిటో కూడా పిటిషనర్ చూపించాలి కదా. ఇది దేశ గర్వంగా భావించే విషయం. కాబట్టి దీన్ని తక్కువ చేయకండి. పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు అస్పష్టమైనవిగా కనిపిస్తున్నాయి. విచారణ కొనసాగించాలంటే, పిటిషనర్లు తమ వాదనలను స్పష్టంగా, ఆధారాలతో సమర్పించాల్సిన అవసరం ఉంది అని కోర్టు అభిప్రాయపడింది.ఈ క్రమంలో.. వంతారాలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను అస్పష్టమైనదిగా న్యాయస్థానం తోసిపుచ్చింది. వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈవిషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వంతారాలో చట్టాలను పాటించట్లేదని.. విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ.. ఇటీవల పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సుప్రీంకోర్టు (Supreme Court)లో పిల్ దాఖలు చేశాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ.. వంతారా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలు, వన్యప్రాణుల సంక్షేమం, ఆర్థిక పారదర్శకత వంటి అంశాల్లో సవ్యంగా ఉందంటూ నివేదికను ఇచ్చింది. ఆ నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది కూడా. అయితే ఇదంతా బయటి దేశాల నుంచి జరుగుతున్న కుట్ర అని, భారత్ చేస్తున్న మంచి పనులపై జంతువుల వేటను అనుమతించే దేశాలు ఈవిధంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని.. ఈ విషయంలో దర్యాప్తునకు తాము అన్నివిధాలా సిట్కు సహకరిస్తామని వంతారా తరఫు న్యాయవాది మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. -
‘‘రజినీ సర్.. ఆయన మీలా ప్యాకేజీ స్టార్ కాదు’’
తమిళనాడు రాజకీయాల్లో మామూలుగా హీటెక్కలేదు. వచ్చే ఎన్నికల్లోనూ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధిస్తుందంటూ సూపర్స్టార్ రజినీకాంత్ చేసిన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఇవి మరో అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అభిమానులకు సాధారణంగానే మంట పుట్టించాయి.స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్.. ఎంకే స్టాలిన్పై రజినీ కురిపించిన ప్రశంస ఇది. ‘‘స్టాలిన్ తమిళనాట మాత్రమే కాదు భారతీయ రాజకీయాల్లో ఓ ధృవతార. కేంద్రంలోని ప్రభుత్వానికి మాత్రమే కాదు.. పాత, కొత్త ప్రత్యర్థులకు ఇప్పుడు ఆయన ఓ సవాల్గా మారారు. నా స్నేహితుడు తన మార్క్ చిరునవ్వుతోనే రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నారు’’ అంటూ ఓ ఈవెంట్లో రజినీకాంత్ వ్యాఖ్యానించారు. అయితే..అన్నింటికీ మించి.. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది. ఎలాంటి తుఫానునైనా తట్టుకునే శక్తి ఉంది ఓ బలమైన కామెంట్ చేశారు. ఈ ఎఫెక్ట్తో సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు ఊగిపోతున్నారు. అందుకు కారణం.. రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక్కరోజు ముందు విజయ్ తన రాజకీయ పార్టీకి కీలకమైన ప్రస్థానం ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి ప్రజా యాత్ర (మీట్ ది పీపుల్) ప్రారంభించారు. ఆ సభలో అలవి కాని హామీలిచ్చారంటూ డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో తాజా రజినీకాంత్ కామెంట్లు విజయ్ను ఉద్దేశించి చేసినవేనన్న చర్చ ప్రముఖంగా నడుస్తోందక్కడ.దళపతినే అంటారా?.. రజినీ కామెంట్లతో అరవ రాజకీయంలో స్టార్ వార్ మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కామెంట్లు చేసిన టైంలో మరో సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కూడా అక్కడే నవ్వుతూ కనిపించారు. కమల్ ఇప్పటికే డీఎంకే కూటమికి మద్దతు అనే సంగతి తెలిసిందే. దీంతో.. రాజకీయంగా అడుగులు వేయలేని వాళ్లు, సొంతగా పార్టీని నడిపించుకోలేని వాళ్లు.. ఒంటరిపోరుకు సిద్ధమైన విజయ్ను విమర్శించడమా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. దీనికి తోడు..మొన్నటిదాకా బీజేపీకి సపోర్ట్గా మాట్లాడిన రజినీకాంత్.. ఇప్పుడు అనూహ్యంగా డీఎంకేకు అనుకూలంగా మాట్లాడడం ఆయన డబుల్ స్టాండర్డ్కు నిదర్శనమని, రీల్లో సూపర్స్టార్ అయినప్పటికీ రియల్ లైఫ్లో రజినీకాంత్ ప్యాకేజీ స్టార్ అని, విజయ్ అలా ప్యాకేజీ స్టార్ ఏనాటికి కాబోరని తిట్టిపోస్తున్నారు.సూపర్ స్టార్ ట్యాగ్తో మొదలై..స్టార్డమ్ పెరిగిపోయే క్రమంలో.. రజనీకాంత్ అభిమానులతో విజయ్ అభిమానుల వైరం మొదలైంది. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అది మరింత ముదురుతూ వస్తోంది. గతంలో సినిమా ఈవెంట్లలోనూ స్టేజ్ మీద రజినీకాంత్ ‘‘కుక్క, కాకి’’ అంటూ ఏవో పిట్టకథలతో తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఆ సమయంలో విజయ్ అభిమానులు ఆయన్ని టార్గెట్ చేసేవారు. అంతేకాదు స్వయంగా విజయ్ కూడా అంతే సెటైరిక్గా తన సినిమా ఈవెంట్లలో ఆ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి.ఈ క్రమంలో.. కిందటి ఏడాది విల్లుపురంలో జరిగిన టీవీకే తొలి మహానాడు తర్వాత రజినీకాంత్ విజయ్ను ప్రశంసించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఈలోపే.. రాజకీయాల్లో తన ప్రధాన ప్రత్యర్థిగా విజయ్ ప్రకటించిన డీఎంకే, స్టాలిన్ను రజినీకాంత్ పొగడ్తలతో ముంచెత్తడంతో పరిస్థితి మళ్లీ మునుపటికి వచ్చింది.రజినీ వెనకడుగులు.. 1995–1996.. రజినీకాంత్ హవా కొనసాగుతున్న రోజులు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆయన తొలిసారిగా పెదవి విప్పారు. అప్పటి జయలలిత ప్రభుత్వంపై అవినీతి విమర్శలు గుప్పిస్తూ.. డీఎంకేకు మద్దతు ప్రకటించారాయన. ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయంలో ఆయన మద్దతూ కీలకంగా మారింది. అయితే..2000 నుంచి దశాబ్దం పాటు ఆయన రాజకీయాలపై మౌనం పాటించారు. బాబా సినిమా టైంలోనూ ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం విస్తృతంగా నడిచినప్పటికీ.. ఆయన కేవలం సామాజిక అంశాలపై మాత్రమే స్పందిస్తూ వచ్చారు. దీంతో రజినీ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. చివరకు..అయితే పాతికేళ్ల అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ.. 2017 డిసెంబర్ 31వ తేదీన రజినీకాంత్ నుంచి రాజకీయ పార్టీ స్థాపన ప్రకటన వెలువడింది. దీంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. 2020 టైంలో ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ సమయంలో తమిళనాట కోలాహాలం నడిచింది. అదే సమయంలో.. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడడం, మరోపక్క కరోనా విజృంభణతో ఆయన వెనకడుగు వేశారు. తన ఆరోగ్య కారణాల రిత్యా రాజకీయ ప్రయత్నాలు విరమించుకుంటున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఆయన అభిమానులు చల్లబడ్డారు.అయితే.. అప్పటి నుంచి రాజకీయంగా మాత్రం ఆయన తన అభిప్రాయాలను స్వేచ్ఛగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో కొన్నాళ్ల కిందట ఓ ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.విజయ్ సూటిగా.. తమిళ సినీ నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (Thalapathy Vijay).. గత దశాబ్ద కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు వంటి చర్యల ద్వారా రాజకీయంగా చురుకుగా ఉన్నారు. అవినీతి, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా తమిళనాడుకు మౌలిక మార్పు అవసరం అని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారాయన. ఈ క్రమంలో ఆయన ఏనాడూ.. ఏ పార్టీకి మద్దతు ప్రకటించింది లేదు. అయితే.. ఆయన అభిమాన సంఘాలు(Vijay Makkal Iyakkam) మాత్రం 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో.. నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ చెల్లింపులు తదితర అంశాలపై ఆయన తన సినిమాల్లో సెటైర్లు ఉండేలా చూడడంతో కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకమనే చర్చ నడిచింది. అయితే.. డీఎంకేను రాజకీయ విరోధిగా, బీజేపీని సైద్ధాంతిక విరోధిగా పేర్కొంటూ 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళగ వెట్రి కళగం (TVK) అనే పార్టీని స్థాపించారు.తాము ఏ కూటమికి చెందిన వాళ్లం కాదని.. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం సింహం సింగిల్గానే వస్తుందని.. అధికారం కోసం జరుగుతున్న పోరులో పొత్తు కోసం కలిసొచ్చే పార్టీలకు ఆహ్వానమంటూ బహిరంగంగా చిన్నపార్టీలను ఆహ్వానించారాయన. ఏమిటీ ప్యాకేజీ గోల?!అధికార డీఎంకే కుటుంబానికి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గతకొన్నేళ్లుగా అక్కడి అగ్ర హీరోలతో బిగ్డీల్(కళ్లు చెదిరే రెమ్యునరేషన్లు, బోనస్గా కాస్ట్లీ గిఫ్ట్లు కూడా) కుదుర్చుకుని వరుస ప్రాజెక్టులు చేస్తూ వస్తోంది. ఈ లిస్ట్లో రజినీకాంత్, కమల్హాసన్లు కూడా ఉండడం గమనార్హం. రాజకీయంగా తమ ఎదుగుదలకు ఆటంకంగా మారకూడదనే ఉద్దేశంతో వాళ్లను ఇలా బుజ్జగిస్తోందని ముమ్మర ప్రచారం నడిచింది. తమిళనాట తమకు ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ మధ్యే ఎన్నికలు జరగాలని డీఎంకే తొలి నుంచి భావిస్తోంది. రజినీకాంత్ కంటే విజయ్కు తమిళనాట ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. దీంతో సొంత పార్టీ ప్రకటన కంటే ముందే ఆయన్ను తమ వైపునకు తిప్పే ప్రయత్నమూ డీఎంకే చేసింది. కానీ రాజకీయ అడుగులు వేయాలని బలంగా ఫిక్స్ అయిన విజయ్ ఆ ప్యాకేజీకి ఒప్పుకోలేదని.. అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారన్నది ఆ ప్రచార సారాంశం(దీనిని విజయ్ ఫ్యాన్సే నడిపించారనే టాక్ కూడా ఉంది). ఇక.. ఏడాదిన్నర కాలంగా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తరచూ విమర్శలు గుప్పించడం.. తాజా మధురై మానాడులో అంకుల్ అని స్టాలిన్ను సంబోధిస్తూ విజయ్ విమర్శలు చేయడాన్ని డీఎంకే సీరియస్గా భావించింది. ఈ క్రమంలోనే కేసులతో ఇబ్బంది పెడుతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోందక్కడ. అయితే.. ఇంత సీరియస్ ఆరోపణలపై ఇటు రాజకీయంగా గానీ, అటు సినిమాలపరంగానూ ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్! -
సెస్ల లక్ష్యం నీరుగారుతోందా?
కేంద్రం సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులను అమలు చేస్తున్న నేపథ్యంలో సెస్లను సవ్యంగా ఉపయోగించుకోవడం పట్ల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సెస్లు.. నిర్దిష్ట ప్రయోజనాల కోసం ప్రభుత్వం విధించే అదనపు పన్నులు. అయితే వీటి వినియోగంపై పారదర్శకత చాలా కాలంగా చర్చకు దారితీస్తోంది. విద్య, ఆరోగ్యం లేదా మౌలిక సదుపాయాలు వంటి ప్రజా సంక్షేమం కోసం నిధులకు ఉద్దేశించినవే ఈ సెస్లు. చాలా సేవలపై ప్రభుత్వం విధిస్తున్న సెస్లు వాటికి ఉద్దేశించిన ప్రయోజనాన్ని అందించడంలో విఫలమవుతున్నాయనే వాదనలున్నాయి.రాష్ట్రాలను పక్కదారి పట్టించే సాధనంగా..ఇతర పన్నుల మాదిరిగా కాకుండా, ఆదాయశాఖ నియమాల ప్రకారం.. సెస్లు, సర్ఛార్జీలు రాష్ట్రాలతో పంచుకునేందుకు వీలుండదు. వీటిపై పూర్తి అధికారం కేంద్రానిదే. వాస్తవానికి దశాబ్దాల నుంచి సెస్లు వివిధ విభాగాల్లో పెరుగుతూ వస్తున్నాయి. 2018 అధ్యయనం ప్రకారం.. 1944 నుంచి 44 విభిన్న సెస్లను గుర్తించారు. 2017లో జీఎస్టీని ప్రారంభించినప్పుడు 26 సెస్లను రద్దు చేసి, ఉన్నవాటిలో కొన్నింటి రేట్లను పెంచారు. ఈ సెస్ల్లో రాష్ట్రాల ఆదాయ లోటును భర్తీ చేయడానికి సిన్ గూడ్స్, లగ్జరీ వస్తువులపై వసూలు చేసే పరిహార సెస్ (జీసీసీ) ఒక్కదాన్ని మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటున్నారు.పర్యవేక్షణ కరవు..రాజ్యాంగంలోని ఆర్టికల్ 270, 271 సెస్లను ప్రస్తావించినప్పటికీ వాటి వినియోగం అస్పష్టంగా ఉంది. సెస్ల నుంచి సమకూరే నిధులు కన్సాలిడేటెడ్ ఫండ్కు కాకుండా పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాకు వెళ్తున్నాయి. ఈ యంత్రాంగం ద్వారా సెస్ నిధులను ఆయా విభాగాలు, విద్య, వైద్య, ఇతర మౌలిక సదపాయాలు సృష్టించేందుకు కేటాయించాలి. కానీ బడ్జెట్ పరిశీలనలో వీటి ఊసే ఎత్తడం లేదనే వాదనలున్నాయి.ఆడిట్ చేయకపోతే అంతే సంగతులు..కన్సాలిడేటెడ్ ఫండ్ కేటాయింపులతోపాటు పబ్లిక్ అకౌంట్ ఫండ్స్పై కఠినమైన పర్యవేక్షణ ఉండదనే అభిప్రాయాలున్నాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆడిట్ చేయకపోతే వీటిపై అసలు రివ్యూనే చేయరని కొందరు భావిస్తున్నారు. ఇటీవల కాగ్ నివేదిక ఈ సమస్యను హైలైట్ చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సెస్లు, సర్ఛార్జీల నుంచి రూ.4.88 లక్షల కోట్లు సేకరించింది. ఇది స్థూల పన్ను ఆదాయంలో 14 శాతంగా ఉంది. అయితే ఇందులో రూ.3.57 లక్షల కోట్లు సెస్ ద్వారానే సమకూరింది. అయినప్పటికీ ఈ నిధులను నిబంధనల ప్రకారం ఉద్దేశించిన ప్రయోజనాల కోసం ఉపయోగించారా.. లేదా.. అనే దానిపై పారదర్శకత లోపించిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చమురుపై విధిస్తోన్న సెస్ ద్వారా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2.95 లక్షల కోట్లు సమకూరింది. అందులో కేవలం రూ.902 కోట్లు మాత్రమే చమురు పరిశ్రమ అభివృద్ధి నిధి (OIDB)కు బదిలీ చేశారు.ఇదీ చదవండి: వారం రోజులుగా ఖాళీగా ఉంటున్న ట్రక్కు డ్రైవర్లు -
ఆచార్య బాలకృష్ణకు అక్రమంగా భూ కేటాయింపు.. సీబీఐ దర్యాప్తుకు కాంగ్రెస్ డిమాండ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.30,000 కోట్లకు పైగా విలువ చేసే 142 ఎకరాల ‘వారసత్వ’ భూమిని యోగా గురువు రామ్దేవ్ సహాయకుడు ఆచార్య బాలకృష్ణకు కేవలం రూ. కోటి వార్షిక అద్దెతో కట్టబెట్టిందని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కరణ్ మహారా ఒక ప్రకటనలో ఆచార్య బాలకృష్ణకు భూములు కట్టబెట్టడం అనేది ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద అవినీతి కుంభకోణం అని అన్నారు. జార్జ్ ఎవరెస్ట్ ఎస్టేట్ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులో జరిగిన ఈ కుంభకోణం బీజేపీ అనుసరించే క్రోనీ క్యాపిటలిజంనకు స్పష్టమైన నిదర్శనమని ఆయన ఆరోపించారు. జార్జ్ ఎవరెస్ట్ భూ కుంభకోణంపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్ను దోపిడీలకు నిలయంగా మార్చివేసిందని, ఈ భూ దందాపై కాంగ్రెస్ నిరంతర పోరాటం సాగిస్తుందన్నారు.2022 డిసెంబర్లో ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు జారీ చేసిన టెండర్కు మూడు కంపెనీలు బిడ్డింగ్ చేశాయన్నారు. జాబితాలోని రాజాస్ ఏరోస్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారువా అగ్రి సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతి ఆర్గానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లు రామ్దేవ్ సహచరుడు ఆచార్య బాలకృష్ణ ఆధీనంలో ఉన్నాయని మహారా ఆరోపించారు. ఇది టెండర్ నియమాల బహిరంగ ఉల్లంఘన అని ఆయన ఆరోపించారు. రాజాస్ ఏరోస్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కు 15 ఏళ్ల పాటు రూ. కోటి రూపాయల వార్షిక అద్దెకు ఇచ్చిన జార్జ్ ఎవరెస్ట్ ఎస్టేట్లోని 142 ఎకరాల భూమిని.. ప్రభుత్వం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి రూ. 23.5 కోట్ల రుణం తీసుకొని అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు. ఈ భూ కుంభకోణంపై సీబీఐ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని ప్యానెల్ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
25 గ్యాంగ్స్టర్ స్థావరాలపై 380 మంది పోలీసుల భారీ దాడులు
న్యూఢిల్లీ: ప్రముఖ గ్యాంగ్స్టర్ సిండికేట్ల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ పోలీసులు ఢిల్లీతోపాటు హర్యానా అంతటా 25 ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని ద్వారక డీసీపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్లో 380 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఈ ఏడాది ఈ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్స్టర్ వ్యతిరేక ఆపరేషన్లలో ఒకటిగా తెలుస్తోంది.25 గ్యాంగస్టర్ స్థావరాలపై జరిగిన దాడుల్లో ఢిల్లీలో 19, హర్యానా, ఎన్సీఆర్లో ఆరు ఉన్నాయి. దోపిడీలు, హత్యలు, ఆయుధ అక్రమ రవాణాతో సహా పలు హై ప్రొఫైల్ నేరాలకు పాల్పడిన కపిల్ సంగ్వాన్ అలియాస్ నందు, విక్కీ టక్కర్ల క్రిమినల్ నెట్వర్క్లపై దాడులు జరిగాయి. ఈ దాడులలో పోలీసులు పెద్ద మొత్తంలో నగదు, ఆయుధాలు,పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.సుమారు రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 8 పిస్టల్స్, 29 లైవ్ కార్ట్రిడ్జ్లు, మూడు మ్యాగజైన్లు, బుల్లెట్ప్రూఫ్ టయోటా ఫార్చ్యూనర్, ఆడి కారు, 14 హై-ఎండ్ లగ్జరీ గడియారాలు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, నగదు లెక్కింపు యంత్రాలు, వాకీ-టాకీ సెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో పోలీసులు 26 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు కీలక గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులందరూ నందు, విక్కీ టక్కర్ ముఠాతో సన్నిహిత సంబంధాలు కలిగినవారు.అర్టెస్టయిన నిందితులుపవన్ అలియాస్ ప్రిన్స్ (18): రాజ్మందిర్ స్టోర్, చావ్లా కాల్పుల కేసుల్లో పాల్గొన్న నందు ముఠాకు చెందిన షూటర్.హిమాన్షు అలియాస్ మచ్చి (24): విక్కీ టక్కర్ గ్యాంగ్ సభ్యుడు. ఏడు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాడు.ప్రశాంత్: నందు గ్యాంగ్ షూటర్. ఇతనిపై 11 కేసులు నమోదయ్యాయి.రాహుల్ దివాకర్ అలియాస్ మన్ప్రీత్ (25): విక్కీ టక్కర్ గ్యాంగ్కు చెందినవాడు. 20 ఎఫ్ఐఆర్లలో ఇతని పేరు ఉంది.అంకిత్ ధింగ్రా అలియాస్ నోని (34): నందు గ్యాంగ్తో సంబంధం ఉన్నాడు. ఇతనిపై 10 కేసులున్నాయి.ప్రవీణ్ అలియాస్ డాక్టర్: ఇతని పేరు మీద 25కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. -
Pune: మూతపడిన స్కూళ్లు.. రేపు కూడా సెలవు?
పూణె: మహారాష్ట్రలోని పూణెలో నిన్న(ఆదివారం) రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ప్రజాజీవనాన్ని ఘోరంగా దెబ్బతీసింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పూణేలోని పాఠశాలలకు ఈ రోజు(సెప్టెంబర్ 15) సెలవు ప్రకటించారు. Pune Rains: Heavy Downpour Triggers Traffic Jams, Waterlogging Across City🔗 https://t.co/ibQExSolWN#punenews #punerains #Rain #weatheralert pic.twitter.com/9HCdtVz3w0— Free Press Journal (@fpjindia) September 15, 2025వాతావారణశాఖ అధికారుల సూచనల మేరకు సెప్టెంబర్ 16న కూడా సెలవు ప్రకటించారు. భారీ వర్షపాతం కారణంగా పూణేలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పూణే మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. భారత వాతావరణ శాఖ పూణేతో పాటు సమీప జిల్లాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారత వాతావరణ శాఖ పూణే, ముంబై, థానే, రాయ్గడ్, బీడ్, అహల్యానగర్, లాతూర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురియనున్నాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. -
వారం రోజులుగా ఖాళీగా ఉంటున్న ట్రక్కు డ్రైవర్లు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ నిర్ణయం ట్రక్కు డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తున్న నేపథ్యంలో కీలక రంగాల్లోని తయారీదారులు, డీలర్లు.. ముఖ్యంగా ఆటోమొబైల్స్, వైట్ గూడ్స్ పంపిణీలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది ట్రక్కులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జీఎస్టీ అమలు తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయని నమ్ముతున్న తరుణంలో ఈమేరకు సరఫరా స్తంభించినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 22 తర్వాత తిరిగి ఈ వస్తువుల రవాణా ప్రారంభమవుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.వేచి ఉండాల్సిందే..జీఎస్టీ 2.0 అమలు దగ్గరపడుతుండడం, త్వరలో ధరలు తగ్గుతాయనే భావనతో కొత్త కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో గత వారంలో సరుకు రవాణా రేట్లు 30-35% పడిపోయాయి. సాధారణంగా చెన్నై తయారీ కేంద్రాల నుంచి భారతదేశం అంతటా కొన్ని కంపెనీల కార్ల రవాణా జరుగుతోంది. ఇది గతవారం రోజులుగా గణనీయంగా తగ్గుముఖం పట్టిందని జోగిందర్ సింగ్ అనే ట్రక్కు డ్రైవర్ తెలిపారు. ‘కంపెనీ ఉత్పత్తుల డెలివరీలు నిలిపేశారు. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే వరకు వేచి ఉండాలని రవాణా ఏజెన్సీలు చెప్పాయి’ అన్నారు.సరుకు రవాణా పెరిగే అవకాశందిల్లీకి చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ చేతక్ గ్రూప్ డైరెక్టర్ సచిన్ జేకేఎస్ హరితాష్ మాట్లాడుతూ..‘త్వరలో కొత్త జీఎస్టీ అమలు నేపథ్యంలో దాదాపు 90 శాతం ట్రక్కులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సరఫరాదారులు, రిటైలర్లు వస్తువుల ఇన్వాయిస్లను నిలిపేశారు. నవరాత్రి-దీపావళి సీజన్లో వాహన తయారీదారులు, రిటైలర్లు బ్యాక్లాగ్లను క్లియర్ చేయడానికి, వస్తువులను పంపిణీ చేయడానికి వేగంగా పని చేస్తారు. దాంతో సెప్టెంబర్ 22 నుంచి వస్తు సరఫరాలో రష్ మొదలవుతుంది. డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం, వాహనాల పరిమిత లభ్యత కారణంగా జీఎస్టీ అమలు తర్వాత సరుకు రవాణా రేట్లు 30-40 శాతం పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.డీలర్ల ఎదురుచూపుడీలర్లు సవరించిన జీఎస్టీ బిల్లింగ్ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నందున ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. బుకింగ్స్ కొనసాగుతున్నప్పటికీ ఈ వారం డెలివరీలు జరగడం లేదని ఒక ప్రధాన ఆటో డీలర్ షిప్ ప్రతినిధి ధ్రువీకరించారు. ‘ఈ రోజు బుకింగ్ చేసినప్పటికీ కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రకారం బిల్లింగ్ ప్రారంభిస్తాం. సెప్టెంబర్ 22 తర్వాత డెలివరీలు షెడ్యూల్ అవుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: సాఫ్ట్ డ్రింక్స్పై ‘హార్డ్’ నిర్ణయం.. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన -
వైరల్ వీడియో.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!
లక్నోలో ఓ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ మహిళ.. పిజ్జా డెలివరీ బాయ్పై రెచ్చిపోయింది. లక్నోలోని రద్దీగా ఉండే రోడ్డులో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్ బైక్.. ఓ మహిళ నడుపుతున్న కారును స్వల్పంగా తాకింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళ పిజ్జా డెలివరీ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టింది.దీంతో ఆగకుండా తన కారుకి జరిగిన డ్యామేజ్ కోసం రూ.30 వేలు ఇవ్వలంటూ డిమాండ్ చేసింది. అతని ఫోన్ను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ బిగ్గరగా అరుస్తూ హల్చల్ చేసింది. నగదు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. ఈ ఘటనతో షాక్కు గురైన డెలివరీ బాయ్ తన వైపు వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ.. తోటి రైడర్లకు ఫోన్ చేశాడు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు.ఎవరిపైనా చేయి చేసుకోవడానికి హక్కు లేదంటూ మహిళను వారించారు. దీంతో ఆ మహిళ.. సలహాలు ఇవ్వకండి. నష్టం కలిగించింది ఇతనే కనుక డబ్బులు కూడా ఇతనే చెల్లించాలి. మీరు కావాలంటే పోలీసులకు ఫోన్ చేయండి” అంటూ మరింత చెలరేగిపోయింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ చర్యను దాడిగా పేర్కొంటూ.. ఆమెను అరెస్టు చేయాలని కొందరు డిమాండ్ చేశారు.Lucknow 📍Woman Slaps Pizza Delivery Guy Over Minor Accident, Demands ₹30,000 As Damage Control pic.twitter.com/mmS3bCHay5— Mayank Burmee (@BurmeeM) September 13, 2025 -
మట్టిదిబ్బలో చీమలు పట్టిన లేలేత చేయి.. కంటతడి పెట్టించే గొర్రెల కాపరి కథనం
బరేలీ: అది యూపీలోని బరేలీ పరిధిలోగల షాజహాన్ పూర్.. బహగుల్ నది వంతెన సమీపం నుంచి పశువుల కాపరి డబ్లూ తన మేకలను మేపుతూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అక్కడి ఒక మట్టి దిబ్బ నుండి శిశువు ఆర్తనాదాలు అతనికి వినిపించాయి. దగ్గరకు వెళ్లి చూసిన డబ్లూ కంగుతిన్నాడు. మట్టిదిబ్బలో నుంచి చీమలు పట్టిన ఒక లేలేత చేయి బయటకు రావడాన్ని గమనించాడు.ఆ లేలేల చేయి నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతోంది. వందలాది చీమలు ఆ చేతిని పీక్కుతింటున్నాయి. ఒక్క చేయి తప్ప మిగిలిన శరీర భాగమంతా భూమిలో కప్పబడి ఉంది.. డబ్లూ మాటల్లో..‘నేను చూస్తున్నది నమ్మలేకపోయాను. వెంటనే పెద్దగా కేకలు వేశాను. పోలీసులకు సమాచారం ఇచ్చేలోగానే అక్కడున్నవారందరినీ పిలిచాను. వారు సంఘటనా స్థలంలో గుమిగూడారు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన పోలీసు బృందం మట్టి దిబ్బ నుంచి శిశువును జాగ్రత్తగా బయటకు బయటకు తీసింది. రోజుల శిశువు శరీరం బురదతో ముద్దయిపోయివుంది. శిశువు అత్యంత దుర్బర స్థితిలో ఉంది. శిశువును వెంటనే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించారు. వైద్యులు శిశివు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశాక, ప్రభుత్వ వైద్య కళాశాలకు రిఫర్ చేశారు’ అని తెలిపాడు.ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ‘శిశువు వయసు దాదాపు 15 రోజులుంటుంది. చాలా బలహీనంగా ఉంది. ఆ శిశువును తీసుకువచ్చే సమయానికే తీవ్ర గాయాలున్నాయి. శిశువు చేతిని చీమలు తీవ్రంగా కుట్టాయి. విపరీతంగా రక్తస్రావం అయ్యింది. శశువు ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది, పరిస్థితి విషమంగా ఉంది’ అని అన్నారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ‘ఆ చిన్నారిని ఒక అడుగు లోతులో పాతిపెట్టారు. శిశువు శ్వాస తీసుకునేందుకు వీలుగా ఉద్దేశపూర్వకంగా గాలి ఆడేందుకు చిన్న ఖాళీ స్థలం ఉంచారు. ఈ ఘటనకు కారకులైనవారిని గుర్తించేందుకు బాహుల్ నది రోడ్డు వెంబడి ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నాం’ అని అన్నారు. జైతిపూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గౌరవ్ త్యాగి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. -
వక్ఫ్ చట్టంపై స్టేకి సుప్రీం కోర్టు నిరాకరణ, కానీ..
వక్ఫ్ (సవరణ) చట్టం Waqf (Amendment) Act, 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పును వెలువరించింది. చట్టం అమలుపై(అన్ని ప్రొవిజనల్స్)పై స్టే విధించేందుకు నిరాకరిస్తూనే.. చట్టంలో కీలక ప్రొవిజన్స్ను నిలిపివేస్తూ సోమవారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. ఇందులో.. ప్రధానంగా ఐదేళ్లు ఇస్లాం మతం ఆచరిస్తేనే వక్ఫ్ చేయాలన్న సెక్షన్ కూడా ఉంది. కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్(సవరణ)చట్టం-2025పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండటం మంచిదని పేర్కొంది.మధ్యంతర ఆదేశాల్లో హైలైట్స్వక్ఫ్ ఆస్తులా ? కావా ? అన్నది కోర్టులే నిర్ణయిస్తాయిప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆక్రమించిందా? లేదా? అనే అంశంపై నిర్ణయించే అధికారం అధికారులకు కట్టబెట్టిన సెక్షన్ పై స్టే ఐదేళ్లు ఇస్లాం మతం ఆచరిస్తేనే వక్ఫ్ చేయాలన్న సెక్షన్ పై స్టేఈ అంశంపై ప్రభుత్వం తగిన నిబంధనలు రూపొందించే వరకు స్టే విధించిన సుప్రీంవక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్: కోర్టు ఈ అంశంపై తాత్కాలికంగా ప్రభుత్వ చర్యలకు పరిమితి విధించింది. ఇప్పటికే వక్ఫ్గా గుర్తించబడిన ఆస్తుల స్థితిని తక్షణంగా మార్చకూడదని సూచించింది.వక్ఫ్ బోర్డుల సభ్యత్వం: ముస్లిమేతరుల నియామకంపై అభ్యంతరాలు ఉన్నా.. కోర్టు తాత్కాలిక స్టే ఇవ్వలేదు. కానీ ఈ అంశంపై వివరణాత్మక విచారణ అవసరమని పేర్కొంది.సెంట్రల్ వక్ఫ్ బోర్డులో నలుగురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దుస్టేట్ వక్ఫ్ బోర్డులో ముగ్గురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దుకలెక్టర్ విచారణ ద్వారా ప్రభుత్వ భూమిగా గుర్తింపు: ఈ నిబంధనపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఆ అధికారం కలెక్టరలకు లేదని.. ట్రిబ్యూనల్స్కే ఉందని స్టే విధించింది. ఇది ఆస్తుల హక్కులపై ప్రభావం చూపే అంశంగా పేర్కొంది.సెక్షన్ 3r - ఇస్లాం ఆచరిస్తూ 5 సంవత్సరాలు కావాలి. నియమాలు రూపొందించకపోతే, అది యాదృచ్ఛిక అధికార వినియోగానికి దారి తీస్తుంది.సెక్షన్ 2(c) నిబంధన - వక్ఫ్ ఆస్తి, వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదు.సెక్షన్ 3C - రెవిన్యూ రికార్డుల్లో సవాలు చేస్తూ కలెక్టర్కు హక్కులు నిర్ణయించే అధికారం ఇవ్వడం, అధికార విభజనకు విరుద్ధం. తుది తీర్పు వచ్చే వరకు ఆస్తుల హక్కులు ప్రభావితం కావు. హక్కు నిర్ణయించకముందు, వక్ఫ్ కూడా ఆస్తి నుండి తొలగించబడదు.సెక్షన్ 23 - ఎక్స్ ఆఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందినవారే కావాలి.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్లో పార్లమెంట్ ఈ బిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకోర్టుకు చేరింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు కాగా.. వీటన్నింటిని ఒక్కటిగా కలిపి కోర్టు విచారణ జరిపి మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ తీర్పు చట్టాన్ని నిలిపివేయకుండా.. కీలకాంశాలపై పరిమితి విధిస్తూ సమగ్ర విచారణకు మార్గం వేసింది. అంతకు ముందు..ఈ పిటిషన్లను సీజేఐ(పూర్వపు) జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మే 5న విచారణ చేపట్టి, తదుపరి విచారణను మే 15కి వాయిదా వేసింది. ఆపై జస్టిస్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయడంతో.. తదుపరి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు పూర్తి కావడంతో మే 22వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ తీర్పును ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. అయితే ఇది మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. రాజ్యాంగబద్ధతపై పూర్తి విచారణ ఇంకా జరగాల్సి ఉంది.వాదనలు.. వక్ఫ్ అనేది మతపరమైన అవసరం కాదు, ఇది చారిటబుల్ కాన్సెప్ట్ అని కేంద్రం వాదించింది. అయితే పిటిషనర్లు ఈ చట్టాన్ని అన్యాయమైనది, అసంవిధానమైనది, ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో కోర్టు.. చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని కేంద్రం చెప్పిందని, కాబట్టి పూర్తి స్టే ఇవ్వడం అనవసరం అని అభిప్రాయపడుతూ కీలక అంశాలపై మాత్రం స్టే విధించింది. -
Mumbai: హఠాత్తుగా ఆగిన మోనో రైలు.. ప్రయాణికులు బెంబేలు
ముంబై: మహానగరం ముంబైలో సోమవారం ఉదయం మోనోరైలు కాసేపు ప్రయాణికులను భయపెట్టింది. వడాలా ప్రాంతంలో మోనోరైలు రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో రైలులోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా మోనో రైలు నిలిచిపోయిందని అధికారులు నిర్ధారించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం మోనోరైలు సాంకేతిక లోపంతో ఆగిపోయిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను బయటకు తీసుకువచ్చి, చెంబూర్ నుండి వచ్చిన మరొక మోనోరైలులో వారిని సురక్షితంగా తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక దళం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మోనోరైలును కప్లింగ్ ద్వారా అక్కడి నుంచి తొలగించనున్నారు.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) తెలిపిన వివరాల ప్రకారం మోనో రైలు ఆగిన సమయంలో దానిలో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. గత నెలలో నగరంలోని ఆచార్య అత్రే చౌక్ స్టేషన్లో ఒక మోనోరైలు రైలు 12 నిమిషాల పాటు నిలిచిపోయింది. ముంబైలో మోనోరైల్ సేవలను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మోనోరైలు ముంబైలోని వడాలా నుండి ఛంబూర్, సంత్ గాడ్గే మహారాజ్ చౌక్ వరకు నడుస్తుంది. -
జార్ఖండ్: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. మరో అగ్రనేత మృతి
హజరీబాగ్: జార్ఖండ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. హజరీబాగ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్ర నేత సహదేవ్ సోరెన్ సహా మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ తలపై రూ.కోటి రివార్డ్ ఉందని పోలీసులు తెలిపారు.ఎన్కౌంటర్లో మృతిచెందిన మరో ఇద్దరు మావోయిస్టులు.. బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హేమ్రమ్ అలియాస్ చంచల్పై రూ. 25 లక్షలు, జోనల్ కమిటీ సభ్యుడు బీర్సెన్ గంఝు అలియాస్ రామ్ఖేలవాన్పై రూ.10 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, నిన్న (సెప్టెంబర్ 14) జార్ఖండ్లో మరో మావోయిస్టు మృతి చెందారు. పలాము జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు.‘ఆపరేష్ కగార్’ మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గత కొన్ని నెలలుగా జార్ఖండ్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు ఆపరేషన్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు మావోయిస్ట్ సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
‘బీఎండబ్ల్యూ’తో రోడ్డుపై మహిళ హల్చల్.. ఆర్థిక శాఖ సీనియర్ అధికారి దుర్మరణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీఎండబ్ల్యూ కారును నిర్లక్ష్యంగా నడిపిన ఓ మహిళ.. ప్రభుత్వ సీనియర్ అధికారి దుర్మరణానికి కారకురాలయ్యారు. ఈ దుర్ఘటనలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్తోజ్ సింగ్ మృత్యువాత పడ్డారు. ఢిల్లీ కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలోని రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న ఒక మహిళ.. బైక్ వస్తున్న నవ్తోజ్ సింగ్ దంపతులను ఢీకొంది. ఈ ప్రమాదంలో సీనియర్ అధికారి నవ్తోజ్ సింగ్ మరణించగా, అతని భార్య తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.ఆర్థిక వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్తోజ్ సింగ్ ఆదివారం బంగ్లా సాహిబ్ గురుద్వారా నుండి తన బైక్పై భార్య సందీప్ కౌర్తో పాటు ఇంటికి తిరిగి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నవ్తోజ్ సింగ్ వయసు 52 సంవత్సరాలు. ప్రమాదం అనంతరం వీరి కుమారుడు మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన తన తల్లిదండ్రులను ఘటన జరిగిన ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలోని నులైఫ్ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అప్పటికే తన తండ్రి చనిపోయారని తెలిపాడు. Finance Ministry Deputy Secretary dies after BMW hits his bike in Delhi.A Deputy Secretary in Finance Ministry died and his wife is seriously injured after a BMW hit his motorcycle on Delhi's Ring Road, police said.He was returning home from Bangla Sahib Gurudwara when he met… pic.twitter.com/Ml4gizQnr9— Nitesh Sharma (@nitesh1572) September 14, 2025తన తల్లిదండ్రుల బైక్ను ఢీకొన్న బీఎమ్డబ్ల్యూ కారు నడిపిన మహిళ కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారని, అయితే ఆస్పత్రి సిబ్బంది ఆమె గురించిన సమాచారం వెల్లడించలేదని నవ్తోజ్ సింగ్ కుమారుడు తెలిపాడు. ప్రమాదానికి కారకురాలైన మహిళ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆమె కోసం నకిలీ మెడికో-లీగల్ సర్టిఫికేట్ను సిద్ధం చేసేందుకు ఆస్పత్రి యాజమాన్య సహాయం చేస్తోందని ఆయన ఆరోపించాడు.కాగా కారు నడిపి మహిళను గగన్ప్రీత్గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త పరీక్షిత్ పాసింజర్ సీట్లో కూర్చున్నాడు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును, నవ్తోజ్ సింగ్ మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద స్థలాన్ని క్రైమ్ బృందం, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా సంఘటనా స్థలంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
మరో వివాదంలో పూజా ఖేడ్కర్.. ట్రక్కు డ్రైవర్ను కిడ్నాప్ చేసి..
పూణె: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఛీటింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయిన ఐఏఎస్ ప్రొబెషనర్ పూజా ఖేద్కర్ మరోమారు వార్తల్లో నిలిచారు. ముంబైలోని ఐరోలిలో కిడ్నాప్ అయిన ఓ ట్రక్ డ్రైవర్ పూణేలోని చతుశృంగి ప్రాంతంలో గల పూజా ఖేడ్కర్ ఇంట్లో కనిపించడం సంచలనంగా మారింది.సామాజిక కార్యకర్త విజయ్ కుంభార్ ట్వీట్తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివాదాస్పదురాలిగా మారి, సస్పెండ్ అయిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి సాగించిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న ఐరోలి ప్రాంతంలోని సిగ్నల్ వద్ద ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ అయ్యాడు. బాధితుడు నవీ ముంబైకి చెందిన ప్రహ్లాద్ కుమార్ (22). ఆయన తన మిక్సర్ ట్రక్కును తీసుకెళ్తూ ఒక కారును ఢీకొన్నాడు. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతనిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఈ నేపధ్యంలో ప్రహ్లాద్ కుమార్ కనిపించడం లేదంటూ సంబంధీకులు రబాలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Pune Video: Ex-IAS Probationer Puja Khedkar's Mother Confronts Police During Rescue Of Allegedly Kidnapped Driver From Her Home pic.twitter.com/zYkEsSyi7L— Momentum News (@kshubhamjourno) September 14, 2025కేసు దర్యాప్తులో భాగంగా అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఖరత్ ఆ కారును ట్రాక్ చేసే దిశగా పూణేకు వెళ్లారు. ఆ కారు వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ ఇంటి లొకేషన్లో కనిపించింది. దీంతో ఖరత్ బృందం కిడ్నాప్ అయిన డ్రైవర్ను రక్షించినట్లు విజయ్ కుంభార్ తన ట్వీట్లో వివరించారు. ఈ కేసు దర్యాప్తు లో పూజా ఖేడ్కర్ తల్లి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని, కనీసం తలుపు కూడా చాలాసేపటి వరకూ తెరవలేదని సమాచారం. పోలీసులు పూజా ఖేడ్కర్ తల్లి చేసిన కిడ్నాప్ వ్యవహహారంపై దర్యాప్తు చేపట్టారు. -
‘సిక్’ అని మెసేజ్ చేసిన 10 నిమిషాలకే..
న్యూఢిల్లీ: హఠాత్తుగా ఒంట్లో బాగోలేదంటూ ఉన్నతాధికారికి స్మార్ట్ఫోన్లో సందేశం పంపిన పది నిమిషాలకే ఆ ఉద్యోగి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్లకే ఓ ఉద్యోగి నూరేళ్లు నిండిన విషాద ఘటన తాలూకు వివరాలను పైఅధికారి కేవీ అయ్యర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘‘నా కింది ఉద్యోగి శంకర్ నుంచి ఉదయం 8.37 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది.భయంకరమైన వెన్నునొప్పి కారణంగా ఈరోజు ఆఫీస్కు రాలేకపోతున్నా, ఒక రోజు సెలవు ఇవ్వండి అని అందులో ఉంది. సరే విశ్రాంతి తీసుకో అని సమాధానం ఇచ్చా. ఆ తర్వాత కేవలం 10 నిమిషాలకే కుప్పకూలి శంకర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కొద్దిసేపటి తర్వాత నాకొక ఫోన్కాల్ వచ్చింది. శంకర్ చనిపోయాడని అవతలి వ్యక్తి చెబితే నమ్మలేకపోయా. వెంటనే మరో ఉద్యోగికి ఫోన్చేసి ఆరాతీశా.10 నిమిషాలకే చనిపోయాడని వాళ్లు కూడా చెప్పడంతో నిశ్ఛేష్డుడినయ్యా. వెంటనే శంకర్ ఇంటి అడ్రస్ కనుక్కుని పరుగున వెళ్లా. కానీ అతనిక లేడని తెల్సి దుఃఖంలో మునిగిపోయా. శంకర్ ఆరేళ్లుగా మా ఆఫీస్లోనే పచిచేస్తున్నాడు. వయసు కేవలం 40 ఏళ్లు. పెళ్లయింది. వాళ్లకొక పసి పిల్లాడు ఉన్నాడు. అతనికి ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు లేవు. మరునిమిషం ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. చుట్టూ ఉన్న వాళ్లతో హాయిగా ఉండండి. చివరిదాకా జీవితాన్ని ఆస్వాదించండి’’ అని అన్నారు. -
ధర్నాకు దిగిన వైష్ణోదేవి భక్తులు
కత్రా/జమ్మూ: త్రికూల పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవిని దర్శించుకునే భాగ్యం తమకు కల్పించాలని భక్తులు ధర్నాకు దిగారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడుతున్న ఘటనలతో ముందుజాగ్రత్తగా జమ్మూకశీ్మర్ పాలనాయంత్రాంగం వైష్ణోదేవి యాత్రను గత 20 రోజులుగా నిలివేసిన నేపథ్యంలో విసుగుచెందిన యాత్రికులు, భక్తులు ధర్మాగ్రహం వెలిబుచ్చారు. దేవీదర్శనం కోసం సుదూరాల నుంచి వచ్చాక తీరా త్రికూల పర్వతాల వద్ద హఠాత్తుగా ఆపేసి, యాత్రకు అర్థంతరంగా రద్దుచేయడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆదివారం రేసీ జిల్లాలోని కత్రా బేస్క్యాంప్ వద్ద పెద్దసంఖ్యలో యాత్రికులు నిరసన చేపట్టారు. ఆలయం దిశగా ర్యాలీగా వెళ్తేందుకు భక్తులు ప్రయతి్నంచగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆలయబోర్డ్ ఆదేశాలను ఉల్లంఘించడానికి వీల్లేదని పోలీసులు తెగేసి చెప్పారు. ఆలయానికి దారితీసే ప్రధాన ఘాట్రోడ్డు, దానికి అనుసంధానమైన రహదారుల వెంట భారీ వర్షాలు, పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిన పడటంతో మొత్తం ఘటనల్లో 34 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. దీంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వైష్ణోదేవి ఆలయ బోర్డ్ ఆగస్ట్ 26వ తేదీన యాత్రను నిలిపేసింది. అప్పటి నుంచి యాత్ర ఆగిపోయి ఆదివారానికి వరసగా 20 రోజులు పూర్తయింది. సెపె్టంబర్ 14వ తేదీన యాత్రను పునరుద్ధరిస్తామని గతంలోప్రకటించినా ఆదివారం(సెప్టెంబర్ 14న) అది మొదలుకాలేదు. దీంతో రోజులతరబడి వేచి ఉండే ఓపికలేక భక్తుల్లో అసహనం, ఆగ్రహం పెల్లుబికింది. ‘‘రెండు నెలలపాటు పాదరక్షల్లేకుండా కాలినడకన కత్రా బేస్క్యాంప్దాకా వచ్చా. వీలైనంత త్వరగా దర్శనభాగ్యం దక్కుతుందని ఆశపడుతున్నా. పెద్దగుంపులుగా జనానఇన పంపిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే చిన్న గుంపులుగా అయినా యాత్రను మొదలెడతే బాగుంటుంది’’అని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రాజీవ్ లోధీ అనే భక్తుడు అన్నారు. ‘‘19 రోజలతర్వాత 14వ తేదీన యాత్ర మొదలుకానుందని తెల్సి తమిళనాడు నుంచి కుటుంబంతో వచ్చా. తీరాచూస్తే యాత్ర పునరుద్ధరణ వాయిదాపడింది. మా క్షేమం కోరి యాత్రను ఆపేశారని తెలుసు. కానీ ఇంకెన్ని రోజులు వేచి ఉండాలో తెలీట్లేదు’’అని చెన్నైవాసి వినోద్కుమార్ అన్నారు. ‘‘ఏదేమైనా యాత్ర పూర్తిచేస్తాం. సస్పెండ్చేసే ఉద్దేశమే ఉంటే ఆన్లైన్ రిజి్రõÙ్టషన్ ఎందుకు మొదలెట్టారు?’అని ముంబై నుంచి వచి్చన రేఖ ఆగ్రహం వ్యక్తంచేశారు. దర్శనం చేసుకున్నాక వెనుతిరుగుతామని బిహార్ వాసి రాజ్కుమార్ స్పష్టంచేశారు. -
ప్రగతి పథంలో ముందుకు
ఇండోర్: భారతీయ సంప్రదాయక విజ్ఞానాన్ని నమ్ముకున్న భారత్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయపథంలో దూసుకుపోతోందని రాష్ట్రీయ స్వయంసేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. గత ఐదు త్రైమాసికాలతో పోలిస్తే ఈ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్రతి ఒక్కరి అంచనాలు పటాపంచలు చేస్తూ భారత్ ఏకంగా 7.80 శాతం వృద్ధిరేటును సాధించిన నేపథ్యంలో భారత పురోభివృద్ధిని భాగవత్ ప్రస్తావించడం గమనార్హం. ఆదివారం మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కు చెందిన ‘పరిక్రమ కృపాసారం’పుస్తకాన్ని ఇండోర్లో ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో భాగవత్ మాట్లాడారు. ‘‘3,000 ఏళ్లపాటు భారత్ విశ్వశక్తిగా కొనసాగినన్నిరోజులు ప్రపంచంలో ఎలాంటి ఆధిపత్యపోరు, సంఘర్షణలు జరగలేదు. ఇప్పుడు ప్రపంచదేశాల్లో నెలకొన్న ఘర్షణలన్నీ స్వప్రయోజనాలకు సంబంధించినవే. ఇవే అన్ని సమస్యలకు మూలం. భారతీయుల పూర్వీకులు జ్ఞాన, కర్మ, భక్తి భావనలను ఎలా సమన్వయం చేసుకుని జీవించాలో మనకు బోధించారు. ఈ సంప్రదాయక తత్వాన్ని భారత్ మనసావాచా కర్మణా పాటిస్తోంది. అందుకే ప్రతి ఒక్కరి అంచనాలను తప్పు అని ప్రకటిస్తూ ప్రగతిపథంలో భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది’’అని అన్నారు. మాజీ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ చేసిన వ్యాఖ్యలను భాగవత్ ఉదహరిస్తూ.. ‘‘మేం(బ్రిటన్) మీకు (భారత్కు) స్వాతంత్య్రం ఇస్తే అంతర్గత వైషమ్యాలు, విబేధాలతో విడిపోతారు. కలిసి ఉండటం కల’అని వెక్కిరించారు. ఆయన అంచనాలు సైతం తప్పు అని భారత్ నిరూపించింది. ఐకమత్యాన్ని చాటింది. ఆర్థికాభివృద్ధితో పురోగమిస్తోంది. విడిపోదామని బ్రిటన్లోనే కొన్ని ప్రాంతాల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ విభజన దిశలో అడుగులేస్తోంది. కానీ భారత్ విడిపోదు. మనం ముందుకే వెళతాం. గతంలో మనం విభజనకు గురయ్యాం ఇప్పుడు మళ్లీ ఆ ఐక్యతను సుసాధ్యంచేద్దాం’’అని అన్నారు. విశ్వాసాలు, నమ్మకాల మీదనే ప్రపంచం ముందుకుపోతోంది. అలాంటి నమ్మికలకు భారత్ పుట్టినిల్లు. ఇక్కడి వాళ్లంతా కర్మసిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. గోవులు, నదీమతల్లులు, వృక్షాలను పూజిస్తూ తద్వారా ప్రకృతి ఉపాసనను భారతీయులు ఆచరిస్తారు. అలా ప్రకృతిలో జీవిస్తారు. అలాంటి ప్రకృతి సంబంధం కోసం నేటి సమాజం అర్రులుచాస్తోంది. కానీ గత 300–350 సంవత్సరాలుగా ప్రపంచంలో చాలా దేశాలు ఎవరి దారి వారిదే, బలవంతులే బతకాలి అనే తప్పుడు వాదనకు జైకొట్టాయి. దాంతో సమస్యలొస్తున్నాయని వాళ్లకు ఇప్పడు అర్థమైంది. జీవితనాటకంలో మనందరం పాత్రధారులం. నాటకం ముగిసినప్పుడే మనం ఎవరనేది మనకు బోధపడుతుంది’’అని ఆయన అన్నారు. -
విమర్శల బదులు విస్తృత దర్యాప్తు చేయించాల్సింది
న్యూఢిల్లీ: బిహార్లో ఆగమేఘాల మీద చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను తీవ్రమైనవిగా భావించి దర్యాప్తు చేపట్టాల్సిందిపోయి ఆయనపై ప్రత్యారోపణల బురద చల్లడం ఏమాత్రం సబబుకాదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్వై ఖురేషి వ్యాఖ్యానించారు. ఖురేషి రాసిన ‘ప్రజాస్వామ్యానికి గుండెకాయ(డెమొక్రసీస్ హార్ట్ల్యాండ్’పుస్తకం త్వరలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నిల సంఘం తీరును ఆయన తూర్పారబట్టారు. ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన తర్వాత ఉద్యమస్థాయికి చేరిన విషయం తెల్సిందే. ‘‘ఓట్ల చోరీ అంశంలో త్వరలో రాహుల్గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’పేలుస్తానని చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఎత్తుగడ అయి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఎన్నికల సంఘం కొత్త ఓట్ల జోడింపు, నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, లోపాటు ఉన్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఈసీ చాలా తీవ్రంగా భావించాలి. వాటిలోని సహేతుకత, ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేపట్టాలి. సమగ్రస్థాయిలో దర్యాప్తుతో ఆయన ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చాలి. అలాంటిదేమీ చేయకుండా కేవలం ఆయనపై ప్రత్యారోపణలు చేయడం ఈసీకి తగదు. బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని విపక్షపారీ్టలుసహా పలు వర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నివృత్తిచేయాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంది. ఆ దిశగా అడుగులేయాల్సిందిపోయి ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకుని వివాదాల తేనెతుట్టెను ఈసీ కదిపింది’’అని ఖురేషి అన్నారు. అఫిడవిట్ అడగడం సబబుకాదు ‘‘ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించినప్పుడు దర్యాప్తు మొదలెడితే సరిపోయేది. అలా చేయకుండా రాహుల్ నుంచి ఆ ఆరోపణలు నిజమేనని పేర్కొంటూ అఫిడవిట్ను కోరడం సబబుకాదు. ఆయనేం వీధిలో వెళ్లే వ్యక్తికాదు. లోక్సభలో విపక్ష నేత. కోట్లాది ఓటర్లకు ప్రతినిధి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల తరఫున ప్రశ్నించే ప్రజాప్రతినిధి. కోట్లాది ప్రజల గొంతుక. అలాంటి కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తితో ఈసీ ఇలా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం గతంలో నేనెప్పుడూ చూడలేదు. అఫిడవిట్ ఇవ్వండి లేదంటే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటూ ఆయనతో అమర్యాద బాషలో సం¿ోదించడం అభ్యంతరకరం మాత్రమేకాదు నేరంకూడా’’అని ఖురేషి ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సందర్భాల్లో నేనెంతో బాధపడ్డా.. ‘‘నేరుగా ఈసీని తప్పుబడుతూ ఏవైనా ఆరోపణలు వస్తే నేను తొలుత ఆందోళనచెందుతా. ఈసీని అత్యంత పారదర్శకంగా పనిచేసేలా చూడటంలో నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్గా నా వంతు కృషిచేశా. అందుకే ఇప్పుడు కేంద్ర ఎన్నికలసంఘంపై ఎవరైనా ఆరోపణలుచేస్తే మాజీ సీఈసీగానేకాకుండా ఒక సగటు భారతీయ పౌరునిగా ఎంతో బాధపడతా. ఏదైనా ప్రభుత్వసంస్థను ఎవరైనా బలహీనపర్చడానికి ప్రయతి్నస్తే కుంగిపోతా. అలాంటి ఈసీ స్వయంగా ఆరోపణల దాడులను ఎదుర్కొన్నప్పుడు వాటిని సమగ్ర దర్యాప్తు ద్వారా సమగ్రంగా ఎదుర్కోవాలి. రాజకీయ శక్తులు, బయటి వ్యక్తుల ఒత్తిళ్ల ఏ స్థాయిలో ఉన్నా సరే స్వీయ నిర్ణయాలల్లో వెనుకడుగు వేయకూడదు. ప్రజల విశ్వాసాన్ని ఈసీ చూరగొనాలి. అధికార పారీ్టతో పోలిస్తే విపక్ష పార్టీల పలుకుబడి తక్కువ అయినాసరే విపక్ష పారీ్టల విశ్వాసాన్నీ సాధించాలి. అధికార పార్టీ నేతలతో పోలిస్తే విపక్ష పారీ్టల నేతలు చెప్పేవి ఎక్కువగా వినాలి. అందుకోసం వారికి ఈసీ తలుపులు బార్లా తెరవాలి. వాళ్లకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ల వాదనలు, ఆరోపణలు, అభ్యంతరాలు, విన్నపాలను సావదానంగా ఆలకించాలి. మా మాట ఈసీ వినట్లేదని ముఖ్యమైన 23 పార్టీలు సుప్రీంకోర్టు గుమ్మం తొక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు’’అని ఈసీకి ఖురేషి హితవు పలికారు.కొత్త జాబితాలో తప్పుల్లేవని అఫిడవిట్ ఇవ్వగలరా? ఈ సందర్భంగా ఈసీపై ఖురేషి పలు ప్రశ్నలు సంధించారు.‘‘ముసాయిదా జాబితా తర్వాత సవరణల తర్వాత తెచ్చే తుది జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లవని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? రాహుల్ను అడిగినట్లుగా మీరు కూడా ఇందులో ఏ తప్పులు ఉండబోవని అఫిడవిట్ సమరి్పంచగలరా? తప్పులు ఉంటే అది నిజంగా నేరమే. అలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కోగలరా?. ఈసీ అనేది పారదర్శకంగా ఉంటే సరిపోదు. పారదర్శకంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించాలి. నిజానిజాలను దర్యాప్తు మాత్రమే బయటపెట్టగలదు. తీవ్ర ఆరోపణలు అరుదుగా చేస్తారు. అలాంటప్పుడే దర్యాప్తు చేపట్టాలి. అలాంటి అవకాశాన్ని ఈసీ సది్వనియోగం చేసుకోలేకపోయింది’’అని అన్నారు. ఖురేషీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ‘రాజకీయ పారీ్టలతో మేము క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇంత నిర్మాణాత్మక పద్ధతిలో మరెక్కడా సమావేశాలు జరగవు’అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
నేడు బిహార్లో ప్రధాని పర్యటన
పట్నా: ప్రధాని మోదీ సోమవారం బిహార్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పుర్నియాలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రూ.36 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పుర్నియాలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెరి్మనల్ను ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మఖానా బోర్డును ప్రధాని ప్రారంభిస్తారు. మఖానాను సూపర్ఫుడ్గా పలుమార్లు ప్రధాని మోదీ పేర్కొనడం తెల్సిందే. దేశంలో ఉత్పత్తయ్యే మఖానాలో అత్యధికంగా 90 శాతం మేర బిహార్లో సాగవుతోంది. మరికొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీ బిహార్కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత 11 ఏళ్లలో బిహార్ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేశారని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర డెప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరి తెలిపారు. తమ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలాలను అందుకుంటోందన్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను భారీగా చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను అధికారులు నిషేధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పుర్నియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడి, వారు పడుతున్న ఇబ్బందులపై ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాల కల్పనలో సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. -
ఏఐ నకిలీ వార్తల సూత్రధారుల భరతం పట్టండి
న్యూఢిల్లీ: కృత్రిమమేథ(ఏఐ)తో సృష్టించిన నకిలీ వార్తలు సమాజంపై పెను దుష్ప్రభావం చూపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పరిష్కార కొరడాతో ముందుకు రావాలని ప్రసార, సమాచార సాంకేతికతపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉద్భోదించింది. ఏఐతో సృష్టించిన నకిలీ వార్తల విస్తృతి కట్టడికి ఏఐతో అడ్డుకట్టవేయాలని ఈ మేరకు ఏఐను పూర్తిస్తాయిలో వినియోగించుకోవాలని సంబంధిత ముసాయిదా నివేదికలో స్టాండింగ్ కమిటీ సూచించింది. ‘తప్పుడు సమాచారం ఎక్కడ ఉందో తెల్సుకునేందుకు సాంకేతికతను ఉపయోగించాలి. కానీ ప్రస్తుత సమాజంలో తప్పుడు సమాచారానికి సాంకేతికతనే సృష్టికర్తగా మారిన దురవస్థ దాపురించింది’అని ముసాయిదా ఆవేదన వ్యక్తంచేసింది. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సారథ్యంలోని స్టాండింగ్ కమిటీ ఇటీవలే తన నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. ‘ఏఐతో నకిలీ వార్తలను తామరతుంపరగా సృష్టించి అన్ని సామాజిక మాధ్యమాల్లోకి వెదజల్లుతున్న సృష్టికర్తల ఆచూకీ కనిపెట్టి వాళ్ల భరతం పట్టాలి. ఈ క్రతువులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలు కలసికట్టుగా పనిచేయాలి. ఏఐ నకిలీ వార్తలను రూపొందిస్తున్న వ్యక్తులు, సంస్థలను చట్టం ముందు నిలబెట్టేలా పటిష్టమైన న్యాయ, సాంకేతిక పరిష్కారాలను కనుగొనాలి’అని సూచించింది. శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి‘‘మంత్రిత్వశాఖల మధ్య అంతర్గత సహకారం ఉంటే ఏఐ కంటెంట్ సృష్టికర్తలకు ఏఐ జనిత వీడియోలు, సమాచారంపై లైసెన్సుల జారీపై మరింత పట్టు సాధించగలరు. ఏఐ వీడియోలు, కంటెంట్పై ఇది ఏఐ జనితం అనే లేబుల్ను కచ్చితంగా ముద్రించాలనే నిబంధనను తు.చ. తప్పకుండా అమలుచేయాలి’ అని సూచించింది. నకిలీ సమాచారం జాడ కనిపెట్టడం, కట్టడిచేయడం, తొలగించడం వంటి విధుల్లో ఏఐ, మెషీన్ లెర్నింగ్ సాంకేతికతలను విరివిగా వాడాల్సిన తరుణమిది అని నివేదిక అభిప్రాయపడింది. ఏఐ నకిలీ వార్తలను సృష్టించడం, ప్రచారంచేయడం వంటి నేరాలకు కఠిన శిక్షలను అమలుచేసేలా నేరశిక్షాస్మృతిలో సవరణలు చేయడం, జరిమానా మొత్తాలను పెంచడం వంటివి చేయాలని సూచించింది. -
శాస్త్ర, సాంకేతిక రంగాల భాషగా హిందీ!
గాంధీనగర్: మాట్లాడే భాషగా మాత్రమేకాదు శాస్త్ర, సాంకేతిక రంగాలు, న్యాయ, పోలీస్ విభాగాల్లోనూ హిందీ అంతర్లీనంగా కలిసిపోవాలిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభిలషించారు. ఆదివారం గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన ఐదవ అఖిల భారతీయ రాజభాష సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమిత్షా పాల్గొని ప్రసంగించారు. ‘‘ హిందీకి ఇతర భారతీయభాషలకు మధ్య ఎలాంటి ఘర్షణ లేనేలేదు. దయానంద సరస్వతి, మహాత్మాగాంధీ, కేఎం మున్షీ, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ వంటి ఎందరో మహానుభావులు హిందీని ఆమోదించారు. హిందీ బాషను దేశవ్యాప్తంగా ప్రోత్సహించారు. గుజరాత్లో హిందీ, గుజరాతీ రెండూ తమ స్పష్టమైన ఉనికిను చాటుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఒకే రాష్ట్రంలో రెండు భాషలు ఉన్నాసరే రెండూ అభివృద్ధి చెందగలవని గుజరాత్ నిరూపించింది’’ అని అన్నారు.హిందీ కేవలం భాష కాదు‘‘హిందీ కేవలం మాట్లాడే భాష కాదు. పరిపాలనా భాష కూడా. శాస్త్ర సాంకేతిక రంగాలు, న్యాయ, పోలీస్ విభాగాల్లోనూ పరిపాలనలో హిందీని ఉపయోగిస్తే బాగుంటుంది. ఇలా అన్ని భాషలను కీలక రంగాల్లో పరిపాలన సౌలభ్యం కోసం వినియోగిస్తే పౌరులు సైతం ఈ భాషలను విరివిగా ఉపయోగిస్తారు. సంస్కృత భాష అనేది మనకు జ్ఞానగంగను ప్రసాదించింది. ఆ జ్ఞానాన్ని ఇంటింటికీ హిందీ మోసుకొచ్చింది. స్థానిక భాషల ద్వారా ఆ జ్ఞానం ప్రతి ఒక్కరికీ చేరువైంది. మాతృభాషలోకాకుండా ఇతర భాషలో చిన్నారులకు కొత్త విషయాన్ని చెబితే మళ్లీ మాతృభాషలోనే దానిని అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం మెదడు సామర్థ్యంలో 25 నుంచి 30 శాతం ఖర్చవుతుంది. సామర్థ్యం వృథాను తగ్గించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎల్లప్పుడూ మాతృభాషలోనే మాట్లాడాలి. లేదంటే పిల్లలకు కొత్త అంశాలను తెల్సుకోవడం కష్టమవుతోంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది’’ అని అన్నారు. ‘‘గుజరాతీ ఉన్నప్పటికీ గుజరాత్లో విద్యాంశాలు హిందీలోనే కొనసాగుతున్నాయి. ఇది మహాత్మాగాంధీ, దయానంద్ సరస్వతి వల్లే సాధ్యమైంది. అలాగే ప్రతి రాష్ట్రంలో ప్రజలు హిందీలోనూ సంప్రతింపులు కొనసాగించాలి’’ అని షా కోరారు. ‘హిందీ శబ్ద సింధూ అనేది 51,000 పదాలతో మొదలైంది. ఇప్పుడు 7,00,000 పదాలతో అలరారుతోంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలోని అన్ని భాషల్లో అత్యధిక పదాల నిఘంటువుగా చరిత్రకెక్కుతుంది’’ అని ఆయన అన్నారు. మోదీ శుభాకాంక్షలు‘‘హిందీ కేవలం భాష, సమాచారమార్పిడి అనుసంధానం కాదు.. మన భారతీయ సంస్కృతి, ఉనికికి సజీవ వారసత్వ సంపదగా హిందీ భాసిల్లుతోంది. హిందీ దివస్ రోజు మీకందరికీ అంతులేని శుభాకాంక్షలు. హిందీ దివస్ సందర్భంగా భారతీయ భాషలన్నీ పరిఢవిల్లాలని ప్రతిజ్ఞచేద్దాం’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ఆదివారం పోస్ట్ చేశారు. -
చొరబాటుదారులకు మద్దతా?
గౌహతి: విపక్ష కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదులకు, మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నవారికి ఆ పార్టీ మద్దతిస్తోందని మండిపడ్డారు. మన సైన్యానికి అండగా ఉండడానికి బదులు నిస్సిగ్గుగా ముష్కర మూకలను వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ కాపాడుతోందని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ పార్టీ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్కు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని, దేశ ప్రయోజనాలను ఆ పార్టీ ఏనాడూ కాపాడలేదని నిప్పులు చెరిగారు. చొరబాటుదారులు మనదేశంలోకి ప్రవేశించి, భూములు ఆక్రమించుకొని, ఇక్కడే తిష్టవేసి జనాభా స్థితిగతులను మార్చేస్తామంటే సహించే ప్రసక్తే లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ అస్సాంలో రెండో రోజు ఆదివారం పర్యటించారు. దరాంగ్ జిల్లాలోని మంగళ్దోయి, నుమాలీగఢ్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కామాఖ్య మాత ఆశీస్సుల వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, ఈ పవిత్రమైన నేలపై అడుగుపెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అస్సాంతో, అస్సాం ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు ‘‘అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ నిన్ననే ఒక వీడియోను నాకు చూపించారు. పాటగాళ్లను, తైతక్కలాడేవాళ్లను బీజేపీ నెత్తిమీద పెట్టుకుంటోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఒకరు విమర్శిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. 2019లో అస్సాం గాయకుడు భూపేన్ హజారికాకు మేం భారతరత్న పురస్కారం ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఆ మాజీ అధ్యక్షుడు మాట్లాడారు. 1962లో చైనా దురాక్రమణ సమయంలో అస్సాం ప్రజలకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన గాయాలు ఇప్పటికీ మానలేదు. పైగా భూపేన్ హజారికాను కించపర్చడం ద్వారా ఆ గాయాలపై కాంగ్రెస్ ఉప్పు చల్లుతోంది. భూపేన్ను కించపర్చడం చూసి చాలా బాధపడ్డా. ప్రజలే నాకు యజమానులు. భూపేన్కు భారతరత్న ఇవ్వడం తప్పో ఒప్పో వారే నిర్ణయిస్తారు. ఆ మహా గాయకుడిని ఎందుకు అవమానించారంటూ కాంగ్రెస్ను ప్రజలు నిలదీయాలి. ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ అస్సాం ప్రజల కలలు నిజం చేయడానికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ అక్రమ వలసదారులను బయటకు పంపిస్తుండడం హర్షణీయం. భూములను వలసదారుల చెర నుంచి విడిపించి, మళ్లీ రైతులకు అప్పగిస్తున్నారు. ఆ భూముల్లో రైతులు, స్థానికులు వ్యవసాయ విప్లవం సృష్టిస్తున్నారు. చొరబాటుదారులు మన దేశంలోకి ప్రవేశించి, మన అక్కచెల్లెమ్మలను, తల్లులను అవమానిస్తామంటే చూస్తూ సహించాలా? జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని వదిలిపెట్టబోం. బయటకు తరిమికొట్టడం ఖాయం. చొరబాటుదారులకు సమాజంలో ఓ వర్గం నుంచి రక్షణ లభిస్తుండడం సిగ్గుచేటు. అక్రమంగా వలస వచ్చినవారి నుంచి అస్సాంను కాపాడేందుకు పోరాటం జరగాల్సిందే. చొరబాటుదారుల వల్ల మన దేశ జనాభాలో మార్పులు రాకుండా చూడడానికి ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ తీసుకొస్తున్నాం. ‘వికసిత్ భారత్’లో ఈశాన్య రాష్ట్రాలు కీలకం కాంగ్రెస్ పార్టీ అస్సాంను కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది. బ్రహ్మపత్ర నదిపై కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేము పదేళ్లలో ఆరు వంతెనలు నిర్మించాం. మనదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. అస్సాంలో 13 శాతం వృద్ధిరేటు నమోదైంది. డబుల్ ఇంజన్ సర్కార్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అస్సాంను హెల్త్హబ్గా తీర్చిదిద్దుతున్నాయి. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఈశాన్య రాష్ట్రాలకు కీలక పాత్ర పోషించబోతున్నాయి. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవాలన్న సంకల్పంతో దేశం మొత్తం ఐక్యంగా ముందుకు కదులుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అనుసంధానం పెంచడానికి చర్యలు చేపట్టాం. ఏ ప్రాంతమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ బలమైన అనుసంధాన వ్యవస్థ ఉండాలి. 21వ శతాబ్దంలో 25 ఏళ్లు గడిచిపోయాయి. ఈ శతాబ్దంలో తదుపరి అధ్యాయం తూర్పు, ఈశాన్య భారతదేశానిదే. దేశీయంగానే చమురు, సహజ వాయువు ఉత్పత్తి ముడి చమురు, సహజ వాయువు దిగుమతులను తగ్గించుకోవడానికి చర్యలు ప్రారంభించాం. మన దేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తరుణంలో ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి విదేశాలపై ఆధారపడడం సరైంది కాదు. అందుకే ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించాం. దేశీయంగానే శిలాజ ఇంధనాలు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి ప్రయతి్నస్తున్నాం. ఇంధనాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆ దిశగా ఇథనాల్ ఒక చక్కటి ప్రత్యామ్నాయం అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్కు ఇంధనం, సెమీకండక్టర్లు చాలా ముఖ్యం. వాటిని దేశీయంగానే తయారు చేసుకుంటే మనకు ప్రయోజనం’’ అని అన్నారు.ఆ గరళం గొంతులో దాచుకుంటా నన్ను చాలామంది దూషిస్తున్నారు. అవమా నించడమే పనిగా పెట్టుకున్నారు. వారు నన్ను ఎంతగా తిట్టినా పట్టించుకోను. నేను శివ భక్తుడిని. అన్నింటినీ భరిస్తా. ఆ గరళాన్ని గొంతులో దాచుకుంటా. కానీ, ప్రజలను అవమానిస్తే మాత్రం ఊరుకోను. ప్రజలే నా రిమోట్ కంట్రోల్. నాకు మరో రిమోట్ కంట్రోల్ లేదు. స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయాలని దేశ ప్రజలను మరోసారి కోరుతున్నా. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దక్కాలన్నా మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులే ఉపయోగించుకోవాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులే మన నిత్య జీవితంలో భాగం కావాలి. మోదీకి బహుమతిగా పెయింటింగ్లుఅస్సాం సభల్లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని పలుమార్లు కొద్దిసేపు నిలిపివేశారు. కొందరు యువతీ యువకులు మోదీ, ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీకి సంబంధించిన పెయింటింగ్లను సభల్లో ప్రదర్శించారు. వాటిని ఆయనకు బహుమతిగా అందజేయాలన్నదే వారి ఉద్దేశం. ఆ విషయం మోదీ గ్రహించారు. పెయింటింగ్ల వెనుక మీ పేరు, చిరునామా రాసి ఇవ్వండి అని కోరారు. వేదిక పైనుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయా పెయింటింగ్లను తీసుకోవాల్సిందిగా తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అలాగే తనకు లేఖ ఇవ్వడానికి ప్రయత్నించిన దివ్యాంగుడికి ఇబ్బంది కలిగించవద్దని ప్రజలకు సూచించారు.రూ.12,230 కోట్ల ప్రాజెక్టులు ప్రధానమంత్రి అస్సాంలో ఆదివారం రూ. 12,230 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో రూ.5,000 కోట్ల విలువైన ఇథనాల్ ప్లాంట్ కూడా ఉంది. వెదురుతో ఇక్కడ ఇథనాలు ఉత్పత్తి చేయబోతున్నారు. అలాగే రూ.7,230 కోట్ల విలువైన చమురు శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. పాలీప్రొపైలీన్ ప్లాంట్ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. దరాంగ్ మెడికల్ కాలేజీకి పునాదిరాయి వేశారు. 2.9 కిలోమీటర్ల పొడవైన నరెంగీ–కురువా వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
హారన్ మోగించరు.. గీత దాటరు
ఆ ప్రాంతం పేరు జొకోసంగ్.. నగరంలోని అతి ప్రధాన రోడ్డు.. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉండటంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒకవైపు వెళ్లే ట్రాఫిక్ అధికంగా ఉంది.. ఆ వైపు వాహనాలు నిలిచి పెద్ద వరస ఏర్పడింది.. మరోవైపు మాత్రం రోడ్డు ఖాళీగా ఉంది.. కానీ రోడ్డు మధ్యలో డివైడర్ లేకున్నా.. ఒక్క వాహనం కూడా గీత దాటలేదు. ఆ నగర పర్యటనకు వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ఈ దృశ్యాన్ని చూసి అశ్చర్యపోయింది. ప్రజల్లో ఆ పరిణతికి అభినందనలు అంటూ నగర మేయర్కు లేఖ రాసింది. ఆ సిటీని చూసి నేర్చుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు సచిత్ర లేఖ పంపింది. ఆ నగరమే ఈశాన్య రాష్ట్రమైన మిజోరం రాజధానిఐజోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐజోల్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. కానీ, కూడళ్లలో వాహనాలు అదుపు తప్పవు. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేనప్పటికీ వాహనాలు నియంత్రణ కోల్పోవు. రోడ్డు మీద వందల సంఖ్యలో వాహనాలు ముందుకు సాగుతున్నా.. ఎక్కడా హారన్లు వినపడవు, వాహనాలు ఒకదాని వెనక ఒకటి వరస కట్టి వెళ్తాయే తప్ప ఓవర్టేక్ చేయవు.. డ్రైవర్లు పరస్పరం అరుచుకోవటం, తిట్టుకోవటం మచ్చుకు కూడా కనిపించవు.. పాదచారులు ఫుట్పాత్ల మీదుగా మాత్రమే నడుస్తారు, అర్ధరాత్రి వేళ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు కూడా రోడ్లమీదుగా నడవరు. ఇవన్నీ నమ్మశక్యం కాని నిజాలు. ఐజోల్ నగరంలో ఏ మూలకెళ్లినా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో కొలువై.. కొండలు, లోయలు, దట్టమైన అడవులు, నదులు, వాగులు వంకలు.. స్వచ్ఛమైన ప్రకృతిలో కొలువైన ఆ నగరంలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. దాదాపు 2.20 లక్షల వాహనాలున్నప్పటికీ హారన్ల మోతలు లేకపోవటంతో శబ్ద కాలుష్యం ఉండదు. ఇది స్థానికుల క్రమశిక్షణ ఫలితం. అందుకే ఐజోల్ నగరాన్ని ‘ది సైలెంట్ సిటీ ఆఫ్ ఇండియా’అంటారు. ఇక్కడి ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ పుట్టుకతో వస్తుందని అంటున్నారు. 4.21 లక్షల జనాభా ఉన్న నగరంలో నేరాలు అతి తక్కువ. మద్య నిషేధం కట్టుదిట్టంగా అమలవుతుండటంతో ప్రశాంతత రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలు తు.చ.తప్పకుండా పాటిస్తున్న ప్రజలు, ఎలాంటి ఉల్లంఘనలకు ఆసక్తి చూపరు. దీంతో ఆ నగరంలో ప్రజల క్రమశిక్షణపై అధ్యయనానికి దేశంలోని చాలా నగరాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇంతకాలం విమానయానంతోనే.. ఐజోల్కు వెళ్లాలంటే ఇంతకాలం విమానయానమే అవకాశంగా ఉంది. అది ఖర్చుతో కూడుకున్నది కావటంతో చాలామంది అక్కడికి వెళ్లలేకపోయారు. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలతో శనివారం నుంచి రైల్వే అనుసంధానం అందుబాటులోకి రావడంతో అధ్యయనాల కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొండలతో కూడుకున్న ప్రాంతం కావటంతో విశాలమైన రోడ్ల నిర్మాణానికి వీలులేదు. కొండ అంచుల్లో వెనకవైపు లోయల్లోకి పిల్లర్లు ఏర్పాటు చేసి వాటి ఆధారంగా ఇళ్లను నిర్మిస్తుంటారు. ఉన్న కాస్త స్థలంలో 30 అడుగుల వెడల్పు రోడ్లు మాత్రమే ఉంటాయి. దీంతో ప్రజలు ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా క్రమశిక్షణతో రోడ్లను వాడుకుంటున్నారు. రోడ్లపై డివైడర్లు ఉండవు, కేవలం ట్రాఫిక్ లైన్స్మాత్రమే గీసి ఉంటాయి. అయినా.. ఓ వైపు ఉన్న వాహనం ఎట్టి పరిస్థితిలో గీత దాటి మరోవైపు వెళ్లదు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్గా మాత్రమే ట్రాఫిక్ నియంత్రిస్తుంటారు. వారు చేయి ఎత్తగానే ఠక్కున వాహనాలు నిలిచిపోతాయి. ముందు వాహనాలు మందగమనంతో సాగినా వెనక వాహనదారులు పొరపాటున కూడా హారన్ మోగించరు. సారీ చెప్పి ఓవర్టేకింగ్..» ఎవరైనా అత్యవసరంగా ముందుకు సాగాల్సి ఉంటే, వాహనాలను ఓవర్టేక్ చేసి పక్క వాహనదారుకు సారీ చెప్పి మరీ వెళ్లటం అక్కడి ప్రత్యేకత. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేని సమయంలో కూడా కూడళ్లలో వాహనదారులు నియంత్రణ కోల్పోరు. » ఘాట్ రోడ్లు కావటంతో అన్నీ మలుపులు తిరిగిన రోడ్లే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా హారన్ల మోత వినిపించదు. మరీ షార్ప్ కర్వ్ ఉండి, భారీ వాహనాలు వచ్చే రోడ్డయితే స్వల్పంగా ఒకసారి హారన్ మోగిస్తారు.» తక్కువ వెడల్పు రోడ్లే అయినా, అన్ని చోట్లా ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. పాదచారులు కచి్చతంగా ఫుట్పాత్పైనే నడుస్తారు. అర్ధరాత్రి వేళ రోడ్లు ఖాళీగా ఉన్నా.. ఫుట్పాత్ల గుండానే ముందుకు సాగుతారు.» టాక్సీలకు రోడ్ల మీదే పార్కింగ్ కల్పించారు. వాటికి 20 శాతం స్థలం ఉంటుంది. అవి వరసగా ఆగి ఉన్నా.. పక్కనుంచి మిగతా వాహనాలు ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంటాయి. » ఫుట్పాత్ల వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్, హారన్లు మోగించకపోవటం, అక్రమ నిర్మాణాలు రాకుండా నియంత్రించటం.. తదితర అంశాలపై పాఠశాలల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించటం అక్కడి ప్రభుత్వాలు నిరంతరం కొనసాగిస్తున్నాయి. -
‘నా బ్రెయిన్ విలువ రూ.200 కోట్లు’.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు నెలకు రూ.200కోట్ల ఆదాయం వస్తుంది. ఎవర్ని మోసం చేసి సంపాదించాల్సి ఖర్మ పట్టలేదంటూ నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తగ్గింపుతో పాటు ఇతర ఉపయోగాల్ని దృష్టిలో ఉంచుకుని 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలు జరపాలంటూ కేంద్రం నిర్ణయించింది. 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల అంశంలో తన కుటుంబం ఆర్థికంగా లబ్ది పొందుతోందంటూ వచ్చిన ఆరోపణల్ని గడ్కరీ ఖండించారు.నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ‘ఈ సందర్భంగా నా బ్రెయిల్ విలువ రూ.200కోట్లు.. నేను మోసంతో కాదు, నిజాయితీతో సంపాదిస్తున్నాను. నా కుమారులు వ్యాపారంలో ఉన్నారు. నేను వారికి సలహాలు ఇస్తాను. కానీ మోసం చేయను. ఇటీవల నా కుమారుడు ఇరాన్ నుంచి 800 కంటైనర్ల యాపిల్స్ను దిగుమతి చేశాడు. అలాగే 1000 కంటైనర్ల అరటిపళ్లను ఎగుమతి చేశాడు’అని చెప్పారు.నాకు డబ్బుకు కొదవలేదు. షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిల్లరీ, పవర్ ప్లాంట్ వ్యాపారాలు ఉన్నాయన్న గడ్కరీ.. ఇవన్నీ వ్యక్తిగత లాభం కోసం కాకుండా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చేస్తున్నానని స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ సందర్భంలో ఈ20 ఇంధనంపై వస్తున్న విమర్శలపై గడ్కరీ స్పందించారు. ‘తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని, అందుకు పెయిడ్ సోషల్ మీడియా ప్రచారం జరగుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు కూడా ఈ20 ఇంధనంపై దాఖలైన పిల్ ను తిరస్కరించిందని గడ్కరీ గుర్తు చేశారు. ఈ విమర్శలన్నీ తనను రాజకీయంగా దెబ్బతీయడానికి పెట్రోల్ లాబీలు చేస్తున్న ప్రయత్నాలని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, రైతులకు మంచి జరిగే వరకు తన ప్రయత్నాలు కొనసాగిస్తానని గడ్కరీ స్పష్టం చేశారు.ఈ ఇంధనం సురక్షితమైనదే. ఇది దిగుమతి ప్రత్యామ్నాయంగా, ఖర్చు తగ్గించే, కాలుష్యాన్ని తగ్గించే, రైతులకు మేలు చేసే విధంగా రూపొందించామన్నారు. అంతేకాక, వాహనాల స్క్రాప్ విధానాన్ని ప్రోత్సహించేందుకు జీఎస్టీ రాయితీ ఇవ్వాలని ఆర్థిక మంత్రికి సూచించానని కూడా గడ్కరీ వెల్లడించారు. -
అస్సాంలో భూకంపం
దిస్పూర్: అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం అస్సాంలో 5.71 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని జీఎఫ్జెడ్ తెలిపింది.అస్సాంలోని గౌహతిలో సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు ఉత్తర బెంగాల్,పొరుగున ఉన్న భూటాన్ వరకు సంభవించాయి. భూకంపం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. తూర్పు హిమాలయ సింటాక్సిస్లో యురేషియన్, సుండా ప్లేట్ల కలయిక వద్ద అస్సాం ఉంది. కాబట్టే అస్సాంలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్పూర్లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొన్ని రోజుల తర్వాత ఇవాళ మరోసారి భూమి కంపించడం గమనార్హం. -
‘నేను శివభక్తుణ్ని.. ఆ విషాన్ని నేను హరించేస్తా’
దిస్పూర్: తనపై,తన తల్లి హీరాబెన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాంగ్రెస్పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను శివభక్తుణ్ని.. కాంగ్రెస్ విమర్శల విషాన్ని హరించేస్తా’అని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అసోంలో దరంగ్ జిల్లాలో ఆదివారం వేలకోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘నేను ఇలా మాట్లాడితే మోదీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. నన్ను ఎంత దూషించినా పట్టించుకోను. ఎందుకంటే నేను శివుని భక్తుడిని.. విమర్శల విషాన్ని హరించేస్తా. నా రిమోట్ కంట్రోల్ వాళ్లేకానీ దేశ ప్రజలపై దాడి చేస్తే మాత్రం మౌనంగా ఉండను. ప్రజలే నా దేవుళ్లు. నా బాధను వాళ్ల ముందు వ్యక్తం చేయకపోతే .. ఎవరి ముందు చేస్తాను. అందుకే వాళ్లే నా యజమానులు, నా దేవతలు, నా రిమోట్ కంట్రోల్. నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదు’ అని స్పష్టం చేశారు.చర్చకు దారితీసిన మోదీ రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలు అయితే, అస్సాం సభలో ప్రధాని మోదీ మరోసారి‘రిమోట్ కంట్రోల్’ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ చేశారని మోదీ ఆరోపించారు. అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్లో ఉన్నారని కూడా విమర్శించారు.2019లో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రముఖ అస్సామీ సంగీత కళాకారుడు భూపెన్ హజారికాకు భారతరత్న అవార్డ్తో సత్కరించింది. ఆ అవార్డుపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ గాయకులకు, నర్తకులకు అవార్డు ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ఖర్గే క్షమాపణలు చెప్పారు. ఖర్గే.. భూపెన్ హాజారికాను ఉద్దేశిస్తూ చేసిన విమర్శలను రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తనతో ప్రస్తావించినట్లు మోదీ తాజాగా సభలో గుర్తు చేశారు. అవును.. ఖర్గే అనుచితంగా మాట్లాడారుఅవును. భారత ప్రభుత్వం ఈ దేశపు ముద్దుబిడ్డ అస్సాం గర్వకారణం భూపేన్ హజారికాను భారతరత్నతో సత్కరించిన రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ ఈ అవార్డును ‘గాయకులు, నృత్యకారులకు’ఇచ్చారని అన్నారంటూ అస్సాం సభలో మోదీ గుర్తు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో.. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు. ఇటీవల రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ సమయంలో ఆ వీడియోపై ..మోదీ స్పందిస్తూ.. కాంగ్రెస్ తన తల్లి హీరాబెన్ను రాజకీయాల్లోకి లాగడం సరైందికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోను మోదీ, తల్లి హీరాబెన్ను ఉద్దేశించి ఉండటం తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ తనని వ్యక్తిగత హననం చేయడంపై ఇవాళ అస్సాంలో మోదీ స్పందించారు. -
భోపాల్ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగపూర్ ‘బాల్కనీ ఫ్లైఓవర్’
నాగ్పూర్:మధ్యప్రదేశ్లోని భోపాల్లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన వింతైన ఫ్లైఓవర్ వార్తల్లో నిలిచింది. దీనిపై వెళ్లే వాహనదారులు తికమకపడటం ఖాయం అనిపించేలా దానిని నిర్మించారు. ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్పూర్లోనూ ఇలాంటి అద్భుతాన్నే నిర్మించారు. ఈ తాజా ఇంజినీరింగ్ పరిజ్ఞానం ఇప్పుడు అందరి దృష్టిని అలరిస్తోంది. నాగ్పూర్లో నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్ అశోక్ చౌక్ సమీపంలోని ఒక ఇంటి బాల్కనీ భాగం గుండా వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.స్థానికులు దీనిని ఎనిమిదవ అద్భుతం అని అంటున్నారు. భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ), నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఒక ఇంటి బాల్కనీ గుండా ఈ నిర్మాణం చేపట్టేమందు ఎందుకు దీనిని గమనించేలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ బాల్కనీ ఫ్లైఓవర్ గురించి ఇంటి యజమాని ప్రవీణ్ పాత్రే, అతని కుమార్తె సృష్టితో పాటు సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మేట్లు మీడియాతో మాట్లాడారు.పాత్రే, అతని కుమార్తె తెలిపిన వివరాల ప్రకారం.. వారి కుటుంబం ఆరు తరాలుగా ఆ ఇంట్లో నివసిస్తోంది. ఈ ఆస్తి దాదాపు 150 సంవత్సరాల నాటిది. ఈ ఇంటిని 25 సంవత్సరాల క్రితం పునరుద్ధరించారు. కాగా ఫ్లైఓవర్ తమ బాల్కనీని ఆనుకంటూ వెళ్లడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, భద్రతా ప్రమాదాల గురించి ఆందోళన చెందడం లేదని వారు అన్నారు. అయితే ఈ ఇంటి ప్లాన్కు ఆమోదం ఉందా? అని అడిగినప్పుడు వారు తప్పించుకునే సమాధానం ఇచ్చారు. This is some crazy stuff going on in Nagpur "Flyover inside my Balcony" 😂@bhaumikgowande @zoru75 @haldilal @public_pulseIN @IndianTechGuide pic.twitter.com/xQW6ejTJNX— Sahil Ghodvinde for Mumbai (@MumbaiCommunit2) September 12, 20259.2 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ను ఎన్హెచ్ఏఐ పర్యవేక్షణలో రూ. 998 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ వివాదంపై అధికారులు మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్కు తెలియజేశామన్నారు.ఈ అనధికార నిర్మాణాన్ని కూల్చివేయడం నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత అని అన్నారు. కాగా సౌత్ నాగ్పూర్ ఎమ్మెల్యే మోహన్ మేట్ మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచిందన్నారు. దీనికి కారకులైనవారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం బాల్కనీకి చేరుకునే ముందుగానే సంబంధింత అధికారులు నోటీసు జారీ చేసి, నిర్మాణాన్ని తొలగించి ఉండాల్సిందని ఆయన అన్నారు. -
విమానం టేకాఫ్ విఫలం.. తప్పిన పెను ప్రమాదం..
లక్నో: లక్నో ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. లక్నో-ఢిల్లీలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రన్వేపై వేగం అందుకున్న తర్వాత విమానం టేకాఫ్ విఫలమైంది. అతి కష్టంపై పైలట్.. విమానాన్ని రన్ వే ముగిసే ముందు నిలిపివేశారు. విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు 151 మంది ప్యాసింజర్లు ఉన్నారు.శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇండిగో ఎయిర్లైన్స్ విమానం 6ఈ-2111 టేకాఫ్ కోసం సిద్ధమైంది. ఈ విమానం సాధారణంగా లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. రన్వేకు చేరుకుని ప్రయాణికులు విమానం ఎక్కారు. టేకాఫ్కు ముందు ఇంజిన్లు శక్తిని పుంజుకోవడంతో విమానం ఒకేసారి పైకి లేస్తుంది. కానీ, ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ కాలేదు. . ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ విమానంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు గోండా ఎస్పీ నాయకుడు సూరజ్ సింగ్ తాము లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్నామని వారు ఈ సంఘటనను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. వేగంగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి తరలించారు. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. -
Haridwar: అర్ధ కుంభమేళా-2027.. పుణ్య స్నానాల తేదీలివే..
హరిద్వార్ : అఖిల భారత అఖాడా పరిషత్ హరిద్వార్ అర్ధ కుంభమేళా- 2027కు ప్రతిపాదిత తేదీలను ఆమోదించడంతో ఈ ఉత్సవానికి కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం త్వరలో అర్ధ కుంభ క్యాలెండర్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ, వివిధ అఖాడాలకు చెందిన సాధువులు ఈ ఉత్సవం కోసం తరచూ సమావేశమవుతున్నారు. Haridwar | Chief Secretary Anand Bardhan conducted an on-site inspection of the mela area today to ensure that the 2027 Kumbh Mela in Haridwar is organized in a grand and divine manner, and to provide all essential facilities to the visiting devotees along with reviewing the… pic.twitter.com/8hcnP8ZnPe— ANI (@ANI) September 12, 2025హరిద్వార్లో జరిగే అర్ధ కుంభమేళా- 2027కు సంబంధించిన మూడు ప్రధాన పుణ్య స్నానాల షెడ్యూల్ ను అఖాడా పరిషత్ ఖరారు చేసింది. 2027 మార్చి 6, మార్చి 8, ఏప్రిల్ 14 తేదీలలో ఈ షాహీ స్నానాలు జరగనున్నాయని తెలిపింది. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అర్ధ్ కుంభమేళా ప్రధానంగా హరిద్వార్, ప్రయాగ్రాజ్ (అలహాబాద్)లలో జరగుతుంటుంది. -
Delhi: 15 రోజుల పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు.. రోజుకొక బహుమతి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలకు ఢిల్లీ ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు నుండి రాజధానిలో 15 రోజుల పాటు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. త్యాగరాజు స్టేడియంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 15 కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇతర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవాలు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు. వేడుకలలో ఢిల్లీ పౌరులకు ప్రతిరోజూ కొత్త బహుమతిని అందించనున్నామని ప్రకటించారు. ఇవి ఢిల్లీ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, వీక్షిత్ ఢిల్లీ దార్శనికతను నెరవేర్చడంలో సహాయపడతాయని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు. వీటిలో 101 ఆరోగ్య నిలయాలు, 150 డయాలసిస్ కేంద్రాలు, కొత్త హాస్పిటల్ బ్లాక్లు, అవయవ మార్పిడి, అవగాహన పోర్టల్ ప్రారంభం మొదలైనవి ఉండనున్నాయి.అలాగే ఢిల్లీ కంటోన్మెంట్లోని రాజ్పుతానా రైఫిల్స్ బేస్ సమీపంలో ఫుట్ ఓవర్బ్రిడ్జికి పునాది వేయడం, ఆటోమేటెడ్ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థలకు శ్రీకారం, గ్రీన్ ఎనర్జీ,పరిశుభ్రత విస్తరణ ప్రణాళికలు, నంగ్లీ సక్రవతిలో బయోగ్యాస్ ప్లాంట్, ఘోఘా డైరీలో బయోగ్యాస్ ప్లాంట్, యమునా యాక్షన్ ప్లాన్ అప్గ్రేడ్, మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులు మొదలైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నరేలాలో కొత్త అగ్నిమాపక కేంద్రం, మండోలి జైలు సమీపంలో రూ. 65 కోట్ల గ్రిడ్ స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆరోగ్య సంరక్షణ , పారిశుధ్యం, విద్య, రవాణా, పునరుత్పాదక ఇంధనం వరకు మొత్తం 75 ప్రాజెక్టులు, పథకాలను 15 రోజుల పాటు జరిగే ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రారంభించనున్నారు. -
పాక్తో భారత్ మ్యాచ్.. మోదీకి షాకిచ్చిన పహల్గాం బాధితులు
ఢిల్లీ: ఆసియా కప్ (Asia Cup)లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి ఘటన బాధితులు స్పందిస్తున్నారు. పాక్ జట్టుతో మ్యాచ్ ఆడటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత ప్రభుత్వం, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాక్ జట్టుతో మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన తమ వారిని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు వృథా అని అనిపిస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్పై పహల్గాం బాధిత కుటుంబాలు స్పందిస్తున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాక్తో మ్యాచ్ ఆడుతున్నారని తెలిసి బాధపడ్డాం. పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు ఉండొద్దు. మీరు మ్యాచ్ ఆడాలి అనుకుంటే దాడి ప్రాణాలు కోల్పోయిన మా వారిని తీసుకురావాలి. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ప్రధాని మోదీ చెప్పారు. మరి పాకిస్తాన్తో ఎందుకు మ్యాచ్ నిర్వహిస్తున్నారు అని ప్రశ్నించారు.ఆపరేషన్ సిందూర్ ఎందుకు?మరోవైపు.. పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది స్పందిస్తూ.. భారత్-పాక్ మ్యాచ్పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. భారత్-పాక్ మ్యాచ్ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కేవలం ఇద్దరు ముగ్గురు క్రికెటర్లే ముందుకువచ్చారు. మిలిగిన వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పాక్తో మ్యాచ్ ఆడాలని క్రికెటర్లను బీసీసీఐ బలవంతపెట్టొద్దని.. దేశం తరఫున నిలబడాలని సూచించాలన్నారు. కానీ అందుకు విరుద్ధంగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. పహల్గాం దాడిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మర్చిపోయారా అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్తో వచ్చిన ఆదాయాన్ని ఆ దేశ ప్రభుత్వం మళ్లీ ఉగ్రవాదులను పోషించడానికే ఉపయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మ్యాచ్ను నిర్వహిస్తే.. మనపై దాడి చేయడానికి వారిని మనమే సిద్ధం చేస్తున్నట్లు అవుతుందన్నారు. దేశ ప్రజలంతా భారత్-పాక్ మ్యాచ్ను చూడకుండా బహిష్కరించాలని కోరారు.నా తమ్ముడిని తీసుకురండి: సావన్పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో సావన్ పర్మార్.. తన తండ్రితో పాటు సోదరుడు కూడా ఉగ్రవాదుల కాల్పులకు బలై ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే భారత్-పాక్ మ్యాచ్పై సావన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మీకు మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన నా 16 ఏళ్ల తమ్ముడిని తిరిగి తీసుకురండి. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు వృథానేమో అనిపిస్తోంది. పహల్గాంలో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను చంపిన తర్వాత కూడా ఈ మ్యాచ్ ఆడటం సరికాదు అని ఘాటు విమర్శలు చేశారు.మా బాధ మీకు పట్టదా?మరోవైపు.. సావన్ తల్లి కిరణ్ యతీష్ పర్మార్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాల గాయాలు ఇంకా మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. ఇలాంటి సమయంలో భారత్-పాక్ మ్యాచ్ ఎందుకు జరుగుతోందని ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘ఈ మ్యాచ్ జరగకూడదు. నేను ప్రధానమంత్రి మోదీని అడగాలనుకుంటున్నాను. ఆపరేషన్ సిందూర్ ముగియనప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు జరుగుతోంది? పహల్గాం ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను ఒకసారి సందర్శించి, వారి బాధ ఎలా ఉందో చూడాలని దేశంలోని ప్రతి ఒక్కరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. మా గాయాలు ఇంకా మానలేదు’ అని అన్నారు. -
విషాదం.. 13వ అంతస్తు నుంచి దూకి తల్లీకొడుకు ఆత్మహత్య
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమారుడితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సాక్షి చావ్లా(37) తన భర్త దర్పణ్ చావ్లా, కొడుకు దక్ష్(11)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో నివసిస్తున్నారు. కుమారుడు పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడటంతో చికిత్స చేయిస్తున్నారు. కుమారుడి అనారోగ్యంపై చావ్లా తీవ్ర ఆందోళన పడేది.ఈ క్రమంలో తన కుమారుడి బాధ చూసి తట్టుకోలేక ఆ తల్లి తన కొడుకుతో కలిసి 13వ అంతస్తు ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన దర్పణ్ చావ్లా ఈ విషాద ఘటన జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నారు. అతను మరొక గదిలో ఉన్న సమయంలో కేక వినిపించిందని, బాల్కనీకి చేరుకోగానే తన భార్య, కొడుకు కింద పడి ఉన్నారని ఆయన పోలీసులకు తెలిపారు. 'క్షమించండి' అంటూ భర్తకు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు."మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం.. క్షమించండి. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము కోరుకోవడం లేదు. మా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు" అంటూ ఆమె సూసైడ్ నోట్లో రాసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
Gujarat: భారీ అగ్నిప్రమాదం.. తగలబడుతున్న ‘సంఘ్వి ఆర్గానిక్స్’
భరూచ్: గుజరాత్లోని భరూచ్ జిల్లా, పనోలిలో గల సంఘ్వి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగల మధ్య భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి,ప్రాణ నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు. VIDEO | Bharuch, Gujarat: Fire breaks out in Sanghvi Organics Pvt Ltd in GIDC Panoli. Thick smoke and flames were visible from a distance as multiple fire tenders rushed to the spot and began firefighting operations. More details are awaited.(Source: Third Party)(Full video… pic.twitter.com/UMVi3UgoN6— Press Trust of India (@PTI_News) September 14, 2025గుజరాత్లో ఏప్రిల్ 2న బనస్కాంత జిల్లాలోని దీసాలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటన మరువకముందే ఈ తాజా ఘటన చోటుచేసుకుంది. నాడు అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో 21 మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్కు నుంచి వలస వచ్చిన కార్మికులు అధికంగా ఈ ప్రమాదం బారిన పడ్డారు. సంఘ్వి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అగ్నిప్రమాదం దరమిలా, దగ్గమైన పొగ ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టింది. గిడ్డంగిలో కొంత భాగం ఆహుతయ్యిందని సమాచారం. కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలియవస్తోంది. పోలీసులు ఈ పరిశ్రమను అక్రమంగా నడిపిస్తున్న యజమాని ఖుబ్చంద్ థక్కర్,అతని కుమారుడిని అరెస్టు చేశారు. -
Rajasthan: వికటించిన మధ్యాహ్న భోజనం.. 90 మంది విద్యార్థులకు అస్వస్థత
దౌసా: రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన 90 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో ఆస్పత్రి పాలయ్యారు. చుడియావాస్ గ్రామంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.పాఠశాలలోని 156 మంది విద్యార్థులు రాష్ట్ర పోషకాహార పథకం కింద అందించిన చపాతీ, కూర తిన్నారు. తరువాత వారిలో 90 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వైద్య బృందం పాఠశాలకు తరలివచ్చింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో వారిని నంగల్ రాజ్వతన్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. వారిలోని 49 మంది విద్యార్థులను దౌసా జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. వారికి వైద్యసేవలు అందించేందుకు అదనంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమించారు. సాయంత్రం నాటికి పిల్లలందరూ కోలుకున్నారని వైద్యశాఖ అధికారులు ధృవీకరించారు.అంతకుముందు ఆస్పత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్.. విద్యార్థులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పాఠశాలలో వడ్డించిన ఆహార నమూనాలను సేకరించారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర మంత్రి కిరోరి లాల్ మీనా, బీజేపీ నేత జగ్మోహన్ మీనా జిల్లా ఆస్పత్రిని సందర్శించి, విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటన మరోసారి ప్రభుత్వ మధ్యాహ్న భోజనం నాణ్యతపై అనుమానాలను లేవనెత్తింది. -
బీహార్లో ‘సీట్ల’ లొల్లి.. ‘ఆల్-243’పై తేజస్వి దృష్టి
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి కొనసాగుతోంది. ఇదే సమయంలో మిత్రపక్షాల కూటమి ‘మహాఘట్ బంధన్’లో సీట్ల లొల్లి మొదలయ్యింది. కూటమిలోని అన్ని పార్టీలు అధిక సీట్లు కోరుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తాము రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లోనూ పోటీచేయనున్నట్లు ప్రకటించారు. శనివారం ముజఫర్పూర్లో జరిగిన ర్యాలీలో తేజస్వి ప్రసంగిస్తూ ‘ఈసారి తేజస్వి 243 స్థానాల్లోనూ పోటీ చేస్తారు. అది ముజఫర్పూర్ అయినా మరొకటైనా.. తేజస్వి పోరాడుతారు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే నా పేరు మీద ఓటు వేయండి. బీహార్ను ముందుకు తీసుకెళ్లడానికి తేజస్వి కృషి చేస్తారు... మనమందరం కలిసి పనిచేసి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి’ అని అన్నారు.ఇటీవల రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఓటరు అధికార్ యాత్రలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్.. ప్రజల ఓటు హక్కును లాక్కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరాస్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీలను చేర్చుకోవడం ద్వారా మహాఘట్ బంధన్లో ఇప్పటికే సీట్ల కేటాయింపు సమస్యగా మారింది. ఇటువంటి తరుణంలో తేజస్వి యాదవ్ తాజా ప్రకటన సంచలనంగా పరిణమించింది.2020 బీహార్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమిలో భాగంగా 144 నియోజకవర్గాల్లో పోటీ చేసి, 75 స్థానాలు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తాను బలపడినట్లు భావిస్తోంది. ఓటరు అధికార్ యాత్ర, ఓటు 'చోరీ'సందేశం బీహార్ ప్రజలతో ప్రతిధ్వనించిందని, రాహుల్కు, పార్టీకి మరింతగా ప్రజాదరణ పెరిగిదని అనుకుంటోంది.ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ కృష్ణ అల్లవారు మాట్లాడుతూ కొత్త పార్టీలు కూటమిలోకి వస్తే, ప్రతి పార్టీ తమ వాటాను అందించాల్సి ఉంటుందనుకుంటున్నామని, అయితే సీట్ల కేటాయింపులో సమతుల్యత ఉండాలన్నారు. కాంగ్రెస్ కనీసం 70 నియోజకవర్గాలను కోరుకుంటున్నదని, ఆ సంఖ్య ఇంకా తక్కువ కూడా కావచ్చన్నారు. అయితే 15 మంది ఎమ్మెల్యేలను కలిగిన వామపక్ష పార్టీలు (సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) కూడా మరిన్ని సీట్ల కోసం అభ్యర్థిస్తున్నాయని సమాచారం.గతంలో రాహుల్ గాంధీ సమక్షంలో తాను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకున్న తేజస్వి యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు మహాఘట్ భంధన్లో సీట్ల కేటాయింపును మరిత జఠిలం చేశాయి. ఇదిలా ఉండగా తేజస్వి యాదవ్ మాటలకు స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ ‘తేజస్వి యాదవ్.. మీరు కలలు కనడం ఆపండి. మీకు 243 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదు. మీరు ఇలాంటి ప్రకటనలతో కాంగ్రెస్, మీ మిత్రదేశాలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తుండవచ్చు. కానీ బీహార్ ప్రజలకు మీపై నమ్మకం లేదు. మిమ్మల్ని చూస్తే వారికి పశుగ్రాసం కుంభకోణం, ఉద్యోగాల భూకుంభకోణం గుర్తొస్తాయి. ప్రజలు ఎన్డీఏకు, నితీష్ కుమార్, ప్రధాని మోదీ పేరు మీద ఓటు వేస్తారు’ అని అన్నారు. -
వైష్ణోదేవి ఆలయ యాత్ర మళ్లీ వాయిదా
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయ యాత్ర వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఆదివారం నుంచి యాత్ర తిరిగి మొదలుకావాల్సి ఉంది. అయితే, రెండు రోజులుగా వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో యాత్రను వాయిదా వేసినట్లు శనివారం ఆలయ బోర్డు తెలిపింది. యాత్రను తిరిగి ప్రారంభించే తేదీని వాతావరణం మెరుగయ్యాక ప్రకటిస్తామని ఆలయ బోర్డు వివరించింది.ఆగస్ట్ 26వ తేదీన వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగి 34 మంది భక్తులు చనిపోగా, 20 మంది గాయపడటం తెల్సిందే. అప్పటి నుంచి యాత్రను 19 రోజులుగా ఆపివేశారు. -
ఐదు గంటల హడావుడి: ఖర్గే
న్యూఢిల్లీ: మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఐదు గంటలు కూడా ఆయన మణిపూర్ ప్రజలతో గడపలేకపోయారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వర్గవైషమ్యాలతో రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న వారిని ఈ పర్యటనతో మోదీ ఘోరంగా అవమానించారన్నారు. మోదీ పర్యటనను ఆయన పిట్ స్టాప్గా అభివరి్ణంచారు. ‘రెండేళ్లకుపైగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో సుమారు 300 మంది చనిపోగా, 1,500 మంది గాయపడ్డారు. మరో 67 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి కూడా చూడని ప్రధాని మోదీ ఇప్పుడు హడావుడిగా ఇంఫాల్ నుంచి చురాచాంద్పూర్ వరకు రోడ్ షో చేపట్టడమేంటి?’అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయ శిబిరాల్లోని ప్రజల మొర ఆలకించకుండా పిరికితనంతో తప్పించుకోవడానికే మోదీ షో చేపట్టారని ఎక్స్లో ఖర్గే వ్యాఖ్యానించారు. పర్యటనకు వెళ్లిన మోదీ ఘనమైన స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేయించుకోవడం బాధితుల గాయాలను మరింతగా పెంచడమేనన్నారు. ఇలాంటి చర్యలతో మోదీలో పశ్చాత్తాపం గానీ, అపరాధ భావన కానీ లేవని వెల్లడవుతోందన్నారు. మణిపూర్లో అశాంతి కొనసాగుతున్న గత 864 రోజుల సమయంలో 46 విదేశీ పర్యటనలు చేసిన మోదీకి, మన పౌరులతో రెండు సానుభూతి మాటలు పంచుకునే తీరికే దొరకలేదా అని ప్రశ్నించారు. మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అసమర్థత బయటపడిందన్నారు. దీన్నుంచి తప్పించుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని ఖర్గే ఆరోపించారు. మీ రాజ్యధర్మం ఎక్కడికి పోయిందంటూ 2002లో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖర్గే ప్రస్తావించారు. ఇలా ఉండగా, 28 నెలలుగా ఎదురుచూస్తున్న మణిపూర్ ప్రజలతో ప్రధాని మోదీ కనీసం ఐదు గంటలైనా గడపలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రచారానికి, విదేశాల్లో పర్యటనలకు ఉన్న సమయం ప్రజల మధ్య గడిపేందుకు ఆయనకు దొరకలేదా అని నిలదీశారు. -
విశ్వాస వారధి నిర్మించాలి: ప్రధాని మోదీ
ఇంఫాల్/చురాచాంద్పూర్: మణిపూర్లో జాతుల మధ్య సోదరభావం నెలకొనాలని, అన్ని వర్గాల ప్రజలు శాంతి సామరస్యాలతో కలిసికట్టుగా జీవించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొండ ప్రాంతాలు, లోయ మధ్య బలమైన విశ్వాస వారధిని కచ్చితంగా నిర్మించాలని తేల్చిచెప్పారు. మణిపూర్ లోయలో మైతేయీలు, కొండ ప్రాంతాల్లో కుకీలు నివసిస్తుంటారు. రాష్ట్రాన్ని శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా మారుస్తామని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేశారు. హింసను విడనాడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఆశ, విశ్వాసం అనే నూతన సూర్యోదయం సంభవిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మణిపూర్లో పర్యటించారు. 2023 మే నెలలో కుకీలు, మైతేయీల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. మోదీకి ఘన స్వాగతం లభించింది. రాజధాని ఇంఫాల్లోని కాంగ్లా పోర్ట్, చురాచాంద్పూర్లో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. మణిపూర్ ప్రజలకు తగిలిన గాయాలను నయం చేయడానికి, వారిలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, బాధితులందరినీ ఆదుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. మణిపూర్ అంటే ఒక రత్నం.. అది భరతమాత కిరీటంలో పొదిగిన రత్నమని అభివరి్ణంచారు. రాష్ట్రంలో హింస ఎక్కడ, ఏ రూపంలో జరిగినా ఖండించాల్సిందేనని చెప్పారు. హింస దురదృష్టకరమని, హింసాకాండకు పాల్పడడం మన పూరీ్వకులకు, భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు. మనమంతా కలిసి మణిపూర్ను శాంతి, అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్దామని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... హింసతో సామాజిక జీవనం బలహీనం మణిపూర్లో శాంతిని బేరసారాలు, బలప్రయోగంతో సాధించలేం. సుహృద్భావ వాతావరణంలో సంప్రదింపులు, ప్రజల ఐక్యతతోనే అది సాధ్యం. మణిపూర్ శక్తివంతమైన, సుందరమైన రాష్ట్రం. కానీ, ఇక్కడి సామాజిక జీవనాన్ని హింసాకాండ బలహీనపర్చింది. శాంతి, సామరస్యంతోనే తూర్పు భారతదేశ కీర్తికిరీటంలో తన స్థానాన్ని మణిపూర్ తిరిగి పొందుతుంది. మణిపూర్లోనే మణి ఉంది. ఈశాన్య భారతదేశంలో ఈ మణి గొప్పగా ప్రకాశించబోతోంది. రాష్ట్రంలో ఘర్షణ వల్ల నష్టపోయిన బాధితుల కోసం రాష్ట్రంలో 7,000 నూతన ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చాం. రూ.3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం. బాధితులకు సాంత్వన కలిగించడమే మా లక్ష్యం. వారి జీవితాల్లో వెలుగులు నిండాలి. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మణిపూర్లో ప్రగతి వేగం పుంజుకుంది. 2014 కంటే ముందు ఇక్కడ వృద్ధి రేటు ఒక శాతం కంటే తక్కువే. ఇప్పుడు అభివృద్ధిలో ముందంజలో ఉంది. 21వ శతాబ్దం తూర్పు, ఈశాన్య భారతదేశానికే చెందుతుంది. అందుకే మణిపూర్కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ‘సిందూర్’ విజయంలో మణిపూర్ జవాన్లు ‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ మణిపూర్ను భారతదేశ స్వాతంత్య్రానికి ముఖద్వారంగా అభివర్ణించారు. భారత జాతీయ సైన్యం(ఐఎన్ఏ) త్రివర్ణ పతాకాన్ని మొదట ఇక్కడే ఎగురవేసింది. ఈ రాష్ట్రం ఎంతోమంది వీరులను దేశానికి అందించింది. వారి త్యాగాల స్ఫూర్తితోనే మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. మహిళా సాధికారత మణిపూర్ సంప్రదాయం. పూర్తిగా మహిళలతోనే నడిచే మార్కెట్ ఇమా కీథెల్ ఉంది. మహిళామణుల గొప్పతనానికి అదొక ఉదాహరణ. ఆర్థిక వ్యవస్థలో తల్లులు, సోదరీమణులు ముందు వరుసలో ఉంటున్నారు. దేశ ప్రగతికి, స్వయం స్వావలంబనకు మహిళల బలమే చోదకశక్తి. ఈ స్ఫూర్తిని అందిస్తున్న రాష్ట్రం మణిపూర్. దేశ రక్షణకు మణిపూర్ సైనికులు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించారు’’ అని మోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం ప్రధాని మోదీ మణిపూర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాజధాని ఇంఫాల్లో రూ.1,200 కోట్ల విలువైన 17 ప్రాజెక్టులను ప్రారంభించారు. పోలీసు ప్రధాన కార్యాలయం, సివిల్ సెక్రటేరియట్కు ప్రారంభోత్సవం చేశారు. అలాగే మహిళా మార్కెట్లను, ఐదు ప్రభుత్వ కాలేజీలను, వంతెనలు, రహదారులను ప్రారంభించారు. చురాచాంద్పూర్లో రూ.7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకస్థాపన చేశారు. ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు ‘‘అభివృద్ధి జరగాలంటే శాంతియుత పరిస్థితులు నెలకొనడం తప్పనిసరి. గత 11 ఏళ్లలో ఈశాన్యంలో ఎన్నో వివాదాలు, ఘర్షణలను పరిష్కరించాం. ఇక్కడి ప్రజలు శాంతి, అభివృద్ధినే కోరుకుంటున్నారు. మీ కలలు నిజం చేసుకోవాలంటే, మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే శాంతి మార్గంలో నడవాలని జాతులకు సంబంధించిన అన్ని గ్రూప్లను కోరుతున్నా. మేము మీతోనే ఉన్నాం. మీకు సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వ చొరవతో లోయ, కొండ ప్రాంతాల మధ్య ఇటీవల చర్చలు జరగడం సంతోషంగా ఉంది. మణిపూర్ ప్రజలు ఈరోజు నాపై కురిపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ప్రధాని మోదీ అన్నారు.నిరాశ్రయులకు మోదీ అభయం మణిపూర్లో రెండు జాతుల మధ్య ఘర్షణల కారణంగా నిరాశ్రయులై, ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలను ప్రధాని మోదీ పరామర్శించారు. ఇంఫాల్తోపాటు చురాచాంద్పూర్లో వారిని కలుసుకున్నారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కలి్పంచారు. నిరాశ్రయులు మోదీకి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బోరున విలపించారు. కొందరు కన్నీళ్లు ఆపుకొనేందుకు ప్రయత్నించారు. హింసాకాండలో కుటుంబ సభ్యులను, ఆప్తులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నారులను మోదీ పలుకరించారు. ఆప్యాయంగా మాట్లాడారు. వారు ఆయనకు పుష్పగుచ్ఛం, పెయింటింగ్ను అందజేశారు. పక్షి ఈకలతో రూపొందించిన టోపీని ఓ చిన్నారి బహూకరించగా, మోదీ దాన్ని ధరించారు. రాష్ట్రంలో శాంతి, స్థిరత్వం నెలకొంటుందని, మీ జీవితాలు మెరుగుపడతాయని మోదీ చెప్పారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 60,000 మంది నిరాశ్రయులైనట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వీరిలో కుకీలు 40,000 మంది, మైతేయీలు 20,000 మంది ఉన్నారు. గ్రోత్ ఇంజన్ ‘ఈశాన్యం’ గతంలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల అన్యాయం మేము వచ్చాక ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం మిజోరంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ ఐజ్వాల్: ఈశాన్య భారతదేశం గతంలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఎంతగానో నష్టపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్డీయే ప్రభుత్వ పాలనలో నేడు అదే ఈశాన్య ప్రాంతం భారతదేశ గ్రోత్ ఇంజన్గా మారిందని ఉద్ఘాటించారు. ఆయన శనివారం ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో పర్యటించారు. రూ.9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. రాజధాని ఐజ్వాల్లోని లామ్వాల్ గ్రౌండ్లో సభలో పాల్గొనాల్సి ఉండగా, భారీ వర్షం కారణంగా అక్కడికి చేరుకోలేకపోయారు. దాంతో ఎయిర్పోర్టులోనే అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. పలు రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు. గతంలో కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయని విమర్శించారు. కేవలం ఎక్కువ ఓట్లు, సీట్లు ఉన్న ప్రాంతాలపైనే ఆ పారీ్టల దృష్టి ఉండేదని చెప్పారు. దీనివల్ల మిజోరం సహా ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని, అభివృద్ధిలో వెనుకబడిపోయాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కిందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో రూ.8,070 కోట్లతో నిర్మించిన బైరాబీ–సైరంగ్ రైల్వేలైన్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 51.38 కిలోమీటర్ల ఈ లైన్ మిజోరంను దేశంలో మిగతా ప్రాంతాలతో అనుసంధానిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ఇది చరిత్రాత్మక దినమని పేర్కొన్నారు. -
చదువుకొనాల్సిందే!
స్కూల్ ఫీజు అనగానే సగటు జీవి బెంబేలెత్తిపోతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలు అయితే పెద్దగా భారం అనిపించదు. సమస్యల్లా ప్రైవేటు స్కూళ్లతోనే. ఎందుకంటే అక్కడ చదువు‘కొనాల్సిందే’. ఇది జగమెరిగిన సత్యం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఏటా అవుతున్న సగటు ఖర్చుల్లో తేడా ఎన్నో రెట్లు ఉంటోంది. పట్టణాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దేశంలో కిండర్గార్టెన్ (కేజీ) విద్య.. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుకు ఏటా అయ్యే ఖర్చు ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఉంది. ప్రీ–ప్రైమరీ స్థాయిలో ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేటు స్కూళ్లలో ఒక్కో విద్యార్థికి ఏటా అయ్యే వ్యయం.. గ్రామీణ ప్రాంతాల్లో 21.8 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 16.1 రెట్లు అధికంగా ఉంది. 9, 10వ తరగతులు (సెకండరీ), 11, 12 తరగతుల (హయ్యర్ సెకండరీ) విషయంలో ఈ వ్యత్యాసం తక్కువగా ఉంది.కేంద్ర గణాంక శాఖ 2025 ఏప్రిల్–జూన్ మధ్య చేపట్టిన సర్వే ఆధారంగా రూపొందించిన ‘కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే: ఎడ్యుకేషన్ 2025’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వ్యయం అంటే.. స్కూల్లో అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, ఇతరత్రా కార్యక్రమాలకోసం చేసే ఖర్చు; రవాణా, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ.. ఇలా విద్యార్థి చదువు కోసం చేసిన మొత్తం ఖర్చు. -
డిజిటల్ 'డోపీ'లు
ఎంతగా అంటే.. తాము సోషల్ మీడియాలో పెట్టే పోస్టుకు లైకులు, కామెంట్లు రావటానికి ఒక్క సెకను ఆలస్యమైనా పిచ్చిగా ప్రవర్తించేంతగా. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగించే యువత సమయాన్ని వృథా చేసుకోవటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటోంది. అందులో తాజాగా ‘డిజిటల్ డోపమిన్’వచ్చి చేరింది. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ డోపమిన్? డోపమిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. దీనిని ‘సంతోష హార్మోన్’అని పిలుస్తారు. ఇది మన మెదడు బహుమతి వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. రుచికరమైన ఆహారం తినడం, ప్రశంసలు స్వీకరించడం, లక్ష్యాన్ని సాధించడం వంటి ఆహ్లాదకరమైన అనుభూతిని పొందినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఈ న్యూరోట్రాన్స్మీటర్ మెదడుకు కార్యాచరణ ఫలవంతమైందని సంకేతమిస్తుంది. మరింత ఉత్సాహంతో పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటి? మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేసినప్పుడు విడుదలై మనల్ని మరింత ప్రోత్సహించే ఈ డోపమిన్ హార్మోనే ఇప్పుడు సోషల్ మీడియాను నడిపిస్తోందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్టు లు, వీడియోలకు లైకులు, షేర్లు వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. అప్పుడు మన మెదడులో ఈ డోపమిన్ హార్మో న్ విడుదలవుతుంది. అయితే, అది ఇప్పుడు శ్రుతిమించింది. మనం పెట్టే ప్రతి పోస్టుకు లైకులు, షేర్ల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేలా ఈ హార్మోన్ ప్రేరేపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల యువత నిత్యం సోషల్మీడియా యాప్లను అంటిపెట్టుకొని ఉంటున్నారని అంటున్నారు. అలా మన మెదడు ఈ తక్షణ బహుమతులను కోరుకునేలా కండిషన్కు గురవుతుంది. ఇది స్వల్పకాలిక ఆనందం ఇచ్చినా.. తరువాత దీర్ఘకాలిక అసంతృప్తికి దారితీస్తుందని పేర్కొంటున్నారు. డిజిటల్ డోపమిన్ సంకేతాలు» సామాజిక మాధ్యమాల్లో నిరంతరం నోటిఫికేషన్లను తనిఖీ చేయడం » సోషల్ ప్లాట్ఫామ్లలో యాక్టివ్గా లేనప్పుడు ఆందోళన చెందడం» సమయం తెలియకుండా సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ ఉండిపోవటం» ఒకరి జీవితాన్ని ఇతరుల హైలైట్ రీల్స్తో పోల్చడం » ప్రతికూల కంటెంట్తో మానసిక స్థితిలో మార్పులు రావడం డోపమిన్ విరమణ (క్రాష్) తర్వాత భావోద్వేగ ప్రతిస్పందనలు.. » డోపమిన్ హార్మోన్ ప్రభావం తొలగిపోయి మెదడు సాధారణ స్థితికి రావటాన్ని డోపమిన్ క్రాష్ అంటారు. » ఈ స్థితిలో విసుగు, అశాంతి కలుగుతాయి. » చిరాకు, నిరాశ, ౖఅపరాధ భావన, సిగ్గు, నిస్పృహ ఆవరించడం, ఆందోళనకు గురవుతారు. »ఉదాహరణకు ఓటీటీలో ఒక వెబ్సిరీస్ను గంటల తరబడి చూసిన తర్వాత సమయం అంతా వృథా అయ్యిందని బాధపడటం. » డోపమిన్ వ్యసనానికి అతిపెద్ద కారణాలలో సోషల్ మీడియా ఒకటి. ఇన్స్ట్రాగామ్, టిక్టాక్, ఫేస్బుక్ వంటి వాటిని వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించారు. ప్రతి లైక్, కామెంట్, షేర్ చిన్నస్థాయిలో డోపమిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఏదో సాధించామనే భావనను కలిగిస్తాయి. ఈ వర్చువల్ బహుమతులను ఎంత ఎక్కువగా వెంబడిస్తే, నిజ జీవిత అనుభవాలతో మనం అంతగా అసంతృప్తి చెందాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. » ఇది మన జీవితంలోని ఇతర అంశాలైన అతిగా తినడం, ఇంపల్స్ షాపింగ్, మితిమీరిన గేమింగ్ వంటి వాటికి కూడా విస్తరించింది. » డిజిటల్ డోపమిన్ సమస్య ఇప్పటికే అమెరికన్లలో తీవ్రంగా ఉంది. భారత్లోని సోషల్, డిజిటల్ మీడి యా వినియోగదారులు సైతం దీనికి ఎక్కువగానే ప్రభావితమవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.‘డిజిటల్’ వాడకం తగ్గించుకోవటమే మార్గం డ్రగ్స్, ఆల్కహాల్ వంటివి తీసుకున్నపుడు వచ్చే ప్రభావం మాదిరిగా ‘డిజిటల్ డోపమిన్’ప్రభావితం చేస్తోంది. మెదడు రివార్డ్స్ సిస్టమ్లో భాగంగా క్విక్ గ్రాటిఫికేషన్ను కోరుకుంటోంది. మెదడులోని సహజ రివార్డ్ సర్క్యూట్ను సోషల్మీడియా అధిక వినియోగం హైజాక్ చేసి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. పుస్తకాలు చదివే అభిరుచి, రోజువారీ వ్యాయామం వంటివాటికి దూరం చేస్తోంది. స్వీయ నియంత్రణ తగ్గిపోవడం, ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోవటం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం నిత్యకృత్యమవుతున్నాయి. దీనిని అధిగమించాలంటే మొబైల్స్, ఇతర డిజిటల్ సాధనాల వినియోగ సమయాన్ని కచ్చితంగా తగ్గించుకోవాలి. – డా. నిషాంత్ వేమన, కన్సల్టింగ్ సైకియాట్రిస్ట్.సామాజిక మాధ్యమాలు నిత్యావసరాలు కాకపోయినా.. అవే సర్వస్వం, అవి లేకపోతే అంతా శూన్యం అన్నట్టుగా యువత ప్రవరిస్తుండడం ఆందోళనకరం. వ్యాయామ విద్య, క్రీడలు, కళలు వంటి వాటిని పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల అతి వినియోగాన్ని అదుపుచేసే చర్యలు తీసుకోకపోతే దేశం అనేక దుర్గుణాలకు, మానసిక అనారోగ్యాలకు కేంద్రంగా మారుతుంది. వ్యాయామం, శారీరక శ్రమ తగ్గిపోయి ఇప్పటికే డయాబెటిస్, ఒబేసిటీ వంటివి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డిజిటల్ డోపమిన్ మనిషి ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
గుర్తుంచుకోండి
సుప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ తరచూ ఫోన్ నంబర్లు మర్చిపోతూ ఉండేవారు. ఈ విషయంపై ఆయన ఒకసారి.. ‘టెలిఫోన్ డైరెక్టరీ చూస్తే తెలుస్తుందిగా’ అని కూల్గా అన్నారట! అలాంటి జ్ఞానులు సాధారణ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలని ఏమీలేదని దీని సారాంశం. అయితే, మామూలు వ్యక్తులు మతిమరుపును అలా తీసేయడానికి వీల్లేదు. దానికి కారణాలేంటో గమనించి.. ఏ వయసులో ఎలాంటి సమస్యలు రావచ్చు.. వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి.20లలో..25 ఏళ్లు వచ్చేసరికి మెదడు పూర్తిగా వికసిస్తుంది. నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవటం, గుర్తుతెచ్చుకోవడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది. వయసు పెరిగేకొద్దీ మెదడు సామర్థ్యం కొద్దిగా తగ్గుతుంది. ఈ తగ్గుదల దశాబ్దానికి స్వల్పంగా 5% వరకు ఉంటుందని మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధన వెల్లడించింది. 30లలో..మెదడు కణాల మధ్య సంకేతాలను ప్రసారం చేసే న్యూరో ట్రాన్స్మీటర్లు ముప్పైలలో తగ్గటం ప్రారంభిస్తాయి. జ్ఞాపకాల నిక్షిప్తానికి సాయపడే రసాయనమైన డోపమైన్.. వయసు పెరిగే కొద్దీ దశాబ్దానికి 10% మేర తగ్గుతుంది. చేతి రాతే జ్ఞాపక మంత్రం!ఎక్కువ కాలం గుర్తుండాలంటే టైప్ చేయడానికి బదులుగా చేతితో రాయండి. దీనివల్ల మెదడులో జ్ఞాపకశక్తికి, అవగాహనకు అనుసంధానమై ఉండే భాగాలు బాగా పనిచేస్తాయని ‘సైకలాజికల్ సైన్స్ జర్నల్’లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది.40లలో..మధ్య వయసు నుంచి జ్ఞాపకశక్తి క్షీణించడం ప్రారంభమవుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (2012)లో ప్రచురితమైన అధ్యయనంలో తేలింది. అధిక ఒత్తిడి సమయాల్లో అధికంగా విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ మెదడులో కొత్త జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే భాగాలను, ప్రక్రియను దెబ్బతీస్తుంది. ప్రాసెస్డ్ మీట్ వద్దు40 ఏళ్ల వయసులో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తులను అతిగా తీసుకుంటే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి తగ్గుతోందని ‘న్యూరాలజీ జర్నల్’లో ప్రచురితమైన ఓ పరిశోధన సూచిస్తోంది. శాకాహారం ఎక్కువగా, మాంసాహారం తక్కువగా తీసుకునే వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతల స్కోర్ ఎక్కువగా ఉందట. మాంసానికి బదులు నట్స్, బీన్స్ తీసుకుంటే ఈ ప్రమాదాన్ని 19% వరకు తగ్గించుకోవచ్చట.50లలో..మీరు ఎప్పుడైనా ఒక గదిలోకి వెళ్లి, మీరు దేనికోసం వెతుకుతున్నదీ మర్చిపోయారా? 50 ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమే. ఇందుకు కారణం మెదడులోని ‘రిఫ్రంటల్ కార్టెక్స్’ కుంచించుకుపోవడమే. సాధారణ జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సామర్థ్యం 45–55 ఏళ్ల మధ్య గరిష్ట స్థాయికి చేరుతుంది. మెనోపాజ్ కారణంగా ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు ప్రభావితమవుతాయి. ఈ దశకు ‘బ్రెయిన్ ఫాగ్’ అని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘క్రాకింగ్ ది మెనోపాజ్’ పుస్తక రచయిత్రి ఆలిస్ స్మెల్లీ పేరుపెట్టారు.సానుకూల భావనతాళాలను ఎప్పుడూ ఒకే చోట పెట్టడం, ఫోన్ లో రిమైండర్లు పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోండి. సానుకూల భావనతో ఉండే వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అధ్యయనాల సారాంశం. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు.. పౌష్టికాహారం తీసుకుంటూ, ఒత్తిడికి దూరంగా ఉంటే జ్ఞాపకశక్తి బాగుంటుంది.60లలో..ఈ వయసులో తరచుగా.. వ్యక్తుల పేర్లు, పదాలు గుర్తుకురాక సతమతమవుతుంటారు. అంతమాత్రాన వీరు బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే, కిక్కిరిసిన గ్రంథాలయంలో ఒక పుస్తకాన్ని దొరకపుచ్చుకోవటానికి సమయం పడుతుంది కదా.. అలాగే ఇదీనూ! శారీరక శ్రమక్రమం తప్పకుండా బ్రిస్క్ వాకింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయాలి. వారంలో మూడు రోజులు ఇలా చేసే వృద్ధుల మెదడులోని జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పోక్యాంపస్ సైజు ఏడాదికి 2% పెరిగినట్లు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (2011) అధ్యయనంలో వెల్లడైంది. 70లలో..కొన్ని పేర్ల జాబితా చదివిన కొద్ది నిమిషాల తర్వాత ఆ పేర్లు గుర్తుచేసుకునే సామర్థ్యం 20 ఏళ్ల వారితో పోల్చితే 70 ఏళ్ల వారిలో సగానికి తగ్గుతుంది. చిన్ననాటి సంఘటనలను జ్ఞాపకం చేసుకోగలిగే వీరు.. నిన్న రాత్రి ఏం తిన్నారో మర్చిపోవచ్చు. దీనికి కారణం మెదడులో భావోద్వేగాల కేంద్రమైన ‘అమిగ్డలా’. యుక్తవయసు నాటి అనుభవాలు ఉద్వేగంతో కూడి ఉంటాయి కాబట్టి అమిగ్డలా సాయంతో వాటిని గుర్తు తెచ్చుకోగలుగుతారు. కొత్త పనులు చేయండి‘ద జర్నల్స్ ఆఫ్ జెరంటాలజీ’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ ఒకే రకం కాకుండా, కొత్త పనులు ప్రయత్నించే, ఉత్సాహంగా ఉండే వృద్ధుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఇనుమడించాయి.80లలో..జ్ఞాపకశక్తి వేగంగా తగ్గుతుంది. మెదడుకు రక్తాన్ని అందించే ధమనుల సామర్థ్యం తగ్గిపోవటం వల్ల మెదడుకు రక్తప్రవాహం, ప్రాణవాయువు సరఫరా మందగించటమే ఇందుకు కారణం. వినికిడి సమస్య వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇతరులు చెప్పేది వినటానికి అధిక శక్తిని మెదడు వినియోగించాల్సి రావటంతో, ఆ విషయాలను గుర్తుపెట్టుకోలేరు. ఒంటరితనం, కుంగుబాటు కూడా జ్ఞాపకశక్తిని క్షీణింపజేస్తాయి.నలుగురితో కలవండిఇతరులతో ఎక్కువగా కలుస్తూ, కలివిడిగా ఉంటే యాక్టివ్గా ఉంటారు. బలమైన సాంఘిక సంబంధాలుండే వృద్ధుల జ్ఞాపకశక్తి అమోఘంగా ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం (2015). వినికిడి పరికరాలు వాడని వృద్ధులతో పోలిస్తే, వాడే వారిలో జ్ఞాపకశక్తి 50%కి పైగా మెరుగ్గా ఉందని ‘లాన్సెట్’ అధ్యయనం (2023). -
చంద్రుడిపైకి మీ పేరు!
చందమామ రావే.. జాబిల్లి రావే అని పాడుతుంటాం. జాబిల్లి ఎలాగూ మన దగ్గరకు రాదు. పోనీ చంద్రమండలం మీద అడుగుపెడదామన్నా అందరికీ సాధ్యం కాదు. భూమిని వదిలి వెళ్ళకుండానే చంద్రుని చుట్టూ ప్రయాణించాలనుకుంటున్నారా? అంతరిక్ష పరిశోధనలో తదుపరి పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా.. సామాన్యులనూ భాగస్వాములను చేసేందుకు మరోసారి ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్లోగా ప్రారంభం కానున్న ఆర్టెమిస్–2 మిషన్ లో భాగంగా ఓరియన్ అంతరిక్ష పరిశోధన నౌకలో వ్యోమగాములు రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేయనున్నారు. వారితోపాటు ఓ మెమరీ కార్డు సైతం జాబిల్లిని చుట్టి రానుంది. ఈ మెమరీ కార్డ్లో చేర్చడానికి తమ పేర్లను సమర్పించాల్సిందిగా ప్రజలను నాసా ఆహ్వానిస్తోంది. చంద్రుడికో నూలుపోగు మాదిరిగా చంద్రుడి మీదకో ‘పేరు’ అన్నమాట. చరిత్రలో భాగం కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. – సాక్షి, స్పెషల్ డెస్క్డిజిటల్ బోర్డింగ్ పాస్ఆసక్తిగలవారు ఉచితంగా తమ పేరును జోడించి తక్షణమే డిజిటల్ ‘బోర్డింగ్ పాస్’ పొందగలిగేలా నాసా ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసింది. సేకరించిన పేర్లన్నీ ఓరియన్ లోపల ఇన్ స్టాల్ చేసే ఎస్డీ కార్డ్లో నిక్షిప్తం చేస్తారు. మొదటిసారిగా సిబ్బందితో కూడిన ఆర్టెమిస్ మిషన్ లో వ్యోమగాములతోపాటు మీ పేరూ జాబిల్లిని చుట్టి వస్తుందన్నమాట. సో, సరదాగా గుర్తిండిపోయేలా మీ పేరుతో డిజిటల్ బోర్డింగ్ పాస్ చేజిక్కించుకునేందుకు మీరూ దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ 2026 జనవరి 21. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినప్పుడు సామాన్యులనూ భాగస్వాములను చేయడం నాసా ప్రత్యేకత.కీలకమైన అడుగు10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో నాసా కొత్త స్పేస్ లాంచ్ సిస్టమ్, ఓరియన్ అంతరిక్ష నౌక పనితీరును అధ్యయనం చేస్తారు. వ్యోమగాములు భూమి నుండి 2,30,000 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి.. తిరుగు ప్రయాణంలో చంద్రుని అవతలి వైపు చుట్టూ తిరుగుతారు. ఈ దశాబ్దం చివర్లో చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములను దింపడం, అలాగే మానవులను అంగారక గ్రహానికి పంపాలన్న నాసా ప్రయత్నంలో ఇది ఒక కీలకమైన అడుగు. -
ప్రజాస్వామ్య పునాదులపై దాడి
సాక్షి, న్యూఢిల్లీ: జర్నలిస్టులు, మీడియా సంస్థలపై పెరుగుతున్న దాడులను ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) తీవ్రంగా ఖండించింది. ‘సాక్షి’మీడియా సంస్థ, వారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, వేధింపులపై ఐఎన్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ఐఎన్ఎస్ అధ్యక్షుడు ఎం.వి. శ్రేయామ్స్ కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికా రంగంపై జరుగుతున్న ఈ దాడులను ప్రజాస్వామ్య పునాదులు, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఐఎన్ఎస్ అభివర్ణించింది. ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’జర్నలిస్టులపై పలుమార్లు దాడులు జరగడంతో పాటు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారిపై అక్రమ కేసులు బనాయించి, విచారణల పేరుతో వేధిస్తున్నారని ఐఎన్ఎస్ దృష్టికి వచ్చిందన్నారు. మీడియా కార్యాలయాలు, సాక్షి ఎడిటర్ నివాసంలో సోదాలు నిర్వహించడం వంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ధోరణి.. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను సొసైటీ తీవ్రంగా ఖండిస్తోందని ఐఎన్ఎస్ తెలిపింది. ఈ దాడులు స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ఒక ఆందోళనకరమైన ధోరణిలో భాగమని శ్రేయామ్స్ కుమార్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు ఎలాంటి భయం, బెదిరింపులు, హింసకు గురికాకుండా తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించగలగాలని సూచించింది. దేశంలో పత్రికా రంగం శత్రువు కాదని.. ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే మిత్రపక్షమని ఐఎన్ఎస్ పేర్కొంది. మీడియా ప్రతినిధులకు భద్రత కల్పించాలి.. ఇక ఈ దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధుల రక్షణకు తగిన చట్టపరమైన భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎన్ఎస్ డిమాండ్ చేసింది. బెదిరింపులు, హింసను ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలకు తాము అండగా నిలుస్తామని సొసైటీ పునరుద్ఘాటించింది. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఐఎన్ఎస్ సెక్రటరీ జనరల్ మేరీ పాల్ కూడా తెలిపారు. -
నేపాల్ సంక్షోభం...కోల్కతా రెడ్లైట్ ఏరియాను తాకిన వైనం!
నేపాల్లో సంభవించిన తాజా పరిణామాలు అక్కడి సంక్షోభ ప్రభావం ఎల్లలు దాటుతోంది. అనేక దేశాల్లో విస్తరించిన ఉన్న నేపాలీయుల గుండెల్లో గుబులు రేపుతోంది. అదే క్రమంలో మన దేశంలోని పలు సంప్రదాయ వ్యభిచార కేంద్రాల్లో, కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాగా పేరొందిన ప్రాంతంలోనూ ఈ పరిణామాల ప్రభావం పడింది. కోల్కతాలో, ముఖ్యంగా సోనాగాచిలో నేపాల్ పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి, గతంతో పోలిస్తే కొంత మేర తగ్గినప్పటికీ అక్కడ నేపాల్ మహిళలు పెద్ద సంఖ్యలోనే ఇప్పటికీ వ్యభిచార వృత్తిలో ఉన్నారు. కాలిఘాట్ నుంచి హౌరా హుగ్లీలోని పలు వ్యభిచార గృహాలలో నేపాలీలే ప్రధాన భాగాన్ని ఆక్రమించారు, ప్రస్తుతం నేపాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు వీరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ‘‘నేను మూడు రోజులుగా నా తల్లితో మాట్లాడలేదు. నేను కాల్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, నెట్వర్క్ పనిచేయడం లేదని ఫోన్ చెబుతుంది. ఆమె సురక్షితంగా ఉందో లేదో కూడా నాకు తెలియదు,’’ అని దశాబ్ద కాలంగా సోనాగాచిలో నివసిస్తున్న తూర్పు నేపాల్కు చెందిన ఒక సెక్స్ వర్కర్ తనను కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘‘ప్రతి నెలా నేను పోఖారా సమీపంలోని మా తాతామామలతో నివసించే నా ఇద్దరు కుమారులకు డబ్బు పంపుతాను. ఈ నెల, నేను ఏదైనా పంపగలనో లేదో నాకు తెలియదు. వారికి డబ్బు రాకపోతే, నా పిల్లలు ఏం తింటారు? ఎలా తింటారు?’’ అంటూ మరొక మహిళ విలపించింది.వీరందరి ఆందోళన ఏమిటంటే వారి కుటుంబాల మనుగడ. వారు అలా వేల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చి విటుల ముందు తమ శరీరాన్ని విస్తరాకులా పరుస్తున్న కారణమే అది. మన కోల్కతా నుంచి నేపాల్కు వీరి ద్వారా వెళ్లే మొత్తాలు పెద్దవేమీ కాకపోయినప్పటికీ, గ్రామీణ నేపాల్లోని పలు కుటుంబాలకు అవే జీవనాధారం. ఈ ఆకస్మిక సంక్షోభం వీరిపై ఆర్థిక ఒత్తిడిని సృష్టించడమే కాకుండా వారి నిస్సహాయ భావనను మరింత తీవ్రతరం చేసింది. ‘‘మేం ఇంటికి వెళ్లాలనుకుంటున్నా, మార్గం కనపడడం లేదు,’’ అని సోనాగాచిలోని మరో నేపాలీ మహిళ అన్నారు. ‘‘సరిహద్దు మూసివేశారు అనేక విమానాలు రద్దు అయ్యాయి. మేం ఇక్కడ మా కుటుంబాలు అక్కడే చిక్కుకున్నాయి. మేం నిస్సహాయంగా ఉన్నాం.’’ అంటూ ఆమె భోరుమంది. ‘‘ఈ మహిళలు బాధలో ఉండటం సహజం. వారు తమ కుటుంబాలను సంప్రదించలేరు, అలాగే చెల్లింపులు వారికి చేరుతాయో లేదో కూడా వారు ఖచ్చితంగా చెప్పలేరు. అధికారులతో సమావేశం నిర్వహించి, వారు తమ కుటుంబాలతో మాట్లాడి ఇంటికి తిరిగి డబ్బు పంపగలిగే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము‘ అని స్థానిక మహిళల సమస్యలపై పనిచేసే ముఖోపాధ్యాయ అన్నారు. సోనాగాచిలోని రెడ్–లైట్ జిల్లాలో దాదాపు 200 మంది నేపాలీ సెక్స్ వర్కర్లు ఉంటారని అంచనా. దశాబ్దాలుగా, నేపాలీ మహిళలు కోల్కతాలోని రెడ్–లైట్ బెల్ట్లలో నివసిస్తూన్నారు. తరచుగా అక్రమ రవాణా కారణంగా సరిహద్దులు దాటి దారుణమైన పరిస్థితులలో తప్పనిసరై ఈ మురికికూపంలో మగ్గిపోతున్నారు. -
లైట్ తీసుకోవద్దు!.. నేపాల్ సంక్షోభంపై యూపీ సీఎం రియాక్షన్
లక్నో: నేపాల్ సంక్షోభాన్ని ఉటంకిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న విషయాలేనని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నేపాల్లో ఏం జరిగిందో చూడండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన లక్నోలోని రామ్ మనోహర్ లోహియా మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేపాల్లోని ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ.. చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం.. అది పెద్ద సమస్యలకు దారి తీస్తుందన్నారు.‘‘చిన్నవిగా కనిపించే విషయాలు, అవి పెద్ద సమస్యను తెస్తాయి. సమాజంలో అభివృద్ధి, పురోగతిని ఎలా అడ్డుకుంటాయో, అశాంతిని ఎలా రగిలిస్తాయో నేపాలే నిదర్శనం. జెన్-జడ్(Gen-Z) నిరసనకారుల ఆందోళనతో నేపాల్ హింసాత్మక ఘటనలు చవిచూసింది. కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పలువురు రాజకీయ నేతలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపాలి.. మారుతున్న పరిస్థితులకు సిద్ధపడాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.నేపాల్ ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ కట్టుబడి ఉందన్నారు. వైద్య విద్యార్థులు, డాక్టర్లను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి సాంకేతిక సంస్థలతో కలిసి పని చేయాలని సూచించారు. -
ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపుల కలకలం
ఢిల్లీ: నగరంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా, తాజ్ ప్యాలెస్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ హైకోర్టులో బాంబు ఉందంటూ నిన్న(శుక్రవారం) బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలు బెంచ్ల న్యాయమూర్తులు.. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఆ ఘటనను మరువక ముందే మధ్యాహ్నం బాంబే హైకోర్టుకు కూడా మెయిల్ వచ్చింది. ఆర్డీఎక్స్ అమర్చామని.. బాంబులతో కోర్టును పేల్చేస్తామని హెచ్చరించారు. వరుస ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.అయితే, ఈ ఘటనల్లో కూడా అవి ఆకతాయిలు చేసిన బెదిరింపు మెయిల్లు అని పోలీసుల విచారణలో తేలింది. భద్రతా సిబ్బంది బాంబ్ స్క్వాడ్స్తో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబులు లభ్యం కాలేదు. ఇవాళ ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు దొరకలేదు. ఇది కూడా ఆకతాయిలు చేసిన మెయిలేనని ఢిల్లీ పోలీసులు తేల్చారు.#WATCH | Taj Palace Hotel in Delhi received a bomb threat mail. Nothing was found; it has been declared a hoax: Delhi Police pic.twitter.com/OPDEZVnDlH— ANI (@ANI) September 13, 2025 -
మణిపూర్ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సెటైర్లు
తెగల మధ్య ఘర్షణలు.. తదనంతరం చెలరేగిన హింసతో చీకట్లో ఉండిపోయిన మణిపూర్ని ఇప్పుడు శాంతి-అభివృద్ధి అనే కొత్త ఉదయం తడుతోందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో శనివారం ఆయన పర్యటించారు. వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థానం చేసిన అనంతరం.. చురాచంద్పూర్ పీస్ గ్రౌండ్ వేదికగా మోదీ ప్రసంగించారు. మణిపూర్ ఆశల భూమి. గతంలో హింస అనే చీకటి ఈ అందమైన ప్రాంతాన్ని కమ్మేసింది. కానీ ఇప్పుడు నమ్మకం, శాంతి, అభివృద్ధి అనే కొత్త వేకువ రాబోతోంది. హింసతో ఎవరికీ లాభం ఉండదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం శాంతిని ఎంచుకోండి. శాంతి ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించండి.. ..ఇవాళ ఇంఫాల్లో కొత్త విమానాశ్రయం, జిరిబాం-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు, మహిళా హాస్టళ్లు, ఐటీ పార్కులు వంటి వేల కోట్ల రూపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. మణిపూర్లో 60,000 పక్కా ఇళ్లు నిర్మించాం. 3.5 లక్షల ఇళ్లకు త్రాగునీటి సరఫరా అందిస్తున్నాం. మణిపూర్ అంతటా పక్కా ఇళ్లు నిర్మించాలన్నది మా అభిమతం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ మణిపూర్ ప్రజలతోనే ఉంటుంది. గతంలో ఢిల్లీ నుంచి నిర్ణయాలు మణిపూర్కు రావడానికి నెలలు, సంవత్సరాలు పట్టేవి. ఓటు బ్యాంకు రాజకీయాలు ఈశాన్య భారతాన్ని ఇబ్బంది పెట్టాయి. కానీ గత 11 ఏళ్లుగా.. ఇక్కడి ఎన్నో సంక్షోభాలు పరిష్కారానికి నొచుకున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంతో నిర్ణయాలు అమలు కావడానికి ఎంతో సమయం పట్టదు. మీరు కలలు కనండి. మేము వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తాం. భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోంది. అభివృద్ధిలో మణిపూర్ దేశంతో పాటు ముందుకు సాగుతుంది’’ అని అన్నారాయన. మోదీ ఇవాళ రూ.8,500 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు మణిపూర్లో శంకుస్థాపన చేశారు. ఇంఫాల్కు కొత్త ఎయిర్పోర్ట్, కొత్త హైవేలు, రైలు-రోడ్డు మార్గం అనుసంధానం, జిరిబమ్ ఇంఫాల్ మధ్య రైల్వే ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి.ఈ కార్యక్రమం కంటే ముందు.. చురాచంద్పూర్లో హింసాత్మక ఘటనల కారణంగా నిరాశ్రయులైన వారిని కలిసి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ సమయంలో వాళ్లకు ఆయన ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు, హక్కుల విషయంలో మైతేయి, కుకీ తెగల మధ్య 2023 మే నెలలో ఘర్షణలు మొదలై.. ఆ అల్లర్లలో హింస ప్రజ్వరిల్లింది. ఆ ఘర్షణల్లో 250 మంది దాకా మరణించారు. వేలాది మంది(60 వేల మందికిపైనే) నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షల కారణంగా.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంతో.. వేల మంది ఇంకా తమ ఇళ్లకు చేరకుండా క్యాంపుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే బీరెన్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.ఇదిలా ఉంటే.. గతంలో.. మోదీ 2014లో ప్రధాని అయిన తర్వాత 2018లో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ను తొలిసారి సందర్శించారు. ఆ సమయంలో ఇంఫాల్ నగరంలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, 2022లో కూడా ఆయన మణిపూర్కు వర్చువల్ రూపంలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం కోసం ప్రసంగించారు. హింసాత్మక ఘర్షణల తర్వాత మోదీ ఇక్కడ పర్యటించడం ఇవాళే తొలిసారి(29 నెలల తర్వాత). 2023 జూలై 20న, హింసపై తొలిసారి పార్లమెంటులో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కు పెట్టాయి. మోదీ పర్యటన.. మణిపూర్ ప్రజలను అవమానించడమే అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన పెద్ద విషయమేమీ కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ చాలా కాలంగా సమస్యల్లో ఉంది. ఇప్పుడు ప్రధాని అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది పెద్ద విషయం కాదు. ప్రస్తుతం దేశంలో అసలు సమస్య 'ఓటు దొంగతనం' (Vote Chori) అని పేర్కొన్నారాయన. ఇక.. మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదంటూ మోదీ మణిపుర్ పర్యటనపై ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. ‘‘రెండేళ్ల తర్వాత బాధితులను పరామర్శించడానికి వెళ్లడం బాధాకరం. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడకు వెళ్లే వాళ్లు. స్వాతంత్ర్యం నుంచి అందరూ ప్రధానులు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రధాని మోదీ మాత్రం రెండేళ్లు ఆలస్యంగా దాన్ని పాటిస్తున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. -
Madhya Pradesh: సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం
మంద్సౌర్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ లాల్ యాదవ్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కబోతున్న హాట్ ఎయిర్ బెలూన్ కు మంటలు అంటుకున్నాయి భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆపివేశారు. ఇక్కడి గాంధీసాగర్ ఫారెస్ట్ రిట్రీట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నాయి. బలమైన గాలుల కారణంగా బెలూన్ ఎగరలేకపోయింది. అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను అదుపు చేశారు. భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రి ట్రాలీని పట్టువడంతో ముఖ్యమంత్రి ప్రమాదం నుంచి బయటపడ్డారు.ముఖ్యమంత్రి బసచేసిన హింగ్లాజ్ రిసార్ట్ సమీపంలో శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం సీఎం గాంధీ సాగర్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంబల్ ఆనకట్ట బ్యాక్ వాటర్ ప్రాంతంలో క్రూయిజ్ రైడ్ చేశారు. గాంధీ సాగర్ ఫారెస్ట్ రిట్రీట్ అనేది మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు ప్రధాన ప్రాజెక్ట్. ఇది హాట్ ఎయిర్ బెలూనింగ్, పారామోటరింగ్, వాటర్ స్పోర్ట్స్కు ప్రసిద్ధి చెందింది. -
రూ. 15 వేలు లంచం తీసుకుంటూ సివిల్ సర్వీస్ టాపర్ అరెస్టు
సంబల్పూర్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలోని బమ్రా తహశీల్దార్గా పనిచేస్తున్న రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్ష టాపర్ అశ్విని కుమార్ పాండా అవినీతికి పాల్పడుతూ ఒడిశా విజిలెన్స్ అధికారులకు దొరికిపోయారు. వ్యవసాయ భూమిని ఇంటి భూమిగా మార్చేందుకు ఒక వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగావిజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.నెల రోజుల క్రితం ఫిర్యాదుదారు తహశీల్దార్ కార్యాలయంలో భూమి మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ‘పాండా రూ. 20,000 లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుదారునికి అనుకూలంగా హక్కు రికార్డు (ఆఓఆర్)జారీ చేశాడు. అయితే అంత మొత్తాన్ని చెల్లించలేనని ఆ వ్యక్తి తహశీల్దార్ పాండాకు తెలిపారు. దీంతో పాండా లంచం మొత్తాన్ని రూ. 15,000 కు తగ్గిస్తూ, ఇది కూడా చెల్లించకుంటే మ్యుటేషన్ కేసులో ఈ మార్పిడిని అనుమతించబోనని పాండా బెదిరించాడని విజిలెన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.దీనిపై ఫిర్యాదుదారు విజిలెన్స్ అధికారులను తెలియజేశాడు.దీంతో ఒక పథకం ప్రకారం అధికారులు శుక్రవారం వల వేసి, అశ్విని కుమార్ పాండాను పట్టుకున్నారు. అనంతరం పాండాకు చెందిన భువనేశ్వర్లోని ఇంటిలో తనిఖీలు చేపట్టి, రూ.4,73,000 విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయన డ్రైవర్ పి ప్రవీణ్ కుమార్ను కూడా అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్లో బి.టెక్ చేసిన పాండా 2019లో ఒడిశా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. 2021, డిసెంబర్లో జూనియర్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఓఏఎస్)లో చేరి, ట్రైనింగ్ రిజర్వ్ ఆఫీసర్ (టీఆర్ఓ)గా ప్రభుత్వ సేవలో ప్రవేశించారు. -
షోరూంలో కారు బొక్కాబోర్లా.. స్పందించిన యువతి
నిమ్మకాయ తొక్కించబోయి.. ఓ మహిళా కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నర్మన్ విహార్లోని మహీంద్రా షోరూమ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ.27 లక్షల విలువైన థార్ వాహనమూ(Thar Rox SUV) నాశనమైంది. అది మీడియా.. అంతకు మించి సోషల్ మీడియా దృష్టిని ఈ ఘటన ఆకర్షించింది. దీంతో ఆ కారును పడేసిన మాని పవార్ స్పందించింది. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్(29) తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి షోరూమ్ ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత వీడియో వైరల్ అయ్యింది, అందులో కారు తలకిందుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యం కనిపించింది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మాని పవార్ సహా భర్త, షోరూమ్ సిబ్బంది గాయపడ్డారని కొందరు, ఆమె ముఖం, ముక్కు పగిలిపోయానని మరికొందరు.. లేదు ఆమె చనిపోయిందంటూ ఇంకొందరు కథనాలు, పోస్టులు ఇచ్చారు. దీంతో మాని పవార్ స్పందించారు. నేను బతికే ఉన్నాను. దయచేసి ఫేక్ వీడియోలు పంచుకోవడం ఆపండి అంటూ వీడియో సందేశం ఉంచారామె. ఘటన సమయంలో కారులో నాతో పాటు షోరూమ్ సేల్స్మన్ వికాస్, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కారు అధిక ఇంజిన్తో పని చేస్తోందని అప్పటికే సేల్స్మన్ మాకు చెప్పారు. నిమ్మకాయల్ని తొక్కించే పూజ సమయంలో పొరపాటుగా ఎక్స్లేటర్ తొక్కడం వల్లే జరిగింది. షోరూమ్ గ్లాస్ బద్దలు కొట్టుకుని మరీ కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఎయిర్బాగ్స్ తెరుచుకోవడం వల్ల మాకేం కాలేదు. సిబ్బంది సాయంతో పగిలిన ముందు భాగం నుంచి అంతా బయటకు వచ్చాం. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఇంటికి వచ్చేశాం. మేం క్షేమంగానే ఉన్నాం. పుకార్లను, వెటకారాలను దయచేసి ఆపండి. ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఇదే’’ అని అన్నారామె. View this post on Instagram A post shared by 🌸 (@___maanniiiiii) -
మణిపుర్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ఇంఫాల్: ఈశాన్య ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ శనివారం మణిపుర్కు వచ్చారు. ఇంఫాల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పునీత్ కుమార్ గోయెల్ స్వాగతం పలికారు. 2023లో ఈ ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణల తర్వాత మోదీ ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. STORY | PM Modi reaches Manipur on his first visit after ethnic violence broke out in 2023Prime Minister Narendra Modi reached Imphal on Saturday on his first visit to Manipur after ethnic violence broke out in May 2023. Modi was received at the Imphal airport by Governor Ajay… pic.twitter.com/W4VvnAOfiD— Press Trust of India (@PTI_News) September 13, 20252023 మే నెలలో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత తొలిసారి మోదీ తొలిసారిగా మణిపుర్కు వచ్చారు. ఈ పర్యటనలో ఆయన చురాచంద్పూర్, ఇంఫాల్లను సందర్శించనున్నారు. అలాగే రూ. 8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ సందర్శన రాష్ట్రంలో శాంతి, అభివృద్ధిని పునరుద్ధరించడానికి దోహదపడుతుందని మణిపూర్ ముఖ్య కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ అన్నారు. #WATCH | Manipur: PM Modi being welcomed in Churachandpur as he arrives in the city. PM also interacts with the locals of the city. PM will lay the foundation stone of multiple development projects worth over Rs 7,300 crore at Churachandpur today. The projects include Manipur… pic.twitter.com/wvDxi3P28i— ANI (@ANI) September 13, 2025 మణిపూర్లోని చురాచంద్పూర్కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. ఆయనను స్వాగతించడానికి దారి పొడవునా స్థానికులు నిలుచున్నారు. మోదీ వారికి అభివాదాలు తెలిపారు. ప్రధాని మోదీ రూ. 7,300 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది వేయనున్నారు. వాటిలో ముఖ్యమైనవిమణిపూర్ అర్బన్ రోడ్స్, డ్రైనేజీ, ఆస్తి నిర్వహణ మెరుగుదల ప్రాజెక్ట్. ఇది పట్టణ రవాణా, ప్రజా సేవలను అప్గ్రేడ్ చేయడానికి రూ.3,600 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. చురచంద్పూర్లో రూ.7,300 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. #WATCH | Churachandpur, Manipur: Prime Minister Narendra Modi lays the foundation stone of multiple development projects worth over Rs 7,300 crore at Churachandpur. The projects include Manipur Urban Roads, drainage and asset management improvement project worth over Rs 3,600… pic.twitter.com/SqNNAAvr0I— ANI (@ANI) September 13, 2025 -
ఐజ్వాల్కు చారిత్రక దినం: ప్రధాని మోదీ
ఢిల్లీ: మిజోరాం లోని ఐజ్వాల్ లో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐజ్వాల్ కు నేడు చారిత్రక దినం అని, రైల్వే మ్యాప్లో మిజోరాంలోని ఐజ్వాల్ కు స్థానం దొరికిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు భారత గ్రోత్ ఇంజన్లు అని మోదీ అభివర్ణించారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక కారిడార్ లో మిజోరం కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశానిదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ శనివారం ఉదయం ఐజ్వాల్ చేరుకున్నారు. అయితే భారీ వర్షం కారణంగా లెంగ్పుయ్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా ఐజ్వాల్లోని లమ్మువల్ గ్రౌండ్కు చేరుకోలేకపోయారు. తొలుత ప్రధాని మోదీ సైరంగ్-ఆనంద్ విహార్ (ఢిల్లీ) రాజధాని ఎక్స్ప్రెస్ (వారానికి ఒకసారి), కోల్కతా-సైరాంగ్-కోల్కతా ఎక్స్ప్రెస్ (వారానికి ఒకసారి), గౌహతి-సైరాంగ్-గువహతి ఎక్స్ప్రెస్ (రోజువారీ) మూడు రైళ్లకు ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమం అయినా, జాతి నిర్మాణం అయినా, మిజోరాం ప్రజలు ఎల్లప్పుడూ సహకరించడంలో ముందున్నారన్నారు. త్యాగం సేవ, ధైర్యం, కరుణ ఈ విలువలు మిజో సమాజానికి కేంద్రంగా నిలిచివున్నయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రోజు, మిజోరం భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది దేశానికి.. ముఖ్యంగా మిజోరం ప్రజలకు ఒక చారిత్రాత్మక రోజు. నేటి నుండి, ఐజ్వాల్ భారతదేశ రైల్వే పటంలో ఉంటుంది. కొన్నేళ్ల క్రితం, ఐజ్వాల్ రైల్వే లైన్కు పునాది వేసే అవకాశం తనకు లభించిందని ఈ రోజు దానిని దేశ ప్రజలకు గర్వంగా అంకితం చేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మా ఇంజనీర్ల నైపుణ్యాలు, మా కార్మికుల స్ఫూర్తి దీనిని సాధ్యం చేశాయని ప్రధాని వారిని కొనియాడారు. ఈ కొత్త రైలు నెట్వర్క్ ప్రారంభమైన తర్వాత, మిజోరాంలోని రైతులు, వ్యాపారులు దేశవ్యాప్తంగా మరిన్ని మార్కెట్లను చేరుకోగలవని, విద్య ఆరోగ్య సంరక్షణ కోసం మరిన్ని ఎంపికలను పొందగలరన్నారు. ఈ నూతన రైల్వే లైను పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాలలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. A landmark day for Mizoram as it joins India's railway map! Key infrastructure projects are also being initiated. Speaking at a programme in Aizawl. https://t.co/MxM6c2WZHZ— Narendra Modi (@narendramodi) September 13, 2025 -
Haridwar: స్కూలుకు రాలేదని.. నేలపై పడేసి, బూటుతో తొక్కేసి..
హరిద్వార్: ఉత్తరాఖండ్లో ఘోరం చోటుచేసుకుంది. స్కూలుకు రెండ్రోజులు రాలేదని ఏడేళ్ల చిన్నారిపై ఇద్దరు ఉపాధ్యాయులు అమానుషంగా ప్రవర్తించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలోని ఒక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత బాలుని తండ్రి తొలుత ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో అతను ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బాలుని తండ్రి ఫిర్యాదు ప్రకారం ఏడేళ్ల బాలుడిని ఇద్దరు ఉపాధ్యాయులు అమానుషంగా కొట్టారు. రెండు రోజులు స్కూలుకు రాలేదని వారు ఆ బాలుడిని నేలపై పడవేసి, అతని ముఖాన్ని బూటుతో అదిమిట్టారు. అదే సమయంలో మరో ఉపాధ్యాయుడు బాలుడిని కర్రతో కొట్టాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. జాబ్రేడా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అజయ్ షా మాట్లాడుతూ ఆ పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్న విద్యార్థి రెండు రోజులు గైర్హాజరు అయ్యాడు. ఆ తర్వాత క్లాసుకు వెళ్లినప్పుడు, అతనిని కొట్టారు. నిందితులు ఇద్దరికీ నోటీసులు జారీ చేశామని, తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.కాగా టీచర్లు కొట్టిన కారణంగా పిల్లవాడి చేయి ఎముక విరిగింది. అతని వీపు, తుంటిలో కూడా గాయాలు అయ్యాయి. బాలుడు ఇప్పటికీ షాక్లో ఉన్నాడు. సెప్టెంబర్ 11న ఇంటికి తిరిగి వచ్చిన బాలుడు స్కూలులో జరిగిన ఘటన గురించి ఇంట్లో చెప్పాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదుదారు ఆ చిన్నారి మెడికల్ రిపోర్టు, అతని వీపుపై పడిన ఎర్రటి మచ్చలు ఫొటోలను పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ (పిల్లల సంరక్షణ) సెక్షన్ 75 కింద కేసు నమోదు చేశారు. -
ఎన్నికల సంస్కరణల మార్గదర్శకుడు జగదీప్ చోకర్ కన్నుమూత
న్యూఢిల్లీ: దేశంలో నిర్వహించే ఎన్నికల్లో పారదర్శకత కోసం పోరాడిన ప్రొఫెసర్ జగదీప్ చోకర్(72) కన్నుమూశారు. ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) అహ్మదాబాద్లో ప్రొఫెసర్గా పనిచేశారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వ్యవస్థాపక సభ్యుడు. ఎన్నికల రాజకీయాలను పారదర్శకంగా, జవాబుదారీగా మార్చడంలో ఏడీఆర్ చారిత్రాత్మక పాత్ర పోషించింది. ప్రొఫెసర్ చోకర్ చొరవతో సుప్రీంకోర్టు.. ఎన్నికల్లో అభ్యర్థులు నేర నేపథ్యం, ఆస్తులు, విద్యార్హతలను వెల్లడించడం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం భారత ప్రజాస్వామ్యంలో ఒక మైలురాయిలా నిలిచింది.pic.twitter.com/rik0mNxiDl— ADR India & MyNeta (@adrspeaks) September 12, 2025ప్రొఫెసర్ జగదీప్ చోకర్ 1967లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. 1977లో డీయూ నుండి ఎంబీఏ పట్టా పొందారు. 1993లో లూసియానా స్టేట్ యూనివర్సిటీ నుండి పీహెచ్డీ, 2001లో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ నుండి ఆర్నిథాలజీలో సర్టిఫికేట్ అందుకున్నారు. 2005లో గుజరాత్ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బీ చేశారు. ఆయన 1985 నుండి 2006 వరకు ఐఐఎం అహ్మదాబాద్లో ప్రొఫెసర్గా పనిచేశారు. 1999లో జగదీప్ చోకర్ తన సహచరులతో కలిసి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)కు పునాది వేశాడు. రాజకీయాల్లో పారదర్శకతను తీసుకురావడం మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా దీనిని నెలకొల్పారు. ఏడీఆర్ ప్రయత్నాల మేరకు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆర్థిక సమాచారం, విద్యా వివరాలను తప్పనిసరిగా అందించాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో తీర్పు ఇచ్చింది. -
వర్క్ ఫ్రం సినిమా హాల్
సాక్షి బెంగళూరు: బెంగళూరులోని సినిమా హాల్లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం యువతీయువకులు వృత్తి జీవితంలో విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. తింటున్నా, ప్రయాణంలో ఉన్నా, చివరికి సినిమా థియేటర్లలో సినిమా ఎంజాయ్ చేస్తున్నా ఆఫీసు పని చేయక తప్పడం లేదు. బెంగళూరులోని స్థానిక థియేటర్లో ‘లోకా’ అనే కొత్త సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ థియేటర్లో ఓవైపు సినిమా చూస్తూ ఇంకోవైపు ల్యాప్టాప్లో ఆఫీసు పని చేస్తూ ఒక యువతి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. -
Gwalior: పట్టపగలు ‘లివ్ ఇన్’పై.. పోలీసుల నిర్లక్ష్యంతోనే..
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డుపై జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఐకానిక్ రూప్ సింగ్ స్టేడియం ముందు జరిగింది. స్థానికంగా కాంట్రాక్టర్గా పనిచేస్తున్న అరవింద్ ఒకప్పటి తన లివ్ ఇన్ భాగస్వామి నందినిని కాల్చిచంపాడు.రక్తమోడుతున్న భాగస్వామి పక్కన తుపాకీ తిప్పుతూ..శుక్రవారం మధ్యాహ్నం అరవింద్ రూప్ సింగ్ స్టేడియం మీదుగా వెళుతున్న తన లివ్ ఇన్ పార్ట్నర్ నందినిని ఆపి, ఆమె ముఖంపై పాయింట్-బ్లాంక్ రేంజ్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. తరువాత రక్తంతో తడిసి, బాధతో విలవిలలాడుతున్న నందిని పక్కనే కూర్చుని తన తుపాకీని ఊపుతూ అటువైపుగా వెళుతున్నవారందరినీ భయపెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా పారిపోయారు. ఆ దారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అరవింద్ తన దగ్గరున్న తుపాకీని పోలీసుల వైపు గురిపెట్టాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి, ఆ ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకున్నారు.పోలీసులనూ బెదిరించి..నిందితుడు అరవింద్ను అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడి, రక్తస్రావంతో విలవిలలాడుతున్న నందినిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు.‘నేను కోర్టు నుండి వస్తుండగా తుపాకీ శబ్దాలు విన్నాను. అతను వరుసగా మూడు బుల్లెట్లను ఆమెపైకి కాల్చడం చూశాను. జనం భయంతో స్తంభించిపోయారు. ఎవరూ అతన్ని పట్టుకునేందుకు సాహసించలేదు’ అని ప్రత్యక్ష సాక్షి, న్యాయవాది ఎంపీ సింగ్ తెలిపారు. పోలీసు అధికారి నాగేంద్ర సింగ్ సికార్వర్ మాట్లాడుతూ నిందితుడు అరవింద్ తన దగ్గరున్న ఆయుధంతో పోలీసులను బెదిరించడానికి ప్రయత్నించాడని తెలిపారు. అతని దగ్గరున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు.మొదటి వివాహం, పిల్లలను దాచిపెట్టి..నిందితుడు కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడని, నందినితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడని ఎస్పీ ధరమ్వీర్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇద్దరికీ గతంలో వివాహాలు జరిగి విడాకులు తీసుకున్నారని, గతంలో లివ్ ఇన్లో ఉన్నారని, అరవింద్ తన మొదటి వివాహాన్ని, పిల్లలున్నారనన్న సంగతిని దాచిపెట్టి, నందినిని ఆర్య సమాజ్లో మోసపూరితంగా వివాహం చేసుకున్నాడనే ఆరోపణలున్నాయన్నారు. అయితే ఆ సంబంధం ఎన్నో రోజులు నిలవలేదు. అరవింద్పై నందిని పలుమార్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.హత్యాయత్నం నుంచి తప్పించుకున్నా..2024, నవంబర్లో అరవింద్ అతని స్నేహితురాలు పూజ పరిహార్తో కలసి తనపై దాడి చేశాడని నందిని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అరవింద్ ఆమెను కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె ఆ హత్యాయత్నం నుండి బయటపడింది. ఆమె ఫిర్యాదు దరిమిలా అరవింద్ను అరెస్టు చేసినప్పటికీ, ఆ తరువాత బెయిల్ పొంది, నందినిని వేధిస్తూ వస్తున్నాడు. సెప్టెంబర్ 9న ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నందిని అరవింద్పై పలు ఆరోపణలు చేసింది. అరవింద్ తనపై ఏఐ జనరేటెడ్ అశ్లీల వీడియోలు రూపొందిస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నడని ఆరోపించింది. తనను చంపేస్తానని బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది.మహిళల రక్షణపై సందేహాలుశుక్రవారం నాడు నందిని మరోమారు ఎస్పీ కార్యాలయానికి వెళుతుండగా, అరవింద్ ఆమెను అడ్డుకున్నాడు. తుపాకీతో ఆమె ముఖంపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపాడు. ఎప్పుడూ జనం రద్దీతో కళకళలాడే రోడ్డు రక్తసిక్తంగా మారిపోయింది. పదేపదే పోలీసు రక్షణ కోరిన మహిళపై పట్టపగలు.. అదీ వీఐపీ జోన్లో చోటుచేసుకున్న దారుణం అందరినీ కలచివేస్తోంది. మహిళల రక్షణపై పలు అనుమానాలు లేవదాస్తోంది.ఘ ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
కర్ణాటకలో విషాదం.. గణేష్ నిమజ్జనం వేళ ఎనిమిది మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గణేష్ నిమజ్జన ఊరేగింపుపైకి ఓ లారీ దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న మొసలె హోసహళ్లి రైల్వే గేటు సమీపంలో జరిగింది. మొసలె హోసహళ్లి, హిరెహళ్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినాయక నిమజ్జనం కోసం శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంతో, నిర్లక్ష్యంగా వచ్చిన కార్గో లారీ.. అక్కడున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో మొదట ఓ బైక్ను ఢీకొట్టి, ఆ తర్వాత డివైడర్ను ఢీకొని, చివరకు ఊరేగింపులో ఉన్న భక్తులను చిదిమేసింది. ఈ ఘటనతో వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని హసన్, హోళెనరసిపుర పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, లారీ డ్రైవర్ భువనేశ్ను బయటకు లాగి చితకబాదారు. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. Visuals ⚠️ Horrific tragedy in Hassan, Karnataka: A speeding tanker truck rammed into a Ganesh festival procession on NH-373 near Mosalehosalli village.4 dead on the spot, 20+ seriously injured. Rescue ops underway. Intentions unknown!! pic.twitter.com/jipF27Frfi— महावीर जैन, ಮಹಾವೀರ ಜೈನ, Mahaveer Jain (@Mahaveer_VJ) September 13, 2025 -
పంజాబ్ ‘ఆప్’ ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలుశిక్ష
అమృత్సర్: పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ లాల్పురాకు తార్న్తరణ్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2013లో ఓ దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనపై 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. రెండు రోజుల క్రితం న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. మంజీందర్ సింగ్ పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి 2022లో ఎమ్మెల్యేగా గెలిచారు. లైంగిక వేధింపుల కేసులో మంజీందర్ సింగ్తోపాటు మరో ఆరుగురు సైతం దోషులుగా తేలారు. వారికి సైతం నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ప్రేమ్కుమార్ తీర్పు వెలువరించారు. 2013లో నేరం జరిగిన సమయంలో మంజీందర్ సింగ్ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తుండడం గమనార్హం. -
21ఏళ్లకే బీర్ తాగొచ్చు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై 21 సంవత్సరాలున్న యువత బీరు తాగేందుకు అర్హులవుతారు. ఆబ్కారీ చట్టం ప్రకారం ఢిల్లీ మినహా దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 25 ఏళ్లున్న వారికి మాత్రమే బీరు తాగేందుకు అనుమమతి ఉంది. తాజాగా ఈ రూల్ను మార్చి కొత్త మద్యం విధానాన్ని తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 21 ఏళ్ల వయస్సు వారిని బీరు తాగేందుకు అనుతించడం వల్ల వీరంతా శివారులోని గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి అక్రమంగా మద్యం తాగడాన్ని నిరోధించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత వర్గాలు నిపుణులతో చర్చలు జరుపుతోంది. నాలుగైదు నెలల్లో కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. కొత్త విధానం ఎలా ఉండొచ్చు..? ప్రస్తుతం ఉన్న మద్యం విధానం ప్రకారం ప్రభుత్వ ఆదాయం ఏడాదికి రూ.12 వేల కోట్ల నుంచి రూ.13వేల కోట్ల వరకు ఉండాలి. కానీ, రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు మాత్రమే వస్తోంది. కొత్త విధానం ద్వారా ఆదాయాన్ని బాగా పెంచుకోవడమే ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు మద్యం దుకాణాలను కూడా తెరవాలని యోచిస్తోంది. బ్రాండెడ్ మద్యం కొరతను నివారించడంపైనా దృష్టి సారించింది. బ్రాండెడ్ మద్యం కొరత కారణంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో జరుగుతున్న రూ.5 వేల కోట్ల నుంచి రూ.7000 కోట్ల లావాదేవీలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఈ ఆదాయం ప్రధానంగా శివారులోని గురుగ్రామ్, నోయిడా, గాజియాబాద్ వంటి ప్రాంతాలకు వెళుతోంది. నివాస ప్రాంతాలు మినహా షాపింగ్ మాల్స్ తదితర వ్యాపార సముదాయాల్లో మద్యం షాపులను తెరవనున్నారు. కొత్త మద్యం పాలసీ పూర్తిగా ప్రభుత్వం, లేదా ప్రభుత్వం–ప్రైవేట్, లేదా పూర్తిస్థాయి ప్రైవేట్ అనే మూడు మోడళ్లపై చర్చిస్తోంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిచ్చి విమర్శల పాలైంది. ఆ తర్వాత వాటిని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్ పాలసీపై పూరి్థస్థాయి చర్చల తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
బాణసంచాపై దేశవ్యాప్త నిషేధం ఉండాలి
న్యూఢిల్లీ: బాణసంచా వినియోగంపై దేశ రాజధాని ఢిల్లీ(ఎన్సీఆర్)లో మాత్రమే ప్రత్యేకంగా నిషేధం ఎందుకు విధించాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలోని కొందరు ధనవంతులు మాత్రమే స్వచ్ఛమైన గాలికి అర్హులా? దేశంలోని ప్రజలంతా స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు అర్హులేనని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచా వినియోగాన్ని నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ‘ఎన్సీఆర్ పరిధిలోని నగరాల్లో ప్రజలకు మాత్రమే పరిశుభ్రమైన గాలికి అర్హులా? మిగతా నగరాల్లోని పౌరులకు ఎందుకు కారు? ఇక్కడ ఎలాంటి విధానముందో దేశవ్యాప్తంగానూ అదే ఉండాలి. ఉన్నత పౌరులుంటున్నారనే కారణంతో ఢిల్లీకి ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించలేం. గత శీతాకాలంలో అమృతసర్ వెళ్లాను. గాలి కాలుష్యం అక్కడ ఢిల్లీ కంటే దారుణంగా ఉంది. బాణసంచాపై నిషేధమే విధించాల్సి వస్తే, అది దేశమంతటా ఉండాలి’అని సీజేఐ పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ క్రాకర్స్ను తక్కువ రసాయనాలను వినియోగించి రూపొందించే విధానంపై నేషనల్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(నీరి) కసత్తు చేస్తోందని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం బాణసంచా తయారీ, విక్రయాల లైసెన్సులపై యథాతథ పరిస్థితిని కొనసాగించాలని పేర్కొన్న ధర్మాసనం..తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది. -
బెయిల్ పిటిషన్పై రెండు నెలల్లోగా తేల్చాలి
న్యూఢిల్లీ: సాధారణ, ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణను దీర్ఘకాలంపాటు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటి చర్య న్యాయాన్ని నిరాకరించడమే కాదు, రాజ్యాంగ హక్కులను నిరాకరించడం కూడా అవుతుందని పేర్కొంది. బెయిల్ పిటిషన్లు దాఖలైన తేదీ నుంచి రెండు నెలల్లోగా వాటిపై నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన దరఖాస్తులను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచలేమని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ల ధర్మాసనం తెలిపింది. తమ పరిధిలోని దిగువ కోర్టుల్లోనూ బెయిల్ పిటిషన్లపై సత్వర నిర్ణయాలు తీసుకునేలా పర్యవేక్షించాలని హైకోర్టులకు సూచించింది. దీనిపై తగు మార్గదర్శకాలను జిల్లా కోర్టులకు పంపించాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థలు కేసుల దర్యాప్తును త్వరితగతిన ముగించాలని ధర్మాసనం కోరింది. మోసం కేసులో తన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను బాంబే హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం పైవిధంగా స్పష్టతనిచి్చంది. -
నేడు మణిపూర్లో ప్రధాని పర్యటన
ఇంఫాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ప్రధాని మణిపూర్లో అడుగుపెడుతుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారని, రూ.7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్కుమార్ గోయల్ శుక్రవారం తెలిపారు. చురాచాంద్పూర్, ఇంఫాల్లో ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో మోదీ సమావేశమవుతారని వెల్లడించారు. రెండు ర్యాలీల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. మోదీ పర్యటన అనంతరం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ప్రగతి వేగవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మణిపూర్ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నట్లు ఆయన కార్యాలయం స్పష్టంచేసింది. మణిపూర్లో నరేంద్ర మోదీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం, సివిల్ సెక్రటేరియట్ను ప్రారంభించబోతున్నారు. అలాగే మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మణిపూర్ కేవలం సరిహద్దు రాష్ట్రం కాదని.. యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఒక మూలస్తంభమని, సౌత్ఈస్ట్ ఆసియాకు ముఖద్వారమని పునీత్కుమార్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలకాలని, ఆయన నిర్వహించే సభల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
కర్నాటకలో 22 నుంచి కుల గణన
బెంగళూరు: కర్నాటకలో సెప్టెంబర్ 22 నుంచి రాష్ట్ర కులగణన మొదలుకానుందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. అక్టోబర్ 7వ తేదీ వరకు ఇది పూర్తి కానుందన్నారు. దీని కోసం సుమారు రూ.420 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వేగా పిలిచే ఈ సర్వేకు కర్నాటక రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్ చైర్పర్సన్ మధుసూదన్ ఆర్ నాయక్ సారథ్యం వహించనున్నారన్నారు. ఇందులో శాస్త్రీయంగా రూపొందించిన 60 ప్రశ్నలతో రాష్ట్రంలోని ఏడు కోట్ల మంది ప్రజలు, 2 కోట్ల కుటుంబాల సామాజిక, విద్యాపరమైన స్థితిగతులను తెల్సుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ కల్లా సర్వే నివేదిక అందే అవకాశాలున్నాయన్నారు. దసరా సెలవుల్లో సుమారు 1.75 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సర్వేను చేపడతారన్నారు. ఇందుకోసం శిక్షణ ఇస్తున్నారని, ఒక్కొక్కరికి 120–150 ఇళ్ల బాధ్యతలు అప్పగిస్తారని సీఎం చెప్పారు. వీరికి రూ.20 వేల పారితోషికం కూడా ఇస్తామన్నారు. -
రాజకీయాల్లో వారసులదే రాజ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యంలో కుటుంబ రాజకీయాలు బలంగా పాతుకుపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ప్రతి ఐదుగురిలో ఒకరు (21%) రాజకీయ కుటుంబాల నుంచి వచి్చనవారేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సమగ్ర విశ్లేషణలో తేటతెల్లమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 5,204 మంది ప్రజాప్రతినిధులపై విశ్లేషణ చేయగా, వీరిలో 1,107 మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే కావడం గమనార్హం. లోక్సభలో ఈ ప్రభావం అత్యధికంగా 31 శాతంగా ఉంది. ముఖ్యంగా, మహిళా ప్రజాప్రతినిధుల్లో ఈ ధోరణి రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంది. దాదాపు సగం మంది (47%) వారసత్వంగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని నివేదిక వెల్లడించింది. వారసత్వ రాజకీయాల వాటాలో ఆంధ్రప్రదేశ్ (34%) దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా తీరిదే.. దేశంలోని రాష్ట్రాలను పరిశీలిస్తే, సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 141 మంది (23%) ప్రజాప్రతినిధులు రాజకీయ కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. అయితే, మొత్తం ప్రజాప్రతినిధుల్లో వారసుల శాతం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ (34%) మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరికి పైగా వారసులే కావడం గమనార్హం. ఆ తర్వాత మహారాష్ట్ర (32%), కర్ణాటక (29%) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విశ్లేషించిన 255 మంది ప్రజాప్రతినిధులలో 86 మంది (34%) వారసులే. మహారాష్ట్రలో 403 మందిలో 129 మంది (32%), కర్ణాటకలో 326 మందిలో 94 మంది (29%), తెలంగాణ మహిళా ప్రజాప్రతినిధులలో 64% మంది వారసత్వ నేపథ్యం కలవారేనని వెల్లడైంది.మహిళల ప్రాతినిధ్యంలో అసమానతలు: రాజకీయాల్లోకి మహిళల ప్రవేశానికి కుటుంబ నేపథ్యం ఒక ముఖ్యమైన మార్గంగా మారుతోందని ఈ నివేదికలోని గణాంకాలు పేర్కొన్నాయి. మొత్తం మహిళా ప్రజాప్రతినిధులలో 47% మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే. పురుషులలో ఈ సంఖ్య కేవలం 18% మాత్రమే. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో 69% మహిళా ప్రతినిధులు, తెలంగాణలో 64% మంది వారసులే కావడం గమనార్హం. రాష్ట్రాల అసెంబ్లీల (20%) కన్నా లోక్సభలో (31%) వారసత్వ ప్రభావం ఎక్కువగా ఉంది. జాతీయ రాజకీయాలపై కుటుంబాల పట్టు బిగుస్తున్నట్లు ఇది సూచిస్తోంది. పారీ్టలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ‘గెలుపు గుర్రం’అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం, డబ్బు, కండబలం వంటివి వారసత్వ రాజకీయాలకు కారణమవుతున్నాయి. భారతీయ సమాజంలో కుటుంబ సంప్రదాయాలకు ఉన్న ప్రాధాన్యత కూడా వారసులను ఓటర్లు ఆమోదించడానికి ఒక కారణంగా నిలుస్తోంది. -
విశ్వపరిశోధనాలయాలు
భారత్లో ఆవిష్కరణల వేగం పుంజుకొంది. దానికి తగ్గట్టుగా మేధో సంపత్తి హక్కుల (ఐపీ) కోసం దరఖాస్తులూ వెల్లువెత్తుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం దేశంలో దాఖలైన పేటెంట్లలో భారతీయ సంస్థల వాటా 20% కంటే తక్కువ. 2023కి వచ్చేసరికి ముఖచిత్రం మారిపోయింది. మొత్తం పేటెంట్ ఫైలింగ్స్లో ఏకంగా 57 శాతం వాటాతో మన సంస్థలు సత్తా చాటాయి. దరఖాస్తుల్లో దేశీయ యూనివర్సిటీలు ముందంజలో ఉండడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుండి సృష్టికర్తగా మారడానికి మనదేశం క్రమంగా అడుగులేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014–15లో భారతీయుల నుంచి వచ్చిన పేటెంట్ దరఖాస్తులు 12,071 కాగా, 2023–24 నాటికి ఇది 51,574కు పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అలాగే, అప్పట్లో పేటెంట్ల మంజూరు కేవలం 684 కాగా, పదేళ్లలో 25,082కు పెరిగింది. పేటెంట్ నియమాలకు సవరణలతో నిర్దిష్ట గ్రూప్స్నకు వేగంగా పరీక్షలు, గడువు కాలాన్ని సరళీకృతం చేయడం.. విద్యా సంస్థలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు దరఖాస్తు రుసుములను 80% తగ్గించడం.. ఫైలింగ్, సమాచారం పూర్తిగా డిజిటలైజేషన్ వంటి సంస్కరణలకు దారితీశాయి.యూనివర్సిటీల సత్తాపేటెంట్ దాఖలు, టెక్నాలజీ బదిలీ, మేధోసంపత్తి హక్కు ల (ఐపీ) ద్వారా ఆదాయ సముపార్జన వంటి అంశాల్లో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రత్యేక ఐపీ సెల్స్ను, చట్టపరమైన సహాయ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా విశ్వవిద్యాల యాలు కూడా ముందంజలో ఉన్నాయి. ఉన్నత విద్యా సంస్థలలో మేధోసంపత్తి హక్కులపై అవగాహన కోసం ప్రభుత్వం 2020లో ‘కపిల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే 2016లో నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. 2021 సెప్టెంబరు నుంచి పేటెంట్ దరఖాస్తు రుసుము గణనీయంగా తగ్గడం యూనివర్సిటీల్లో జోష్ నింపింది. ఐఐటీ మద్రాస్ 2022లో 156 పేటెంట్లను అందుకోగా.. ఏడాదిలో ఈ సంఖ్య 300కి చేరింది. ఐఐటీ బాంబే 2023–24లో 421 పేటెంట్లతో దేశంలో అగ్రస్థానంలో ఉంది.⇒ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ 2020లో 48వ స్థానం నుంచి 2024లో 39వ స్థానానికి ఎగబాకింది. ⇒ భారత్లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కి చేస్తున్న వ్యయం ప్రస్తుతం జీడీపీలో 0.67% మాత్రమే. ఇది యూఎస్లో 3.5%, చైనాలో 2.5%. ⇒ విద్యా సంస్థల పేటెంట్ అప్లికేషన్స్సంవత్సరం భారత్ విదేశీ2021–22 7,405 962022–23 19,155 2752023–24 23,306 237పెరిగిన వేగంరెండేళ్లలో దాఖలైన దాదాపు 80% పేటెంట్లు ఇప్పటికీ నమోదు కోసం వేచి ఉన్నాయి. అయితే 2000ల ప్రారంభంలో ఒక్కో పేటెంట్ మంజూరుకు 8–10 సంవత్సరాలు పట్టింది. 2020లో చాలావరకు 2–3 ఏళ్లలోపే అయిపోయాయి. కొన్ని దరఖాస్తు చేసిన ఏడాదిలోనే మంజూరయ్యాయి.వ్యక్తులూ.. విద్యాసంస్థలూ..2000లో వచ్చిన మొత్తం పేటెంట్ దరఖాస్తుల్లో కంపెనీలవి 43 శాతం కాగా, 2023 నాటికి ఇది 17 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో వ్యక్తుల దరఖాస్తులు 10 నుంచి 32 శాతానికి పెరిగాయి. 2010లో 20 శాతంలోపే ఉన్న విద్యాసంస్థల వాటా.. ఇప్పుడు ఏకంగా 43 శాతానికి ఎగబాకింది. 2023–24లో దేశీయ సంస్థలు, వ్యక్తుల వంటి వారు పెట్టుకున్న మొత్తం పేటెంట్ దరఖాస్తులు 51,574 కాగా మంజూరైనవి 25,079. ఇందులో..⇒ 2010 నుంచి 2025 సెప్టెంబరు 11 వరకు ఫైల్చేసిన పేటెంట్లు 9,32,693⇒ వీటిలో భారతీయులు దరఖాస్తు చేసినవి 3,83,073⇒ మొత్తం దరఖాస్తుల్లో మంజూరైనవి 3,20,807⇒ వీటిలో భారతీయులవి 70,088 -
‘సాక్షి జర్నలిస్ట్లపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు ఉపసంహరించాలి’
సాక్షి జర్నలిస్ట్లపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని ఢిల్లీ టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా స్వేచ్ఛను కాపాడలని పేర్కొంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని ఓ ప్రకటన విడుదల చేసింది.‘ప్రజాస్వామ్యంలో వేధింపులు, అక్రమ కేసులకు తావులేదు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పోలీస్ కేసులు, విచారణ పేరుతో నోటీసులు ఏ మాత్రం సరికాదు. ఆంధ్రప్రదేశ్లో తమకు వ్యతిరేక వార్తలు రాస్తున్నారన్న నెపంతో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి సహా మరికొంత జర్నలిస్టులపై పోలీస్ కేసులు నమోదు చేసి, విచారణ కోసం పోలీస్స్టేషన్లకు రమ్మని గంటల తరబడి విచారిస్తూ,వేధింపులకు గురి చేయటం ఏ మాత్రం సమ్మతం కాదు. ముఖ్యంగా ఒక నాయకుడు పెట్టిన ప్రెస్మీట్పెట్టిన వార్తను ప్రచురించినందుకు ఎడిటర్ సహా, రాసిన విలేకరిపై క్రిమినల్కేసు నమోదు చేయటం విచారకరం. వాస్తవాలకు భిన్నంగా వార్తలు వస్తే, వాటిని తిరిగి ప్రచురించమని, తమ వాదనలు కూడా వేయాలని కోరే హక్కు ప్రభుత్వంతో పాటు అందరికీ ఉంది. కానీ వివరణలు ఇవ్వకుండా జర్నలిస్టులను బెదిరించే ధోరణిలో పోలీస్కేసులు నమోదు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని పదేపదే హితువు పలికింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం పునరాలోచన చేసి పోలీస్ కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాము’ అని ఢిల్లీ టీయూడబ్యూజే అధ్యక్షులు నాగిళ్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గోపీకృష్ణ, కోశాధికారి కొన్నోజు రాజులు ప్రకటనలో పేర్కొన్నారు. -
‘మీరు కొంచెం మసాలా యాడ్ చేశారు’.. కంగనా రనౌత్కు సుప్రీంకోర్టు చీవాట్లు
సాక్షి,న్యూఢిల్లీ: సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. రైతు చట్టాల ఆందోళనపై మీరు రీట్వీట్ మాత్రమే చేయలేదు. కొంచెం మసాలా యాడ్ చేశారని మండిపడింది. 2020-21లో రైతు చట్టాలకు సంబంధించిన ఆందోళన సమయంలో కంగనారౌనత్ ఓ మహిళా రైతును ఉద్దేశిస్తూ రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో మహిళా రైతు కంగనారౌనత్పై పరువు నష్టం దావా వేశారు. తాజాగా, పంజాబ్ రాష్ట్రం బాథిండా కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో కంగనాపై నమోదైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. అంతేకాదు.. మహిళ రైతు గురించి మీరు ట్వీట్లు మాత్రమే కాదు మసాల్ యాడ్ చేశారు’అని వ్యాఖ్యానించింది. దీంతో ఆమె తరఫు న్యాయవాది పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.2020-21 దేశ రాజధాని ఢిల్లీ రైతు చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో మరో ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. అయితే, రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న మహీందర్ కౌర్.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాల్గొన్న బిల్కిస్ బానో ఇద్దరూ ఒకటేనంటూ తాను చేసిన పోస్టును కంగనా రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్పై మహీందర్ కౌర్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసునే కొట్టేయొమని కంగాన న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. కంగనా ఇప్పటికే పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ కూడా ఆమెకు ఊరట లభించలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు సూచన మేరకు ఆమె ట్రయల్ కోర్టులోనే న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. -
ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?
భారతదేశంలో రాజ్యాంగ బద్దంగా.. రాష్ట్రపతి తరువాత రెండో అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి. ఈ బాధ్యతలను సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు శుక్రవారం(సెప్టెంబర్ 12వ తేదీ) చేపట్టారు. అయితే దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎటువంటి జీతం ఉండదని బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అయితే.. జీతం తప్ప, ఇతర ప్రోత్సాహకాలు లభించే ఏకైక పదవి ఇదే అని చెప్పడంలో సందేహం లేదు.భారత ఉపరాష్ట్రపతిగా ఎటువంటి జీతం తీసుకోనప్పటికీ.. ఈ పదవిలో ఉన్న వ్యక్తి, రాజ్యసభ ఛైర్మన్గా నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతారు ((2018లో దీనిని రూ.1,25,000 నుంచి సవరించారు). ఉపరాష్ట్రపతి జీతం, భత్యాలు పార్లమెంటు అధికారుల జీత భత్యాల 1953 చట్టం ప్రకారం నిర్ణయిస్తారు. ఇందులో ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేక జీత నిబంధన లేదు.ఉపరాష్ట్రపతికి లభించే ప్రయోజనాలుభారత ఉపరాష్ట్రపతికి జీతం లేకపోయినప్పటికీ.. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉచిత వసతి, వైద్య సంరక్షణ, రైలు & విమాన ప్రయాణం, ల్యాండ్లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్ సర్వీస్, వ్యక్తిగత భద్రత, సిబ్బంది మొదలైనవి ఉన్నాయి.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐపదవీ విరమణ తరువాత కూడా అనేక సదుపాయాలు కల్పిస్తూ.. నెలకు సుమారు రూ. 2 లక్షల పెన్షన్, పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్, సెక్యూరిటీ, డాక్టర్, ఇతర సిబ్బంది సేవలను పొందుతూనే ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి మరణించిన తరువాత.. ఆయన భార్యకు కూడా కొన్ని సదుపాయలను కల్పిస్తారు. -
కనుమరుగు కానున్న ఈశాన్య రుతుపవనాలు?!
అనూహ్యం.. అసాధారణం.. ఆశ్చర్యం.. నైరుతి రుతుపవనాలు ‘సంప్రదాయ’ గతి తప్పాయి. వాతావరణ మార్పు, భూతాపం నేపథ్యంలో అవి దారి తప్పి ఆధునిక ‘పోకడ’ పోతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నడక కొద్దిగా మారింది. భవిష్యత్తులో ఇదే నడత కొనసాగితే మన దేశానికి ముప్పు తప్పదు!!. ఈ నెల తొలి వారంలో భారత వాతావరణ విభాగానికి చెందిన ఓ ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం రుతుపవన గమనంపై వాతావరణ నిపుణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల వరకు వెళ్లి.. గోడకు కొట్టిన బంతిలా వెనక్కు రావాల్సిన రుతుపవనాలు కొంత కట్టు తప్పి టిబెట్ పీఠభూమి ప్రాంతంలోకి ప్రవేశించాయి. హిమాలయాలకు ఆవల ఉండే టిబెట్ పీఠభూమిలో అవపాతం తక్కువ. అందుకే ఈ ప్రదేశం ఎప్పుడూ పొడిగా కనిపిస్తుంది. శీతాకాలంలో హిమపాతం, వసంత రుతువులో పశ్చిమ అలజడుల వల్ల కొద్దిపాటి వర్షపాతం మాత్రమే అక్కడ నమోదవుతాయి. అలాంటి శుష్క టిబెట్ ప్రాంతంలో నైరుతి తేమ గాలులు తాజాగా వానలు కురిపించాయి. నైరుతి రుతుపవనాల తేమగాలులు హిమాలయాల హద్దును దాటేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ మీదుగా టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపుతోందని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన గ్లేసియాలజిస్ట్ మనీష్ మెహతా చెప్పారు. ఇండియాకు ప్రత్యేక వరం.. రుతుపవనాలు! వేసవిలో సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి బయలుదేరే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో భారతదేశమంతటా విస్తరించి జూన్-సెప్టెంబరు నెలల్లో వర్షాలు కురిపిస్తాయి. వాటి ప్రయాణం ఉత్తరానికి వచ్చేటప్పటికి ఎదురుగా హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా, పెట్టని కోటలా అడ్డు నిలుస్తాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకుని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తాయి. తమలో మిగిలివుండే తేమతో హిమాలయ పర్వత శ్రేణుల నుంచి అవి వెనక్కు మరలుతాయి. తిరుగుపయనంలో ఈశాన్య రుతుపవనాల పేరిట అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షిస్తూ మళ్లీ సముద్రం బాట పడతాయి. ప్రయాణంలో వర్షిస్తూ తేమను కోల్పోతూ ఉంటాయి కనుక... నైరుతితో పోలిస్తే మనకు ఈశాన్య రుతుపవనాల వర్షపాతం తక్కువ. రుతుపవన ప్రక్రియ భారతదేశానికి ప్రత్యేకం. దేశంలో సాగునీరు, తాగునీటికి రుతుపవనాలే ఆధారం. భూతాపం, వాతావరణ మార్పు, పశ్చిమ అలజడులు/కల్లోలాలుగా పిలిచే వాతావరణ ప్రక్రియల వల్ల నైరుతి రుతుపవనాలు టిబెట్ వైపు వెళ్లి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఎత్తు తక్కువ ఉండే దారుల గుండా నైరుతి తేమ గాలులు టిబెట్లోకి ప్రవేశించి ఉండొచ్చని అంటున్నారు. అయితే.. నైరుతి రుతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం ఆరంభిస్తే... హిమనీనదాల (గ్లేసియర్స్)లోని మంచు కరుగుదలలో, నదీ ప్రవాహాల తీరుతెన్నుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. నైరుతి కాస్తా తుర్రుమని టిబెట్ పారిపోతే మనకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. భారతదేశంలో వర్షపాతం తగ్గుతుంది. వ్యవసాయం, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతుంది. తాగునీటికి కటకట తప్పదు. రుతుపవనాలనే నమ్ముకుని బతుకుతున్న దేశం మనది. ఏదో ఒక సీజన్లో రుతుపవనాలు ముఖం చాటేసినా తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తారు రైతన్నలు. నైరుతి రుతుపవనాలు భౌగోళికంగా ‘హిమాలయ కంచె’ దూకి ప్రతి సీజన్లోనూ ఆవలి టిబెట్ వైపునకు పూర్తిగా మరలిపోయేట్టయితే... అవి ఇక తిరిగి వెనక్కు రావు! అప్పుడిక ఈశాన్య రుతుపవనాలు అనేవే ఉండవు!! ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా ఆ తేమలేని, బలహీన పవనాలతో కురిసే వర్షాలు, కలిగే ప్రయోజనం నామమాత్రమే. భయపెట్టాలని కాదు గానీ... ఆ దుస్థితి రాకూడదనే ఆశిద్దాం. వాతావరణ మార్పు ప్రభావంతో ఎన్నో వింతలు చూస్తున్నాం. నిరుడు కురిసిన వర్షాలకు సహారా ఎడారి ఇసుక తిన్నెలు సరస్సులను తలపించిన సంగతి మరచిపోతే ఎలా?!(Source: Zee News)::జమ్ముల శ్రీకాంత్ -
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పలు బెంచ్ల న్యాయమూర్తులు.. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. హైకోర్టు ప్రాంగణం ఖాళీ చేయాలని న్యాయవాదులకు భద్రతా సిబ్బంది సూచించారు. బెదిరింపు మెయిల్తో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. హైకోర్టు ఆవరణలో మూడు ప్రదేశాల్లో ఆర్డీఎక్స్ అమర్చామని.. పాక్తో ఐసిస్తో సంబంధాలున్నట్లు మెయిల్లో ప్రస్తావించారు.గత నెలలో కూడా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్కాల్స్, మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతివ తెలిసిందే. ఈమెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయ IP అడ్రస్లు, వర్చువల్ ప్రాక్సీలు వాడుతున్నట్లు గుర్తించారు. స్కూల్స్, కోర్టులు, గవర్నమెంట్ ఆఫీసులు, బహిరంగ ప్రాంతాలు, ఆఖరికి విమానాల్లోనూ బాంబు ఉందంటూ బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. -
హీరాబెన్-మోదీపై ఏఐ వీడియో.. బీజేపీ గుర్రు
బీహార్ ఎన్నికల ప్రచారం పోనుపోను వ్యక్తిగత విమర్శలకు కేరాఫ్గా మారేలా కనిపిస్తోంది. మొన్నీమధ్యే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను బీజేపీ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం తన తల్లి హీరాబెన్ను రాజకీయాల్లోకి లాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.साहब के सपनों में आईं "माँ" देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m— Bihar Congress (@INCBihar) September 10, 2025అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
నేపాల్లో హోటల్కు నిప్పు.. భవనంపై నుంచి దూకేసిన భారతీయ జంట
ఖాట్మండు: నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అదుపు తప్పాయి. ఆగ్రహంతో రగిలిపోయిన యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ దేశాన్ని చుట్టుముట్టిన నిరసనల క్రమంలో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల సమయంలో రాజధాని ఖాట్మండులోని ఓ హోటల్కు నిరసనకారులు నిప్పుపెట్టారు. దీంతో ఓ భారతీయ జంట.. మంటల నుంచి తప్పించుకునేందుకు నాలుగో అంతస్తు విండో నుంచి దూకారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.మృతి చెందిన మహిళను డెహ్రాడూన్ చెందిన 55 ఏళ్ల రాజేష్ దేవి గోలాగా గుర్తించారు. పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఆమె తన భర్త రామ్వీర్ సింగ్ గోలాతో కలిసి ఖాట్మండుకు వెళ్లారు. రామ్వీర్ వృత్తిరీత్యా ట్రాన్స్పోర్టర్. గురువారం ఈ దంపతులు హిల్టన్ హోటల్లో బస చేశారు. నిరసనకారులు ఆ భవనానికి నిప్పంటించడంతో తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకారు. మరోవైపు నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తిరుగు ప్రయాణపర్వం మొదలైంది. పలు మార్గాల్లో పలు రాష్ట్రాల ప్రజలు వెనుతిరిగి వస్తున్నారు. కాగా, నేపాల్లో ఓవైపు ఉద్యమం, మరోవైపు ప్రభుత్వం కుప్పకూలడంతో శాంతిభద్రతలు కట్టుతప్పి ఖైదీలు చెలరేగిపోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 కారాగారాల నుంచి 15 వేల మంది ఖైదీలు జైలు గదులు బద్దలుకొట్టిమరీ బయటపడ్డారు. పరారై బయటికొచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చారు. నేరస్తుల పరారీతో అప్రమత్తమైన సైన్యం పలుచోట్ల ఖైదీలను వెంటబడిమరీ పట్టుకుంది. కొన్ని చోట్ల జైలు సిబ్బందిపై ఖైదీలు ఎదురుతిరిగారు. మాధేశ్ ప్రావిన్సులోని రామెఛాప్ జిల్లా కారాగార కేంద్రంలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఖైదీలు జైలుసిబ్బందితో ఘర్షణకు దిగారు.జైలు గోడను బద్దలుకొట్టేందుకు ఖైదీలు గ్యాస్ సిలిండర్ను పేల్చేశారు. దీంతో ఘర్షణ మొదలైంది. పారిపోయేందుకు ప్రయతి్నంచిన వారిని నిలువరించేందుకు సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీంతో సోమవారం మొదలైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా సంభవించిన మరణాల సంఖ్య గురువారానికి 34కు పెరిగింది. 1,338 మందికి పైగా గాయాలపాలయ్యారు. కల్లోల నేపాల్ నుంచి బయటపడే దురుద్దేశంతో ఇప్పటికే జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు కొందరు ఏకంగా దేశందాటి పారిపోయేందుకు విఫలయత్నంచేశారు. ఉత్తరప్రదేశ్లోని బయిర్గనియా చెక్పోస్ట్ సమీప ప్రాంతం గుండా భారత్లోకి చొరబడేందుకు యతి్నంచిన 13 మంది నేపాల్ ఖైదీలను భారత బలగాలైన సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) విజయవంతంగా అడ్డుకుంది. సరిహద్దు సమీపంలోని రౌతహాత్ జిల్లా కారాగార కేంద్రం నుంచి ఈ ఖైదీలు పారిపోయారని ఎస్ఎస్బీ గుర్తించింది.నిబంధనల ప్రకారం వారందరినీ నేపాల్ పోలీసులకు ఎస్ఎస్బీ సైనికులు అప్పగించారు. ఇప్పటిదాకా జైళ్ల నుంచి పారిపోయి సరిహద్దుదాకా చేరుకున్న దాదాపు 60 మంది నేపాలీ ఖైదీలు, ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని అదుపులోకి తీసుకుని నేపాల్ పోలీసులకు అప్పగించామని ఎస్ఎస్బీ అధికారి వెల్లడించారు. -
భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశపు 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు పలువురు ఎన్డీయే కూటమి సీఎంలు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, జగ్దీప్ ధన్ఖడ్ సహా మాజీ ఉపరాష్ట్రపతులూ పాల్గొన్నారు.ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 9న జరిగిన పోలింగ్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన సమీప ప్రత్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఓటమి తర్వాత జస్టిస్ సుదర్శన్రెడ్డి రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్. 1957 అక్టోబరు 20న తమిళనాడులోని తిరుప్పూర్లో ఆయన జన్మించారు. కాంగ్రెస్ సానుభూతిపరులైన వ్యవసాయ కుటుంబంలో ఈయన జన్మించారు. పదహారో ఏట నుంచి ఆర్ఎస్ఎస్, జన్సంఘ్లతో కలిసి పనిచేశారు. సామాజికంగా, ఆర్థికంగా బలమైన కొంగు వెల్లాలర్ (గౌండర్) సామాజికవర్గం నుంచి వచ్చిన ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. 1998 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా 1.5 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో అక్కడినుంచే నెగ్గారు. వాజ్పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 2000లో రాధాకృష్ణన్ కేంద్రమంత్రి కావాల్సి ఉంది. మరో సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్ అప్పట్లో ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో అలాంటి పొరపాటు జరిగిందని చెబుతారు. ఇక.. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీలో ‘తమిళనాడు మోదీ’గా ఈయన పేరుపొందారు. ఆపై.. రాధాకృష్ణన్ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. కొన్నాళ్లు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులై 27 నుంచి మహారాష్ట్ర గవర్నర్గా ఉండి.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గడంతో ఆ హోదాకు రాజీనామా చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకటరామన్ల తర్వాత తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన మూడోవ్యక్తిగా, దక్షిణాది నుంచి ఏడో వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీకాలం 2030 వరకు ఉంటుంది. -
మందలించినందుకు తల నరికేశాడు
డాలస్: అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్లో దారుణం జరిగింది. భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను తోటి కార్మికుడు కిరాతకంగా హత్య చేశాడు. తాము పనిచేస్తున్న హోటల్ వద్ద భార్య, కుమారుడి కళ్లెదుటే ఆయన తలను నరికేశాడు. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. ప్రాణభయంతో పరుగులు తీసిన నాగమల్లయ్యను వెంటాడి మరీ నరకడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హంతకుడు యొర్డానిస్ కోబోస్–మారి్టనెజ్(37)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేశారు. హంతకుడిని క్యూబా జాతీయుడిగా గుర్తించినట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నేర చరిత్ర కలిగిన మారి్టనెజ్పై గతంలోనే కేసులు నమోదయ్యాయి. వాహనం దొంగతనం కేసుతోపాటు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుకు వెళ్లాడు. వలసదారుడన్న సానుభూతితో జో బైడెన్ ప్రభుత్వం అతడిని జైలు నుంచి విడుదల చేసింది. నేరస్థుడైన మారి్టనెజ్కు తమ దేశంలోకి అనుమతించేందుకు క్యూబా ప్రభుత్వం నిరాకరించింది. దాంతోనే అమెరికాలోనే ఉంటున్నాడు. నాగమల్లయ్య హత్య విషయంలో నేరం నిరూపణ అయితే మారి్టనెజ్కు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెప్పారు. అసలేం జరిగింది? చంద్రమౌళి నాగమల్లయ్య డాలస్లోని డౌన్టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్గా పని చేస్తున్నారు. అదే హోటల్లో మార్టినెజ్ కార్మికుడు. ఇద్దరికీ చాలా రోజుల నుంచే పరిచయం ఉంది. బుధవారం ఉదయం హోటల్ గదిని శుభ్రం చేసే విషయంలో గొడవ మొదలైంది. మారి్టనెజ్, మరో మహిళా కార్మికురాలు కలిసి విరిగిపోయిన మెషీన్తో గదిని ఊడ్చేందుకు ప్రయతి్నస్తుండగా నాగమల్లయ్య వారించాడు. అలా చేయొద్దంటూ మందలించినట్లుగా మాట్లాడారు. దాంతో ఆగ్రహానికి గురైన మారి్టనెజ్ అప్పటికే తన వద్దనున్న కత్తితో నాగమల్లయ్యపై దాడి చేసేందుకు ముందుకొచ్చాడు. ఆందోళన చెందిన నాగమల్లయ్య వెంటనే బయటకు పరుగెత్తారు. ఎవరైనా తనను కాపాడాలని గట్టిగా ఆరుస్తూ పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నారు. మారి్టనెజ్ అక్కడికి దూసుకొచ్చి నాగమల్లయ్యను కత్తితో పొడిచేశాడు. ఉన్మాదిలా మారి విచక్షణారహితంగా తల నరికాడు. నాగమల్లయ్య జేబులోని తాళం కార్డును, సెల్ఫోన్ను తీసుకున్నాడు. తెగిపడిన తలను కాలితో రెండుసార్లు దూరంగా తన్నాడు. తర్వాత తలను చేతితో తీసుకెళ్లి చెత్తకుండీలో పడేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్కు చేరుకున్నారు. మారి్టనెజ్ను అరెస్టు చేశారు. రక్తంతో కూడిన కత్తిని స్వా«దీనం చేసుకున్నారు. ఈ హత్య జరుగుతున్న సమయంలో నాగమల్లయ్య భార్య, కుమారుడు హోటల్లోనే ఉన్నారు. కేకలు విని బయటకు వచ్చారు. నాగమల్లయ్యను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, వారిని మారి్టనెజ్ బలవంతంగా నెట్టేశాడు. నాగమల్లయ్య తల తెగిపోయేదాకా నరుకుతూనే ఉన్నాడు. ఇదంతా హోటల్ ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కళ్లెదుటే జరిగిన హత్యను చూసి నాగమల్లయ్య భార్య, కుమారుడు బిగ్గరగా రోదించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలు బాదుకున్నారు. ఈ హత్య పట్ల హూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబానికి తగిన సాయం అందిస్తామని, అండగా ఉంటామని ప్రకటించారు. కర్ణాటక వాసి నాగమల్లయ్య నాగమల్లయ్య స్వస్థలం భారత్లోని కర్ణాటక. చాలా ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. డాలస్ డౌన్టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్గా చేరారు. ఆయన చాలా సౌమ్యుడని, గొడవలకు దూరంగా ఉంటారని మిత్రులు చెప్పారు. కుటుంబం అంటే ఆయనకు ప్రాణమని, ఇతరుల పట్ల దయతో వ్యవహరిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం బాధగా ఉందన్నారు. నాగమల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన కుమారుడి చదువులకు అయ్యే ఖర్చుల కోసం మిత్రులు నిధుల సేకరణ ప్రారంభించారు. నాగమల్లయ్య అంత్యక్రియలు శనివారం అమెరికాలోనే జరుగుతాయని సమాచారం. -
భార్య, ఆమె ప్రియుడి తలలతో జైలుకు
వేలూరు: భార్య, ఆమె ప్రియుడిని అతి దారుణంగా చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. తమిళనాడులోని కల్లకుర్చి జిల్లా మలై కొట్టాలంకు చెందిన కొలంజి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి(46)కి, అదే గ్రామానికి చెందిన తంగరాసు(39)తో కొంత కాలంగా సన్నిహిత సంబంధం ఉంది. ఈ విషయం తెలియడంతో కొలంజి వారిని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో తంగరాసు బుధవారం అర్ధరాత్రి కొలంజి ఇంటిపైన లక్ష్మిని కలిశాడు. వారిని గమనించిన కొలంజి.. తీవ్ర ఆగ్రహావేశంతో ఇంట్లోని కత్తితో ఇద్దరి తలలను నరికాడు. వాటిని బ్యాగులో వేసుకొని గురువారం తెల్లవారుజామున బస్సులో వేలూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. వెంటనే వారు కల్లకుర్చి పోలీసులకు సమాచారమిచ్చారు. కల్లకుర్చి పోలీసులు కేసు నమోదు చేసి.. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొలంజిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
243 సీట్లు.. 2,300 దరఖాస్తులు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్లో సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పథక రచన చేస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 243 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమి ఆమోద ముద్ర వేసేవరకూ ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొనసాగనున్నది. ఆశావహుల నుంచి ఇప్పటికే 2,300పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల ఆధారంగా పార్టీ బలం, బలహీనతలపై ఒక అవగాహనతోపాటు.. కొత్తగా ఎదుగుతున్న నేతలపై ప్రధానంగా దృష్టి సారించడమే రాష్ట్ర కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నది. 14వ తేదీలోగా అభ్యర్థుల జాబితాను పంపాలని రాష్ట్ర పార్టీ కోరింది. 16న జరిగే సమావేశంలో ఈ పేర్లపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఒక్కో సీటుకు ముగ్గురు పోటీ: రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిటీ మొత్తం 243అసెంబ్లీ స్థానా ల్లో ఒక్కో సీటు నుంచి ముగ్గురి పేర్లను సిద్ధం చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నది. ఈ నెల 19న జరగనున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దరఖాస్తులను పరిశీ లించనున్నారు. అంతిమంగా ఒకరి పేరును ఎంపిక చేసి ఆమోదం కోసం ఢిల్లీలోని అధిష్టానానికి పంపించనున్నారు. ఇదే జాబి తాను యథాతథంగా లేదా కొద్ది మార్పులతో అధిష్టానం ప్రటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
కొండలను చీలుస్తూ.. లోయలను దాటుతూ..
ఐజోల్ నుంచి సాక్షి ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి: ఎత్తయిన కొండలు, ఒకటి కాదు రెండు కాదు వందలు.. ఆ వెంటనే అగాధాలను తలపించే లోయలు... కొండలను చీలుస్తూ పరుగులెత్తే నదులు.. ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని నగరమైన ఐజోల్లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్టు పిల్లర్లపై నిర్మించి ఉంటాయి. నడకదారి నిర్మాణం కూడా కనాకష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 52 కి.మీ.మేర రైల్వే లైన్ నిర్మితమైంది. ఆ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించటమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల కఠోర శ్రమతో ఇంజినీర్లు అద్భుతాన్ని చేసి చూపారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడది రికార్డుల్లోకెక్కింది. దాన్నిశనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్ నిడివి 51.38 కి.మీ. కానీ, దీని నిర్మాణానికి అయిన వ్యయం రూ.8,071కోట్లు. అంటే కి.మీ.కు రూ.157 కోట్లు అన్నమాట. సాధారణంగా రైల్వే లైన్ల నిర్మాణంలో కి.మీ.కు అయ్యే ఖర్చు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుంది. కానీ, ఇక్కడ వ్యయం అంతకంటే పది రెట్లు ఎక్కువగా ఉండటం ఓ రికార్డు. వంతెనలు, సొరంగాలు... ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావటమే భారీ వ్యయానికి కారణం. ఒకదానిని ఆనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. రెండు కొండల మధ్య అగాధంలా లోయలున్నందున, సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దానిమీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. సొరంగాలలో మూడో దాని నిడివి 1.9 కి.మీ. కావటం విశేషం. అలా మొత్తం సొరంగాల నిడివి 15.88 కి.మీ.గా ఉంది.అంటే మొత్తం రైలు కారిడార్లో 31 శాతం నిడివి సొరంగాలతోనే ఉందన్నమాట. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిల్లో 97వ నంబర్ వంతెన పొడవు 742 మీటర్లు కాగా, దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు కాస్త చిన్నవి. 10 ఆర్యూబీలు, ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కి.మీ. మొత్తం కారిడార్ నిడివిలో వీటి వాటా 23 శాతం. అంటే 54 శాతం రైల్వే లైను వంతెనలు, సొరంగాలతోనే ఉంటుందన్నమాట. ఐజోల్కు భాగ్యం ⇒ దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు గాను సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. ఆరు రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరం రాజధాని ఐజోల్కు ఆ భాగ్యం దక్కబోతోంది. మిగతా మూడు రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది. ⇒ ఐజోల్కు 20 కి.మీ. దూరంలో ఉన్న సాయిరంగ్ స్టేషన్ నుంచి ఇక నాలుగు రైళ్లు నడవనున్నాయి. ఇందులో రాజధాని ఎక్స్ప్రెస్ వారానికి ఒక రోజు ఢిల్లీకి, కోల్కతాకు వారంలో మూడు రోజులు నడిచే మరో ఎక్స్ప్రెస్, అస్సాం రాజధాని గువాహటికి నిత్యం ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానున్నాయి. సాయిరంగ్ స్టేషన్ నుంచి మయన్మార్ దేశ సరిహద్దు 223 కి.మీ. దూరంలో ఉంటుంది. ⇒ ప్రకృతి రమణీయతకు నెలవైన ఆ ప్రాంతానికి రైలు కనెక్టివిటీతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. పరిశ్రమలు కూడా రానున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన సరుకుల రవాణా కూడా అతి కష్టంగా ఉన్నందున, ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అధికం. ఇప్పుడు రైలు మార్గాన సరుకు రవాణా సులభతరం కానున్నందున ధరలు దిగివచ్చి సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంది. -
ఖిలాఫత్ ఉగ్ర మాడ్యూల్ బట్టబయలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్తో లింకులున్న ఉగ్ర మాడ్యూల్ ఒక దానిని ఢిల్లీ పోలీసులు బట్టబ యలు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు జరిపి ఇందుకు సంబంధించి ఐదుగురిని అరె స్ట్ చేశారు. పాకిస్తాన్ హ్యాండ్లర్ ద్వారా వీరు ఆన్లైన్లో యువతను ఉగ్ర ఊబిలోకి లాగు తున్నారు. కొంత భూభాగాన్ని స్వాధీనం చేసు కుని ఖిలాఫత్ జోన్గా ప్రకటించడం ద్వారా భారత్లో జిహాద్ను ప్రారంభించాలన్నది వీరి ప్రణాళిక అని అదనపు పోలీస్ కమిషనర్ (స్పె షల్ సెల్) ప్రమోద్ కుష్వాహా మీడియాకు తెలి పారు. ఘజ్వా–ఇ–హింద్ (భారత్పై దాడి) నినాదంతో దేశవ్యాప్తంగా హింసాత్మక కార్యక లాపాలకు పాల్పడేందుకు వీరు ప్రయత్నిస్తు న్నారన్నారు. పట్టుబడిన వారిలో రాంచీకి చెందిన అషర్ దానిష్ అలియాస్ అష్రార్ ఖురే షి(23), ముంబైకి చెందిన అఫ్తాబ్ ఖురేషి, సుఫియాన్ అబూబకర్లు, తెలంగాణకు చెందిన మహ్మద్ హుజైఫా, మధ్యప్రదేశ్కు చెందిన కమ్రాన్ ఖురేషి ఉన్నారు. వీరితోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తు న్నట్లు వివరించారు. ఈ మాడ్యూల్కు డానిష్ సారథ్యం వహిస్తూ పాకిస్తాన్లోని హ్యాండ్లర్ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఈ హ్యాండ్లకు సీఈవో, గజ్బా, ప్రొఫెసర్ అనే సంకేత నామం ఉందని ఏసీపీ కుష్వాహా చెప్పారు. సోషల్ మీడియా చాట్ల ద్వారా పాక్ హ్యాండ్లర్ వీరికి మందు పాతరల డిజైన్లు, తయారీలో సలహాలిస్తున్నాడు. గత ఆరు నెలలుగా వీరి కార్యకలాపాలపై కన్నేసి ఉంచామని, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అఫ్తాబ్, సుఫియాన్లను మొదటగా అరెస్ట్ చేశామన్నారు. మేవాడ్కు చెందిన వ్యక్తి నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వచ్చి వీరు పట్టుబడ్డారని తెలిపారు. వీరి మరికొంత మందిని కూడా చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఐఈడీలను తయారు చేసేందుకు అవసరమైన వివిధ రకాల సామగ్రి, రసాయనాలను స్వాధీనం చేసుకుని, విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపించినట్లు చెప్పారు. ఖిలాఫత్ గతంలో పట్టుబడిన ఉగ్ర మాడ్యూల్లతో సంబంధం లేకుండా కొత్తగా ఏర్పాటైన గ్రూపుగా పేర్కొన్నారు. ఖిలాఫత్ జోన్కు అవసరమైన భూమి కొనుగోలు కోసం వీరు నిధుల సేకరణలో బిజీగా ఉన్నారన్నారు. -
ప్రపంచయాత్రకు నారీశక్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల చరిత్రలో నారీశక్తి మరో సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాలకు చెందిన పది మంది మహిళా అధికారుల బృందం తొలిసారిగా సముద్రమార్గంలో భూమిని చుట్టేసేందుకు సాహస యాత్రకు బయల్దేరింది. ఈ యాత్రకు ‘సముద్ర ప్రదక్షిణ’ అని నామకరణం చేశారు. ఈ చరిత్రాత్మక పడవ యాత్రను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు.సాగరంలో సాహస యాత్రఈ యాత్రలో భాగంగా బృందం సముద్రంలో ఏకధాటిగా 26,000 నాటికల్ మైళ్లు పయనించనుంది. రెండుసార్లు భూమధ్యరేఖను దాట డంతో పాటు, అత్యంత ప్రమాదకరమైనవిగా పేరొందిన మూడు గ్రేట్ కేప్లైన కేప్ లీవిన్, కేప్ హార్న్, కేప్ ఆఫ్ గుడ్ హోప్లను ఈ బృందం చుట్టి రానుంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన దక్షిణ మహాసముద్రం, డ్రేక్ పాసేజ్ జలాల్లో వీరి ప్రయాణం సాగుతుంది. ఈ బృందం 2026 మే నెలలో తిరిగి ముంబై తీరానికి చేరుకుంటుందని అంచనా.మూడేళ్ల కఠోర శిక్షణలెఫ్టినెంట్ కల్నల్ అనూజ వరూద్కర్ నేతృత్వంలోని ఈ బృందంలో స్క్వాడ్రన్ లీడర్ శ్రద్ధా పి. రాజు, మేజర్ కరమ్జీత్ కౌర్, మేజర్ ఓమితా దాల్వి, కెప్టెన్ ప్రజక్తా పి నికమ్, కెప్టెన్ దౌలీ బుటోలా, లెఫ్టినెంట్ కమాండర్ ప్రియాంక గుసాయిన్, వింగ్ కమాండర్ విభా సింగ్, స్క్వాడ్రన్ లీడర్ అరువి జయదేవ్, స్క్వాడ్రన్ లీడర్ వైశాలి భండారీ ఉన్నారు. గత మూడేళ్లుగా ఈ బృందం కఠోర శిక్షణ పొందింది. శిక్షణ, సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ఏడాది ముంబై నుంచి సుదూర సీషెల్స్ వరకు సముద్రయాత్రను విజయవంతంగా పూర్తిచేసి తమ సన్నద్ధతను ఈ బృందం ఇప్పటికే చాటింది.ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీక: రక్షణ మంత్రిఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పుదుచ్చేరిలో దేశీయంగా నిర్మించిన 50 అడుగుల ఐఏఎస్వీ త్రివేణి నౌక ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పానికి ప్రతీక అని కొనియాడారు. ఈ నౌక ప్రయాణించే ప్రతీ నాటికల్ మైలు.. దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, స్వావలంబన దిశగా వేసే అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఐఎన్ఎస్ తారిణి నౌకపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూపాలను ఆయన అభినందించారు. ఇప్పుడు ‘త్రివేణి’ బృందం కూడా నౌకాయానంలో మరో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి, ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. -
నకిలీ పత్రంతో లబ్ధి పొందితేనే చీటింగ్
సాక్షి, న్యూఢిల్లీ: మోసం (చీటింగ్) కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. నకిలీ (ఫోర్జరీ) పత్రాలను సమర్పించినప్పటికీ, కేవలం ఆ పత్రాల వల్లే ఎదుటి వ్యక్తి మోసపోయి, దానిద్వారా నిందితుడు ఏదైనా భౌతిక ప్రయోజనం పొందితేనే ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఫోర్జరీ పత్రానికి, పొందిన ప్రయోజనానికి మధ్య ప్రత్యక్ష సంబంధం (ప్రేరేపణ) లేనప్పుడు దానిని మోసంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. కళాశాల గుర్తింపు కోసం నకిలీ ఫైర్ ఎన్వోసీ సమర్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యాసంస్థ అధినేత జూపల్లి లక్ష్మీకాంతరెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేసింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.అసలు కేసు..: జూపల్లి లక్ష్మీకాంతరెడ్డి జె.వి.ఆర్.ఆర్.ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నంద్యాలలో కళాశాల నిర్వహిస్తున్నారు. కళాశాల గుర్తింపునకు ఆయన విద్యాశాఖకు నకిలీ ఫైర్ సేఫ్టీ ఎన్వోసీని సమర్పించారని జిల్లా ఫైర్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 420 కింద చార్జిషీట్ దాఖలు చేశారు. ఆయన ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక అంశాలను ప్రస్తావించింది. ‘చీటింగ్ నేరం రుజువు కావాలంటే కొన్ని ప్రధానమైన అంశాలు ఉండాలి.తప్పుడు పత్రం చూపి ఎదుటివారిని నమ్మించి, మోసపూరితంగా వారిని ప్రేరేపించి, వారినుంచి ఏదైనా ఆస్తిని పొందడం లేదా వారికి నష్టం కలిగించడం జరగాలి..’ అని జస్టిస్ నాగరత్న ధర్మాసనం పేర్కొంది. ‘నేషనల్ బిల్డింగ్ కోడ్–2016 ప్రకారం 15 మీటర్ల లోపు ఎత్తున్న విద్యాసంస్థల భవనాలకు ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ తప్పనిసరి కాదు. ఇదే విషయాన్ని గతంలో హైకోర్టు కూడా స్పష్టం చేసింది. చట్టప్రకారం అవసరం లేని ఒక పత్రాన్ని పిటిషనర్ నకిలీది సమర్పించినప్పటికీ, ఆ పత్రం ప్రేరణతో విద్యాశాఖ గుర్తింపు ఇవ్వలేదు.ఆ ఎన్వోసీ లేకపోయినా ఆయనకు చట్టప్రకారమే గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ పిటిషనర్కు అక్రమ లాభం గానీ, విద్యాశాఖకు నష్టం గానీ జరగలేదు. తప్పుడు పత్రానికి, పొందిన ప్రయోజనానికి మధ్య బలమైన సంబంధం లేనప్పుడు, చీటింగ్ నేరానికి అవసరమైన కీలకమైన అంశం సంతృప్తి చెందనట్లే..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మోసపూరిత ఉద్దేశం లేనందున ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్లు 468, 471 కూడా వర్తించవని చెబుతూ పిటిషనర్పై కేసును ధర్మాసనం కొట్టేసింది. -
మారిషస్కు రూ.6,004 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
వారణాసి: మారిషస్కు 680 మిలియన్ డాలర్ల(రూ.6,004 కోట్లు) ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధానమంత్రి నవీన్చంద్ర రామ్గూలామ్ గురువారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో సమావేశమయ్యారు. భారత్– మారిషస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వి ద్య, ఇంధనం, హైడ్రోగ్రఫీ, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా రెండు దేశాల మధ్య ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్, మారిషస్లు కేవలం భాగస్వామ్య పక్షాలు మా త్రమే కాదని.. అవి ఒకే కుటుంబమని నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన, స్థిరమైన, సౌభాగ్యవంతమైన హిందూ మహాసముద్రం ఇరుదేశాలకు ఉమ్మడి ప్రాధాన్యం కలిగిన అంశమని వివరించారు. నవీన్చంద్రతో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రతను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. మారిషస్లో యూపీఐ చెల్లింపులు, రూపేకార్డులు అందుబాటులోకి వచ్చాయని, ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం స్థానిక కరెన్సీల్లోనే జరి గేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మారిషస్లో ‘మిషన్ కర్మయోగి’ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద మారిషస్లో 10 ప్రాజెక్టులకు భారత్ సాయం అందించబోతోంది. ఇందులో ఓడరేవు, ఎయిర్పోర్టు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఇది ఆర్థిక సాయం కాదని.. రెండు దేశాల ఉమ్మడి భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్, మారిషస్లు రెండు వేర్వేరు దేశాలు అయినప్పటికీ వాటి స్వప్నాలు, భవిష్యత్తు ఒక్కటేనని స్పష్టంచేశారు. చాగోస్ ఒప్పందం కుదిరినందుకు నవీన్ చంద్రతోపాటు మారిషస్ ప్రజలకు మోదీ అభినందనలు తెలిపారు. మారిషస్ సార్వభౌమత్వానికి ఇదొక చరిత్రాత్మక విజయమని ఉద్ఘాటించారు. మారిషస్కు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. మారిషస్ సార్వ¿ౌమత్వాన్ని పూర్తిస్థాయిలో గుర్తించడానికి తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని తెలిపారు. మారిషస్లో నూతన డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. మారిషస్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి త్వరలో ‘మిషన్ కర్మయోగి’ప్రారంభిస్తామన్నారు. పరిశోధన, విద్య, నవీన ఆవిష్కరణల్లో భారత్, మారిషస్ల భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయమని స్పష్టంచేశారు. చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించేందుకు ఈ ఏడాది మే నెలలో యునైటెడ్ కింగ్డమ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ దీవులపై హక్కులను యూకే వదులుకుంది. ఇదిలా ఉండగా, మారిషస్ ప్రధానమంత్రి నవీన్చంద్ర ఈ నెల 16 దాకా భారత్లో పర్యటించనున్నారు. -
నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా నూతనంగా ఎన్నికైన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్(67) శుక్రవారం 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరుగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారు. ఇండియా కూటమి నేతలకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహా్వన లేఖలు పంపినట్లుగా తెలిసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కారణంగా సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయగా, దానిని రాష్ట్రపతి ఆమోదించారు. -
పండ్లు, పూలు.. ఫైను.. జైలు!
డిక్లరేషన్స్ ఇవ్వకుండా.. కొప్పులో మల్లెపూలు పెట్టుకున్నందుకు మెల్బోర్న్ విమానాశ్రయ ఇమిగ్రేషన్స్ అధికారులు నవ్య నాయర్ అనే మలయాళ నటికి రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఈమెకు ఎదురైన చేదు అనుభవం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అవును, విదేశాల్లో ఇలాంటి చిత్రవిచిత్రమైన నిషేధాలు చాలా ఉన్నాయి.ప్రయాణం అంటేనే వెంట తీసుకెళ్లే వస్తువులతో బ్యాగులు నిండాల్సిందే. మౌత్ ఫ్రెషనర్, పెర్ఫ్యూమ్ వంటి రోజూ వాడే వస్తువులు అయినా.. బంధువులు, స్నేహితులకు ఇచ్చే పిండివంటలు, బహుమతులైనా.. బాధ్యత, ప్రేమతో సూట్కేస్ బరువెక్కాల్సిందే. మనతోని అట్లుంటది మరి. మన దేశంలో అయితే ఫర్వాలేదు. పరాయి దేశం వెళితేనే సమస్య. ఎందుకంటే మనదగ్గరిలా ఏదిపడితే అది విదేశాలకు తీసుకెళతామంటే అక్కడి నిబంధనలు ఒప్పుకోవు. ఆస్ట్రేలియాలో ఇటీవలే జరిగిన నటి నవ్య నాయర్ ఘటనే ఇందుకు ఉదాహరణ. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ విమానాశ్రయంలో 2002లో జరిగిన సంఘటన సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, హర్భజన్స్ సింగ్ చెరి 200 న్యూజిలాండ్ డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. వాళ్లు బ్యాగుల్లో తీసుకొచ్చిన బూట్లకు మట్టి, గడ్డి ఉండడమే ఇందుకు కారణం. వేడి చేయని పాలను కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లకూడదు. గ్రీసులోని ప్రాచీన పర్యాటక ప్రదేశాలకు హైహీల్స్తో వెళ్లడం నిషిద్ధం. ఇలాంటివి మరికొన్ని..ఆస్ట్రేలియా: బయో సెక్యూరిటీ, కస్టమ్ చట్టాల ప్రకారం తాజా పూలు, పండ్లు, కూరగాయలు, మట్టిని తీసుకెళ్లడానికి వీల్లేదు. ఎందుకంటే ఇబ్బడిముబ్బడిగా వీటిని నాటితే అక్కడి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందన్నది వారి వాదన. సోన్పాపిడి, మైసూర్ పాక్ వంటి స్వీట్లు, మసాలా దినుసులు, పాల ఉత్పత్తులు కూడా నిషేధమే. ఈ జాబితాలో ఇంకా చాలా ఉన్నాయి.ఆగ్నేయాసియా: ఘాటైన వాసన వచ్చే డ్యూరియన్స్ (పనసలాంటి) పండును ప్రయాణంలో తీసుకెళ్లడాన్ని చాలా విమానయాన సంస్థలు నిషేధించాయి. ముఖ్యంగా కోసిన పండును తీసుకెళ్లరాదు. దీన్ని భారత్కు తీసుకురావాలంటే సరైన పద్ధతిలో ప్యాక్ చేయాలి. సింగపూర్లో చూయింగ్ గమ్ అమ్మకం, దిగుమతి నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో గమ్స్ను ఉమ్మితే భారీ జరిమానా విధిస్తారు. మెడికల్ గమ్స్ను మాత్రమే అనుమతిస్తారు.దక్షిణ కొరియా: అమెరికాకు చెందిన ట్రేడర్ జో కంపెనీ తయారీ ‘ఎవిరీథింగ్ బట్ ది బేగల్ సీజనింగ్’ బ్రాండ్ మసాలాలను విమాన ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ మసాలాల్లో గసగసాలు ఉండడమే ఇందుకు కారణం. ఆ దేశం గసగసాలను మాదక ద్రవ్యాలుగా పరిగణిస్తుందట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, సింగపూర్లలోనూ గసగసాలపై బ్యాన్ ఉంది. కరేబియన్స్ దీవులు: సైనికులు ధరించే దుస్తుల (క్యామఫ్లాజ్) వంటివి సాధారణ పౌరులు వేసుకోవడం చట్టవిరుద్ధం. సైన్యం మాత్రమే ధరించాలి. సైనికులుగా పొరపడే ప్రమాదం ఉంది కాబట్టి సాధారణ వ్యక్తులు ఈ దుస్తులతో విమానాశ్రయాల్లో కూడా కనిపించకూడదు. అలా చేస్తే జరిమానా వేస్తారు లేదా జైలుకు పంపుతారు. యూఎస్: ప్రపంచవ్యాప్తంగా పిల్లలు అమితంగా ఇష్టపడే కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్ (కిండర్జాయ్)ను విమానంలో తీసుకురావడం నిషేధం. గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల్లో తినడానికి వీలుకాని వస్తువులను ఉంచకూడదు.న్యూజిలాండ్: పచ్చళ్లు, మాంసం, విత్తనాలు, విదేశీ మట్టి నిషేధం. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా సరిహద్దు నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఇటలీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లిప్–ఫ్లాప్స్ లేదా శబ్దం వచ్చే బూట్లు వేసుకోకూడదన్న నిబంధన ఉంది. శబ్దం వస్తే స్థానికులకు చికాకు కలుగుతుందట.కెనడా: ఈ దేశంలో బేబీ వాకర్ నిషేధం. పిల్లలకు ఇందులో గాయాలవుతున్నాయని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కెనడా వీటిని తమ దేశంలో నిషేధించింది.ఉత్తర కొరియా : ఎంతో ఇష్టమని ఈ దేశానికి బ్లూజీన్స్తో వెళ్లేరు.. ఫైన్ కట్టాలి లేదా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. పాశ్చాత్య సంస్కృతికి ఇవి చిహ్నమని, ఇవి తమ సంస్కృతిని పాడుచేస్తాయని వీటిపై బ్యాన్ విధించారట. -
రాజ్యాంగానికి కాపలాదారులం
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి తాము కాపలాదారులమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. గవర్నర్లు విధులు నిర్వర్తించడంలో విఫలమైతే తాము నిశ్శబ్దంగా చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించింది. పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేసే విషయంలో రాష్ట్రపతి/గవర్నర్లకు గడువు నిర్దేశించే అధికారం న్యాయస్థానాలకు ఉందా? అనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ వ్యవహారంపై 10 రోజులపాటు కొనసాగిన విచారణ గురువారం ముగిసింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పార్లమెంట్ లేదా శాసనసభల నుంచి వచ్చిన బిల్లులపై రాష్ట్రపతి/గవర్నర్లు మూడు నెలల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందేహాలు లేవనెత్తారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి/గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. కోర్టును ప్రశ్నించడానికి ఆర్టికల్ 143(1) కింద తనకున్న అధికారాలను వాడుకున్నారు. సుప్రీంకోర్టుకు మొత్తం 14 ప్రశ్నలు సంధించారు. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాజ్యాంగంలోని ఆరి్టకల్ 200, 201 కింద రాష్ట్రపతి/గవర్నర్లకు ఉన్న అధికారాలపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రిఫరెన్స్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 19వ తేదీన ప్రత్యేక విచారణ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సీనియర్ లాయర్లు వాదించారు. వ్యతిరేకించిన విపక్ష పాలిత రాష్ట్రాలు రాష్ట్రపతి రిఫరెన్స్ను విపక్ష పాలిత తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులపై రాష్ట్రపతి/గవర్నర్లు నిర్ణీత గడువులోగా సమ్మతి తెలియజేయడమో లేక వెనక్కి పంపించడమో జరగాల్సిందేనని పేర్కొన్నాయి. బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరైంది కాదని స్పష్టంచేశాయి. రాష్ట్రపతి రిఫరెన్స్ను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరాయి. కానీ, రాష్ట్రపతి అభ్యంతరాలను బీజేపీ పాలిత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, గోవా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సమరి్థంచాయి. కేరళ, తమిళనాడు ప్రభుత్వాల తరఫున కె.కె.వేణుగోపాల్, కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. రాష్ట్రపతి అభ్యంతరాలను వ్యతిరేకించారు. ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. గడువు నిర్దేశించే అధికారం కోర్టులకు ఉందని తేల్చిచెప్పారు. ఆ అధికారం కోర్టులకు లేదు: తుషార్ మెహతా రాజ్యాంగం ప్రకారం.. వేర్వేరు వ్యవస్థలకు వేర్వేరు ప్రత్యేక అధికారాలు ఉంటాయని తుషార్ మెహతా గురువారం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రపతి/గవర్నర్లకు రాజ్యాంగం ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని, రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో అదొక భాగమని స్పష్టంచేశారు. గవర్నర్ల విచక్షణాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు. వారికి టైమ్లైన్ విధించే అధికారం కోర్టులకు లేదని స్పష్టంచేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్ స్పందించారు. ‘‘రాజ్యాంగానికి మేము కాపలాదారులం. రాజ్యాంగం ప్రకారం వేర్వేరు వ్యవస్థలకు వేర్వేరు అధికారాలు ఉంటాయన్న విషయం నిజమే. న్యాయ వ్యవస్థ కూడా తనకున్న అధికారాలతో చురుగ్గా వ్యవహరిస్తోంది. అదేసమయంలో జ్యుడీíÙయల్ టెర్రరిజం, అడ్వెంచరిజం ఉండాలని మేము చెప్పడం లేదు. కానీ, ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ సక్రమంగా విధులు నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ కాపలాదార్లు ని్రష్కియాత్మకంగా ఉండిపోవాలా? అధికారాలు ఉపయోగించుకోకుండా చూస్తూ కూర్చోవాలా?’’అని ప్రశ్నించారు. దీనిపై తుషార్ మెహతా బదులిచ్చారు. కేవలం కోర్టులే కాకుండా శాసన(లెజిస్లేచర్), కార్యనిర్వాహక వర్గం(ఎగ్జిక్యూటివ్) కూడా ప్రజల ప్రాథమిక హక్కులకు కాపలాదారులేనని స్పష్టంచేశారు. ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాణాన్ని ఉల్లంఘించేలా ఎవరూ వ్యవరించకూడదని చెప్పారు. మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్ నడుచుకోవాలన్న వాదనను తుషార్ మెహతా ఖండించారు. భారతదేశంలో తాము అంతర్భాగం కాదంటూ ఏదైనా ఒక రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఆమోదిస్తే దానికి కూడా గవర్నర్ సమ్మతి తెలియజేయాలా? అని ప్రశ్నించారు. అలాంటి సందర్భాల్లో బిల్లును పెండింగ్లో పెట్టడం తప్ప గవర్నర్కు మరో మార్గం ఉండదన్నారు. -
బాల్యమూ.. భారమే!
పిల్లల్లో ఊబకాయ సమస్య ప్రపంచానికి పెద్ద ఆరోగ్య సంక్షోభంలా పరిణమించబోతోందని యునిసెఫ్ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా బాలల్లో 10 శాతం మంది ఊబకాయంతో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి పది మంది పిల్లల్లో ఒకరికి ఊబకాయం ఉంటోందని పేర్కొంది. సాంప్రదాయ ఆహారాలు, ఇతర పోషక పదార్థాలకు బదులుగా పిల్లలు అధిక కేలరీలున్న, ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడటమే ఇందుకు కారణం అని చెబుతూ, ఈ అలవాట్లు పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్యాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.‘తగినంత ఆహారం లేక గతంలో పిల్లలు తరచూ బరువు తక్కువగా ఉండేవారు. అది వారి శారీరక పెరుగుదలను కుంగదీయడమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకూ దారితీసింది. అయితే, తాజా పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జంక్ఫుడ్ను తినకుండా ఉండలేక పిల్లలు బరువెక్కుతున్నారు’ అని యునిసెఫ్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. ఇదీ పోషకాహార లోపమే!నేటి పిల్లల్లో ఊబకాయం అన్నది, మునుపటి దశాబ్దాల నాటి పోషకాహార లోపం కంటే వేగంగా పెరుగుతోందని, ఊబకాయం ఉన్న పిల్లల సంఖ్య.. బరువు తక్కువగా ఉన్నవారిని మించిపోయిందని నివేదిక తెలిపింది. బాల్యంలోని ఈ ఊబకాయం ఇప్పుడు పోషకాహార ‘లోపానికి’ వేరొక రూపంగా భావించవచ్చని పేర్కొంది.యునిసెఫ్, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 18 కోట్ల 80 లక్షల మంది పిల్లలు ఊబకాయుల కేటగిరీలో ఉన్నారు! ఈ వయసులో బరువు తక్కువగా ఉన్న పిల్లల శాతం 2000లో 13 నుంచి నేడు 9.2 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఊబకాయం 3 శాతం నుంచి 9.4 శాతానికి పెరిగింది.ఎక్కడ ఎక్కువగా ఉన్నారు?యునిసెఫ్ నివేదిక ప్రకారం పసిఫిక్ దీవులలోని పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా ఉంది. దీవి దేశాలైన నియులో 38 శాతం, కుక్ దీవులలో 37 శాతం, నౌరు దీవులలో 33 శాతం బాల ఊబకాయులు ఉన్నారు. ప్రపంచంలో మొత్తం బాల్య, కౌమార దశల్లో ఉన్న వారిలో 42.7 కోట్ల మంది అధిక బరువు సమస్యతో ఉంటే వారిలో.. దాదాపు సగం మంది తూర్పు ఆసియా, పసిఫిక్, లాటిన్ అమెరికా, కరీబియన్, దక్షిణాసియాలలోనే ఉన్నారు.అలవాటుగా అధిక ఆహారంప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో కనిపిస్తున్న ఈ ఊబకాయానికి ప్రధాన కారణం.. చవకైన, మితిమీరి ప్రాసెస్ చేసిన, దిగుమతి చేసుకుంటున్న అధిక కేలరీల ఆహార పదార్థాల వినియోగం పెరగడమేనని నివేదిక గుర్తించింది. సాంప్రదాయ ఆహారాలు, ఇతర పోషక పదార్థాలకు బదులుగా పిల్లలు అధిక కేలరీలున్న, ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని తెలిపింది. అల్ట్రా–ప్రాసెస్డ్ ఆహారంలో ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వు వంటివి చిన్నారుల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయని పేర్కొంది.పేద దేశాల్లోనూ ఊబకాయంసాధారణంగా అధిక ఆదాయ దేశాలలో పిల్లలు ఊబకాయంతో ఉంటారని ఒకప్పుడు భావించేవారు. అయితే, యునిసెఫ్ తాజా నివేదిక ఈ భావనను పటాపంచలు చేసింది. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో చిలీలో 27 శాతం మంది, యూఎస్ఏ, యూఏఈలలో 21 శాతం మంది ఊబకాయంతో ఉండటాన్ని బట్టి పిల్లల్లోని ఈ ఊబకాయం దిగువ, మధ్య ఆదాయ దేశాలకే పరిమితం కాలేదని నివేదిక గుర్తించింది.ప్రకటనలు ప్రేరేపిస్తున్నాయిపిల్లల్లో ఊబకాయం పెరగడంలో వ్యాపార ప్రకటనలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది. తాజా సర్వేలో, గతవారం 13 నుంచి 24 సంవత్సరాల వయసు గల 75 శాతం మంది పిల్లలు, యువకులు జంక్ ఫుడ్ ప్రకటనలను చూసినట్లు వెల్లడైంది. వారిలో 60 శాతం మంది ఈ ప్రకటనలు చూశాక తమలో వాటిని తినాలన్న కోరిక కలిగిందని తెలిపారు. ఘర్షణలు, యుద్ధ వాతావరణం ఉండే ప్రాంతాల్లోనూ 68 శాతం యువత ఇప్పటికీ అలాంటి మార్కెటింగ్ వ్యూహాలకు ప్రభావితం అవుతున్నట్లు నివేదిక పేర్కొంది.ఆర్థిక ముప్పు!ఈ ఊబకాయం ముప్పును తప్పించటానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యునిసెఫ్ హెచ్చరించింది. 2035 నాటికి, ఊబకాయం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే భారం రూ.353 లక్షల కోట్లకు చేరుతుందని యునిసెఫ్ అంచనా వేసింది. పర్యవసానంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, ఉత్పాదక రంగం అన్నీ దెబ్బతింటాయని హెచ్చరించింది. -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్లోని శంకర్పూర్కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
ట్రాన్స్జెండర్ల గొప్ప మనసు.. పంజాబ్ వరద బాధితులకు భారీ విరాళం
ఆగ్రా: సామాజిక సేవకు లింగ భేదం అడ్డుకాదని మరోసారి నిరూపించే సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో ట్రాన్స్జెండర్లు తమ ఉదారతను చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ సహాయాన్ని సమీకరించేందుకు ఆగ్రాలోని ట్రాన్స్జెండర్ సంఘాలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి.మనదేశంలో కష్టాల్లో ఎవరున్నా సరే మానవత్వం చూపించాల నినాదంతో తమ ఆదాయంతో పాటు దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ మొత్తంగా వచ్చిన మొత్తాన్ని పంజాబ్కు పంపించారు. आगरा में किन्नरों ने 25 लाख रुपए इकट्ठा करके बाढ़ पीड़ितों को मदद भिजवाई है pic.twitter.com/rEPuXEw5uQ— Birendra Kumar Yadav (@BirendraYdvSP) September 11, 2025 ఆగ్రాలోని ఫతేహాబాద్ రోడ్డులో 'ఆల్ ఇండియా కిన్నార్ సమాజ్ కాన్ఫరెన్స్' జరుగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు పది వేల మంది ట్రాన్స్జెండర్ల ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించింది. ఇతర ట్రాన్స్జెండర్ల నుంచి నుండి వచ్చిన విరాళాలు 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పంజాబ్ వరద బాధితుల కోసం డబ్బును విరాళంగా ఇచ్చిన తర్వాత బిడ్లు వేసింది. కొందరు రూ.50,000 విరాళంగా ఇవ్వగా ..మరికొందరు రూ.లక్ష వరకు విరాళం ఇచ్చారు. అత్యధిక విరాళం గోరఖ్పూర్ నుండి వచ్చింది. -
భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. రేపే ప్రమాణస్వీకారం
ఢిల్లీ: ఇటీవల జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం (సెప్టెంబర్ 12) ఉదయం 9.30గంటలకు సీపీ రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది.ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో జరిగిన పోలింగ్లో బ్యాటెట్ పత్రాలనే ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండటం వల్ల ఈవీఎంలను వాడలేదు. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 కాగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగుకు దూరంగా బీఆర్ఎస్ (4రాజ్యసభ), బీజేడీ(7), శిరోమణి అకాలీదల్(3) దూరంగా ఉన్నాయి. దాంతో 767 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు !మాత్రమే ఉంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగ్గా, అటు తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. -
దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని బోధనలో ఒకరిని అరెస్ట్ చేశారు. పాక్ హ్యాండ్లర్లతో కలసి టెర్రరిస్టులు దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయినవారిలో కెమికల్ బాంబుల తయారీ ఎక్స్పర్ట్ డానిష్ ఉన్నాడు. భారీ టెర్రర్ మాడ్యుల్ను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు.దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టెర్రరిస్టుల నుంచి భారీగా తుపాకీలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.ముంబైకి చెందిన అఫ్తాబ్, అబు సుఫియాన్లను ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. ఆషర్ డానిష్ను రాంచీలో, కమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో, హుజైఫ్ యెమెన్ను తెలంగాణలో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్లోని తమ హ్యాండ్లర్లతో సోషల్ మీడియా ద్వారా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. #WATCH | Delhi Police Special Cell busted a Pan-India terror module and arrested five terrorists identified as Ashhar Danish, Sufiyan Abubakar Khan, Aaftab Ansari, Huzaifa Yaman and Kamran Qureshi A large quantity of materials and precursors for making IED have been seized from… https://t.co/uAcHkQ8r58 pic.twitter.com/zoCOqCkCJK— ANI (@ANI) September 11, 2025 -
రాజకీయంగా నన్ను టార్గెట్ చేసి.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
ఇథనాల్ కలిపిన ఇ20 పెట్రోల్కు వ్యతిరేకంగా సోషల్మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకునే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. E20 ఫ్యూయల్ విషయంలో ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం నడుస్తోంది. E20 ఫ్యూయల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని.. ఇంజిన్కు నష్టం కలుగుతుందని పోస్టులు కనిపిస్తున్నాయి. పాత వాహనాలకూ ఇది అనుకూలం కాదు అంటూ గడ్కరీ ఆలోచనను తప్పుబడుతూ విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రచారంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM ) వార్షిక సమావేశంలో గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారం వెనుక పెట్రోల్ లాబీ ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాతావరణానికి కలుగుతున్న హానిని తగ్గించడంలో E20 ఫ్యూయల్ కీలక పాత్ర పోషిస్తుంది. SIAM, భారత ఆటోమొబైల్ పరిశోధనా సంఘం(ARAI) లాంటి సంస్థలు E20 ఫ్యూయల్ను సురక్షితమైన, సమర్థవంతమైనదిగా పేర్కొన్నాయి. మైలేజ్ తగ్గుదల అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. పైగా సుప్రీం కోర్టు కూడా E20 ఫ్యూయల్పై దాఖలైన PILను తిరస్కరించింది.. సోషల్ మీడియాలో నన్ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకునే ప్రచారం జరిగింది. అది చెల్లించిన ప్రచారం(పెయిడ్ క్యాంపెయిన్). అందుకే నేను దానికి ప్రాధాన్యం ఇవ్వను. పెట్రోల్ లాబీ చాలా ధనికం. అది ఎంతో శక్తివంతంగా ఉంది. వాళ్లే ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తు ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారాయన.E20 ఫ్యూయల్ అనేది 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఇంధనం. ఇథనాల్ అనేది.. జొన్న, బియ్యం, పంచదార వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది. ఇది పర్యావరణ హితమైంది. దేశీయంగా తయారయ్యే, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ ఇంధనం. అందుకే గడ్కరీ దీనిని ప్రమోట్ చేస్తున్నారు. E20 ఫ్యూయల్ లక్ష్యం ఏంటంటే.. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. రూ. 22 లక్షల కోట్ల విలువైన ఫాసిల్ ఫ్యూయల్ దిగుమతులను తగ్గించడం అలాగే.. రైతులకు ఆదాయం పెంచడం (ఇథనాల్ తయారీ ద్వారా ₹45,000 కోట్ల లాభం వచ్చినట్లు గడ్కరీ పేర్కొన్నారు). అయితే.. గడ్కరీ ఓ క్లియర్ విజన్తో ముందుకు వెళ్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బయోఫ్యూయల్స్, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ల ఆలోచనతో పాటు పాత వాహనాలను స్క్రాప్ చేయడం ద్వారా రేర్ ఎర్త్ మెటల్స్ పొందడం.. తద్వారా ఈ తరహా ఆలోచనలతో భారత ఆటో పరిశ్రమను ప్రపంచంలో #1 స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారు. -
పాట్నాలో ఆర్జేడీ నేత దారుణ హత్య
పట్నాలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత దారుణ హత్య గురయ్యారు. రాజ్కుమార్ రాయ్ను దుండగులు కాల్చి చంపారు. బుధవారం రాత్రి పాట్నాలోని చిత్రగుప్త్ ప్రాంతంలోని మున్నాచక్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఎన్నికల వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్కుమార్ రాయ్.. రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.భూ వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాయ్ భూమి కొనుగోలు, అమ్మకాల్లో వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
బాబోయ్.. ఎయిరిండియా విమానాల్లో ఉక్కపోత!
దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు. ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. రెండుగంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ప్రయాణికులకు కలిగిన అంతరాయంపై ఎయిరిండియా ప్రకటన చేసినా.. చేయకపోయినా.. అది ఏసీ వల్లే అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చేసింది. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.పీటీఐ కథనం ప్రకారం.. బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ రాత్రి 11గం. సమయంలో సింగపూర్కు బయల్దేరాల్సి ఉంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తిందని అనౌన్స్మెంట్ చేశారు. అయితే.. రెండు గంటలు గడిచినా మరమ్మత్తులు కాలేదు. ఆపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రయాణికులను సిబ్బంది కిందకు దించేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఏసీ పని చేయకపోవడంతో ప్యాసింజర్లు మ్యాగజైన్లు, న్యూస్పేపర్లతో విసురుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఎయిరిండియా విమానాల్లో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకున్నాయి. Now after suffering without AC for around 2 hrs, passengers of Delhi-Singapore @airindia flight being deplaned suspecting a technical glitch. Pathetic service @airindia @DGCAIndia @moneycontrolcom https://t.co/omaceiKZ41 pic.twitter.com/MOccbgH4JT— Ashish Mishra (@AshishM1885) September 10, 2025ఢిల్లీ–సింగపూర్ విమానం (AI2380) – సెప్టెంబర్ 10, 2025(తాజా ఘటన)బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానంలో విద్యుత్ సరఫరాలో లోపంతో పని చేయని ఏసీలు!200 మందికి పైగా ప్రయాణికులు రెండు గంటల పాటు ఎదురు చూశాక.. చివరికి విమానం నుంచి దిగమన్నారుఢిల్లీ–పాట్నా విమానం – మే 19, 2025తీవ్ర వేడిలో AC పనిచేయకపోవడంతో ప్రయాణికులు పేపర్లు, మ్యాగజైన్లు ఉపయోగించి గాలి తీసుకునే ప్రయత్నంరిషి మిశ్రా అనే నేత ఓ వీడియో షేర్ చేసి విమానయాన మంత్రిత్వ శాఖను ప్రశ్నించారుఅహ్మదాబాద్–లండన్ విమానం (AI171) – జూన్ 12, 2025ఈ విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే.. విమానం క్రాష్కి ముందు ప్రయాణికులు AC పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారుTV స్క్రీన్లు, లైట్లు, సిబ్బందిని పిలిచే crew call buttons కూడా పనిచేయలేదని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ఎయిర్ ఇండియా CEO ఏమన్నారంటే..వరుసగా ఈ తరహా ఘటనలు జరగడంపై కాంప్బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందిస్తూ.. ఎయిరిండియాకు ఉన్న విమానాల సంఖ్య, సిబ్బంది, సంస్థ పరిమాణాన్ని బట్టి చూస్తే.. ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణమే. అయినప్పటికీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. -
ఫ్రిడ్జ్లో పసికందును పెట్టి నిద్రపోయిన తల్లి!
పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis).. ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో కనిపించే తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. ఇది చాలా అరుదైనది అయినప్పటికీ.. తల్లి, బిడ్డకు.. ఒక్కోసారి ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితిగా మారొచ్చు. దీని బారినపడే ఓ తల్లి తన చంటిబిడ్డను ఫ్రిడ్జ్లో పెట్టి ఏం ఎరుగనట్లు నిద్రపోయింది. ఉత్తరప్రదేశ్ మోరాదాబాద్లో అదృష్టం కొద్దీ ఓ చంటిబిడ్డ ఫ్రిడ్జ్ నుంచి ప్రాణాలతో బయటపడింది. స్థానికంగా ఉండే 23 ఏళ్ల యువతి 15 రోజుల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం రాత్రి తన బిడ్డను ఫ్రిడ్జ్లో ఉంచి పడుకునిపోయింది. కాసేపటికి పిల్లాడి ఏడ్పు వినిపించడంతో అమ్మమ్మ అప్రమత్తమైంది. వెంటనే ఫ్రిడ్జి తెరిచి.. బిడ్డను తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తింది. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకలా చేశావ్? అని అడిగితే.. బిడ్డ పడుకోవట్లేదని అలా చేశానని ఆమె అమాయకంగా బదులిచ్చింది!!.ఏమిటీ పోస్ట్పార్టమ్ సైకోసిక్.. సాధారణంగా ప్రసవానంతర మాంద్యం (Postpartum Depression) కంటే ఇది పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) తీవ్రమైంది. లేనివాటిని చూడడం, వినడం(Hallucinations).. మానసిక కల్లోలం అంటే ఉన్నట్లుండి డిప్రెషన్లోకి వెళ్లిపోవడం, తీవ్రమైన గందరగోళం, అనుమానాలు(పారనోయా), నిద్రలేమి, తనకు తాను హాని చేసుకునే ప్రయత్నం.. చివరకు.. బిడ్డకు హాని కలిగించే ఆలోచనలూ కలగొచ్చు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు వేగంగా తగ్గడం(హార్మోన్ల మార్పులు), బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా (జన్యు ప్రభావం) శారీరకంగా.. భావోద్వేగంగా అలసిపోవడం, ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లేకపోవడంతో ఈ మానసిక సమస్యకు గురయ్యే చాన్స్ ఉంది. మొదటిసారి తల్లి అవడం, గతంలో ఇలాంటి సమస్యలు ఉండడం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి కూడా ఈ పరిస్థితికి దారి తీసే అవకాశం లేకపోలేదు.మోరాదాబాద్ ఘటనలో మహిళకు పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) మానసిక సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు తెలిపారు. డాక్టర్ మేఘనా గుప్తా ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఇలాంటి మానసిక సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ అవి తీవ్రమైనవి. మహిళలు ప్రసవం తర్వాత భావోద్వేగంగా అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబం నుంచి మద్దతు లేకపోతే, ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి అని అంటున్నారామె. ఇదిలా ఉంటే.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ‘‘చెడు శక్తుల ప్రభావం’’తోనే ఆమె అలా చేసి ఉండొచ్చని భావించి తొలుత సంప్రదాయ పద్ధతులను ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో.. చివరకు వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం ఆమె కౌన్సెలింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.यूपी: 15 दिन का बच्चा रो रहा था तो उसे फ्रिज में रखकर गहरी नींद में सो गई मां, डॉक्टर ने बताई इस हरकत की असली वजहRead more: https://t.co/0tf6hNhY1F#UPNews #Moradabad #Mother #Baby #Fridge pic.twitter.com/xxsBj2kKoo— India TV (@indiatvnews) September 10, 2025 -
భార్యను హతమార్చి.. దృశ్యం సినిమా
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పలుచోట్ల వైవాహిక సంబంధాలు పక్కదారులు పట్టి అవహేళనకు గురవుతున్నాయి. భార్య, లేదంటే భర్త పరాయి మోజులో పడి హత్యలకు వెనుకాడడం లేదు. ఇలా కుటుంబాలు వీధిన కూడా పడుతున్నాయి. ఆరు నెలల గర్భిణి అయిన భార్యను హతమార్చిన లాయర్.. ప్రమాదంలో చనిపోయిందని ప్రచారం చేసుకున్నాడు. దృశ్యం సినిమాను తలపించే ఈ హత్యోదంతం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉగార్ బీకే గ్రామంలో చోటుచేసుకుంది. చైతాలి (23)ని ఆమె భర్త ప్రదీప్ (28) హత్య చేశాడు. కారు యాక్సిడెంట్ అని.. జిల్లా ఎస్పీ భీమాశంకర్ గుళేద్ తెలిపిన వివరాల మేరకు... 7వ తేదీ రాత్రి ప్రదీప్ కాగవాడ పోలీస్స్టేషన్కి ఫోన్ చేసి తమ కారుకు యాక్సిడెంట్ జరిగిందని, భార్య చైతాలి చావుబతుకుల మధ్య ఉందని, వెంటనే రావాలని, భార్యను కాగవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్తున్నానంటూ చెప్పాడు. పోలీసులు ఆ ఆస్పత్రికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేరు. ప్రదీప్కి ఫోన్ చేయగా తన భార్యను మహారాష్టలోని మీరజ్ ఆస్పత్రికి తీసుకువచ్చానని, అయితే చనిపోయిందని చెప్పాడు. అందరికీ అదే మాట చెప్పసాగాడు. అతని తీరు మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ప్రమాదస్థలికి వెళ్లి చూడగా ఎలాంటి ఘటన జరగలేదని తేలింది. ప్రియురాలి కోసమే దీంతో పోలీసులు ప్రదీప్, అతని మిత్రులు సద్దాం అక్బర్ ఇమాందార్, రాజన్ గణపతి కాంబ్లేను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కారు. ప్రదీప్, చైతాలిది ప్రేమ వివాహం. అయితే ప్రదీప్కి ఇటీవల మరో యువతితో çసంబంధం ఏర్పడింది. భార్య చైతాలిని అడ్డు తొలగించుకోవాలని కారులో తీసికెళ్లి తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు స్నేహితులు సహకరించారు. తరువాత మృతదేహాన్ని తరలించి యాక్సిడెంట్ అని ప్రచారం చేశారు. పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. -
క్రాస్ ఓటింగ్పై అంతర్గత విచారణ?
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుకున్నదానికంటే ఎన్డీఏ అభ్యర్థికి రాధాకృష్ణన్కు అధిక మెజారిటీ సాధించడం వెనుక క్రాస్ ఓటింగ్ దాగిఉందన్న వాదన మరింత పెరిగింది. సొంత ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయకుండా రాధాకృష్ణన్ వైపు కొందరు విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల ఎంపీలు మొగ్గుచూపారని వార్తలు ఎక్కువయ్యాయి. ఇండియా కూటమి పక్షాల ఎంపీలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై అంతర్గత విచారణ చేయించాలని కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బిహార్ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ అంశం పార్టీల ఐక్యతకు ప్రశి్నస్తోంది. దీంతో ఐక్యత పెద్ద సవాల్గా మారుతున్న నేపథ్యంలో కూటమిలోని లోటుపాట్లను గుర్తించి, వాటిని వీలైనంత త్వరగా సవరించుకోవాలనే అభిప్రాయంతో విపక్షపార్టీలు ముందుకెళ్తున్నట్లు సమాచారం. మంగళవారం వెల్లడైన ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో సుమారు 20 ఓట్లు రాధాకృష్ణన్కు పడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డికి 324 ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఆయనకు కేవలం 300 ఓట్లు పడ్డాయి. రాధాకృష్ణన్ గరిష్టంగా 436 ఓట్లు సాధించవచ్చని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన 452 ఓట్లు సాధించారు. మరింత స్పష్టమైన మెజారిటీ ఒడిసిపట్టారు. పోలింగ్ పూర్తయిన వెంటనే తమ అనుకూల ఓట్లపై ఓ అంచనాకు వచి్చన కాంగ్రెస్ సైతం తమకు అనుకూలంగా 315 ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు ఇక్కడే క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతో పాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. భారీ క్రాస్ ఓటింగ్ దృష్ట్యా ఈ అంశంపై కచ్చితంగా విచారణ జరగాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. దీనిని తీవ్రమైన విశ్వాస ఉల్లంఘనగానే పరిగణించాలని, ఇది విపక్షాల అంతర్గత ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తివారీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు సైతం ఈ విషయంపై విచారణ కోరుకుంటున్నారని ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి రావాల్సిన 12 ఓట్లలో కనీసంగా 3 ఓట్లు, తమిళనాట డీఎంకే నుంచి రావాల్సిన 32 ఓట్లలో కనీసంగా 4 ఓట్లు, ఆర్జేడీ నుంచి రెండు ఓట్లు, శివసేన(ఉద్ధవ్) పార్టీ నుంచి కొన్ని ఓట్లు క్రాసింగ్ జరిగినట్లు అంచనాలు వేస్తున్నారు. మాకు సంబంధం లేదన్న పార్టీలుఅయితే క్రాస్ ఓటింగ్ వివాదంపై విపక్ష పార్టీల వాదన భిన్నంగా ఉంది. తమ సభ్యులెవరూ రాధాకృష్ణన్కు ఓటేయలేదని కాంగ్రెస్ మిత్రపక్షాలు కరాఖండీగా చెప్పాయి. దీనిపై ఇప్పటికే ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ పార్టీలు తమ ఎంపీలు క్రాస్ ఓటింగ్కు పాల్పడలేదని ప్రకటనలు సైతం ఇచ్చాయి. ఇక కాంగ్రెస్ సైతం తమ ఓట్లు నూటికి నూరు శాతం కూటమి అభ్యర్థికే బలంగా పడ్డాయని చెబుతున్నాయి. అయితే బిహార్, తమిళనాడు, పశి్చమబెంగాల్ ఎన్నికల దృష్ట్యా కూటమిలో ఐక్యత కొనసాగి ఎన్నికల్లో పోరాడాలంటే క్రాస్ ఓటింగ్పై విచారణ జరపాలని కాంగ్రెస్ నేతల నుంచి డిమాండ్ వస్తోంది. ఇదే సమయంలో విపక్షాల అభ్యర్థికి 40 శాతం ఓట్ల వాటాను ‘నైతిక విజయం‘గా కాంగ్రెస్ నాయకులు అభివరి్ణస్తున్నారు. 2022 ఎన్డీఏకు చెందిన జగదీప్ ధన్ఖడ్పై పోటి చేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు వచి్చన ఓట్లతో పోలిస్తే ఈసారి తమకుæ దాదాపు 14 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఇక వీటిని తిప్పికొడుతున్న బీజేపీ 15 మంది ప్రతిపక్ష ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారని, మరో 15 మంది ఉద్దేశపూర్వకంగా చెల్లని ఓట్లు వేశారని కౌంటర్లు ఇస్తోంది. -
ఇండోర్.. అమరావతి.. దేవాస్..!
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని ఇండోర్, మహారాష్ట్రలోని అమరావతి, మధ్యప్రదేశ్లోని దేవాస్.. దేశంలోనే నాణ్యమైన గాలి కలిగిన నగరాలుగా నిలిచాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ప్రకటించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులను గెలుచుకున్నాయి. ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి భూపేందర్ యాదవ్ అవార్డులను ప్రదానం చేశారు. పారిశ్రామిక కేంద్రాలు, బొగ్గు గనుల వంటివి ఉన్నప్పటికీ ఇవి మంచి ఫలితాలను సాధించాయన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) కింద దేశంలోని 130 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. నగర జనాభాను బట్టి మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. కేటగిరీ–1 (10 లక్షలకు పైగా జనాభా)లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ రూ.1.5 కోట్ల నగదు బహుమతితో మొదటి స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్కే చెందిన జబల్పూర్ రూ.1 కోటితో ఈ కేటగిరీలో రెండో స్థానం, యూపీలోని ఆగ్రా, గుజరాత్లోని సూరత్ చెరో రూ.25 లక్షలతో మూడో స్థానంలో నిలిచాయి. కేటగిరీ–2 (3– 10 లక్షల జనాభా)లో మహారాష్ట్రలోని అమరావతి రూ.75 లక్షలతో మొదటి స్థానం దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, మొరాదాబాద్లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. కేటగిరీ–3 (3 లక్షల లోపు జనాభా)లో దేవాస్ (మధ్యప్రదేశ్) రూ.37.50 లక్షలతో ప్రథమ స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ 32వ స్థానంలో నిలవడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) కింద ఎంపిక చేసిన 130 నగరాల జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు కూడా ఉన్నాయి. ఈ నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఇప్పటివరకు 130 నగరాలకు రూ.20,130 కోట్లు కేటాయించగా, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు రూ.1.55 లక్షల కోట్లను సమీకరించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నా, తెలుగు నగరాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంలో వెనుకబడటం గమనార్హం.వార్డు స్థాయికి విస్తరిస్తాం రామ్సర్ కన్వెన్షన్ విభాగం కింద ఇండోర్, ఉదయ్పూర్ నగరాలకు ‘వెట్ల్యాండ్ సిటీ అక్రిడిటేషన్’(చిత్తడి నేలల నగర గుర్తింపు) సరి్టఫికెట్లను మంత్రి భూపేందర్ యాదవ్ అందజేశారు. పట్టణ చిత్తడి నేలల పరిరక్షణకు ఈ నగరాలు అసాధారణమైన చర్యలు తీసుకున్నాయని కొనియాడారు. దేశంలోని 103 నగరాల్లో గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి వార్డుల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకున్న చర్యల ఆధారంగానూ అవార్డులు అందజేస్తామని తెలిపారు. తద్వారా క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశముందని తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. -
ఓట్ల చోరీపై పోరాటం ఉధృతం చేస్తాం
రాయ్బరేలీ: ‘ఓటు చోర్, గద్దీ చోడ్’ నినాదం దేశమంతటా వినిపిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ బాగోతాన్ని భిన్నరూపాల్లో బయటపెడతామని చెప్పారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి దిగిపోవాలని ప్రజలు నినదిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ పార్లమెంట్ నియోజక వర్గానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్ల చోరీ ముమ్మాటికీ నిజమని తేల్చిచెప్పారు. ప్రజల ఓట్లను దొంగలించి గద్దెనెక్కినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఓట్ల చోరీపై తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోటి మందిని కొత్తగా ఓటర్లుగా చేర్పించి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని మండిపడ్డారు. ఓట్ల చోరీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్కు మద్దతు ఇస్తే రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను కూడా కాపాడినట్లేనని రాహుల్ అన్నారు. దేశ సంపద ప్రజలందరికీ చెందుతుందని రాజ్యాంగం నిర్దేశిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, రాయ్బరేలీలో రాహుల్ గాంధీతోపాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫోటోలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘భారతదేశం చివరి ఆశ కలియుగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు’ అంటూ వాటిపై నినాదాలు రాశారు. -
నేపాల్ ప్రధానిగా సుశీల?
కాఠ్మండు: కల్లోల నేపాల్లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువతరం ఆరంభించిన పోరాటం నేపాల్ ప్రధానమంత్రి కేపీ వర్మ ఓలీ రాజీనామాకు దారితీసింది. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ‘జనరేషన్ జెడ్’ఆన్లైన్లో సంప్రదింపులు ప్రారంభించింది. యువత తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించాలని చాలామంది సూచిస్తున్నారు. యువతలో ఆమెపట్ల అమితమైన ఆదరణ కనిపిస్తోంది. తాజాగా జరిగిన వర్చువల్ సమావేశంలో 5 వేల మందికిపైగా పాల్గొన్నారు. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా జస్టిస్ సుశీల కర్కీని నియమించాలన్న ప్రతిపాదనకు ఎక్కువమంది ఓటేశారు. తొలుత కాఠ్మండు నగర మేయర్ బాలెన్ షా పేరు వినిపించింది. అయనను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదని జనరేషన్ జెడ్ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు కర్కీకి మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. మద్దతుగా 2,500 మంది సంతకాలు మధ్యంతర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలంటూ సుశీల కర్కీని యువత అభ్యర్థించగా.. తనకు మద్దతుగా కనీసం వెయ్యి సంతకాలు సేకరించి, చూపించాలని ఆమె కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు అనుకూలంగా సంతకాలు చేసినవారి సంఖ్య 2,500కు చేరినట్లు సమాచారం. మరోవైపు పోటీలో సుశీల కర్కీ ముందంజలో ఉన్నప్పటికీ మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్, యువనేత సాగర్ ధాకల్, ధరణ్ సిటీ మేయర్ హర్కా సంపంగ్ పేర్లపైనా చర్చ సాగుతోంది. నేపాల్లోని ప్రముఖ యూట్యూబర్ రందోమ్ నేపాలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఎవరూ మందుకు రాకపోతే తాను ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు. సుశీల కర్కీ నియామకానికి పెద్ద తతంగమే ఉంటుందని సమాచారం. ఆమె తొలుత నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ను, అనంతరం అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ను కలుసుకొని మద్దతు పొందాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు.ఎవరీ జస్టిస్ సుశీల? నేపాల్ చరిత్రలో 72 ఏళ్ల సుశీల కర్కీకి ప్రత్యేక స్థానమే ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డుకెక్కారు. భారత్లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1975లో పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. సుశీల కర్కీ మొదట టీచర్గా పనిచేశారు. 1978లో కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిపార్సు మేరకు అప్పటి అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఆమెను చీఫ్ జస్టిస్గా నియమించారు. సుశీల కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికీ భయపడబోరని పేరుంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదుకున్నప్పటి రోజులను సుశీల ఇటీవలే గుర్తుచేసుకున్నారు. అక్కడ డ్యాన్స్ నేర్చుకొనే అవకాశం దక్కిందని చెప్పారు. ఆ యూనివర్సిటీలోనే తనకు ఉద్యోగం వచి్చందని, అక్కడే పీహెచ్డీ పూర్తిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కానీ, విధిరాత మరోలా ఉండడంతో న్యాయమూర్తిగా మారానని తెలిపారు.మోదీజీ కో నమస్కార్ నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీక రించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జస్టిస్ సుశీల చెప్పారు. ఆమె బుధవారం ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మధ్యంతర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలంటూ యువత చేసిన విజ్ఞప్తిని స్వీకరిస్తున్నానని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని నేపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన ప్రారంభానికి శ్రీకారం చుడదామని అన్నారు. భారత్–నేపాల్ మధ్య దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ అంటే తమకు ఎంతో గౌరవం, ప్రేమ అని స్పష్టంచేశారు. తమ దేశానికి భారత్ వివిధ సందర్భాల్లో ఎంతగానో సాయం అందించిందని చెప్పారు. భారతదేశ పాలకులు, నాయకులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి నమస్కారాలు తెలియజేస్తున్నానని జస్టిస్ సుశీల కర్కీ వ్యాఖ్యానించారు. మోదీజీ అంటే తనకు గౌరవ ప్రప త్తులు, ఆరాధనభావం ఉన్నట్లు వివరించారు. -
రోజుకు 54,794 పిడుగులు!
వర్షం పడుతోందంటే మెరుపులు, పిడుగులు పడడం సహజం. పిడుగు శబ్దం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిలోమీటర్ల దూరంలో పడ్డా మన పక్కనే పడినట్టు ఉంటుంది. 2024–25లో ఇలా మనదేశంలో ఎన్ని పిడుగులు పడ్డాయో తెలుసా? 2 కోట్లకుపైగానే! అంటే రోజుకు సగటున 54,794! 2025–26లో జూలై 30 నాటికి దేశ వ్యాప్తంగా పిడుగుల వల్ల 1,626 మంది మనుషులు, 52,367 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే తేమ 7 శాతం పెరుగుతుంది. ఫలితంగా పిడుగులు 10–12 శాతం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లో వేసవికాలంలో భానుడి ప్రతాపం, అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతం వేడెక్కడం వంటివి కూడా పిడుగులకు అనువైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు పెరిగిందని, తూర్పు రాష్ట్రాల్లో తుపాన్లకు కారణమయ్యే తేమకు ఆజ్యం పోస్తున్నాయని క్లైమేట్ రెసీలియెంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ (సీఆర్ఓపీసీ) వ్యవస్థాపకులు సంజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. పర్యావరణ విపత్తుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇది.46 శాతం పిడుగుపాటు మరణాలే!ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య వర్షాలు, పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా 1,626 మంది మరణించారని కేంద్ర హోంశాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. 1967 నుంచి 2020 వరకు పిడుగుపాటుతో భారత్లో 1,01,000 మంది మరణించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్బీ) డేటా చెబుతోంది. 2002–24 మధ్య దేశంలో వాతావరణ సంబంధ మరణాలలో దాదాపు 46 శాతం పిడుగుల వల్ల సంభవించాయని ఎన్సీఆర్బీ తెలిపింది. ఐఎండీ, సీఆర్ఓపీసీ ప్రకారం 2019–20లో 51.7 లక్షల పిడుగుపాటు సంఘటనలు నమోదయ్యాయి. 2024–25లో ఈ సంఖ్య 2 కోట్లకుపైగా పెరిగింది.ముందస్తు హెచ్చరికలుఐఎండీ ప్రస్తుతం 86 శాతం కచ్చితత్వంతో పిడుగులను అంచనా వేస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని అయిదు రోజుల ముందే హెచ్చరిస్తోంది. జిల్లాల పేర్లను రెండు రోజుల ముందుగా వెల్లడిస్తోంది. ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నరోజున ప్రభావిత ప్రాంతాల వివరాలతో ప్రతి మూడు గంటలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఐఎండీ, ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో పిడుగులు అధికంగా పడే ప్రాంతాలను సీఆర్ఓపీసీ గుర్తించింది. ముప్పు నివారణ ప్రణాళికలో భాగంగా దామినీ యాప్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పంచాయతీ నియమించిన భద్రతా సమన్వయకర్తలకు రియల్–టైమ్ హెచ్చరికలను పంపుతున్నారు. జాతీయ పిడుగుపాటు నష్టనివారణ కార్యక్రమం కింద హెచ్చరికల కోసం మైక్రోఫోన్స్, సీసీటీవీ కెమెరాలు, లౌడ్స్పీకర్లతో కూడిన స్మార్ట్ స్తంభాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తాటి చెట్లను నాటడం మొదలు అనేక అవగాహన ప్రచారాలు కూడా చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లోనూ..నగరవాసులు కమ్యూనికేషన్ సిస్టమ్స్ వంటి విద్యుదయస్కాంత మౌలిక సదుపాయాలను ఎక్కువగా వాడుతున్నారని ఇది పిడుగు ప్రమాదాన్ని పెంచుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహపాత్ర చెబుతున్నారు. కాంక్రీట్, తారు, గాజు వంటివి వేడిని గ్రహించి, ప్రసరింపజేయడం వల్ల కలిగే ఉష్ణ ప్రభావం నగరాలను గ్రామీణ ప్రాంతాల కంటే వేడిగా మారుస్తోందట. ఈ పరిస్థితులు పిడుగుపాట్లకు దారితీస్తున్నాయట.విమానయాన సంస్థలకు..వర్షాకాలంలో పిడుగుపాట్ల వల్ల ఏటా దాదాపు 2,000 విమానాలను దారి మళ్లిస్తున్నారు. దీనివల్ల విమానయాన సంస్థలకు ఏటా సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతోందట. -
మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం
న్యూఢిల్లీ: బలహీన ప్రజాస్వామ్య పునాదులపై నిర్మితమైన రాజ్యాలు కుప్పకూలుతున్నాయని, బలీయమైన మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. శాసనసభల ఆమోదం పొంది తమ వద్దకు వచి్చన బిల్లులను నిరీ్ణత కాలపరిమితిలోపు గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును రాష్ట్రపతి అభిప్రాయం కోరిన అంశంలో వాదోపవాదనలు జరుగుతున్న కేసు విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. ‘‘పౌరులు ప్రభావితమయ్యే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు సుప్రీంకోర్టును రాష్ట్రపతి సలహాలు కోరవచ్చు అని మన భారత రాజ్యాంగం ఉద్భోదిస్తోంది. ఇలాంటి సమగ్రతను సంతరించుకున్న మన రాజ్యాంగాన్ని చూసి గరి్వస్తున్నాం. పొరుగుదేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్లో ఇప్పుడు ఎలాంటి దారుణ పరిస్థితి ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం’’అని సీజేఐ గవాయ్ అన్నారు. బంగ్లాదేశ్లోనూ అదే పరిస్థితులు ఉన్నాయని మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ గుర్తుచేశారు. ధర్మాసనంలో జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ సైతం సభ్యులుగా ఉన్నారు.నేపాల్లో.. తమ వద్ద గడువులోపు సమగ్రస్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్న సాకుతో సోషల్ మీడియా యాప్లపై పూర్తిస్థాయి నిషేధం విధించి నేపాల్ ప్రభుత్వం విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొంది. చివరకు ప్రధాని ఓలీ తన పాలనావైఫల్యాన్ని అంగీకరిస్తూ గద్దె దిగారు. అయినాసరే జెన్ జెడ్, ఇతర విద్యార్థి సంఘాల ఆందోళన ఆగకపోగా మరింత హింసాత్మకంగా మారి చివరకు 30 మంది ప్రాణాలను బలిగొంది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పారీ్టల హెడ్ఆఫీస్లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల తగలబెట్టారు. కొన్నింటిని ధ్వంసంచేశారు. మాజీ ప్రధాని షేర్బహదూర్ దేవ్బా ఇంటిని చుట్టుముట్టి దేవ్బా, భార్య అర్జు రాణాలపై దాడిచేశారు. ప్రజల ఆస్తుల విధ్వంసం యథేచ్చగా సాగింది. బంగ్లాదేశ్లో.. భారత్కు తూర్పు వైపున్న మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ సైతం ఉద్యమ సెగకు బలైంది. 1971 విమోచన ఉద్యమకారుల వారసులకు సివిల్సరీ్వసెస్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కలి్పంచడంతో అక్కడి నిరుద్యోగ యువతలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. అది హఠాత్తుగా గత ఏడాది జులైలో మహోగ్రరూపం దాల్చి దేశవ్యాప్తంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం చేతులెత్తేసింది. చివరకు దేశ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రాణభయంతో రాజధాని ఢాకాను వీడి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పట్నుంచి ఆమె ఢిల్లీలోనే తలదాచుకుంటున్నారు. నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనుస్ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నా అది సుస్థిర పాలనను అందివ్వలేక ఆపసోపాలు పడుతోంది. -
నివురుగప్పిన నిప్పులా నేపాల్
కాఠ్మండు/న్యూఢిల్లీ/డెహ్రాడూన్/జైపూర్: హిమాలయాల నేపాల్లో సోషల్మీడియాపై నిషేధంతో శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చి డజన్లమందిని పొట్టనబెట్టుకుని బుధవారానికి చాలామటుకు శాంతించింది. కానీ బయటిశక్తుల విధ్వంసకర ఉద్యమ ఎగబోతతో నివురుగప్పిన నిప్పులా తయారై తాత్కాలిక ప్రభుత్వానికి కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. దాంతో సైన్యంరంగంలోకి దిగి దేశవ్యాప్త కర్ఫ్యూను కఠినంగా అమలుచేస్తోంది. ఉద్యమబాట వీడి చర్చల పథంలో సాగాలంటూ విద్యార్థి సంఘాలకు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌదెల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ‘జెన్ జెడ్ నేపాల్’విద్యార్థి సంఘం ప్రతినిధులు నేపాల్ సైన్యంతో బుధవారం తొలిదఫా చర్చలు జరిపారు. రెండు గంటలపాటు చర్చించినా ఎలాంటి ఏకాభిప్రాయం కుదర్లేదు. మరోమారు చర్చలు జరపనున్నారు. నేపాల్ మాజీ మహిళా చీఫ్ జస్టిస్ సుశీల కరీ్క, కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా, మాజీ విద్యుత్ బోర్డ్ సీఈఓ కుల్మాన్ ఘిసింగ్లలో ఏవరో ఒకరి సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని విద్యార్థులు డిమాండ్చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వదేశాన్ని నిరసనోద్యమ అగి్నకీలల్లోకి తోసేశారన్న ఆరోపణలను విద్యార్థులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. శాంతియుతంగా పోరాటంచేస్తుంటే బయటిశక్తులు దూరి విధ్వంసం సృష్టించాయని స్పష్టంచేశాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసినా ఆందోళనలు చల్లారకపోవడంతో సైన్యం మంగళవారం అర్థరాత్రి రంగంలోకి దిగింది. అత్యంత సమస్యాత్మకంగా మారిన ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. దేశవ్యాప్త కర్ఫ్యూను విధించింది. అయితే హింసాత్మక ఘటనల్లో మరణాల సంఖ్య బుధవారానికి 33కు పెరిగింది. 1,033 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం దాకా కఠిన ఆంక్షలను అందరూ పాటించాలని, లూటీ, దోపిడీ వంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యాత్ర, పర్యటన కోసమొచ్చి చిక్కుకుపోయిన విదేశీయులను భద్రంగా స్వదేశాలకు తరలించే ప్రక్రియ మొదలెడతామని ఆర్మీ భరోసా ఇచ్చింది. ఆలోపు విదేశీ పర్యాటకులు, యాత్రికులకు తగు సాయం చేయాలని హోటళ్లు, టూరిజం సంస్థలను ఆర్మీ ఆదేశించింది. కాఠ్మండులో దుకాణాలు కొల్లగొట్టిన అల్లరిమూకల సభ్యులను ఆర్మీ అరెస్ట్చేసింది. వారి నుంచి భారీ ఎత్తున నగదు, 31 ఆయుధాలు, విలువైన వస్తువులను స్వా«దీనంచేసుకుంది. నేపాల్లో తాజా పరిస్థితిని గమనిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ బుధవారం చెప్పారు. పారిపోయిన ఖైదీలు ఆందోళనకారులు జైళ్లను బద్దలుకొట్టడంతో వాటిల్లోని 13,000 మందికిపైగా ఖైదీలు పరారయ్యారు. ఢిల్లీబజార్ జైలు, ఛిత్వాన్, నఖూ, ఝుంప్కా, కంఛన్పూర్, జలేశ్వర్, కస్కీ, డాంగ్, జుమ్లా, సోలూఖుంబు, గౌర్, బజ్హాంగ్లోని జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయారు. ఆకొద్ది సమయంలో పారిపోవడం సాధ్యంకాని ఖైదీలు కారాగారాల్లో ఘర్షణలకు దిగుతున్నారు. పశ్చిమ నేపాల్లోని బాంకే ప్రాంతంలోని నౌబస్తా ప్రాంతీయ జైలు పరిధిలోని బాలనేరస్తుల కేంద్రంలో కొందరు జైలువార్డన్ల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు తెగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు బాలలు చనిపోయారు. కొన్ని జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలను సైన్యం ఎలాగోలా వెతికి పట్టుకుని మళ్లీ జైల్లో పడేసింది.పర్యాటకుల ఆక్రందనలు పొఖారా పట్టణంలో వాలీబాల్ లీగ్ మ్యాచ్ల కోసం వచి్చన భారతీయ మహిళ ఉపస్థ గిల్ ఆందోళనకారుల దాడి నుంచి తప్పించుకున్నారు. తనను రక్షించాలని, స్వదేశానికి పంపించాలని భారతసర్కార్ను వేడుకుంటూ ఆమె ఇన్స్టా గ్రామ్లో ఒక వీడియో పోస్ట్చేశారు. ‘‘మ్యాచ్ కోసం ఇక్కడికొచ్చా. హోటల్ స్పాలో ఉన్నప్పుడు ఆందోళనకారులు పెద్ద కర్రలతో వెంటబడ్డారు. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్నా. కానీ నా లగేజీ మొత్తం హోటల్లోనే ఉండిపోయింది. ఆ హోటల్కు నిరసనకారులు నిప్పుపెట్టి కాల్చేశారు. దయచేసి నన్ను భారత్కు పంపేయండి. రోడ్ల మీద ఎక్కడ చూసిన మంటలే చెలరేగుతున్నాయి. ఇక్కడ దారుణ పరిస్థితులున్నాయి’’అని ఆమె వీడియోలో వాపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలా పలు రాష్ట్రాలకు చెందిన చాలా మంది పర్యాటకులు నేపాల్లో చిక్కుకుపోయి సురక్షిత తిరుగుప్రయాణం కోసం ప్రభుత్వ సాయం అర్థిస్తున్నా రు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నేపా ల్ అధికారవర్గాలతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఎయిర్ఇండియా, ఇండిగో విమానాల్లో భారతీయులను వెనక్కి రప్పిస్తామని పౌరవిమాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
ఇక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో(సీఈఓ) కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వర్క్షాప్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ఈ భేటీలో ఆమోదముద్ర వేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని, అనర్హుల పేర్లు చేరుస్తున్నారని మండిపడుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ఎస్ఐఆర్ పేరిట కుట్రలు సాగిస్తున్నారని బీజేపీ కూటమిపై ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శిస్తున్నాయి. విపక్షాల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఎన్నికల సంఘం ముందుకెళ్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్కు సిద్ధమవుతుండడం గమనార్హం. ధ్రువపత్రాల జాబితా సిద్ధం చేయండి బిహార్ ఎన్నికలు ముగియకముందే దేశమంతటా ఎస్ఐఆర్పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బుధవారం జరిగిన వర్క్షాప్లో సీఈఓల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం సేకరించింది. ఎస్ఐఆర్కు ఎప్పటిలోగా సిద్ధం కాగలరని ప్రశ్నించగా.. సెపె్టంబర్లో ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో పూర్తిచేస్తామని, అక్టోబర్ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించగలమని చాలామంది సీఈఓలు బదులిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎస్ఐఆర్కు సంబంధించిన వనరులు, సన్నాహాలపై మూడున్నర గంటలపాటు ప్రజంటేషన్ ఇచ్చారు. ఓటర్ల అర్హతను తేల్చడానికి అవసరమైన ధ్రువపత్రాల జాబితాను సిద్ధం చేయాలని సీఈఓలను ఆదేశించారు. స్థానికంగా ఆమోదించే, సులభంగా లభించే ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. స్పష్టమైన సమగ్ర ఓటర్ల జాబితా కోసమే.. ఎస్ఐఆర్ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే తేల్చిచెప్పింది. పారదర్శకమైన, అత్యంత కచి్చతత్వంతో కూడిన ఓటర్ల జాబితాను రూపొందించడమే అసలు లక్ష్యమని వెల్లడించింది. మరణించివారి పేర్లను, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి పేర్లను, డూప్లికేట్ ఎంట్రీలను, దేశ పౌరులను కానివారి పేర్లను తొలగించడానికే ఓటర్ల జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేసింది. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొంది. ఓటు వేసేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేర్లను ఇందులో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. సమగ్రమైన, స్పష్టమైన ఓటర్ల జాబితాను రూపొందించాలంటే ఎస్ఐఆర్ తప్పనిసరి అని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా, 2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సవరించిన ఓటర్ల జాబితాలతోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
యూత్ కు 'రెస్ట్' రూమ్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు జీవితంలో ప్రతి ఒక్కరికీ వారివారి స్థాయిలను బట్టి ఒత్తిడి అనేది అనివార్యం అయిపోయింది. సాధారణంగా ఒత్తిడిని జయించేందుకు యోగా, క్రీడలు, సంగీతం, నలుగురితో ముచ్చటించడం, షాపింగ్ థెరపీ వంటివి చేస్తుంటారు. కానీ జెన్ –జీ.. అంటే 13–28 ఏళ్ల వయసున్న యువతలో మాత్రం చాలామంది వీటన్నిటికీ భిన్నంగా ‘బాత్రూమ్ క్యాంపింగ్’ని ఆశ్రయిస్తున్నారు.టెంట్, చలి మంటలు, నక్షత్రాలతో మెరిసే ఆకాశం, షాపింగ్.. ఇవేవీ కావు. జస్ట్ తెల్లటి టైల్స్ పరిచిన నాలుగు గోడల మధ్య ‘రెస్ట్రూమ్స్’లో జెన్ –జీ సేదతీరుతోంది. శారీరక అవసరాల కోసం కాకుండా మానసిక ప్రశాంతతకు బాత్రూమ్లో ఎక్కువసేపు గడుపుతున్నారు. శబ్దాలు, జనంతో కిటకిటలాడే ప్రదేశాలకు దూరంగా ప్రశాంతంగా ఉండటానికి, సంగీతం వినడానికి మూసి ఉంచిన కమోడ్పై కూర్చుని మనసుని తేలికపర్చుకుంటున్నారు. ఒత్తిడి, ఆందోళన, బాధ, ఓటమి సమయంలోనే కాదు.. సమస్యల నుంచి బయటపడే మార్గాల అన్వేషణ, కొత్త ఆలోచనల కోసమూ అటువైపే అడుగులు పడుతున్నాయి. ఇల్లు, ఆఫీస్ లేదా ఏదైనా పార్టీలో ఉన్నా.. ఒత్తిడికి గురైనప్పుడు, మనసు బాధగా ఉన్నప్పుడు బాత్రూమ్ను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఇప్పుడు ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అంటున్నారు.ప్రపంచానికి దూరంగా..‘నా బాధ, ఒత్తిడి నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. అవి వారికి అక్కరలేదు.అందరికీ కనపడేలా కూర్చుని బాధపడుతుంటే ఈ సమాజం వేలెత్తి చూపుతుంది. అలా కాకుండా బాత్రూమ్లో అయితే ఎవ్వరికీ తెలీదు. ఏకాంతం, నిశ్శబ్దంతో కూడిన ప్రశాంత వాతావరణమూ ఉంటుంది. మనల్ని జడ్జ్ చేసే అవకాశంఇంకొకరికి ఉండదు’అంటోంది జెన్ జీ.బాత్రూమ్ క్యాంపింగ్ ఎందుకంటే?ఒత్తిడిఆందోళనకోపంబాధఓటమిసమస్యకు పరిష్కారంకొత్త ఆలోచనలువీటిని ట్రై చేయండిఒత్తిడి నుంచి ఉపశమనానికి బాత్రూమ్ను ఒక సౌలభ్యమైన స్థలంగాఈ తరం వాళ్లు భావిస్తూ ఉండవచ్చు. కానీ బాత్రూమ్ అంటే రోగకారక క్రిములకు అడ్డా అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆందోళనను నియంత్రించడానికి ఇతర ఆరోగ్యకరమార్గాలూ ఉన్నాయని వారు సూచిస్తున్నారు.ప్రాణాయామం: శ్వాస ఆధారిత ప్రాణాయామ ప్రక్రియలను నిపుణుల ద్వారా తెలుసుకుని రోజూ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మెదడు చురుగ్గా పనిచేస్తుందనిప్రపంచ వ్యాప్తంగా అనేకఅధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకృతి ఒడిలో: ప్రకృతిని మించిన వైద్యుడు లేడు. పార్కులు, మైదానాల్లో గడ్డిని తాకడం, గడ్డిపై పడుకోవడం, సుందర ప్రకృతిదృశ్యాలను ఆస్వాదించడం.. ఇవన్నీ మనసును ఆహ్లాదపరిచేవే. సంగీతం,పజిల్స్: నచ్చిన సంగీతాన్ని వినొచ్చు. మెదడుకు పని కల్పించే పజిల్స్ చేయొచ్చు. ఆఫీసుల్లో: గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోకుండా.. ప్రతీ అరగంట లేదా గంటకు చిన్న విరామం తీసుకోవాలి. ఒత్తిడి అనిపిస్తే.. తేలికపాటి ప్రాణాయామాలు చేయాలి. మీ డెస్క్ వద్ద సరైనభంగిమలో కూర్చునేలా చూసుకోండి.నో సెల్ఫోన్: అలసిపోయినట్టు అనిపించినా.. పని ఎక్కువైనట్టు అనుకున్నా వెంటనే చేతులు ఫోన్ మీదకు వెళ్లిపోతుంటాయి. అలా వెళ్లి.. ఎన్ని ఫేస్బుక్ పోస్టులు చూస్తామో / పెడతారో, ఎన్ని రీల్స్ చూస్తారో తెలీదు. అన్నీ మనకు నచ్చినవే ఉండాలని లేదుగా. నచ్చనివి కనిపిస్తే మరింత కోపం, ఒత్తిడి. అందువల్ల ఆందోళన ఉండే సమయాల్లో సెల్ఫోన్ను (మ్యూజిక్ వినేటప్పుడు తప్ప) పక్కన పెట్టేయండి.సమయానికి తిండి, నిద్ర» సమయానికి ఆహారం తీసుకోవాలి. ఎంత పనిలో ఉన్నా, ఒత్తిడి ఉన్నా.. తినే టైమ్ను మాత్రం వాయిదా వేయొద్దు. అది మరింత ఒత్తిడి,ఆందోళనకు దారితీస్తుంది.» తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలూఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పోషకాహార నిపుణులు సూచించే.. ఒత్తిడి తగ్గించే ఆహార పదార్థాలు తీసుకోవాలి.» రాత్రుళ్లు సమయానికి, వేగంగా నిద్రపోవడం.. తెల్లవారుజామున లేవడం దినచర్యగా పెట్టుకోండి. రాత్రిపూట ఫోన్ లేదా టీవీల్లో సినిమాలు చూడటం సరదాగానేఉంటుంది గానీ.. దాని ప్రభావం మరుసటి రోజంతా పడుతుంది.పని.. ఒత్తిడి కాదు!జెన్–జీలో చాలామంది పనిని ఒత్తిడిగా భావిస్తుంటారు. ఆ మానసిక స్వభావాన్ని ముందు పూర్తిగా మార్చుకోవాలి. కెరీర్లో ఎదగాలన్న మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే పనిపట్ల ప్రేమ, నిబద్ధత వాటంతట అవే పెరుగుతాయి. పనిలో లేదా కెరీర్లో వచ్చే సవాళ్లను భవిష్యత్తుకు మెట్లుగా చూడాలి తప్ప.. వాటిని ఒత్తిడిగా భావించినంత కాలం ఎదుగుదల ఉండదు అని గ్రహించాలి. -
కదులుతున్న ఆటోలో.. ఆమె సాహసాన్ని చూస్తే షాకే!
పంజాబ్లో ఓ మహిళ.. దొంగలతో ధైర్యంగా పోరాడి తప్పించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పట్టపగలే ఆటోలో మహిళను దోచుకోవడానికి ప్రయత్నించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఫిల్లౌర్కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా, డ్రైవర్తో పాటు ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు.అయితే, ఆమె ధైర్యంగా దుండగులను ప్రతిఘటించింది.. ఆటో నుంచి బయటకు వేలాడుతూ సాయం కోసం అరవడం ప్రారంభించింది. ఆమె దాదాపు అర కిలోమీటర్ వరకు వేలాడుతూ సాయం కోసం ఆమె పిలుస్తూనే ఉంది. ఇంతలో, వెనుక కారులో ప్రయాణిస్తున్న కొంతమంది యువకులు ఆటోను వెంబడించారు. ఆమె సాహసాన్ని వీడియో తీశారు. దొంగలను పట్టుకోవడానికి వారు సాయం చేశారు.ఆటో వేగంగా వెళ్లి ఒక కారును ఢీకొట్టింది. చివరికి ఆటో బోల్తా పడింది. దాంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ వీడియోలో ఆ మహిళ ఆటోకు బయట వేలాడుతూ దొంగల్ని ఎదుర్కొంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ధైర్యంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా దొంగలను కూడా పట్టించగలిగిందని.. ఈ ఘటన మహిళల ధైర్యానికి నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.In an extremely courageous act, a Ludhiana woman saved herself from a robbery in a moving auto by clinging on the vehicle while signalling for help from other commuters. Three robbers who tried to snatch her phone and money inside auto arrested by @Ludhiana_Police @IndianExpress pic.twitter.com/N7KXS62Olp— Divya Goyal (@divya5521) September 10, 2025 -
విషమివ్వాలని దర్శన్ విజ్ఞప్తి.. బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు!
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రేణుకాస్వామి అనే అభిమాని హత్యకేసులో నిందితుడైన ఆయనను బెయిల్ రద్దు కావడంతో అరెస్టై జైలుకు వెళ్లారు. ఈ కేసులో దర్శన్తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో విచారణకు వర్చువల్గా హాజరైన దర్శన్.. న్యాయమూర్తికి తన బాధలను చెప్పుకొచ్చారు. జైల్లో ఉండలేకపోతున్నానని.. తన పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని అన్నారు. దయచేసి తనకు ఇంత విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు. నా జీవితం దారుణంగా తయారైందని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే దర్శన్ పరిస్థితిని అర్థం చేసుకున్న బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దర్శన్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు బదిలీ చేయాలన్న అధికారుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దర్శన్ను బళ్లారి జైలుకు మార్చడానికి ఎటువంటి బలమైన కారణం లేదని పేర్కొంది. కాగా.. రేణుకాస్వామి హత్య కేసులో 7 మంది నిందితులు వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. దర్శన్ తరపు న్యాయవాదులు కనీసం ఒక మంచం, దిండును అందించాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అంతకుముందు దర్శన్ జడ్జితో మాట్లాడుతూ.. 'నెల రోజులకు పైనే అవుతుంది ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు. -
జేఈఈ లేకుండానే.. ఐఐటీలో సీటు!
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఐఐటీలో సీటు సంపాదించాలని విద్యార్థులు కోరుకుంటారు. ఇంజనీరింగ్ చేయాలనుకునే దాదాపు ప్రతి విద్యార్థి ఐఐటీలో అడ్మిషన్ పొందడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఐఐటీలో సీటు రావాలంటే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్లో అత్యుత్తమ మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు రాయకుండానే ఐదుగురు విద్యార్థులు ఐఐటీ అడ్మిషన్ సాధించారు.జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ లేకుండానే ఐదుగురికి విద్యార్థులకు కాన్పూర్ ఐఐటీలో ప్రవేశం లభించినట్టు ఇండియా టుడే వెల్లడించింది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)లో ఈ ఐదుగురు సీట్లు దక్కించుకున్నారని తెలిపింది. ఒలింపియాడ్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరిని 2025- 26 సెషన్కి ఎంపిక చేసినట్టు పేర్కొంది. ఐదుగురు విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో సీఎస్ఈ ఎంచుకున్నారు. వీరికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను కాన్పూర్ ఐఐటీ (IIT Kanpur) వెల్లడి చేయలేదు.ఎంపికైన విద్యార్థులలో ఇద్దరు ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్ శిక్షణ శిబిరం (IOITC)కు చెందినవారు. మిగతా ముగ్గురు విద్యార్థులు ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ శిక్షణ శిబిరం (IMOTC) నుంచి వచ్చారు. ఒలింపియాడ్లో సాధించిన విజయాలు, శిక్షణా శిబిరాలకు హాజరు వంటి అంశాలతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్స్కు సమాన స్థాయి ప్రమాణాలతో వీరిని పరీక్షించారు. ప్రవేశ నిబంధనలకు అనుగుణంగానే వీరికి సీట్లు కేటాయించారు.రెగ్యులర్ విద్యార్థుల్లానే..ఒలింపియాడ్ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులు నేరుగా రెగ్యులర్ కోర్సులో చేరతారు. జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులతో కలిసి చదువుతారని అధికారులు వెల్లడించారు. వీరికి ప్రత్యేకంగా విద్యా సహాయం చేయడం అంటూ ఏమీ ఉండదని స్పష్టం చేశారు. అయితే ఒలింపియాడ్ ఎంట్రన్స్.. ఎంపిక చేసిన కొన్ని కోర్సులకు మాత్రమే పరిమితమని తెలిపారు.ఒలింపియాడ్ ఎంట్రన్స్ ఈ 5 కోర్సులకు మాత్రమే.1. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్2. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్3. ఎకనామిక్ సైన్సెస్4. బయోలాజికల్ సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్5. కెమిస్ట్రీఎంపిక ఇలా?ఒలింపియాడ్స్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తుంది. జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్ ప్రకారమే వీరికి రాత పరీక్ష పెడతారు. వీటి ఫలితాలు ఆధారంగా కేంద్ర అడ్మిషన్ల కమిటీ ప్రవేశానికి ఎంపిక చేస్తుంది. మొత్తం ఈ ప్రక్రియ అంతా జేఈఈ అడ్వాన్స్డ్స్లో అర్హత సాధించిన వారికి సరి సమానంగా ఉంటుందని కాన్పూర్ ఐఐటీ తెలిపింది. జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) విజేతలతో సమానమైన ప్రతిభ ఉన్న ఒలింపియాడ్ విజేతలకు ఐఐటీలో ప్రవేశానికి ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ఇక నుంచి ఒలింపియాడ్స్పైనా ఫోకస్ చేయాల్సి ఉంటుంది.చదవండి: టైమ్స్ కిడ్ ఆఫ్ ది ఇయర్.. ఎవరీ తేజస్వీ మనోజ్?సీఎస్ఈవైపే మొగ్గు2025 జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (జేఐసీ) నివేదిక ప్రకారం 27,285 మంది అభ్యర్థులు తమ ప్రాధాన్యత జాబితాలో ఐఐటి కాన్పూర్లో సీఎస్ఈని ఎంచుకున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 23,254 ప్రాధాన్యతలతో రెండవ స్థానంలో ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ (20,261), సివిల్ ఇంజనీరింగ్ (15,846), కెమికల్ ఇంజనీరింగ్ విత్ పవర్ అండ్ ఆటోమేషన్ (15,758) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
బీహార్పై వరాల జల్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్లో ముకామ- ముంగర్ మధ్య 82 కిలోమీటర్ల హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.బక్సర్ బగ్లాపూర్ కారిడార్లో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న 84 కిలోమీటర్ల జాతీయ రహదారికి రూ.4447 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. దీంతో పాటు బీహార్లోని భాగల్పూర్ డంకా రాంపూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 177 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ పనులకు రూ.3,169 కోట్ల రూపాయల్ని కేంద్రం ఖర్చు చేయనుంది. -
దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది!
‘‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’’ నూటొక్క జిల్లాల అందగాడిగా పేరొందిన సినీ నటుడు, దివంగత నూతన్ప్రసాద్ ఒకానొక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. నిజజీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే కానీ.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఊహూ.. మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాల గురించి కానే కాదు. పాక్తో యుద్ధం.. లేదా అమెరికాతో టారిఫ్ల విషయం అంతకంటే కాదు. దీనికంటే కొంచెం సీరియస్ విషయం. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా. ఏమిటంటారా.. తాజా గణాంకాల ప్రకారం మన సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది!జనాభా తగ్గితే మంచిదే కదా అంటున్నారా? నిజమే కానీ.. అన్నివేళలా కాదు. ఎందుకంటే.. సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉంటే.. దేశం ముసలిదైపోతుంది. వృద్ధుల వైద్యావసరాలు తీర్చడం కష్టమవుతుంది. ఇది కాస్తా ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులు గమనిస్తే మీకీ విషయం అర్థమైపోతుంది. ‘‘మా దేశం రండి. ఉచితంగా ఇల్లిస్తాం. ఉద్యోగం వెతుక్కునేంతవరకూ నెలవారీ భృతి కూడా ఇస్తాం’’ అంటూ కొన్ని యూరోపియన్ దేశాలు ఊరిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా తగ్గిపోతూండటం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన దేశంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది? ఒక్కసారి పరిశీలిద్దాం..1950లలో దేశ సగటు సంతానోత్పత్తి రేటు 6.18. అంటే పిల్లల్ని కనగలిగే వయసులో ఉన్న ఒక్కో మహిళ కనీసం ఆరుగురికి జన్మనిచ్చేదన్నమాట. నిజమే మరి.. మన తాత ముత్తాతల కుటుంబాలు చాలా పెద్దవిగానే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు... బోలెడంత మంది చిన్నాన్నలు, అత్తమ్మలు, మేనమామలు ఉండేవారు. అయితే.. దేశ అవసరాల కోసం అనండి.. ఇంకో కారణం చేతనైనా కానివ్వండి ఈ సంతానోత్పత్తి రేటు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 1.9కి పడిపోయింది. ఏ దేశంలోనైనా జనాభా క్రమేపీ పెరుగుతూ ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చనిపోయే వారికంటే పుట్టే వారు ఎక్కువగా ఉండాలంటే ఒక్కో మహిళ 2.1 మందిని కనాలన్నమాట. తాజాగా అంటే 2023ను బేస్ సంవత్సరంగా పరిగణించి చేసిన సర్వే ప్రకారం కూడా దేశ సంతానోత్పత్తి రేటు 1.9కి మించడం లేదు. అంటే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్కు ఉన్న రికార్డు చెరిగిపోనుందన్నమాట. ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత దేశ జనాభా కూర్పు ఎలా ఉందంటే.. పద్నాలుగేళ్ల లోపువారు 24 శాతం మంది ఉంటే పనిచేసే స్థితిలో ఉన్న వారు (15 - 64) వారు 68 శాతం మంది ఉన్నారు. మిగిలిన ఏడు శాతం మంది 65 ఏళ్లపైబడ్డ వృద్ధులు!అయితే ఏంటి?2050 నాటికి దేశంలో 65 ఏళ్లపైబడ్డ వారు మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటారని అంచనా. అంటే.. సుమారు 19 కోట్ల మంది పని చేసే స్థితిలో ఉండరు. వీరందని పోషణ భారం ఇతరులపై పడనుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వాలు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఫలితంగా ఆయా దేశాల గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా నిర్మానుష్యమైపోయాయి. యువత ఉపాధివేటలో నగరాలకు మళ్లిపోవడం దీనికి కారణం. మన పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. యూరోపియన్ దేశాల మాదిరిగా వృద్ధాప్య సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే మౌలిక సదుపాయాలు (వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు వంటివి)పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకు తగినట్టుగా విధానాలు మార్చాలి. పిల్లల పెంపకం ఒక భారం కాకుండా ఉండేలా తగిన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఐఎస్ఐకి భారత సిమ్ కార్డుల సరఫరా .. నేపాలీ జాతీయుడి అరెస్టు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీకి భారత సిమ్ కార్డులను సరఫరా చేశాడనే ఆరోపణలపై ఒక నేపాలీ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రభాత్ చౌరాసియా(43) బీఎస్సీ చదువుకున్నాడని, మహారాష్ట్ర, ఢిల్లీలో ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పనిచేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.మహారాష్ట్రలోని లాతూర్లో నమోదైన తన ఆధార్ కార్డును ఉపయోగించి బీహార్, మహారాష్ట్రల నుండి 16 సిమ్ కార్డులను కొనుగోలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. తరువాత వాటిని గూఢచర్యంతో సంబంధం ఉన్న కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఆగస్టు 28న స్పెషల్ పోలీసు బృందం లక్ష్మీ నగర్లోని విజయ్ బ్లాక్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. లాహోర్, బహవల్పూర్, పాకిస్తాన్లోని పలు ప్రాంతాల నుండి ఐఎస్ఐ ఆపరేటర్లు పదకొండు సిమ్లను ఆపరేట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. నిందితుడు 2024లో నేపాలీ మధ్యవర్తి ద్వారా ఐఎస్ఐ హ్యాండ్లర్లను సంప్రదించాడని దర్యాప్తులో తేలింది. అమెరికా వీసా, విదేశాల్లో జర్నలిజంలో అవకాశాల హామీతో అతన్ని ఐఎస్ఐ ఏజెంట్లు ఆకర్షించారు. డీఆర్డీఓ, ఆర్మీ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిని అతనిని అప్పగించారని స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత్ కౌశిక్ తెలిపారు.నిందితుడు సిమ్ కార్డులను భారతదేశం నుండి ఖాఠ్మండుకు అక్రమంగా రవాణా చేసి, తరువాత ఐఎస్ ఐహ్యాండ్లర్లకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. 2017లో ప్రభాత్ చౌరాసియా ఖాఠ్మండులో ఒక లాజిస్టిక్స్ కంపెనీని ప్రారంభించాడు. అది ఆర్థిక నష్టాల కారణంగా మూతబడింది. దీంతో సంపాదన కోసం ఐఎస్ఐ హ్యాండ్లర్లతో పరిచయం పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నిందితుని నుంచి పలు డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రభాత్ చౌరాసియాపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘మా హోటల్కు నిప్పు పెట్టారు’.. నేపాల్లో భారత పర్యటకురాలు విలవిల
న్యూఢ్లిల్లీ: జనరేషస్ జెడ్ నిరసనలతో నేపాల్ అట్టుడుకిపోతోంది. ఈ నేపధ్యంలో అక్కడున్న పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడ చిక్కుకుపోయిన ఒక పర్యాటకురాలు తనను కాపాడాలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉపాసన గిల్గా తనను పరిచయం చేసుకున్న ఆమె తనకు ఎదురైన భయానక అనుభవాలను పంచుకున్నారు.‘నేను స్పాలో ఉండగా, నేను బస చేసిన హోటల్కు నిరసనకారులు నిప్పంటించారు. కర్రలు చేత పట్టుకుని కొందరు పరిగెడుతూ అందరినీ భయపెట్టారు. వాలీబాల్ లీగ్ను నిర్వహించడానికి నేను నేపాల్కు వచ్చాను. దయచేసి నాకు సహాయం చేయాలని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థిస్తున్నాను. నేను ఇక్కడ నేపాల్లోని పోఖ్రాలో చిక్కుకుపోయాను. నేను బస చేసిన హోటల్ దగ్ధమయ్యింది. వస్తువులన్నీ నా గదిలోనే ఉండిపోయాయి.హోటల్ మొత్తం తగలబడింది. నేను ప్రాణాలతో తప్పించుకోగలిగాను. ఇక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతిచోటా రోడ్లపై మంటలు చెలరేగుతున్నాయి. ఆందోళనకారులు ఇక్కడి పర్యాటకులను విడిచిపెట్టడం లేదు. ప్రతిచోటా నిప్పు పెడుతున్నారు. దయచేసి మాకు సహాయం చేయండి. ఇక్కడ నాతోపాటు చాలా మంది ఉన్నారు’ అని ఆ భారత మహిళ వీడియోలో మొరపెట్టుకున్నారు.సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతిపై తిరుగుబాటుగా మారాయి. సోమవారం రాత్రి ఆలస్యంగా సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ, భారీ నిరసనల నేపథ్యంలో ప్రధాని ఓలి రాజీనామా చేశారు. ప్రదర్శనకారులు పలు ప్రభుత్వ భవనాలను ముట్టడించి, పార్లమెంటుతో పాటు పలువురు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లను తగలబెట్టారు. కాగా కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం.. నేపాల్లోని పరిస్థితులు చక్కబడే వరకూ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరింది. -
పాత స్టాక్పై ఎంఆర్పీ మార్చవచ్చు: కేంద్రం
వస్తు సేవల పన్ను శ్లాబులను ఇటీవల సవరించిన ప్రభుత్వం వినియోగ వస్తువుల కంపెనీలకు కార్యాచరణ అడ్డంకులను తగ్గించే లక్ష్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వస్తువుల తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు కొత్త జీఎస్టీ రేట్లను ప్రతిబింబించేలా అమ్ముడుపోని ప్రీ-ప్యాకేజ్డ్ స్టాక్పై గరిష్ట రిటైల్ ధర (MRP)ను సవరించడానికి అనుమతించింది. దీని అమలు డిసెంబర్ 31, 2025లోపు పూర్తికావాలని చెప్పింది. కొత్తగా తయారయ్యే స్టాక్కు మారిన రేట్లను అప్డేట్ చేస్తారని గమనించాలి.కేబినెట్ కార్యదర్శి టి.వి.సోమనాథన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం మార్పులను అమలు చేయడంలో పరిశ్రమ వర్గాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈమేరకు వెసులుబాటు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది వృధాను నివారించడానికి, సప్లై చెయిన్ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటానికి ఆచరణాత్మక విధానమని చెప్పింది.నోటిఫికేషన్లోని నిబంధనలుకంపెనీలు జీఎస్టీ సవరణ తేదీకి ముందు తయారు చేసిన అమ్ముడుపోని స్టాక్పై ఉన్న ఎంఆర్పీని సవరించవచ్చు.శ్లాబుల వారీగా వస్తువుల రేట్లు పెరిగినా, తగ్గినా సవరించేలా రెండింటినీ లెక్కించవచ్చు.అప్డేట్ అయిన ధరలను స్టిక్కర్లు, స్టాంపింగ్ లేదా ఆన్లైన్ ప్రింటింగ్ ఉపయోగించి వినియోగదారులకు తెలియజేయవచ్చు.ఒరిజినల్ ఎంఆర్పీ స్పష్టంగా కనిపించాలి.కంపెనీలు సవరించిన ఎంఆర్పీల గురించి వినియోగదారులు, డీలర్లు, పంపిణీదారులకు ప్రకటనలు, పబ్లిక్ నోటీసుల ద్వారా తెలియజేయాలి.ఇప్పటికే ఉన్న ప్యాకేజింగ్, ర్యాపర్లను డిసెంబర్ 31 వరకు లేదా స్టాక్స్ అయిపోయే వరకు ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: నెలకు రూ.18 వేలు జీతం.. ప్రపంచంలోనే రిచ్.. -
కొత్తకారుతో నిమ్మకాయల్ని తొక్కించబోయి..
కొత్తగా కారు కొన్నాక కొందరు పూజలు చేయించి నిమ్మకాయలు తొక్కించి బండిని ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే అలాంటి ప్రయత్నాన్ని షోరూమ్లోనే చేయబోయింది ఓ మహిళ. పొరపాటు జరగడంతో 27 లక్షల విలువ చేసే కొత్తకారు యాక్షన్ సినిమాలో మాదిరి అద్దాలు బద్దలు కొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి భూమ్మీద బొక్కబొర్లాపడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్ అనే మహిళ తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది. दिल्ली के निर्माण विहार में स्थित महिंद्र शोरूम से महिला ने 27 लाख की थार खरीदी और शोरूम में ही पूजापाठ की, महिला को कार का पहिया नींबू पर चढ़ाना था लेकिन महिला ने ज्यादा एक्सीलेटर दिया और कार बिल्डिंग को तोड़ते हुए 15 फीट नीचे गिर गई#delhi #thar #viralvideo #laxminagar pic.twitter.com/oGgAvDkeZg— Live Viral Breaking News (@LVBNewsOfficial) September 9, 2025అయితే మరికొన్ని మీడియా చానెల్స్ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందనిప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్ ఆన్ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం. -
‘ఉప రాష్ట్రపతి ఆఫీసుకు మరింత కీర్తి’.. చానాళ్లకు ధన్ఖడ్ బహిరంగ ప్రకటన
న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మంగళవారం తన వారసుడు సీపీ రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి కార్యాలయం అతని అపార అనుభవంతో మరింత కీర్తిని పొందుతుందని భావిస్తున్నానని అన్నారు. గత జూలైలో రాజీనామా చేసిన తర్వాత జగదీప్ ధన్ఖడ్ చేసిన తొలి బహిరంగ ప్రకటన ఇదే కావడం గమనార్హం. Former Vice President Jagdeep Dhankhar greets his successor CP Radhakrishnan. pic.twitter.com/m6WorHvNWJ— Press Trust of India (@PTI_News) September 9, 2025మంగళవారం ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లతో గెలుపొందగా, ప్రతిపక్ష అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించారు. నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు జగదీప్ ధన్ఖడ్ రాసిన లేఖలో ‘మీరు ఈ గౌరవనీయమైన పదవికి ఎదగడం అనేది మన దేశ ప్రతినిధుల అపార నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజా జీవితంలో రాధాకృష్ణన్కున్న అపారమైన అనుభవానికి తోడు ఆయన నాయకత్వంలో ఈ కార్యాలయం ఖచ్చితంగా గొప్ప గౌరవాన్ని, కీర్తిని పొందుతుందని’ అన్నారు. జగదీప్ ధన్ఖడ్ జూలై 21న తన అనారోగ్య సమస్యలను కారణంగా చూపుతూ, ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
ద్వైపాక్షిక ఒప్పందానికి కృషి
న్యూఢిల్లీ: భారత్, అమెరికాలు సహజ భాగస్వామ్య దేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇరుపక్షాలు ఆ దిశగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యపరమైన అవరోధాలను తొలగించడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై మోదీ ప్రతిస్పందించారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ ప్రకటనను పరోక్షంగా స్వాగతించారు. India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward… pic.twitter.com/3K9hlJxWcl— Narendra Modi (@narendramodi) September 10, 2025 భారత్, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్పష్టంచేశారు. రెండు మిత్ర దేశాల నడుమ భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి వాణిజ్య చర్చలు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల పౌరులకు మేలు జరిగేలా, ఉజ్వల భవిష్యత్తు ఉండేలా తాము కలిసికట్టుగా పనిచేస్తామని తేల్చిచెప్పారు. మోదీ–ట్రంప్ మధ్య సోషల్ మీడియాలో అనుసంధానం గత నాలుగో రోజుల్లో ఇది రెండోసారి కావడం విశేషం. భారత్–అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పగా, అందుకు మోదీ ఈ నెల 6న హర్షం వ్యక్తంచేశారు. రెండు దేశాల బంధంపై ట్రంప్ అభిప్రాయాన్ని ప్రశంసించారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఇటీవల ఒత్తిడికి లోనవుతున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత్పై ట్రంప్ సర్కార్ మండిపడుతోంది. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్రంప్ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సంబంధాలను మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం త్వరలో ఇండియాకు రానుంది. అమెరికా నుంచి భారత నావికాదళం పీ–8ఐ లాంగ్ రేంజ్, మల్టిమిషన్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్లు కొనుగోలు చేస్తోంది. దీనిపై త్వరలో ఇరుపక్షాల మధ్య తుది చర్చలు జరుగనున్నాయి. -
మా తండ్రి ఆస్తుల్లో వాటా ఇవ్వాలి.. కోర్టుకెక్కిన కరిష్మా కపూర్ పిల్లలు
న్యూఢిల్లీ: తమ తండ్రి దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు న్యాయ పోరాటం ప్రారంభించారు. తండ్రి ఆస్తుల్లో తమకు రావాల్సిన వాటా దక్కేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. సంజయ్ కపూర్కు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మరణానికి ముందు ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఆయన రాసినట్లు చెబుతున్న విల్లు నకిలీదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు ఆరో పించారు.ఆస్తులు మొత్తం కొట్టేయడానికి తమ సవతి తల్లి ప్రియా కపూర్(ప్రియా సచ్దేవ్) కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఎస్టేట్ మొత్తం ప్రియా కపూర్ కు దక్కేలా సంజయ్ కపూర్ విల్లు రాసినట్లు సమాచారం. అయితే, ఆ విల్లును కుట్ర పూరితంగా సృష్టించారని, అది నిజమైన విల్లు కాదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు తేల్చిచెప్పారు. దాని గురించి తమ తండ్రి సంజయ్ కపూర్ కానీ, సవతి తల్లి ప్రియా కపూర్ కానీ గతంలో ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. ఇప్పుడు ప్రియా కపూర్ దురుద్దేశంతోనే హఠాత్తుగా నకిలీ విల్లును తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. సంజయ్ కపూర్కు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టేలా ప్రియా కపూర్ను ఆదేశించాలని హైకోర్టును కోరారు.ఏమిటీ వివాదం? ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తొలుత నందితాను వివాహం చేసుకున్నారు. 1996 నుంచి 2000 సంవత్సరం దాకా వారు కలిసున్నారు. విడాకుల తర్వాత సంజయ్ కపూర్ 2003లో కరిష్మా కపూర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్ ఉన్నారు. 2016లో అభిప్రాయభేదాల వల్ల సంజయ్ కపూర్, కరిష్మా విడిపోయారు. అనంతరం 2017 ప్రియా సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడారు. సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ 12న హఠాత్తుగా మృతిచెందిన సంగతి తెలిసిందే.లండన్లో పోలో ఆడుతుండగా గొంతులోకి తేనెటీగ దూసుకెళ్లింది. దాంతో ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని సంజయ్ తల్లి రాణి కపూర్ యూకే ప్రభుత్వాన్ని కోరారు. సంజయ్ మరణం తర్వాత ఆయన ఆస్తులపై వివాదం మొదలైంది. రెండో భార్య సంతానం, మూడో భార్య మధ్య పోరాటం సాగుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ ప్రియా సచ్దేవ్గానే ఉన్న మూడో భార్య ఇటీవలే తన పేరును ప్రియా కపూర్గా మార్చుకోవడం గమనార్హం. అంతేకాకుండా తన అత్త రాణి కపూర్పై ఒత్తిడి తెచ్చి కొన్ని రకాల పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ప్రియా కపూర్పై ఆరోపణలు వస్తున్నాయి. -
కశ్మీర్ యువతలో ప్రతిభకు కొదవలేదు
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని వారికి సరైన అవకాశాలు లభిస్తే దేశం తరపున ఆడే స్తతా ఉందని భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. జమ్మూ, కశ్మీర్ పర్యటనలో ఉన్న మహ్మద్ అజారుద్దీన్ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాలను మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజులుగా జమ్మూ కశ్మీర్లో యువ క్రికెటర్లను తాను కలిశానని ఆటలోని మెళకువలను నేర్పించానన్నారు. సుదీర్ఘ కాలంగా అవకాశాల కోసం వేచి చూస్తున్న యువతకు ప్రభుత్వం ఇటీవల ప్రోత్సాహం కల్పిస్తుండటం అభినందనీయమని అన్నారు. -
భారత సరిహద్దుల్లో హైఅలర్ట్
ఖాట్మండు/న్యూఢిల్లీ: నేపాల్లో అస్థిరత కారణంగా మెరుగైన జీవితం కోసం భారత్లోకి నేపాలీలు చొరబడే ప్రమాదం ఉండటంతో 1,751 కి.మీ.ల పొడవైన సరిహద్దు వెంట సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) బలగాలు కాపలాను కట్టుదిట్టం చేశాయి. సున్నితమైన పాయింట్లతోపాటు బోర్డర్ పోస్ట్ల వద్ద భద్రతను మరింత పెంచారు. 22 ఔట్పోస్ట్ల వద్ద అదనపు బలగాలను రప్పించారు. పోలీస్, ఎస్ఎస్బీ బృందాలు పెట్రోలింగ్ను తీవ్రతరంచేశాయని ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ చెప్పారు.భారతీయులకు అడ్వైజరీ జారీసంక్షోభ నేపాల్కు వెళ్లొద్దని భారతీయులకు భారత విదేశాంగ శాఖ మంగళవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. వివిధ కారణాలతో ఇప్పటికే నేపాల్లో ఉన్న భారతీయులు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల వైపు వెళ్లొద్దని సూచించింది. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాటని, భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్లో అత్యవసరమైతే సంప్రతింపులు కొనసాగించాలని ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు 977 – 980 860 2881; 977 – 981 032 6134 వెల్లడించింది. అయితే గుజరాత్లోని భావ్నగర్ జిల్లాకు చెందిన 40మందికిపైగా భక్తులు తీర్థయాత్ర కోసం నేపాల్కు వెళ్లి అక్కడే చిక్కుకుపో యారని తాజా సమాచారం.ప్రధాని మోదీ సమీక్షతాజా పరిణామాలపై భారత ప్రధాని మోదీ ఢిల్లీలో మంగళవారం సమీక్ష జరిపారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించింది. తర్వాత భేటీపై మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘నేపాల్లో తాజా పరిణామాలు నన్నెంతో కలచివేశాయి. ఎందరో యువకులు బలయ్యారు. అక్కడ శాంతి నెలకొనడం తక్షణావసరం. నేపాలీలంతా సంయనంతో మెలగాలని కోరుకుంటున్నా’’అని మోదీ విజ్ఞప్తిచేశారు. నేపాల్లో జెన్జీ ఉద్యమాన్ని సుదన్ గురంగ్ అనే 36 ఏళ్ల వ్యక్తి నడుపుతున్నారు. యువత సారథ్యంలో నడిచే ‘హమి నేపాల్’సంస్థకు ఇతను అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. -
మంత్రి ముందే.. భర్తకు భార్య దేహశుద్ధి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): బీడీసీసీ బ్యాంకు ఎన్నికల పేరుతో తన భర్త మంత్రి సతీష్ జార్కిహొళి అనుచరులతో కలిసి వారంపాటు ఇంటికి రాకుండా, ఫోన్ చెయ్యకుండా తిరుగుతున్నాడని ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ భర్త కనిపించగానే దాడి చేసింది. ఈ విచిత్ర సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా మదిహళ్లి గ్రామంలో జరిగింది. బెళగావి బీడీసీసీ బ్యాంకు ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. అభ్యర్థులు ఓటర్లు జారిపోకుండా శిబిరాలకు తరలించాయి. పీకేపీఎస్ సభ్యుల్లో ఒకడైన మారుతి అనే వ్యక్తి వారం రోజుల నుంచి కనబడకుండాపోయాడు. సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా జార్కిహొళి సభకు హాజరయ్యాడు, అక్కడే ఉన్న అతని భార్య వారం నుండి ఎక్కడికి పోయావంటూ కాలర్ పట్టుకుని లాగి కొట్టింది. కిందపడేసి పిడిగుద్దులు గుద్దింది. ఇదంతా మంత్రి సతీష్ జార్కిహొళి కళ్ల ముందే జరుగుతున్నా భార్యభర్తల గొడవతో నాకేం పని అనుకుని చూస్తుండిపోయారు. కొందరు జనం ఆమెను శాంతపరిచారు, బాధితుడు మళ్లీ మంత్రి అనుచరులతో కలిసి వెళ్లిపోయాడు. -
వివాహేతర సంబంధం.. భర్త మర్మాంగాలపై దాడి చేసిన భార్య..!
సాక్షి, బళ్లారి/ రాయచూరు రూరల్: పరాయి మగవాని మోజులో మునిగిపోయి, భర్తను అంతమొందించడానికి ఆమె రాక్షసిగా మారింది. గొంతు పిసికి, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించింది, అయితే భర్త తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లా ఇండి అక్కమహాదేవి కాలనీలో బీరప్ప పూజారి, సునంద దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సునందకు సిద్దప్ప అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సంతోషానికి బీరప్ప అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ అనుకున్నారు. దీంతో ఏకంగా హత్య చేయాలని కుట్ర చేశారు. సోమవారం రాత్రి బీరప్ప నిద్రపోతుండగా.. సునంద భర్త ఎద మీద కూర్చుని గొంతు నులమడంతో పాటు మర్మాంగాలపై కొట్టి ప్రాణాలు తీయాలని చూసింది. సిద్దప్ప కూడా ఆమెకు సహకరించినట్లు సమాచారం. అయితే బీరప్ప మేలుకుని కాళ్లతో ఎయిర్కూలర్ని గట్టిగా కొడుతూ కేకలు వేశాడు. ఇంటి యజమాని, బీరప్ప ఎనిమిదేళ్ల కుమారుడు తలుపులు తెరవడంతో సునంద అఘాయిత్యం బయటపడింది. బీరప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సునందతో పాటు ప్రియుడు సిద్దప్పను ఇండి పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
బంగారం బుల్లెట్ ర్యాలీ!
న్యూఢిల్లీ: కనకం ‘ల’కారం దాటినా తగ్గేదేలే అంటూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది! కొన్నిరోజులుగా రూ. లక్షపైనే కదలాడుతున్న పుత్తడి ఒక్కసారిగా మళ్లీ హైజంప్ చేసింది. బంగారం ధర మంగళవారం బుల్లెట్లా దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 5,080 పెరిగి రూ. 1,12,750 స్థాయికి చేరింది. దేశీయంగా బంగారానికి ఇది మరో కొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయి. అంతేకాదు.. ఒకేరోజు పసిడి ఇంతలా పెరగడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెండి ధర సైతం కిలోకు రూ. 2,800 లాభపడటంతో రూ. 1,28,800 స్థాయిని తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం 3,698 డాలర్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ‘బంగారం మరో రికార్డు స్థాయిని చేరింది. ఈ ఏడాది ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో 35 శాతం పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ల నుంచి బలమైన డిమాండ్కు తోడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి పెట్టుబడుల రాక, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు.. బంగారం, వెండిలో రికార్డు బ్రేకింగ్ ర్యాలీకి కారణమవుతున్నాయి’అని హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళనలు సైతం సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్నట్టు గాంధీ వివరించారు. -
స్వచ్ఛత పెర'గాలి'
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ’స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ర్యాంకులు–2025’లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. దేశవ్యాప్తంగా గాలి నాణ్యత ఆధారంగా ప్రకటించిన ఈ ర్యాంకుల్లో, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ 13వ ర్యాంకు, విశాఖపట్నం 17వ ర్యాంకు సాధించాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 22వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఎప్పటిలాగే మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో ఏపీలోని గుంటూరు నగరం జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ ర్యాంకులను ప్రకటించారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) కింద దేశంలోని 130 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. – సాక్షి, న్యూఢిల్లీకేటగిరీల వారీగా తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల స్థానాలు ఇవీ.. కేటగిరీ–1 (10 లక్షలకు పైగా జనాభా): ఈ విభాగంలో విజయవాడ 13వ ర్యాంకును, విశాఖపట్నం 17వ ర్యాంకును సాధించాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్ నగరం 22వ స్థానంలో నిలిచింది.కేటగిరీ–2 (3 నుంచి 10 లక్షల జనాభా): ఈ కేటగిరీలో గుంటూరు 6వ ర్యాంకుతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రాజమండ్రి 12, నెల్లూరు 18, కడప 23, కర్నూలు 29, అనంతపురం 35 ర్యాంకులు పొందాయి.కేటగిరీ–3 (3 లక్షల లోపు జనాభా): ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం 8, శ్రీకాకుళం 16, ఒంగోలు 21, చిత్తూరు 29, ఏలూరు 31 ర్యాంకులు సాధించాయి. తెలంగాణ నుంచి నల్గొండ 13వ ర్యాంకులో, సంగారెడ్డి 17వ ర్యాంకులో నిలిచాయి.జాతీయ స్థాయిలో విజేతలు 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా, జబల్పూర్ రెండో ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఆగ్రా, సూరత్ మూడోస్థానంలో నిలిచాయి. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో అమరావతి (మహారాష్ట్ర) మొదటి ర్యాంకు సాధించగా, 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో దేవాస్ (మధ్యప్రదేశ్) అగ్రస్థానంలో నిలిచింది. గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఈ నగరాలు తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. -
ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి దాకా..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో మొదలైన ప్రస్థానం.. ద్రవిడ గడ్డపై కమలం జెండాను రెపరెపలాడించిన పోరాటం.. గవర్నర్గా రాజ్యాంగబద్ధ పాలనకు అందించిన సహకారం.. వెరసి అంతిమంగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ను భారత ఉపరాష్ట్రపతిని చేశాయి. తమిళనాడులోని ఒక సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు సీపీ రాధాకృష్ణన్ సాగించిన సుదీర్ఘ రాజకీయ యాత్ర మంగళవారం విజయతీరాలకు చేరింది. పార్టీ సిద్ధాంతాలే శ్వాసగా, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ అధిష్టానం అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించిన నాయకుడికి దక్కిన అత్యున్నత గౌరవం ఇది. రాధాకృష్ణన్ నియామకం కేవలం ఒక వ్యక్తికి దక్కిన పదవిగా కాకుండా బీజేపీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు ముఖ్యంగా ‘మిషన్ సౌత్’కు అద్దం పడుతోంది. రాధాకృష్ణన్ ఎంపిక వెనుక కమలదళం రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక కోణాలు దాగిఉన్నాయి. సిద్ధాంత పునాదులు.. సంఘ్లో శిక్షణ తమిళనాడులోని తిరుప్పూరులో 1957 అక్టోబర్ 20న జన్మించిన రాధాకృష్ణన్.. చిన్నతనం నుంచే ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితులై పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. జాతీయవాద రాజకీయాలకు ఆదరణ లేని తమిళనాట.. ద్రవిడ ఉద్యమమే ఊపిరిగా సాగే సామాజిక వాతావరణంలో.. రాధాకృష్ణన్ తన 16వ ఏటనే ఆర్ఎస్ఎస్లో చేరారు. అది ఆయన జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తును నిర్దేశించిన కీలక మలుపు. అప్పటి నుంచే జాతీయవాదం, హిందూత్వం, క్రమశిక్షణ, దేశ సేవ వంటి సంఘ్ మౌలిక సిద్ధాంతాలు ఆయనలో బలంగా నాటుకుపోయాయి. పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవడం, సైద్ధాంతిక స్పష్టత వంటి లక్షణాలను ఆయన అక్కడే అలవర్చుకున్నారు. 1974లో నాటి జనసంఘ్ తమిళనాడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ ఆవిర్భావంతో లాంఛనంగా అందులో చేరి నాటి అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయికి అనుచరుడిగా మారారు. ఈ పునాదే ఆయన్ను తర్వాతి రాజకీయ జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను తట్టుకొనేలా చేసింది. ద్రవిడ కోటలో సంచలనం.. రాధాకృష్ణన్ రాజకీయ ప్రస్థానంలో 1998, 1999 కోయంబత్తూరు లోక్సభ విజయాలు అత్యంత కీలకమైనవి. 1998 ఎన్నికలకు కొన్నిరోజుల ముందు కోయంబత్తూరులో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘అల్–ఉమ్మా’జరిపిన వరుస బాంబు పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. ఈ ఘటన జరిగినప్పుడు అధి కారంలో ఉన్న డీఎంకేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అభద్రతాభావం ఆందోళన రేకెత్తించింది. ఈ వాతావరణంలో దేశభక్తి, హిందూ రక్షణ నినాదాలతో బీజేపీ బరిలోకి దిగింది. రాధాకృష్ణన్ను జాతీయవాదానికి ప్రతీకగా చూసిన ప్రజలు ముఖ్యంగా హిందూ ఓటర్లు ఏకతాటిపైకి వచ్చి ఆయనకు పట్టంకట్టారు. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి సవాల్ విసురుతూ ఒక జాతీయ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవడం సంచలనం సృష్టించింది. 1999లోనూ అదే ఊపును కొనసాగించి రెండోసారి గెలవడం ద్వారా అది గాలివాటు విజయం కాదని ఆయన నిరూపించారు.దక్షిణాదిపై గురి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం వెనుక బీజేపీ స్పష్టమైన రాజకీయ ప్రణాళిక కనిపిస్తుంది. దక్షిణాదిలో పార్టీ విస్తరణపై దృష్టిపెట్టిన కమలదళం.. తమిళనాడుకు చెందిన వ్యక్తిని, అందులోనూ బలమైన హిందూత్వ నేపథ్యం ఉన్న నాయకుడిని ఉప రాష్ట్రపతిని చేయ డం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, కార్యకర్తలకు ఒక సందేశం పంపినట్లయింది. ఈ పరిణా మం భవిష్యత్తులో పొత్తులు, పార్టీ విస్తరణకు మార్గం సుగమం చేయనుంది.వివాదరహిత, సౌమ్య ముద్ర గవర్నర్గా రాధాకృష్ణన్ పనితీరు వివాదరహితంగా ఉంది. ఇప్పుడు రాజ్యసభ చైర్మన్గా, ప్రతిపక్షాలు బలంగా ఉన్న సభను నడిపించడానికి ఆయన సౌమ్య స్వభావం, రాజ్యాంగ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడతాయి. ఇది వ్యూహాత్మకంగా సరైన ఎంపిక. రాధాకృష్ణన్ ప్రస్థానం ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు.. ఇది ఆధునిక బీజేపీ రాజకీయాలకు ప్రతిబింబం. సైద్ధాంతిక నిబద్ధత, సంస్థాగత విధేయత, వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనం.. ఈ మూడు అంశాలనూ సమన్వయం చేస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం. పార్టీయే శాశ్వతం.. ఓడినా చెదరని పట్టుదల రెండుసార్లు ఎంపీగా గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ ఓట మిని చవిచూశారు. అయినా ఆయన నిరాశ చెందలేదు. అధికారం లేనప్పుడే అసలైన నాయకత్వ పటిమ బయటపడుతుందన్న ట్లుగా ఆయన పార్టీ నిర్మాణానికే సమయాన్ని కేటాయించారు. 2004–07 మధ్య తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రంలో పార్టీకి సంస్థాగత రూపాన్ని ఇవ్వడానికి తీవ్రంగా శ్రమించారు. బూత్స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టిపెట్టారు. నదుల అనుసంధానం, ఉగ్రవాద నిర్మూలన, ఉమ్మడి పౌరస్మృతి అమలు, డ్రగ్స్రహిత రాష్ట్రం తదితర డిమాండ్లతో 93 రోజులపాటు సుమారు 19 వేల కి.మీ. మేర ఆయన రథయాత్ర చేపట్టారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఓడిన రాధాకృష్ణన్.. పదవులున్నా లేకున్నా పార్టీని, సిద్ధాంతాన్ని అంటిపెట్టుకొనే ఉన్నారు. ఈ లక్షణమే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతల దృష్టిలో ఆయ న్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. 2023 ఫిబ్రవరిలో కేంద్రం ఆయన్ను జార్ఖండ్ గవర్నర్గా నియమించింది. ఆ తర్వాత నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూలైలో అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో బీజేపీ అధినాయకత్వం రాధాకృష్ణన్ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపింది. -
అంకుర సంస్థలు.. అప్పుడే మూసేస్తున్నారు
ఎన్నో ఆశలతో పెడుతున్న అంకుర కంపెనీలు.. ఇటీవలి కాలంలో మూతపడుతున్నాయి. కృత్రిమ మేధ సృష్టించిన అలజడి.. పోటీ.. నిధుల రాక తగ్గిపోవడం.. ఖర్చులు పెరిగిపోవడం.. ఇలా అనేక కారణాలు. ప్రధానంగా కంటెంట్పైనే ఆధారపడ్డ స్టార్టప్స్పై ఏఐ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎడ్టెక్, స్టోరీటెల్లింగ్ ప్లాట్ఫామ్స్, మార్కెటింగ్ వంటి రంగాలలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్లను నడిపించేందుకు, విస్తరించేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇంకేముంది 2023, 2024లో ఏకంగా 28,000 పైచిలుకు స్టార్టప్స్ మూతపడ్డాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్వెర్సే ఇన్నోవేషన్.. జోష్, డెయిలీహంట్ సంస్థల మాతృసంస్థ.. ఈ ఏడాది మేలో 350 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రధానంగా ఏఐలో పెట్టుబడులు పెడుతున్నట్టు, ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కోడ్ ప్యారట్, సటల్.ఏఐ, వూరి, లొకేల్.ఏఐ, అస్త్ర.. ఇలాంటి ఏఐ స్టార్టప్లు ఇటీవలికాలంలో చాలా మూతపడ్డాయి. ఇందుకు.. ఏఐలో వేగంగా వస్తున్న మార్పులు, మారిపోతున్న సాంకేతికత, అధికమవుతున్న పోటీ, నిధుల సమస్య పెరుగుతున్న వ్యయాలు.. ఇలాంటి అనేక కారణాలు. రూ.21,000 కోట్ల నష్టంచాట్జీపీటీ ఎంట్రీ ఇచ్చిన తర్వాతి సంవత్సరం అంటే 2023లో భారత్లో ఏకంగా 15,921 టెక్ స్టార్టప్లు మూతపడ్డాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య 2,101 మాత్రమే. 2024లో 12,717 స్టార్టప్స్ కనుమరుగైపోయాయి. షట్టర్లు దించేసిన కంపెనీల సంఖ్య 2022 వరకు నాలుగు అంకెలకే పరిమితం అయింది. గత రెండేళ్లలో అనూహ్యంగా అయిదు అంకెల స్థాయికి చేరడం ఆందోళన కలిగించే అంశం. కరోనా తదనంతర పరిస్థితులు కూడా కొంతవరకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఏఐ వల్ల.. అగ్రిటెక్, ఫిన్టెక్, ఎడ్టెక్, హెల్త్టెక్ రంగాల్లోని స్టార్టప్లు అధికంగా ప్రభావితమయ్యాయి. ‘ఐఎన్సీ42’ వెబ్సైట్ ‘ఇండియన్ స్టార్టప్ లేఆఫ్ ట్రాకర్ 2025’ ప్రకారం.. 2025 సెప్టెంబర్ వరకు స్టార్టప్స్ 5,600లకుపైగా ఉద్యోగులను తొలగించాయి. 2023–24లో 67 స్టార్టప్స్ రూ.21,472 కోట్ల నష్టాన్ని ప్రకటించాయి. ఏఐ కంపెనీల దూకుడుఏఐ రాకతో కంటెంట్ రూపకల్పనలో వ్యయం తగ్గుతోంది. ఈ రంగంలో ప్రవేశానికి అడ్డంకులను తొలగించింది. ఏఐ ఎంట్రీతో టెక్ స్టూడియోల అవసరం తీరిపోయింది. అంతేకాదు ఖరీదైన స్టార్టప్స్ ఏర్పాటు చేయాల్సిన పనికూడా లేదు. కంటెంట్ సులువుగా, చవకగా దొరుకుతోంది. జనానికీ అందుబాటులో ఉంటోంది. ఆదాయం విషయంలో నిర్దిష్ట టర్నోవర్కు చేరుకోవడానికి కంపెనీలకు సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు నెలల్లోనే ఏఐ స్టార్టప్స్ అది సాధ్యం చేస్తున్నాయి. ఏర్పాటైన 12–18 నెలల్లోనే 10 మిలియన్ డాలర్ల వార్షికాదాయం స్థాయికి చేరుతున్నాయంటే ఏఐ కంపెనీల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.సగానికి తగ్గాయిఏఐ దూకుడు.. ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించిన స్టార్టప్లను సైతం తుడిచిపెట్టేస్తోంది. పెట్టుబడిదారులు ఇప్పుడు ఏఐ మార్పులను తట్టుకొని దీర్ఘకాలంలో లాభాలను అందించే వ్యాపార విధానాలపై దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. స్టార్టప్స్లోకి రావాల్సిన నిధులూ తగ్గుముఖం పట్టాయి. భారతీయ స్టార్టప్స్ 2021, 2022లో ఏటా 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఫండింగ్ అందుకోగా.. గత రెండేళ్లలో ఈ మొత్తం దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. 2024లో భారత్కు చెందిన అంకుర సంస్థలు 3.7 బిలియన్ డాలర్ల నిధులను దక్కించుకున్నాయి. 2025 ఆగస్ట్ నాటికి ఈ మొత్తం కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే. -
దేశంలోకి రెండేళ్లలో రూ.800 కోట్ల దొంగ బంగారం
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ద్వారా గడిచిన రెండేళ్ల కాలంలో కనీసం టన్ను బరువైన రూ.800 కోట్ల బంగారంలో దేశంలోకి దొంగచాటుగా వచ్చింది. 2023, 2024 సంవత్సరాల్లో టిబెటన్లు, చైనీయులే ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు. గతేడాది జూలైలో లద్దాఖ్లో ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) దళం 108 కిలోల విదేశీ బంగారం కడ్డీలను పట్టుకున్న నేపథ్యంలో ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు మంగళవారం ఈడీ వర్గాలు తెలిపాయి.చైనాతో మనకున్న 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్ఏసీ రక్షణ బాధ్యతలను ఐటీబీపీయే చూసుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఐదు ప్రాంతాలు, లద్దాఖ్లో ఒక చోట మంగళవారం తనిఖీలు చేపట్టామని ఈడీ వివరించింది. దొంగతనంగా తీసుకువచ్చిన బంగారానికి సంబంధించిన చెల్లింపులన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారానే పూర్తయినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపింది. పట్టుబడిన 108 కిలోల విదేశీ బంగారాన్ని చైనాకు చెందిన భు చుమ్చుమ్ అనే వ్యక్తి భారత్లోని టెండు తాషికి ఎల్ఏసీ ద్వారా పంపాడని డీఆర్ఐ వివరించింది. ఇందుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నామంది. -
ఇంజనీర్, ర్యాపర్, మేయర్, ఇప్పుడు ప్రధాని?
కాఠ్మండు: నేపాల్లో ఒకవైపు రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతుండగా మరోవైపు, అక్కడి యువత తదుపరి ప్రధానిని మీరే చేపట్టాలంటూ కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా అలియాస్ బాలేన్కు పెద్ద ఎత్తున మద్దతుగా ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో, ఇప్పుడు బాలేన్ పేరు మారుమోగిపోతోంది. రాజధానిలో పరిణామాల నేపథ్యంలో బాలేన్ ఫేస్బుక్లో మంగళవారం ..‘ర్యాలీ నిర్వాహకులు 28 ఏళ్లలోపు వాళ్లే పాల్గొనాలనే వయో పరిమితి విధించిన కారణంగానే సోమవారం జరిగిన ర్యాలీలో పాల్గొనలేకపోయా.వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం’అని పేర్కొన్నారు. ‘ఇది జెన్ జెడ్ చేపట్టిన ఆకస్మిక ఉద్యమమన్నది సుస్పష్టం. నేను కూడా వారికి పెద్దవాడిలా అనిపించవచ్చు. వారి ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆలోచనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నా. రాజకీయ పార్టీలు, నాయకులు ఈ ర్యాలీని తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరాదు.యువతకు పూర్తి మద్దతు తెలుపుతున్నా’అని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఆయన పేరు అన్ని రకాల సామాజిక మాధ్యమ వేదికల్లోనూ మారుమోగిపోయింది. ‘బాలేన్, సారథ్యం మీరే చేపట్టండి’అని ఎక్స్లో ఒకరు కోరారు. 1990లో కాఠ్మండులో పుట్టిన బాలేన్ అక్కడే సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. భారత్లోని కర్నాటకలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పీజీ చేశారు. -
మా తండ్రి ఆస్తుల్లో వాటా ఇవ్వాలి
న్యూఢిల్లీ: తమ తండ్రి దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు న్యాయ పోరాటం ప్రారంభించారు. తండ్రి ఆస్తుల్లో తమకు రావాల్సిన వాటా దక్కేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. సంజయ్ కపూర్కు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మరణానికి ముందు ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఆయన రాసినట్లు చెబుతున్న విల్లు నకిలీదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు ఆరో పించారు.ఆస్తులు మొత్తం కొట్టేయడానికి తమ సవతి తల్లి ప్రియా కపూర్(ప్రియా సచ్దేవ్) కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఎస్టేట్ మొత్తం ప్రియా కపూర్ కు దక్కేలా సంజయ్ కపూర్ విల్లు రాసినట్లు సమాచారం. అయితే, ఆ విల్లును కుట్ర పూరితంగా సృష్టించారని, అది నిజమైన విల్లు కాదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు తేల్చిచెప్పారు. దాని గురించి తమ తండ్రి సంజయ్ కపూర్ కానీ, సవతి తల్లి ప్రియా కపూర్ కానీ గతంలో ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. ఇప్పుడు ప్రియా కపూర్ దురుద్దేశంతోనే హఠాత్తుగా నకిలీ విల్లును తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. సంజయ్ కపూర్కు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టేలా ప్రియా కపూర్ను ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఏమిటీ వివాదం? ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తొలుత నందితాను వివాహం చేసుకున్నారు. 1996 నుంచి 2000 సంవత్సరం దాకా వారు కలిసున్నారు. విడాకుల తర్వాత సంజయ్ కపూర్ 2003లో కరిష్మా కపూర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్ ఉన్నారు. 2016లో అభిప్రాయభేదాల వల్ల సంజయ్ కపూర్, కరిష్మా విడిపోయారు. అనంతరం 2017 ప్రియా సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడారు. సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ 12న హఠాత్తుగా మృతిచెందిన సంగతి తెలిసిందే. లండన్లో పోలో ఆడుతుండగా గొంతులోకి తేనెటీగ దూసుకెళ్లింది.దాంతో ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని సంజయ్ తల్లి రాణి కపూర్ యూకే ప్రభుత్వాన్ని కోరారు. సంజయ్ మరణం తర్వాత ఆయన ఆస్తులపై వివాదం మొదలైంది. రెండో భార్య సంతానం, మూడో భార్య మధ్య పోరాటం సాగుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ ప్రియా సచ్దేవ్గానే ఉన్న మూడో భార్య ఇటీవలే తన పేరును ప్రియా కపూర్గా మార్చుకోవడం గమనార్హం. అంతేకాకుండా తన అత్త రాణి కపూర్పై ఒత్తిడి తెచ్చి కొన్ని రకాల పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ప్రియా కపూర్పై ఆరోపణలు వస్తున్నాయి. -
చెదిరిపోతున్న కెనడా కలలు
కెనడాలో ఉన్నత విద్య అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు అమితంగా ఆసక్తి చూపుతుంటారు. అయితే, వారి ఆశలను కెనడా ప్రభుత్వం నీరుగారుస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా 80 శాతం ఇండియన్ స్టూడెంట్ వీసా దరఖాస్తులను తిరస్కరించింది. గత పదేళ్ల కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా(ఐఆర్సీసీ) ఈ విషయం స్వయంగా వెల్లడించింది. భారతీయ విద్యార్థులే ఎక్కువగా ప్రభావితం అయినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఆసియాతోపాటు ఆఫ్రికా దేశాల విద్యార్థుల వీసా దరఖాస్తులు అధికంగా తిరస్కరణకు గురయ్యాయి. వీసాలు సులభంగా లభించే పరిస్థితి లేకపోవడంతో కెనడా విద్యాసంస్థల్లో విదేశీయుల ప్రవేశాలు సైతం తగ్గిపోతున్నాయి. 2024లో 1.88 లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడా విద్యాసంస్థల్లో చేరారు. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 3.60 లక్షలకు పైగానే ఉండేది. భారతీయ విద్యార్థులు ఇప్పుడు జర్మనీపై దృష్టి పెడుతున్నారు. 2022లో కెనడాకు ప్రాధాన్యం ఇచ్చిన భారతీయుల విద్యార్థులు 18 శాతం ఉండగా, 2024లో అది 9 శాతానికి పడిపోయింది. జర్మనీకి వైపు ఆసక్తి చూపినవారి సంఖ్య గత ఏడాది 31 శాతంగా ఉంది.ఎందుకీ పరిస్థితి?అమెరికాలో విదేశీ విద్యార్థులపై పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. విద్యార్థి వీసా నిబంధలను ప్రభుత్వం కఠినంగా మార్చింది. విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు విధించింది. కెనడా సర్కార్ సైతం ఇదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇళ్ల కొరత వేధిస్తోంది. మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో విదేశీయుల రాకను అడ్డుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.స్థానిక రాజకీయాలకు ప్రభుత్వం తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. విదేశీ విద్యార్థులపైనా ఆ ప్రభావం పడుతోంది. ఆర్థిక వనరులు బలీయంగా ఉన్న విద్యార్థులకే కెనడా వీసాలు లభించే అవకాశం ఉంది. లాంగ్వేజ్ టెస్టులోనూ మంచి ప్రతిభ చూపాల్సి ఉంటుంది. సమగ్రమైన స్టడీ ప్లాన్ సమర్పించాలి. అంతేకాకుండా రూల్స్ ఆఫ్ వర్క్ను సైతం కఠినంగా మార్చారు. చదువుకుంటూ ఖర్చుల కోసం పార్ట్టైమ్ జాబ్ చేయడం ఇక కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.గమ్యస్థానం జర్మనీఈ ఏడాది విదేశీ విద్యార్థులకు 4,37,000 వీసాలు ఇవ్వాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఏడాది కంటే 10 శాతం తక్కువ కావడం విశేషం. ఇందులో 73,000 వీసాలు పోస్ట్రుగాడ్యుయేట్ విద్యార్థులకు, 2,43,000 వీసాలు అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నిర్దేశించారు. 1,20,000 వీసాలు రెన్యూవల్స్, పాఠశాల విద్యార్థులకు సంబంధించినవి. కెనడా వీసా చాలా ఖరీదైన అంశంగా మారిపోయింది. దరఖాస్తు, టెస్టులు, ఫీజులు తడిసిమోపెడవుతున్నాయి. ఒకసారి దరఖాస్తు తిరస్కరణకు గురైతే మళ్లీ దరఖాస్తు చేసుకోలేక చాలామంది వెనక్కి తగ్గుతున్నారు.మొత్తానికి కెనడా కలలు చెదిరిపోతున్నాయి. మరోవైపు విదేశీ విద్యార్థులపైనే ఆధారపడి మనుగడ సాగించే కెనడా కాలేజీలు, యూనివర్సిటీ పరిస్థితి దారుణంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని ఇతర కాలేజీల్లో విలీనమయ్యాయి. ఇదిలా ఉండగా, కెనడాకు ద్వారాలు మూసుకుపోతుండడంతో జర్మనీ విద్యాసంస్థల్లో చేరే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. 2023లో 49,500 మంది చేరారు. 2025లో ఇప్పటికే 60,000 మంది ప్రవేశాలు పొందారు. జర్మనీలో టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ తదితర కీలక విభాగాల్లో తక్కువ ఫీజులకే మెరుగైన విద్య లభిస్తోంది. అమెరికా, కెనడాతో పోలిస్తే జర్మనీలో జీవన వ్యయం కూడా చాలా తక్కువ. ఈ అంశాలే జర్మనీని ఉన్నత విద్యకు గమస్థానంగా మారుస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ధర్మశాల/చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నీట మునిగిన పంట పొలాలు, ధ్వంసమైన ఇళ్లు, రహదారులను స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్కు తక్షణ సాయం కింద రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు.హిమాచల్ ప్రదేశ్లో ఏరియల్ సర్వే అనంతరం కాంగ్రా పట్టణంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయ పునరావాస చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్ సుఖూ పాల్గొన్నారు. వరద బాధితులు సైతం హాజరై తమ గోడు వినిపించారు. తమను ఆదుకోవాలని ప్రధాని మోదీని వేడుకున్నారు. కచ్చితంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వరదల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పునరి్నరి్మంచాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 20 నుంచి సెపె్టంబర్ 8 దాకా వరదలు, కొండచరియల కారణంగా ఏకంగా 370 మంది మృతిచెందారు. పంజాబ్లో సహాయక చర్యలపై ఆరా ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్లో పర్యటన అనంతరం పంజాబ్కు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులను కలిసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోనూ మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. గురుదాస్పూర్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. పంజాబ్కు తక్షణ సాయం కింద రూ.1,600 కోట్లు అందజేస్తామని ప్రకటించారు. భారీ వర్షాలతోపాటు సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పంజాబ్లో భారీ నష్టం వాటిల్లింది. 51 మంది మరణించారు. 1.84 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రూ.13,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రూ.20,000 కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని మోదీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.చిన్నారి నీతికతో మోదీ హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రాలో సమీక్షా సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ 14 నెలల చిన్నారి నీతికను ఎత్తుకొని బుజ్జగించారు. ప్రకృతి విలయం వల్ల అనాథగా మారిన నీతిక దీనగాథ విని ఆయన చలించిపోయారు. హిమాచల్ప్రదేశ్లో మండీ జిల్లాలోని తల్వార గ్రామంలో జూన్ 30న రాత్రిపూట హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. గ్రామంపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. ఓ ఇంట్లో రమేశ్ కుమార్(31), రాధాదేవి(24) దంపతులు తమ కమార్తె నీతికతోపాటు తల్లి పూనమ్దేవితో కలిసి నిద్రిస్తున్నారు. ఇంట్లోకి బురద చొచ్చుకొచ్చింది.నీతికను వంట గదిలో పడుకోబెట్టి బురదను తొలగించేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. ఇంతలో భారీ కొండచరియ ఆ ఇంటిపైకి దూసుకొచ్చింది. వంట గది మినహా ఆ ముగ్గురున్న గది నేలమట్టమైంది. రమేశ్ కుమార్, రాధాదేవి, పూనమ్దేవి బురదతోపాటు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వంట గదికి నష్టం జరగకపోవడంతో నీతిక ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో నీతిక వయసు 11 నెలలే. నీతికను హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం ‘చైల్డ్ ఆఫ్ ద స్టేట్’గా ప్రకటించింది. ఆమె చదువుతోపాటు జీవనానికి అయ్యే ఖర్చులు భరిస్తామని ప్రకటించింది. -
ఆగ్రహ జ్వాలలు
కాఠ్మండు/న్యూఢిల్లీ: సోషల్ మీడియా యాప్లపై నిషేధంతోపాటు విద్యార్థులు, యువత సోమవారం మొదలెట్టిన ఆందోళనలు మెరుపువేగంతో నేపాల్ను చుట్టేసి దేశాన్ని సంక్షోభ కుంపట్లోకి నెట్టేశాయి. సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరిస్తున్నామని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది గంటల్లోనే స్పష్టంచేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. రాజధాని కాఠ్మండు మొదలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత తమ నిరసనజ్వాలలను మరింతగా ఎగదోస్తూ ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. మంగళవారం ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగాయి. కాళీమతిలో పోలీస్సర్కిల్కు నిప్పుపెట్టి అధికారులపై దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.దీంతో ఇద్దరు చనిపోయారు. దీంతో కాల్పులు, పరస్పర ఘర్షణ ఘటనల్లో మరణాల సంఖ్య మంగళవారానికి 22కు పెరిగింది. 300 మందికిపైగా గాయపడ్డారు. కట్టలు తెంచుకున్న యువాగ్రహాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం తన పదవికి రాజీనామాచేశారు. భద్రంగా ఇంటి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను బతిమాలుకున్నట్లు వార్తలొచ్చాయి.ఆందోళనకారుల నిరసన కార్యక్రమం అదుపుతప్పి మాజీ ప్రధానమంత్రి, తాజా మంత్రులపై భౌతికదాడులదాకా వెళ్లింది. ప్రధాని ఓలీకి చెందిన భక్తపూర్లోని బాల్కోట్ నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రకార్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను సమీప కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా ఆస్తుల విధ్వంసం, వినాశనంతో నేపాల్ నిలువెల్లా రక్తమోడింది. దుకాణాల లూటీలు, పౌరుల భయాందోళనల నడుమ ప్రధాని రాజీనామాతో ఎట్టకేలకు సైన్యం పూర్తస్థాయిలో రంగంలోకి దిగి శాంతభద్రతల పరిరక్షణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకుని ప్రజల ఆస్తులను ధ్వంసంచేస్తూ లూటీలకు తెగించిన వాళ్ల అంతుచూస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, రాజకీయ వారసత్వం, సంపన్న, ఉన్నతస్థాయి వర్గాల ఆధిప్యంపై ఇప్పటికే విసిగిపోయిన యువత తాజాగా సామాజికమాధ్యమాలపై హఠాత్తుక నిషేధం విధించడంతో వాళ్లలో ఆగ్రహం పెల్లుబికి మహోద్యమంగా మారడంతో దేశ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. పెల్లుబికిన ఆగ్రహం పరిస్థితిని మరింతగా కట్టుతప్పొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. అయినాసరే వేలాదిమంది విద్యార్థులు, యువత ‘జెన్ జెడ్’కూటమిగా ఏర్పడి రాజధాని కాఠ్మండు మొదలు పట్టణాలదాకా విధ్వంసానికి తెగించారు. మాజీ ప్రధానమంత్రులు మొదలు తాజా కేబినెట్ మంత్రులు, కీలక నేతల దాకా ముఖ్యమైన వ్యక్తుల ఇళ్లకు నిప్పంటించారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలనూ ధ్వంసంచేశారు. కనిపించిన ప్రతి ఒక్క రాజకీయ నేతను చితకబాదారు. దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్(ప్రచండ), ప్రస్తుత కమ్యూనికేషన్స్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోం మంత్రి రమేశ్ లఖ్హార్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాల ఇళ్లను నాశనంచేశారు. ఆందోళనలు కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ తాకాయి. దీంతో ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దుచేసి ఎయిర్పోర్ట్ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. ఎటుచూసినా విధ్వంసమే ఆందోళనలను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పార్టీల హెడ్ఆఫీస్లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా ప్రతి దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల ఆగ్రహజ్వాలల బారినపడ్డాయి. డల్లూ ఏరియాలోని మాజీ ప్రదాని ఝలానాథ్ నివాసానికి నిప్పుపెట్టారు. కపన్ ప్రాంతంలోని నేపాలీ కాంగ్రెస్ నేత ఇంటిని తగులబెట్టారు.సింఘదర్బార్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం భవనానికీ నిప్పుపెట్టారు. మహరాజ్గంజ్లోని అధ్యక్షకార్యాలయం, బలూవతార్లో ప్రధాని అధికారి నివాసం సైతం నిప్పురవ్వల వర్షంలో కాలిపోయాయి. టిన్కునేలో కాంతిపూర్ టెలివిజన్ ఆఫీస్ను ధ్వంసంచేశారు. బుద్ధనీలకంఠ ప్రాంతంలోని మాజీ ప్రధాని షేర్బహదూర్ దేవ్బా ఇంట్లో చొరబడి దేవ్బా, భార్య అర్జూ రాణాలను రక్తంకారేలా కొట్టారు. దీంతో ప్రాణభయంతో ఆయన పచ్చికబయళ్లకు పరుగులుపెట్టారు. విషయం తెల్సుకుని సైన్యం రంగంలోకి దిగి ఆయనను నిరసనకారుల బారినుంచి కాపాడింది.దేవ్బా కుమారుడు జైబీర్కు చెందిన కాఠ్మండులో హిల్టన్ ఐదునక్షత్రాల హోటల్కు, అర్జూకు చెందిన ఖుమల్తార్లోని ఉలెన్స్ పాఠశాలకు, తోఖాలో మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ ఇంటికి నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌదెల్ను వీధిలో పరుగెత్తించిమరీ చితక్కొట్టారు. వెనక నుంచి ఆయన్ను ఒకతను వీపుమీద ఎగిరి తన్నుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గోశాల, లూభూ, కాళీమతి పోలీస్పోస్ట్లకూ నిరసనకారులు నిప్పుపెట్టారు. కలాంకీ, కాళీమతి, తహచల్, బనేశ్వర్, నైకాప్, ఛియాసల్, ఛపగావ్, థేచో ఇలా ప్రతి ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించారు.టైర్లు తగలబెట్టి రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యాలయ భవనం ఎక్కి పార్టీ జెండాను చింపేశారు. పోఖ్రా పట్టణంలో ఆందోళనకారులు కారాగారం గోడలు బద్దలుకొట్టారు. దీంతో జైలులోని 900 మంది ఖైదీలు బయటకు పరుగులుతీశారు. కాఠ్మండూలోని నఖూ జైలుకూ ఇదే గతి పట్టింది. దీంతో ఇక్కడి ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో మాజీ హోం మంత్రి రవి లమీచ్ఛానే సైతం ఉన్నారు. ఇదే అదనుగా కొన్ని అల్లరిమూకలు దుకాణాలను లూటీ చేశాయి. దిగిపోవాలని డిమాండ్ చేసి దింపేశారుమంగళవారం ఉదయం ప్రధాని కేపీ శర్మ ఓలీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన వందలాది మంది ఆందోళనకారులు తర్వాత లోపలికి చొరబడి శర్మను వెంటనే గద్దె దిగాలని మొండిపట్టుపట్టారు. ‘‘కేపీ దొంగ, దేశాన్ని వీడిపో’’అంటూ పెద్దగా నినాదాలు చేశారు. తప్పని పరిస్థితుల్లో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు రాంచంద్రకు లేఖ రాశారు. ‘‘నేపాల్ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిస్థితి కుదుటపడేందుకు రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా తగు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నా’’అని 73 ఏళ్ల సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్కిస్ట్–లెనినిస్ట్) నేత శర్మ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.వెంటనే రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు. అయితే నూతన మంత్రివర్గం ఏర్పడేదాకా ఆయనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారని దేశాధ్యక్షుడు చెప్పారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అండతో గత ఏడాది జూలైలో శర్మ నాలుగోసారి ప్రధాని పదవిని చేపట్టడం తెల్సిందే. శర్మ దిగిపోవాలని నేపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి గగన్ థాపా సైతం అంతకుముందే డిమాండ్చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగించే శర్మీ తరచూ భారతవ్యతిరేక విధానాలను అవలంభించే నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత షెడ్యూల్ ప్రకారం ఈనెలలోనే భారత్లో పర్యటించాల్సి ఉండగా ఆలోపే పదవీసన్యాసం చేశారు. అయితే శర్మ దేశాన్ని వీడి దుబాయ్కు వెళ్లనున్నారని, ఆయన కోసం రన్వే మీద హిమాలయ ఎయిర్లైన్స్ విమానాన్ని సిద్ధంగా ఉంచారని వార్తలొచ్చాయి. అగ్నికి ఆహుతవుతున్న ప్రధాని ఇల్లు బాణసంచా కాల్చి.. పారిపోకుండా ఆపి.. నేపాల్ నుంచి పారిపోయేందుకు నేతలకు హెలికాప్టర్ సేవలను అందిస్తోందన్న పుకార్లతో సిమ్రిక్ ఎయిర్లైన్స్ భవంతిని ఆందోళనకారులు తగలబెట్టారు. భైసేపతి మంత్రుల క్వార్టర్స్ నుంచి మంత్రులు విదేశాలకు హెలికాప్టర్లలో పారిపోతున్నారన్న వార్తలతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ రన్వేల సమీపంలో బాణసంచా, రాకెట్లు కాల్చారు. దీంతో ఆకాశంలో పొగచూరింది. డ్రోన్లు ఎగరేసి, పౌర లేజర్లైట్లు రన్వే వైపు ప్రసరింపజేసి విమాన రాకపోకలను అడ్డుకోవాలని ప్రజలకు ఆందోళనకారులు సోషల్మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అయితే అప్పటికే కొన్ని హెలికాప్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయని వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు, వీవీఐపీలు ఆర్మీ బ్యారెక్లలో తలదాచుకున్నారు. పార్లమెంట్ను రద్దుచేయండి: బాలెన్ షా యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న కాఠ్మండు నగర మేయర్, 35 ఏళ్ల బాలేంద్ర షా మాత్రం వెంటనే పార్లమెంట్ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ‘‘నిరసనకారులు శాంతించాలి. విద్యార్థి బృందాలు తక్షణం ఆర్మీ చీఫ్తో చర్చలకు సంసిద్ధమవ్వాలి. అంతకుముందే పార్లమెంట్ను రద్దుచేయాలి’’అని అన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, తాము ఎంపీలుగా రాజీనామా చేస్తామని రా్రïÙ్టయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ప్రకటించారు. ఉద్యమానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. తాను సైతం రాజీనామా చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ చెప్పారు. చర్చించుకుందాం.. రండి ఆందోళనను విడనాటి చర్చలకు రావాలని జెన్ జెడ్ విద్యార్థి, యువలోకానికి దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్ పిలుపునిచ్చారు. శాంతి, సుస్థిరతకు అందరం పాటుపడుతున్నామంటూ నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్రాజ్ సిగ్దెల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నారాయణ్ ఆర్యల్, హోం సెక్రటరీ గోకర్ణ దవాదీ, సాయుధ పోలీసు బలగాల చీఫ్ రాజు ఆర్యల్, ఐజీ చంద్ర కుబేర్, జాతీయ దర్యాప్తు విభాగ సారథి హుత్రాజ్ థాపా సంతకాలు చేసి ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశారు.అయితే 26 సోషల్మీడియా సైట్ల పునరుద్దరణతోపాటు వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా రాజకీయనేతలకూ రిటైర్మెంట్ వయసును ప్రకటించాలని పలు డిమాండ్లను యువత ప్రభుత్వం ముందుంచింది. మంత్రులు, ఉన్నతవర్గాల కుటుంబాలే సకల సౌకర్యాలను పొందుతున్నాయని ఉద్యమకారులు సోషల్మీడియాలో ప్రచారాన్ని మొదలెట్టారు. పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వం, ఆర్మీ దేశంలో మళ్లీ శాంతిని నెలకొల్పాలని నేపాల్లోని ఆ్రస్టేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, బ్రిటన్, అమెరికా రాయబార కార్యాలయాలు సంయుక్త ప్రకటనలో అభ్యర్థించాయి. ఉద్యమాలు శాంతియుతంగా సాగాలని హింసాత్మక పథం పనికిరాదని ఐక్యరాజ్య సమితి సైతం హితవు పలికింది. -
కొత్త ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ 15వ ఉపరాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తరఫున పోటీ చేసిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా జస్టిస్ సుదర్శన్రెడ్డి 300 ఓట్లు పొందారు. దీంతో 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. దీంతో రాధాకృష్ణన్ త్వరలోనే ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేపట్టనున్నారు. తమిళనాడు నుంచి ఈ పదవిని అధిష్టించిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్ల తర్వాత మూడో నాయకుడిగా సీపీ రాధాకృష్ణన్ చరిత్రకెక్కారు. ఘన విజయం... ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నూతన పార్లమెంట్ భవనంలోని ‘వసుధ ఎఫ్–101’లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ పోలింగ్లో మొత్తంగా 767 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 6, లోక్సభలో ఒక ఖాళీ స్థానాన్ని పక్కనబెడితే లోక్సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది కలిపి 781 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ముందే ప్రకటించినట్లుగా బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎంపీలు, ఏడుగురు బీజేడీ ఎంపీలతోపాటు శిరోమణి అకాలీదళ్ ఎంపీ ఒకరు, స్వతంత్ర ఎంపీ సరబ్జీత్సింగ్ ఖల్సా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో మొత్తంగా 767 (98.2 శాతం) ఓట్లు పోలయ్యాయి. విజయానికి అవసరమైన ఓట్లను 377గా నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్లను లెక్కించి రాత్రి 7:30 గంటలకు ఫలితాన్ని ప్రకటించారు. మొత్తం పోలైన 767 ఓట్లలో చెల్లని ఓట్లు 15 ఉండగా మిగిలిన 752 ఓట్లలో రాధాకృష్ణన్కు 452 మొదటి ప్రాధాన్యతా ఓట్లు లభించాయని.. జస్టిస్ బి.సుదర్శన్రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు. అనుకున్నట్లే క్రాస్ ఓటింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. ఇండియా కూటమిలోని పక్షాలు, తమకు మద్దతుగా వచ్చిన ఆప్ సహా ఇతర చిన్నాచితక పార్టీలతో కలిసి కాంగ్రెస్ కనీసం 324 ఓట్లు వస్తాయని అంచనా వేసింది. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ప్రతిపక్షాలు ఐక్యంగా నిలబడ్డాయి. కూటమికి చెందిన 315 మంది ఎంపీల్లో అందరూ ఓటింగ్ కోసం హాజరయ్యారు’అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతోపాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 20–25 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాధాకృష్ణన్కు ఎన్డీయే కూటమిలోని 427 మంది ఎంపీల మద్దతు ఉందని బీజేపీ కాగితంపై లెక్కలేసుకోగా పోలింగ్లో మాత్రం అంతకన్నా ఎక్కువగానే ఓట్లు లభించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలో నిర్వహించిన సమర్థవంతమైన ఫ్లోర్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్డీయే సునాయాశ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ కూటమి పక్షాలకు రెండ్రోజులపాటు నిర్వహించిన శిక్షణా తరగతులు, మిత్రపక్షాలతో సమన్వయం, పోలింగ్కు ముందు ప్రాంతాలవారీగా ఎంపీలతో సమన్వయం రాధాకృష్ణన్ గెలుపునకు దోహదం చేసిందని చెబుతున్నారు. మిన్నంటిన సంబరాలు.. సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించిన వెంటనే బీజేపీలో సంబరాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి నివాసం ముందు తమిళనాడు సంప్రదాయాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సీపీ రాధాకృష్ణన్కు బీజేపీ ఎంపీలతోపాటు ఆయనకు మద్దతిచ్చిన పక్షాల ఎంపీలు శుభాకంక్షలు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, ఖర్గే శుభాకాంక్షలు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర అమిత్ షా సహా పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్ట్లు చేశారు. ‘ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్కు అభినందనలు. ప్రజాజీవితంలో దశబ్దాల గొప్ప అనుభవం, దేశ పురోగతికి గణనీయంగా దోహడపతుంది. విజయవంతమైన, ప్రభావవంతమైన పదవీకాలం కోసం మీకు ఇవే నా శుభాకాంక్షలు’అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాధాకృష్ణన్కు ఎంపీగా, వివిధ రాష్ట్రాల గవర్నర్గా గొప్ప అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ చురుకైనవి. గవర్నర్గా పదవీకాలంలో, సాధారణ పౌరులు ఎదుర్కొన్న సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. ఈ అనుభవాలు ఆయనకు శాసన, రాజ్యాంగ విషయాలపై అపార జ్ఞానం ఉందని నిర్ధారించాయి. ఆయన స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకం ఉంది‘ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాధాకృష్ణన్ నాయకత్వ లక్షణాలను, పరిపాలనపై ఆయనకున్న లోతైన జ్ఞానాన్ని అమిత్ షా ప్రశంసించారు. రాధాకృష్ణన్ అనుభవం, అట్టడుగు స్థాయి నేపథ్యం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అణగారిన వర్గాలకు సేవ చేయడానికి సహాయపడతాయని షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగువ సభ సంరక్షకుడిగా ఆయన కొత్త పాత్రలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి పెదవివిప్పని జగ్దీప్ ధన్ఖడ్.. సీపీ రాధాకృష్ణన్ విజయం నేపథ్యంలో తొలిసారి స్పందించారు. ప్రజాజీవితంలో రాధాకృష్ణన్కు ఉన్న అపార అనుభవంతో ఉపరాష్ట్రపతి కార్యాలయం మరింత ఖ్యాతిని పొందుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు లేఖ రాశారు. ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నాం: ఖర్గే ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు. ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్రెడ్డి పోరాటానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాధాకృష్ణన్ పార్లమెంటరీ సంప్రదాయాల అత్యున్నత నైతికతను నిలబెట్టుకుంటారని, ప్రతిపక్షాలకు గౌరవాన్ని ఇస్తారని, ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నా. వర్షాకాల సమావేశాల్లో జగదీప్ ధన్ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు, ఇది ఎందుకు అనేది ఎప్పటికీ వివరించలేం. రాజ్యాంగ స్థానాలపట్ల గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.