breaking news
National
-
బెంగాల్లో తృణమూల్, బీజేపీ నువ్వా నేనా?
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు మరోసారి దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఒకరకంగా చెప్పాలంటే ‘సర్’కు ముందు, తర్వాత అన్నట్టుగా పరిణమించాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియకు ముందు వరకూ సీఎం మమతా బెనర్జీయే రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా వెలుగొందారు. కానీ ఓటర్ల జాబితా సవరణతో అధికార తృణమూల్ పార్టీ ఓటు బ్యాంకు భారీగా ప్రభావితమైనట్టు కన్పిస్తోంది. దాంతో ఈ ఎన్నికల్లో ‘సర్’ప్రక్రియనే ప్రధాన ప్రచారాంశంగా చేసుకోవాలని దీదీ నిర్ణయించారు! ‘సర్’సాకుతో బెంగాలీల అస్తిత్వంపైనే దెబ్బ కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబడుతున్నారు. దాంతో సర్ ప్రక్రియ బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసేలా కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర అంశాలు, సమస్యలు ఎన్నున్నా ఈసారి కూడా రాష్ట్రంలో ఎన్నికలు మరోసారి ‘మమత వర్సెస్ మోదీ’అన్నట్టుగానే జరగనున్నాయి.ఇద్దరు పాపులర్ నేతల పోరులో అంతిమంగా పైచేయి సాధించేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ దూకుడుకు మరోసారి ముకుతాడేసి వరుసగా నాలుగోసారి విజయఢంకా మోగించాలని తృణమూల్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యలు, పలు రంగాల్లో మమత సర్కారు వైఫల్యాలు తదితరాలను అస్త్రాలుగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. 2021 ఎన్నికల్లో తృణమూల్కు గట్టి పోటీ ఇచ్చి 77 సీట్లు కైవసం చేసుకున్న ఆ పార్టీ, ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా చొచ్చుకుపోయి బెంగాల్పై తొలిసారిగా కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో సున్నా చుట్టి పూర్తిగా చతికిలపడ్డ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గట్టిగా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.పశ్చిమబెంగాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అధికార బీజేపీ, విపక్ష తృణమూల్ కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మమత దూకుడుకు ముకుతాడేసి ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా విజయఢంకా మోగించాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి బెంగాల్పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. త్వరలో వారిద్దరూ రాష్ట్రంలో సుడిగాలి ప్రచారానికి తెర తీయనున్నారు. మోదీ కరిష్మా రాష్ట్రంలో ఈసారి అధికారం కట్టబెట్టడం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది. 15 ఏళ్లుగా సాగుతున్న తృణమూల్ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత బాగా కలిసొచ్చే అంశమన్నది ఆ పార్టీ భావన. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్న ప్రచారం కూడా తృణమూల్కు గట్టిగానే చేటుచేసేలా కన్పిస్తోంది.ముఖ్యంగా మహిళలకు భద్రతే లేకుండా పోయిందంటూ బీజేపీ ఇప్పటికే హోరెత్తిస్తోంది. హిందూత్వవాదంపై కూడా కాషాయ పార్టీ గట్టిగానే నమ్మకం పెట్టుకుంది. తద్వారా ముస్లిమేతర ఓట్లు సంఘటితం అవుతాయని, పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటములను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుందని భావిస్తోంది. మొండితనానికి, పోరాటానికి మారుపేరైన దీదీ కూడా కాషాయ దళానికి దీటుగా ఎన్నికల వ్యూహరచన చేస్తోంది. సర్ ప్రక్రియను వ్యతిరేకించే క్రమంలో ఆమె ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లడం వంటివి కలిసొస్తాయని తృణమూల్ భావిస్తోంది. మమతకున్న ‘సామాన్యురాలి’ ఇమేజీపైనే మరోసారి నమ్మకం పెట్టుకుంది. అయితే మంత్రులు, నేతల అవినీతి బాగోతాలు అధికార పార్టీకి తీవ్రంగా చేటుచేసేలా కన్పిస్తున్నాయి. అవినీతి ఆరోపణల మచ్చను ఏ మేరకు చెరుపుకోగలదన్నది ఆసక్తికరం.లెఫ్ట్, కాంగ్రెస్ నేల చూపులు 1977 నుంచి 2011 దాకా బెంగాల్ను సుదీర్ఘంగా పాలించిన వామపక్ష కూటమి పరిస్థితి రాష్ట్రంలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఓట్ల శాతం కేవలం 4.73కి పడిపోయిన పరిస్థితి! కాంగ్రెస్దీ అదే పరిస్థితి. లెఫ్ట్ ఫ్రంట్కు, హస్తం పార్టీకి గత ఎన్నికల్లో కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు! దాంతో అవి ఈసారి ఎంతోకొంత పుంజుకుని ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాయి.బీజేపీకి ‘ఎల్పీజీ’దడ ఎన్నికలు సమీపించిన తరుణంలో పశ్చిమాసియా యుద్ధం బీజేపీకి అనుకోని సమస్య తెచ్చిపెట్టింది. నానాటికీ తీవ్రమవుతున్న ఎల్పీజీ కొరత సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. పరిస్థితి తక్షణం చక్కబడకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రతికూలాంశంగా మారగలదని బీజేపీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. మరోవైపు మమతకు మాత్రం ఈ అంశం అనుకోకుండా అందివచ్చిన అస్త్రంగా మారేలా కనిపిస్తోంది. పోలింగ్కు మరో నెల రోజులున్నందున ఈలోపు సమస్యను మోదీ సర్కారు ఏ మేరకు చక్కదిద్దగలదన్నది చూడాల్సిందే.కీలకంగా ‘సర్’ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ బెంగాల్లో కీలక ఎన్నికల అంశంగా మారింది. ఓటర్ల జాబితా సవరణ ఫలితంగా రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.44 కోట్లకు తగ్గింది. ఏకంగా 1.2 కోట్లకు పైగా ఓట్లు తొలగింపుకు గురవడంతో పలు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకరణాలే అనూహ్యంగా తారుమారయ్యే పరిస్థతి నెలకొంది! ముఖ్యంగా 60 లక్షలకు పైగా ముస్లిం ఓట్ల తొలగింపు తృణమూల్ను గట్టిగా దెబ్బతీయనుంది.రాజధాని కోల్కతాతో పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దాని ఓటు బ్యాంకు తగ్గడం బీజేపీకి లాభించేలా కన్పిస్తోంది. ఆయాచోట్ల తమ ఓట్లు భారీగా తొలగింపుకు గురైనట్టు తృణమూల్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించింది. అందుకే సర్ ప్రక్రియను కీలక ప్రచారాస్త్రంగా మలచుకోవాలని మమత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాన్ని బెంగాలీల అస్తిత్వంపై కేంద్రం దాడిగా చిత్రిస్తున్నారు. సర్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకంగా సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు విన్పించారామె! ఇది రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆమె ఇమేజీని మరింత పెంచిందని తృణమూల్ అంటోంది.అయితే 24 పరగణాలు, నాదియా వంటి బంగ్లా సరిహద్దు జిల్లాల్లో బీజేపీ ఓటుబ్యాంకుకు కూడా సర్ ప్రక్రియ కొంతమేరకు గండి కొట్టింది. అక్కడ బీజేపీకి పట్టున్న మథువా, రాజ్బన్షీ సామాజిక వర్గాల ఓటర్లు భారీగా తొలగింపుకు గురయ్యారు. అయినా సరే, అక్రమ వలసదారుల ఓట్లతోనే మమత అధికారం చేపడుతూ వస్తున్నారని రాష్ట్ర బీజేపీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. బీజేపీ సానుకూలతలు డబుల్ ఇంజన్ ప్రభుత్వ నినాదం మమత ప్రభుత్వంపై వ్యతిరేకత సర్ ప్రక్రియతో పలు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు అవకాశాలు మెరుగవడం టీచర్లు, ఆశా వర్కర్లు తదితరుల దన్ను ప్రతికూలతలు చరిష్మా ఉన్న నాయకుడు లేకపోవడం తృణమూల్తో పోలిస్తే క్షేత్రస్థాయిలో బలహీనం కేంద్ర నాయకత్వంపై ఆధారపడటం సర్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం నానాటికీ తీవ్రమవుతున్న ఎల్పీజీ కొరతతృణమూల్ కాంగ్రెస్ సానుకూలతలు మమత పాపులారిటీ మహిళల్లో ఆదరణ క్షేత్రస్థాయిలో పార్టీకున్న పట్టు లక్ష్మీర్ బంధర్, స్వాస్థ్య సాథి, యువ సాథి వంటి పథకాలు సర్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం ఎన్నికలను రాష్ట్రం వర్సెస్ కేంద్రంగా మలచడంలో విజయం ప్రతికూలతలు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నందున తీవ్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత నేతలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో పెచ్చరిల్లిన నేరాలు సర్ ప్రక్రియతో పలుచోట్ల ఓటు బ్యాంకుకు గండి -
ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం!
మానవ మనుగడకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుత రోజుల్లో రసాయన ఎరువులపై మితిమీరి ఆధారపడటం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అస్థిరమైన గ్లోబల్ మార్కెట్లు మన ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవసాయ రంగం ప్రకృతి సాగువైపు అడుగులు వేయడం కేవలం పర్యావరణ హితం మాత్రమే కాదు.. దేశ ఆర్థిక, ఆరోగ్య భద్రతకు అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుత ఆధునిక వ్యవసాయం శిలాజ ఇంధనాలతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. ఐపీఈఎస్-ఫుడ్ 2024-25 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లభించే పెట్రోకెమికల్స్లో 40%, శిలాజ ఇంధనాల్లో 15 కేవలం ఆహార వ్యవస్థలకే వినియోగిస్తున్నారు. అంటే, అంతర్జాతీయ ఇంధన ధరల్లో వచ్చే స్వల్ప మార్పు కూడా సామాన్యుడి కంచంలోని ఆహార ధరను ప్రభావితం చేస్తోంది.రసాయన ఎరువుల సెగప్రపంచవ్యాప్త ప్రోటీన్ వినియోగంలో 40% కేవలం ‘హేబర్-బోష్’(గాలిలో ఉండే నైట్రోజన్ను మొక్కలకు ఉపయోగపడే అమ్మోనియాగా మార్చే పద్ధతి) ప్రక్రియ ద్వారా తయారయ్యే సింథటిక్ నైట్రోజన్ ఎరువులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం యూరియా ధర టన్నుకు 585 డాలర్ల వద్ద ఉండగా భవిష్యత్తులో ఇది 650-700 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం తన అమ్మోనియా, సల్ఫర్ దిగుమతుల్లో 2/3 వంతు గల్ఫ్ దేశాల నుంచే పొందుతోంది. అక్కడ తలెత్తే రాజకీయ అనిశ్చితి మన పొలాల్లో ఎరువుల కొరతకు దారితీస్తోంది.శాస్త్రీయ వాస్తవాలుఐపీసీసీ(ఇంటర్గవర్న్మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్) హెచ్చరికల ప్రకారం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంట కాలాలను కుదించేస్తున్నాయి. దేశంలో ఇది ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల గోధుమల దిగుబడి తగ్గుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వరిసాగులో గింజ గట్టిపడే ప్రక్రియ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యాంత్రాంగం స్పందించి వరి, గోధుమలపైనే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల వైపు సాగును మళ్లించాల్సిన సమయం ఆసన్నమైంది.రసాయన సాగు వల్ల నేలతోపాటు మానవులు రోగాల బారిన పడుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం, ఆహారంలో రసాయన అవశేషాల వల్ల అంటువ్యాధులు కాని రోగాలు (ఎన్సీడీ) వేగంగా పెరుగుతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడం వల్ల పరాగ సంపర్కం చేసే కీటకాలు అంతరించిపోతున్నాయి. ఇది దిగుబడుల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది.మార్పు కోసం వ్యూహంప్రకృతి సాగు వైపు మార్పు అనేది ఒక్కరోజులో జరిగే పనికాదు. ఇది క్రమబద్ధంగా శాస్త్రీయంగా జరగాలి. దీనికోసం ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని సూత్రాలను నిపుణులు సూచిస్తున్నారు.రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను ప్రోత్సహించాలి.నేల ఆరోగ్యం, సూక్ష్మజీవుల పాత్ర, చెట్లు-పశువులు-పంటల కలయికపై వ్యవసాయ పరిశోధనా సంస్థలు దృష్టి సారించాలి.ఎరువుల కోసమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడే రైతులకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించే వారికి ప్రోత్సాహకాలు అందించాలి.ప్రకృతి సాయంతో తయారైన ఉత్పత్తులకు ప్రత్యేక సరఫరా గొలుసును నిర్మించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలి.యుద్ధాలను, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను వెంటనే నియంత్రించలేకపోవచ్చు. కానీ, మన ఆహారాన్ని ఎలా పండించుకోవాలో మనం నిర్ణయించుకోగలం. పెట్టుబడి తగ్గించి, ప్రకృతితో మమేకమయ్యే సాగు ద్వారానే మన భూమిని, భావితరాల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని గుర్తుంచుకోవాలి. -
ఇన్సూరెన్స్ ప్రీమియంల మోత.. నో లాజిక్!
ఆరోగ్య బీమా ప్రీమియంల పెంపుపై బీమా కంపెనీలు చెబుతున్న వాదనలకు, వాస్తవాలకు పొంతన లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. వైద్య ఖర్చుల పెరుగుదల (మెడికల్ ఇన్ఫ్లేషన్) కారణంగానే ప్రీమియంలు పెంచుతున్నామన్న కంపెనీల వాదనను బలపరిచేలా ఎలాంటి అధికారిక అధ్యయనాలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సామాన్యులపై భారంగా మారిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వ్యవహారంపై కేంద్రం చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.అధ్యయనం లేదు.. ఆధారాల్లేవు!బీమా రంగ నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) వద్ద దీనిపై నిర్దిష్టమైన డేటా లేదని మంత్రి తెలిపారు. మెడికల్ ఇన్ఫ్లేషన్ రేటుకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పెంపునకు మధ్య గల సంబంధంపై ఐఆర్డీఏఐ ఎటువంటి ప్రత్యేక అధ్యయనం నిర్వహించలేదు.కేవలం వైద్య ఖర్చులే కాకుండా పాలసీదారుల సగటు వయసు పెరగడం, క్లెయిమ్ హిస్టరీ, మెరుగైన పాలసీ ఫీచర్లు వంటి అనేక అంశాలు ప్రీమియం పెంపులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో కేవలం వైద్య ద్రవ్యోల్బణం వల్ల మాత్రమే ఎంత శాతం ప్రీమియం పెరిగిందో విడదీసి చూడటం సాధ్యం కాదని మంత్రి వివరించారు.కంపెనీల వాదన.. వాస్తవ పరిస్థితిసాధారణంగా బీమా కంపెనీలు దేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ 12-14 శాతం మధ్య ఉందని, ఇది సాధారణ ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు అని వాదిస్తుంటాయి. కరోనా అనంతర కాలంలో కొన్ని కంపెనీలు తమ ప్రీమియంలను ఏకంగా 100 శాతం వరకు పెంచేశాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది తమ 65 శాతం ఉత్పత్తుల ధరలను పెంచడానికి వైద్య ఖర్చులే కారణమని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం తాజా వివరణతో కంపెనీల ‘ద్రవ్యోల్బణ సాకు’ బలహీనపడింది.బీమా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి వైద్య ఖర్చులను సాకుగా చూపిస్తున్నాయనే ఆరోపణలకు కేంద్ర మంత్రి సమాధానం బలాన్ని చేకూర్చింది. పారదర్శకత లేని ప్రీమియం పెంపుదలపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఐఆర్డీఏఐ మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు. -
భారత్కు మరో భారీ ఎల్పీజీ నౌక
వదినార్ (గుజరాత్): పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ భారత్కు ఊరటనిచ్చే వార్త వినిపించింది. దేశంలో ఎల్పీజీ కొరత వెంటాడుతున్న తరుణంలో 47,000 మెట్రిక్ టన్నుల గ్యాస్తో కూడిన ‘నందా దేవి’ నౌక సురక్షితంగా గుజరాత్లోని వదినార్ పోర్టుకు చేరుకుంది. ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధిని దాటుకుని భారత్ చేరుకున్న రెండో భారీ ఎల్పీజీ నౌక ఇది.నౌకాదళాల పహారాలో ప్రయాణంయుద్ధ వాతావరణం నడుమ అత్యంత ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతం గుండా ఈ నౌక ప్రయాణించింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖతో పాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. భారత నౌకాదళం, ఇరానియన్ నేవీలు సంయుక్తంగా ఈ నౌకకు రక్షణ కవచంలా నిలిచి ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను దాటించాయి.తీరనున్న కొరతప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం దృష్ట్యా, ఈ 47,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్కు ఎంతో కీలకం కానుంది. వదినార్ నుంచి ఈ నౌక కాండ్లా పోర్టుకు వెళ్లనుందని, అక్కడ గ్యాస్ను అన్లోడ్ చేస్తారని అధికారులు తెలిపారు. ‘ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా దేశ అవసరాలకు తగ్గట్లుగా ఎల్పీజీ సరఫరాను కొనసాగిస్తాం’ అని నందా దేవి నౌక చీఫ్ ఆఫీసర్ హర్షం వ్యక్తం చేశారు.వరుసగా చేరుతున్న నౌకలుఇంతకుముందే 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్తో ‘శివాలిక్’ అనే నౌక ముంద్రా పోర్టుకు చేరుకుంది. ఇందులో 20,000 టన్నులను ముంద్రాలో, మిగిలిన 20,000 టన్నులను మంగళూరులో అన్లోడ్ చేయనున్నారు. వీటితో పాటు యూఏఈ నుంచి 81,000 టన్నుల ముడి చమురుతో వస్తున్న ‘జగ్ లాడ్కి’ నౌక కూడా భారత్ వైపు వస్తోంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భారత జెండాతో ఉన్న మరో 22 నౌకలు ప్రయాణిస్తున్నాయి. అందులోని 611 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ఈ వరుస సరఫరాలతో దేశంలో గ్యాస్, ఇంధన కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
ముదురుతోన్న సంక్షోభం.. కీలక రంగాలకు ముప్పు
పశ్చిమాసియాలో అలుముకున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ పదకొండో రోజుకు చేరుకోవడంతో.. కేవలం చమురు, సహజ వాయువు సరఫరా మాత్రమే కాకుండా, నిత్యవసర రంగాలు సైతం సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఎరువులు, అల్యూమినియం, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పాటు ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అన్నదాతపై ఎరువుల సెగభారతదేశంలో విత్తనాల సీజన్ (ఖరీఫ్) ప్రారంభంకానున్న తరుణంలో ఎరువుల కొరత ఆందోళన కలిగిస్తోంది. దేశీయ ఎరువుల అవసరాల్లో 30% దిగుమతుల ద్వారానే తీరుతుండగా అందులో 40% వాటా ఒక్క మధ్యప్రాచ్య దేశాలదేనని క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది.మెరుగైన రుతుపవనాల కారణంగా డిమాండ్ పెరగడంతో 2026 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల దిగుమతులు 41% పెరిగి 22.3 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీని కేంద్రం తొలుత రూ.1.67 లక్షల కోట్లుగా అంచనా వేసినప్పటికీ అది రూ.1.86 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అయితే, 2027 ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.1.71 లక్షల కోట్లుగా కేటాయించడం గమనార్హం.చైనా ఆంక్షలుచైనా విధిస్తున్న సరఫరా పరిమితులతో గత నెలలోనే యూరియా ధరలు 20% పెరిగాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఇప్పుడు యుద్ధం తోడవడంతో ఈ ఖర్చు మరింత భారమవ్వనుంది.అల్యూమినియం రంగంలోనూ అస్థిరతప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో 8-9% వాటా కలిగిన గల్ఫ్ దేశాల నుంచి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది. యుద్ధం మొదలైన వారంలోపే ‘హైడ్రో’, ‘ఆల్బా’ వంటి దిగ్గజ సంస్థలు ఫోర్స్ మేజర్ (అనివార్య కారణాల వల్ల ఒప్పందాలను అమలు చేయలేకపోవడం) ప్రకటించాయి. అల్యూమినియం స్మెల్టర్లు ముడి పదార్థాల కోసం హార్మూజ్ జలసంధిపైనే ఆధారపడతాయి. యుద్ధం కారణంగా అటు ముడి పదార్థాలు, ఇటు ఇంధన లభ్యత రెండూ ప్రశ్నార్థకంగా మారాయి.ప్యాకేజింగ్ పరిశ్రమకు దెబ్బయుద్ధం కారణంగా పాలిమర్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది నేరుగా ప్యాకేజింగ్ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. ప్యాకేజింగ్ తయారీదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్న బ్రాండ్లు కొంతవరకు తట్టుకోగలిగినా స్పాట్ మార్కెట్లో కొనుగోలు చేసే చిన్న సంస్థలు అధిక ధరల అస్థిరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘సరఫరా అంతరాయాలు కలగకుండా కస్టమర్లతో కలిసి పనిచేస్తున్నాం. ఈ సవాళ్లను అధిగమిస్తామనే నమ్మకం ఉంది’ అని ఆల్టర్నిక్ ఎండీ, సీఈఓ తిమ్మయ్య ఎన్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోతే రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారం పడే ప్రమాదం పొంచి ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే దౌత్యపరమైన, ఆర్థికపరమైన చర్యలే కీలకం కానున్నాయి. -
గ్యాస్ లేక ‘బొగ్గు’మంటున్న కిచెన్లు
ముంబై: మనిషి పరిస్థితులను అనుగుణంగా మారుతూ తన జీవనశైలిని మార్చుకుంటాడు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎల్పీజీ గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నేపధ్యంలో తిరిగి కోల్ కిచెన్లు తెరపైకి వచ్చాయి. రంజాన్ మాసంలో రుచికరమైన ఇఫ్తార్ విందులకు పెట్టింది పేరు ముంబైలోని మహమ్మద్ అలీ రోడ్డు. ప్రస్తుతం ఇక్కడి హోటల్ యజమానులు ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో గత్యంతరం లేక పాతకాలపు బొగ్గు పొయ్యిలు, డీజిల్ బర్నర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రద్దీ సమయంలో గ్యాస్ అందక పోవడంతో వంటల తయారీ ఆలస్యమవడమే కాకుండా, ఖర్చులు కూడా తడిసి మోపెడవుతున్నాయి. ఇక్కడి ప్రసిద్ధ ‘షబ్బీర్స్ తవక్కల్ స్వీట్స్’ యజమాని మోయ్యద్ షబ్బీర్ మిఠాయివాలా మాట్లాడుతూ.. ‘గత నాలుగు రోజులుగా గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చేసేదేమీ లేక బొగ్గును వాడుతున్నాం. మాల్పువా వంటి స్వీట్ల తయారీకి ఎక్కువ వేడి అవసరం. ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లు ప్రయత్నించినా అవి మా అవసరాలకు సరిపోవడం లేదు. బొగ్గు వాడకం వల్ల కొన్ని స్వీట్ల ధరలను 5 నుంచి 10 శాతం పెంచక తప్పలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రసిద్ధ ‘షాలిమార్’ రెస్టారెంట్ కూడా డీజిల్ బర్నర్లపై వంటలు చేస్తోంది. ‘మక్కా హోటల్’ యజమాని ఆలందర్ స్పందిస్తూ.. కొత్తగా బొగ్గు సిగ్డీలను కొనాల్సి వస్తోందని, ఒక్కో యూనిట్ ధర 7,000 రూపాయల వరకు పలుకుతోందని, ఈ భారాన్ని సామాన్య కస్టమర్లపై వేయలేకపోతున్నామని అన్నారు.బొగ్గు వాడకంతో ఇబ్బందులుఎల్పీజీ స్థానంలో బొగ్గును వాడటం వల్ల హోటల్ నిర్వాహకులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్యాస్తో పోలిస్తే బొగ్గుపై వంట చేయడానికి రెట్టింపు సమయం పడుతోంది. ఎల్పీజీ కంటే బొగ్గు వేడి చేసే శక్తి (Efficiency) 3 నుంచి 5 రెట్లు తక్కువ. బొగ్గు వాడకం వల్ల గాలిలో ప్రమాదకరమైన PM2.5 కణాలు విపరీతంగా విడుదలవుతున్నాయి. ప్రస్తుతం కిలో బొగ్గు ధర రూ. 40 నుంచి రూ. 70 వరకు పలుకుతోంది. పండుగ రోజుల్లో గ్యాస్ సరఫరా పునరుద్ధరించకపోతే ఆహార దుకాణాలు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.ఇది కూడా చదవండి: ఏ పనీ చేయకున్నా.. నీరసం వేధిస్తోందా? -
‘ట్రావెల్ విత్ జో’ కేసు.. 10 నెలలైనా వీడని ఉత్కంఠ
పాకిస్తాన్ గూఢచారులకు కీలక సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలతో గత ఏడాది అరెస్టయిన హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి రాణి అలియాస్ జ్యోతి మల్హోత్రా ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత ఏడాది మే నెలలో ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ కింద ఆమెను అరెస్ట్ చేశారు. పది నెలలు గడుస్తున్నా విచారణ మాత్రం అడుగు ముందుకు పడలేదని ‘ది ప్రింట్’ తన కథనంలో పేర్కొంది. ఇప్పటివరకు కనీసం నేరారోపణలపై ప్రాథమిక విచారణ కూడా ప్రారంభం కాకపోవడం గమనార్హమని వ్యాఖ్యానించింది.అసలు కేసు ఏంటి?హిసార్కు చెందిన జ్యోతి మల్హోత్రా 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన సోదాల్లో భాగంగా ఆమెను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో ఆమె నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, దేశ భద్రతకు ముప్పు కలిగించేలా కీలక ప్రాంతాల వీడియోలను పంచుకున్నారని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.వివాదంలో 'పాండో డ్యామ్' వీడియోఈ కేసులో హిమాచల్ ప్రదేశ్లోని 'పాండో డ్యామ్'కు సంబంధించిన వీడియో అత్యంత కీలక సాక్ష్యంగా మారింది. ఈ డ్యామ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ‘కేటగిరీ-బి’ కిందకు వచ్చే అత్యంత సున్నితమైన ప్రాంతమని, ఇక్కడ వీడియోలు తీయడం నిషిద్ధమని భక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది. అయితే ఈ డ్యామ్ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించిన ఫోటోలు, వివరాలు ఇప్పటికే ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయని జ్యోతి తరపు న్యాయవాది రవీందర్ సింగ్ ధుల్ వాదిస్తున్నారు.పాక్ హైకమిషన్ ఉద్యోగితో సంబంధాలు?జ్యోతి మల్హోత్రా 2023లో వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే ముహమ్మద్ ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్తో పరిచయం ఏర్పడిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. వీరిద్దరూ వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా టచ్లో ఉన్నారని, ఆమె పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి భద్రతా అధికారులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ఫాలోవర్స్ను పెంచుకోవాలనే ఆశతో, డబ్బు ఆశకు లోబడి ఆమె భారత దేశ భద్రతకు సంబంధించిన వివరాలను పంచుకున్నట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.బెయిల్ నిరాకరణ.. సుప్రీంకోర్టుకు లాయర్ఇటీవలే పంజాబ్, హర్యానా హైకోర్టు జ్యోతి బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ కేసులో ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ ప్రయోగించే అధికారం జిల్లా పోలీసులకు లేదని, అది కేవలం కేంద్ర హోం శాఖకు మాత్రమే ఉంటుందని జ్యోతి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. హైకోర్టు తీర్పును త్వరలోనే సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ఆయన తెలిపారు.జ్యోతి తండ్రి ఆవేదన‘మా అమ్మాయి కేవలం టూరిస్టుగా అక్కడికి వెళ్లింది. సాధారణ పర్యాటకులు తీసినట్లే ఆమె కూడా వీడియోలు తీసింది. పాకిస్తాన్ కోణం ఉండటంతో ఎవరూ నిజం వినడానికి సిద్ధంగా లేరు’ అని జ్యోతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 2,500 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసినా, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా హిసార్ జైలులో ఉన్నారు. దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చే సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో విచారణ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ఏ పనీ చేయకున్నా.. నీరసం వేధిస్తోందా? -
Gujarat: పొద్దున్నే పెను ప్రమాదం.. భయంతో హాహాకారాలు!
వడోదర: గుజరాత్లోని వడోదరలో నేటి(మంగళవారం) ఉదయం పెను ప్రమాదం సంభవించింది. సోమా తలాబ్ ప్రాంతంలోని ఒక నివాస భవనం బాల్కనీ ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో మంటలు కూడా చెలరేగడం మరింత ఆందోళనకు గురిచేసింది.ప్రమాదం జరిగిందిలా..గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మూడు అంతస్తులు ఉన్న ఈ భవనంలో ఎడమ వైపున మెట్లకు ఆనుకుని ఉన్న బాల్కనీ భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ శిథిలాలు మెట్ల మార్గానికి అడ్డంగా పడటంతో లోపల ఉన్న వారు బయటకు రావడానికి వీలు లేకుండా చిక్కుకుపోయారు. అదే సమయంలో భవనంలో మంటలు అంటుకోవడంతో ప్రాణభయంతో అక్కడున్నవారంతా హాహాకారాలు చేశారు.స్పందించిన ఫైర్ సిబ్బందిసమాచారం అందిన వెంటనే వడోదర ఫైర్ ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఆఫీసర్ అమిత్ చౌదరి నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేస్తూనే, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.‘కంట్రోల్ రూమ్ నుండి పిలుపు రాగానే మా బృందం వెంటనే స్పందించింది. బాల్కనీ కూలిపోవడం వల్ల అపార్ట్మెంట్లోని వారంతా అక్కడే ఉండిపోయారు. అయితే మా సిబ్బంది అప్రమత్తతతో భవనంలో ఉన్న ప్రతి ఒక్కరినీ క్షేమంగా బయటకు తీసుకువచ్చారు’ అని అధికారి అమిత్ చౌదరి తెలిపారు. ప్రస్తుతానికి భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కాగా ఈ ఘటనతో సోమా తలాబ్ పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది కూడా చదవండి: ‘ఎల్పీజీ స్కామ్’: ఒక్క క్లిక్తో మీ ఖాతా ఖాళీ -
‘ఎల్పీజీ స్కామ్’: ఒక్క క్లిక్తో మీ ఖాతా ఖాళీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దేశవ్యాపంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరిగ్గా ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు కొత్త రకం ‘ఎల్పీజీ స్కామ్’తో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. వీరు సృష్టిస్తున్న మోసపూరిత లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.ఏమిటీ గ్యాస్ స్కామ్?ఢిల్లీ నగరంలో ఎల్పీజీ కొరత నెలకొనడంతో, వినియోగదారుల మొబైల్ ఫోన్లకు నిరంతరం ఎస్ఎంఎస్ , వాట్సాప్ సందేశాలు వస్తున్నాయి. ‘మీ ఎల్పీజీ కేవైసీ పెండింగ్లో ఉంది’, ‘స్టాక్ పరిమితంగా ఉంది, వెంటనే బుక్ చేసుకోండి’, ‘ఆధార్ లింక్ చేయకపోతే కనెక్షన్ కట్ అవుతుంది’ అంటూ భయపెట్టిస్తూ కేటుగాళ్లు లింకులు పంపుతున్నారు.పోలీసులు గుర్తించిన మోసాలివే:నకిలీ వెబ్సైట్లు: Indane, HP వంటి ప్రముఖ గ్యాస్ కంపెనీల పేర్లను పోలి ఉండేలా ‘bookLPGfast.com’, ‘lpg-booking.com’ వంటి వెబ్సైట్లను సృష్టించి అడ్వాన్స్ పేమెంట్లు వసూలు చేస్తున్నారు.డేంజరస్ ఏపీకే (APK) ఫైల్స్: వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ యాప్స్ అంటూ ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. వీటిని ఇన్స్టాల్ చేస్తే ఫోన్లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు నేరుగా హ్యాకర్ల చేతికి వెళ్తాయి.ఓటీపీ మోసాలు: తక్కువ ధరకే సిలిండర్ ఇప్పిస్తామంటూ ఫోన్ చేసి, మీ ఫోన్కు వచ్చే ఓటీపీ లేదా పిన్ నంబర్లను అడిగి తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.జాగ్రత్తగా ఉండండి ఇలా..‘గ్యాస్ బుకింగ్ కోసం అనధికారిక లింకులను క్లిక్ చేయవద్దు. కేవలం గ్యాస్ ఏజెన్సీల అధికారిక వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్స్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి’ అని ఢిల్లీ డీసీపీ ఆశిష్ మిశ్రా సూచించారు. ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ కొత్త టార్గెట్ ఫిక్స్! -
పేపర్ పరిశ్రమకు ‘పశ్చిమాసియా’ సెగ
పశ్చిమాసియా సంక్షోభంతో దేశీ పేపర్ పరిశ్రమను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇంధన వ్యయాలు పెరిగిపోవడం, ఎగుమతులకు అవరోధాలతో వ్యాపారాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన పేపర్ పరిశ్రమకు కీలక ఎగుమతి మార్కెట్లలో పశ్చిమాసియా కూడా ఒకటిగా ఉంటోంది. 2024–25లో దేశీ పరిశ్రమ 980 మిలియన్ డాలర్ల పేపర్, పేపర్బోర్డును ఎగుమతి చేయగా అందులో పశ్చిమాసియా దేశాల వాటా 290 మిలియన్ డాలర్లుగా (సుమారు 30 శాతం) ఉన్నట్లు పేపర్ తయారీ సంస్థల సమాఖ్య ఐపీఎంఏ తెలిపింది.అన్కోటెడ్ రైటింగ్..ప్రింటింగ్ పేపర్, కోటెడ్ పేపర్..పేపర్బోర్డ్, క్రాఫ్ట్ పేపర్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. తమ పరిశ్రమలో ప్రధానంగా ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుందని, దీనితో భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం తమపైనా ఉంటోందని ఐపీఎంఏ వివరించింది. ఇంధన రేట్లు పెరిగిపోవడం, సరఫరాపరమైన అవరోధాల వల్ల దేశీ పేపర్ మిల్లుల ఉత్పత్తి వ్యయాలపై నేరుగా ప్రభావం పడుతోందని వివరించింది. పేపర్ తయారీ ప్రక్రియకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్..బైండర్స్లాంటి ఉత్పత్తులను సమకూర్చుకోవడంలో మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.మరో వైపు, పేపర్ని ఉత్పత్తి చేసే చైనా, ఇండొనేషియాలాంటి దేశాలు ఎగుమతి కోసం పశ్చిమాసియాపై ఆధారపడతాయని, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల, సదరు ఉత్పత్తులను ఇప్పుడు అవి భారత్ వైపు మళ్లించే అవకాశం ఉందని ఐపీఎంఏ తెలిపింది. దీనితో చౌక దిగుమతులు వెల్లువెత్తి, దేశీ తయారీ సంస్థలపై ఒత్తిడి పెరిగిపోయే ముప్పు ఉందని వివరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే డిమాండ్పై ప్రతికూల ప్రభావం పడే ముప్పు నెలకొందని ఐపీఎంఏ ప్రెసిడెంట్ పవన్ అగర్వాల్ చెప్పారు.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
మరో మహిళతో భర్త సంబంధాన్ని పెళ్లి అనలేం: హైకోర్టు
శివాజీనగర(బెంగళూరు): ఓ మహిళ (66) తన భర్త (77) అక్రమంగా రెండవ పెళ్లి చేసుకున్నాడని దాఖలు చేసిన కేసును హెకోర్టు కొట్టివేసింది. భర్త పర స్త్రీతో సంబంధం కలిగి ఉండడం వివాహానికి సమానం కాదు, కాబట్టి కేసు చెల్లదని స్పష్టంచేసింది. న్యాయమూర్తి నటరాజ్ కేసును విచారించారు. వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే కేసు వర్తిస్తుందన్నారు. తన భర్త మరో మహిళ (51)ను వివాహం చేసుకొన్నారు, ఆయన కుమారులు మద్దతుగా నిలిచారు అని మహిళ ఆరోపించారు. ఆ తరువాత మహిళ భర్త, కుమారులు, ఆ మహిళ కేసును రద్దు చేయాలని పిటిషన్ వేశారు. చివరకు కేసు వీగిపోయింది. -
దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు
దేశంలో బ్యాంకులకు టాప్–10 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రూ.40,635 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ జాబితాలో ఏబీజీ షిప్యార్డ్ (రూ.6,695 కోట్లు), గీతాంజలి జెమ్స్ (రూ.6,236 కోట్లు), బీటా నాప్తాల్ (రూ.5,268 కోట్లు), రాకేష్ కుమార్ కుల్దీప్ సింగ్ వాధ్వాన్ (రూ.4,291 కోట్లు) ఉన్నట్లు లోక్సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆమె వెల్లడించారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, బడా ఎగవేతదారుల (డిఫాల్టర్ల)పై చర్యలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు ఈ మొత్తం జాబితాను అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (సీఐసీ)లకు నెలవారీగా సమర్పించాల్సి ఉంటుందని, అలాగే ఆయా సీఐసీలు దీన్ని తమ వెబ్సైట్లలో ప్రదర్శించాలని కూడా ఆమె వివరించారు.సెటిల్మెంట్ చేసుకోవచ్చు కానీ...ఆర్బీఐ నిబంధనల మేరకు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కేటగిరీలో చేర్చిన ఖాతాలకు సంబంధించి బ్యాంకులు రాజీ సెటిల్మెంట్లు చేసుకోవచ్చని, అయితే ఆయా రుణగ్రహీతలపై కొనసాగుతున్న నేర విచారణలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసుకోవాలని సీతారామన్ పేర్కొన్నారు. డిఫాల్ట్ సొమ్మును తీవ్రమైన జాప్యాలు లేకుండా రికవరీ చేసుకోవడంలో రుణదాతలకు వెసులుబాటు కల్పించడమే దీని ఉద్దేశమని చెప్పారు.డిజిటల్ పేమెంట్స్ జోరు..గడిచిన కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్ పేమెంట్ లావాదేవీలు అసాధారణరీతిలో ఎగబాకాయని, దీనికి ప్రధానంగా ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సమన్వయంతో చేపట్టిన చర్యలే కారణమని మరో ప్రశ్నకు సమాధానంగా సీతారామన్ బదులిచ్చారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ డిజిటల్ చెల్లింపుల విలువ రూ.457.44 లక్షల కోట్లు కాగా, 2024–25 నాటికి ఇది రూ.849.12 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని ఆమె చెప్పారు. వీటిలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) 81 శాతం వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద రియల్టైమ్ రిటైల్ పేమెంట్ వ్యవస్థగా ఆవిర్భవించిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.డిజిటల్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, ఎన్పీసీఐ పలు చర్యలు చేపడుతున్నాయన్నారు. కస్టమర్ మొబైల్ నంబర్, పరికరం మధ్య అనుసంధానం, పిన్ ద్వారా రెండంచెల ధృవీకరణ, రోజువారీ లావాదేవీల పరిమితి, ఇంకా కొన్ని రకాల వినియోగాలపై నియంత్రణలు ఇందులో ఉన్నాయని వివరించారు. అనుమానాస్పద లావాదేవీల విషయంలో అలెర్ట్లు పంపడం, వాటిని తిరస్కరించడానికి బ్యాంకులన్నింటికీ ఏఐ/ఎంఎల్ ఆధారిత ఫ్రాడ్–మానిటరింగ్ పరిష్కారాన్ని ఎన్పీసీఐ అందిస్తోందని కూడా ఆర్థిక మంత్రి తెలిపారు.11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్గత 11 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ (రైటాఫ్) చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. 2019–20లో గరిష్టంగా రూ.1.59 లక్షల కోట్లను రైటాఫ్ చేయగా... 2024–25లో ఈ మొత్తం రూ.47,568 కోట్లకు దిగొచ్చిందని లోక్సభకు ఇచి్చన రాతపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్నారు. ‘ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకు బోర్డులు ఆమోదించిన పాలసీ ప్రకారం, నాలుగేళ్లపాటు పూర్తి ప్రొవిజనింగ్ (కేటాయింపులు) జరిపిన మొండి బకాయిల (ఎన్పీఏ)తో సహా, ఎన్పీఏలను బ్యాంకులు రైటాఫ్ చేస్తాయి.ఈ చర్యల వల్ల రుణగ్రహీతలు చెల్లించాల్సిన అప్పులు మాఫీ కావు, అందువల్ల ఇది వారికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. రుణగ్రహీతలు బకాయిల చెల్లింపును కొనసాగించాల్సిందే. ఆయా ఖాతాలపై బ్యాంకులు చేపట్టిన రికవరీ చర్యలు కూడా కొనసాగుతుతాయి’ అని ఆయన వివరించారు.ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష -
సింగర్ ఓవరాక్షన్.. డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన
పాట్నా: బీహార్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోజ్పురి సింగర్ ధనంజయ్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రైవేటు ఈవెంట్లో భాగంగా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్తో శర్మ అనుచితంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. మహిళ అని కూడా ఆమెను పైకి ఎత్తి జనాలపైకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోజ్పురి సింగర్ ధనంజయ్ శర్మ తాజగా బీహార్లో ఓ ప్రైవేటు ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాలు విపరీతంగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాటలు పాడుతూ అందరూ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అనూహ్య ఘటన జరిగింది. స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్ను పైకి ఎత్తి జనాల్లో పడేశాడు ధనంజయ్ శర్మ. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా టచ్ చేస్తూ ఆమెను లిఫ్ట్ చేశాడు. అనంతరం, స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్పైకి ఆమెను విసిరేశాడు. దీంతో ఆ లేడీ డ్యాన్సర్ తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది.⚠️VIRAL | Singer Dhananjay Sharma lifts female dancer off stage and throws her into reaching fans during Muzaffarpur show. pic.twitter.com/neHNwWTdFl— The Tatva (@thetatvaindia) March 16, 2026ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ధనంజయ్ శర్మకు కొంచెం కూడా బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు. లేడీ డాన్సర్ అని చూడకుండా, పబ్లిక్ సిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారా? అని మండిపడుతున్నారు. మహిళలంటే అతడికి ఎలాంటి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ ధనుంజయ్ శర్మ స్పందించారు.. ఈ క్రమంలో తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో వేదికపై ఏం జరిగిందో ప్రజలకు పూర్తి నిజం తెలియదని ఆయన అన్నారు. తాను పాట పాడుతున్న సమయంలో డ్యాన్సర్లు నన్ను ఢీకొట్టారు. వారు నన్ను పట్టుకుని వేదికపై నుండి నెట్టడానికి ప్రయత్నించారు. ఈ మధ్యలో, ఒక మోడల్ నన్ను తన్ని.. నా ఛాతీపై చేయి వేయడం ప్రారంభించింది. ఇది ఎలాంటి ప్రవర్తన? అని ఆయన ప్రశ్నించారు. సదరు డ్యాన్సర్ను తాను విసిరేయాలని అనుకోలేదని ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సింగర్ ధనంజయ్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. -
రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా
యశవంతపుర(బెంగళూరు): నీ భర్తను వదిలిపెట్టాలంటే నువ్వు నా ఇంటికి రావాలి, లేదా రూ.25 లక్షలను ఇచ్చుకో అని ఓ సీఐ మహిళను వేధించిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణాలో జరిగింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడికి పోస్టింగ్ తీసుకున్నట్లు సీఐ సందేశ్ చెప్పాడని ఆ మహిళ పేర్కొన్నారు. నాపై ఫిర్యాదు చేసిన నీ భర్తను అరెస్ట్ చేశా, విడిపించుకోవాలంటే రూ.25 లక్షలు డబ్బులివ్వాలంటూ సీఐ సందేశ్ తనను ఒత్తిడి చేశారని సదరు మహిళ మంగళూరు పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గత ఆగస్ట్లో తన భర్తను అరెస్ట్ చేశారని, విడుదల చేయాలని సీఐ వద్దకు వెళ్లగా అతడు చెప్పిన మాటలు విని షాక్కు గురైనట్లు మహిళ వాపోయింది. ఈ రాత్రికి పడక గదికి రావాలని అసభ్యకరంగా డిమాండ్ చేశాడని మహిళ ఆరోపించింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడి వచ్చా, నేను అడిగినంత డబ్బులిస్తేనే విడుదల చేస్తా, లేదంటే నీ భర్తపై రౌడీషిట్ను తెరుస్తానంటూ బెదిరించాడని మహిళ ఆరోపించారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. -
36 ఏళ్ల నాటి రూ. 500 లంచం కేసులో శిక్ష తగ్గింపు
న్యూఢిల్లీ: దాదాపు 36 సంవత్సరాల క్రితం 500 రూపాయల లంచం తీసుకున్న నేరానికి గతంలో హైకోర్టు న్యాయస్థానం ఆనాటి కానిస్టేబుల్కు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సగానికి తగ్గించింది. దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు వేసిన శిక్షను 14 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చి న తీర్పును జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ పీబీ వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.అయితే 75 ఏళ్ల వయసులో మాజీ ఉత్తరాఖండ్ ఎక్సయిజ్ కానిస్టేబుల్ రెండేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించలేడని పేర్కొంటూ ఆ శిక్షను ఏడాదికి కుదించింది. అవినీతి నిరోధక చట్ట నిబంధనలను అనుసరిస్తూ మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
న్యూయార్క్–ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా ఎ–350 విమానంలో సోమవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో దాన్ని మార్గమధ్యంలోనే అత్యవసరంగా ఐర్లాండ్లోని షానన్ నగరంలో దించేశారు. విమానానికి పూర్తిస్థాయిలో సాకేంతిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.అందులో దాదాపు 300 మంది ప్రయాణికులున్నారు. ‘‘వారంతా క్షేమమే. వారికి బస తదితర ఏర్పాట్లు చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఢిల్లీ చేరుకునేందుకు సాయపడతాం’’అని ఎయిరిండియా తెలిపింది. న్యూయార్క్ నుంచి బయల్దేరిన ఆరు గంటలకు విమానంలో సమస్య తలెత్తినట్టు వివరించింది. ఆ విమానాన్ని ఎయిరిండియా 2024లో సమకూర్చుకుంది. -
8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ తొలి దఫా సమావేశాల వేళ లోక్సభలో సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారన్న కారణంగా ఫిబ్రవరి మూడో తేదీన సస్పెన్షన్కు గురైన ఎనిమిది మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ను మోదీ సర్కార్ రద్దుచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. సస్పెన్షన్ను మంగళవారం ఎత్తేయనున్నట్లు సమాచారం.సీపీఐ(ఎం) ఎంపీ ఎస్.వెంకటేసన్తోపాటు ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు గుర్జీత్ సింగ్ ఔజ్లా, హిబీ ఈడెన్, సీ కిరణ్ కుమార్ రెడ్డి, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణిక్యం ఠాకూర్, ప్రశాంత్ పదోలే, డియాన్ కురియన్కోసేలపై ఏప్రిల్ రెండో తేదీదాకా ఉన్న సస్పెన్షన్ వేటును తొలగించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో నిర్ణ యించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో వీళ్లపై సస్పెన్షన్ను రద్దుచేయాలంటూ విపక్షనేతలు డిమాండ్ చేయడంతో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రాజ్యసభకు నితీశ్, నితిన్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బిహార్లోని ఐదు, ఒడిశాలో నాలుగు, హరియాణాలో రెండు సీట్లకు సోమవారం జరిగిన పోలింగ్లో బీజేపీ అత్యధిక సీట్లను దక్కించుకుంది. 11 సీట్లకు గాను బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. ఒకటి బీజేడీకి, మరోటి బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థికి దక్కింది.హరియాణాలో కౌంటింగ్ నిలిచిపోవడంతో ఫలితం వెల్లడి కాలేదు. బిహార్ నుంచి ఖాళీ అవనున్న మొత్తం ఐదు స్థానాలను ఎన్డీయే క్లీన్స్వీప్ చేసింది. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్, నితిన్ నబీన్లతోపాటు జేడీయూ నేత, కేంద్ర మంత్రి రాంనాథ్ ఠాకూర్, బీజేపీ నేత శివేశ్ కుమార్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ఎన్నికయ్యారు.ఐదు సీట్లకుగాను ఆర్జేడీకి చెందిన అమరేంద్ర ధారి సింగ్ సహా ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, వరుసగా రెండో విడత గెలవాలన్న అమరేంద్రకు మహాగఠ్బంధన్ నుంచి సహకారం కరువైంది. దీంతో, ఆయన ఓడిపోయారు. కాగా, బిహార్కు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నితీశ్ కుమార్ ఇటీవల రాజ్యసభకు వెళ్లనున్నట్లు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పర్చింది. రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే రాజీనామా చేస్తారని భావిస్తున్నారు.ఒడిశాలో బీజేపీకి రెండు సీట్లుఒడిశాలో అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, పార్టీ ఎంపీ సుజీత్ కుమార్ 35 చొప్పున ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అధికార అభ్యర్థి సంతృప్త్ మిశ్రా 31 ఓట్లతో గెలిచారు. బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే కూడా గెలిచారు. తమ 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులకు ఓటేశారని బీజేడీ ఆరోపించింది. కాంగ్రెస్ కూడా తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసినట్లు పేర్కొంది. -
బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఉన్నతాధికారులపై వేటు
కోల్కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్(ఈసీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నత స్థాయి అధికార, పోలీసు యంత్రాంగాన్ని బాధ్యతల నుంచి తొలగించింది. ఆదివారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన ఈసీ, కొద్ది గంటల్లోనే ఈ మేరకు సమూల ప్రక్షాళన చర్యలను చేపట్టడం గమనార్హం. ఆదివారం సాయంత్రం వెలువరించిన మొదటి ఉత్తర్వులతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందినీ చక్రవర్తి, హోం శాఖ కార్యదర్శి జగదీశ్ ప్రసాద్ మీనాలపై వేటు వేసింది.అనంతరం, 16వ తేదీతో వెలువరించిన మరో ఆదేశంలో రాష్ట్ర డీజీపీ పియూశ్ పాండే, కోల్కతా సీపీ సుప్రతీమ్ సర్కార్ తదితర నలుగురు ఉన్నతస్థాయి ఐపీఎస్లను తొలగిస్తున్నట్లు తెలిపింది. నందినీ చక్రవర్తి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1993 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ దుష్యంత్ నరియాలాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. దుష్యంత్ ప్రస్తుతం ఉత్తర బెంగాల్ అభివృద్ధి శాఖ అదనపు చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.అదేవిధంగా, జగదీశ్ ప్రసాద్ మీనా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా సంఘమిత్రా ఘోష్కు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపింది. డీజీపీగా 1992 బ్యాచ్ అధికారి సిద్్ధనాథ్ గుప్తాను నియమించింది. అజయ్ కుమార్ నంద్ను కోల్కతా పోలీస్ కమిషనర్గా నియమిస్తున్నట్లు ఈసీ తెలిపింది. శాంతి భద్రతల ఏడీజీ వినీత్ గోయల్ స్థానంలో అజయ్ ముకుంద్ పాండేను, సిద్్ధనాథ్ గుప్తా స్థానంలో డీజీగా నటరాజన్ రమేశ్ బాబును నియమించింది.ఈసీ బెంగాల్ వ్యతిరేకి: సీఎం మమత ఎన్నికల వేళ ఉన్నతాధికారులను బాధ్యతల నుంచి తొలగించడంపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈసీ, బీజేపీలు మహిళలకు, బెంగాల్కు వ్యతిరేకులన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఎల్పీజీ సంక్షోభంపై కోల్కతాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బీజేపీ ఎందరు అధికారులను మార్చినా తమ ప్రభుత్వాన్ని మాత్రం మార్చలేదని ధీమా వ్యక్తం చేశారు. -
న్యాయానికి ముసుగేసి.. వాస్తవాలు దాచేసి..
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలను పక్కదోవ పట్టించి, చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా విచారణ సాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి ఆరోపించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో సునీత అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, సీబీఐ విచారణలో ఉన్న లొసుగులను ఆధారాలతో సహా ఎండగట్టారు. ‘హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి సునీత మద్దతుగా నిలబడటం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేము కోర్టును కోరితే, ఆమె మాత్రం లూథ్రా వంటి ఖరీదైన న్యాయవాదులను పెట్టి అతడికి అండగా ఎలా నిలబడతారని నిలదీశారు. హత్య జరిగిన వెంటనే వివేకానంద రాసిన లేఖ గురించి పీఏ కృష్ణారెడ్డి ద్వారా సమాచారం అందినప్పటికీ, పోలీసులు వచ్చే వరకు ఆ లేఖను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. సీబీఐ ముందు సునీత ఒకసారి లేఖ గురించి తెలుసునని, మరోసారి తెలియదని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని... ఇలా స్టేట్మెంట్లు మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి? లేఖను దాచిపెట్టడం నేరం కాదా? అందులో ఉన్న నిజాన్ని ఎందుకు తొక్కిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు వివేకానందరెడ్డి గారి రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడికి ఆస్తిలో వాటా వెళ్తుందనే భయంతో ఈ హత్య జరిగి ఉండవచ్చన్న అవినాష్ రెడ్డి... ఇది ‘మర్డర్ ఫర్ గెయిన్’ (ఆస్తి కోసం జరిగిన హత్య) కోణం కాదా? ఈ విషయాలపై దర్యాప్తు చేయాలని సునీత ఎందుకు కోరడం లేదని నిలదీశారు. షమీమ్ కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. అలాగే వివేకాకు, షమీమ్కు మధ్య నడిచిన చాట్స్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసును వచ్చే ఎన్నికల వరకు లాగడం ద్వారా చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్ ఇవ్వడమే సునీత లక్ష్యంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు.. ఢిల్లీలో ఉన్న కొందరు పెద్ద మనుషుల అండతో, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే న్యాయం గెలిచే రోజు వస్తుందని... మమ్మల్ని అనవసరంగా నిందించిన వారంతా ముక్కున వేలేసుకునే రోజు దగ్గర్లోనే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరగా విచారణ పూర్తి చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలి అని అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం నిందితులు విచారణలో అనేక విషయాలు చెప్పారు. వివిధ లావాదేవీల్లో వైఎస్ వివేకానందరెడ్డికి డబ్బులు, డైమండ్స్ రూపంలోనూ, ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉంది. దాని కోసం వివేకానందరెడ్డి గారు కొంత మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయిందీ, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధ ఆయనకు ఉంది. అందుకే అందరి మీద కోప్పడేవారని ఉంది. దాని మీద ఎందుకు తదుపరి దర్యాప్తు సునీత కోరడం లేదు?. మరోవైపు తొలిసారి 161 స్టేట్మెంట్లో దస్తగిరి... వివేకానందరెడ్డి గారిని చంపక ముందు డాక్యుమెంట్లు గురించి అడిగామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఆయన్ను తీవ్రంగా కొట్టామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కున్న తర్వాత అవి తాము అనుకున్నవో కావో తేల్చుకున్న తర్వాతే చంపామని చెప్పాడు. హత్య అనంతరం రెండు మూడు సార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లామని కూడా చెప్పాడు. దస్తగిరి బెయిల్ ఎందుకు అడ్డుకోలేదు? మీకు అత్యంత ఆప్తుడైన దస్తగిరి ఇంత స్పష్టంగా చెప్పాడు. ఆయన బెయిల్ రద్దు చేయమని మేమే కోర్టులో వేసినా.. మీరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఏకంగా లూథ్రా లాంటి న్యాయవాదిని దస్తగిరి తరపున నియమించి మాపై పోరాడతారు. చంద్రబాబుకు, వివేకాను హత్య చేసిన దస్తగిరికి, మీకు న్యాయవాదిగా లూథ్రాయే ఉండడంలోని ఆంతర్యమేమిటి? దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిలిచ్చినా మీరు అడ్డుకోలేదు. ప్రతి అంశానికి అడ్డుపడే మీరు తానే మీ నాన్నగారిని చంపానని దస్తగిరి చెప్పినా ... అతను దర్జాగా బయట తిరుగుతున్నా కనీసం బెయిల్ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన్ను శిక్షించాలని మీరు ఎందుకు కోరరు? అంత కీలకమైన డాక్యుమెంట్లు ఏవని అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఇదే విషయాన్ని అడగడానికి మీకు ఎందుకు నోరు రావడం లేదు? కోర్టును, సీబీఐను అడగాల్సిన బాధ్యత మీకు లేదా? హత్య అనంతరం లేఖ గురించి ఎందుకు చెప్పలేదు? మీ తల్లి, భర్త అటెండర్కు సెలవు ఇచ్చి పంపిస్తే మీరు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు? హత్య జరిగిన రోజు రాత్రి దోపిడీకి గురైన డాక్యుమెంట్ల గురించి కూడా మీరు నోరు మెదపడం లేదు.. సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ.... కీలకమైన విషయాలను ఇగ్నోర్ చేసే కార్యక్రమం మీరు ఇన్నాళ్లూ చేశారన్నది పచ్చి నిజం. ఈ కేసులో పీఏ కృష్ణారెడ్డి తొలుత మృతదేహాన్ని, లేఖను చూసిన తర్వాత తొలుత సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి బావమరిది, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సొంత సోదరుడు శివప్రకాష్ రెడ్డికి ఆ లేఖ గురించి, చనిపోయిన విషయం కూడా చెప్పాడు. ఆ లెటర్లో అంశాలు కూడా మీ అందరికీ చదివి వినిపించాడు. కానీ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడున్న లెటర్ గురించి ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు?. వివేక అటెండర్ పండంటి రాజశేఖర్ను హత్యకు ముందు రోజు కుటుంబసభ్యులే కాణిపాకం ఎందుకు పంపించారు?సునీత పరస్పర విరుద్ధ ప్రకటనలు... పైగా ఎవరికీ లేని అవకాశం సీబీఐ సునీతకి ఇచ్చింది. 2020 జులై 28న ఆ లేఖ గురించి సునీతను సీబీఐ అడిగింది. ఈ లేఖ చాలా కీలకమైన ఆధారం, ఆ లేఖ గురించి తెలిస్తే ఇది హత్య అని తెలిసి ఉండేది, అంత ప్రాముఖ్యత ఉన్న లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారని ప్రశ్నించింది. దానికి ఆమె లెటర్ ఉన్న విషయం పీఏ కృష్ణారెడ్డి తమకు వాట్సప్లో చెప్పాడని అంగీకరించింది. అదే టైంలో ఎందుకు బయట పెట్టలేదనడానికి ఊరంతా గొడవలు అవుతాయని చెప్పలేదంటూ పెద్ద థియరీ చెప్పారు. మరలా నెల రోజులకు 27 ఆగస్టు 2020 నాడు సీబీఐ ముందుకు వచి్చ, నెల రోజుల క్రితం లెటర్ గురించి తాను చెప్పినదంతా తూచ్... నాకు ఆ లేఖ గురించి ఏం తెలియదు, నేను ఏ లెటరూ చూడలేదు, సాయంత్రం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి చేతిలో లేఖ చూడ్డం తప్ప నాకేమీ తెలియదు అని అబద్దం చెప్పింది. ముందు ఒక వాంగ్మూలం ఇచి్చన తర్వాత దాన్ని కవర్ చేయడానికి సీబీఐ మరో వాంగ్మూలం తీసుకోవడం ఎంత వరకు సమంజసం? మరో కీలమైన అంశం నా బెయిల్ గురించి హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు... గతంలో సునీత మాట్లాడిన వీడియోను హైకోర్టు ముందు ఉంచాను. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన 12 రోజులకు అంటే మార్చి 27, 2019లో మాట్లాడుతూ... గడిచిన కొన్ని నెలలుగా అవినాష్ని ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి మా నాన్న శ్రమిస్తున్నారు అని మాట్లాడిన వీడియోను హైకోర్టుకు సమర్పించాను. అనంతరం నాకు బెయిల్ వచ్చిన తర్వాత మరలా సీబీఐ అధికారులను సునీత పిలిచి... మరలా మే 31, 2023 అంటే మూడేళ్ల తర్వాత గతంలో మాట్లాడిన వీడియోను కవర్ చేసే విధంగా మరో స్టేట్మెంట్ ఇప్పించారు. అందులో భాగంగా గతంలో మీరు ఎందుకు అలా మాట్లాడారు అని సీబీఐ అడిగితే నాకు సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడమన్నారు అందుకే మాట్లాడానని చెప్పింది. విచారణలో లొసుగులను ఇవన్నీ తేటతెల్లం చేస్తున్నాయి. మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారించరు? వివేకాకు, ఆయన రెండో భార్య షమీమ్కు మధ్య నడిచిన చాట్స్ను బయటపెట్టే ధైర్యం ఉందా? వివేకా రెండో భార్య కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం మీకు ఉందా? ఈ కేసులో విచారణను పరిశీలిస్తే.. వివేకానందరెడ్డి ఆమె పేరిట ఆస్తులు ఇవ్వాలనుకున్నారని ఉంది. హైదరాబాద్లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నాడని ఉంది. షమీమ్ కుమారుడిని హెచ్పీఎస్ స్కూలులో అడ్మిషన్ తీసుకుని చేర్చాలనుకున్నాడని ఉంది. వాళ్లను పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నాడని ఉంది. ఒకవైపు వివేకాకు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్ పూర్తిగా చెక్ పవర్ తీసేశారు. ఖర్చులకు కూడా డబ్బులేని పరిస్థితికి ఆయన్ను తీసుకొచ్చారు. చివరగా గత మూడేళ్లులో ఆయనతో మాట్లాడడంలేదని కూడా విచారణలో సునీతక్క మాటల్లో ఉంది. ఆ కోణంలో ఎందుకు విచారించడం లేదు..? షమీమ్కు వివేకా ఎన్నో హామీలిచ్చారు. అవి నెరవేరకుండానే హత్యకావించబడ్డారు. ఎవరు చేసి ఉంటారు ఈ హత్య? ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వివేకా ఆస్తులు షమీమ్కు, ఆమె కొడుకుకు పోతే నష్టపోయేదెవరు? ఆ నష్టం వాటిల్లకుండా వారే చేసి ఉండవచ్చు కదా? మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు ఇది? ఆ దొంగిలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ చేయలేదు? నిత్యం విచారణను అడ్డుకునే ప్రయత్నంలో సునీత... ముఖ్యంగా రామ్ సింగ్ వీళ్ల చేతుల్లోకి వచి్చన తర్వాత సుధాసింగ్, దీపక్ గారిని విచారణ నుంచి తప్పించిన తర్వాత పూర్తిగా శిక్షణ ఇచ్చి ఇష్టమొచి్చనట్లు స్టేట్ మెంట్లు తీసుకున్నారన్నది పచ్చి నిజం. అదే విధంగా దస్తగిరి తన స్టేట్మెంట్లో వివేకానందరెడ్డి గారికి అనేక అక్రమ సంబంధాలున్నాయని చెప్పారు. ఆ కోణంలో కూడా విచారణ అడిగే ప్రయత్నం సునీత చేయదు. అది వ్యక్తిగత అంశం కాబట్టి నేను అటువైపు వెళ్లదల్చుకోలేదు. నేను అనేకసార్లు సీబీఐ డైరెక్టర్కి వినతిపత్రం ద్వారా మొరపెట్టుకున్నా మా మొర ఆలకించలేదు. ఆ రోజుల్లో విచారణలో వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు జరగలేదు. ఏకపక్షంగా విచారణ జరిగింది. ఇప్పుడు కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లి, విచారణ అడ్డుకునేలా ప్రయత్నం చేస్తోంది. గడిచిన రెండు, మూడేళ్లుగా ఇదే పని చేస్తోంది. వచ్చే ఎన్నికల వరకు హత్య కేసును లాగడమే లక్ష్యం... ఎప్పుడు విచారణ జరిగినా.. దేవుడి ముందు, చట్టం ముందు మేం తప్పు చేయలేదన్న విషయాన్ని నిరూపించుకుంటామన్న ధైర్యం, నమ్మకం, విశ్వాసం మాకుంది. విచారణ జరిగేలా సహకరించమని సునీతని కోరుతున్నాం. కానీ వీరి ఆలోచన మాత్రం వచ్చే ఎన్నికల వరకు వివేకానంద రెడ్డి హత్య కేసును లాగడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చడమే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. విచారణ జరగకూడదన్నట్లు, దోషులెవరూ బయటకు రాకూడదన్నట్లు ఆమె వైఖరి ఉంది. ఎవరైనా ఆధారాలుంటే విచారణ సందర్భంగా సమర్పిస్తారు.. కానీ సునీత అలా చేయకుండా ఈ కేసును ఇలాగే కొనసాగించాలని, చంద్రబాబు చేతిలో పావులా మారి ఆయనకు రాజకీయంగా ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప.. న్యాయం కోసం పోరాటం అన్నది ఎక్కడా లేదు. కాబట్టి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలను పక్కన పెట్టాలని కోరుతున్నాను.తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ...ఏపీకి సంబంధించిన పెద్ద మనిషి, ఢిల్లీలో కీలకమైన పోస్టులో ఉండడం, ఆయన ఆశీస్సులతో అప్పటి సీబీఐ డైరెక్టర్ నియామకం జరగడం, ఆయనను సునీత అనేకసార్లు కలవడం, చంద్రబాబు నాయుడు, సునీత కలిసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ దిశగా కేసును తీసుకెళ్లారు. వారికి నచి్చన వారిని తీసుకెళ్లి సీబీఐ విచారణ చేసింది. గతంలో ఎన్నికల ముందు 2024 ఏప్రిల్లో నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాను. నన్ను సీబీఐ 12 సార్లు విచారణకు పిలిచింది. నేను మూడోసారి సీబీఐ విచారణకు వెళ్లినప్పుడు హత్య జరిగిన రోజు మేము గమనించిన విషయాలు చెప్పాను. నేను సీఐ గారికి సమాచారం ఇచ్చాను. స్థానికులు వివేకానందరెడ్డి గారిని చూస్తామని గట్టిగా గొడవపడితే వాళ్లను కూడా అనుమతించాం. ఆ రోజు నేను సీబీఐకి చెప్పాను. ఆ రోజు వచి్చన హిమకుంట్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి.. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. 2025లో సునీత, ఆమె భర్త ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి... ఘటన జరిగిన తర్వాత వెళ్లిన వాళ్లలో నువ్వు కూడా ఉన్నావు, సీబీఐ వాళ్లు నిన్ను పిలిచి విషయం అడుగుతారని చెప్పారు. దానికి ఆయన నేను తప్పకుండా చెబుతానంటే... అలా చెప్పడం కాదు అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పాడని స్టేట్మెంటు ఇమ్మన్నారు. నాకు అలా చెప్పలేదంటే... మా నాన్నకి ఆప్తుడివి నువ్వు అలా చెప్పాల్సిందేనని అంటే... అక్కడ నుంచి వెళ్లిపోయి మరలా వారం తర్వాత ఆయనపై ఒత్తిడి తెచి్చ.. తాము చెప్పమన్నట్టే స్టేట్మెంట్ ఇమ్మని ఒత్తిడి చేశారు. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదే రీతిలో తప్పుడు స్టేట్మెంట్లను ఇప్పిస్తూ వచ్చారు. వారినే సీబీఐ పిలుస్తూ వచి్చంది.విచారణ పూర్తి చేయాలి..సునీత లేఖ దాచిపెట్టిన విషయం, సౌభాగ్య పెద్దమ్మ, నర్రెడ్డి రాజశేఖర్ కలిసి అటెండర్కి సెలవు ఇచ్చి కాణిపాకం పంపించడం, డాక్యుమెంట్ దొంగతనం వంటి అంశాలపై దర్యాప్తు కోరాల్సింది పోయి.. అసలు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తోంది. దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ కోసం మేం పిటిషన్ వేస్తే.. వెంటనే ఆమె ఇంప్లీడ్ అయి.. దస్తగిరి తరపున లూథ్రాతో వాదనలు వినిపిస్తారు. ఈ కేసు విషయంలో గత మూడేళ్లుగా వాస్తవాలు తెలియకుండా మమ్నల్ని ఎంతో మంది దూషించారు. వీళ్లంతా తాము అనవసరంగా నిందించామని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఈ కేసు ఆలస్యం కాకుండా త్వరగా విచారణ జరిగే దిశగా న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలి. సునీత భర్త రాజశేఖర్కు టీడీపీ నాయకుడు బీటెక్ రవికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలి.గుండెపోటు థియరీని సృష్టించింది సునీతే..ఈ కేసులో అనేక సందర్భాల్లో సీబీఐ అప్పటి డైరెక్టర్కు తాము చెప్పిన కోణాల్లో దర్యాప్తు చేయాలని విజ్ఞపి చేశాం. పైన నేను చెప్పిన అన్ని అంశాలను లేఖ రూపంలో రాశాను. కేవలం టార్గెటెడ్ దర్యాప్తు చేసిందే తప్ప... సీబీఐ వాస్తవాలను వెలికి తీసే దిశగా దర్యాప్తు చేయలేదు. గతంలో కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి, సీబీఐకి మెయిల్స్, రిజిస్టర్డ్ పోస్టు రూపంలో మేము అనుకున్న అంశాలపై ఫిర్యాదు చేశాం. సునీత ఇప్పుడు కూడా చంద్రబాబు ఆదేశాల ప్రకారం పలు రకాల పిటిషన్స్ వేసి విచారణను మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఈ అంశాన్ని వెలుగులో ఉంచడమే వీరి లక్ష్యం. వివేకానంద రెడ్డి హత్య జరిగే నాటికి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అదే విధంగా గుండెపోటు అని అవినాష్ రెడ్డి చెప్పాడని చెప్పమంటూ.. సునీత చాలా మందిని ట్రైన్ చేశారు. గుండెపోటు అని తాను అనుకున్నానని సునీత చెప్పింది. అసలు ఆ థియరీని సృష్టించింది, సిట్ ముందు చెప్పిందే సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి కూడా సిట్ ముందు హాజరై శివప్రకాష్ రెడ్డి, ఆయన కుమారుడు ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారన్నారు. చేసినదంతా వాళ్లే చేసి అన్యాయంగా మా మీద నిందలు వేశారు. మార్చి 16న సునీత తానే స్వయంగా సిట్ ముందు గుండెపోటు అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. కీలకమైన అంశాలను పక్కనపెట్టి.. ఇతర అంశాలను కోర్టు దృష్టికి, సీబీఐ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా విచారణను జాప్యం చేయడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వివేకానందరెడ్డి చెక్ పవర్ తీసివేసి చనిపోయే ముందు ఖర్చులకు డబ్బుల్లేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడలేదు. ఆ కోణంలో విచారణ జరగాలి. షమీమ్కి వివేకానంద రెడ్డికి మధ్య జరిగిన చాట్స్ బయటకు రావాలి. దొంగిలించబడిన రౌండ్ సీల్ డాక్యుమెంట్లలో ఏముంది? మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నదే మా వాదన. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వివేకం అని సినిమా తీసి రాక్షసానందం పొందారు. కానీ పైన దేవుడు కూడా క్షమించడు. వాళ్లందరినీ దేవుడు శిక్షించడం ఖాయం. ఈ ప్రశ్నలకు బదులేది?ఈ విషయాలపై మరింత విచారణకు సునీత ఎందుకు పట్టుబట్టడం లేదు?1. హత్యకు ముందు రోజు వివేకా అటెండర్ పండంటి రాజశేఖర్ను సౌభాగ్యమ్మ, అల్లుడు రాజశేఖర్ కాణిపాకం ఎందుకు పంపించారు?2. వివేకాను హత్య చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఆయన్ను హింసించామని దస్తగిరి చెప్పాడు. డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాతనే హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేశాక కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లినట్లు చెప్పాడు. రౌండ్ సీల్తో ఉన్న ఆ డాక్యుమెంట్లు ఏమిటి?3. హత్య జరిగిన చోట లేఖను సునీత భర్త రాజశేఖర్ ఎందుకు దాచినట్లు? లేఖలో విషయాలు ఎవరికీ చెప్పకుండా లేఖను దాచాల్సిందిగా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం అనుమానాస్పదం కాదా?4. వివేకాకు అనేకమందితో అక్రమ సంబంధం ఉందని పేర్లతో సహా దస్తగిరి స్టేట్మెంట్లో ఉంది. ఆ మహిళల భర్తలు, పిల్లలు వివేకాపై కక్ష పెంచుకున్నారని ఆ స్టేట్మెంట్లో ఉంది.5. వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన జీవించి ఉంటే 30 నుంచి 40శాతం ఆస్తులను తన రెండో భార్యకు ఇచ్చేవారు. అందుకని ఇది మొదటిభార్య కుటుంబం చేసిన మర్డర్ ఫర్ గెయిన్ కాదా?6. హంతకుడు దస్తగిరి ముందస్తు బెయిల్ను సునీత అడ్డుకోదు. ఎందుకంటే సునీత ఏం కోరుకుంటుందో అదే దస్తగిరి చెబుతాడు. స్టేట్మెంట్గా ఇస్తాడు. మేం దస్తగిరి బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళితే సునీత ఇంప్లీడ్ అయ్యింది. బెయిల్ రద్దు కోసం కాదు.. దస్తగిరి బెయిల్ ఉండాలని.. దస్తగిరి రక్షణ కోసం లూద్రా వంటి సీనియర్ లాయర్ను దింపుతుంది. -
USAలో ఆలయాల దాడులపై ఆలోచించండి: రణధీర్ జైశ్వాల్
ఢిల్లీ: భారత్లో మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికాలోని USCIRF కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. అమెరికా ఇతర దేశాల సంస్థలపై నివేదికలు ఇవ్వడం బదులు ఆ దేశంలో హిందువుల ఆలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.అమెరికాకు చెందిన (USCIRF) కమిషన్ భారత్లో మతస్వేచ్ఛకు సంబంధించిన విషయాలపై అధ్యయనం చేసింది. భారత్లో క్రమపద్ధతిలో, మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కనుక భారత్ను ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదించింది. దానితో పాటు మతస్వేచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడుతన్నందుకు భారత్కు చెందిన RAW రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ,RSS సంస్థలకు చెందిన వ్యక్తులు మరియు సంస్థల ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొంది.తాజాగా దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. " అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ ఇచ్చిన తాజా నివేదికను మేము పరిశీలించాము. భారతదేశంపై చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాము. అవి ప్రేరేపితమైనవి మరియు పాక్షికమైనవి. గత కొన్ని సంవత్సరాలుగా USCIRF భారతదేశాన్ని వక్రీకృతమైన సమాచారం చూపిస్తూ వస్తోంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే నివేదికలు కమిషన్ యొక్క విశ్వసనీయతను తగ్గిస్తాయి. భారత దేశంపై విమర్శలు మాని అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అక్కడ నివసిస్తున్న భారతీయ వలసదారులపై పెరుగుతున్న అసహనం, బెదిరింపులపై USCIRF ఆలోచించాలి,” అని తెలిపారు.USCIRF అనేది ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న మతస్వేచ్ఛ పరిస్థితులపై ఏటా నివేదిక అందిస్తుంది. అందులో భాగంగా కొన్ని దేశాలను CPC ప్రత్యేక ఆందోళనకర దేశాలుగా గుర్తించాలని సూచిస్తుంది.. -
విజయ్కి డిప్యూటీ సీఎం పోస్టా? కుండబద్దలు కొట్టిన టీవీకే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్న నేపథ్యంలో సినీనటుడు విజయ్కు చెందిన టీవీకే ఇప్పటికీ పొత్తులపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ కూటమి తమిళనాడులో గెలిస్తే విజయ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.అయితే, పొత్తుల గురించి వస్తున్న ఇలాంటి ప్రచారానికి చెక్ పెట్టేందుకు టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. కూటమి గురించి తాను ఎవరితోనూ మాట్లాడలేదని, అలాగే వదంతులను నమ్మవద్దని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.‘ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యం.కొన్ని నిర్దిష్ట పార్టీలతో, రాజకీయ నాయకులతో ఏ స్థాయిలోనూ చర్చలు జరగలేదని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. గతంలో కూడా కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలతో కలుస్తున్నామంటూ ఇలాంటి తప్పుడు వార్తలు రావడం అందరికీ తెలిసినదే, అది నిజం కాదు.అయితే ప్రజలు, టీవీకే కార్యకర్తల్లో గందరగోళం కొనసాగించేందుకు డీఎంకే ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేస్తోంది. బాధ్యతాయుత మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వినియోగదారులు నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఇలాంటి వదంతులు ప్రచారం చేయొద్దు. నిజమే గెలుస్తుంది!’ అని చెప్పారు. -
ఎన్నికల వేళ తమిళనాడులో ఈసీ కీలక నిర్ణయం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తమిళనాడులో నలుగురు పోలీసు సూపరింటెండెంట్ల(ఎస్పీ)ను బదిలీ చేసింది. ఈసీ ఆదేశాలతో కరూర్, ఈరోడ్, నాగపట్నం, విరుదునగర్ జిల్లాల ఎస్పీలు తక్షణ బదిలీ అవుతారు. తాజాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లో భాగంగా తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్తో పాటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఈసీఐ కరూర్ ఎస్పీగా హరికిరణ్ ప్రసాద్, కిరణ్ శ్రుతిని ఈరోడ్, సుజిత్ కుమార్ను నాగపట్నం, శ్రీనాథను విరుదునగర్ ఎస్పీగా నియమించారు. ఈ జిల్లాల ఎస్పీలు అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.మరోవైపు, పశ్చిమ బెంగాల్లోనూ కీలక అధికారులను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన అధికారి నందిని చక్రవర్తిని తొలగించి దుష్యంత్ నరియాలా (ఐఏఎస్-1993 బ్యాచ్)ను నియమించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం అండ్ హిల్ అఫైర్స్ జగదీశ్ ప్రసాద్ మీనాను తొలగించి సంగమిత్ర ఘోష్ (ఐఏఎస్-1997 బ్యాచ్)ను నియమించింది. -
దీదీకి ఝలక్ : 144 రేసు గుర్రాలు రెడీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వేళ బీజేపీ (BJP) తన రేసు గుర్రాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో 144 మందితో తొలి జాబితాను ప్రకటించింది.ఈ జాబితాలో మొత్తం 10 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 10మంది మహిళలు బరిలోకి దిగనున్నారు. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి అగ్నిమిత్ర పాల్, బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు (LoP) సువేందు అధికారి (భవానీపూర్ నియోజకవర్గం), దిలీప్ ఘోష్ (ఖరగ్పూర్ సదర్) వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య జాబితా తగ్గిపోవడం ప్రధాన వివాదంగా మారింది. గత ఏడాది నవంబర్లో ఓటర్ల సంఖ్య 7.66 కోట్లుగా ఉండగా, ఫిబ్రవరి 28న విడుదల చేసిన తుది జాబితాలో అది 6.44 కోట్లకు తగ్గింది.BJP announces first list of 144 candidates for the upcoming West Bengal Assembly Elections pic.twitter.com/QHLfHAUNFF— ANI (@ANI) March 16, 2026 "లాజికల్ డిస్క్రెపెన్సీ" విభాగం కింద వర్గీకరించి, న్యాయపరమైన పరిశీలన కోసం పంపిన దాదాపు 42 లక్షల మందికి పైగా ఓటర్ల భవిష్యత్తు మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది.ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి వచ్చిన వారితో కలిపి మొత్తం 732 మంది జుడీషియల్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.(అట్టుడుకుతున్న దుబాయ్ : విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి)ప్రధాని పర్యటన సందర్భంగా తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సీరియస్ అయింది. షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్చరించారు.కాగా పశ్చిమ బెంగాల్తో సహా నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం నాడు ప్రకటించిన వెంటనే బీజేపీ తొలి జాబితా సిద్ధం కావడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడతాయి.కేరళలో కూడాకేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 కోసం బిజెపి సోమవారం (మార్చి 16) 47 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. క్రైస్తవ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా. క్రైస్తవుల కోట అయిన కొట్టాయంలోని కంజిరపల్లిలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి,రాజ్యసభ సభ్యుడు జార్జ్ కురియన్ను పోటీకి దింపగా, ప్రాంతీయ పార్టీ కేరళ కాంగ్రెస్ మాజీ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే పిసి జార్జ్ మరియు అతని కుమారుడు షోన్ జార్జ్లను వరుసగా కొట్టాయం జిల్లాలోని పూంజర్ , పాలాలో పోటీకి దింపడం గమనార్హం. ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో -
బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు సహా ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం అండ్ హిల్ అఫైర్స్ ప్రధాన కార్యదర్శి, మరికొందరు అధికారులను బదిలీ చేసినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ మార్పులు చేశామని తెలిపింది.ఎవరెవరిని బదిలీ చేశారు? మమతా బెనర్జీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఇద్దరు ఉన్నత అధికారులను ఎన్నికల కమిషన్ తొలగించింది.చీఫ్ సెక్రటరీ: నందిని చక్రవర్తిని తొలగించి దుష్యంత్ నరియాలా (ఐఏఎస్-1993 బ్యాచ్)ను నియమించింది.ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ అండ్ హిల్ అఫైర్స్: జగదీశ్ ప్రసాద్ మీనాను తొలగించి సంగమిత్ర ఘోష్ (ఐఏఎస్-1997 బ్యాచ్)ను నియమించింది.ఇతర కీలక నియామకాలుడీజీ అండ్ ఐజీపీ: సిద్ధ్ నాథ్ గుప్తా (ఐపీఎస్-1992)డీజీ, కరెక్షనల్ సర్వీసెస్: నటరాజ్ రమేశ్ బాబు (ఐపీఎస్-1991)ఏడీజీ అండ్ ఐజీపీ, లా అండ్ ఆర్డర్: అజయ్ ముకంద్ రనడే (ఐపీఎస్-1995)కొలకతా పోలీస్ కమిషనర్: అజయ్ కుమార్ నంద్ (ఐపీఎస్-1996)ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. బదిలీ అయిన అధికారులను ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల పనుల్లో నియమించరు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ మార్పులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎన్నికల కమిషన్పై విమర్శలు చేశారు. అర్ధరాత్రి దాటాక బెంగాల్ హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీని బదిలీ చేయడం సరికాదని అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఉన్నత అధికారుల బదిలీలపై ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ సోమవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. ఈ ఘటన 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో జరిగింది.. మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఇలాంటి బదిలీలు చేయడానికి కమిషన్కు రాజ్యాంగ అధికారము ఉందని చెప్పారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తిన తృణమూల్ కాంగ్రెస్ను విమర్శించారు. -
అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో
బాగా చదివి, ప్రయోజకులై,మంచి కానుకలతో తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేయాలిని చాలామంది బిడ్డల ఆలోచన. చక్కటి ఇల్లో, ఖరీదైన కారో కానుకగా ఇవ్వాలని చాలామంది డ్రీమ్. అలా తమ తల్లిదండ్రులకు ఒక సరికొత్త కారును గిఫ్ట్ ఇచ్చి, ఆశ్చర్యపరిచిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమ్మానాన్నలకు అపురూపమైన కానుకిచ్చిన ఇద్దరు కూతుళ్ళ కథ తెలుసుకుందాం పదండి.వర్ష అనే యువతి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సందడిగా మారింది. తన సోదరితో కలిసి తమ తల్లిదండ్రులకు కొత్త కారును గిఫ్ట్గా ఇచ్చింది.తమ తల్లిదండ్రుల కళ్ళకు గంతలు కట్టి డ్రైవ్వే వైపు మెల్లగా తీసుకొచ్చి మరీ బ్రాండ్ న్యూ కారు ఇచ్చారు. కొత్త కారును చూసి ఆ దంపతులు ఆశ్చర్య పోయారు. అందరూ కలిసి కారుపైన కవర్ తీయగానే అమ్మానాన్నల ముఖాల్లో వెయ్యి వోట్ల వెలుగు వచ్చింది. వెంటనే వారు తమ కుమార్తెలను హత్తుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. చుట్టూ ఉన్న బంధువుల చప్పట్లు, నవ్వులతో =సందడిగా మారింది. ఈ క్షణాలు ఎంతో భావోద్వేగాన్ని నింపాయి. View this post on Instagram A post shared by Varsha (@varshhaa.n)భావోద్వేగ సందేశం"మా తల్లిదండ్రులు ఇది లేదు, అది లేదు అని ఎపుడూ చెప్పలేదు. మమ్మల్ని ఏ విషయంలోనూ ఆపలేదు. ఎదిగి విజయం సాధించండి' అని మాత్రమే చెప్పారు. మా జీవితాంతం మాకు రక్షణగా, మద్దతుగా నిలిచినందుకు ఈ కారు ఒక చిన్న కృతజ్ఞత మాత్రమే. మేం నలుగురం ఒక్కటే."నెటిజన్ల ప్రశంసలుఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపించారు."ఇంతటి విలువైన కుమార్తెలను పొందిన ఆ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు," అని ఒకరు "ఆ తల్లి కళ్లలోనే అంతా కనిపిస్తోంది. అందులో కేవలం ప్రేమానురాగాలు మాత్రమే ఉన్నాయి" అని మరొకరు రాశారు. కన్నబిడ్డలు ఎదుగుదల, తమకు గౌరవించే తీరు చూసినపుడు తల్లిదండ్రులు పొందే ఆ గర్వం, సంతోషం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
తీవ్ర ఉత్కంఠ మధ్య రాజ్యసభ ఎన్నికలు
దేశంలోని 10 రాష్ట్రాల్లో 37 స్థానాలను భర్తీ చేయడానికి సోమవారం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటలకు జరగనుంది. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, బిహార్, ఛత్తీస్గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేస్తున్న 37 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్లో ముగుస్తుంది.ఇప్పటికే 37 స్థానాల్లో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మిగిలిన 11 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. వీటిలో బిహార్ నుంచి 5, ఒడిశా నుంచి 4, హరియాణా నుంచి 2 స్థానాలు ఉన్నాయి.ఏకగ్రీవంగా గెలిచిన 26 మందిలో బీజేపీ ఏడు స్థానాలు సాధించింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు, డీఎంకే నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, క్రాస్ ఓటింగ్ భయంతో తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్నికలు జరున్నాయి.హరియాణాలో 2 స్థానాలకు ముగ్గురి పోటీహర్యానా అసెంబ్లీ మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. కానీ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయం కోసం 31 ఓట్లు అవసరం. భారతీయ జనతా పార్టీకి 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి సంజయ్ భాటియా విజయం ఖాయమైంది. 17 ఓట్లు మిగులుతాయి. అవి స్వతంత్ర అభ్యర్థి సతీశ్ నందాల్కు పడతాయి. ముగ్గురు స్వతంత్రులు తప్ప ఇనెలో ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సంఖ్య 22 అవుతుంది. అంటే విజయవానడికి తొమ్మిది ఓట్లు తక్కువ అవుతాయి. కాంగ్రెస్ వద్ద 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐక్యంగా ఉంటే పార్టీ అభ్యర్థి కర్మవీర్ బౌద్ధకు 31 కంటే ఎక్కువ ఓట్లు రావచ్చు. కానీ క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు మారవచ్చు. ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉన్నా అభ్యర్థి ఓడిపోయారు. 2016, 2022లో ఇలా జరిగింది.బిహార్లో 4 స్థానాలకు ఓటింగ్బిహార్ అసెంబ్లీ 243 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. ఎన్డీఏకు 202 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహాఘట్బంధన్కు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎన్డీఏకు 4 స్థానాలు సులభంగా వస్తాయి. ఒక్కో స్థానానికి 41 ఓట్ల లెక్కలో నాలుగు స్థానాలు గెలవడానికి 164 మంది ఎమ్మెల్యేలు అవసరం. తర్వాత ఎన్డీఏ వద్ద 38 ఎమ్మెల్యేలు మిగులుతారు. 5వ స్థానానికి గెలవడానికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. ఒడిశాలో 4 స్థానాలకు 5 అభ్యర్థుల మధ్య పోటీఒడిశా అసెంబ్లీ 147 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ రాజ్యసభ 4 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. కానీ 5 అభ్యర్థులు ఉన్నారు. ఒక స్థానానికి విజయం కోసం 30 ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. భారతీయ జనతా పార్టీ రెండు అభ్యర్థులు మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్ విజయం ఖాయం. బీజేడీ వద్ద 48 ఓట్లు ఉన్నాయి. రెండు అభ్యర్థులు నిలబెట్టింది — సంత్రుప్త మిశ్రా, దత్తేశ్వర్ హోతా. మిశ్రా విజయం ఖాయం. చిక్కు నాలుగో స్థానంలో ఉంది. భారతీయ జనతా పార్టీ దిలీప్ రాయ్కు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ 14 ఎమ్మెల్యేలు, మాకపా ఒక ఎమ్మెల్యే హోతా వద్ద ఉన్నారు. క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు మారవచ్చు.ముఖ్యాంశాలుబిహార్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు, ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు.హరియాణా, బిహార్, ఒడిశా నుంచి 11 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఉదయం 9 గంటల నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ భయం ఉంది.తేజస్వీ యాదవ్ పార్టీ ఆర్జేడీ ఒక ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తోంది. ఆయన కూడా ఇప్పటివరకు ఓటు వేయడానికి రాలేదు.బిహార్లో ఇప్పటివరకు ఎన్డీఏ తరఫున 201 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మహాఘట్బంధన్ తరఫున 37 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తొలి ఓటు వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఎన్నికల్లో 70 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హిమాచల్ కసౌలి నుంచి బయలుదేరి చండీగఢ్లో భూపేందర్ హుడ్డా ఇంటి వద్ద చేరారు. తర్వాత అందరూ కలిసి బస్సులో అసెంబ్లీకి వద్దకు చేరుకున్నారు. -
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపు షురూ
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభాగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను వివిధ రాష్ట్రాలు ప్రారంభించాయి. ఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేటాయింపులు అమల్లోకి వచ్చాయి.ప్రాధాన్యత క్రమంలో పంపిణీప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) రోజువారీ సగటు వినియోగంలో 20 శాతం మేర నియంత్రిత పంపిణీ కోసం కేటాయించాయి. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో రోజుకు సుమారు 1,800 సిలిండర్లను ఈ విధానం కింద పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంపిణీలో ఐదు స్థాయిల ప్రాధాన్యతను నిర్ణయించారు:స్థాయి 1, 2: విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వేలు, విమానాశ్రయాలకు అత్యున్నత ప్రాధాన్యత.స్థాయి 3: రెస్టారెంట్లు, భోజనశాలలకు 42 శాతం వాటా.స్థాయి 4: హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ట్రస్టులకు 4 శాతం కేటాయింపు.స్థాయి 5: డెయిరీలు, బేకరీలు, స్వీట్ షాపులకు 11 శాతం కేటాయింపు.రాష్ట్రాల వారీగా..కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికే ఢిల్లీ, బిహార్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గృహ వినియోగ గ్యాస్ మళ్లింపును అరికట్టడానికి, వాణిజ్య అవసరాలకు అంతరాయం కలగకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల పండుగల సీజన్లో, రద్దీ సమయాల్లో వాణిజ్య గ్యాస్ కొరత తలెత్తకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష -
ఎల్పీజీ సంక్షోభంపై కేంద్రం అబద్దాలు చెబుతోంది : మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ: ఇరాన్ వార్తో దేశంలో ఎల్పీజీ గ్యాస్ లభ్యంత గందరగోళంగా మారింది. సోమవారం పార్లమెంటులో ఈ సంక్షోభంపై దుమారం రేగింది. ఒకవైపు ఎల్పీజీ కొరతలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఆందోళనగా కరంగా ఉందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) మల్లికార్జున్ ఖర్గే, జె.పి. నడ్డా మధ్య వాగ్వాదంచోటు చేసుకుంది. జీరో అవర్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, గల్ఫ్ యుద్ధం మరియు హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎల్పిజి సరఫరాపై ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ కేంద్రంపై మండిపడింది. రాజ్యసభలో ఎల్పిజి సంక్షోభ అంశాన్ని లేవనెత్తిన మల్లికార్జున్ ఖర్గే సిలిండర్ల ప్యానిక్ బుకింగ్పై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఎల్పిజి సమస్య మధ్యతరగతి, రెస్టారెంట్లు, హాస్టళ్లు , వాణిజ్య వినియోగ దారులను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో, ఎల్పిజి లభ్యత, ధర స్థిరత్వం తీవ్రమైన సమస్యలుగా మారాయనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ఎల్పిజి కొరత లేదని లోక్సభలో ప్రకటించిన వైనాన్నిఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చెబుతున్న వాదనలు తప్పు అని వాస్తవాలు రుజువు చేస్తున్నామని మండిపడ్డారు.హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని ఖర్గే ఆరోపించడంతో జీరో అవర్ సమయంలో ఘర్షణ చెలరేగింది.దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ల తీవ్ర కొరతకు ప్రభుత్వమే కారణమని ఖర్గే అన్నారు. మధ్యతరగతి , పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. రెస్టారెంట్లు, హాస్టళ్లు కమ్యూనిటీ కిచెన్లను మూసివేయాల్సి వచ్చిందని, ఎల్పిజి సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.దేశంలో 60 శాతం ఎల్పిజి దిగుమతి అవుతుందని, ఇందులో 90 శాతం సరఫరా హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంద న్నారు. ప్రపంచ చమురు సంక్షోభానికి దారితీసే కీలకమైన సముద్ర మార్గం ఇది అని అన్నారు. ఎల్పిజి సరఫరాపై కేంద్రం ముందస్తు ప్రణాళిక వేసుకుని ఉంటే, ఈపరిస్థితి తలెత్తేది కాదన్నారు. ఖర్గే ఎరువుల సరఫరా కొరతను కూడా ఎత్తిచూపారు.అలాగే సిలిండర్ కోసం వెయిటింగ్ సమయాన్ని కూడా 21 - 25 రోజులకు పెంచారు, ఇది, బ్లాక్ మార్కెటింగ్కు దారితీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ప్రభుత్వ పేలవమైన ప్రణాళిక నిదర్శనమని, ఇది విదేశాంగ విధానంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుదని ఖర్గే మండిపడ్డారు. ప్రణాళిక లేకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశంలో ఎల్పిజి సరఫరాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.నడ్డా కౌంటర్ ఖర్గే విమర్శలతో సభలో వేడి రాజుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, నడ్డా కూడా స్పందించారు. జీరో అవర్ కారణంగా సభ్యులు ప్రజా సమస్యలపై లేవనెత్తాల్సిన అవసరం ఉందని, చైర్ జోక్యం చేసుకోవాలని నడ్డా కోరారు. సభలో తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నపుడు వాటిపై శ్రద్ధపెట్టకుండా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు LPG సమస్యపై మాట్లాడకుండా ఇతర అంశాలపై మాట్లాడటానికే మొగ్గు చూపారంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ఆందోళన అయితే ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, LPG సంక్షోభం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించాయి. ప్రతిపక్షాల వైపు నుంచి గందరగోళం కొనసాగుతుండగానే, సభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ముగించాలని ఖర్గేను కోరారు. ఖర్గే చేసిన ఆరోపణలకు బదులిస్తూ, నడ్డా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అసలు ఈ సంక్షోభం దేశం వల్ల కాదని, ప్రపంచవ్యాప్త కారణాల వల్లే తలెత్తిందని పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ నిరంతరాయంగా లభ్యతను నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వింత ప్రవర్తన: రేబిస్తో కుక్కలా అరుస్తున్న యువకుడు
లక్నో: ఓ 17ఏళ్ల యువకుడు అచ్చం కుక్కలా ప్రవర్తిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని కచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలుడి తల్లిదండ్రులు అందించిన వివరాల మేరకు.. కుక్క కరవడం వల్లే తమ కుమారుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కరవడం వల్ల రేబిస్ వ్యాధి సోకుతుంది. రేబిస్కు సరైన వైద్యం అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ బాలుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనే అంశంపై వైద్యులు ఆరా తీశారు. రేబిస్కు సరైనా చికిత్స తీసుకోకపోవడం వల్లే బాలుడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు గుర్తించారు. నాలుగు నెలల క్రితం, ఆ గ్రామంలో నివసించే భాయ్ లాల్ అనే 17 ఏళ్ల యువకుడికి కుక్క కరిచింది. ఈ సమయంలో, అతనికి మొదటి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. రేబిస్ సోకితే ఐదు టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ బాధిత బాలుడు రెండు టీకాలు మాత్రమే తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో వైద్యం తీసుకోకుండా మధ్యలో వదిలేయడం వల్ల కొంత కాలంగా బాలుడు కుక్కలా ప్రవర్తించడం ప్రారంభించాడు. వైద్య చికిత్స కోసం ఆస్పత్రులు తిరిగినా ఫలితం కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యం అందిస్తే తగ్గిపోతుందని బాలుడి కుటుంబ సభ్యులు తమని తాము సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు చెప్పారు. మరోవైపు,స్థానిక వైద్యులు సైతం బాలుడికి టీకా పూర్తిస్థాయిలో వేయలేదని చెబుతున్నారు. కాబట్టే బాలుడు మాట్లాడే విధానం, నడక, కూర్చునే తీరు మారిపోయింది. అంతేకాకుండా, అతను బతికే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు. బాలుడి పరిస్థితిని వైద్య పరిభాషలో హైడ్రోఫోబియా అని డికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పంకజ్ పాండే వివరించారు. రేబిస్ లక్షణాలు కనిపించినప్పుడు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వ్యక్తి కుక్కలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు’ అని తెలిపారు. Mirzapur Boy Bitten by Dog 4 Months Ago, Took Only 2 Rabies Shots – Now Acting Like a Dog 😨#mirzapur #rabies #kiranyadav pic.twitter.com/ZuTZTCfJ5Z— Kiran yadav (@Thekiranyadavvv) March 15, 2026 -
ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?
అహ్మదాబాద్: విదేశాల్లో భారీ ప్యాకేజీలు అందుకుంటూ, అత్యాధునిక సాంకేతికతతో పనిచేసి, ఏవో కారణాలతో స్వదేశానికి తిరిగివచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు భారతీయ కంపెనీల్లో వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్యాన్సర్ పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)వంటి అత్యున్నత రంగాల్లో అనుభవమున్న టెక్కీలను ఇంటర్వ్యూల్లో ‘నోట్ప్యాడ్' మీద కోడ్ రాయమనడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది.అసలేం జరిగింది?అహ్మదాబాద్కు చెందిన ‘న్యూకాన్స్’ (Pneucons) సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ లఖానీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ ఉదంతం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అతని స్నేహితులిద్దరు గత ఐదేళ్లుగా జర్మనీని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఒకరు క్యాన్సర్ కణాలను గుర్తించే ఏఐ మోడల్స్ను రూపొందించగా, మరొకరు మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) పైప్లైన్స్లో నిపుణుడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసం వారు తమ విదేశీ ఉద్యోగాలను వదిలి భారత్కు తిరిగివచ్చారు.అయితే వారు ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తే.. సదరు రిక్రూటర్లు వారి అనుభవాన్ని పక్కన పెట్టి, 2026వ సంవత్సరంలో కూడా ఒక సాధారణ ‘నోట్ప్యాడ్’ ఇచ్చి కోడ్ రాయమని అడగడం వారిని షాక్నకు గురిచేసింది. ‘క్యాన్సర్ను గుర్తించే ఏఐ మోడల్స్ తయారు చేసే మేధావులను నోట్ప్యాడ్పై కోడ్ రాయమనడం హాస్యాస్పదం’ అని లఖానీ ఎద్దేవా చేశారు.నెటిజన్ల రియాక్షన్: 'ఇది టెక్ ఇంటర్వ్యూనా.. జోకా?'ఈ పోస్ట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ‘భారతీయ ఇంటర్వ్యూ వ్యవస్థ ఇంకా పురాతన కాలంలోనే ఉంది. 15 ఏళ్ల అనుభవం ఉన్నవాడిని కూడా లాజిక్ అడగకుండా, బట్టీ పట్టినట్టు కోడ్ రాయమనడం రిక్రూటర్ల అసమర్థతకు నిదర్శనం’ అని ఒకరు మండిపడ్డారు. ‘అనుభవం ఎంత ఉన్నా ప్రాథమిక అంశాలు ముఖ్యం. నోట్ప్యాడ్పై రాయడం వల్ల వారి సృజనాత్మకత, పట్టు అర్థమవుతుంది" అని మరికొందరు వాదించారు. మొత్తానికి ప్రపంచమంతా ఏఐ వేగంతో దూసుకుపోతుంటే, మన దగ్గర ఇంకా పాత పద్ధతులతోనే ప్రతిభను కొలవడం ఇప్పుడు ఐటీ రంగంలో చర్చకు దారితీసింది.ఇది కూడా చదవండి: UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే.. -
భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి శివాలిక్ నౌక భారత్ చేరుకుంది. ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది.షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్కు చేరింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్ హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. ఇవాళ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఎల్పీజీ గ్యాస్ నౌక భారత్కు సురక్షితంగా రావడం శుభపరిణామ. దేశీయ వంట గ్యాస్ కొరతను తగ్గించడంలో సహాయపడుతోంది. రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నాయి. #Fujairah #IranIsraelWar #GlobalEnergy #PMModi #IndianShips #NandaDevi #Shivalik #Delhi $BJP 54 हजार टन LPG लेकर जहाज ‘शिवालिक’ आज मुद्रा पोर्ट पहुंचेगा,नई दिल्ली. मोदी सरकार की कुशल रणनीति और ईरान–इजराइल तनाव के बीच भारत के लिए राहत की खबर है, करीब 54 हजार टन एलपीजी गैस लेकर… pic.twitter.com/YbqSa3dnBM— सिरोही की आवाज (@Sirohikiaawaz) March 16, 2026 -
గిగ్ కార్మికుల ఆదాయంపై యుద్ధ మేఘాలు!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు గిగ్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు వీధి వ్యాపారుల నుంచి మెట్రో నగరాల ఫుడ్ డెలివరీ బాయ్స్ వరకు అందరినీ రోడ్డున పడేస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు మూతపడుతుండటంతో.. డెలివరీ ఆర్డర్లు లేక గిగ్ కార్మికుల ఆదాయం సగానికి పడిపోయింది.అడుగంటిన సరఫరా.. ఆకాశన్నంటిన ధరలుఅంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులు తగ్గడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఇదే అదునుగా భావిస్తున్న అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ను సుమారు రూ.4,000 వరకు విక్రయిస్తున్నారని గిగ్, ప్లాట్ఫాం సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా స్పందించి ఈ కృత్రిమ కొరతను అరికట్టాలి’ అని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.తగ్గిన ఆర్డర్లు..రెస్టారెంట్లు, ధాబాలు గ్యాస్ లేక వంటలు చేయలేకపోవడంతో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్ఫారమ్లపై ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ వ్యవహారంపై ఓ గిగ్ సిబ్బంది స్పందిస్తూ.. ‘గతంలో రోజుకు 30-40 ఆర్డర్లు చేసేవాడిని. ఇప్పుడు 20 కూడా రావడం లేదు. గంటల తరబడి యాప్ వైపు చూస్తూ ఖాళీగా కూర్చుంటున్నాం’ అన్నాడు.ఆర్ధిక సంక్షోభంలో గిగ్ కుటుంబాలుకేవలం డెలివరీ బాయ్స్ మాత్రమే కాదు, క్లౌడ్ కిచెన్లలో పనిచేసే వారు, రోడ్డు పక్కన బండ్లు నడిపేవారు ఈ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్డర్ల పతనం వల్ల ఆదాయం తగ్గడమే కాకుండా, పెరిగిన నిత్యావసరాల ధరలు వారిని కుంగదీస్తున్నాయి. చాలా మంది గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లు లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ పెరిగిన కరెంటు బిల్లులు మరో భారంగా మారుతున్నాయి.ప్రభుత్వ జోక్యం అవసరంగ్యాస్ సరఫరాతోపాటు లక్షలాది మంది కార్మికుల జీవనాధారానికి సంబంధించిన అంశంపై ప్రభుత్వ స్పందించాల్సి ఉంది. సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆదాయం కోల్పోయిన డెలివరీ భాగస్వాములకు కంపెనీలు లేదా ప్రభుత్వం తరఫున ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కొందరు చెబుతున్నారు. మిడిల్ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీ దిగుమతులను వేగవంతం చేయాలి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
వంట గ్యాస్ వినియోగదారులకు షాక్
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటింట్లో సెగలు రేపుతున్నాయి. ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా సామాన్యుడి నడ్డి విరుస్తుండటంతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని గృహ వినియోగదారులందరికీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (ఈ-కేవైసీ) తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ నుండే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) యాప్తో పాటు, ‘ఆధార్ ఫేస్ ఆర్డీ) (Aadhaar FaceRD) యాప్ను ఉపయోగించి ఇంట్లోనే ఈ-కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలుంటే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించాలని లేదా టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలని సూచించింది.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపధ్యంలోనే కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలు నిలిచిపోయాయి. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం 90% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. ఫలితంగా ఢిల్లీలో 14.2 కిలోల గృహ సిలిండర్ ధర ₹60 పెరిగి ₹913కు చేరగా, కమర్షియల్ సిలిండర్ ధర ₹1,884.50కు పెరిగింది.గ్యాస్ కొరతను సాకుగా చూపి అక్రమంగా నిల్వ చేసే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్ణాటకలోని కెంఘేరిలో బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఢిల్లీలో గ్యాస్ డిపోల వద్ద నిరంతరం పోలీసు పహారా ఏర్పాటు చేశారు. అటు ఢిల్లీ ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సరఫరాపై 20 శాతం క్యాపింగ్ విధించి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు గ్యాస్ సరఫరా ఇబ్బందులు, మరోవైపు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు.ఇది కూడా చదవండి: UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే.. -
భారత్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.. జైశంకర్ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ ఇరాన్తో తాను జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం నేను ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నాను. ఈ చర్చలు ఫలితాల్ని ఇస్తున్నాయి. ఇరాన్తో భారత్ నిరంతరం టచ్లోనే ఉంటుంది. చర్చల ద్వారా దౌత్యపరమైన విజయాలు లభిస్తుంటే వాటిని పరిశీలించడంలో తప్పులేదు. నేనుకూడా అదే చేస్తున్నాను’ అని ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో జైశంకర్ తెలిపారు. ‘ఖచ్చితంగా, ఆయా దేశాలతో సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భారత్ దృక్కోణం నుండి ఇరాన్తో చర్చలు జరపడం,సమన్వయం చేసుకోవడం మంచిది. పరిష్కారం సైతం లభిస్తోందన్నారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంత కొనసాగుతోంది. క్రమంలో ప్రపంచ దేశాలపై ఆర్థిక పరమైన ఒత్తిడి తెచ్చేలా ఇరాన్ తన హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. తమని కాదని చమురు నౌకల రవాణాని కొనసాగిస్తే వాటిని పేల్చుతామని హెచ్చరించింది. అందుకు కొనసాగింపు ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నేవల్ మైన్స్ను నింపేసింది. 700నౌకలను నిలిపివేసిందిఈ క్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఇరాన్తో చర్చలు జరిపారు. హర్మూజ్ జలసంధిలో భారత్ నౌకలపై ఆంక్షలు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు భారత్ గ్యాస్, చమురు నౌకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. భారత్ జెండాలతో జలసంధి గుండా వెళ్లొచ్చని సూచించింది.ఆరోణల్ని ఖండించిన జైశంకర్భారత జెండాతో ఉన్న నౌకలకు సంబంధించి ఇరాన్తో ఎలాంటి ‘సమగ్ర ఒప్పందం’లేదని విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఇరాన్ ప్రతిఫలం పొందిందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం. భారత్-ఇరాన్ల మధ్య చిరకాల సంబంధం ఉంది. దాని ఆధారంగా చర్చలు జరిపినట్లు పునరుద్ఘాటించారు. భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం శుభపరిణామం. అయినప్పటికీ హర్మూజ్ జలసంధి నుంచి భారత్కు రావాల్సిన నౌకలు చాలా ఉన్నాయి. వాటి విషయంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. -
మెగా ఫైట్ @2026: పేలుతున్న ‘సీనియర్ల’ మాటల తూటాలు
దేశవ్యాప్త ఉత్కంఠకు తెరదించుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9 నుంచి మే 4 వరకు సాగే ఈ ‘ప్రజాస్వామ్య పండగ’లో విజయం ఎవరిదనే చర్చ అప్పుడే మొదలైంది. ఎన్నికల తేదీల ప్రకటన రాగానే ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి మంత్రం, మరోవైపు ప్రజాస్వామ్య రక్షణ నినాదాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.తమిళనాడు: ‘వారసత్వ రాజకీయాలకు చరమగీతం’ తమిళనాడులో ఈసారి చారిత్రాత్మక మార్పు రాబోతోందని ఏఐఏడీఎంకే (AIADMK) ప్రతినిధి కోవై సత్యన్ ధీమా వ్యక్తం చేశారు. ‘మే 4న తమిళనాడులో వారసత్వ పాలన అంతం కాబోతోంది’ అంటూ ఆయన అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ ఇస్తూ, డీఎంకే ఎంపీ ఎంఎం అబ్దుల్లా.. ‘డీఎంకే ఎప్పుడూ ఎన్నికల మూడ్లోనే ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుంది, గెలుపు మాదే’ అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నేత పీటర్ అల్ఫోన్స్ దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.పశ్చిమ బెంగాల్: 'హింస లేని ఎన్నికలే మా లక్ష్యం'బెంగాల్ రాజకీయం ఎప్పుడూ రణరంగాన్ని తలపిస్తుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, అయితే బెంగాల్లో మా కార్యకర్తల హత్యలు మళ్లీ జరగకూడదు.. భయం లేని వాతావరణంలో ఎన్నికలు జరగాలి’ అని కోరారు. కాగా, ఒపీనియన్ పోల్స్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) 150కి పైగా సీట్లతో ముందంజలో ఉండటం తృణమూల్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.కేరళ: ‘వేసవి ఎండలో ప్రచార యుద్ధం’కేరళలో ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు సిద్ధం కానీ, వేసవి ఎండల్లో ప్రచారం చేయడం అభ్యర్థులకు సవాలే. మా దగ్గర భారీగా ఖర్చు చేసేందుకు ఆర్థిక వనరులు లేవు. కానీ ప్రజల మద్దతు ఉంది’ అని అన్నారు. కాగా, కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ తాము ఏడాది క్రితమే గ్రౌండ్ లెవల్లో ప్రిపరేషన్స్ మొదలుపెట్టామని, ఈసారి మార్పు ఖాయమని అన్నారు.అస్సాం: ‘అభివృద్ధి వర్సెస్ ప్రజా మద్దతు’అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారం చేపడుతుందని బీజేపీ నేతలు అశోక్ భట్టారాయ్ లాంటి వారు నమ్మకంతో ఉన్నారు. ‘పంచాయతీ స్థాయి నుంచి మా కమిటీలు సిద్ధంగా ఉన్నాయి’ అని వారు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాత్రం ‘అస్సాం ప్రజలు ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇస్తారు’ అని సవాల్ విసిరారు. ఇక్కడ కూడా ఒపీనియన్ పోల్స్ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని సూచిస్తున్నాయి.బీజేపీ గెలుపు ధీమా: ‘ఐదు రాష్ట్రాల్లోనూ మాదే విజయం’కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. "ఐదు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్డీఏ (NDA) భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది’ అని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని బీజేపీ నేతలు రాజీవ్ ప్రతాప్ రూడీ, వీరేంద్ర సచ్దేవా తదితరలు నొక్కి చెప్పారు. సామాన్యుల కష్టసుఖాల్లో తోడుగా ఉండే పార్టీగా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇది కూడా చదవండి: సిలిండర్లకు సంకెళ్లు.. బడిలో పానీపూరీ భోజనం -
బెంగాల్ ఎన్నికలు.. సీఎస్, హోం సెక్రటరీపై వేటు
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీపై ఈసీ బదిలీ వేటు వేసింది. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి పోస్టింగ్ వద్దని ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం, కొత్త చీఫ్ సెక్రటరీగా దుష్యంత్ నరియాల, హోం సెక్రటరీగా సంఘమిత్ర ఘోష్లను నియామకం చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖలో స్పష్టం చేసింది. తన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, అధికారులు విధుల్లో చేరిన వివరాలతో కూడిన నివేదికను సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు పంపాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక, ఇప్పటివరకు నందిని చక్రవర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. Following the announcement of the West Bengal Assembly Elections 2026 schedule on 15 March 2026, the Election Commission of India announced the transfer of senior officers. Dushyant Nariala (IAS-1993) appointed Chief Secretary, Govt. of West Bengal, and Sanghamitra Ghosh… pic.twitter.com/pqXt0fWD8b— ANI (@ANI) March 15, 2026 -
సిలిండర్లకు సంకెళ్లు.. బడిలో పానీపూరీ భోజనం
దేశంలో ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యునికి ఊపిరి ఆడనివ్వడం లేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సరఫరాలో అంతరాయాల వల్ల గ్యాస్ సిలిండర్ ఇప్పుడు సామాన్య వస్తువు కాదు.. ఒక విలాసవంతమైన వస్తువుగా మారిపోయింది. ఈ సంక్షోభం ఎంతటి వింత పరిస్థితులకు దారితీసిందంటే.. ఐఐటీ లాంటి విద్యాసంస్థల మెనూలు మారిపోయాయి.. సిలిండర్లకు సెక్యూరిటీ పెరిగింది. ఇటువంటి ఆసక్తికర కథనాల సమాహారం మీకోసం..సిలిండర్లకు ఇనుప గొలుసుల పహారా!మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ‘వెల్వెట్ గార్డెన్’ లాంటి వంటి నివాస ప్రాంతాల్లో దొంగలు సిలిండర్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రజలు తమ సిలిండర్లను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. వాచ్మెన్ క్వార్టర్లలో ఉండే స్టోర్ చేసే సిలిండర్లకు ఇనుప గొలుసులతో తాళాలు వేసి భద్రపరుస్తున్నారు. గ్యాస్ దొరకడమే కష్టమైన వేళ.. ఉన్న సిలిండర్లు దొంగలపాలైతే ఆకలితో అలమటించాల్సి వస్తుందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఐఐటీ బాంబేలో 'నో ఫ్రైడ్.. ఓన్లీ ఐస్క్రీమ్'!దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థ అయిన ఐఐటీ బాంబేలో గ్యాస్ కొరత కారణంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ వందలాది మంది విద్యార్థులకు భోజనం వండటం మెస్ నిర్వాహకులకు సవాలుగా మారింది. దీంతో వారు తమ మెనూని పూర్తిగా మార్చేశారు. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే వేపుడు పదార్థాలను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో గ్యాస్ అవసరం లేని ఐస్క్రీమ్లు, చల్లని పదార్థాలను అందిస్తున్నారు.బడిలో పానీ పూరీల భోజనం!పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనం అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్యాస్ సిలిండర్ల కొరతతో వంట చేయడం అసాధ్యం కావడంతో, పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పానీపూరీలను భోజనంగా అందించింది. అన్నం, కూరలకు బదులు చాట్ ఐటమ్స్ వడ్డించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్యాస్ సంక్షోభం చిన్నారుల ఆకలిపై ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.పెళ్లిళ్లలో గ్యాస్ తిప్పలు.. క్యాటరర్ల హైరానా!ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత పెళ్లిళ్ల విందుపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసుల వారికి గ్యాస్ అందక సతమతమవుతున్నారు. కొన్ని చోట్ల పెళ్లిళ్లలో భారీ విందులు ఏర్పాటు చేయడం కష్టతరం కావడంతో మెనూని కుదించడం లేదా గ్యాస్ అవసరం లేని వంటకాల వైపు మొగ్గు చూపడం జరగుతోంది. సిలిండర్లు దొరకక పోతే శుభకార్యాలు ఎలా నిర్వహించాలని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీధి వ్యాపారుల ఉపాధి గల్లంతు!నగరాల్లోని స్ట్రీట్ ఫుడ్ వెండర్లు, చిన్న చిన్న హోటల్ నిర్వాహకుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సిలిండర్ల ధరలు పెరగడమే కాకుండా, అసలు సరఫరానే నిలిచిపోవడంతో వేలాది మంది వ్యాపారులు తమ బండ్లను మూసివేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూసినా ఫలితం ఉండటం లేదని, ఫలితంగా తమ రోజువారీ ఆదాయం దెబ్బతింటోందని చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతర్జాతీయ ప్రభావం.. స్థానిక కష్టాలు!ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపాయి. దీని ప్రభావంతోనే భారత్లో ఎల్పీజీ కొరత ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రవాణా వ్యవస్థ దెబ్బతినడం, ధరల పెరుగుదల వల్ల సామాన్యుడి వంటగదిలో మంట ఆరిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.సంక్షోభంలో సామాన్యుడి పోరాటం!ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సామాన్యుల జీవనం మరింత దుర్భరంగా మారుతుందనడంలో సందేహం లేదు. సిలిండర్లకు తాళాలు వేసుకోవడం, వంటలు మానేసి ఐస్క్రీమ్లు తినడం వంటివి తాత్కాలిక పరిష్కారాలే కానీ, శాశ్వత పరిష్కారం కాదు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని, ధరలను అదుపులోకి తీసుకురావాలని దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.ఇది కూడా చదవండి: ‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ? -
Odisha : ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పదిమంది మృతి
భువనేశ్వర్: ఒడిశా కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయూలో మంటలు చెలరేగి 10 మంది మరణించగా, మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన ఐసీయూ వార్డులో మొత్తం 23 మంది చికిత్స పొందుతున్నారు. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది, వైద్యులు సహాయక చర్యలు ప్రారంభించారు. రోగులను ఇతర ఐసీయూ, జనరల్ వార్డులకు తరలించే సమయంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది సేపటికే మరో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 3 గంటల మధ్య జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం మోహన్ చరణ్ మాఝీఒడిశాలో ఎస్సీబీ ఆస్పత్రి ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్యశాఖ మంత్రి మహాలింగ్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. భారీ అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. #WATCH | Odisha: A fire broke out at Trauma Care ICU of S.C.B. Medical College and Hospital in Cuttack. Fire brigade present at the spot for firefighting operations. Visuals from the spot. More details awaited. pic.twitter.com/KZVF5wOy4V— ANI (@ANI) March 16, 2026 -
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్లో కనిపిస్తున్న కంటెంట్లో డీప్ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మౌనంగా బాధితులు.. మహిళలకు సంబంధించిన 62% డీప్ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.పరిశ్రమలా విస్తరించాయి..డీప్ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్ఫేక్లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఎర
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ కర్నాటక నేతలు ‘ఆపరేషన్ లోటస్’కు తెరతీశారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఇస్తామంటూ కొందరు ప్రయత్నించారని తెలిపారు.దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. బిడది రిసార్టులో ఉంచిన తమ ఎమ్మెల్యేల వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి నగదు ఆఫర్ ఇచ్చినట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా తెలిపారు. -
నేపాల్లో బస్సు ప్రమాదం ఏడుగురు భారతీయులు మృతి
కఠ్మాండు: భారతీయ తీర్థయాత్రికులతో కూడిన మినీ ఎలక్ట్రిక్ బస్సు నేపాల్లో ప్రమాదానికి గురైంది. ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గండకి ప్రావిన్స్లోని గూర్ఖా జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.మనకామన ఆలయం నుంచి వస్తున్న ఈ అదుపుతప్పి రోడ్డు పక్క ఏటవాలుగా ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఏడుగురు మృత్యువాతపడగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుదేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
భారత ఆర్థిక వ్యవస్థ ప్రోగ్రెస్ రిపోర్ట్
భారతదేశం కేవలం అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు, ప్రపంచ వృద్ధికి దిక్సూచిగా మారుతోందని ఎన్ఎక్స్టీ ఫౌండేషన్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ‘భారత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2025-26’ పేరుతో విడుదలైన విశ్లేషణలో గడిచిన ఏడాది కాలంలో దేశం సాధించిన 101 చారిత్రాత్మక విజయాలను ఆవిష్కరించింది. డిజిటల్ విప్లవం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, మౌలిక సదుపాయాల కల్పన నుంచి హరిత ఇంధనం వరకు భారత్ వృద్ధిలో వేగంగా దూసుకుపోతోందని చెప్పింది.జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..ఎన్ఎక్స్టీ నివేదిక ప్రకారం.. 2025లో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 4.18 ట్రిలియన్ డాలర్ల నామమాత్రపు జీడీపీతో జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 8.2 శాతం బలమైన వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదే వేగం కొనసాగితే అతి త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయమని నివేదిక విశ్లేషించింది.విదేశీ పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 1.15 ట్రిలియన్ డాలర్లను దాటాయి. దేశ ఆర్థిక వృద్ధిని ప్రతిబింబించేలా పలు కీలక సూచీలు రికార్డులను సృష్టించాయని నివేదిక తెలిపింది. ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లు మునుపెన్నడూ లేని విధంగా రూ.2.17 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ పొదుపు సంస్కృతి పెరగడంతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.80 లక్షల కోట్లను దాటింది.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షంనివేదికలోని కొన్ని అంశాలు..యూపీఐ నెలవారీ లావాదేవీల విలువ రూ.21 లక్షల కోట్లు దాటడం దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యాప్తికి అద్దం పడుతోంది.ఒక బిలియన్ మార్కును దాటిన ఆధార్ అప్డేషన్లు ప్రభుత్వ సేవలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరవేయడంలో పారదర్శకతను పెంచాయి.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన (చీనాబ్ బ్రిడ్జ్) పూర్తి కావడం భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం.దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వందే భారత్ రైళ్లు రవాణా ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి.జాతీయ రహదారుల విస్తరణతో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి సరఫరా గొలుసు బలోపేతమైంది.ఇస్రో నిర్వహించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ విజయవంతం కావడంతో అంతరిక్షంలో సొంత స్టేషన్ ఏర్పాటు దిశగా భారత్ కీలక అడుగు వేసింది.చైనాకు ప్రత్యామ్నాయంగా ‘గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్’గా ఎదిగే క్రమంలో సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్లో భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తోంది.సౌర, పవన, హైడల్ పవర్ రంగాల్లో భారత్ అసాధారణ వృద్ధిని కనబరిచింది. -
పార్లమెంట్ మెట్లపై మీరు టీ తాగి, పకోడీ తిని..: అమిత్ షా
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. అసోం ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆ రాష్ట్రంలోని గువాహటిలో పర్యటించిన అమిత్ షా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. భారత్కు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు అపకీర్తి తెచ్చిపెట్టేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ మెట్లపై కూర్చుని “టీ, పకోడీలు” తింటారని పేర్కొన్నారు.“ఒక్కోసారి ఆయన పార్లమెంట్ ద్వారం వద్ద కూర్చొని టీ తాగుతారు, పకోడీలు తింటారు. అల్పాహారం తినే చోటు ఏది? ఈ విషయం ఆయనకు తెలియదా? భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అత్యున్నత వ్యవస్థ. అక్కడ కూర్చొని నిరసనకు దిగడం కూడా ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కానీ, మీరు అక్కడ నిరసనకు దిగడమే కాకుండా మరో రెండు అడుగులు వేసి టీ తాగుతూ, పకోడీలు కూడా తింటున్నారు. దీనివల్ల ప్రపంచం ముందు భారత్ అపకీర్తి పాలవుతుంది” అని అమిత్ షా అన్నారు.ఏఐ సదస్సులో ఇలాగేనా చేసేది? మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ దేశానికే వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారని అన్నారు. పార్లమెంట్ చర్చల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం లేదని విమర్శించారు. ఇటీవల ఢిల్లీ నగరంలో జరిగిన కృత్రిమ మేధస్సు సదస్సు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారని చెప్పారు. ఆ కార్యక్రమానికి 80 దేశాల కంపెనీల ప్రధాన కార్యనిర్వాహక అధికారి స్థాయి అధికారులు హాజరయ్యారని తెలిపారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ సదస్సును ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కృత్రిమ మేధస్సు సదస్సని పేర్కొన్నారని అమిత్ షా అన్నారు. ఆ కార్యక్రమంలో అనేక అవగాహన ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అయితే, అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు నిర్వహించి భారతదేశాన్ని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సదస్సు సమయంలో అర్ధనగ్నంగా నిరసన తెలిపిన వారికి రాహుల్ గాంధీ మద్దతు పలికారని కూడా విమర్శించారు.ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు భారత శక్తిని, యువత సామర్థ్యాన్ని చూడటానికి వచ్చే ఇటువంటి సదస్సుల్లో నిరసన ప్రదర్శలు చేస్తే.. ఇటువంటి వాటిల్లో మనకు అవకాలు తగ్గుతాయని చెప్పారు. భారత ప్రజలు అలాంటి చర్యలను క్షమించరని అన్నారు. దాదాపు దశాబ్దం క్రితం ఈశాన్య ప్రాంతం, అసోంలో ఆరోగ్య వ్యవస్థ చాలా దయనీయ స్థితిలో ఉందని చెప్పారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కన్నా తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు. -
ఇద్దరు యువకుల ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి..!
జెట్పూర్: గుజరాత్లోని జెట్పూర్లో శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతి వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అ వధ్ తివారీ, మరొక స్నేహితుడు దేవరాజ్ గోసాయి ఇద్దరు హుండాయ్ వెర్నా కారును అత్యంత వేగంగా డ్రైవ్ చేస్తూ రీల్స్ షూట్ చేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న అవధ్ తివారీ ప్రమాదానికి కొద్దిసేపటి ముందు తన ఇన్స్టాగ్రామ్లో వేగంగా కారును నడుపుతున్న వీడియోలను పోస్ట్ చేశాడు. ఆయన ఎడమ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని రీల్ రికార్డ్ చేస్తూ, మరో చేతితో స్టీరింగ్ పట్టుకున్నట్లు వీడియోలో ఉంది. కారు సుమారు 120 కిమీ వేగంతో వెళ్తుండగా, పక్క సీటులో కూర్చున్న వ్యక్తి కూడా వీడియో తీశాడు. అనంతరం కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తివారీ అక్కడికక్కడే మృతి చెందగా, అతని 20 ఏళ్ల స్నేహితుడు దేవరాజ్ గోసాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ కారులో ఉన్న మరో యువయుడు అక్షయ్ ప్రవీణ్భాయ్ వాఘెలా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తివారీకి కార్లలో ఫీట్లు చేస్తూ వీడియోలుఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం హాబీగా మారిపోయింది. ఇప్పుడు ఆ హాబీనే అతని ప్రాణం తీసింది. -
గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. కేంద్రం కొత్త ఆదేశాలు
న్యూఢిల్లీ: ఎల్పీజీ,పీఎన్జీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలని సూచించింది. రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు,ఎరువుల రంగాలను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు సంక్షోభాన్ని తగ్గించేలా ఆయా రంగాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తాజాగా భారత్ సైతం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.గ్యాస్ వినియోగదారులు ఏదైనా ఒక గ్యాస్ కనెక్షన్ వినియోగించుకోవాలి. రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎల్పీజీ నియమాలలో మార్పులు చేసింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పిప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) పాటు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్ను తిరిగి సంబంధిత ఏజెన్సీలకు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ఇంధన వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక గృహాలు పీఎన్జీ కనెక్షన్తో పాటు ఎల్పీజీ కనెక్షన్ను కూడా కలిగి ఉన్నాయి. ఇది వినియోగదారులకు సౌకర్యంగా ఉన్నప్పటికీ, సబ్సిడీ లబ్ధి విషయంలో గందరగోళం, దుర్వినియోగం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒక గృహానికి ఒకే ఇంధన కనెక్షన్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ ఉన్న గృహాలు వెంటనే ఎల్పీజీ కనెక్షన్ను సమర్పించాలి. ఈ ప్రక్రియను ఆలస్యం చేయకుండా సంబంధిత గ్యాస్ కంపెనీలకు సమాచారం ఇవ్వాలి. ఇకపై సబ్సిడీ లబ్ధి ఒకే కనెక్షన్కు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై ఎల్పీజీ సబ్సిడీ పొందలేరు. ఎల్పీజీ కనెక్షన్ను సమర్పించిన తర్వాత పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతర సరఫరా కొనసాగుతుంది. ఇంధన వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. అక్రమ గ్యాస్ కనెక్షన్లు తగ్గనున్నాయి.ఈ నిర్ణయంపై గ్యాస్ వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఎల్పీజీ అవసరం లేదని భావిస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఎల్పీజీ సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరమవుతుందని మరికొందరు అంటున్నారు. కాగా, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ (MoPNG), అలాగే పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) ద్వారా విడుదలైన గణాంకాల ఆధారంగా దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ 33.2కోట్ల మందికి.. పిప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్1.36కోట్ల మంది వినియోగిస్తున్నారు. -
ప్రపంచంలోనే అధికంగా వంటగ్యాస్ ఉత్పత్తి చేసే దేశం
భారతదేశంలో సగటు సామాన్యుడి వంటింటి బడ్జెట్ను తలకిందులు చేసే ప్రధాన అంశాల్లో గ్యాస్ ధర ఒకటి. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు నేరుగా భారతీయులపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న ఈ యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది సౌదీ అరేబియా లేదా రష్యా అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారులు అని భావిస్తారు. కానీ అసలు వాస్తవం ఏమిటో.. ప్రపంచంలో ఏ దేశం ఎక్కువగా వంటగ్యాస్ ఉత్పత్తి చేస్తుందో కింద చూద్దాం.గ్యాస్ సరఫరాకు కీలకంగా హార్మూజ్ జలసంధిప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు హార్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా ఈ షిప్పింగ్ కారిడార్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు అధికం కావడంతో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో సిలిండర్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.అమెరికానే నంబర్ వన్చాలామంది సౌదీ అరేబియా లేదా రష్యా అతిపెద్ద ఉత్పత్తిదారులు అని భావిస్తారు, కానీ వాస్తవం వేరు. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అగ్రగామి ఎల్పీజీ ఉత్పత్తిదారుగా అవతరించింది. అమెరికా ఏటా సుమారు 84 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తోంది. అంటే ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 26% వాటా ఒక్క అమెరికాదే.చైనా 32 మిలియన్ టన్నులు, సౌదీ అరేబియా 26 మిలియన్ టన్నులతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రష్యా నాలుగో స్థానంలో ఉంది. కెనడా, ఇరాన్, ఖతార్, యూఏఈలు కూడా ఈ జాబితాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.ఎల్పీజీ అసలు ఎలా తయారవుతుంది?ఎల్పీజీ అంటే ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. ఇది ప్రధానంగా రెండు మార్గాల్లో లభిస్తుంది. భూమి లోపలి నుంచి సహజ వాయువును వెలికితీసేటప్పుడు ప్రొపేన్, బ్యూటేన్లను వేరు చేస్తారు. ఇతర మార్గాల్లో రిఫైనరీల్లో ముడి చమురును పెట్రోల్, డీజిల్గా మార్చే ప్రక్రియలో ఎల్పీజీ ఒక ఉప ఉత్పత్తిగా వస్తుంది.భారత్ పరిస్థితి ఏమిటి?భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుల్లో ఒకటి. ఉజ్వల యోజన వంటి పథకాలతో గ్యాస్ వినియోగం పెరిగినప్పటికీ మన దేశీయ ఉత్పత్తి డిమాండ్కు సరిపోవడం లేదు. భారత్ తన అవసరాల కోసం ప్రధానంగా పశ్చిమ ఆసియా దేశాల నుంచి దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు లేదా సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పుడు దాని ప్రభావం నేరుగా దేశీయ సిలిండర్ ధరలపై పడుతోంది.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
Election 2026: 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ మేరకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రెస్మీట్ను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. దాంతో ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో కలుపుకుని మొత్తం 17. 4 కోట్ల మంది ఓటర్లు ఉ న్నట్లు జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి సీఎస్, డీజీ, నోడల్ అధికారులు, ఎన్నికల అధికారులతో సమావేశమైనట్లుస్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తునపాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్కు ముందే పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మే 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ఒకే విడతలో తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉంటుందన్నారు.ఇక వెస్ట్ బెంగాల్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో ఏప్రిల్ 23వ తేదీన తొలి విడత, 29వ తేదీన రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపారు. ఎన్నికలు జరిగే ఈ ఐదు రాష్ట్రాల్లో మే 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుందన్నారు. VIDEO | Election Commission of India holds a press conference to announce the schedule for the 2026 General Elections to the Legislative Assemblies of Assam, Kerala, Puducherry, Tamil Nadu, and West Bengal.#ECI(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/wSy6SfmflF— Press Trust of India (@PTI_News) March 15, 2026 రాష్ట్రాల వారీగా ఎలక్షన్ షెడ్యూల్అసోం- పోలింగ్: ఏప్రిల్ 9, కౌంటింగ్: మే 4తమిళనాడు – పోలింగ్: ఏప్రిల్ 23, కౌంటింగ్: మే 4పశ్చిమ బెంగాల్ – పోలింగ్: ఏప్రిల్ 23 (1వ దశ), ఏప్రిల్ 29 (2వ దశ), తదుపరి దశ, కౌంటింగ్: మే 4కేరళ – పోలింగ్: ఏప్రిల్ 9, కౌంటింగ్: మే 4పుదుచ్చేరి – పోలింగ్: ఏప్రిల్ 9, కౌంటింగ్: మే 4కాగా, ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మే 7న.. తమిళనాడులో మే 10న.. అసోంలో మే 20న..కేరళంలో మే 23న.. పుదుచ్చేరిలో జూన్ 15న అసెంబ్లీ పదవికాలం ముగియనుంది. -
షిర్డీని తాకని ‘గ్యాస్ సెగలు’.. సోలార్ మాహాత్మ్యం
షిర్డీ: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, ఇంధన సంక్షోభం తరుముకొస్తున్న ప్రస్తుత తరుణంలో, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అత్యాధునిక సౌర శక్తి వినియోగంతో వేల సంఖ్యలో భక్తుల ఆకలిని తీరుస్తూ, పర్యావరణ హితంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోజుకు ఏకంగా 40 వేల మంది భక్తులకు సూర్యరశ్మి సాయంతో వండిన వేడివేడి ప్రసాదాన్ని అందిస్తోంది షిర్డీ ట్రస్ట్.ఏమిటీ సోలార్ మాహాత్మ్యం?షిర్డీ ప్రసాదాలయంలో సుమారు 1.37 కోట్ల రూపాయల వ్యయంతో 2009లోనే ఈ సోలార్ కుకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తం 73 సోలార్ డిష్ల సాయంతో సూర్యరశ్మిని కేంద్రీకరించి, 150 లీటర్ల సామర్థ్యం ఉన్న 10 భారీ కుక్కర్లతో ఇక్కడ వంట చేస్తారు. ఏక కాలంలో 15 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల పప్పు, 5 క్వింటాళ్ల కూరగాయలను ఉడికిస్తారు. సాధారణంగా ఇంతటి స్థాయిలో వంట చేయాలంటే రోజుకు 1,700 కిలోల గ్యాస్ అవసరమయ్యేది. కానీ ఈ సోలార్ సిస్టమ్ వల్ల రోజుకు భారీగా గ్యాస్ ఆదా అవుతోంది.కోట్లలో ఆదా.. పర్యావరణానికి మేలు2009 నుంచి 2026 మధ్య కాలంలో ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 2 లక్షల కిలోలకు పైగా గ్యాస్ను ట్రస్ట్ ఆదా చేసింది. దీనివల్ల దాదాపు 2 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గింది. కేవలం వంటకే కాకుండా, భక్తుల సౌకర్యార్థం సాయి ఆశ్రమం తదితర వసతి గృహాల్లో 10 వేల మందికి పైగా భక్తులకు ఉచితంగా వేడి నీటిని అందించేందుకు కూడా సౌర శక్తిని వాడుతున్నారు.దేశానికే ఆదర్శంరోజుకు సగటున 80 వేల మంది భక్తులు సాయి దర్శనానికి వస్తుండగా, అందులో సగం మంది ప్రసాదాలయంలో భోజనం చేస్తున్నారు. ఇంధన ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో షిర్డీ ట్రస్ట్ అవలంబిస్తున్న ఈ విధానాన్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఒక ‘యూనిక్ మోడల్’గా గుర్తించి గౌరవించింది. ఆధ్యాత్మికతకు ఆధునిక సాంకేతికత తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో షిర్డీ సాయి సంస్థాన్ నిరూపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ? -
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడి రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ‘ఇండియా టుడే’ పేర్కొన్న సమాచారం ప్రకారం విజయ్ పార్టీతో బీజేపీ జరుపుతున్న చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.బంపర్ ఆఫర్.. కానీ మెలిక!ఈ పొత్తులో భాగంగా విజయ్కి బీజేపీ కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో చేరితే విజయ్కి ఏకంగా ‘డిప్యూటీ సీఎం’ పదవితో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 80 సీట్లు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మాత్రం నేరుగా ‘ముఖ్యమంత్రి’ పీఠంపైనే కన్నేసినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు కంటే సీఎం కుర్చీ కారణంగా చర్చలు ప్రస్తుతం ఒక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.రంగంలోకి పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం..విజయ్ను ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రిని మధ్యవర్తిగా రంగంలోకి దింపినట్లు సమాచారం. విజయ్తో నేరుగా మంతనాలు జరిపే బాధ్యతను సదరు నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. విజయ్కి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఎన్నికల్లో అత్యంత కీలకం కానుంది. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపోటములు మారిపోయే తమిళనాడు రాజకీయాల్లో, విజయ్ క్రేజ్ తమకు కలిసొస్తుందని బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.విజయ్ క్యాంపులో అంతర్మథనంమరోవైపు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విజయ్ సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని స్థాపించిన కొత్తలోనే ఒక జాతీయ పార్టీతో చేతులు కలిపితే, స్వతంత్ర ప్రత్యామ్నాయంగా తాము నిర్మించుకున్న ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక కొత్త మార్గంలో మొదలుపెట్టిన తరుణంలో, ఈ కూటమి నిర్ణయం పార్టీ విశ్వసనీయతను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ‘దళపతి’ వేసే తదుపరి అడుగు తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు.. -
ఐదు రాష్టాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్?
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.కాగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో సింగిల్ ఫేస్లో ఎన్నికలు జరగనుండగా పశ్చిమ బెంగాల్, అస్సాంలో పలు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇది వరకే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికల కమిషన్ ప్రకటన నేపథ్యంలో దేశ రాజకీయాలు వేడెక్కనున్నాయి. -
భారీ ఎన్కౌంటర్.. పాక్ ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం మరోసారి తన శౌర్యాన్ని చూపింది. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఒక పాక్ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఆపరేషన్లో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు కలిసి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు.అసలేం జరిగిందంటే?ఉరి సెక్టార్లోని బుచ్చార్ ప్రాంతం గుండా ఉగ్రవాదులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సైన్యం, మార్చి 14-15 మధ్య రాత్రి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో పొదల్లో నక్కిన ఉగ్రవాదుల కదలికలను గమనించిన జవాన్లు వారిని హెచ్చరించారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా, ఎదురుకాల్పుల్లో ఒక పాక్ ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి ఏకే రైఫిల్, పిస్టల్స్, భారీగా మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. #𝗪𝗵𝗶𝘁𝗲𝗞𝗻𝗶𝗴𝗵𝘁𝗖𝗼𝗿𝗽𝘀 | #𝗢𝗽𝗦𝗛𝗘𝗥𝗜𝗞𝗔𝗟𝗔𝗡 | #𝗦𝘂𝗽𝗿𝗲𝗺𝗲𝗦𝗮𝗰𝗿𝗶𝗳𝗶𝗰𝗲While operating in the challenging and rugged terrain during prolonged operations in the general area of Poonch, as part of Operation Sheri Kalan, today at about 2.30 pm, Subedar… pic.twitter.com/qG2fPiBhro— White Knight Corps (@Whiteknight_IA) March 14, 2026విధి నిర్వహణలో జేసీవో వీరమరణంమరోవైపు పూంచ్ జిల్లాలో చేపట్టిన ‘ఆపరేషన్ షేరీ కలాన్’లో ఒక విషాదం చోటుచేసుకుంది. అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఉన్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సుబేదార్ సందీప్ కుమార్ ధాకా ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. వెంటనే ఆయనను పోతాలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన వీరమరణం పొందారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ ధీర జవానుకు వైట్ నైట్ కోర్ప్స్ ఘన నివాళులు అర్పించింది.ఇది కూడా చదవండి: ‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’ -
‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’
న్యూఢిల్లీ: దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)కనెక్షన్ ఉన్న ఇళ్లలో డొమెస్టిక్ ఎల్పీజీ (ఎల్పీజీ)సిలిండర్లను ఉంచుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. గ్లోబల్ మార్కెట్లో ఇంధన సరఫరాలో తలెత్తుతున్న ఒడిదుడుకుల దృష్ట్యా, జాతీయ ఇంధన నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది.సవరించిన కొత్త నిబంధనలివేలిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఉత్తర్వులను సవరిస్తూ కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పీఎన్జీ సౌకర్యం ఉన్న ఇళ్లకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వకూడదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సిలిండర్లను రీఫిల్ చేయడంపై కూడా నిషేధం విధించారు. పీఎన్జీ వాడుతున్న వారు తమ వద్ద ఉన్న ఎల్పీజీ సిలిండర్లను తక్షణమే సంబంధిత కంపెనీలకు అప్పగించాల్సి ఉంటుంది.ఎందుకీ కఠిన నిర్ణయం?మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ వద్ద తలెత్తిన అడ్డంకులు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో, దేశీయ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పీఎన్జీ కనెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.పెట్రోల్, డీజిల్ నిల్వలపై నిఘామరోవైపు పెట్రోల్ లేదా డీజిల్ను బాటిళ్లు, డబ్బాలు వంటి అనధికారిక కంటైనర్లలో నిల్వ చేయవద్దని మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఇలా చేయడం వల్ల తీవ్రమైన భద్రతా ముప్పులు పొంచి ఉంటాయని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి విడి డబ్బాల్లో పెట్రోల్ పోసిన తమిళనాడులోని ఒక పెట్రోల్ బంకుపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.ఆందోళన వద్దు.. నిల్వలు పుష్కలం!దేశంలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెంది ముందస్తుగా కొనుగోలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. గృహ అవసరాలకు, రవాణా రంగానికి 100 శాతం గ్యాస్ సరఫరాను నిర్ధారిస్తూ ‘నేచురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్’ జారీ చేశారు. పరిశ్రమలకు మాత్రం సరఫరాను 80 శాతానికి పరిమితం చేశారు. ప్రస్తుతం దేశం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉందని, దేశవ్యాప్తంగా ఉన్న లక్షకు పైగా రిటైల్ అవుట్లెట్లలో ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నదని ప్రభుత్వం తెలిపింది.ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి: ‘వందేభారత్’ ఎక్కుతున్నారా? -
ప్రయాణికులకు విజ్ఞప్తి: ‘వందేభారత్’ ఎక్కుతున్నారా?
బెంగళూరు: వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ముఖ్య గమనిక. భారతీయ రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మీదుగా నడిచే నాలుగు కీలక వందే భారత్ రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. ఈ సవరించిన వేళలు నేటి నుంచే (మార్చి 15, 2026) అమలులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 164 వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ఈ స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.వేళలు మారిన రైళ్లు ఇవే:హైదరాబాద్ (కాచిగూడ) - బెంగళూరు (యశ్వంత్పూర్), కలబుర్గి - బెంగళూరు (SMVT) మధ్య నడిచే రైళ్ల షెడ్యూల్లో మార్పులు జరిగాయి.కాచిగూడ – యశ్వంత్పూర్ (20703): ఈ రైలు హిందూపూర్ స్టేషన్కు ఇదివరకు ఉన్న సమయం కంటే కొన్ని నిమిషాల ఆలస్యంగా చేరుకుంటుంది.యశ్వంత్పూర్ – కాచిగూడ (20704): తిరుగు ప్రయాణంలో కూడా హిందూపూర్ స్టేషన్లో ఈ రైలు చేరే సమయంలో స్వల్ప మార్పు ఉంటుంది.కలబుర్గి – SMVT బెంగళూరు (22231): ఈ సర్వీసు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్కు సవరించిన సమయానికి చేరుకుంటుంది.SMVT బెంగళూరు – కలబుర్గి (22232): ఈ రైలు యలహంక స్టేషన్కు గతంలో కంటే ఆలస్యంగా చేరుకుంటుంది.గమనించాల్సిన అంశాలుSMVT బెంగళూరు – కలబుర్గి వందే భారత్ ఎక్స్ప్రెస్ గతంలో మాదిరగానే వారానికి ఆరు రోజులు (గురువారం మినహా) నడుస్తుంది. బిజీ రూట్లలో వందే భారత్ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, స్టేషన్లలో రద్దీని మేనేజ్ చేయడానికి, రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు అధికారిక వెబ్సైట్ లేదా యాప్లో ఖచ్చితమైన సమయాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా? -
నూకలతో డిజైనర్ బియ్యం
సాధారణ వరి బియ్యం కన్నా మూడు రెట్లు అధిక ప్రొటీన్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన సరికొత్త డిజైనర్ వరి బియ్యం మన వంటగదిలోకి త్వరలోనే రానున్నాయి. పసుపు రంగులో ఉండే ఈ పోషక సంపన్న బియ్యం చూడ్డానికి, తినటానికి సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు. కేంద్ర శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్)కు అనుబంధంగా తిరువనంతపురంలోని నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ) శాస్త్రవేత్తలు ఈ డిజైనర్ రైస్ను ఉత్పత్తి చేసే సాంకేతికతను రూపొందించారు.దేశంలో తెల్ల బియ్యం తినే కోట్లాది మందిని వేధిస్తున్న సూక్ష్మ పోషకాహార లోపాన్ని పరిష్కరించటం, షుగర్ ముప్పును తగ్గించే లక్ష్యంతో ఈ బియ్యాన్ని రూపొందించినట్లు ఎన్ఐఐఎస్టీ ప్రకటించింది. సాధారణ తెల్ల వరి బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ను పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ పెరుగుదలకు దోహదం చేస్తుంది.డిజైనర్ బియ్యం అంటే?వరి బియ్యం నూకను పిండి చేసి.. అందులో ఉండే పిండి పదార్థం, మాంసకృత్తులు, పీచును వేరుచేస్తారు. ఎక్కువ మోతాదులో ఉండి బ్లడ్ షుగర్ పెంచుతున్న పిండి పదార్ధాన్ని తగ్గించి, ప్రొటీన్లను మూడు రెట్లు పెంచేలా, సమతుల్యత పొందేలా బియ్యాన్ని తిరిగి తయారు చేస్తారు. ఇది జీవక్రియ సంబంధమైన అనారోగ్యానికి చురుకైన, నిర్మాణాత్మక పరిష్కారంగా పనిచేసే పోషక–సాంద్రత గల ఆహారమని చెబుతున్నారు. మన అభీష్టానికి అనుగుణమైన సుగుణాలతో రూపొందించింది కాబట్టి ‘డిజైనర్ బియ్యం’ అని పిలుస్తున్నారు.పౌష్టికాహార లోపానికి చెక్మన దేశం ఒక విలక్షణమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధిక గ్లైసెమిక్ సూచిక (జీఐ)తో కూడిన తెల్ల బియ్యంతో భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర ప్రమాదకరమైన వేగంతో పెరుగుతుంది. మరోవైపు, లక్షలాది మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. తగినన్ని కేలరీల అన్నం తిన్నప్పటికీ ప్రొటీన్, ఖనిజాల లోపం వస్తోంది.డిజైనర్ రైస్ ప్రయోజనాలుతక్కువ జీఐ (55 కంటే తక్కువ): శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. ప్రొటీన్ పవర్హౌస్: సాధారణ బియ్యంలో 6–8% ప్రొటీన్ ఉంటుంది. ఈ బియ్యంలో 20% కంటే ఎక్కువే ఉంటుంది.బలవర్థకమైన రక్షణ: ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12ను కలిపి తయారు చేసిన బియ్యం కావటంతో రక్తహీనతను తగ్గిస్తుంది.పిండి తగ్గించి ప్రొటీన్లు పెంచాండిజైనర్ బియ్యాన్ని ఒక ‘ఆహార భవన నిర్మాణం’గా భావించండి. ఉదాహరణకు.. సాధారణ బియ్యం లాంటి ఒక భవనం ఉందనుకోండి. ఇది ఎక్కువగా ‘చక్కెర ఇటుకల’ (పిండి పదార్థం)తో తయారైన ఇల్లు. ఎన్ఐఐఎస్టీ పరిశోధకుల బృందం ఆ ఇంటిలోని ఇటుకలన్నింటినీ విడదీశారు. ఆ ఇటుకల్లో ఎక్కువగా ఉన్న పిండి పదార్ధాన్ని చాలావరకు తొలగించి, ఆ ఖాళీని ప్రొటీన్ల ఇటుకలతో భర్తీ చేశారు. జన్యుమార్పిడి సాంకేతికతకు బదులు ఆహార శుద్ధి సాంకేతికతను ఉపయోగించి ఈ బియ్యాన్ని రూపొందించారు. తక్కువ ధరకు అమ్ముడయ్యే వరి నూకను మెత్తని పిండిగా చేసి.. అందులో పిండి పదార్ధాన్ని తీసేసి.. ఆ మేరకు ప్రొటీన్లు, ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్–బీ12 వంటి సూక్ష్మపోషకాలను కలిపారు.ఈ మిశ్రమాన్ని లేత పసుపు రంగులో ఉండే సన్న వరి బియ్యపు గింజలుగా తయారు చేశారు. మనకు తెలిసిన బియ్యంలాగా ఇవి కనిపిస్తాయి. రుచిగా, సంతృప్తికరంగా ఉండేలా డిజైనర్ బియ్యాన్ని తయారు చేశారు. అధిక ప్రొటీన్ ఉన్న కారణంగా ఈ బియ్యంతో వండిన అన్నం మామూలు అన్నం కంటే రుచిగా ఉంటుంది. నూకలకు విలువ పెరుగుతుంది కాబట్టి రైతులకూ ఉపయోగకరమే. –డాక్టర్ ఆనందరామకృష్ణన్, సీఎస్ఐఆర్–ఎన్ఐఐఎస్టీ డైరెక్టర్, డిజైనర్ రైస్ ప్రాజెక్ట్ రూపశిల్పి -
నమాజ్ చేసే వారి సంఖ్యపై పరిమితులా?
సాక్షి, న్యూఢిల్లీ: రంజాన్ మాసంలో మసీదులో నమాజ్ చేసుకునే వారి సంఖ్యపై పరిమితులు విధించడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతిభద్రతల నెపంతో ఇటువంటిఆంక్షలు విధించలేరని స్పష్టం చేసింది. శాంతిభద్రతలను కాపాడలేకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయడమో లేక వేరే జిల్లాకు బదిలీ చేయించుకోవాలని సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ సిద్ధార్థ్ నందన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.‘శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంతో నమాజ్ చేసుకునే వారి సంఖ్యను పరిమితం చేస్తూ ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా తిరస్కరిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఈ బాధ్యతను నిర్వర్తించలేమని, చట్టాన్ని అమలు చేసే సామర్థ్యం తమకు లేదని భావిస్తే.. వెంటనే పదవులకు రాజీనామా చేయాలి లేదా సంభాల్ జిల్లా నుంచి బయటకు బదిలీ కోరుకోవాలి’అని తీవ్ర స్థాయిలో మందలించింది. ప్రైవేట్ స్థలమైతే అనుమతి అక్కర్లేదుసంభాల్ జిల్లాలోని సర్వే నంబర్– 291లో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకోకుండా అధికారులు అడ్డుకుంటున్నారంటూ మునాజిర్ ఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ వేశారు. రంజాన్ సమయంలో ఎక్కువ మంది భక్తులు ప్రార్థనలకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారని ఆయన కోర్టు దష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆంక్షలు విధించినట్లు కోర్టుకు తెలిపారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రతి వర్గానికి తమ నిర్దేశిత ప్రార్థనా మందిరాల్లో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునే హక్కు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రైవేట్ ఆస్తిలో ప్రార్థనలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. అయితే, ప్రభుత్వ స్థలాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు లేదా పబ్లిక్ స్థలాల్లోకి ఆ కార్యక్రమాలు విస్తరించినప్పుడు మాత్రమే అధికారుల అనుమతి తప్పనిసరి అని స్పష్టత ఇచ్చింది.ఆ స్థలం ఎవరిది?విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనను యూపీ ప్రభుత్వం ఖండించింది. రెవెన్యూ రికా ర్డుల ప్రకారం మసీదు ఉన్న భూమి సుఖీ సింగ్ కుమారులైన మోహన్ సింగ్, భూరాజ్ సింగ్ల పేరిట ఉందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, అక్కడ మసీదు లేదా ప్రార్థనా స్థలం ఉన్నట్లుగా పిటిషనర్ ఎలాంటి ఫొటోలను సమర్పించలేదని కోర్టు గమనించింది. ఆధారాలు, ఫొటోలు, రెవెన్యూ రికార్డులు సమర్పించేందుకు పిటిషనర్ సమయం కోరగా.. తదుపరి వివరాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం కూడా గడువు అడిగింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
హార్మూజ్ను దాటేసిన... రెండు భారత నౌకలు
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలతో వస్తున్న మరో రెండు భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. భారీస్థాయిలో ఎల్పీజీ నిల్వలతో భారత్ వైపు బయల్దేరాయి. ‘‘శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు శనివారం ఉదయం హార్మూజ్ను దాటుకుని వచ్చాయి. గుజరాత్లోని ముంద్రా, కాండ్లా రేవులకేసి బయల్దేరాయి’’అని నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు వెల్లడించారు. శివాలిక్ సోమవారం ముంద్రాకు, ఆ మర్నాడు నందాదేవి కాండ్లాకు చేరే అవకాశముందన్నారు. హార్మూజ్కు పశి్చమాన మరో 22, తూర్పున 4 భారత నౌకలు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నట్టు ఆయన వివరించారు.వాటిని కూడా సురక్షితంగా దాటించేలా ఇరాన్ వర్గాలతో కేంద్రం ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పశి్చమాన నిలిచిన 22 నౌకల్లో ఆరింట్లో ఎల్పీజీ, ఒకదాంట్లో ఎల్ఎన్జీ, నాలుగింట్లో చమురు నిల్వలున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలీ్పజీకి తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో రెండు నౌకల్లో భారీగా నిల్వల రాక ఉపశమనం కల్పించనుంది. టాంజానియాకు గ్యాసోలిన్ నిల్వలు తీసుకెళ్తున్న జగ్ప్రకాశ్ అనే భారత చమురు నౌక శుక్రవారమే హార్మూజ్ను దాటడం తెలిసిందే. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వాటిలో 90 శాతం దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ నుంచి చమురు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయాయి. మళ్లీ రష్యా నుంచే కొనాలని అడుక్కుంటోంది ఇరాన్ ఎద్దేవాదుబాయ్: రష్యా నుంచి ముడిచమురు కొనొద్దని భారత్ను నెలల తరబడి బెదిరించిన అమెరికా ఇప్పుడు గతిలేక భారత్ను బతిమిలాడుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘యుద్ధం మొదలుకాకమునుపేమో రష్యా నుంచి చమురు అస్సలు కొనకూడదని భారత్ను అమెరికా బాగా బెదిరించింది. తీరా యుద్ధం మొదలయ్యాక మార్చి ఐదో తేదీన అమెరికా మాటమార్చింది. యుద్ధం దెబ్బకు హార్మూజ్ మూతబడటంతో రష్యాకాకుండా ఇతర దేశాల నుంచి చమురు కొనాలంటే సాధ్యపడట్లేదు. అందుకే మరో 30 రోజుల సడలింపు ఇస్తున్నాం.. రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా భారత్కు అడగకపోయినా గడువు పెంచుతూపోతోంది’’అని అబ్బాస్ వెటకారంగా మాట్లాడారు. -
తృణమూల్ ప్రభుత్వానికి కౌంట్డౌన్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో చొరబాటుదార్లను కాపాడేందుకే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. చొరబాటుదార్ల కారణంగా రాష్ట్రంలో చాలాప్రాంతాల్లో జనాభా సమతూకంలో విపరీతమైన మార్పులు వచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బెంగాలీ హిందువులను మైనార్టీ లుగా మార్చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహించిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.రూ.18,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. రెండు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఓడరేవుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోల్కతాలో బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహించిన పరివర్తన్ యాత్ర ముగింపు సందర్భంగా ఈ సభ నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలపై దాడి చేసిందని ఆరోపించారు. ఈ అరాచక ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని అన్నారు.రాజకీయ మార్పు తీసుకురావాలని ప్రజలకు సూచించారు బెంగాల్ ఆత్మను కాపాడేందుకు, కట్ మనీ సంస్కృతిని అంతం చేసేందుకు, భయం నుంచి విముక్తి కోసం ఈ ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఈ ఎన్నికలు నిర్ణయాత్మక పోరాటమని అభివర్ణించారు. బెంగాల్లో జంగిల్ రాజ్ అంతం కాక తప్పదన్నారు. ఎస్ఐఆర్తో ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదార్ల పేర్లుతొలగిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. మృతి చెందినవారి పేర్లు కూడా తొలగించకూడదా? అని నిలదీశారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే.. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని, ఇక ఆ గూండాలే భయపడే రోజులు వచ్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేరగాళ్లు, చొరబాటుదార్లు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవాళ్లు చట్టానికి భయపడాల్సిందేనని ఉద్ఘాటించారు. నేరగాళ్లు ఉండాల్సిన చోటు జైలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తామన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారిపై, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన వచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిని, అరాచకాలకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న మనదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించడం తృణమూల్ కాంగ్రెస్కు ఇష్టం లేదని ఆక్షేపించారు. ఎందుకంటే హిందువులను ఆ పార్టీ ఓటు బ్యాంకుగా భావించడం లేదన్నారు. కేవలం నేరస్థుల అండతోనే మమతా బెనర్జీ సర్కారు మనుగడ సాగిస్తోందని విమర్శించారు.ఎస్ఐఆర్ నిర్వహించినందుకు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ప్రధానమంత్రి మండిపడ్డారు. దళిత మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును తృణమూల్ కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కేవలం రాష్ట్రపతినే కాకుండా.. దేశంలోని గిరిజనులు, రాజ్యాంగాన్ని అవమానించినట్లు ధ్వజమెత్తారు. ఆ పార్టీ అన్ని హద్దులూ దాటేసిందన్నారు. తృణమూల్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ కోల్కతాలో ప్రధాని మోదీ హాజరైన సభ కంటే అరగంట ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. తమ పార్టీలకు అనుకూలంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో బీజేపీ నాయకుడితోపాటు ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. బహిరంగ సభకు వస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమను రెచ్చగొట్టి దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం సిల్చార్: మన దేశంపై ప్రపంచ సంక్షోభాలు, యుద్ధాల ప్రభావాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టంచేశారు. పశ్చిమాసియా పరిణామాల పట్ల మన దేశంలో ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరైంది కాదని సూచించారు. మోదీ వరుసగా రెండోరోజు శనివారం కూడా అస్సాంలో పర్యటించారు.రూ.23,550 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. సిల్చార్లో బహిరంగ సభలో ప్రసంగించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని ప్రజల్లో అలజడి సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్కు అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. మోదీని దూషించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. -
ఎట్టకేలకు వాంగ్చుక్ విడుదల
లేహ్/న్యూఢిల్లీ/జోద్పూర్: లద్దాఖ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలో చేర్చాలని ఉద్యమించి చివరకు జైలుపాలైన పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చారు. గత ఆరునెలలుగా కారాగారానికే పరిమితమైన వాంగ్చుక్పై కొనసాగుతున్న నిర్బంధాన్ని తక్షణం రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన విడుదలచేసింది. తక్షణం ఆయనను విడుదలచేస్తున్నట్లు వెల్లడించింది. వెనువెంటనే ఆయనను జోధ్పూర్ కేంద్ర కారాగారం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విడుదలచేశారు. భర్త విడుదల కోసం కొంతకాలంగా న్యాయస్థానాల్లో పోరాడుతున్న గీతాంజలి ఆంగ్మో జోధ్పూర్ కేంద్ర కారాగారానికి వచ్చి ఆయనను వెంట తీసుకెళ్లారు.వాంగ్చుక్ను అరెస్ట్ను సవాల్చేస్తూ భార్య వేసి న పిటిషన్ మార్చి 17వ తేదీన సుప్రీంకోర్టులో తదుపరి విచారణకు రాబోతున్న వేళ కేంద్రం ఆయనను విడుదలచేయడం గమనార్హం. ‘‘తాజా పరిస్థితులు, లద్దాఖ్లో శాంతిస్థాపనే ధ్యేయంగా వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దుచేయాలని నిర్ణయించాం. లద్దాఖ్లో శాంతి, సుస్థిరత, పరస్పర విశ్వాసం పాదుగొల్పడమే మా లక్ష్యం. రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ వంటి అంశాల్లో అన్ని భాగస్వామ్య పక్షాలతో అర్థవంతమైన చర్యల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటుచేశాం. ఎన్ఏసీ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఆయనను తక్షణం వదిలేస్తున్నాం’’అని కేంద్రం శనివారం విడుదలచేసిన ప్రకటనలో పేర్కొంది.లద్దాఖ్కు రాష్ట్ర ప్రతిపత్తి, ఆరో షెడ్యూల్లో చేర్చడం సహా పలు డిమాండ్ల సాధన కోసం 59 ఏళ్ల వాంగ్చుక్ సారథ్యంలో యువత చేపట్టిన ఉద్యమం ఆనాడు లేహ్ పరిధిలో హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఉద్యమకారులతోపాటు 22 మంది పోలీసులు సహా ఆనాడు 90 మంది గాయపడ్డారు. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న లద్దాఖ్లో ఉద్యమం లేవదీసి అత్యంత సున్నితమైన సరిహద్దు భద్రతా అంశాన్ని ఆయన ప్రమాదంలో పడేశారంటూ కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద గత ఏడాది సెపె్టంబర్ 26వ తేదీన ఆయనను లద్దాఖ్ పాలనాయంత్రాంగం అదుపులోకి తీసుకుంది. భద్రతా కారణాలతో ఆయనను తర్వాత జోధ్పూర్ జైలుకు మార్చిన విషయం తెల్సిందే. మిగతా వారినీ విడుదలచేయండి వాంగ్చుక్ విడుదలను కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు స్వాగతించాయి. వాంగ్చుక్తోపాటు ఉద్యమించి జైలుపాలైన తమ తోటి వారిని తక్షణం విడుదలచేయాలని ఉద్యమకారుల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. ‘‘సోనమ్ రాక మాకు ఆనందమే. కానీ ఉద్యమం వేళ జైలుపాలైన ఉద్యమకారులనూ విడుదలచేయాలి. వాళ్లపై మోపిన అక్రమ కేసులను ఎత్తేయాలి. ఉద్యమం చేయడమనేది రాజ్యాంగబద్ధ హక్కు. మా రాష్ట్ర హోదా డిమాండ్ను మోదీ సర్కార్ నెరవేర్చాల్సిందే’’అని లద్దాఖ్ లోక్సభ సభ్యుడు మొహమ్మద్ హనీఫా డిమాండ్చేశారు.‘‘వాంగ్చుక్ విడుదల లద్దాఖ్ ప్రజల విజయం. లద్దాఖ్ వాసులపై మోపిన జాతీయవ్యతిరేక ముద్ర తప్పు అని వాంగ్చుక్ విడుదలతో తేలిపోయింది’’అని ది లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ) సహ చైర్మన్ చెరింగ్ డోర్జే అన్నారు. ‘‘దిల్దాన్ నామ్గియాల్, స్మాన్లా డోర్జీలనూ విడుదలచేయాలి. ఉద్యమం ఆగదు’’అని కార్గిల్ ప్రాంత రాజకీయనేత, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్(కేడీఏ) సభ్యుడు సజ్జద్ కార్గిలీ అన్నారు. ‘‘లద్దాఖ్ భద్రత, సుస్థిరతలో జాతీయవాది వాంగ్చుక్ పాత్ర అత్యంత కీలకమైంది’’అని అతని లాయర్, కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా వ్యాఖ్యానించారు. వాంగ్చుక్ విడుదలను జమ్మూకశీ్మర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. హింసను ఆపేయాలి: ఎల్జీ ‘‘లద్దాఖ్ ప్రాంత సమస్యలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. వాంగ్చుక్ విడుదల తర్వాత మళ్లీ హింసాత్మక మార్గంలో ఉద్యమిస్తామంటూ ఊరుకునేది లేదు. ఉద్యమాలకు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు. లద్దాఖ్ పౌరులు, నేతలు, వివిధ వర్గాల భాగస్వాములతో సంప్రదింపుల మార్గంలోనే సమస్యలకు పరిష్కారం వెతుకుదాం’’అని లద్దాఖ్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యాఖ్యానించారు. పది రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సారథ్యంలోని హైపవర్ కమిటీ సమావేశం కాగా అందులో వాంగ్చుక్ను తక్షణం విడుదలచేయాలని ఎల్ఏబీ, కేడీఏ నేతలు కోరడం తెల్సిందే. -
కాలేజీ బస్సును ఢీ కొట్టిన రైలు.. 15 మందికి గాయాలు
చెన్నై: కరూర్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వెల్లియానై సమీపంలో ఓ ప్రైవేట్ కాలేజ్ బస్సు రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తూ దానిమీదే ఆగిపోయింది. అదే సమయంలో ప్రైవేట్ సిమెంట్ కర్మాగారం కోసం గ్రావెల్ స్టోన్స్ తీసుకెళ్తున్న గూడ్సు రైలు దూసుకొచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ ప్రైవేట్ కళాశాల బస్సులోని 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కరూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎంపీ జ్యోతిమణి స్వయంగా కలిసి, వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
ఎరుమేలిలో కొత్త చెక్ డ్యామ్ నిర్మాణం
ఎరుమేలిలో అయ్యప్ప భక్తులు పవిత్ర స్నానం చేయడానికి సరిపడా నీటి లభ్యతను నిర్ధారించేందుకు వలియంబలం ప్రాంతంలోని వలియ తోడ్ వద్ద కొత్త చెక్ డ్యామ్ నిర్మాణానికి 75 లక్షల రూపాయల నిధిని కేటాయించినట్లు పూన్జార్ ఎమ్మెల్యే Sebastian Kulathunkal ప్రకటించారు.ఇప్పటికే ఉన్న చెక్ డ్యామ్ పాతదై దెబ్బతిన్న కారణంగా నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల కొత్త చెక్ డ్యామ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు.ఈ కొత్త చెక్ డ్యామ్ 16 మీటర్ల వెడల్పు, 14.1 మీటర్ల పొడవుతో నిర్మించబడుతుంది. ఇది 1.8 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.అదనంగా , ఈ చెక్ డ్యామ్లో మొత్తం 8 షట్టర్లు ఉంటాయి. వాటిలో 6 FRP షట్టర్లు, 2 యాంత్రిక (మెకానికల్) షట్టర్లు ఉంటాయి.ఈ మెకానికల్ షట్టర్ల వాడకం వల్ల యాత్రాకాలంలో అయ్యప్ప భక్తులకు అవసరమైన నీటి లభ్యతను నిర్ధారించడం మాత్రమే కాకుండా, నీటి ప్రవాహాన్ని నియంత్రించడమూ సులభం అవుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు.(చదవండి: భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు) -
భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు
ఆ మణికంఠుని అపార కృపాకటాక్షాలతో, అత్యంత పవిత్రమైన మీనమాస పూజలు, శబరిమల ఉత్సవం 2026 కొరకు అయ్యప్ప సన్నిధాన ద్వారాలు తెరుచుకున్నాయి. "స్వామియే శరణం అయ్యప్ప" అనే నామస్మరణతో ఆ దివ్య దర్శనానికి తరలి వెళ్దాం.మీనమాస పూజల షెడ్యూల్నడ తెరిచే సమయం: మార్చి 14, 2026 (శనివారం) సాయంత్రం 5:00 గంటలకు.నడ మూసివేత: మార్చి 19, 2026 (గురువారం) రాత్రి 10:00 గంటలకు (అత్తాజ పూజ, హరివరాసనం అనంతరం).శబరిమల ఉత్సవం, పంగుని ఉత్తరం 2026వార్షిక ఉత్సవాల నిమిత్తం మార్చి 22 సాయంత్రం 5:00 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి.మార్చి 23: కొడియేట్టు (ధ్వజారోహణం)మార్చి 24: ఉత్సవ బలిమార్చి 31: పళ్ళివేట (రాజవేట)ఏప్రిల్ 01: పంపా ఆరాట్టు & పంగుని ఉత్తరం – భగవాన్ అయ్యప్ప స్వామి వారి దివ్య జన్మదినోత్సవం.ముగింపు: ఏప్రిల్ 1, 2026.ఏప్రిల్ 1వ తేదీన సన్నిధానం ఉదయం 5:00 నుండి 8:00 వరకు మాత్రమే తెరవబడుతుంది. తిరిగి పంపా ఆరాట్టు ముగిసిన తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తెరిచి, రాత్రి 10:00 గంటలకు మూసివేస్తారు.(చదవండి: మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి) -
ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ: గ్యాస్ కొరత వేళ కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలు వాడుకోవచ్చని ప్రకటించింది. ఢిల్లీలో కాలుష్యం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం మరింత పెరగకుండా ప్రభుత్వం ఎన్నో నిబంధనలను తీసుకొచ్చింది. అయినప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్లో గ్యాస్ కొరత నెలకొనడంతో ఇప్పుడు కట్టెల పొయ్యి వాడక తప్పడం లేదు. దీంతో దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. కమర్షియల్ సిలిండర్ల కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కొన్ని రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జిల్లాలోనూ గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలుపుదల చేశాయి. కొందరికి మాత్రం పాత స్టాక్ ఉండడంతో ఎలాగోలా రెండు రోజులు నెట్టుకొచ్చారు. స్టాక్ లేని వారు కట్టెల పొయ్యిపై వంటలు చేయడం ప్రారంభించారు. ఇంకొందరు సుదూర ప్రాంతాల నుంచి గ్యాస్ తెచ్చుకొని రెస్టారెంట్లను నడుపుతున్నారు.మరోవైపు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటివి మూడపడకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్ బిల్లులో యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇవాళ ప్రకటన చేశారు.తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్ సెక్టార్ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. ‘గ్యాస్ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్కు యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు. -
గ్యాస్ కొరత వేళ హోటళ్లు, టీ స్టాళ్లు మూత పడకుండా..
చెన్నై: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్లో గ్యాస్ కొరత నెలకొనడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటి వాటిని నడపలేని పరిస్థితి వస్తోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్ బిల్లులో యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్ సెక్టార్ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. హోటళ్ల వంటివాటిలో కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జె.రాధాకృష్ణన్ వివరాలు తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.‘గ్యాస్ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్కు యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయించేందుకు సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అర్హత ఉన్న వ్యాపారులు రూ.3.75 లక్షల వరకు రుణాలకు 25 శాతం సబ్సిడీ పొందవచ్చు. మహిళా వ్యాపార అభివృద్ధి పథకం కింద మహిళలు నడిపే వ్యాపారాలకు రూ.10 లక్షల వరకు రుణంపై గరిష్ఠంగా రూ.2 లక్షలపై 25 శాతం సబ్సిడీ ఇస్తారు.అదనంగా ఎస్సీ, ఎస్టీ వ్యాపారులను ప్రోత్సహించేందుకు అన్నై అంబేడ్కర్ బిజినెస్ ఛాంపియన్స్ పథకం కింద గరిష్ఠంగా రూ.కోటి వరకు 35 శాతం మూలధన సబ్సిడీ ఇస్తారు. అధిక సామర్థ్య విద్యుత్ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం. తమిళనాడులో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో 60,698 కర్మాగారాలు ఎల్పీజీ, సీఎన్జీ, డీజిల్, ఫర్నేస్ ఆయిల్, కట్టెలు వంటి వాటిని ఉపయోగిస్తూ పనిచేస్తున్నాయి. -
గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు
తిరువనంతపురం: దేశాన్ని ఎల్పీజీ కొరత అతలాకుతలం చేస్తోంది. వంట గ్యాస్ దొరక్క వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో మరో పెను సంక్షోభం తెరపైకి వచ్చింది. ఉపాధి కోల్పోయిన వేలాది మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరుగుపయనం అవుతున్నారు. కేరళలోని హోటల్ రంగం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలపైనే ఆధారపడి నడుస్తోంది.ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, మరోవైపు రంజాన్ పండుగ దగ్గరపడుతుండటంతో వీరంతా ముందస్తుగానే ఇళ్లకు తరలి వెళుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయానికి వారం ముందు వెళ్లే వీరు, ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల హోటళ్లు మూతపడటంతో పనులు లేక ముందుగానే సొంతూళ్లకు తరలివెళ్లిపోతున్నారు. ‘ఎల్పీజీ సంక్షోభం మధ్య చిన్న తరహా హోటల్ యజమానులు తమ సిబ్బందిని కాపాడుకోలేకపోతున్నారు. ఒక్కసారి వీరు తమ గ్రామాలకు వెళ్తే మళ్లీ రెండు మూడు నెలల వరకు తిరిగి రారు. ఇది కేరళలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది’ అని కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. జయపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.కేరళలోని వలస కార్మికులలో సుమారు 50 శాతం మంది ఎన్నికలు జరగబోయే బెన్సాం, అస్సాం ప్రాంతాల వారేనని గణాంకాలు చెబుతున్నాయి. కొందరు యజమానులు గ్యాస్కు బదులు ఇతర ఇంధనాలను వాడుతూ పనివారిని ఆపే ప్రయత్నం చేస్తున్నా, పరిస్థితులు ఆశాజనకంగా లేవు. తిరువనంతపురంలోని ప్రముఖ మాల్స్కు సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో 25 మంది పనిచేసే చోట ఇప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. ప్రస్తుతానికి స్థానిక మహిళలతో పనులు కానిస్తున్నా, వలస కూలీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ సమస్య త్వరగా పరిష్కారం అయితేనే కేరళ ఆతిథ్య రంగం తిరిగి కోలుకునే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: కాంగ్రెస్ విదేశీ శక్తుల కీలుబొమ్మ: ప్రధాని మోదీ -
LPG cylinder అదను చూసి చార్జీలు బాదుడు
చెన్నై/బెంగళూరు: దేశవ్యాప్తంగా నానాటికీ తీవ్రతరమవుతున్న వాణిజ్య సిలిండర్ల (Commercial LPG cylinder) కొరత పలు గమ్మత్తైన పరిణామాలకు కూడా దారి తీస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉన్న బెంగళూరు, చెన్నై వంటి పలు నగరాల్లో బ్లాక్ మార్కెటింగ్ జోరుగా సాగుతోంది. దాంతో పలు హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే ప్రయత్నం చేస్తున్నాయి. ‘గ్యాస్ చార్జీ’ పేరిట కస్టమర్ల నుంచి బిల్లులో అదనంగా వసూలు చేసేస్తున్నాయి! అలా చెన్నైలోని ఒక హోటల్ ఇచ్చిన బిల్లు ఇప్పుడు వైరల్గా మారింది. ఇదీ చదవండి: మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..!బెంగళూరులో కూడా ఒక హోటల్ తన కస్టమర్ నుంచి గ్యాస్ బిల్లు రూపంలో ఏకంగా 30 రూపాయలు వసూలు చేసింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్ ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నగర పోలీస్ కమిషనర్ను కూడా ట్యాగ్ చేస్తూ, ఈ వసూళ్ల దందాను కట్టడి చేయాల్సిందిగా కోరాడు. బెంగళూరు హోటళ్ల సంఘం అధ్యక్షుడు పి.సి.రావు దీనిపై వెంటనే స్పందించారు. సదరు హోటల్ యాజమాన్యంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. బెంగళూరు తదితర నగరాల్లో సిలిండర్ల చోరీలు కూడా పెరిగి పోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్ -
కాంగ్రెస్ విదేశీ శక్తుల కీలుబొమ్మ: ప్రధాని మోదీ
సిల్చార్ (అస్సాం): ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో, దేశ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తూ, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. అస్సాంలోని సిల్చార్ వేదికగా శనివారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. #WATCH | Silchar, Assam: PM Narendra Modi says, "Nowadays, conditions of war prevail all around the world. Our government is making every possible effort to ensure that the citizens of our country face the fewest hardships possible. Our objective is to minimise the impact of this… pic.twitter.com/gQlE3iivDF— ANI (@ANI) March 14, 2026భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న కొన్ని అంతర్జాతీయ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలుబొమ్మగా మారుతోందని ప్రధాని ఆరోపించారు. ‘ప్రస్తుతం ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటువంటి క్లిష్ట సమయంలో దేశ ప్రజలపై ఆ ప్రభావం పడకుండా తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అయితే బాధ్యతాయుతమైన రాజకీయ పక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్.. దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దేశం ఇబ్బందుల్లో చిక్కుకోవాలని, తద్వారా మోదీని నిందించవచ్చని వారు ఆశిస్తున్నారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ప్రధాని మోదీ శనివారం ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీని మెరుగుపరిచే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 22,860 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న 'షిల్లాంగ్-సిల్చార్ కారిడార్'కు భూమిపూజ చేశారు. 166 కిలోమీటర్ల మేర సాగే ఈ గ్రీన్ ఫీల్డ్ ఫోర్-లేన్ హై స్పీడ్ కారిడార్ పూర్తయితే, గౌహతి నుంచి సిల్చార్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 8.5 గంటల నుండి కేవలం 5 గంటలకు తగ్గుతుంది. ఇదేవిధంగా ప్రధాని మోదీ సిల్చార్లోని NH-306 పై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్కు భూమిపూజ చేశారు.అలాగే కరీంగంజ్ జిల్లాలోని పత్తర్కండి వద్ద కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అస్సాంలో వ్యవసాయ విద్య, పరిశోధనలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, విపక్షాలు కేవలం విమర్శలకే పరిమితమవుతున్నాయని ప్రధిన మోదీ అన్నారు. -
ఇక ‘టోల్’ తీసే బాధ్యత మహిళలకే..
న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతకు బాటలు వేస్తూ, టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులను నియమించనున్నట్లు ప్రకటించింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 1,140కి పైగా టోల్ ప్లాజాల వద్ద సుమారు 5,100 మంది మహిళలను పగటిపూట షిఫ్టుల్లో నియమించనున్నారు.నేషనల్ హైవేస్ అథారిటీ నిర్ణయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైవే మౌలిక సదుపాయాల రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. టోల్ బూత్ల వద్ద మహిళా సిబ్బంది ఉండటం వల్ల వాహనదారులకు మరింత మర్యాదపూర్వకమైన సేవలు అందుతాయని నేషనల్ హైవేస్ అథారిటీ భావిస్తోంది.సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య జరిగే వాగ్వాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది. ప్రశాంతమైన, వృత్తిపరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు నేషనల్ హైవేస్ అథారిటీ పలు కీలక భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపింది. ఎన్హెచ్బీఎఫ్, హెచ్ఓఏఐ, ఏఐటీయూసీ తదితర సంఘాలతో పాటు టోల్ ఆపరేటర్లు కూడా ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించారు.ఈ వినూత్న కార్యక్రమం అమలునునేషనల్ హైవేస్ అథారిటీ నిరంతరం పర్యవేక్షించనుంది. విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా వారికి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, టోల్ ఆపరేషన్లలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించడం, భద్రతా నియమాలపై అవగాహన తదితర అంశాల్లో శిక్షణ అందించనున్నారు.ఇది కూడా చదవండి: సోనమ్ వాంగ్చుక్ విడుదల -
మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..!
నగర/పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు అధిక ఉష్ణంతో సెగలు కక్కుతున్నాయి. ఇరుకు రేకుల ఆవాసాల్లో తలదాచుకునే పేదల నుంచి పక్కా ఇళ్లలో ఉండే మధ్యతరగతి ప్రజల వరకు వేడిఒత్తిడి (హీట్ స్ట్రెస్)కి లోనవుతున్నారు. తమ ఇళ్లు వేడెక్కిపోతుంటే ఏసీలు కొనే స్తోమత లేని వారు అల్లాడుతున్నారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం ప్రకారం.. ఆరు భారతీయ నగరాల్లో 80% విస్తీర్ణంలోని గృహవాసులు వేడి ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇంటి పైకప్పులను ఇన్సులేట్ చెయ్యటమే, ఏసీలు/కూలర్ల వాడకం కన్నా, మేలైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. వేడి ఒత్తిడి నుంచి కాపాడు కోవటానికి ఉపయోగపడే కూల్ రూప్ పద్ధతులేమిటో చూద్దాం.. హీట్ స్ట్రెస్కు మూల కారణాలు ఇవి.. అర్బన్ ప్రాంతాలు ఇళ్లతో నిండిపోవటం, పచ్చదనం తగ్గిపోవటం, వాహన కాలుష్యం పెరిగిపోవటంతోపాటు వేడిని అతిగా గ్రహించే స్వభావం గల (హీట్ ట్రాపింగ్ మెటీరియల్) సామగ్రితో ఇళ్లు నిర్మించటం ఈ వేడి ఒత్తిడి పెచ్చుమీరటానికి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. కాంక్రీటు, ఇటుకలు, రాళ్లు పగటి పూట సూర్యరశ్మి నుంచి వేడిని గ్రహించుకొని, రాత్రి పూట నెమ్మదిగా ఆ సెగను వదులుతూ ఉంటాయి. దీంతో కాంక్రీటు భవనాలు రాత్రిళ్లు కూడా సెగలు కక్కుతూనే ఉంటాయి. అందువల్ల అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా రేకుల ఇళ్లు, మండు వేసవిలో నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. మెరుగైన పైకప్పులు.. మూడు రకాలు బయటి వేడిని అతి తక్కువగా గ్రహించటంతోపాటు అతి తక్కువగా ఇంటి లోపలికి వదిలే పై కప్పులు ముఖ్యంగా మూడు రకాలు. వీటినే థర్మల్లీ ఎఫిషియెంట్ రూఫ్స్ అని వ్యవహరిస్తున్నారు. కూల్ రూఫ్స్ : ఎండ కాచే సమయంలో సోలార్ రేడియేషన్ను ఎక్కువగా గ్రహించకుండా తిరిగి వాతావరణంలోకి తిప్పికొట్టే (రిఫ్లెక్టివ్) సామర్థ్యం, గ్రహించిన కొద్దిపాటి వేడిని కూడా గది లోపలికి కాకుండా పైకప్పు నుంచే అతి త్వరగా బయటకు వదిలి వేసి చల్లబడే సామర్థ్యం గల టైల్స్, పెయింట్లు, మెంబ్రెయిన్లు ఈ కోవలోకి వస్తాయి. గ్రీన్ రూఫ్స్ : ఆర్సీసీ శ్లాబ్పైన వాటర్ ప్రూఫింగ్ చేసి మట్టి పోసి మొక్కలు పెంచితే అదే గ్రీన్ రూఫింగ్. సూర్యరశి్మని గ్రహించి మొక్కలు పెరుగుతుంటాయి. అవి ఆకుల ద్వారా వాతావరణంలోకి వదిలే నీటి తేమ వల్ల పైకప్పు, పరిసరాలు చల్లగా ఉంటాయి. పచ్చని లాన్/ మొక్కలు/ చిన్న చెట్లు పెంచాలంటే 300 ఎంఎం లోతులో మట్టి పొర వేసుకోవాలి. రూఫ్ పార్కులు, సేదదీరే స్థలాలు, కమ్యూనిటీ గార్డెన్లకు ఈ ఇంటెన్సివ్ గ్రీన్ రూఫ్ అనువైనది. ఎక్స్టెన్సివ్ గ్రీన్ రూఫ్ పద్ధతిలో అయితే 25–125 ఎంఎం లోతు మట్టి పొర వేస్తే చాలు. నీటి ఎద్దడిని తట్టుకునే సక్యులెంట్స్, గడ్డి, తీగజాతి మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇంటి పైకప్పులను ఇన్సులేట్ చెయ్యటమే ఏసీల వాడకం కన్నా మేలైన పరిష్కారం మట్టి పాత్రలతో ఇన్సులేషన్: ఆర్సీసీ శ్లాబ్పైన మట్టి పాత్రలను బోర్లించి, వాటిపైన సున్నం లేదా సిమెంట్ కాంక్రీటు వేసి, దానిపైన సెరామిక్ టైల్స్ వంటి వాటితో వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి. బోర్లించిన మట్టిపాత్రలో ఉండే గాలి శ్లాబ్కు వేడి చేరకుండా అడ్డుకుంటుంది. తద్వారా ఎండ వేడి కిందకు దిగకుండా ఉంటుంది. ఇన్సులేటెడ్ రూఫ్స్: రూఫ్ శ్లాబ్ ద్వారా గది లోపలికి దిగే వేడిని మూడింట రెండొంతులు పైకప్పుపై వేసే ఇన్సులేటెడ్ రూఫ్ అరికడుతుంది. ఇన్సులేషన్ పొరగా ఎక్స్ట్రూడెడ్ పాలిస్టైరెన్ షీట్ (ఎక్స్పీఎస్), సెల్యులోజ్ పైబర్, థర్మోక్రేట్, లైమ్ కాంక్రీట్, హాలో టెర్రకోట టైల్స్, గ్లాస్ వూల్ షీట్లను వాడుతున్నారు. దీని మందం 20–50 ఎం.ఎం. ఉంటుంది. షీట్ ధర రూ. 275–695 మధ్యలో ఉంటుంది. ఆర్సీసీ శ్లాబ్ పైన ఇన్సులేషన్ (ఓవర్ డెక్ ఇన్సులేషన్) పొర వేసుకొని, దానిపై వాటర్ ప్రూఫింగ్ చెయ్యాలి. ‘అండర్ డెక్ ఇన్సులేషన్’అనే మరో పద్ధతి ఉంది. ఆర్íసీసీ శ్లాబ్ అడుగున, ఈ బోర్డ్/జిప్సం లేయర్కు మధ్యలో ఈ ఇన్సులేషన్ వేస్తారు. పై కప్పు నుంచి కిందికి వచ్చే వేడిని ఇది కొంత మేరకు ఆపుతుంది. -
సోనమ్ వాంగ్చుక్ విడుదల
లేహ్/జోధ్పూర్: లడఖ్ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న ప్రముఖ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్లో లేహ్లో జరిగిన హింసాత్మక నిరసనల దరిమిలా ఆయనను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ)కింద అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి రాజస్థాన్లోని జోధ్పూర్ జైలులో ఉన్న వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దు చేస్తూ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.శాంతి స్థాపన కోసమే ఈ నిర్ణయంలడఖ్లో శాంతి, స్థిరత్వం పెంపొందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, ఆందోళనలను పరిష్కరించేందుకు, అన్ని వర్గాలతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం పేర్కొంది. గతంలో ప్రజా శాంతికి భంగం కలగకుండా ఉండేందుకే వాంగ్చుక్ను నిర్బంధించాల్సి వచ్చిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది.పరిశ్రమలు, పర్యాటకంపై ప్రభావంలడఖ్లో నిరంతర బంద్లు, నిరసనల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారవేత్తలు, పర్యాటక రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపిందని, ఈ వాతావరణాన్ని మార్చేందుకే వాంగ్చుక్ విడుదలకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.‘న్యాయ పోరాటం ఫలించింది’వాంగ్చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో తన భర్త నిర్బంధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్త ఎప్పుడూ అహింసా మార్గాన్నే కోరుకున్నారని అన్నారు. హింస వల్ల లడఖ్లో తన ఐదేళ్ల ‘తపస్సు’ వృథా అవుతుందని ఆయన సామాజిక మాధ్యమాల్లో కూడా పేర్కొన్నారని ఆమె కోర్టుకు విన్నవించారు. వాంగ్చుక్ విడుదలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆయన మద్దతుదారులకు ఆనందాన్నిచ్చింది. -
గ్యాస్ లేక.. స్మశానంలో మృతదేహాల వెయిటింగ్..
కోజికోడ్: దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు స్మశానవాటికల వరకూ పాకింది. కేరళలోని కోజికోడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ‘స్మృతిపథం’ స్మశానవాటికలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు పూర్తిగా అయిపోవడంతో, శుక్రవారం నుంచి గ్యాస్ ఆధారిత దహన సంస్కారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.సంప్రదాయ పద్ధతులే శరణ్యంగత రెండు రోజులుగా సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా సరఫరాదారులు కొత్త స్టాక్ పంపలేదని స్మృతిపథం సిబ్బంది వాపోతున్నారు. దీంతో గ్యాస్ ఫర్నేస్లను మూసివేసి, ప్రత్యామ్నాయంగా కొబ్బరి పీచు, చిప్పలను ఉపయోగిస్తూ, సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ క్రీమెటోరియం కూడా సాంకేతిక కారణాలతో గత నాలుగు నెలలుగా మూలనపడింది. వారం రోజుల్లోగా దీనికి మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.సామాన్యులపై అదనపు భారంసాధారణంగా మిగతా చోట్ల కంటే స్మృతిపథంలో అంతిమ సంస్కారాల ఖర్చు తక్కువ. ఇక్కడ గ్యాస్ ఆధారిత దహనానికి ₹2,000, ఎలక్ట్రిక్ పద్ధతికి ₹2,500 వసూలు చేస్తారు. గ్యాస్ కొరత కారణంగా దహన సంస్కారాల కోసం ఇప్పుడు కుటుంబ సభ్యులు పుతియాపాలం లేదా వెస్ట్ హిల్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ఒక్కో కుటుంబంపై అదనంగా ₹500 నుండి ₹1,500 వరకు ఆర్థిక భారం పడుతోంది.ఒక మృతదేహానికి 25 కిలోల గ్యాస్సాధారణంగా ఒక మృతదేహాన్ని గ్యాస్ ద్వారా దహనం చేయడానికి సుమారు 25 కిలోల గ్యాస్ అవసరమవుతుంది. అంటే దాదాపు ఒకటిన్నర కమర్షియల్ సిలిండర్లు ఖర్చవుతాయి. దహన ప్రక్రియలో తగినంత ఒత్తిడి కొనసాగించాలంటే ఒకేసారి 12 సిలిండర్లను ఫర్నేస్కు అనుసంధానించాల్సి ఉంటుంది. గ్యాస్ సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే ఇక్కడ సేవలు పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ఆకలి తీరుస్తున్న ‘గ్యాస్ అన్డూ’.. టెక్కీల క్రేజీ ఆవిష్కరణ -
ఆకలి తీరుస్తున్న ‘గ్యాస్ అన్డూ’.. టెక్కీల క్రేజీ ఆవిష్కరణ
కొచ్చి: పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభపు సెగ వంటగదులనూ తాకింది. కేరళలోని కొచ్చి నగరంలో ఎల్పీజీ (LPG) కొరత తీవ్రం కావడంతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ మేధస్సుకు పదును పెట్టారు. గ్యాస్ కొరతతో ఏయే హోటళ్లు మూతపడ్డాయి? ఎక్కడ భోజనం దొరుకుతుంది? అనే వివరాలను ఇట్టే చెప్పేసే ఒక వినూత్న వెబ్సైట్ను వారు అందుబాటులోకి తెచ్చారు.చేదు అనుభవం.. సరి కొత్త ఆలోచనవైశాఖ్ సురేష్, వి. విశ్వనాథ్ కర్త అనే ఇద్దరు టెక్కీలు ఇటీవల తమ టీమ్ సభ్యులతో కలిసి డిన్నర్కు వెళ్లారు. 30 మంది ఉన్న ఆ బృందానికి నగరంలోని ప్రధాన హోటళ్లలో ఆహారం లభ్యం కాలేదు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లలో వంటలు నిలిచిపోయాయని తెలుసుకున్నారు. కావాల్సిన ఆహారం దొరకక, నగరం అంతా తిరగాల్సి రావడంతో వారికి గంటల కొద్దీ సమయం, ఇంధనం వృథా అయ్యాయి. ఈ ఇబ్బంది మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో ‘గ్యాస్ అన్డూ’ ‘Gas Undo’ (https://www.gasundo.live/) పేరుతో ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.లైవ్ మ్యాప్తో ఆహారం వేట సులభంఈ వెబ్సైట్ ఒక డిజిటల్ మ్యాప్ మాదిరిగా పనిచేస్తుంది. కొచ్చి నగరంలోని దాదాపు 2,488 రెస్టారెంట్ల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఏ హోటల్ ప్రస్తుతం ఏమి ఆహారం దొరుకుతుంది? ఎక్కడ పరిమితమైన మెనూ మాత్రమే అందుబాటులో ఉంది? తదితర వివరాలను రియల్ టైమ్లో ఈ వెబ్పసైట్ ద్వారా తెneighboursలుసుకోవచ్చు. గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌవ్లు లేదా కట్టెల పొయ్యిలకు మారిన హోటళ్ల సమాచారాన్ని కూడా ఇందులో చూడవచ్చు.ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యంఈ ప్లాట్ఫారమ్ విశేషమేమిటంటే ఇది పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో నడుస్తుంది. ఏదైనా హోటల్కు వెళ్లిన కస్టమర్లు అక్కడ ఆహారం అందుబాటులో ఉందో లేదో వెంటనే మ్యాప్లో అప్డేట్ చేయవచ్చు. దీనివల్ల వేరే వాళ్లు ఆ హోటల్కు వెళ్లి, నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. సాంకేతికతను సామాన్యుల కష్టాలను తీర్చడానికి ఎలా ఉపయోగించవచ్చో ఈ కేరళ టెక్కీలు చక్కగా నిరూపించారు.ఇది కూడా చదవండి: అంతులేని ప్రేమతో.. మహిళ లోదుస్తులు చోరీ! -
అంతులేని ప్రేమతో.. మహిళ లోదుస్తులు చోరీ!
ఉజ్జయిని: ఒక వివాహితపై మనసు పడిన ప్రబుద్ధుడు.. ఆమెపై ఉన్న పిచ్చితో వికృత చేష్టలు మొదలుపెట్టాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలుగుచూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఉజ్జయినిలోని చిమన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాంచా భవన్ ప్రాంతంలో ఒక కుటుంబం నివాసముంటోంది.ఎవరూ లేరని నిర్ధారించుకుని..గత కొంతకాలంగా రాత్రిపూట ఇంటి బయట తీగపై ఆరవేసిన మహిళ లోదుస్తులు మాయమవుతుండటాన్ని ఆ కుటుంబ సభ్యులు గమనించారు. వరుసగా ఇదేవిధంగా జరుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆ ఇంట్లోనివారు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, అవాక్కయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఒక యువకుడు నెమ్మదిగా ఇంటి వద్దకు రావడం, ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తీగ మీద ఉన్న మహిళ లోదుస్తులను తీసుకుని అక్కడి నుంచి పరారవ్వడం క్లియర్గా ఆ సీసీటీవీలో కనిపించింది. బాధితులు వెంటనే ఆ ఫుటేజీని పోలీసులకు అందజేసి, ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.వీర ప్రేమకు గుర్తుగా ఛాతీపై టాటూసీసీటీవీ ఆధారంగా పోలీసులు అదే ప్రాంతానికి చెందిన అంకిత్ మాలవీయ (25) అనే యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. తనకు ఆ వివాహిత అంటే అంతులేని అని, ఆమెపై ఉన్న వన్ సైడ్ లవ్తోనే ఆమె లోదుస్తుల చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. అతను ఆమె పేరును ఛాతీపై టాటూగా కూడా వేయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.ఇది కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ! -
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో బెంగాల్ ప్రజల మనోగతం ఎలా ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలువడిన ‘ఓట్ వైబ్’ (Vote Vibe) సర్వే ఫలితాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై మమతా బెనర్జీ పట్టు ఏ మేరకు ఉన్నదనేది ఈ సర్వే తేల్చిచెప్పింది.దీదీకే జై కొడుతున్న జనం!తాజా సర్వే వివరాల ప్రకారం బెంగాల్ ముఖ్యమంత్రిగా 42 శాతం మంది మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారికి కేవలం 19 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఐప్యాక్ (ఐ-పాక్)సంస్థపై ఈడీ దాడులు జరిగినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పర్సెప్షన్ యుద్ధంలో గెలిచిందని, ముఖ్యంగా ముస్లిం ఓటర్ల మద్దతును పదిలపరుచుకుందని సర్వే పేర్కొంది.ప్రభుత్వ పనితీరుపై మిశ్రమ స్పందనమమత ప్రభుత్వ పనితీరుపై జనం భిన్నంగా స్పందిస్తున్నారు. సుమారు 34 శాతం మంది ‘అద్భుతం’ అని కితాబివ్వగా, 18 శాతం మంది మాత్రం ‘చాలా దారుణం’ అంటూ పెదవి విరిచారు. సర్వేలో అధికార పార్టీకి కొన్ని హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. దాదాపు 36 శాతం మంది ఓటర్లు నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. మరోవైపు టీఎంసీ.. అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ ప్రచారాన్ని 47 శాతం మంది నమ్ముతుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, యువ ఓటర్లు టీఎంసీకి దూరమయ్యే అవకాశం ఉందని సర్వే హెచ్చరించింది.ఎన్నికల నగారాకు అంతా సిద్ధంవచ్చే వారం రోజుల్లో పశ్చిమ బెంగాల్తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే 294 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం. 2021లో భారీ మెజారిటీతో గెలిచిన దీదీ, ఈసారి నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటారా? లేక బెంగాల్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా? అనేది వేచి చూడాలి.ఇది కూడా చదవండి: శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’ -
శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’
తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయానికి మహిళల ప్రవేశం విషయంలో కేరళలోని ఎల్డీఎఫ్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న తన పాత వైఖరిని మార్చుకుని, ఇప్పుడు ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిశ్చయించింది. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన తాజా నిర్ణయాన్ని అధికారికంగా వివరించనున్నదని తెలుస్తోంది.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందంటూ ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది. ఇటీవలే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కూడా శబరిమల పురాతన ఆచారాలను కాపాడాలని తీర్మానం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగినప్పటికీ, తుది నిర్ణయాన్ని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు వదిలివేశారు. సీపీఎం నాయకత్వం, ఇతర మిత్రపక్షాలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయానికి ప్రభుత్వం మొగ్గు చూపింది.గత ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదని ఎల్డీఎఫ్ భావిస్తోంది. ఈ అంశంపై గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ ‘రాజ్యాంగబద్ధంగా నడిచే దేశంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఫలానా వారు ఆలయానికి వెళ్లకూడదని ఏ ఒక్క వర్గం నిర్ణయించలేదు’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ మాటలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ‘శబరిమలలోకి మహిళల ప్రవేశంపై మా వైఖరిలో మార్పు లేకపోయినా, ప్రస్తుత పరిస్థితులు, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ సెక్రటేరియట్ నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ ఓటర్ల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా కేరళ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘ఉగ్గు’తో ఉసురు తీయకండి! -
మేమే దేశాన్ని నడిపించాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: ‘యావత్ దేశాన్ని మేమే నడపాలని మీరు కోరుకుంటున్నారా?’అంటూ సుప్రీంకోర్టు ఓ పిటిషనర్ను ప్రశ్నించింది. రహదారులు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ తదితరాలు సక్రమంగా ఉండేలా ప్రజల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తించే సమగ్ర ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్పై ఈమేరకు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం శుక్రవారం ఇందుకు సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టింది. షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నట్లే అన్ని అంశాలకు ఒకే చోట పరిష్కా రం కోరుతున్న ఈ పిటిషన్ చాలా బాగుందని పేర్కొంది. ‘సమస్యలను నిర్దిష్టంగా ప్రస్తావించలేప్పుడు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలను జారీ చేయలేం. అందుకే ఈ రిట్ పిటిషన్పై విచారణకు నిరాకరిస్తున్నాం. పిటిషనర్ కావాలనుకుంటే సరైన రీతిలో పిటిషన్ను రూపొందించి, సంబంధిత పరిధిలోని హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కలి్పస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లోని సానుకూల అంశాలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని పేర్కొంది. ‘పిటిషన్ కోరిన విధంగా చేసేందుకు ఆర్థిక వనరులు అవసరమవుతాయి. సంబంధిత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ను అర్థం చేసుకోవడానికి ఆయా రాష్ట్రాల హైకోర్టులే సరైనవి’అని ధర్మాసనం అభిప్రాయపడింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషనర్ తరఫు లాయర్ తెలిపారు. అయితే, యావత్తు దేశాన్ని మేమే పాలించాలని భావిస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘షోరూం, షాపింగ్ మాల్ మాదిరిగానే మీ పిటిషన్ కూడా చాలా బాగుంది. రోడ్లపై గుంతలు, రహదారులు, అసంపూర్తి వంతెనలు తదితర నిర్మాణాలు..ఇలా ప్రతి ఒక్కటీ ఇందులో ఉంది. భూమిపై ఉన్న ప్రతి ఒక్క సమస్యకూ మీరు పరిష్కారం చూపారు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.పిటిషన్లో ఇంకా ఏముంది? రోడ్లు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ వంటి బహిరంగ మౌలిక సదుపాయాల నిర్వహణ, సాధారణ తనిఖీలు, క్రమబద్ధమైన ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా ప్రజా భద్రతను నిర్ధారించాలని కోరింది. నగర, శివారు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల భద్రతను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి స్వతంత్ర భద్రతా ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో సివిల్ ఇంజనీర్లు, మౌలిక సదుపాయాల నిపుణులు, పౌర సమాజం, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఉండాలి. 2020 నుంచి మౌలిక సదుపాయాల లోపాల వల్ల జరిగిన మరణాల డేటాను సేకరించి, డిజిటలైజ్ చేసి బహిరంగ పరచాలి. మూడు నెలలకోసారి జిల్లాల వారీ నివేదికలను సుప్రీంకోర్టుకు సమరి్పంచేలా ఆదేశాలు ఇవ్వాలి. -
ట్రాన్స్జెండర్కు స్పష్టమైన నిర్వచనం
న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇస్తూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ శుక్రవారం లోక్సభలో ట్రాన్స్జెండర్ పర్సన్స్(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ట్రాన్స్జెండర్ పర్సన్స్(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) చట్టం–2019లో కొన్ని మార్పులు చేసి ఈ బిల్లును రూపొందించారు. ట్రాన్స్జెండర్లకు హాని తలపెట్టే వారికి నేర తీవ్రతను బట్టి శిక్షలు విధించే అంశాన్ని బిల్లులో చేర్చారు. విభిన్న లైంగిక ధోరణులు, స్వీయ లైంగిక గుర్తింపు కలిగిన వ్యక్తులను ట్రాన్స్జెండర్ కేటగిరీలో చేర్చకూడదని ఇందులో ప్రతిపాదించారు. ట్రాన్స్జెండర్ల రక్షణ కోసం ఉన్న చట్టం ప్రయోజనాలు అసలైన, అర్హులైన వ్యక్తులకే చేరాలంటే ఈ పదానికి కచి్చతమైన నిర్వచనం ఇవ్వడం అత్యవసరం అని పేర్కొన్నారు. 2019 నాటి చట్టంలోని రక్షణలు, ప్రయోజనాలు చాలా విస్తృతమైనవని తెలిపారు. వాటిని అనర్హులకు అందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. ట్రాన్స్జెండర్ వ్యక్తిని నిర్వచించడానికి బిల్లులో సబ్క్లాజ్ చేర్చారు. జని్మంచిప్పుడు నిర్ధారించిన లింగం(స్త్రీ లేదా పురుషుడు) కాకుండా, తమకు నచి్చన లేదా భిన్నమైన లింగ గుర్తింపుతో జీవించే వ్యక్తిని ట్రాన్స్జెండర్ అనొచ్చు. సామాజికంగా–సాంస్కృతికంగా కిన్నెర్, హిజ్రా, అరావణి, జోగ్తా, కొజ్జా (నపుంసకుడు) వంటి గుర్తింపులు ఉన్న వ్యక్తులు ట్రాన్స్జెండర్లు అవుతారు. ఇంటర్సెక్స్ వైవిధ్యాలు కలిగిన వ్యక్తి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లింగ లక్షణాలు ఉన్న వ్యక్తిని ట్రాన్స్జెండర్గా నిర్వచించాలి. ఒక వ్యక్తి ట్రాన్స్జెండర్ అవునో కాదో నిర్ధారించడానికి నిపుణుల సలహా తీసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని మెడికల్ బోర్డుకు ఈ అధికారం ఉంటుంది. ట్రాన్సజెండర్లుగా అధికారికంగా గుర్తింపు పొందిన వ్యక్తులు తమ గుర్తింపును బర్త్ సరి్టఫికెట్ సహా ఇతర ధ్రువపత్రాల్లో మార్చుకోవచ్చు. -
వంటింటి వార్కు చెక్..
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రతి ఇంటా ఇప్పుడు ఒకటే చర్చ. వంటింట్లో గ్యాస్ అయిపోతే? సిలిండర్ సమయానికి రాకపోతే? ప్రత్యామ్నాయం ఏంటి? వంటలు ఎలా? ఇదంతా ఎందుకంటే యూఎస్–ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు మన వంటింటి వరకూ వచ్చింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధమే కావొచ్చు. కానీ ఆ వార్ కాస్తా ఎల్పీజీ సరఫరాను దెబ్బతీయడంతో ప్రతి ఇంటి సమస్యగా మారింది. ఈ సమస్య రోజురోజుకూ ముదురుతోంది. ఎన్ని రోజులు ఇది కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వంట గ్యాస్కు, వంటలకూ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం తక్షణ పరిష్కారం. గ్యాస్ లేదంటే ముందుగా గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ స్టవ్ (ఇండక్షన్ కుక్టాప్స్), ఎలక్ట్రిక్ కుక్కర్, సోలార్ కుక్కర్, ఇతర అప్లయెన్సెస్. ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నా అందరికీ కొనే స్తోమత ఉండకపోవచ్చు. పల్లెల్లో కట్టెలు, బొగ్గు వంటివి ఇంధనంగా వాడుతున్నారు. పట్టణాల్లో వీటిని వాడటం సాధ్యం కాదు. ఉపకరణాలను కొనలేనివారు, సహజ ఇంధనాలను వాడలేనివారు, ఇంకా చెప్పాలంటే అందరూ.. ఇవేవీ అవసరం లేకుండానే సహజ పదార్థాలతో వంటలు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందామా.. వంటింటి శ్రమను తగ్గించేలా.. స్టవ్తో పనిలేకుండా సహజ ఆహారంతో విభిన్న వంటకాలను నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని పచ్చళ్లు, పొడులు రోట్లో లేదా రాయిపై నూరుకోవచ్చు. మిక్సీ ఉంటే మిక్సీలోనూ కొన్ని వేసుకోవచ్చు. నూనెల వాడకం, వేపుళ్లు తగ్గించవచ్చు. వండటం, పాత్రలు శుభ్రం చేసుకోవడంలో మహిళలు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. ఖర్చూ తగ్గుతుంది. ఇక రుచి అంటారా.. వేరుశనగ, నువ్వుల వంటి నూనె గింజల పొడులు వాడతాం కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. పూర్వకాలపు నిల్వ రోటి పచ్చళ్లుఒకప్పుడు స్టవ్ అవసరం లేకుండానే రోటి పచ్చళ్లు తయారుచేసుకునేవాళ్లు. నూనె తాలింపు కూడా చాలా వాటికి అవసరం లేదు. వేడి వేడి అన్నంలో వీటిని కలుపుకొని తింటే.. ఆ రుచిని మాటల్లో చెప్పలేం. పండు మిర్చి పచ్చడి, టమాటా పచ్చడి, కరివేపాకు పచ్చడి, క్యారెట్ పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి, కరివేపాకు క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చడి, ఉల్లిపాయ కారం, దోసకాయ–మామిడి కాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి వంటివి ఇలా తయారుచేసుకోవచ్చు. మామిడి పిందెలతో కూడా నిల్వ రోటి పచ్చడి పెట్టుకోవచ్చు. పుటా్నల పప్పు, చింతపండు, ఎండుమిర్చి వంటి వాటితో పచ్చడి చేయవచ్చు. పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఉసిరి, పచి్చమిర్చి, ఉప్పు కలిపి నూరి గ్రీన్ చట్నీ చేసుకుంటే రుచిగా ఉంటుంది. పచ్చి పెసరపప్పు లేదా పెసర్లు, మొలకెత్తిన పెసర్లు, పొట్టు పెసరపప్పుతో పచ్చడి చేసుకోవచ్చు.మంచి ప్రత్యామ్నాయం తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయిత, మిద్దెతోట ప్రచారకులుకూరగాయలు, నూనె గింజల వంటి సహజ పదార్థాలు వాడతాం కాబట్టి వంటకాలు రుచికరంగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు అలాగే ఉంటాయి. సహజ ఆహార పదార్థాల్లో ప్రాణశక్తి ఉంటుంది. వాడే పదార్థాలు ఎవరి స్తోమతను బట్టి వారు ఎంచుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఖర్చూ తక్కువ. పొడులు ఎన్ని కూరలు ఉన్నా.. పొడులను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. వెల్లుల్లి కారం, పెసరపప్పు పొడి, కంది పొడి, కారప్పొడి, నువ్వుల కారం మొదలైనవి త్వరగా చేసుకోవచ్చు. రెడీమేడ్ ఆవకాయ మామిడి కాయ ఆవబద్దలు మన ఇళ్లలో ఉండే పెద్దలందరికీ తెలుసు. అప్పటికప్పుడు తయారుచేసుకుని అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. క్యాలీఫ్లవర్ పచ్చడి, దోస ఆవకాయ, సొరకాయ వంటివి కూడా ముక్కలతో రెడీమేడ్గా చేసుకుని ఫ్రిజ్లో ఓ 10 రోజుల వరకు నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. చాలా సులభంగా బ్యాచిలర్లు చాలా సులభంగా, గ్యాస్ అవసరం లేకుండానే తయారుచేసుకునే పచ్చళ్లు చాలా ఉన్నాయి. ఉల్లి–నిమ్మ పచ్చడి, మామిడల్లం పచ్చడి (వేసవిలో వచ్చే మామిడి అల్లంతో), అల్లం కారం, ఉల్లిగడ్డ పచ్చడి, పచి్చమిర్చి పచ్చడి, పచ్చి టమాటా పండ్లతో నిల్వ పచ్చడి వంటివి ఈ కోవలోకి వస్తాయి.మిక్స్డ్ సలాడ్లు మొలకలు (పెసలు, శనగలు మొదలైనవి), నానబెట్టిన పల్లీలు, క్యారెట్, బీట్ రూట్ తురుము, కీరదోస ముక్కలు, జామకాయ ముక్కలు, కాస్త నిమ్మరసం చల్లిబ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్లు (వీటిలో డ్రై ఫ్రూట్స్ కావాలంటే కలుపుకోవచ్చు)పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి చాలా సులభంగా చేసుకోగలిగేది. తాలింపు లేకపోయినా ఫర్వాలేదు. ముల్లంగి పెరుగు పచ్చడి, పచ్చి పులుసు వంటివి అప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు.కొబ్బరి తురుముతో పచ్చి కొబ్బరి తురుము, దంచిన పచ్చి మిర్చి కలిపి అందులో నిమ్మరసం వేసుకోవచ్చు. లేదంటే మామిడికాయ తురుము కలిపినా బాగుంటుంది. పచ్చి పెసరపప్పు,పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, నిమ్మరసం, ఉప్పు కలుపుకొంటే కోసంబరి సిద్ధం.ఈ రెడీమేడ్ లడ్డూలు–తీపి పొడులు కేవలం వంటలే కాదు టైమ్ పాస్కి, స్నాక్స్లా తినడానికి రెడీమేడ్గా లడ్డూలు, తీపి పొడులు తయారుచేసుకోవచ్చు. ఇవి పిల్లలకు చాలా బలమైన ఆహారం. మొక్కజొన్న పిండికి, బెల్లం కలిపి సత్తు పిండి తయారుచేసుకోవచ్చు. దానిపై బాదం, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్లు అలంకరణ చేసుకుని తినొచ్చు. వేరు శనగ పొడి, బెల్లం కలిపి పొడి చేసుకోవచ్చు. అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుముతోనూ లడ్డూ చేసుకోవచ్చు. -
అప్పుడు మహిళలకు ఉద్యోగాలివ్వరు
న్యూఢిల్లీ: మహిళలకు రుతుక్రమ సమయంలో తప్పనిసరి సెలవుల పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ సెలవులను తప్పనిసరి చేస్తే మహిళలను ఎవ్వరూ ఉద్యోగాల్లోకి తీసుకోరని, ఇది వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. ఋతుక్రమ సమయంలో విద్యారి్థనులు, మహిళా ఉద్యోగులకు సెలవు నియమాలను రూపొందించాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారించింది. ఈ చట్టం శ్రామిక మహిళల్లో భయాన్ని లేదా వారు పురుషుల కంటే తక్కువనే అభిప్రాయాన్ని సృష్టిస్తుందని అభిప్రాయపడింది. ‘ఒక విషయం పట్ల అవగాహన, సున్నితత్వాన్ని సృష్టించడం భిన్నంగా ఉంటుంది.రుతుక్రమ సెలవులను తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చిన క్షణం నుంచే యాజమాన్యాలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు. యజమానుల మనస్తత్వం మీకు తెలియదు. వారు మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు. ఋతుస్రావం వారికి జరుగుతున్న ‘చెడు’గా పరిగణిస్తారు’అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులు 2013లో కేరళ ప్రభుత్వం మంజూరు చేసిందని సీనియర్ న్యాయవాది ఎమ్.ఆర్.శంషాద్ గుర్తు చేశారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి సడలింపులు ఇచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే, ‘అవి స్వచ్ఛందంగా తీసుకున్న చర్యలు. మీరు తప్పనిసరి చట్టం అని చెప్పిన వెంటనే, ఎవరూ వారికి ఉద్యోగాలు ఇవ్వరు. న్యాయవ్యవస్థలో లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో వారిని తీసుకోరు. ఇక ఇంట్లో కూర్చోవాలని చెబుతారు. వారి కెరీర్ ముగిసిపోతుంది.’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. -
ఈశాన్యంలో శాంతి వీచికలు
గువాహటి: ఒకప్పుడు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లిన ఈశాన్య భారతదేశంలో నేడు శాంతి పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ అశాంతి అంతమై, అభివృద్ధి పరుగు ఆరంభమైందని స్పష్టంచేశారు. ఈశాన్య ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్వార్థ రాజకీయాల కోసమే కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ శుక్రవారం అస్సాంలో పర్యటించారు. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో రూ.19,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మరికొన్ని ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అలాగే పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత కింద దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేశారు.కోక్రాఝార్ జిల్లాలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి రాజధాని గువాహటి నుంచి వర్చువల్గా ప్రసంగించారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రధానమంత్రి కోక్రాఝార్కు చేరుకోలేకపోయారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో అస్సాంలో నూతన అధ్యాయం మొదలైందని, ఇక్కడ పూర్తిస్థాయిలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని, శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ భద్రతను పణంగా పెట్టిందని, స్థానికుల భూములను చొరబాటుదారులకు కట్టబెట్టిందని మండిపడ్డారు. అస్సాంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టిగా బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తేయాకు కార్మికుల రుణం తీర్చుకుంటున్నా అస్సాంలో తేయాకు తోటల కార్మికులకు జరిగిన అన్యాయాన్ని తాము సరిదిద్దినట్లు ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భూములపై వారికి హక్కులు కల్పించామని, పట్టాలు అందజేశామని అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా మూడు కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక మహిళా కార్మికురాలికి మోదీ పాదాభివందనం చేశారు. కార్మికులకు న్యాయం చేసినందుకు హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వాన్ని అభినందించారు. అస్సాం కార్మికులు పండించిన తేయాకు గుజరాత్కు వస్తోందని, అక్కడ ఆ తేయాకుతో తేనీరు తయారు చేసి విక్రయించానని తెలిపారు. ఛాయ్వాలాగా పనిచేసి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. భూమి పట్టాలు ఇవ్వడం ద్వారా తేయాకు కార్మికుల రుణం తీర్చుకుంటున్నానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ది అబద్ధాల దుకాణం ప్రేమ దుకాణం(మొహబ్బత్ కీ దుకాణ్) తెరిచామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారాన్ని ప్రధానమంత్రి తిప్పికొట్టారు. కాంగ్రెస్ అబద్ధాల దుకాణం(ఝూటే వైదో కీ దుకాణ్) తెరిచిందని విమర్శించారు. అక్కడ ఒక అబద్ధానికి మరో నాలుగు సూపర్ అబద్ధాలు బహుమతిగా లభిస్తాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్కు ఏనాడూ లేదన్నారు. హామీలు నిలబెట్టుకోవడమే లక్ష్యంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. -
మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
ఆగ్రాలో ఒక మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నాలుగేళ్లు సహజీవనంచేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఒక పోలీస్ కానిస్టేబుల్పై ఆరోపణలు గుప్పిస్తూ చనిపోయే ముందు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కూడా విజ్ఞప్తి చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసలు స్టోరీ ఏంటంటే..ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత మహిళది స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా. ఆమె అంతకుముందే విడాకులు తీసుకుని, ఆగ్రాలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో తాజ్గంజ్ పోలీస్ స్టేషన్లోపనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్తో పరిచయమైంది. దీంతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబం ఒప్పుకోదు అంటూ పెళ్లికి నిరాకరించాడు. చివరికి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో వివాదం రేగింది. తీవ్ర ఆవేదనతో వీడియో సందేశం రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వీడియోలో ఇలా పేర్కొంది..తాను కలిసి జీవించిన గౌతమ్ చేతిలో ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మాట తప్పాడని పేర్కొంది. గౌతమ్తో జీవించిన కాలంలో తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఫిర్యాదు చేయడానికి తాను పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు, తమ చేతుల్లో ఏమీ లేదని, ఆ కానిస్టేబుల్పై ఎటువంటి చర్యలూ తీసుకోలేమని అక్కడివారు చెప్పినట్లు ఆమె తెలిపింది. తాను బతికి ఉన్నప్పుడు తనకు న్యాయం జరగలేదని, కనీసం తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని ఆశించింది. అంతేకాదు గౌతమ్, అతని కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని, మానసికంగా వేధించారని, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా తనను నెట్టారని ఆమె ఆరోపించింది. ఏళ్ల తరబడి అతనితో కలిసి జీవించిన తర్వాత, ఇప్పుడు అతను వేరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని ఆమె వాపోయింది."నా మరణానికి జేవీ గౌతమ్, అతని కుటుంబం మొత్తం కారణం. వారు నన్ను ఎంతగానో మోసం చేశారు. మానసికంగా ఎంతగా వేధించారంటే, చివరికి నేను చనిపోయేలా నన్ను బలవంతం చేశారు." అని చెప్పింది. అలాగే ‘‘అతని అన్నయ్య ఒకవైపు నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. మరోవైపు, నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదని జేవీ గౌతమ్ నాతో చెబుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఏ అమ్మాయినీ మోసం చేయకు," అని పేర్కొంది."Don't get married to anyone, but don't keep any girl in deception either"The young woman who made a video before suicide in Agra leveled serious allegations of deception against police constable Jitendra Gautam!!Constable is arrested and send to Jail.99 percent of Live in… pic.twitter.com/OCDlXiEbLb— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 13, 2026 ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుల్ జె.వి. గౌతమ్ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. -
వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్లో గ్యాస్ సంక్షోభం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్యానిక్ బుకింగ్స్ వద్దని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ కోరారు. అవసరం లేకున్నా ఆందోళనతో గ్యాస్ బుక్ చేయొద్దన్నారు. బ్లాక్ మార్కెట్పై చర్యలు తీసుకుంటున్నామన్న పెట్రోలియం శాఖ.. గ్యాస్ అందుబాటులో ఉందని.. ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. దేశంలో పెట్రోల్ కొరత కూడా లేదని.. 30 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్పీజీ బదులు ప్రజలు పీఎన్జీ తీసుకోవాలని.. ఎప్పటిలాగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న ప్రజలు.. భారీగా పెట్రోల్ బంక్లు, గ్యాస్ గోడౌన్ల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, వాణిజ్య సిలిండర్ల కొరతతో అనేక హోటల్స్లలో నుంచి మెనూ మార్చేశారు. కొన్ని డిష్లకు తాత్కాలికంగా మంగళం పాడేశారు. ఇక పలు టీ దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. పలు హోటళ్లు కట్టెలు, పొట్టుతో కూడిన పొయ్యిలపై దృష్టి పెట్టాయి. దీంతో కట్టెలు, పొట్టుకు సైతం డిమాండ్ పెరిగింది. -
ప్రియుడితో మెనాలీసా పెళ్లి : రంగంలోకి వీహెచ్పీ
కుంభమేళా సోషల్మీడియా సంచలనం మోనాలీసా భోంస్లే (Monalisa Bhosle)కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రేమ వివాహం చట్టవిరుద్దమని విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఆమెది బాల్య వివాహమని వీహెచ్పీ ఆరోపించింది. దీంతో ఈ పెళ్లి నెట్టింట చర్చకు దారితీసింది.ప్రయాగ్రాజ్లో జరిగిన 2025 మహా కుంభమేళా సందర్భంగా విశేష గుర్తింపు పొందిన మోనాలిసా భోంస్లే ఇటీవల (మార్చి 11, 2026న ) తన ప్రియుడు మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ (Mohammed Farman Khan)ను పెళ్లాడింది. కేరళలోని అరుణ్మనూర్లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారీ వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే మోనాలీసా మైనర్శ్రీ అనీ, ఈ వివాహం చెల్లదంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) కేరళ విభాగం గురువారం నాడు డీజీపీతో పాటు పూవార్ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేసింది. ఈ మతాంతర వివాహం చట్టవిరుద్ధమని, ఎందుకంటే వధువు మైనర్ అని (18 ఏళ్లలోపు) విహెచ్పీ తన ఫిర్యాదులో ఆరోపించింది. బాల్య వివాహాల నిరోధక చట్టం, పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం-2012 కింద విచారణ జరపాలని,అలాగే వివాహాన్ని నిర్వహించిన వారిపైనా, అందులో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ విహెచ్పీ కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ విలయిల్ కేరళ డీజీపికి, పూవార్ SHOకు ఫిర్యాదు చేశారు. #WATCH | Thiruvananthapuram, Kerala: Monalisa Bhosle, the viral 'Rudraksha Girl' of the 2025 Maha Kumbh Mela, has married her boyfriend Furman KhanFurman Khan says, "This is not love jihad. Both of us follow our own religions, but we also respect all religions. We are both… pic.twitter.com/GrQyafT9J5— ANI (@ANI) March 12, 2026ఈ ఫిర్యాదు ప్రకారం.. తమ వాదనకు ఆధారంగా, జనవరి 21, 2025న జరిగిన మోనాలిసా 16వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సోషల్ మీడియా వీడియో దృశ్యాలను వీహెచ్పీ ప్రస్తావించింది. కనుక 18 ఏళ్ల లోపే జరిగిన మోనాలిసా భోంస్లే వివాహం చెల్లదని, ఆ జంటపైనా, ఆలయ అధికారులపైనా, అలాగే వారికి అండగా నిలిచిన రాజకీయ పోషకులపైనా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలుమెనాలీసా క్లారిటీతమ వివాహం చట్టబద్దమైందనీ, లవ్ జిహాద్ కాదనీ కొత్త జంట తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. మోనాలిసాకు 18 ఏళ్లు నిండాయని స్పష్టం చేశారు. ఇద్దరమూ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని వివరించారు. అలాగే జనవరి 1, 2008న జన్మించిందంటూ, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రాన్ని కూడా వారు సమర్పించారు. అయితే మెనాలీసా కుటుంబం ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో రక్షణ కోరుతూ తంపనూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. 18 సంవత్సరాలు నిండాక, చట్టబద్ధంగా నచ్చిన భాగస్వామితో జీవించడానికి స్వేచ్ఛ ఉందని పోలీసు అధికారులు వివరించారు. దీంతో వివాహం ప్రక్రియను ముగించారు. ఇదీ చదవండి : లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!కాగా మెనాలీసా-ఫర్మాన్ ఖాన్ వివాహానికి కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాజ్యసభ సభ్యుడు ఎఎ రహీం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్తో సహా పలువురు రాజకీయ నాయకులు హాజరైనారు. -
నో టెన్షన్.. భూగర్బ రహస్య గుహల్లో చమురు నిల్వలు
పశ్చిమాసియా యుద్ధం భారతదేశ చమురు పరాధీనతను కళ్లకు కట్టింది. విదేశాల నుంచి ముడిచమురు, ద్రవరూప పెట్రోలియం గ్యాస్, ద్రవరూప సహజవాయువు దిగుమతులు హఠాత్తుగా ఆగిపోతే భారత్ కష్టాలకడలిలో పడిపోవడం ఖాయమని వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితిని చాన్నాళ్ల క్రితమే ఊహించిన భారత్ ముందుజాగ్రత్తగా భారీ స్థాయిలో పెట్రో ఉత్పత్తులను నిల్వచేసుకునే రహస్య భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించుకుంది. వీటిల్లో మిలియన్ల మెట్రిక్ టన్నుల కొద్దీ ముడిచమురు ఉత్పత్తులను దాచిపెడుతోంది.భారత్ తన 90 శాతం ముడిచమురు, 60 శాతం ఎల్పీజీ, 50 శాతం సీఎన్జీ (CNG) అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ సరకును నిల్వచేసుకోవడంపై దృష్టిసారించింది. ఈ కారణంగానే హార్మూజ్ జలసంధి వంటి కీలక చమురు సరఫరా మార్గాలు మూతబడినా వెంటనే కంగారుపడకుండా తన చమురు నిల్వలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ వంటి దేశాలు ఏకంగా లాక్డౌన్ ప్రకటించి చేతులెత్తేసి చేష్టలుడిగి చూస్తున్నాయి.మూడు చోట్ల మహా గుహలు! చమురు ఉత్పత్తుల దిగుమతులు ఆగిపోయాయనే దిగులుతో భారత్ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, తమిళనాడులోని పాడూర్లో కేంద్రప్రభుత్వం మూడు భూగర్భ రహస్య నిల్వకేంద్రాలను నిర్వహిస్తోంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పదేళ్ల క్రితమే 4 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును నిల్వచేసే భారీ భూగర్భ కేంద్రాన్ని నిర్మించారు.ఇందులోని ముడిచమురు (Crude Oil) పది రోజులపాటు యావత్ భారతదేశ అవసరాలను తీర్చగలదు. బాంబు, డ్రోన్ దాడులను తట్టుకునేలా అత్యంత లోతులో వీటిని నిర్మించారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, చమురు ఒలికిపోవడం వంటి లీకేజీ సమస్యలూ ఇక్కడ దాదాపు ఉండవు. గతంలోలాగా ఒకటి రెండు దేశాలపై ఆధారపడకుండా ఏకంగా 40 దేశాల నుంచి ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఏదో ఒకటి రెండు దేశాలు యుద్ధసంక్షోభంలో చిక్కుకున్నాసరే మిగతా దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు భారత్ చేసుకుంది.అంతర్జాతీయ చమురు సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా రష్యా చమురును కొనేందుకు భారత్కు అమెరికా అనుమతి ఇవ్వడంతో వేగంగా భారత్ పావులు కదిపింది. దక్షిణాసియాలో ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన 30 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలుచేసింది. దీనికితోడు గత పది రోజుల్లోనే ఒక్క అంగోలా నుంచే 34 లక్షల బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనేసింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి మరో 19 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలుచేసింది. ఇలా వచ్చిన సరకును వీలైనంత వరకు భూగర్భం కేంద్రాల్లో దాచేస్తోంది. ఎల్పీజీ స్టోరేజీ సైతం ఊపందుకుంది.అరకిలోమీటర్ లోతులో..కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) ఏర్పాటుచేసిన స్టోరేజీ సామర్థ్యం ఏకంగా 80,000 టన్నులు. ఇది అరకిలోమీటర్ లోతులో ఉంది. ఇదిగాక విశాఖపట్నంలో మరో ఎల్పీజీ నిల్వకేంద్రం ఉంది. దీని సామర్థ్యం 60,000 టన్నులు. ఇవిగాక మరికొన్ని రహస్య భూగర్భ రాతి గుహలను నిర్మించి మరింత ఎక్కువ చమురును నిల్వచేయాలని కొన్ని నెలల క్రితం పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను తమిళనాడులోని పాడూర్లోనూ దాచేస్తోంది. ఒడిశాలోని ఛందీఖోల్లో మరో దానిని నిర్మించనున్నారు.చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే!భూగర్భ గుహలు అనేవి వ్యూహాత్మకంగా సురక్షితమైనవి. భూమి మీది నిల్వకేంద్రాల నుంచి ఎండాకాలంలో కొంతమేర పెట్రో ఉత్పత్తులు వేడికి ఆవిరవుతాయి. భూగర్భంలో ఆ నష్టభయం ఉండదు. యుద్ధకాలంలో తొలిసారిగా స్వీడన్లో ఈ ప్రణాళికను అమలుచేశారు. తర్వాత ఫిన్లాండ్, జపాన్, దక్షిణకొరియా తదితర దేశాలు ఇదే బాటలో పయనించాయి. 1990లో గల్ఫ్ యుద్ధం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో భారత్ ఈ అండర్గ్రౌండ్ స్టోరేజీలకు అంకురార్పణ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రెండు దశల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరో దశ సమావేశాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కోల్కతాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సమావేశంలో అధికార టీఎంసీ మినహా, రాష్ట్రంలోని చాలా రాజకీయ పార్టీలు ఒకటి లేదా రెండు దశల ఎన్నికలు కోరాయని, భద్రతా దళాల అధికారులు కూడా ఇలాంటి సూచనలే చేశారని చెప్పారు.పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికలకు సంబంధించిన హింసను అరికట్టడం సులభమవుతుంది. తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన అన్నారు. ‘288 సీట్లున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాం. పశ్చిమ బెంగాల్లోనూ ఒకే దశలో నిర్వహించడం అసాధ్యమైతే కాదు. అయితే.. ఇక్కడ భద్రతా అంశాల దృష్ట్యా అది అసంభవం అనిపిస్తోంది’ అని అన్నారు.ఎన్నికల సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఈసీకి ప్రధాన ఆందోళనగా మారాయని, అయితే గట్టి నిఘా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హామీ ఇచ్చారని అధికారి తెలిపారు.చదవండి: ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించాలంటూ.. -
కుమారుడు లేని జీవితం ఎందుకని..
కాసరగోడ్ (కేరళ): ఏకైక కుమారుడు దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. రైలు ప్రమాదంలో కుమారుడు ప్రాణాలు కోల్పోయిన నాటి నుంచి వారు దుఃఖంలో మునిగిపోయారు. చివరకు ‘వాడు లేని లోకంలో మేము ఉండలేం’ అంటూ ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కేరళలోని కాసరగోడ్ జిల్లా చెమ్నాడ్ పంచాయతీ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.పొయినాచిలోని పరంబ ప్రాంతానికి చెందిన వేణుగోపాలన్ నాయర్ (50), ఆయన భార్య స్మిత (42) శుక్రవారం ఉదయం తమ నివాసంలో విగతజీవులుగా కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మేల్పరంబ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. ఏకైక కుమారుడు ఎం. శివానందన్ (19) మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.మంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న శివానందన్, గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన ఒక దుర్ఘటనలో మరణించాడు. బేకల్ బీచ్ ఫెస్టివల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరికి తన స్నేహితుడు అజేష్తో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వేదికకు చేరుకోవడానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న రైల్వే పట్టాలను దాటుతుండగా, ‘తిరునెల్వేలి జంక్షన్ - జామ్నగర్ ఎక్స్ప్రెస్’ వీరిని ఢీకొంది. ఈ ఘటనలో శివానందన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అజేష్ గాయాలతో బయటపడ్డాడు.కొడుకు మరణం తర్వాత వేణుగోపాలన్, స్మిత దంపతులు తీవ్రమైన కుంగుబాటులోకి వెళ్లిపోయారని బంధువులు, పొరుగువారు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. ‘వాడు లేకుండా మేము బతకలేము’ అని వారు తరచూ చెబుతుండేవారని, కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చినా వారిలో మార్పు రాలేదని తెలిసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు జ్ఞాపకాలు వారిని ప్రతిక్షణం వెంటాడటంతో, మరణమే శరణ్యమని భావించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాసరగోడ్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.ఇది కూడా చదవండి: ఎల్పీజీ కొరత.. మారిన ఆహార అలవాట్లు -
శశికళ కొత్త పార్టీ పేరు ఇదే..!
చెన్నై:తమిళనాడు చిన్నమ్మ శశికళ ఇటీవలే ఆ రాష్ట్రంలో పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన పార్టీ గుర్తును ప్రకటించారు..'ఆల్ ఇండియా పురుచ్చి తలైవార్ మక్కల్ మునేత్ర కళగం' పార్టీ పేరుగా తెలిపారు. కొబ్బరిచెట్టు తన పార్టీ చిహ్నంగా పేర్కొంది. ఈ మేరకు తన అభిమానుల సమక్షంగా ఈ ప్రకటన చేశారు. కాగా ఇదివరకే తమిళనాడులో జరిగిన సభలో పార్టీ జెండా ఆవిష్కరించిన శశికళ తాజాగా పార్టీ పేరు గుర్తు ప్రకటించింది. శశికళ పార్టీ జెండాను తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. దివంగత నేతలు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ గుర్తులతో జెండా ఉంది. అయితే పార్టీ పేరు మాత్రం త్వరలోనే ప్రకటిస్తానని చెప్పిన చిన్నమ్మ తాజాగా ఆ ప్రకటన చేసింది.. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని పార్టీ ఆవిర్భావ సభలో పేర్కొంది.కాగా శశికళ, జయలలితకు అత్యంత సన్నిహితురాలు ఆమె మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవించి, తదనంతరం ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ, గత కొంతకాలంటా చెన్నై వేదికగా తన మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కృతురాలైనప్పటికీ, రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే మాట వినిపిస్తోంది.ఈ క్రమంలోనే ఆమె అనుచరులు సైతం ‘చిన్నమ్మ’ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో తమిళనాట పొలిటికల్ హీట్ మరింత ముదిరింది. తమిళనాడులో ఇది వరకే ఫిలిం స్టార్ విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శశికళ ఎంట్రీతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. -
ఎల్పీజీ కొరత.. మారిన ఆహార అలవాట్లు
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత తీవ్రతరమవుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో సిలిండర్ల కోసం వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ సరఫరాలో అనిశ్చితి నెలకొనడంతో హోటళ్లు తమ మెనూలను కుదిస్తుండటంతో ఇడ్లీలు, దోశలు తినేవారు టీ, కాఫీలతోనే సరిపెట్టుకుంటున్నారు. మెనూలో కోతలుదేశ రాజధాని ఢిల్లీలోని విద్యాసంస్థల క్యాంటీన్లపై ఎల్పీజీ కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని పలు క్యాంటీన్లు ఇప్పటికే మెనూలోని స్నాక్స్ ఐటమ్స్ను నిలిపివేశాయి. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ క్యాంటీన్ తన ‘మటన్ దోశ’ను తాత్కాలికంగా తొలగించింది. ధరలు పెంచలేక, గ్యాస్ దొరకక వంటకాలను తగ్గించుకుంటున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముంబైలో మరీ దారుణంసిలిండర్ రీఫిల్ కోసం ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ డీలర్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ముంబైవాసులకు ఏర్పడింది. గ్యాస్ కొరత కారణంగా ముంబైలోని పలు రెస్టారెంట్లు మళ్లీ పాత కాలపు బొగ్గు పొయ్యిల బాట పట్టాయి. మరోవైపు బెంగళూరులో ఆటో గ్యాస్ ధరలు రెండు రోజుల్లోనే లీటరుకు రూ. 10 వరకు పెరగడం వాహనదారులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇందిరా క్యాంటీన్ల నిర్వహణపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.టిఫిన్ బాక్సుల షేరింగ్..పుణెలో విద్యార్థుల మెస్ నిర్వహణ భారంగా మారడంతో ధరలు పెంచక తప్పడం లేదు. దీంతో విద్యార్థులు ఒకే టిఫిన్ బాక్సును ఇద్దరు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోల్కతా, అజ్మీర్ తదితర నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత వల్ల హోటల్ యజమానులు కట్టెలు, బొగ్గును వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో బొగ్గు, కట్టెల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కేజీ బొగ్గు ధర రూ. 30 నుంచి రూ. 35కి చేరగా, కట్టెల ధరలు కూడా అమాంతం పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం త్వరగా ముగియకపోతే, రాబోయే రోజుల్లో ఇంధన కష్టాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: వార్ ఎఫెక్ట్: మూసివేత దిశగా ప్రముఖ కాఫీ హౌస్? -
అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు
ఢిల్లీ: మహిళల పీరియడ్ లీవ్కు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు రుతుస్రావం సమయంలో సెలవులు తప్పనిసరి చేస్తే ఏ కంపెనీలు వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి మెుగ్గు చూపవని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రుతుస్రావం సమయంలో మహిళలకు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు శుక్రవారం విచారించింది. మహిళల సహజ రుతుస్రావం సమయంలో విద్యార్థినిలకు, ఉద్యోగస్థులకు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని లాయర్ శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ‘పీరియడ్ సమస్యపై, దాని సున్నితత్వంపై అవగాహన కల్పించడం వేరు. రుతుక్రమం సమయంలో సెలవులు తప్పనిసరి అనిచట్టం చేస్తే మహిళలకే నష్టకరంగా మారవచ్చు. వారిని ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోరు. గవర్నమెంట్ ఉద్యోగాలు, జ్యూడీషియరీ జాబ్స్ ఎందులోనూ వారికి చోటు ఉండదు. కంపెనీల మనస్థత్వం మీకు తెలియదు’ అని అన్నారు. అయితే దీనిపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇదే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 21 ప్రకారం ఆడపిల్లలకు గౌరవంగా జీవించే హక్కు ఉందని ఆరోగ్యం, విద్య, గౌరవం వారికి ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత అని తెలిపింది.ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వారికి ఉచితంగా నాప్కీన్స్, ప్రత్యేకమైన టాయిలెట్స్, మెంటల్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. -
వార్ ఎఫెక్ట్: మూసివేత దిశగా ప్రముఖ కాఫీ హౌస్?
తిరువనంతపురం: దక్షిణాదిన దశాబ్దాల చరిత్ర కలిగిన ‘ఇండియన్ కాఫీ హౌస్' (ఐసీహెచ్) ఇప్పుడు ఎల్పీజీ సంక్షోభంలో చిక్కుకుంది. కేరళ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ సహకార సంస్థ అవుట్లెట్లలో వంటగ్యాస్ (ఎల్పీజీ)సిలిండర్ల కొరత వేధిస్తుండటంతో, పలు బ్రాంచీలు మూతపడే దిశగా సాగుతున్నాయి. త్రిసూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు చెందిన సుమారు 45 బ్రాంచీల్లో ప్రస్తుతం గ్యాస్ నిల్వలు నిండుకున్నాయని, కేవలం ఒకటి లేదా రెండు రోజులకు సరిపడా మాత్రమే స్టాక్ ఉందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది.ప్రస్తుత గండం నుంచి గట్టెక్కేందుకు కేరళలోని 15 ప్రధాన బ్రాంచీలలో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే, నగరాల మధ్యలో, బహుళ అంతస్తుల భవనాల్లో ఉన్న అవుట్లెట్లలో కట్టెల పొయ్యిలు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ సమీపంలో ఉన్న బ్రాంచీలు, కమర్షియల్ కాంప్లెక్స్లలో నడిచే హోటళ్లలో భద్రతా కారణాల దృష్ట్యా కట్టెలను వాడటం అసాధ్యం. దీంతో చేసేది లేక భోజనాలను తాత్కాలికంగా నిలిపివేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ఇండియన్ కాఫీ హౌస్ వినూత్న ప్రయోగాలు చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు టీ, కాఫీ సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తున్నారు. అలాగే, సాధారణ భోజనం బదులు తక్కువ గ్యాస్ ఖర్చయ్యే బిర్యానీ వంటి పదార్థాలను మాత్రమే అందించేలా మెనూను తయారు చేస్తున్నారు. నెలకు సుమారు 5,000 సిలిండర్లు అవసరమయ్యే ఈ భారీ నెట్వర్క్కు సరఫరా నిలిచిపోవడంతో వేలాదిమంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు.ఇండియన్ కాఫీ హౌస్ కేవలం పర్యాటక ప్రాంతాల్లోనే కాకుండా కేరళలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా క్యాంటీన్లను నిర్వహిస్తోంది. గ్యాస్ కొరత కొనసాగితే రోగులకు, వారి సహాయకులకు ఆహారం అందడం కష్టతరమవుతుందని సహకార సంఘం హెచ్చరించింది. గ్యాస్ సరఫరా సంస్థలకు ఇప్పటికే అత్యవసర లేఖలు రాశామని, ప్రాధాన్యతా క్రమంలో సిలిండర్లను కేటాయించాలని కోరామని అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం -
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఏదైనా ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాలని సూచించింది. -
సిలిండర్లు దాచారో.. జైలుకే!
మధురై: ఎల్పీజీ కొరతను ఆసరాగా చేసుకుని, అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసిన ఇద్దరు వ్యక్తులపై తమిళనాడు ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు నడుం బిగించింది. మధురైలో భారీ ఎత్తున వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినట్లు సివిల్ సప్లైస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిపై అత్యంత కఠినమైన ‘ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్’ (గుండా చట్టం) కింద కేసు నమోదు చేశారు. సిలిండర్ల నిల్వపై రాష్ట్రంలో ఈ తరహా కఠిన చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు మధురై సమీపంలోని కోవిల్పాపాకుడి ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పళని అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన 100 సబ్సిడీ సిలిండర్లు, 109 కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆనందం నగర్లోని మదన్ కుమార్ (27) నివాసంలో సోదాలు నిర్వహించి, మరో 189 సిలిండర్లను గుర్తించారు. మొత్తం కలిపి 398 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.పి. మురళి మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళనతో ముందస్తు కొనుగోళ్లు చేయవద్దని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 టెర్మినల్స్లో 7,000 పైగా పెట్రోల్ బంకులకు సరిపడా నిల్వలు ఉన్నాయని, కనీసం మూడు వారాలకు సరిపడే స్టాక్ అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ బంకుల్లో నిల్వలు అయిపోవడం వల్ల ఇటువంటి వదంతులు వ్యాపించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తమిళనాడు వణిగర్ సంఘంగళిల్ పేరమైపు అధ్యక్షుడు విక్రమరాజా ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఏజెంట్లు ఒక్కో సిలిండర్ను రూ. 4,000 వరకు విక్రయిస్తున్నారని, దీనివల్ల సామాన్యులకు ఆహార పదార్థాల లభ్యత భారంగా మారుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం -
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో అంతకంతకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటగది ముఖచిత్రాన్ని మార్చివేశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మున్ముందు ఎల్పీజీ (LPG) సరఫరాకు విఘాతం కలగవచ్చనే భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఒక సరికొత్త ‘ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికింది. గ్యాస్ సిలిండర్ల కొరత భయం సామాన్యుడిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపిస్తున్నది. ఈ నేపధ్యంలో గత రెండు రోజుల్లో ఇండక్షన్ స్టౌల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరగడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.హాట్ కేకుల్లా ఇండక్షన్ స్టౌలుయుద్ధం పశ్చిమాసియాలో జరుగుతుంటే, ఆ సెగ భారతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గత 48 గంటల్లో ఇండక్షన్ స్టౌల విక్రయాలు ఏకంగా 30 రెట్లు పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో పాటు, బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్లో కూడా ఇండక్షన్ స్టౌల ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికోసం జనం ఎంతలా ఎగబడుతున్నారంటే, ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోయి ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు, మెసేజ్లు కనిపిస్తున్నాయి. కేవలం ఇండక్షన్ స్టౌలే కాకుండా, రైస్ కుక్కర్లు, ఎయిర్ ఫ్రైయర్ల అమ్మకాలు కూడా నాలుగు రెట్లు పెరగడం విశేషం.బ్లాక్ మార్కెట్ దందాయుద్ధ భయాన్ని ఆసరాగా చేసుకుని పలువురు అక్రమార్కులు గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి, సామాన్యుడిని నిలువునా దోచేస్తున్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో గృహ అవసరాల సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో ఏకంగా ₹1,800 కి చేరగా, మధ్యప్రదేశ్లో కమర్షియల్ సిలిండర్ ధర ₹4,000 పలుకుతోంది. ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల ధరల సెగ కంటే ఎలక్ట్రిక్ వంట సురక్షితమని భావిస్తున్న గృహిణులు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు కూడా ఇప్పుడు ఇండక్షన్ కుకింగ్నే ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా..భారత్లోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా ఇండక్షన్ స్టౌల వినియోగం పెరుగుతోంది. ఇంధన భద్రతపై ఆందోళనలు ఉన్న అనేక దేశాల్లో ప్రజలు గ్యాస్ ఆధారిత వంట నుంచి ఎలక్ట్రిక్ వంట వైపు మళ్లుతున్నారు. ఐరోపా దేశాల్లో ఇప్పటికే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించే దిశగా ప్రజలు ఇండక్షన్ స్టౌలను ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ఈ మార్పును మరింత వేగవంతం చేశాయి. ఇతర ఆసియా దేశాల్లోని ప్రజల కూడా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఎలక్ట్రిక్ వంట పరికరాలవైపు దృష్టి సారిస్తున్నారు.పొదుపుతో కూడిన భవిష్యత్తుప్రస్తుతం మార్కెట్లో బేసిక్ ఇండక్షన్ స్టౌలు ₹1,200 నుండి లభిస్తుండగా, అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ కుక్కర్లు ₹14,000 వరకు అమ్ముడవుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్ల వినియోగాన్ని సమయం, డబ్బు ఆదా చేసేదిగా వినియోగదారులు గుర్తిస్తున్నారు. యుద్ధ భయం ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో సంప్రదాయ గ్యాస్ స్టౌల స్థానాన్ని స్మార్ట్ ఎలక్ట్రిక్ పరికరాలు పూర్తిగా ఆక్రమించే అవకాశం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు -
సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్పై అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వాలని విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ (ఓటరు ప్రత్యేక సవరణ)కు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు ఇండియా కూటమి విపక్షాలు ఈ తీర్మానాన్ని ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ అభిశంసన తీర్మానంపై మొత్తం 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ఎన్నికల సంఘం ఏకపక్షంగా విపక్ష పార్టీల ఓటర్లను తొలగిస్తోందని. ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్పై అభిశంసన తీర్మానం విపక్షాల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచింది. ఈ తీర్మానం ద్వారా విపక్షాలు ఎన్నికల సంఘం తీరుపై తమ అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇకపై ఈ అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఎలా ముందుకు సాగుతుందో, ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు మోదీ ఫోన్
ఢిల్లీ:ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తీవ్రతరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధం ఇరు వైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.ఈమేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను’అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగడం భారత్ ప్రాధాన్యతలు. అంతేకాదు, శాంతి, స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమని అన్నట్లు ’ప్రధాని మోదీ తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారి తీసిన నేపథ్యంలో గత 10 రోజుల్లో ప్రధాని మోదీ అనేక పశ్చిమాసియా దేశాల నాయకులతో మాట్లాడారు. గత నెల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తరుణంలో ఇరాన్ ప్రధాని మసూద్ తొలిసారి మాట్లాడారు. తాజాగా మరోసారి మసూద్తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region. Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure. The safety and security of…— Narendra Modi (@narendramodi) March 12, 2026అంతకుముందు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత మార్చి 1న రాస్ తనురా నుంచి ముడి చమురుతో బయలుదేరిన షెన్లాంగ్ సూయెజ్మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులతో హర్మూజ్ సంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీంతో జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ద్రవిడ పాలిటిక్స్లో ఇప్పుడు ‘దళపతి’ విజయ్ రూపంలో ఒక పెను తుపాను ముంచుకొస్తోంది. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘పారావీల్’ తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాలు రాజకీయ విశ్లేషకులనే కాదు, అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లోనూ రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) రాష్ట్రంలో మూడో ప్రధాన శక్తిగా అవతరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.నిర్ణయాత్మక శక్తిగా 13.6 శాతం ఓట్లుపారావీల్ సీఈఓ కిరణ్ కొండేటి విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. విజయ్ పార్టీ ఏకంగా 13.6 శాతం ఓట్ల వాటాను కొల్లగొట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో సుమారు 70.2 లక్షల మంది ఓటర్ల నాడిని సంగ్రహించిన ఈ సర్వేలో తమిళనాట ముక్కోణపు పోటీ అనివార్యమని స్పష్టం అయ్యింది. అధికార డీఎంకే 41.5 శాతం, ఏఐఏడీఎంకే 36.2 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ, టీవీకే సాధిస్తున్న ఈ ఓట్ల శాతం షాకిచ్చేలా ఉంది. ఈ సర్వే ప్రకారం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటును శాసించే ‘కింగ్ మేకర్’ స్థాయికి విజయ్ చేరుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.నవతరం ఓటర్లంతా..ఈ సర్వేలో వెల్లడైన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. యువత, తొలిసారి ఓటు వేస్తున్న నవతరం ఓటర్లంతా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. కేవలం సినిమా అభిమానులే కాకుండా, సాంప్రదాయ రాజకీయాలపై విరక్తి చెందిన విద్యావంతులు, మార్పును కోరుకుంటున్న యువత టీవీకేను తమ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని తేలింది. ముఖ్యంగా చెన్నై లాంటి పట్టణ ప్రాంతాల్లో విజయ్ మేనియా ఏ స్థాయిలో ఉందంటే, కొన్ని సెగ్మెంట్లలో ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీని వెనక్కి నెట్టి టీవీకే రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయమని తెలుస్తోంది.పక్కా వ్యూహం.. క్షేత్రస్థాయి విశ్లేషణకేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో కుల సమీకరణలు, ప్రాంతీయ సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకతను లోతుగా విశ్లేషించారు. దీనిలో దక్షిణాది జిల్లాల నుంచి పశ్చిమ తమిళనాడు వరకు విజయ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తేలింది. సినిమా గ్లామర్ను పొలిటికల్ పవర్గా మార్చడంలో టీవీకే కేడర్ సక్సెస్ అవుతోందని ఈ సర్వే చెబుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల ప్రాధాన్యతలు మారుతుండటం, స్వింగ్ నియోజకవర్గాల్లో టీవీకే పుంజుకోవడం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.వార్ రూమ్ టెక్నాలజీతో..ఎన్నికల కురుక్షేత్రంలో విజయ్ సరికొత్త సాంకేతికతను జోడించబోతున్నారు. పారావీల్ సంస్థ పరిచయం చేస్తున్న ‘వన్ క్యాండిడేట్ - వన్ వార్ రూమ్’ కాన్సెప్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతి అభ్యర్థికి క్షేత్రస్థాయి డేటా విశ్లేషణను అందిస్తూ, గెలుపు గుర్రాలను సిద్ధం చేసే ఈ వ్యూహం పాత తరం రాజకీయ నాయకులకు సవాల్ విసురుతోంది. సంప్రదాయ ప్రచార శైలిని పక్కన పెట్టి, డేటా ఆధారిత వ్యూహాలతో విజయ్ అడుగులు వేస్తుండటం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా నిలిచింది.ద్రవిడ గడ్డపై సరికొత్త చరిత్ర?కరుణానిధి, జయలలిత తదితర రాజకీయ దిగ్గజాల నిష్క్రమణ తర్వాత తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసే సత్తా విజయ్లో ఉందని ఈ సర్వే ఫలితాలు నిరూపిస్తున్నాయి. 13.6 శాతం ఓట్ల వాటా అంటే అది కేవలం సంఖ్య కాదు, తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయగల ఒక బలమైన శక్తి అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే ద్రవిడ కోటలో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు -
నేడే పీఎం కిసాన్ నిధులు విడుదల
నేడు ( శుక్రవారం) 22 వ విడత పీఎం కిసాన్ నిధులను కేంద్రం విడుదల చేయనుంది. అసోంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ నొక్కి వీటి విడుదల చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది ఖాతాల్లో రూ. 18,640 కోట్లు జమకానున్నాయి. కాగా గతేడాది నవంబర్లో కేంద్రం 21వ విడత నిధులను తమిళనాడు వేదికగా విడుదల చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు లబ్ధికోసం ప్రతీ ఏడాది రూ. 6 వేల చొప్పున మూడు విడతలుగా అందిస్తోంది. ప్రతీ ఏడాది తొలి విడత సొమ్మును ఫిబ్రవరిలో జమ చేసేవారు. పీఎం కిసాన్ లబ్దిదారుల రీవెరిఫికేషన్ ప్రక్రియ కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా ఈ సారి 1.30 లక్షల మంది అనర్హులను గుర్తించి వారిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించింది. ఈ ప్రక్రియ వల్లనే నిధుల విడుదలలో జాప్యం జరిగిందని తెలుస్తోంది. -
నౌకా విలాపం..
రణక్షేత్రంలో శత్రుసేన తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తుంటే సైనికుడు రక్షణగా దాక్కోడానికి కందకాల వంటి ఏర్పాట్లు ఉంటాయి. కనీసం కొండప్రాంతాల్లో పెద్దరాళ్ల మాటున నిలబడి ప్రతిదాడి చేయొచ్చు. కానీ సువిశాల సముద్రంలో నిరాయుధంగా వెళ్లే నౌకలకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దాంతో పశ్చిమాసియా యుద్ధంలో ముడి చమురు, సరకు రవాణా నౌకలు సులభంగా చిక్కి శత్రుదాడుల్లో దారుణంగా ధ్వంసమవుతున్నాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా దాడిచేస్తే ఆ తర్వాతి రోజు నుంచే నౌకలపై దాడుల పర్వం మొదలైంది. ఆనాటి నుంచి ప్రతిరోజూ ప్రత్యర్థిదేశ దాడులతో దారుణంగా దెబ్బతింటూ శి«థిలమయమై ఎలాగోలా కొన్ని హార్బర్లకు చేరుకుంటున్నాయి. మరికొన్ని నీటమునిగి సముద్రగర్భానికి చేరుకుంటున్నాయి. మార్చినెల తొలిరోజు నుంచీ దాదాపు 19 నౌకలపై దాడులు జరిగాయి.మార్చి 1: ఒమన్ రాజధాని మస్కట్కు 50 నాటికల్ మైళ్ల దూరంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో వెళ్తున్న చమురునౌక ‘ఎంకేడీ వ్యోమ్’పై దాడి జరిగింది.ఈ ఘటనలో నౌక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ ఖైమా పోర్ట్కు 17 నాటికల్ మైళ్ల దూరంలో గిబ్రాల్టన్ జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ‘హెర్కులస్ స్టార్’పైనా దాడి జరిగింది. ఒమన్లోని కుమ్జార్ సమీప హార్మూజ్ జలసంధిలో పలావూ జెండాతో వెళ్తున్న ట్యాంకర్ ‘స్కైలైట్’మీదా దాడి జరిగింది.మార్చి 2 : బహ్రెయిన్ నౌకాశ్రయంలో అమెరికా జెండాతో నిలిచి ఉన్న సరకుల నౌక ‘స్టెనా ఇంపరేటివ్’పై దాడి జరిగింది. అగ్నికీలలను వెంటనే ఆర్పేశారని యునైటెడ్ కింగ్డమ్ మ్యారటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) తెలిపింది.మార్చి 3 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా పోర్ట్కు 10 నాటికల్ మైళ్ల దూరంలోని మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ ‘లిబ్రా ట్రేడర్’, పనామా జెండాతో ఉన్న చమురు నౌక ‘గోల్డ్ ఓక్’పైనా దాడి జరిగింది.మార్చి 4: ఒమన్కు ఉత్తరాన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మాలీ్టస్ జెండాతో ఉన్న కంటైనర్ నౌక ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’పై దాడి జరిగింది. దీంతో నౌక నుంచి అందరూ సముద్రంలోకి దూకేశారు.మార్చి 5: ఇరాక్లోని ఖోర్ అల్ జుబేర్ పోర్ట్లో లంగరేసిన చమురునౌక ‘సోనాంగోల్ నమీబే’పై దాడి జరిగింది. బహమాస్ జెండాతో వెళ్తున్న మరో నౌకను ఇరాన్ పేలుడుపదార్థాలున్న పడవను రిమోట్ కంట్రోల్తో నియంత్రిస్తూ ఢీకొట్టించింది. దీంతో నౌక ధ్వంసమైంది.మార్చి 6: మార్చి నాలుగోతేదీన ధ్వంసమైన ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’కు మరమ్మత్తులు చేసేందుకు సిబ్బందితో వచ్చిన టగ్బోట్ పైనా దాడి జరిగింది.ఒమన్కు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మార్చి 7: సౌదీ అరేబియాలోని జుబేల్కు ఉత్తరంగా 10 నాటికల్ మైళ్ల దూరంలో మరో నౌకపై దాడి జరిగింది. నౌక అగి్నకి ఆహుతి అవుతుండటంతో సిబ్బంది అంతా సముద్రంలో దూకారు.మార్చి 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయానికి బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘మయూరి నారీ’హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు దానిపై ఇరాన్ దాడి చేసింది. దీంతో నౌక పైభాగంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి 20 మంది సిబ్బందిని ఒమన్ నేవీ కాపాడింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ఖైమా నౌకాశ్రయం నుంచి ఉత్తరంగా 29 నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో జపాన్ జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘వన్ మ్యాజిస్టీ’పైనా ఇరాన్ దాడిచేసింది. దుబాయ్కు ఉత్తరంగా 92 కిలోమీటర్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో మార్షల్ దీవుల జెండాతో వెళ్తున్న ‘స్టార్ గేనిత్’నౌక మీదా ఇరాన్ దాడిచేసిందని నౌకల భద్రతా సంస్థ వ్యాన్గార్డ్ ప్రకటించింది.మార్చి 12: ఇరాక్లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో భారతీయుడు చనిపోయారు. మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక పై ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఈసీని తొలగించాలంటూ నోటీసు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు.. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) తొలగింపునకు సైతం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్కుమార్ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు సిద్ధం చేసిన నోటీసుపై మొత్తం 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో 130 మంది లోక్సభ సభ్యులు కాగా, 63 మంది రాజ్యసభ ఎంపీలని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఈ నోటీసును లోక్సభకు లేదా రాజ్యసభ చైర్మన్కు అందజేసే అవకాశాలున్నాయంటున్నారు.ముందుగా ఎవరికి ఇచ్చేదీ స్పష్టం కావాల్సి ఉంది. సీఈసీ తొలగింపు కోరుతూ ఇవ్వనున్న నోటీసుపై సంతకాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎంపీలు ముందుకు వచ్చారని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. నోటీసుకు అవసరమైన సంఖ్యలో సంతకాలను ఇప్పటికే సేకరించినప్పటికీ, గురువారం కూడా ఎంపీలు కొందరు ఆసక్తి కనబరిచారన్నారు. సీఈసీ తొలగింపును కోరాలంటే లోక్సభలో కనీసం 100 మంది, అదే రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు సంతకాలు చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్య పారీ్టలతోపాటు, అధికారికంగా ఆ కూటమిలో చేరని ఆప్కు చెందిన ఎంపీలు కూడా నోటీసుపై సంతకాలు చేశారని ఆ నేత వివరించారు. ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విషయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అధికార పక్షానికి అనుకూలంగా, వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుపై జరిగే విచారణను ఆయన అడ్డుకుంటున్నారంటున్నాయి. కాగా, సీఈసీని తొలగించాలంటూ పార్లమెంట్లో నోటీసు జారీ చేయనుండటం ఇదే మొదటిసారి కానుంది. తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే, సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీ (50% కంటే ఎక్కువ) ఉండటంతో పాటు, ఆ సమయంలో సభకు హాజరై ఓటేసిన వారిలో రెండింట మూడొంతుల మెజారిటీ తప్పనిసరి. -
ఇంధన కొరత లేదు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మనదేశంలో ఇంధన కొరత ఎంతమాత్రం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బైన్ ఇంధన నిల్వలు సరిపడా ఉన్నట్లు తెలిపారు. ఇంధనం విషయంలో ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇంధన కొరత గురించి ప్రస్తావించారు. దీనిపై హర్దీప్సింగ్ పురి సమాధానం ఇచ్చారు. దేశంలోని 33 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా పేద కటుంబాలకు ఎలాంటి కొరత రానివ్వబోమని ప్రకటించారు.దేశీయ సరఫరా వ్యవస్థను పరిరక్షిస్తామన్నారు. అన్ని రకాల ఇంధనం విషయంలో రిటైల్ ఔట్లెట్ల వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. సప్లై చైన్స్ యథాతథంగా పని చేస్తున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు అదనంగా కిరోసిన్ కేటాయిస్తున్నా మని తెలిపారు. ఇంధన సరఫరాలో సంక్షోభం ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని హర్దీప్సింగ్ పురి స్పష్టంచేశారు.ఎల్పీజీ ఉత్పత్తిని 28% పెంచినట్లు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలను బట్టి చూస్తే మన దేశంలో ఇంధనం ధరలు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. హార్మూజ్ జలసంధిలో చమురు రవాణా ఆగిపోయినప్పటికీ ఇతర దేశాల నుంచి మనకు ముడి చమురు అందుతూ నే ఉందని గుర్తుచేశారు. 2006–07లో కేవలం 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నామని, ప్రస్తుతం 40 దేశాల నుంచి దిగుమ తి చేసుకుంటున్నామని తెలియజేశారు. మోదీ దౌత్య నీతి వల్లే ముడి చమురు విషయంలో ఆటంకాలు లేకుండాపోయాయని మంత్రి ఉద్ఘాటించారు. -
రెండు నౌకలపై ఇరాన్ దాడి
న్యూఢిల్లీ: తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం దీటుగా స్పందిస్తూ అమెరికా తదితర ఇతర దేశాల నౌకలపై దాడులుచేస్తోంది. బుధవారం రాత్రి ఇరాక్లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. అతడిని భారతీయునిగా గుర్తించామని ఇరాక్లోని భారతీయ రాయబార కార్యాలయం గురువారం తమ సామాజికమాధ్య ఖాతాలో ఒక పోస్ట్పెట్టింది. అతని స్వరాష్ట్రం, కుటుంబం వంటి ఇతర వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు. మంటల్లో చిక్కుకున్న ఆ నౌక నుంచి 27 మంది సిబ్బందిని ఎలాగోలా కాపాడారు.గాయపడిన వారిని సమీపంలోని బస్రా నగరంలోని ఆస్పత్రిలో చేరి్పంచి వైద్యం అందిస్తున్నారు. నౌకలోని 27 మంది సిబ్బందిలో 15 మంది భారతీయులేనని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఈ నౌకతోపాటు సమీపంలోని మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక మీదా ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. పేలుడుపదార్థాలతో దూసుకొచ్చి సూసైడ్ బోట్లు ఢీకొనడంతో పేలుళ్లు జరిగి సేఫ్సీ విష్ణు, జిఫిరోస్ నౌకలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.ఈ రెండు నౌకలు మొత్తంగా 4,00,000 బ్యారెళ్ల ముడిచమురును ఇరాక్ నుంచి తీసుకొస్తున్నట్లు షిప్ల ట్రాకింగ్ వెబ్సైట్ అయిన ‘ట్యాంకర్ట్రాకర్స్.కామ్’వెల్లడించింది. అమెరికాకు చెందిన సేఫ్సీ ట్రాన్స్పోర్ట్ ఐఎన్సీ సంస్థ ‘సేఫ్సీ విష్ణు’నౌకను నిర్వహిస్తోంది. 228.6 మీటర్ల పొడవు, 32.57 మీటర్ల వెడల్పయిన సేఫ్సీ విష్ణు నౌకను 2007లో తయారుచేశారు. గరిష్టంగా దాదాపు 74,000 టన్నుల బరువైన సరకులను ఇది మోసుకెళ్లగలదు. జిఫిరోస్ను గ్రీస్కు చెందిన సంస్థ నిర్వహిస్తోంది. -
సాహసోపేతంగా... ముంబైకి చేరుకున్నషెన్లాంగ్ నౌక
ముంబై: సంకల్పంతో ముందుకెళితే మార్గమధ్యంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు సరైన వ్యూహాలు అక్కరకొస్తాయంటారు. శత్రు నౌకలు, జలాంతర్గాముల సంచారాలను అడ్డుకునే సముద్ర మందుపాతరలైన ‘సీమైన్స్’ను హార్మూజ్ జలసంధిలో అక్కడక్కడా ఇరాన్ ఏర్పాటుచేసినా సరే దృఢనిశ్చయంతో అదే మార్గంలో ప్రయాణించి ముడి చమురునౌక షెన్లాంగ్ సూయిజ్మ్యాక్స్ సాహసోపేత యాత్రను పూర్తిచేసింది.పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ జలసంధి గుండా ఎలాంటి దాడుల బారిన పడకుండా సురక్షితంగా ముంబై చేరుకున్న తొలి నౌకగా షెన్లాంగ్ సూయిజ్మ్యాక్స్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. బుధవారమే నౌక ముంబైకి చేరుకున్నప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక మార్చినెల ఒకటో తేదీన సౌదీ అరేబీచియాలోని రాస్ తనూరా నౌకాశ్రయంలో ఏకంగా 1,35,335 మెట్రిక్ టన్నుల ముడిచమురును నింపుకుంది. మార్చి మూడో తేదీన అక్కడి నుంచి బయల్దేరి క్షేమంగా ముంబై పోర్ట్కు చేరుకుంది.ఏమాత్రం అనుమానం రాకుండా..అంతర్జాతీయ సముద్రజలాల గుండా వెళ్లే ముడి చమురు, సరకు రవాణా నౌకలు పొరపాటున ఎదురెదురుగా రాకుండా, ఢీకొనకుండా ఉండేందుకు వాటి స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో తెల్సుకునేందుకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఉపయోగిస్తుంటారు. దీని సాయంతో నౌక ఎక్కడ, ఎంత వేగంతో, ఏ దిశలో వెళ్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. దీని సాయంతో నౌకల గుట్టుమట్లను ఇరాన్ తెల్సుకుని నౌకల మీదకు ఆత్మాహుతి డ్రోన్ లేదా క్షిపణులను ప్రయోగించే ప్రమాదముంది. వాటితోనూ పనిలేకుండా సీమైన్స్నూ అక్కడక్కడా అమర్చింది. ఈ ఆటంకాలను అధిగమించేందుకు షెన్లాంగ్ నౌక కెపె్టన్, భారతీయుడు సుఖ్శాంత్ సింగ్ సంధూ బృందం నౌకాయాన విధానమైన ‘డార్క్మోడ్’టెక్నిక్ను అవలంభించారు.నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఏఎస్ఐ) వివరాలు ఎక్కడా ట్రాకింగ్ డేటాలో నమోదుకాకుండా ఉండేందుకు ఏఐఎస్ను స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఫలానా చోట నౌక ఉంది అనే విషయం ఇరాన్కు తెలీకుండా పోయింది. హార్మూజ్ జలసంధిలోకి షెన్లాంగ్ నౌక ప్రవేశించగానే దాని సిగ్నళ్లు ఆర్పేశారు. దీనికి తోడు నౌకలోని అన్ని విద్యుత్దీపాలను ఆర్పేశారు. నౌక సిగ్నళ్లు చివరిసారిగా మార్చి 9వ తేదీన కన్పించాయి. తర్వాత నౌక పత్తాలేకుండా పోయింది. దాడులకు గురై మునిగిపోయిందేమోననే భయాందోళనల నడుమ అనూహ్యంగా నౌక హార్మూజ్ను దాటింది. తర్వాత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను స్విచ్ఆన్ చేశారు. దీంతో నౌక క్షేమంగా గమ్యం దిశగా వస్తోందని అర్థమైంది.బుధవారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు ఇది ముంబై పోర్ట్కు చేరుకుంది. తర్వాత జవహర్ ద్వీప్ వద్ద సాయంత్రం 6.06 గంటలకు లంగరువేసింది. గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరానికి చెందిన డైనాకామ్ ట్యాంకర్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ ఈ నౌకను నిర్వహిస్తోంది. ఈ నౌకలో 29 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశస్తులు ఉన్నారు. డార్క్మోడ్ విధానంలో మరో ఐదు నౌకలు తమ గమ్యస్థానాల దిశగా కదిలే ఆస్కారముందని నౌకల ప్రయాణాలను పర్యవేక్షించే ‘ట్యాంకర్ట్రాకర్స్.కామ్’సంస్థ పేర్కొంది. రెండు భారీ చమురు రవాణా నౌకలు, పనామా కాలువలో పట్టే మరో పనామామ్యాక్స్ ట్యాంకర్ నౌక, సూయిజ్కాలువలో పట్టే రెండు సూయిజ్మ్యాక్స్ ట్యాంకర్నౌకల జాడ సైతం గత 48 గంటలుగా కన్పించట్లేదని ఇవి కూడా డార్క్మోడ్లో సముద్రయానం చేస్తుండే అవకాశముందని సంస్థ అంచనావేస్తోంది. -
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇంధన కొరతతో హోటళ్ల మూసివేతలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. కొంత మొత్తంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తామని తెలిపింది. లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది.అంతేకాదు, ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు అదనంగా 40,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు కూడా చేశామని తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రోజూ దాదాపు 50 లక్షల సిలిండర్ల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఎక్కడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.కానీ భయాందోళనల కారణంగా బుకింగ్లు అనేక రెట్లు పెరిగాయని సుజాత శర్మ చెప్పారు. భయంతో బుకింగ్ చేయవద్దని పౌరులను కోరారు. ప్రాధాన్యం ఆధారంగా కమర్షియల్ సిలిండర్లు పంపిణీ జరిగేందుకు లబ్ధిదారుల జాబితా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన పంపినట్టు తెలిపారు.ప్రతి త్రైమాసికంలో రాష్ట్రాలకు దాదాపు లక్ష కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపును ప్రభుత్వం చేస్తుందని ఆమె తెలిపారు. ఇవాళ ఉత్తర్వు విడుదల చేసి మరో 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.ఇప్పుడు ఎల్పీజీ ఉత్పత్తి 28 శాతానికి పెరిగిందని శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ రిటైల్ అవుట్లెట్ నెట్వర్క్ ఉందని చెప్పారు. దాదాపు లక్ష రిటైల్ అవుట్లెట్లు దేశంలో పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం ప్రజా రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధీనంలో ఉన్నాయని చెప్పారు. ఏ రిటైల్ అవుట్లెట్ వద్ద కూడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.భయంతో సిలిండర్ బుకింగ్లుఎల్పీజీ కొరతపై భయాందోళనలు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. వినియోగదారులు భయంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి సిలిండర్లు బుక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయ ప్రయత్నాలు అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు, గ్యాస్ కొరత కారణంగా దేశంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూసేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. దేశంలో ఇంధన కొరత లేదని ఇవాళ లోక్సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. -
లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!
మహా కుంభమేళా 2025లో పూసల దండలు అమ్ముకుంటూ ఫ్యామస్ అయిన మోనాలీసా భోంస్లే (Monalisa Bhosle) మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రియుడు నటుడు ఫర్మాన్ ఖాన్ పెళ్లాడి ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే ఈ పెళ్లి 'లవ్ జిహాద్' నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీనిపై ఈ జంట వివరణ ఇచ్చారు. గురువారం (మార్చి 12, 2026) తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ పెళ్లిపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.తాము తమ మతాలు మార్చుకోలేదని మోనాలీసా స్పష్టం చేసింది. తాను హిందువుగా, తన భర్త ముస్లింగానే కొనసాగుతామని మోనాలీసా వివరించింది. అలాగే 'లవ్ జిహాద్' ఆరోపణలను కూడా ఆమె తోసిపుచ్చింది. ఈ వివాహం తన సొంత నిర్ణయమని తేల్చి చెప్పింది. తన తండ్రి తనతో పాటు కేరళకు వచ్చినప్పటికీ, ఈ పెళ్లి పట్ల ఆయన ఇంకా అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఆయనను ఒప్పించు కోగలననే ధీమా వ్యక్తం చేసింది. తన అత్త కొడుకుతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారని, కానీ తనకు ఇష్టం లేక ఫర్మాన్ ఖాన్ను ఎంచుకున్నానని ఆమె చెప్పారు.తల్లి దండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన తమ మతాంతర వివాహానికి సంబంధించి విమర్శలపై స్పష్టత ఇస్తూ "ప్రేమలో మత మార్పిడి అవసరం లేదు" అని ఫర్మాన్ ఖాన్ ( Farman Khan)పేర్కొన్నాడు.. అలాగే మోనాలీసా మైనర్ అంటూ వస్తున్న వార్తలను ఫర్మాన్ ఖాన్ ఖండించారు. ఆమె ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను మీడియాకు చూపించారు. మోనాలిసా కోరుకున్న విధంగా ఆచారాలను అనుసరించడానికి తాను అంగీకరించాననీ, ఎందుకంటే ఆమె ఆనందాన్నే తన ఆనందమని చెప్పు కొచ్చాడు. ఈ సందర్భంగా తమకు కేరళ ప్రజల మద్దతు లభించడం సంతోషమని,మోనాలీసాకు ఇష్టమైతే అక్కడే స్థిరపడతా మన్నాడు.ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాకు చెందిన ఖాన్, ఇండోర్ నివాసి మోనాలీసా వివాహం కేరళలోని ఒక ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కేరళ ప్రభుత్వానికి చెందిన K-SMART యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా నమోదైంది. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ లాంటి ప్రముఖ రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇందులో ఫర్మాన్ ఖాన్ విలన్గా, మోనాలీసా హీరోయిన్గా నటిస్తున్నారు. -
చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఎల్పీజీ సిలిండర్లపై ఏర్పడిన సంక్షోభంపై లోక్సభలో దుమారం రేగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. గ్యాస్ సంక్షోభంతో దేశం అల్లాడిపోతోందంటూ ఆరోపించారు. దీంతో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి. హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) వివరణ వచ్చారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఆందోళన అవసరం లేదని తెలిపారు. గృహాసరాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆసుపత్రులు , విద్యా సంస్థలకు ఆటంకం లేకుండా సరఫరా చేస్తామని మంత్రి అన్నారు. గ్యాస్ సరఫరాపై రాష్ట్రాలకు ఎప్పటికపుడు సూచనలి స్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. విపక్షాల ఆందోళన మధ్యే మంత్రి ఈ వివరణ ఇచ్చారు. వదంతలను వ్యాప్తి చేయడానికి ఇది సమయం కాదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. దేశంలో డీజిల్, పెట్రోల్ లేదా కిరోసిన్ కొరత లేదని హామీ ఇచ్చారు. సరఫరా గొలుసులు సజావుగా పనిచేస్తున్నాయన్నారు.మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంధన సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఉందని కానీ, భారతదేశ ముడి చమురు సరఫరా స్థానం సురక్షితంగా ఉందని, హార్ముజ్ అందించే దానికంటే ఎక్కువ పరిమాణంలో లభించిందని చెప్పారు.90 మిలియన్ల మెట్రిక్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. గల్భ్కు బదులుగా నార్వే కెనడా నుంచి దిగుమతికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. ఇంధన సరఫరాను నిర్ధారించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నా యన్నారు.ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ఉన్నప్పటికీ భారతదేశ ముడి చమురు సరఫరాకు ఇబ్బంది లేదని చెప్పారు.కొన్ని ప్రాంతాలలో కనిపించే ఒత్తిడి ఏదైనా ఉత్పత్తి లేదా సరఫరా వైఫల్యం వల్ల కాదని, తాత్కాలిక డిమాండ్ కారణంగా ఉందని పూరి అన్నారు.LPG వినియోగదారులకు డెలివరీ ప్రామాణీకరణ కోడ్ కవరేజీని 50శాతం నుండి 90శాతానికి విస్తరిస్తున్నా మని, దీని కింద వినియోగదారు OTP నిర్ధారణ తర్వాత మాత్రమే సిలిండర్ డెలివరీ అయినట్లు గుర్తిస్తామని ఇది మళ్లింపు అవకాశాలను తగ్గిస్తుందని ఆయన సభకు తెలియజేశారు. బుకింగ్-టు-డెలివరీ చక్రం దాదాపు 2.5 రోజులు కొనసాగుతుందని, సిలిండర్ల బుకింగ్ , సరఫరా పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు , గ్రామీణ, ప్రాంతాలలో 45 రోజుల గ్యాప్ ఉంటుందని ఆయన అన్నారు.కాగా గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ విపక్షాలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏ దేశానికైనా ఇంధన భద్రత ప్రాథమికమని నొక్కి చెబుతూ, భారతదేశం తన గ్యాస్ను ఎక్కడి నుండి కొనుగోలు చేస్తుందనే దానిపై నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అమెరికాను ఎందుకు అనుమతించాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పుడు విదేశాంగ విధానాల కారణంగా గ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాల విషయంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కోబోతోందని హెచ్చరించారు.ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికన్-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ప్రారంభమైన ఈ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చమురు సరఫరాను, ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. -
యుద్ధం వేళ.. ఇరాన్తో చర్చించిన భారత్
న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు పెరుగుతున్న వేళ ఇరాన్తో నౌకాయాన భద్రతపై భారత్ చర్చించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాయాన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీపై చర్చించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న పరిస్థితి, సముద్ర రవాణాకు ప్రమాదాలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగాయి. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించటం, చమురు సరఫరా స్థిరంగా కొనసాగటం వంటి అంశాలపై కేంద్రీకృతమైందని ఈ చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిది రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు.ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పలుసార్లు సంప్రదింపులు జరిపారని జైస్వాల్ తెలిపారు. “గత కొన్ని రోజుల్లో భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య పలుసార్లు సంభాషణ జరిగింది. చివరిసారిగా జరిపిన చర్చలో నౌకాయాన భద్రత, భారత ఎనర్జీ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చించాం. ఇంకా మేము ఏమి చెప్పినా తొందరపాటే అవుతుంది” అని తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం వేళ హోర్ముజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇటీవలి జరిగిన దాడుల్లో పలు నౌకలు దెబ్బతినడంతో ప్రపంచ నౌకాయాన వ్యవస్థ, ఎనర్జీ సరఫరాపై అంతరాయాలు కలుగుతున్నాయి.మరోవైపు, ఇవాళ సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌక ముంబై చేరుకుంది. లైబీరియాకు చెందిన నౌకలో క్రూడాయిల్ దిగుమతి అయింది. యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటిన మొదటి నౌక ఇదే. 1.35 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి అయింది. -
ఖాళీ సిలిండర్ల కామెడీ.. ‘మీమ్స్’ మహోత్సవం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన ఆటంకాలు సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిలిండర్ బుక్ చేశాక రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడంతో, వినియోగదారులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే ఈ పరిస్థితులను కొందరు తమదైన శైలిలో హాస్యంగా మలుస్తున్నారు. గ్యాస్ కష్టాలపై సోషల్ మీడియా వేదికగా షేర్ అవుతున్న ‘మీమ్స్’ ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి.‘ఉత్తుత్తి’ వంటలు.. వివిధ విన్యాసాలుపశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఇదే తరుణంలో నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ‘ఖాళీ సిలిండర్లు - నిండుగా కామెడీ’ అన్నట్లుగా పరిస్థితి మారింది. స్టవ్ మీద వంట చేస్తున్నట్లు నటిస్తూ, ‘ఇది ఊహాజనిత గ్యాస్’ అని పేర్కొనే వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు.. మళ్లీ పాతకాలం నాటి కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నట్లుందని అంటున్నారు.గ్యాస్ అప్పు ఇస్తారా?గతంలో ఇరుగుపొరుగు వారి వద్ద చక్కెర, పాలు అప్పుగా తీసుకునేవారమని, ఇప్పుడు గ్యాస్ అప్పు ఇస్తారా? అని అడిగే రోజులు వచ్చాయంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సిలిండర్లను బంగారు ఆభరణాల్లాగా దాచుకోవడం, వాటికి సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవడం వంటి మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. కేవలం గృహ అవసరాలకే కాకుండా, వాణిజ్య రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు 8 శాతం పెరగడంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ భారంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతినవచ్చనే భయంతో చాలామంది ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కృత్రిమ కొరతకు కూడా దారితీస్తోంది.పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాలతో చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ భరోసా ఇస్తున్నప్పటికీ, అంతటా పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ఎల్పీజీ కష్టాలకు త్వరలో విముక్తి: మంత్రి సురేష్ గోపి -
ఎల్పీజీ కష్టాలకు త్వరలో విముక్తి: మంత్రి సురేష్ గోపి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న ఎల్పీజీ (వంటగ్యాస్) కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టింది. ‘హోర్ముజ్ జలసంధి’ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అవరోధాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలలో గ్యాస్ దిగుమతులను పునరుద్ధరించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు.గురువారం ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. త్వరలోనే గ్యాస్ కొరత సమస్య ఒక కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ బుధవారం పార్లమెంటులో వివరణ ఇచ్చారని సురేష్ గోపి తెలిపారు. జలసంధి వద్ద నెలకొన్న దౌత్యపరమైన సున్నిత అంశాల దృష్ట్యా, అన్ని వివరాలను బహిర్గతం చేయలేమని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వివిధ దేశాధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చల ఫలితంగా కొత్త సరఫరా మార్గాలు తెరుచుకుంటున్నాయని, త్వరలోనే అదనపు నిల్వలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.ఆస్పత్రులు, శ్మశాన వాటికలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశీయంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అయితే అంతర్జాతీయంగా సరఫరాలో తలెత్తే సాంకేతిక అంశాలపై మనకు పూర్తి నియంత్రణ ఉండదని ఆయన స్పష్టం చేశారు. కేరళ సహా పలు రాష్ట్రాల్లో హోటళ్లు మూతపడటం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితులపై ఆయన విచారం వ్యక్తం చేశారు.గ్యాస్ ధరల నియంత్రణకు సంబంధించి ఇప్పటికే పటిష్టమైన యంత్రాంగం అమల్లో ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలైన పెట్రోలియం కంపెనీలే ధరల నిర్ణయాధికారాన్ని కలిగి ఉన్నాయని మంత్రి తెలిపారు. హోర్ముజ్ జలసంధి మన ఇంధన భద్రతకు అత్యంత కీలకమైనప్పటికీ, కేవలం ఇంధనం కోసం యుద్ధానికి వెళ్లడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలనేది భారత విధానమని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: పార్లమెంట్: ఎల్పీజీ కొరతపై దద్దరిల్లిన ఉభయ సభలు -
పార్లమెంట్: ఎల్పీజీ కొరతపై దద్దరిల్లిన ఉభయ సభలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ (వంటగ్యాస్) సిలిండర్ల తీవ్ర కొరత, పెరుగుతున్న ధరలపై గురువారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. పెరుగుతున్న సామాన్యుడి కష్టాలపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు నిరసన గళం విప్పగా, మరోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు దారితీసి, తీవ్ర వాగ్వాదాల మధ్య వీగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే దేశంలో ఇంధన సంక్షోభం ముదిరిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.Lok Sabha Speaker Om Birla returns to the Chair after the no-confidence motion against him moved by the Opposition was rejected yesterday.He says, "On the two-day discussion which was held, I will also present my view. Lok Sabha is adjourned till noon today." pic.twitter.com/X33hpaULDs— ANI (@ANI) March 12, 2026‘హోర్ముజ్ జలసంధి దిగ్బంధం వల్ల ఖతార్, అబుదాబి నుంచి రావాల్సిన చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోయాయి. ఈ యుద్ధం ముంచుకొస్తుందని తెలిసినా ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయని, గృహ అవసరాల సిలిండర్ కోసం 25 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నోట్ల రద్దు, కరోనా సమయాల్లోనూ ప్రభుత్వం ఇలాగే బుకాయించిందని, ఇప్పుడు కూడా అదే బాటలో సాగుతోందని విమర్శించారు. VIDEO | Parliament session: Lok Sabha Leader of Opposition Rahul Gandhi on the reported LPG crisis says, “The Prime Minister says there is no need to panic. But he himself appears panicked for completely different reasons. You saw yesterday that the Prime Minister’s chair inside… pic.twitter.com/lA7pVRFqlv— Press Trust of India (@PTI_News) March 12, 2026కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా, యుద్ధ ప్రభావం వల్ల 60 వేల టన్నుల బాస్మతీ ఎగుమతులు నిలిచిపోయాయని, మందుల తయారీకి వాడే ముడిపదార్థాల ధరలు 30 శాతం పెరగడంతో సామాన్యునికి వైద్యం భారమైందని విపక్షాలు ఆరోపించాయి. వస్త్ర, విమానయాన, ఉక్కు, ఆటోమొబైల్ రంగాలు కుదేలవుతున్నాయని ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు వెలుపల మీడియాతో పేర్కొన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ఇదిలావుండగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని 118 మంది ఎంపీలు ఇచ్చిన నోటీసుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. నాలుగు దశాబ్దాల తర్వాత స్పీకర్పై ఇలాంటి తీర్మానం రావడం దురదృష్టకరమన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. "సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసేవారు.. సభకు ఎంతసేపు వస్తున్నారో చూసుకోవాలి. జాతీయ సగటు హాజరు 80 శాతం ఉంటే, ఆయన హాజరు 43-51 శాతమే ఉంది’ అని ఎద్దేవా చేశారు.రైతులకు నష్టం జరుగుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన షా.. 2013 నాటి డబ్ల్యూటీవో ఒప్పందాలే ప్రస్తుత సమస్యలకు మూలమని అన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం, జగదాంబికా పాల్ అధ్యక్షతన జరిగిన ఓటింగ్లో స్పీకర్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. అయితే, హోంమంత్రి వాడిన కొన్ని పదాలు అసందర్భంగా ఉన్నాయని విపక్షాలు ఆరోపించగా, సభాపతి వాటిని రికార్డుల నుంచి తొలగించారు. యుద్ధం ముగిసే వరకు ఇంధన భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని విపక్షాలు పట్టుబట్టాయి.ఇది కూడా చదవండి: మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు -
ఇరాన్ యుద్ధం-ఎల్పీజీ సంక్షోభం, పరిస్థితి ఇదీ!
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలో ఎల్పీజీ (LPG) సరఫరా,నిల్వలపై ప్రభావం పడింది. విదేశాల నుంచి ఎల్పీజీ సరఫరా నిలిపివేతతో భారతదేశంలో సంక్షోభం తలెత్తింది. ఫలితంగా వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. భయపడుతున్నట్టుగానే ఇరాన్యుద్ధం ప్రభావం వంటగదిలోకి వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ముందస్తుగా వంట సిలిండర్లను బుక్ చేసేసుకున్నారు. దీంతో సిలిండర్ బుక్ చేస్తో వస్తుందో రాదో తెలియని గందరగోళ పరిస్థితి మరికొంతమందిది. దేశవ్యాప్తంగా వినియోగ దారులు ఎల్పీజీ ఏజెన్సీల భారీగా క్యూ కట్టారు ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ నిల్వల ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు సరిపడా నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం వంటగ్యాస్ను ఎక్కడ తెస్తుంది లాంటి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. భారతదేశానికి సంవత్సరానికి 33 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పిజి అవసరం. దేశీయ గ్యాస్ సిలిండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం 235 కోట్ల సిలిండర్లు. అంటే రోజుకు 64 లక్షల సిలిండర్లు అవసరం.వీటిలో 88శాతం గృహాలలో ఉపయోగిస్తారు. మిగిలిన 12శాతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లే. అంటే అంటే హోటళ్ళు, రెస్టారెంట్లు, పరిశ్రమలు మొదలై వాణిజ్య అవసరాలకు వినియోగించేవి. భారతదేశం తన వినియోగ ఎల్పిజిలో 60 శాతం విదేశాల నుండి కొనుగోలు చేస్తుంది. మిగిలినవి భారతీయ రిఫైనరీలలో తయారవుతాయి.అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం దేశంలో పరిస్థితిమధ్యప్రదేశ్: వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల హోటల్-రెస్టారెంట్ సమస్యలను ఎదుర్కొంటోంది. వంట గ్యాస్ సిలిండర్ల కోసం పెద్ద ఎత్తున క్యూలు, ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది అత్యవసర పరిస్థితి అని క్యాటరర్లు అంటున్నారు.రాజస్థాన్: వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. జైపూర్లో 1911 రూపాయలకు అందుబాటులో ఉన్న సిలిండర్ను 2500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.ఉత్తర ప్రదేశ్: 4-5 రోజుల బుకింగ్ తర్వాత కూడా సిలిండర్లు అందుబాటులో లేవు. గ్యాస్ ఏజెన్సీల వెలుపల వినియోగదారులు బారులుతీరారు. గోరఖ్ పూర్-సిద్ధార్థ్ నగర్ లో పోలీసు రక్షణ కింద సిలిండర్లను పంపిణీ చేస్తున్నారంటేనే పరిస్థితితీవ్రతను అర్థం చేసుకోవచ్చు.బిహార్: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల బుకింగ్ 3 రోజులు పాటు నిలిపివేశారు. దీంతో హోటల్, హోటల్స్ పై దాడి చేశారు. దేశీయ గ్యాస్ ఏజెన్సీలు మూసివేయబడతాయి లేదా పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి.పంజాబ్: లుధియానా, ఫరీద్కోట్ లలో సర్వర్ కారణంగా దేశీయ సిలిండర్లు కూడా బుక్ కావడం లేదు. అనేక జిల్లాల్లో గత 3 రోజులుగా వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది.ముంబై-పుణెః గ్యాస్ కొరత కారణంగా సుమారు 20శాతం హోటళ్ళు , రెస్టారెంట్లు మూసివేశారు. లేదా పాక్షికంగా నడుస్తున్నాయి. కేవలం టీ, కాఫీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.బెంగళూరు-హైదరాబాద్ః 2-3 రోజులు వాణిజ్య సిలిండర్ల డెలివరీని తమకు అందలేదని రెస్టారెంట్లు ఫిర్యాదు చేశాయి. కొన్ని చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా ప్రారంభమైంది.దేశీయ ఉత్పత్తి పెంపు: దిగుమతులకు అంతరాయం కలగడంతో, ప్రభుత్వం ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించి రిఫైనరీలలో ఎల్పీజీ ఉత్పత్తిని 25శాతం వరకు పెంచాలని ఆదేశించింది. దీనికోసం ఇతర అవసరాలకు వాడే ప్రోపేన్, బ్యూటేన్ వాయువులను ఎల్పీజీ తయారీకి మళ్లిస్తున్నారు.ఎందుకీ సంక్షోభంహోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగాభారతదేశానికి వచ్చే ఎల్పీజీ దిగుమతుల్లో దాదాపు 60శాతం గల్ఫ్ దేశాల నుండే వస్తాయి. అందులోనూ 90శాతం దిగుమతులు ఇరాన్ పక్కనే ఉండే 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) ద్వారానే రావాలి. యుద్ధం వల్ల ఈ మార్గం మూతపడటం సరఫరాకు ప్రధాన అడ్డంకిగా మారింది.భారత్ మొత్తం అవసరంలో దాదాపు 60శాతం ఎల్పీజీని దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈల నుండే ఉంటుంది.ప్రభుత్వం తీసుకున్న చర్యలు యుద్ధం వల్ల గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా, అల్జీరియా, కెనడా వంటి దేశాల నుండి గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు చర్చలు జరుగు తున్నాయి.ప్రాధాన్యత కేటాయింపు: వంట గ్యాస్ (Domestic LPG), సీఎన్జీ (CNG), పైపుల ద్వారా వచ్చే గ్యాస్ (PNG) సరఫరాకు 100శాతం ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆందోళన అవసరం లేదని ప్రకటించింది. అంటే కమర్షియల్ సిలిండర్లపై పరిమితులతో, ముందుగా ఇళ్లకు సరఫరా చేశాకే, మిగిలిన గ్యాస్ను పరిశ్రమలకు ఇస్తారు. ఆ తరువాతే హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య విభాగాలకు సరఫరా ఉంటుంది. దీనివల్ల బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో హోటళ్లు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది.బుకింగ్ నియమాలు: గ్యాస్ హోర్డింగ్ (నిల్వ చేయడం) అరికట్టడానికి, సిలిండర్ బుకింగ్ గ్యాప్ను 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారు.ప్యానిక్ కావద్దు, ప్యానిక్ బుకింగ్లు నివారించండి!ఎల్పీజీ డీలర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పీవీ రావు సాక్షి వెబ్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. భారతదేశంలో సాధారణంగా ప్రతీసారి నెలకు సరిపడా నిల్వ ఉంటుంది. ఆందోళన అవసరం లేదన్నారు. యుద్ధ వాతావరణానికి ఆధారంగా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందిని చెప్పారు. అలాగే ఈ సంక్షోభాన్ని నివారించే చర్యల్లో భాగంగా వినియోగదారులకు 25 రోజుల తర్వాత మాత్రమే రెండో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తద్వారా సరఫరా సరళీకరణ చేయాలనేది తమ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఈ విషయంలో వినియోగదారులు సహకరించాలని కోరారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు. అలాగే వాణిజ్య సిలిండర్ల విషయంలో కూడా కొన్ని మార్గ నిర్దేశకాలను కూడా ఆయన సూచించారు. పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటేయుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఎల్పీజీ ధరలపై భారం పడిందిడొమెస్టిక్ సిలిండర్ ధర సుమారు రూ.60 పెరిగిందికమర్షియల్ సిలిండర్ ధర రూ.115 వరకు పెరిగింది. -
విజయ్ వైపు.. ఆ ముగ్గురి చూపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో చేరే పార్టీల జాబితా దాదాపుగా ఖరారైంది. అయితే టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన పిలుపునకు ఎట్టకేలకు ముగ్గురు స్పందించారు. ఈ ముగ్గురి విజయ్తో కలిసి మెగా కూటమి దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. డీఎంకే మెగా కూటమి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఏఏ పారీ్టలు ఉన్నాయో దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే. ఇక, అన్నాడీఎంకే– బీజేపీ కూటమిలోనూ అదే పరిస్థితి. కాగా సంకీర్ణ ధర్మం మేరకు పాలనలోనూ భాగస్వామ్యం అన్న నినాదంతో తనతో కలిసి వచ్చేవారికి అధికారంలో వాటా ఇస్తానన్న విజయ్ వైపుగా ఇంత వరకు ఎవ్వరూ దృష్టి పెట్ట లేదు. చివరకు ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్కు మరింత బలాన్ని ఇచ్చేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఓ వైపు ,దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ మరోవైపు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో చేరిన దృష్ట్యా, డీఎంకేలో తమకు అవకాశం లేక పోవడంతో ఇక విజయ్ పక్షాన నిలబడేందుకు రాజకీయ అనుభవజు్ఞడైన రాందాసు నిర్ణయించి, అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ సైతం రాందాసు పిలుపునకు స్పందించినట్టు ప్రచారం. రహస్యంగా చర్చలు.. ఈ ప్రచారానికి అద్దం పట్టే విధంగా ఆమె మంగళవారం రాత్రి తైలాపురంలో రాందాసుతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. తనకు వెన్నుపోటు పొడిచిన పళణిస్వామి, టీటీవీ దినకరన్కు గట్టిగా బుద్ది చెప్పే రీతిలో అన్నాడీఎంకే కేడర్ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా చిన్నమ్మవ్యూహాలకు పదును పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్, ముక్కళత్తోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా ఆయనకు దన్నుగా నిలబడేందుకు సన్నద్ధమవుతున్నట్టు చర్చలు జోరందుకున్నాయి. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో వెనుకబడిన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను కలిగిన పుదియ తమిళగం నేత కృష్ణస్వామి సైతం విజయ్కు దన్నుగా నిలబడే రీతిలో సిద్ధమైనట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే సజావుగా వ్యవహారాలన్నీ సాగి, వ్యూహాలు ఫలించిన పక్షంలో విజయ్ నేతృత్వంలోమెగా కూటమి తథ్యమని రాందాసు ,చిన్నమ్మ శశికళ శిబిరంలోని కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం. -
సిటీలో ఆటో గ్యాస్ బంద్
శివాజీనగర( కర్ణాటక): ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ధం, గల్ఫ్ దేశాలపై దాడులు వల్ల బెంగళూరులో వంట గ్యాస్, వాహనాలకు సీఎన్జీ, ఎల్పీజీ కొరత ఏర్పడింది. స్టాక్ లేక బుధవారం నగరంలోని పలు ఆటో గ్యాస్ బంక్లు బంద్ అయ్యాయి. బంక్లకు మంగళవారం నుంచి సక్రమంగా గ్యాస్ సరఫరా కాలేదంటూ యజమానులు మూసివేశారు. శేషాద్రిపురం–గుట్టహళ్లి వద్ద ఉన్న ఆటో గ్యాస్ బంక్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. పలుచోట్ల బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం కేజీ గ్యాస్ రూ.65 ఉండగా ఇప్పుడు రూ. 80 అయ్యింది. ఓ బంక్ మేనేజర్ బాబు మాట్లాడుతూ, ఆటో గ్యాస్ సక్రమంగా సరఫరా కావడం లేదు. ఎక్కువ ధర పెట్టి కొని విక్రయించే స్తోమత లేదు. కొత్త స్టాక్ వచ్చిన తరువాత బంక్ను తెరుస్తామని తెలిపారు. ఉపాధికి గండిపడుతోందని డ్రైవర్లు ఆవేదన చెందారు. బెంగళూరులో ప్రముఖ ఆలయాల కూడా ఇబ్బంది వచ్చింది. ప్రసాదాలు, నైవేద్యాలు వండడానికి రోజుకు కనీసం 1 నుంచి 4 సిలిండర్లు కావాలి. మంగళవారం, శుక్ర, శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ. గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. -
దొరికినవి.. దేవతల నగలు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఈ ఏడాది జనవరి 10వ తేదీన కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్కుండిలో లభించిన నిధి గురించి కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆ చారిత్రక గ్రామంలో ఓ మహిళ ఇంటి పునాది తవ్వతుండగా పురాతనమైన రాగి చెంబు, అందులో అపురూపమైన బంగారు నగలు లభించడం తెలిసిందే. వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. పురావస్తుశాఖ అధికారులు ఆ బంగారు ఆభరణాలు సుమారు 600 సంవత్సరాల క్రితం నాటివని, కళ్యాణ చాళుక్య రాజులు, విజయనగర అరస రాజుల కాలం నాటివని నిర్ధారించారు. ఇవి మనుషులు ధరించేవి కావని, ఆలయాలలో దేవతలకు లేదా ఉత్సవ మూర్తులకు అలంకరించే ఆభరణాలని తెలిపారు. వీటి విలువ రూ.8 కోట్లని ప్రకటించారు. చదవండి: అరుదైన ఈ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? -
MH: అసెంబ్లీకీ బాంబు బెదిరింపు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు అసెంబ్లీలో బాంబు ఉందంటూ మెయిల్ పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపడుతుంది. అక్కడున్న వారిని వెంటనే వేరే ప్రాంతాల తరలించింది. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా తరుచుగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ ఫేక్వా లేక నిజంగానే బాంబు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. -
శాండ్విచ్ కోసం లాయర్లు క్యూ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నెలకొన్న వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత న్యాయస్థాన ప్రాంగణాలనూ తాకింది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఢిల్లీ హైకోర్టులోని ‘లాయర్స్ క్యాంటీన్’లో ప్రధాన భోజన వసతిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ లభ్యత కష్టతరంగా మారడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్ ఇన్ఛార్జ్ సందీప్ శర్మ తాజాగా న్యాయమూర్తుల కార్యదర్శికి, న్యాయవాదులకు ఒక విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సిలిండర్ల నిల్వలు నిండుకోవడంతో, వంట చేయడానికి వీలు లేక ‘మెయిన్ కోర్స్’ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి రాగానే తిరిగి భోజన సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం వంట గ్యాస్తో సంబంధం లేని శాండ్విచ్లు, సలాడ్లు, ఫ్రూట్ చాట్ వంటి అల్పాహారాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. దీంతో న్యాయవాదులు, కోర్టు పనులపై వచ్చేవారు మరోమార్గం లేక క్యాంటీన్లోని శాండ్వించ్ల కోసం క్యూ కడుతున్నారు.పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం మార్చి 7న ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 60 పెంచింది. దీంతో ఢిల్లీలో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ. 913కు చేరింది. కేవలం ధరల పెరుగుదలే కాకుండా, సరఫరాలో ఏర్పడిన అవరోధాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ కొరత తీవ్రమైంది. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వినియోగదారులు సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. గత పది రోజులుగా ఈ పరిస్థితి నెలకొందని, ఒక్కో ఏజెన్సీ వద్ద వందలాది మంది వేచి చూడాల్సి వస్తోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నిత్యావసర వస్తువుల చట్టాన్ని’ ప్రయోగించింది. గృహ అవసరాలు, ఆస్పత్రులు, అత్యవసర సేవలకు ఎల్పీజీ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా డొమెస్టిక్ రీఫిల్ బుకింగ్ల మధ్య 25 రోజుల గడువును తప్పనిసరి చేసింది. వాణిజ్య అవసరాలకు సరఫరాను పరిమితం చేయడంతో హోటళ్లు, క్యాంటీన్లపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు? -
సుప్రీంకోర్టులో ముగిసిన తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు
న్యూఢిల్లీ,సాక్షి: సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్,జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది.తాజాగా 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ ఆదేశాలను వెంటనే అధికారికంగా పబ్లిష్ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత పిటీషనర్లకు కావాల్సిన డాక్యుమెంట్లను నాలుగు రోజుల్లో ఇవ్వాలని సూచించింది. అంతకుముందు గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పు పట్టాయి.దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ, స్పీకర్ వాటిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణ ముందు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసినట్లు ప్రకటించింది. -
TG: కాంగ్రెస్ నేత దారుణ హత్య
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. గౌరారం వద్ద కాంగ్రెస్ నేత గోపిని దుండగులు కారుతో వేగంగా ఢీకొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. విచారణలో
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరూక్ అబ్దుల్లాని హత్యచేయడం కోసం 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపారు.నిన్న( బుధవారం) జమ్మూలోని గ్రేటర్ కైలాష్ వద్ద ఫరూక్ అబ్దుల్లా ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతున్నారు. అప్పుడు హఠాత్తుగా ఒక వ్యక్తి వెనక నుండి వచ్చి ఆయనను కాల్చే యత్నం చేశాడు. వెంటనే ఇది గమనించిన ఎన్ఎస్జీ కమాండోలో అతనిని చెయ్యిని లాగడంతో ప్రమాదం తప్పింది. అయితే నిందితుడు 65ఏళ్ల కమల్సింగ్ అని అతను జమ్మూకు చెందిన పురాణాస్ మండీ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు.మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను చంపడానికి గత 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నానని విచారణలో కమల్ సింగ్ తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఒమర్ అబ్దుల్లా స్పందించారు. 'Z ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న 85 ఏళ్ల వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. అల్లా దయతో ఉన్నారు. అయితే లోడెడ్ పిస్తోల్తో ఆ వ్యక్తి పాయింట్ బ్లాక్ రేంజ్లోకి ఎలా రాగలిగాడు. అతని పక్కకు ఉన్న సెక్యూరిటీ మాత్రమే అతనిని కాపాడగలిగింది. ఇందులో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి' అని అన్నారు.అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫరూక్ అబ్దుల్లా వెంబడి జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, ముఖ్యమంత్రి సలహాదారు నాసిర్ సోగామి ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. -
చిరుతతో పోరాడిన యువకుడు
సిమ్లా: చిరుతపులికి చిక్కి ప్రాణాలతో బయటపడటం ఊహకందని విషయం. కానీ.. చిరుతపులి బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పెద్ద సాహసమే చేశాడో యువకుడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా రాళ్లు రప్పలతో తిరుగుబాటు చేశాడు. చివరికి నిస్సహాయ స్థితిలోకి వెళ్లిన చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. స్వల్ప గాయాలపాలైన యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్కిలోని సర్లి గ్రామానికి చెందిన ప్రవేశ్ శర్మ ఐటీఐ చదువుతున్నాడు. సోమవారం ఉదయం పొలానికి వెళ్లగా చిరుత దాడి చేసింది. ఊహించని ఘటనతో నివ్వెరపోయిన యువకుడు సహాయం కోసం అరుస్తూనే.. చిరుతపులికి తన మెడ చిక్కకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ క్రమంలో చిరుతపులి దవడలు అతని చేతికి చిక్కాయి. చేతికి అందిన రాళ్లతో ఆ చిరుతపులి దవడలు, గోళ్లపై దాడి చేశాడు. పది నిమిషాలకు పైగా సాగిన పోరాటంలో చివరకు ఆ చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. యువకుని భుజాలు, కాళ్ళు, చేతులు, ముఖంపై అనేక గాయాలు అయ్యాయి. ఈలోపు అటవీ అధికారులు చేరుకుని యువకుడిని ఆస్పత్రికి తరలించారు. -
వాటర్ ట్యాంకులో డీజిల్.. ఇలా చేస్తే ఎలా?
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు దేశాన్ని తాకాయి. ఇదివరకే వంటగ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఇక తదుపరి క్రూడాయిల్ కొరత ఏర్పడనుందేమో అనే భయంతో ఒక వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా వాటర్ ట్యాంకర్ నిండా డీజిల్ నింపుకెళ్లారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ నిర్భందించడంతో చమురు నౌకల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇదివరకే దేశంలో వంటగ్యాస్, LPG, CNG కొరత ఏర్పడింది. అయితే ప్రభుత్వం వీటికి ఇబ్బందులు ఏమి లేవని సదరు సంస్థలను ఉత్పత్తి పెంచమని ఆదేశించామని ప్రకటించింది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు సైతం రెండు మాసాలకు సరిపడా ఉన్నాయని ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు రవాణా చేపడుతున్నామని ప్రకటించింది. అయితే ఇలా ప్రకటించినటప్పటికీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వేల లీటర్లు నిల్వ చేసి ఇతరులను ఇబ్బందులకు గురిచేసే యత్నం చేస్తున్నారు.తాజాగా దానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఒక వ్యక్తి నీటిని నిల్వచేసే ఒక ట్యాంకర్లో డీజీల్ నింపి నిల్వచేస్తున్నారు. దేశంలో డీజీల్ కొరత ఏర్పడే అవకాశం ఉందనే ఈ విధంగా చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి దాదాపు ఐదువేల లీటర్ల డీజీల్ నిల్వ ఉంటుందని అది దాదాపు రెండువందల మందికి సరిపోతుందని అంటున్నారు. అయితే పెట్రోల్, డీజీల్ కొరత వదంతులతో చాలా మంది టౌన్లలో, గ్రామాలలో ఇదేవిధంగా చేస్తున్నారని దీనివల్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల కొరత ఏర్పడడమే కాదని ఇది చాలా ప్రమాదమన్నారు. సీసాలలో ఆయిల్ తీసుకెళ్లడానికి అనుమతించని దేశంలో ట్యాంకర్లలో ఎలా నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి 5 వేల లీటర్లు తీసుకుంటే ఇక చమురుకొరత రాకుండా ఏలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి ఆ పెట్రోల్ బంక్ లైసెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. The govt says it has fuel reserves for 50–60 days, but if it doesn’t curb rumors and panic, and fails to crack down on hoarders and black marketeers, that 50–60 day stock won’t last even two weeks.This man here is (proudly) filling 5,000 litres of fuel, enough to meet the needs… pic.twitter.com/6zYWunZbw5— THE SKIN DOCTOR (@theskindoctor13) March 11, 2026 -
అవినాశ్ బెయిల్ రద్దుకు సుప్రీం నో..
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముసుగులో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి తదితరులపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతూ, పలు పిటిషన్లతో పదే పదే కోర్టుల మెట్లు ఎక్కుతున్న డాక్టర్ సునీతకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బుధవారం చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్రెడ్డితో పాటు పలువురి బెయిల్ను రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. దర్యాప్తు ముగిసింది: సీబీఐ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ, వివేకా కేసులో దర్యాప్తు పూర్తయ్యిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే మూడో సప్లిమెంటరీ చార్జ్షీట్ను సైతం కింది కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఇకపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని విన్నవించారు. సీబీఐ వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ రద్దు అవసరం లేదని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో ‘సెక్షన్ 207’ ప్రక్రియ పూర్తికి నిర్దేశం దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో కింది కోర్టులో విచారణను ఇకపై వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా నిందితులకు కేసు చార్జ్షీట్లు, ఇతర ఆధారాల పత్రాలను అందజేయడానికి సంబంధించిన ‘సీఆర్పీసీ సెక్షన్ 207’ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని కింది కోర్టును ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా కేసు ట్రయల్ ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పునఃదర్యాప్తు పేరుతో వివేకా హత్య కేసు విచారణను అసెంబ్లీ ఎన్నికల వరకు సాగదీసి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ప్రత్యర్థుల కుట్రలో సునీత పావుగా మారారన్న విమర్శల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ట్రయల్ కోర్టు విచారణ ఇక్కడెందుకు.. సిద్ధార్థ లూథ్రాకు ప్రశ్న విచారణ సందర్భంగా సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యవహరించిన తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాలను ఆయన పదే పదే ధర్మాసనం ముందు లేవనెత్తారు. ‘మా వద్ద కేసుకు సంబంధించిన కీలక మెటీరియల్ ఉంది.. దాన్ని పరిశీలించి బెయిల్ రద్దు చేయండి’ అంటూ లూథ్రా వాదించే ప్రయత్నం చేశారు. దీనిపై జస్టిస్ సుందరేశ్ తీవ్రంగా స్పందించారు. ఏమిటిది.. మీరు సుప్రీంకోర్టులోనే కేసు ట్రయల్ (విచారణ) నిర్వహించాలనుకుంటున్నారా?’ అంటూ లూథ్రాను సూటిగా ప్రశ్నించారు. ట్రయల్ కోర్టు పరిధిలో జరగాల్సిన విచారణను ఇక్కడికి ఎందుకు తెస్తున్నారంటూ లూథ్రా తీరును తప్పుబట్టారు. ఇలా పదే పదే పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. -
కొత్త డీజీపీగా సీవీ ఆనంద్కు చాన్స్ !
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా సీవీ ఆనంద్ నియామకం కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆరు వారాల్లోగా రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీ నియామకాన్ని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి ఎంపిక కమిటీ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు హాజరై, నలుగురు సీనియర్ ఐపీఎస్లతో కూడిన జాబితాను కమిటీకి అందజేసినట్టు తెలిసింది. ఆ ముగ్గురు ఎవరు?... ఢిల్లీ షాజహాన్ రోడ్లోని యూపీఎస్సీ భవన్ వేదికగా దాదాపు గంటపాటు ఈ సమావేశం సాగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్తోపాటు, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నాయి. ఈ భేటీలో ఆయా అధికారుల సర్వీస్ రికార్డులు, మెరిట్, ఇతర కీలక అంశాలపై సీఎస్తో కలిసి కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం పంపిన నలుగురి జాబితా నుంచి ఒకరిని పక్కనపెట్టి, ముగ్గురితో కూడిన తుది ప్యానెల్ను ఎంపిక కమిటీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ పంపించే జాబితాలో నుంచి సీవీ ఆనంద్ వైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొగ్గు చూపించే అవకాశమున్నట్టు తెలిసింది. జితేందర్ ఉద్యోగ విరమణ చేసినప్పుడు కూడా సీవీ ఆనంద్ డీజీపీ పోస్టు కోసం ప్రయత్నించినా... అప్పట్లో శివధర్రెడ్డికి ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్రెడ్డి ఆయనకు అవకాశం కల్పించిన విషయం విదితమే. తీవ్ర పోటీ.. కొత్త డీజీపీ పోస్టు కోసం సీనియర్ అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే జాబితాలో సీవీ ఆనంద్ పేరు ముందు వరుసలో ఉంది. డీజీపీ పదవిని దక్కించుకునేందుకు శిఖా గోయల్ సైతం గట్టిగానే ఆసక్తి చూపుతున్నట్టు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీజీపీ జితేందర్ ఉద్యోగ విరమణ చేసిన సమయంలోనే ఆమె ఈ పోస్టు కోసం తనవంతు ప్రయత్నాలు చేశారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే.. యూపీఎస్సీ ఎంపిక కమిటీ ఢిల్లీ నుంచి పంపే ‘ముగ్గురు’అధికారు ల తుది జాబితా రాష్ట్రానికి చేరిన తర్వా త ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుది నిర్ణ యం తీసుకుంటారు. దీంతో త్వరలోనే రాష్ట్ర కొత్త పోలీస్ బాస్ ఎవరన్నదానిపై అధికారికంగా సస్పెన్స్ వీడనుంది. -
వంటింటి వార్కు 'చెక్'..
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రతి ఇంటా ఇప్పుడు ఒకటే చర్చ. వంటింట్లో గ్యాస్ అయిపోతే? సిలిండర్ సమయానికి రాకపోతే? ప్రత్యామ్నాయం ఏంటి? వంటలు ఎలా? ఇదంతా ఎందుకంటే యూఎస్–ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు మన వంటింటి వరకూ వచ్చింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధమే కావొచ్చు. కానీ ఆ వార్ కాస్తా ఎల్పీజీ సరఫరాను దెబ్బతీయడంతో ప్రతి ఇంటి సమస్యగా మారింది. ఈ సమస్య రోజురోజుకూ ముదురుతోంది. ఎన్ని రోజులు ఇది కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వంట గ్యాస్కు, వంటలకూ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం తక్షణ పరిష్కారం. గ్యాస్ లేదంటే ముందుగా గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ స్టవ్ (ఇండక్షన్ కుక్టాప్స్), ఎలక్ట్రిక్ కుక్కర్, సోలార్ కుక్కర్, ఇతర అప్లయెన్సెస్. ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నా అందరికీ కొనే స్తోమత ఉండకపోవచ్చు. పల్లెల్లో కట్టెలు, బొగ్గు వంటివి ఇంధనంగా వాడుతున్నారు. పట్టణాల్లో వీటిని వాడటం సాధ్యం కాదు. ఉపకరణాలను కొనలేనివారు, సహజ ఇంధనాలను వాడలేనివారు, ఇంకా చెప్పాలంటే అందరూ.. ఇవేవీ అవసరం లేకుండానే సహజ పదార్థాలతో వంటలు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందామా.. వంటింటి శ్రమను తగ్గించేలా.. స్టవ్తో పనిలేకుండా సహజ ఆహారంతో విభిన్న వంటకాలను నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని పచ్చళ్లు, పొడులు రోట్లో లేదా రాయిపై నూరుకోవచ్చు. మిక్సీ ఉంటే మిక్సీలోనూ కొన్ని వేసుకోవచ్చు. నూనెల వాడకం, వేపుళ్లు తగ్గించవచ్చు. వండటం, పాత్రలు శుభ్రం చేసుకోవడంలో మహిళలు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. ఖర్చూ తగ్గుతుంది. ఇక రుచి అంటారా.. వేరుశనగ, నువ్వుల వంటి నూనె గింజల పొడులు వాడతాం కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. పూర్వకాలపు నిల్వ రోటి పచ్చళ్లు ఒకప్పుడు స్టవ్ అవసరం లేకుండానే రోటి పచ్చళ్లు తయారుచేసుకునేవాళ్లు. నూనె తాలింపు కూడా చాలా వాటికి అవసరం లేదు. వేడి వేడి అన్నంలో వీటిని కలుపుకొని తింటే.. ఆ రుచిని మాటల్లో చెప్పలేం. పండు మిర్చి పచ్చడి, టమాటా పచ్చడి, కరివేపాకు పచ్చడి, క్యారెట్ పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి, కరివేపాకు క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చడి, ఉల్లిపాయ కారం, దోసకాయ–మామిడి కాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి వంటివి ఇలా తయారుచేసుకోవచ్చు. మామిడి పిందెలతో కూడా నిల్వ రోటి పచ్చడి పెట్టుకోవచ్చు. పుటా్నల పప్పు, చింతపండు, ఎండుమిర్చి వంటి వాటితో పచ్చడి చేయవచ్చు. పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఉసిరి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి నూరి గ్రీన్ చట్నీ చేసుకుంటే రుచిగా ఉంటుంది. పచ్చి పెసరపప్పు లేదా పెసర్లు, మొలకెత్తిన పెసర్లు, పొట్టు పెసరపప్పుతో పచ్చడి చేసుకోవచ్చు. పొడులు ఎన్ని కూరలు ఉన్నా.. పొడులను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. వెల్లుల్లి కారం, పెసరపప్పు పొడి, కంది పొడి, కారప్పొడి, నువ్వుల కారం మొదలైనవి త్వరగా చేసుకోవచ్చు. రెడీమేడ్ ఆవకాయ మామిడి కాయ ఆవబద్దలు మన ఇళ్లలో ఉండే పెద్దలందరికీ తెలుసు. అప్పటికప్పుడు తయారుచేసుకుని అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. క్యాలీఫ్లవర్ పచ్చడి, దోస ఆవకాయ, సొరకాయ వంటివి కూడా ముక్కలతో రెడీమేడ్గా చేసుకుని ఫ్రిజ్లో ఓ 10 రోజుల వరకు నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. చాలా సులభంగా బ్యాచిలర్లు చాలా సులభంగా, గ్యాస్ అవసరం లేకుండానే తయారుచేసుకునే పచ్చళ్లు చాలా ఉన్నాయి. ఉల్లి–నిమ్మ పచ్చడి, మామిడల్లం పచ్చడి (వేసవిలో వచ్చే మామిడి అల్లంతో), అల్లం కారం, ఉల్లిగడ్డ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, పచ్చి టమాటా పండ్లతో నిల్వ పచ్చడి వంటివి ఈ కోవలోకి వస్తాయి. మంచి ప్రత్యామ్నాయం తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయిత, మిద్దెతోట ప్రచారకులు కూరగాయలు, నూనె గింజల వంటి సహజ పదార్థాలు వాడతాం కాబట్టి వంటకాలు రుచికరంగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు అలాగే ఉంటాయి. సహజ ఆహార పదార్థాల్లో ప్రాణశక్తి ఉంటుంది. వాడే పదార్థాలు ఎవరి స్తోమతను బట్టి వారు ఎంచుకొనేవెసులుబాటు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి మంచిప్రత్యామ్నాయం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఖర్చూ తక్కువ. మిక్స్డ్ సలాడ్లు మొలకలు (పెసలు, శనగలుమొదలైనవి), నానబెట్టిన పల్లీలు, క్యారెట్, బీట్ రూట్ తురుము, కీరదోస ముక్కలు, జామకాయ ముక్కలు, కాస్త నిమ్మరసం చల్లిబ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్లు (వీటిలో డ్రై ఫ్రూట్స్ కావాలంటే కలుపుకోవచ్చు) పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి చాలాసులభంగా చేసుకోగలిగేది. తాలింపు లేకపోయినాఫర్వాలేదు. ముల్లంగిపెరుగు పచ్చడి, పచ్చిపులుసు వంటివి అప్పటికప్పుడుతయారుచేసుకోవచ్చు. కొబ్బరి తురుముతో పచ్చి కొబ్బరి తురుము, దంచిన పచ్చి మిర్చి కలిపి అందులో నిమ్మరసం వేసుకోవచ్చు. లేదంటే మామిడికాయ తురుము కలిపినా బాగుంటుంది. పచ్చి పెసరపప్పు,పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, నిమ్మరసం, ఉప్పు కలుపుకొంటే కోసంబరి సిద్ధం. ఈ రెడీమేడ్ లడ్డూలు–తీపి పొడులు కేవలం వంటలే కాదు టైమ్ పాస్కి, స్నాక్స్లా తినడానికి రెడీమేడ్గా లడ్డూలు, తీపి పొడులు తయారుచేసుకోవచ్చు. ఇవి పిల్లలకు చాలా బలమైన ఆహారం. మొక్కజొన్న పిండికి, బెల్లం కలిపి సత్తు పిండి తయారుచేసుకోవచ్చు. దానిపై బాదం, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్లు అలంకరణ చేసుకుని తినొచ్చు. వేరు శనగ పొడి, బెల్లం కలిపి పొడి చేసుకోవచ్చు. అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుముతోనూ లడ్డూ చేసుకోవచ్చు. -
ఆ ముగ్గురిని పక్కన పెట్టండి
న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో అభ్యంతకర అధ్యా యాన్ని చేర్చడానికి కారకులైన ముగ్గురు నిపు ణుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వారితో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించరాదని కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని ఈ పుస్తకంలో చేర్చడం సంచలనాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎన్ఈసీఆర్టీ లీగల్ స్టడీస్కు సంబంధించి పాఠ్యప్రణాళికను ఖరారు చేయడానికి న్యాయ రంగానికి చెందిన నిపుణులతో ఒక కమిటీని వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో మాజీ సీనియర్ జడ్జి, ఒక ప్రముఖ విద్యావేత్త, పేరు ప్రఖ్యాతలున్న ఒక న్యాయవాది ఉంటే బాగుంటుందని సూచించింది. వీరు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ (భోపాల్)తో సంబంధం ఉన్నవారైతే ఇంకా మంచి విషయం అవుతుందని ఉద్ఘాటించింది. ఎనిమిదో తరగతి మాత్రమే కాకుండా, ఉన్నత తరగతుల పాఠ్యప్రణాళికను ఈ కమి టీ ఖరారు చేస్తుందని వెల్లడించింది. వివాదా స్పద అధ్యయాన్ని ప్రొఫెసర్ మైఖేల్ డానినో నేతృత్వంలో టెక్ట్బుక్ డెవలప్మెంట్ టీమ్ సభ్యులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్ రూపొందించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ప్రొఫె సర్ మైఖేల్ డానినో, ఆయన సహచరులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లకు భారత న్యాయవ్యవస్థ గురించి సహేతుక మైన జ్ఞానం లేదని, 8వ తరగతి విద్యార్థుల ముందు భారత న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా, తెలిసి కూడా వాస్తవాలను తప్పుగా చూపించారని మేము సందేహించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు’’ అని స్పష్టంచేసింది. తదుపరి తరం విద్యార్థులకు అవసరమైన పాఠ్యప్రణాళిక తయారీ, పాఠ్యపుస్తకాల ఖరారులో ఆ ముగ్గురిని ఎందుకు భాగస్వాములను చేయాలని ప్రశ్నించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు.. ఆ ముగ్గురు నిపుణులను తక్షణమే పక్కనపెట్టాలని ఆదేశించింది. పూర్తిగా ప్రభుత్వ నిధులతో లేదా పాక్షికంగా ప్రభుత్వ నిధలుతో సంబంధం ఉన్న బాధ్యతలు అప్పగించకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులో సవరణ కోరుతూ ముగ్గురు నిపుణులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, వివరణ ఇవ్వొచ్చని ధర్మాసనం పేర్కొంది. దుష్ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలివ్వండి వివాదాస్పద చాప్టర్ను తిరగరాస్తున్నామంటూ ఎన్సీఈఆర్టీ డెరెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్పైనా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. చాప్టర్–4ను మొత్తం తిరగరాయాలని, న్యాయ నిపుణులతో ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించి, ఆమోదించేదాకా ఆ చాప్టర్ను ప్రచురించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. నేషనల్ సిలబస్, టీచింగ్ టెర్నింగ్ మెటేరియల్ కమిటీ (ఎన్ఎస్టీసీ)ను పునర్వ్యవస్థీకరించాలని కేంద్రానికి పరోక్షంగా సూచించింది. వివాదాస్పద చాప్టర్పై ఫిబ్రవరి 26న తాము ఉత్తర్వు జారీ చేసిన తర్వాత సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు గుర్తుచేసింది. ఈ ప్రచారం వెనుక ఉన్న సోషల్ మీడియా వేదికలు, వ్యక్తుల వివరాలు తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తప్పుడు పనులు చేసేవారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థ గురించి విద్యార్థులకు బోధించడం మంచి విషయమే అయినప్పటికీ.. సంబంధిత పాఠ్యప్రణాళిక తయారీలో కనీసం ఒక న్యాయ నిపుణుడికి కూడా అవకాశం కల్పించకపోవడం తమకు అసంతృప్తి కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.విమర్శను నియంత్రించడం లేదు దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు సమీక్షకు అతీతం అని తాము చెప్పడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆరోగ్యకరమైన, చట్టబద్ధమైన, నిర్మాణాత్మక విమర్శను తాము నియంత్రించడం లేదని స్పష్టంచేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను సమగ్రంగా సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ఈ బాధ్యతను ఎన్సీఈఆర్టీకి అప్పగించడాకి బదులు ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీకే అప్పగిస్తే తాము ప్రశంసిస్తామని పేర్కొన్నారు. తటస్థ, స్వతంత్ర నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని తుషార్ మెహతా బదులిచ్చారు. వివాదానికి కారకులైన ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధం ఉండదని ఎన్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. ఆ ముగ్గురిలో ఒకరిని రేపే వైస్ చాన్సలర్గా నియమిస్తే పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకే వెంటనే పక్కన పెట్టాలని తేల్చిచెప్పింది. -
కేరళలో ఈసారి మా ప్రభుత్వమే
కొచ్చి/తిరుచిరాపల్లి: కేరళలో సీసీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ కూటములు అవినీతిలో కూరుకుపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు కూటములకు గట్టిగా బుద్ధి చెప్పాలని కేరళ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మార్పునకు పట్టం కట్టాలని కోరారు. ప్రధాని మోదీ బుధవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. తొలుత కేరళలో ‘అఖిల కేరళ ధీవర సభ’ స్వర్ణోత్సవాలకు హాజరయ్యారు. అనంతరం కొచ్చిలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో భాగంగా రూ.11,000 కోట్ల విలువైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ప్రారంభించారు, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం గమనార్హం. అనంతరం బీజేపీ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో తమ పార్టీ బలం పెరిగిందని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పశ్చిమాసియా పరిణామాలపై రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాందీపై మోదీ మండిపడ్డారు. పశ్చిమాసియా యుద్ధంపై ప్రజలను రెచ్చగొట్టేలా, బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన దేశ అభివృద్ధి గురించి కాంగ్రెస్ యువరాజుకు ఏమాత్రం తెలియదని ఎద్దేవా చేశారు. మన కంపెనీలు, మన యువత సాధిస్తున్న విజయాలు రాహుల్ ఏం తెలుసని ప్రశ్నించారు. శబరిమల బంగారం దొంగతనంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు ప్రమేయం ఉందని ఆరోపించారు. మత రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఆ రెండు కూటములకు బుద్ధి చెప్పాలని, ఈసారి ‘మోదీ గ్యారంటీల’తో ముందుకొస్తున్న బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తమిళనాడు అభివృద్ధికి ప్రణాళికలున్నాయి తమిళనాడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆయన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ.5,650 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంరతం ఎన్డీఏ ఎన్నిక ప్రచార సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో డీఎంకే పాలనలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. నేరగాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు కాపాడుతామన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తమిళనాడులో అవినీతికి అంతే లేకుండాపోయిందని దుయ్యబట్టారు. నదులన్నీ చివరికి సముద్రంలో కలిసిపోయినట్లు అవినీతి సొమ్ము చివరకు ఒక కుటుంబానికి చేరుతోందని సీఎం స్టాలిన్పై నిప్పులు చెరిగారు. డీఎంకే ‘శాస్త్రీయమైన అవినీతి మోడల్’ను అమలు చేస్తోందన్నారు. తమిళనాడు అభివృద్ధి పట్ల తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాన్ని రేర్ ఎర్త్ కారిడార్లో ఒక భాగంగా మారుస్తామని ప్రకటించారు. బెంగళూరు–చెన్నై, చెన్నై–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు నిర్మించాలన్న ప్రతిపాదన ఉందని మోదీ తెలిపారు. ‘అభివృద్ధి చెందిన భారత్కు అభివృద్ధి చెందిన తమిళనాడు’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని వెల్లడించారు. -
ఫరూక్ అబ్దుల్లాపై హత్యా ప్రయత్నం
జమ్మూ: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆయనపై దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. బుధవారం జమ్మూలోని గ్రేటర్ కైలాష్ వద్ద ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ‘‘పెళ్లి జరిగిన రాయల్ పార్క్ ప్రాంగణంలో పొంచి ఉన్న దుండగుడు అబ్దుల్లాపై పిస్టల్తో కాల్పులకు దిగేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు స్పందించి అదుపులోకి తీసుకునే లోపే ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు గానీ, ఆయన వెంటే ఉన్న ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గానీ ఎలాంటి గాయాలూ కాలేదు. దుండగున్ని అదుపులోకి తీసుకున్నాం. అతన్ని జమ్మూలోని పురానీ మండీకి చెందిన కమల్సింగ్గా గుర్తించాం’’ అని పోలీసులు తెలిపారు. -
భయపడాల్సిన పనిలేదు.. ఎల్పీజీ కొరతపై మోదీ భరోసా
తిరుచిరాపల్లి/కొచ్చి: పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో కొత్తగా భారత్లో వెలుగుచూసిన ఎల్పీజీ కొరతపై జనం భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో బుధవారం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘పశ్చిమాసియా సంక్షోభంపై తమిళనాడు ప్రజలకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. ఈ సమయంలోనూ భారత్ మొదట్నుంచీ అవలంభిస్తున్న విధానాన్నే నేను నమ్ముతా. ఎలాంటి సంక్షోభకాలంలోనైనా భారతీయుల స్వప్రయోజనాలకే మా ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుంది. ప్రస్తుత కష్టకాలంలో మన విధానం మారదు. ఇప్పుడు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. పుకార్లకు ఎవరూ ప్రాధాన్యత ఇవ్వొద్దు. ప్రజలను ఒక్కటే కోరుతున్నా. కేవలం సరైన, విశ్వసనీయ సమాచారం మాత్రమే అందరితో పంచుకోండి. కోవిడ్ మహావిలయకాలంలోనూ భారత్ ఎంత పరిణతి చెందిన దేశమో 140 కోట్ల మంది భారతీయులు రుజువుచేశారు. అచ్చం అలాగే ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని మ నం విజయవంతంగా ఎదుర్కొని సమస్య నుంచి గట్టెక్కుతాం’’అని మోదీ వ్యాఖ్యా నించారు. గల్ఫ్ దేశాలు ఆదుకుంటున్నాయి: పశ్చిమాసియా యుద్ధవాతారణంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న భారతీయులకు ఎన్డీఏ ప్రభుత్వంతోపాటు గల్ఫ్ దేశాలు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాయని మోదీ ప్రకటించారు. బుధవారం కేరళంలోని కొచ్చిలో ఎన్డీఏ ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇరాక్లో చిక్కుకున్న నర్సులను కావొచ్చు, యెమెన్లో ఉగ్రవాదుల చెరలో బందీగా ఉన్న ఫాదర్ టామ్ను కావొచ్చు సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ ఏనాడూ తన పౌరులను గాలికి వదిలేయలేదు’ అన్నారుఆందోళన అనవసరంఅవసరాలకు తగినంత ఎల్పీజీపై సరఫరా ఎప్పట్లా 2.5 రోజుల్లోనే రీఫిల్ డెలివరీ: కేంద్రంన్యూఢిల్లీ: ‘‘దేశంలో అవసరాలకు తగినన్ని ఎల్పీజీ నిల్వలున్నాయి. గృహావసరాల డిమాండ్ను పూర్తిస్థాయిలో తీర్చడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు’’అని కేంద్రం బుధవారం పేర్కొంది. ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదని పెట్రోలియం, సహజ వాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ స్పష్టం చేశారు. ‘‘ఆందోళనతో రీఫిల్స్ అధిక బుకింగ్, డీలర్ల అక్రమ నిల్వల వంటివి తప్పుడు సమాచార వ్యాప్తికి దారి తీస్తున్నాయి. వాస్తవానికి గృహ వినియోగదారులకు రీఫిల్ సిలిండర్ పశ్చిమాసియా కల్లోలానికి ముందు మాదిరిగానే సగటున 2 నుంచి 2.5 రోజుల్లోనే అందుతోంది’’అని ఆమె మీడియాకు వెల్లడించారు. ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం మోపాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నారు. గృహేతర ఎల్పీజీ సరఫరాలో ఆస్పత్రులు, విద్యా సంస్థల వంటి అత్యవసర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 90 శాతం హార్మూజ్ జలసంధి గుండానే వస్తోంది’’అని తెలిపారు. ఎల్ఎన్జీ నిల్వలతో కూడిన రెండు నౌకలు త్వరలో భారత్ చేరుకోనున్నట్టు శర్మ వెల్లడించారు. హార్మూజ్ గుండా భారత్కు చమురు, సహజ వాయువు, ఎల్పీజీ రవాణా రెండు వారాలుగా తీవ్రంగా ప్రభావితం కావడం తెలిసిందే. రష్యా తదితర దేశాల నుంచి చమురు సరఫరా అవుతున్నా ఎల్పీజీ, ఎల్ఎన్జీ విషయంలో మాత్రం సమస్య నెలకొంది. దాంతో ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీ సరఫరాను పెంచుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది. -
‘మద్యం పాలసీ కేసు అప్పీలును మరో బెంచ్కు బదిలీ చేయాలి‘
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన అప్పీలును జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుంచి మరో బెంచ్కు బదిలీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ కేసు జస్టిస్ శర్మనే కొనసాగిస్తే నిష్పాక్షిక విచారణ జరగకపోవచ్చని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్తో పాటు మరో 22 మందికి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. వారిపై ఆరోపణలు నిరూపితం కాలేదని తేల్చింది. ఆ ఉత్తర్వును సీబీఐ సవాలు చేసింది. ప్రస్తుతం ఆ విషయంపైనే జస్టిస్ శర్మ విచారణ జరుపుతున్నారు.మార్చి 9న జస్టిస్ శర్మ ఓ నోటీసు జారీ చేశారు. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారిపై శాఖాపర చర్యలు చేపట్టాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేశారు.ట్రయల్ కోర్టు ఉత్తర్వులో చేసిన కొన్ని వ్యాఖ్యలు తప్పుగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నాయని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.అదే సమయంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఉన్న పీఎంఎల్ఏ కేసు విచారణను వాయిదా వేయాలని కూడా ట్రయల్ కోర్టుకు ఆమె ఆదేశించారు. రివిజన్ పిటిషన్లో సాధారణంగా స్పందన దాఖలు చేయడానికి కనీసం 4 నుంచి 5 వారాలు సమయం ఇస్తారని కేజ్రీవాల్ తెలిపారు. ఇంతకు ముందు కూడా అదే న్యాయమూర్తి ఎక్సైజ్ పాలసీ అంశాలపై విచారణ చేసి అదే అంశాలపై ప్రాథమిక అభిప్రాయాలు వ్యక్తం చేశారని కేజ్రీవాల్ తెలిపారు. -
లోక్సభ స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాసం
లోక్సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. అనంతరం లోక్సభను రేపటికి వాయిదా వేశారు. కాగా నిన్న మంగళవారం పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి ప్రసంగంలో రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతించకపోవడం, 8మంది కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం, విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేయడం తదితర కారణాలతో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి మద్దతుగా 118 మంది ఎంపీలు సంతకం చేశారు. అయినప్పటీకీ అవిశ్వాస తీర్మాణానికి కావాల్సిన సభ్యుల బలం లేకపోవడంతో తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించారు. -
'ఆందోళన వద్దు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం'
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు (బుధవారం) కేరళలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 10 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటుందని దుయ్యబట్టారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డు పరిస్థితులనూ రాజకీయం చేస్తుందన్నారు. వీటిని సైతం రాజకీయంగా వాడుకుంటుందన్నారు. యుద్ధంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని గల్ఫ్లో భారతీయులు చిక్కుకోవాలని కాంక్షిస్తుందని ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మట్లాడుతున్నారని.. దేశ యువతపై రాహుల్ గాంధీకి సరైన అవగాహన లేదని మోదీ ఆరోపించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దంతో భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొందన్నారు. మోదీ మాట్లాడుతూ " మన దేశ ప్రజలు సమస్యల్లో ఉన్న ప్రతీసారి వారిని కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఇరాక్ సంక్షోభంలో భారతీయ నర్సులను క్షేమంగా తీసుకవచ్చాం. యెమెన్లో ఉగ్రవాదుల చెర నుంచి ఫాదర్ టామ్ను రక్షించాం " అని అన్నారు. ప్రస్తుతం గల్ఫ్లో జరుగుతున్న సంక్షోభం స్వయం సమృద్ధితి అవసరాన్ని మరింత నొక్కిచెబుతుందన్నారు.ఆత్మనిర్భర్ అవసరం కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ ఎంత అవసరమో ఇటీవల కాలంలో జరిగిన సంక్షోభాలు తెలియజేస్తున్నాయన్నారు. కరోనా , ఉక్రెయిన్- రష్యా యుద్దం, ఇరాన్ వార్ దాని అవసరాన్ని తెలియజేశాయన్నారు. ఆత్మనిర్భర్ ప్రారంభ సమయంలో కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు దానిని ఎగతాళి చేశాయని ప్రస్తుతం దాని విలువ అందరికీ అర్థమైందని తెలిపారు. దేశం ఇతర దేశాలపై ఆదారపడేలా చేసిందని ఈ రెండు పార్టీలే ఇంతకాలం భారత్ను వేరే దేశాలపై ఆధారపడేలా చేశాయన్నారు. ఇంధన కొరతపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆదారపడడం చాలావరకూ తగ్గించుకున్నామన్నారు. ప్రత్యామ్నయ ఇంధన వనరులపై ఫోకస్ పెట్టామని తెలిపారు. పెట్రోల్, డీజీల్ దిగుమతులు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అందుకే కేంద్రం ఎలక్ట్రిక్ బస్సులకు, వాహనాలకు ప్రోత్సహాకాలు అందిస్తున్నామని మోదీ అన్నారు. ప్రస్తుతం గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులకు ఆయా దేశాలు తగిన రక్షణ కల్పిస్తున్నాయని అందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలిపారు. -
అమ్మా, తిరిగి వస్తానో లేదో.. రెస్క్యూ ఫ్లైట్ పైలట్ ఆవేదన వైరల్
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు, ఇరాన్ ప్రతి దాడుల మధ్య మధ్యప్రాచ్యంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. భారత విమాన యాన సంస్థలు , గల్ఫ్ విమానయాన సంస్థలు విస్తృతంగా విమానాలను రద్దు చేశాయి. ఫిబ్రవరి 28-మార్చి 5 మధ్య భారతదేశం-మధ్యప్రాచ్య మార్గాల్లో 1,770 విమానాలు రద్దయ్యాయి. అనేక మంది ప్రయాణీకులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే వీరిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో ఫరీదాబాద్కు చెందిన యువ పైలట్, 23 ఏళ్ల దీపిక అధానా, UAEలో చిక్కుకున్న 169 మంది భారతీయులను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రయాణీకులను సురక్షితంగా ఢిల్లీకి తిరిగి తీసుచ్చి ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఇంత ఉద్రికత్తతల మధ్య విమానం బయలుదేరే ముందు "అమ్మా, బై బై. నేను తిరిగి వస్తానో లేదోనాకు తెలియదు" అని చెప్పి మిషన్కు బయలు దేరడంమాత్రమే కాదు ఎన్నో సవాళ్ల మధ్య అత్యంత సాహసంగా వ్యవహరించి సురక్షితంగా ఢిల్లీకి చేరడం పలువురిని భావోద్వేగానికి గురి చేసింది. ఇదీ చదవండి: విమానం గాల్లో ఉండగా క్యాబిన్ క్రూ రీల్, ఎయిరిండియా విచారణఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవడంతో బాధితుల బంధువులు, అదికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికులను క్షేమంగా తీసుకొచ్చిన తన కూతురిని చూసి దీపికా తల్లి కూడా తనకెంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ పైలట్ దీపికా అధానా, కెప్టెన్ జస్వీందర్ కౌర్ నేతృత్వంలోని ఆరుగురు మహిళా సభ్యుల బృందం ఉన్నారు. యూఏఈలోని రాస్ అల్ ఖైమా (Ras Al Khaimah) విమానాశ్రయం నుండి యుద్ధ వాతావరణం వల్ల అక్కడ చిక్కుకుపోయిన 169 మంది భారతీయ ప్రయాణికులను సురక్షితంగా ఢిల్లీకి చేర్చారు.ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటీ అంటే ఈ విమానాన్ని తొలుత స్నేహితురాలు నడపాల్సి ఉంది, కానీ బయలుదేరడానికి అకస్మాత్తుగా కేవలం రెండు గంటల ముందు, దీపికను ఆమె స్థానంలోకి రావాలని ఆదేశాలందాయి. ఈ బాధ్యతను అత్యంత సాహసోపేతంగా నిర్వహించి అందరి ప్రశంసలు దక్కించుకుంది.ఎదురైన సవాళ్లు : ఈ రెస్క్యూ మిషన్ సమయంలో ఒక దశలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంబంధాలు తెగిపోయాయి. కొద్దిసేపు నెట్వర్క్ ఫెయిల్యూర్ కావడంతో ఉత్కంఠ నెలకొంది, కానీవెంటనే సంబంధాలు పునరుద్ధరించబడటంతో విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది.ఎవరీ దీపిక అధానాహర్యానాలోని ఫరీదాబాద్ (తిగావ్ ప్రాంతం) చెందిన వారు దీపిక. తండ్రి యోగేష్ అధానా (ఆర్కిటెక్ట్), తల్లి బబ్లీ అధానా. ఆమె తాతయ్య అమృత్ సింగ్ అధానా కోరిక మేరకు దీపికా పైలట్ కావాలని నిర్ణయించుకుంది. 2020లో 12వ తరగతి పూర్తి చేసిన ఆమె, కరోనా కష్టకాలంలోనూ పట్టుదలతో చదివి కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది.ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలు -
చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే!
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య గత 12 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధ తంత్రాన్నే మార్చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతోన్న అసమాన దాడులు భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ప్రమాదంగా మారుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు చాలామంది చమురు, గ్యాస్ ధరల గురించే చర్చిస్తున్నారు, కానీ నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న ‘ఎరువుల సెగ’ భారత ఆహార భద్రతను, 147 కోట్ల మంది జీవనోపాధిని ప్రశ్నార్థకం చేయనుందనే సంగతి విస్మరిస్తున్నారు.భారత వ్యవసాయానికి కీలకంగా హార్ముజ్ జలసంధి..భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎంతగా గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుందో, ఎరువుల కోసం కూడా అంతే స్థాయిలో ఆధారపడి ఉంది. ఇరాన్ వైఖరి కారణంగా హార్ముజ్ జలసంధిపై ఏర్పడిన ప్రతిష్టంభన భారత్కు సవాలుగా మారింది.లెక్కలివే..భారత్ దిగుమతి చేసుకునే నత్రజని సంబంధిత ఎరువుల్లో (యూరియా, అమ్మోనియా) 63 శాతం, డీఏపీలో 32 శాతం కేవలం గల్ఫ్ దేశాల (యూఏఈ, ఖతార్, సౌదీ, ఒమన్) నుంచే వస్తాయి. దేశానికి కావాల్సిన పొటాష్ దిగుమతుల్లో 42 శాతం వాటా ఒక్క సౌదీ అరేబియాదే. ఇరాన్ నుంచి నేరుగా కొనుగోళ్లు తక్కువగా ఉన్నప్పటికీ (కేవలం 2.59 మిలియన్ డాలర్లు) ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలు హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. యుద్ధం వల్ల బీమా ప్రీమియంలు పెరగడం, నౌకల రాకపోకలు నిలిచిపోవడం రైతన్నపై భారాన్ని పెంచుతున్నాయి.ఆహార భద్రతపై ప్రభావంభారతదేశంలో ఖరీఫ్, రబీ సీజన్లు వ్యవసాయానికి కీలకం. జూన్/ జులైలో విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత ఏర్పడితే అది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఎరువుల దిగుమతి బిల్లు 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.5 లక్షల కోట్లు) రికార్డు స్థాయికి చేరుతుందని అంచనా. ఇందులో యూరియా వాటానే 61 శాతంగా ఉండనుంది.అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీ భారం భారీగా పెరగనుంది.‘మేక్ ఇన్ ఇండియా’కు సహజ వాయువు సెగఎరువుల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని, యూరియా దిగుమతులను నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది (38 మిలియన్ టన్నుల లక్ష్యం). అయితే, యూరియా తయారీకి ప్రధాన ముడిసరుకు అయిన సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరా ఇప్పుడు భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఖతార్, యూఏఈల నుంచి సరఫరా తగ్గడంతో భారత అగ్రశ్రేణి గ్యాస్ దిగుమతిదారు ‘పెట్రోనెట్’ మార్కెటింగ్ కంపెనీలకు 30 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీయ ఎరువుల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది.ప్రత్యామ్నాయ మార్గాలురష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత సరఫరా గొలుసులో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మిడిల్ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంది. ఎరువుల దిగుమతికి సంబంధించి చైనాపై ఆధారపడటం తగ్గించాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనాలే ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలుగా తోస్తున్నాయి. ఇవి హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా సరఫరా చేయగలవు. నైజీరియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాలి (ప్రస్తుతం వీటి వాటా 5% కంటే తక్కువ).ప్రభుత్వ ధీమాపరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ కేంద్ర ఎరువుల శాఖ మార్చి 6న ఒక ప్రకటన విడుదల చేస్తూ.. దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని స్పష్టం చేసింది. రైతుల్లో అసంతృప్తి కలగకుండా ప్రభుత్వం ఎంతటి ప్రీమియం చెల్లించైనా ఎరువుల సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి చమురు కోసం రష్యా వైపు మొగ్గు చూపినట్లుగానే ఎరువుల భద్రత కోసం భారత్ త్వరలో మరిన్ని కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు! -
విమానం గాల్లో ఉండగా క్యాబిన్ క్రూ రీల్, ఎయిరిండియా విచారణ
ఎయిరిండియా విమానం గాలిలో ఉన్నప్పుడు, మాజీ క్యాబిన్ క్రూ సభ్యురాలు ఒకరు కాక్పిట్లో కూర్చోని రీల్ చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రయాణీకుల భద్రతపై ఆందోళన లేవనెత్తింది. దీనిపై ఎయిరిండియా స్పందించింది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మహిళ పైలట్ సీటులో కూర్చున్నట్లు కనిపిస్తుంది. కెమెరాను అద్దం (విండ్స్క్రీన్ )వైపు తిప్పినప్పుడు బయట మేఘాలు కనిపిస్తుండటంతో, విమానం గాలిలో ఉన్నప్పుడే ఈ వీడియో తీసినట్లు స్పష్టమవుతోంది. విమానయాన భద్రతా ప్రోటోకాల్ల గురించి చర్చకు దారితీసింది.క్లిప్ను ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ, “విమానం గాలిలో ఉంది, ఒక ఎయిర్ హోస్టెస్ కాక్పిట్లో కూర్చుని రీల్స్ తయారు చేస్తోంది. ఇది నిజంగా దీనికి అనుమతి ఉందా? ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారిని చూడటం చాలా బాధగా ఉంది అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ వీడియో భద్రతా నిబంధనల ఉల్లంఘనేనంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలుఈ ఘటనపై ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాక్పిట్లోకి ప్రవేశించడానికి కఠినమైన ప్రోటోకాల్ ఉంది. దీన్ని అధిగమించడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని క్యారియర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వీడియోను ఎపుడు, ఎలా చిత్రీకరించారు, దీని యథార్థతను తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించామని, దర్యాప్తు ఫలితాల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని ఎయిరిండియా తెలిపింది, కాక్పిట్ ప్రవేశంపై ఎయిర్ ఇండియాకు కఠినమైన నిబంధనలు ఉన్నాయని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని ఎయిరిండియా స్పష్టం చేసింది.Wait until you see the end of this video. The plane is in the air and an air hostess is sitting in the cockpit making reels. Is this really allowed? Feels quite disturbing to see something like this when passenger safety is supposed to be the top priority. @DGCAIndia pic.twitter.com/91Nmsr9R70— Nikhil saini (@iNikhilsaini) March 10, 2026డీజీసీఏ నిబంధనలేంటి?డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం విమానం గాలిలో ఉన్నప్పుడు కాక్పిట్లో ఎప్పుడూ కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి.ఒకవేళ పైలట్లలో ఒకరు విరామం కోసం లేదా అత్యవసర పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, ఆ సమయంలో ఒక క్యాబిన్ క్రూ సభ్యుడిని లోపలికి పిలుస్తారు. రెండవ పైలట్ తిరిగి వచ్చే వరకు ఆ క్రూ సభ్యుడు అక్కడే ఉండాలి. కొందరు నెటిజన్లు ఈ నిబంధనను ప్రస్తావిస్తూ, బహుశా పైలట్ బయటకు వెళ్లిన సమయంలో నిబంధనల ప్రకారమే ఆమె లోపలికి వెళ్లి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఘటనపై ఎయిరిండియా దర్యాప్తులో ఏం తేలనుందో వేచి చూడాల్సిందే. -
‘చరిత్రలో ఇదే తొలిసారి’: లోక్సభలో రాహుల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలో రాజకీయ సెగలు మరింతగా రాజుకున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో గందరగోళం నెలకొంది. చర్చ సందర్భంగా అధికార పక్ష సభ్యులు పదేపదే తన పేరును ప్రస్తావించడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ప్రతిపక్ష నేతను సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడం ఇదే తొలిసారి అని ఆయన మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.సభాపతి ఓం బిర్లా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అవిశ్వాస తీర్మానంపై ఫిబ్రవరిలోనే సుమారు 118 మంది ఎంపీలు సంతకాలు చేయగా, దీనిపై చర్చకు 10 గంటల సమయాన్ని కేటాయించారు. తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు సాధారణ మెజారిటీ అవసరం. అయితే, స్పీకర్ ఎన్నడూ పక్షపాతంగా వ్యవహరించలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విపక్షంలోని 50 మందికి పైగా ఎంపీలు వ్యక్తిగతంగా తనను కలిసి, ఈ తీర్మానంతో తాము ఏకీభవించడం లేదని, కేవలం ఒత్తిడి మేరకే సంతకాలు చేశామని చెప్పారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.వంట గ్యాస్ కొరతపై..దేశంలో వంట గ్యాస్ (ఎల్పీజీ) కొరతను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిని, గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా సామాన్యులకు సిలిండర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. 2019 నుంచి లోక్సభలో ‘డిప్యూటీ స్పీకర్’ పదవి ఖాళీగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. గతంలో స్పీకర్పై తీర్మానం ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ సభను నడిపించేవారని, కానీ ప్రస్తుతం ఆ వ్యవస్థే లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కాగా ఇరాన్ తదితర గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా చిక్కుకుపోయిన వెయ్యి మందికి పైగా భారతీయ మత్స్యకారులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు? -
ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలు
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని బుధవారం ఉదయం నుంచీ ఇన్స్టాగ్రామ్ వినియోగ దారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో యాప్ను ఉపయోగించడంలో సమస్యలొస్తున్నా యంటూ వేలాదిమంది యూజర్లు గగ్గోలే పెడుతున్నారు. ఇన్స్టాలో సందేశాలను పంపలేక పోతున్నారని లేదా వాటికి ప్రత్యుత్తరం ఇవ్వలేక పోతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో సందేశాలు, మీమ్స్తో హల్ చల్ చేస్తున్నారు.ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ డేటా ప్రకారం 10,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను ఫ్లాగ్ చేశారు, వీరిలో అమెరికా యూజర్లే ఎక్కువున్నారు. ఇండియాలో వందల సంఖ్యలో ఇలాంటి సమస్యలను నివేదించారు. అయితే మెటా యాజమాన్యంలోని కంపెనీ ఇన్స్టాగ్రామ్ దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పందించ లేదు.యూజర్ల ఫిర్యాదులు యాప్ పనిచేయకపోవడంతో, వినియోగదారులలో గందరగోళం, నిరాశకు దారితీసింది. ఇన్స్టాగ్రామ్ DMలు పనిచేయడం లేదంటూ స్క్రీన్షాట్లతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. “ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐ రిపీట్ ఇన్స్టాగ్రామ్ డౌన్” అని ఒకరు, మరొకరు “ఇన్స్టాగ్రామ్ dms డౌన్ అయ్యిందా లేదా... నేను కుక్ అయ్యానా” , “ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిందా??? dms నాకు పని చేయడం లేదా అది నేను మాత్రమేనా?” అని మరొకరు ప్రశ్నించారు. మరికొతమంది నెటిజన్లు ట్విటర్లో తమ సమస్యను రిపోర్ట్ చేశారు. “ఇన్స్టాగ్రామ్ పనిచేయడం మానేసిందా? నేను నా స్నేహితుడికి ప్రత్యుత్తరం ఇవ్వలేను” అని ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్లో (గతంలో ట్విట్టర్)లో ఒక వినియోగదారు పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: గల్ఫ్ ఉద్రిక్తతలు : సౌదీకు పాకిస్థాన్ బాసట -
‘ఎన్సీఈఆర్టీ’ వివాదంలో మరో మలుపు
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల చుట్టూ ముసురుకున్న వివాదం మరో కీలక మలుపు తిరిగింది. అన్ని తరగతులకు చెందిన పాఠ్యపుస్తకాలను సమగ్రంగా సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీని ఆదేశించింది. ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు విన్నవించారు. న్యాయవ్యవస్థపై ఎనిమిదో తరగతి పుస్తకంలో వివాదాస్పద అంశాలు చోటుచేసుకోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.పాఠ్యప్రణాళికను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆయా రంగాలకు చెందిన నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి హామీ ఇచ్చారు. అయితే ఈ సమీక్ష బాధ్యతను కేవలం ఎన్సీఈఆర్టీకి మాత్రమే వదలకుండా, కేంద్రమే స్వయంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. విద్యా ప్రమాణాలను కాపాడటంలో నిష్పాక్షికత అవసరమని కోర్టు పేర్కొంది.ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకం ‘ఎక్స్ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’లో న్యాయవ్యవస్థపై ఉన్న నాలుగో అధ్యాయం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై ఎన్సీఈఆర్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ‘న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అధ్యాయంలో అభ్యంతరకర అంశాలు ఉన్నట్లు అంగీకరిస్తూ, సదరు పుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రకటించారు. విద్యా విషయాల్లో ఖచ్చితత్వం, బాధ్యతను పాటించడంలో తాము కట్టుబడి ఉన్నామని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు? -
పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు?
చండీగఢ్: చమురు సంక్షోభం సెగ ఇప్పుడు పెళ్లిళ్ల వరకూ పాకింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం గ్యాస్ సరఫరాపై పడటంతో పెళ్లిళ్ల సీజన్ కాస్తా కళా విహీనంగా మారింది. పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో సుమారు 10 వేల వివాహాలు జరగనున్న తరుణంలో కమర్షియల్ ఎల్పీజీ (LPG) సరఫరా నిలిచిపోవడం గందరగోళానికి దారితీసింది. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.పంజాబ్లో ప్రస్తుతం వివాహ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇంటి నిండా చుట్టాలు, భాజాభజంత్రీల సందడి మధ్య గ్యాస్ కొరత అందరినీ కలవరానికి గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం అర్ధరాత్రి నుంచి వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు, మ్యారేజ్ ప్యాలెస్ యజమానులు చేతులెత్తేస్తున్నారు. విందు భోజనాల మెనూలో కోతలు విధించక తప్పని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంజాబ్ మ్యారేజ్ ప్యాలెస్ అండ్ రిసార్ట్ అసోసియేషన్ ప్రతినిధి సుఖ్దేవ్ సింగ్ సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్యాస్ లేకపోతే పెద్ద ఎత్తున వంటకాలు చేయడం అసాధ్యం. ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించేందుకు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే కట్టెల పొయ్యిలకు మారాయి. ఈ పరిస్థితిపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పందిస్తూ.. గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నల్లబజారును అరికట్టడానికే కఠిన నిబంధనలు తెచ్చామని స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్ -
రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు?
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల లేవనెత్తిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న పన్నులు, విమానాశ్రయాల్లో ఆహార ధరలు, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంపై ఆయన సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అడిగిన ప్రశ్నలు, వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేస్తున్నాం.పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా తనకున్న ఆర్థిక అవగాహనతో బడ్జెట్ లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, రోజువారీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారికంగా కేంద్రం నుంచి సమాధానాలు రాబట్టారు.పన్నుల భారంతో మధ్యతరగతి విలవిలబడ్జెట్ 2026-27పై జరిగిన చర్చలో రాఘవ్ చద్దా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరుగుతున్నా, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఎందుకు లేదు? జీతాలు పెరగకపోయినా ద్రవ్యోల్బణం (సుమారు 6.8%) కారణంగా కొనుగోలు శక్తి పడిపోతోంది. కనీసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) పన్నును ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.ప్రభుత్వ స్పందన: ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. దేశ మౌలిక సదుపాయాల కల్పన (క్యాపెక్స్) కోసం నిధుల సేకరణ అవసరమని, పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నామని పేర్కొంది. అయితే నేరుగా ఆదాయపు పన్ను తగ్గింపుపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు.రైట్ టు రీకాల్.. ఓటర్లకే ఆ అధికారం ఇవ్వాలి!ఇటీవల రాఘవ్ చద్దా రాజ్యసభలో లేవనెత్తిన ‘రైట్ టు రీకాల్’ (ఎన్నికైన ప్రతినిధులు పనితీరు నచ్చకపోతే అధికారం తొలగించే హక్కు) అంశం సభ్యుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ‘ఎన్నికైన ప్రతినిధుల ఐదేళ్ల కాలపరిమితి ముగిసే వరకు వేచి చూడకుండా, పనితీరు సరిగ్గా లేని అభ్యర్థులను ఓటర్లే తొలగించేలా చట్టం తీసుకురావాలి’ అని చద్దా కోరారు. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో ఈ విధానం ఉందని గుర్తుచేశారు.ప్రభుత్వ స్పందన: ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ విధివిధానాల ప్రకారం దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమలులో ఉందని తెలిపింది. ఇటువంటి మార్పులు రాజకీయ అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది.విమానాశ్రయాల్లో ఆహార ధరలు..విమానాశ్రయాల్లో కనీస ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సభలో తెలిపారు. సాధారణంగా లీటర్ వాటర్ బాటిల్ రూ.20 ఉంటే.. ఎయిర్పోర్ట్ల్లో మాత్రం ఇది సుమారు రూ.100గా ఉంటుంది. ఇదే కాకుండా వివిధ ఆహార పదార్థాల ధరలు ఎయిర్పోర్ట్ల్లో అధిక ధరలుంటాయి. ఈ నేపథ్యంలో ‘విమానాశ్రయాల్లో సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరలో స్నాక్స్, పానీయాలు లభించే ఉడాన్ యాత్రి కేఫ్ల సంఖ్యను పెంచాలి. వాటిని సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత కూడా అందుబాటులో ఉంచాలి’ అని కోరారు.ప్రభుత్వ స్పందన: పౌర విమానయాన శాఖ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని, ప్రయాణికుల సౌకర్యార్థం విమానాశ్రయాల్లో సరసమైన ధరలకు ఆహారం అందించే అవుట్లెట్లను పెంచే దిశగా చర్యలు చేపడతామని తెలిపింది.సిమ్ కార్డులు - ఇన్కమింగ్ కాల్స్..రాఘవ్ చద్దా రాజ్యసభలో టెలికాం కంపెనీల దోపిడీని ఎండగట్టారు. ‘ప్రస్తుతం దేశంలోని టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అవుట్గోయింగ్ మాత్రమే కాకుండా, ఇన్కమింగ్ కాల్స్ కూడా నిలిపివేస్తున్నాయి. దీనివల్ల సామాన్యులు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి వద్ద రీఛార్జ్ చేసుకునే డబ్బు లేకపోయినా తమకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అందుకోలేకపోతున్నారు. ఇది ఒక రకమైన దోపిడీ కాదా?’ అని ప్రశ్నించారు.బ్యాంకింగ్, రేషన్, ప్రభుత్వ పథకాలు.. ఓటీపీ ద్వారా ఫోన్ నంబర్కే లింక్ అయి ఉన్న తరుణంలో ఇన్కమింగ్ ఆపేయడం వల్ల సామాన్యులు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం, ట్రాయ్ స్పందన: డేటా (ఇంటర్నెట్) అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే చౌకైన ప్లాన్లను తీసుకురావాలని కంపెనీలను ఆదేశించింది. గతంలో ఉన్న 90 రోజుల పరిమితిని సడలించి వినియోగదారులు ఏకకాలంలో 365 రోజుల (ఒక ఏడాది) వరకు వాలిడిటీని పొందేలా స్పెషల్ టారిఫ్ వోచర్స్ తీసుకురావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రాఘవ్ చద్దా లేవనెత్తిన ప్రశ్నలు కేవలం రాజకీయ కోణం నుంచి కాకుండా సామాన్యుడి ఆర్థిక, సామాజిక ప్రయోజనాల చుట్టూ ఉండడం విశేషం. ముఖ్యంగా పన్నుల సంస్కరణలు, వర్కర్ల రక్షణపై ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం రాతపూర్వక సమాధానాలు భవిష్యత్తు విధాన నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం.. -
ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసి, కోర్టులో కనీస న్యాయ పరిభాషను చదవలేకపోయిన ఒక వస్త్ర వ్యాపారికి సుప్రీంకోర్టులో పరాభవం ఎదురైంది. ‘వెళ్లి లూధియానాలో మరో రెండు మూడు స్వెటర్లు అమ్ముకో.. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది’ అంటూ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఆ పిటిషన్ను కొట్టివేశారు.పంజాబ్లోని లూధియానాకు చెందిన హోజరీ వ్యాపారి రజనీష్ సిద్ధూ 'పీఎం కేర్స్' (PM CARES) నిధికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో సిద్ధూ స్వయంగా వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఇంగ్లీష్లో ఉన్న పిటిషన్ను చూసి చదువుతుండటం గమనించిన ధర్మాసనం ఆయన నేపథ్యంపై ఆరా తీసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్తో పాటు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన బెంచ్, సిద్ధూ చదువు గురించి ప్రశ్నించింది.గతంలో ఎప్పుడూ పిటిషన్ వేయలేదని, నేరుగా సుప్రీంకోర్టుకే వచ్చానని ఆయన చెప్పడంతో సీజేఐ వ్యంగ్యంగా స్పందించారు. ‘చాలా ధైర్యవంతుడివి.. నేరుగా లూధియానా నుండి సుప్రీంకోర్టుకు వచ్చావా? నీకు ఇక్కడే ఇంగ్లీష్ పరీక్ష పెడతాను. అందులో కనీసం 30 శాతం మార్కులు సాధించినా నువ్వే ఈ పిటిషన్ రాశావని నమ్ముతాను’ అని వ్యాఖ్యానించారు. పిటిషన్లో పేర్కొన్న 'ఫిడ్యూషియరీ రిస్క్ ఆఫ్ కార్పొరేట్ డోనర్స్' (Fiduciary Risk of Corporate Donors) అనే పదానికి అర్థం చెప్పాలని సీజేఐ కోరగా, సిద్ధూ నీళ్లు నమిలాడు.తన నోట్స్ చూసి చెప్పడానికి ప్రయత్నించగా.. ‘మిస్టర్ సిద్ధూ, ఇది ఎవరో న్యాయవాది రాసి ఇచ్చింది. నువ్వు కేవలం స్క్రిప్ట్ చదువుతున్నావు’ అని సీజేఐ అడ్డుకున్నారు. దీనిపై పంజాబ్ విజిలెన్స్ బ్యూరోతో విచారణ జరిపిస్తామని హెచ్చరించడంతో సిద్ధూ అసలు విషయం బయటపెట్టారు. సుప్రీంకోర్టు ఆవరణలోని ఒక టైపిస్ట్ తనకు సహాయం చేశాడని, అతనికి గంటకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తూ, నాలుగు జాకెట్లు బహుమతిగా ఇచ్చానని చెప్పారు. తాను న్యాయవాదిని పెట్టుకోలేక, మూడు నాలుగు రకాల ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ టూల్స్ ఉపయోగించి ఈ పిటిషన్ను రూపొందించానని అంగీకరించాడు.సాంకేతికతను తప్పుగా వాడుకుంటూ, కోర్టు సమయాన్ని వృథా చేసే పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు ఆర్థిక జరిమానాలు కూడా తప్పవని హెచ్చరిస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది. కాగా, సోమవారం కూడా ఇదే బెంచ్.. ఉల్లి, వెల్లుల్లిలో ‘తామసగుణం’ ఉంటుందా అనే అంశంపై వచ్చిన పిటిషన్తో సహా ఐదు ఉపయుక్తంకాని వ్యాజ్యాలను కొట్టివేసింది.ఇది కూడా చదవండి: మధ్యవర్తిత్వంపై ఖతార్ కీలక వ్యాఖ్యలు -
హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతించింది. హరీష్ రాణా తల్లిదండ్రుల అభ్యర్థనలతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విచారణలో సుప్రీంకోర్టు బుధవారం (మార్చి 11, 2026) తుది తీర్పు ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్లతో కూడిన బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న రాణా పాసివ్ యూతనేషియా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో 2018లో చట్టబద్దత తర్వాత మన దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన మొదటి కేసుగా నిలిచింది. ఇక ఈ కేసు తుది తీర్పు విచారణకు ముందు సుప్రీం కోర్టు హరీష్ రాణా ఆరోగ్య పరిస్థితిపై రెండు వైద్య బోర్డుల అభిప్రాయాలను సుప్రీంకోర్టు అధ్యయనం చేసింది. ఆ తర్వాతే సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించినట్లు తెలుస్తోంది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. ఆగస్టు 20,2013. రాఖీ పండుగ. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ తన హాస్టల్ నాలుగవ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు.ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకల్యం ఏర్పడింది. హరీష్కు చికిత్స చేసిన వైద్యుడు మొదట్లో అతను కళ్ళు తెరవలేకపోయాడని, అవయవాలను కదల్చలేకపోయాడని చెప్పాడు. అప్పటి నుండి, హరీష్ శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యాడు.ఓ వైపు ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న హరీష్ రాణా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. హరీష్ రాణాకు ఇద్దరు తోబుట్టువులు. వారి సంరక్షణ కోసం ఢిల్లీలోని మహావీర్ ఎన్క్లేవ్లోని తమ ఇంటిని అమ్మేసి ఘజియాబాద్కు మకాం మార్చారు.రోజులు, నెలలు,సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ హరీష్ ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో చేసేది లేక తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా.. జూలై 2024లో కారుణ్య మరణం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు హరీష్ వెంటిలేటర్పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ (శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్ (ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల అభ్యర్థనను తిరస్కరించింది. నవంబర్ 2024 అప్పటి సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, హరీష్ పూర్తిగా లైఫ్ సపోర్ట్పై ఆధారపడటం లేదని పేర్కొంది. అయితే, కేంద్రం హరీష్ చికిత్స, వసతి కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది.డిసెంబర్ 2025 సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం హరీష్కు చికిత్స అందిస్తుంది. ప్రైమరీ, సెకండరీ మెడికల్ బోర్డులు హరీష్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని, కోలుకునే అవకాశం చాలా తక్కువేనని నివేదించాయి. మెడికల్ రిపోర్టులపై జస్టిస్ జేబీ పార్థీవాలా ధర్మాసనం.. ఇది చాలా బాధాకరమైన నివేదిక. హరీష్ను ఇలాగే ఉంచలేం’ అని అన్నారు. తాజాగా, అత్యున్నత న్యాయ స్థానం పాసివ్ యూతనేషియాకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. -
సోషల్ మీడియాలో పరిచయం… లాడ్జికి పిలిచి..!
కర్ణాటక : శ్రీమంతులను గురి పెట్టి పరిచయం చేసుకొని తీయని మాటలతో వల వేసి దోచేస్తున్న కిలాడీ బాగోతమిది. బాగలకోట జిల్లా మహాలింగపురకు చెందిన దీప అవటగి (35)ని బెళగావి పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె స్నేహితుడు శివానంద మఠపతి పరారీలో ఉన్నాడు. శివానంద బెళగావి జిల్లా హుక్కేరివాసి, దీపకు శ్రీమంతుల వివరాలను అందించేవాడు. ఆమె ఫేస్బుక్, ఇన్స్టాలో అలాంటివారిని పరిచయం చేసుకొని బుట్టలో వేసుకొనేది. అశ్లీల చాటింగ్ చేసి, బెళగావిలో లాడ్జికి పిలిచేది. ఇలా ఓ బాధితుడు లాడ్జికి రాగానే స్నానాల గదిలోకి పంపించి, తాళం వేసుకొని బట్టలు, నగదు, మొబైల్, కారు తాళం తీసుకుని పరారైంది. పైగా డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేదని పోలీసుల విచారణలో బయట పడింది. కాల్ రికార్డింగులు, సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితురాలిని బెళగావిలోని తిళకవాడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
బస్సులో మహిళపై చిల్లర పడేసి, గొలుసు చోరీ
కర్ణాటక: మైసూరులో రెండుచోట్ల మహిళల బంగారు గొలుసులను దుండగులు తెంచుకెళ్లారు. వివరాలు.. వృద్ధురాలి మెడలోని 40 గ్రాముల గొలుసు చోరీ చేసిన ఘటన ఎన్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నీలమ్మ (60) అనే మహిళ బెళ్లూరు క్రాస్ నుంచి మైసూరుకు వచ్చే బస్సులో ప్రయాణిస్తుండగా ఇద్దరు అపరిచిత మహిళలు శిశువుతో సహా శ్రీరంగపట్టణలో బస్సు ఎక్కారు. శిశువు వాంతులు చేసుకుంటోంది, కిటికీ పక్కన స్థలం ఇవ్వాలని నీలమ్మను అడిగితే తిరస్కరించింది. కొలంబియా ఆస్పత్రి వద్దకు బస్సు చేరుకోగానే మహిళలు బస్సు దిగబోతూ తమ లగేజీని తీస్తూ నీలమ్మపైకి చిల్లరను పడేశారు. చిల్లరను తీసిచ్చేందుకు నీలమ్మ వంగినప్పుడు ఆమె మెడలోని బంగారు గొలుసును కట్ చేసుకున్నారు. ఎల్ఐసీ స్టాప్ రాగానే మహిళలు బస్సు దిగి వెళ్లిపోయారు. నీలమ్మ ఇంటికి వెళ్లిన తరువాత చూసుకుంటే గొలుసు లేదు. చిల్లర డబ్బులు వంటిపై పడినప్పుడు ఏదో మైకం కమ్మినట్లయిందని నీలమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. టీవీ చూస్తుండగా చొరబడి... మైసూరు చామరాజ మొహల్లా నివాసి ఇంద్రాణి సోమవారం రాత్రి 9.45 గంటల సమయంలో గాలి రావడం లేదని ఇంటి తలుపును తెరిచి ఉంచి టీవీ చూస్తోంది. ఆ సమయంలో దుండగుడు చొరబడి ఇంద్రాణి ముఖం, కళ్లపై స్ప్రే చేసి ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఆమె లక్ష్మీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
విద్యకు విశ్వ ‘భారతం’
సాక్షి, స్పెషల్ డెస్క్: మన దేశంలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దక్షిణాసియా నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు భారత్కు వస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కూడా డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వంటి విధాన సంస్కరణలే ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. అయితే మౌలిక సదుపాయాలు, గుర్తింపు, ఉపాధి అవకాశాలతో ముడిపడిన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. 2025లో వివిధ దేశాలకు చెందిన 58,000 మంది విద్యార్థులు భారత్లో చదువుతున్నట్టు అంచనా. మన దేశంలోని విద్యా సంస్థల్లో చేరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య 2030 వరకు ఏటా సుమారు 8% పెరుగుతుందని అంతర్జాతీయంగా ఉన్నత విద్య సమాచారం, ర్యాంకింగ్స్ను అందించే లండన్కు చెందిన క్యూఎస్ తన ‘క్యూఎస్ గ్లోబల్ స్టూడెంట్ ఫ్లోస్: ఇండియా 2026’నివేదికలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా గమ్యస్థానాలలో ఒకటిగా భారత్ నిలుస్తుందని వెల్లడించింది. భారత్కు కొత్త అవకాశాలు.. పదేళ్లలో భారత్కు వచ్చే అంతర్జాతీయ వి ద్యార్థుల సంఖ్య పెరగడానికి దేశీయంగా ప్ర భుత్వ విధాన సంస్కరణలు, దక్షిణాసియా –ఆఫ్రికా నుంచి పెరుగుతున్న డిమాండ్, సంప్రదాయ విదేశీ విద్యా గమ్యస్థానాలలో విపరీతంగా పెరుగుతున్న ఖర్చులు ప్రధాన కారణం. భారత్ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2047 నాటికి 5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తెలి సిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా నాణ్యమై న విద్య కోసం అధికం అవుతున్న డిమాండ్ భారత్కు కొత్త అవకాశాలను కలి్పస్తోంది. వీసా నిబంధనలతో.. ఆంగ్లం మాట్లాడే విద్యా గమ్యస్థానాలైన అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలు ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అక్కడ ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ప్రపంచ విద్యా రంగంలో మార్పులు వస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యా ర్థులు తక్కువ ఖర్చుతో కూడిన, సులభంగా ప్రవేశం లభించే విద్యా కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్లో విద్యా వ్యయం తక్కువగా ఉండడం, విస్తరిస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ విదేశీ విద్యార్థులకు ప్రధాన ఆకర్షణలుగా మారుతున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి.. ⇒ పెరుగుతున్న ఆదరణ: దక్షిణాసియా తర్వాత ఆఫ్రికా దేశాల నుంచి ప్రధానంగా సబ్–సహారన్ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ⇒ వృద్ధి రేటు: విద్యార్థుల రాక ఏటా 6% వృద్ధి చెందుతుందని అంచనా. ఈ దేశాల్లో యువత ఎక్కువ. ఉన్నత విద్యకు పరిమితమైన అవకాశాలు. ⇒ జింబాబ్వే: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. 2024లో భారత్కు విద్యార్థులను పంపిన దేశాల్లో 7వ స్థానం. 2030 నాటికి 6వ స్థానానికి చేరుకుంటుందని అంచనా. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా.. ⇒ స్థిరమైన సహకారం: ఈప్రాంతం నుంచి విద్యార్థుల రాక స్థిరంగా కొనసాగుతోంది. ⇒ యూఏఈ: 2030 నాటికి భారత్లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 5% వరకు ఉండే అవకాశం.ఆకర్షణీయమైన అంశాలు..⇒ భౌగోళిక సామీప్యత: పొరుగు దేశాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రయా ణ సౌలభ్యం మెరుగ్గా ఉండటం. ⇒ సాంస్కృతిక సారూప్యత: ఆహారం, జీవనశైలి, భాషాపరంగా ఉన్న దగ్గరి సంబంధాలు విద్యార్థులకు సౌకర్యవంతంగా అనిపించడం. ⇒ తక్కువ ఖర్చు: ఇతర దేశాలతో పోలిస్తే విద్యా, జీవన వ్యయాలు చాలా తక్కువగా ఉండటం. ⇒ ప్రధాన సమస్య: భారతీయ విద్యా సంస్థల విషయంలో కంపెనీల దృష్టిలో గుర్తింపు, విద్యాపరమైన గుర్తింపు మధ్య పెద్ద వ్యత్యాసం. ⇒ మెరుగుపడిన ఎంప్లాయర్ ర్యాంకింగ్: గత దశాబ్దంలో భారతీయ గ్రాడ్యుయేట్లపై కంపెనీలకు ఉన్న నమ్మకం, గుర్తింపు గణనీయంగా పెరిగింది. ⇒ స్థిరంగా ఉన్న అకడమిక్ సూచీలు: విద్యా నాణ్యత, పరిశోధనలు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల పరంగా ఉండే గుర్తింపులో మాత్రం పెద్దగా మార్పు లేదు.భారత్లో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో దక్షిణాసియా దేశాలు దాదాపు సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే విద్యార్థులు మొత్తం ప్రవేశాలలో 30% కంటే ఎక్కువ. రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతం నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా నేపాల్ కొనసాగుతుందని అంచనా. -
ధర్నా వేదికపై ‘చిత్రం’
కోల్కతా: పశ్చిమబెంగాల్లో సర్ ప్రక్రియలో పెద్దసంఖ్యలో ఓటర్ల తొలగింపునకు నిరసనగా కోల్కతాలో ధర్నా కొనసాగిస్తున్న సీఎం మమతా బెనర్జీ మంగళవారం కుంచె పట్టారు. నిరసన వేదికపై ఏర్పాటు చేసిన పచ్చ రంగు కాన్వాస్పై తెల్ల రంగుతో సర్ అంటూ రాసిన ఆమె..ఓటర్ల తొలగింపును సూచికగా నల్లరంగు బాక్సులను చిత్రించారు. అదేవిధంగా, కాన్వాస్ మధ్యలో వ్యానిష్(మాయం) అని రాసి, నల్ల రంగుతో పెద్దబాక్సును గీశారు.సీఎం మమత గతంలో పలుమార్లు గతంలో ప్రధాన ఎన్నికల కమిష నర్ను వ్యానిష్ కుమార్గా పేర్కొనడం గమనా ర్హం. ఇలా ఉండగా, సర్ను నిరసిస్తూ ఈ నెల 6వ తేదీ నుంచి ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న మమత ధర్నాను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు అభ్యంతరాలపై అప్పిల్లేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. -
2028 వరకు జల్జీవన్ మిషన్
న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్(జేజేఎం)ను డిసెంబర్ 2028 వరకు పొడిగించడం సహా కేంద్ర మంత్రివర్గం మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జేజేఎం 2.0 కింద రూ.8.7 లక్షల కోట్లను వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లోని 3.23 కోట్ల గృహాలకు పైపులైన్ల ద్వారా తాగునీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.దేశంతో భూ సరిహద్దులు కలిగిన చైనా, ఇతర దేశాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్న నిబంధనలను సడలించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే ఆయా దేశాల వాటాదారులు, 10 శాతం వరకు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడనుందన్నారు. ఈ మేరకు 2020లో జారీ చేసిన నోటీసును సవరించనుందని చెప్పార. మదురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేపైగల మధ్యప్రదేశ్లోని 80 కిలోమీటర్ల బద్నావర్–తిమర్వానీ సెక్షన్ను రూ.3,839 కోట్లతో నాలుగు లేన్లుగా 24 నెలల కాలంలో విస్తరించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. దీంతోపాటు, బెంగాల్–జార్ఖండ్లను కలిపే రూ.4,474 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. ఇన్సాల్వెన్సీ లా, కంపెనీ చట్టానికి సవరణలు చేపట్టాలని కూడా కేబినెట్ తీర్మానించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. -
అర్హులెవ్వరినీ తొలగించం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రధాన ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు. బెంగాల్లో ఎన్నికల సన్నద్ధతపై రాజకీయ పార్టీలు, ఉన్నతాధికా రులతో ఈసీ వరుస సమీక్షా సమావేశాలు నిర్వ హించిన అనంతరం మంగళవారం కోల్కతాలో ఈసీలోని ఇతర సభ్యులతో కలిసి జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.ఢిల్లీ వెళ్లాక రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తామ న్నారు. బెంగాల్లో సర్ అమలు పలు వివాదాలకు, ఉద్రిక్తతలకు దారితీయడంపై ఆయన స్పందిస్తూ.. అనర్హులైన వారిని జాబితా నుంచి తొలగించడమే కాదు, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 6 వేల మందికి పైగా శతాధిక వృద్ధులతోపాటు కొత్తగా నమోదైన 18–19 ఏళ్ల గ్రూపులోని 5.23 లక్షల మంది యువజనులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వివరించారు. -
ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు
స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. – కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై మంగళవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాల నడుమ సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, కొందరు మహిళా ఎంపీలపైఆయన నిరాధార ఆరోపణలు చేశారని, కొన్ని అంశాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు.స్పందించిన అధికార పక్షం, ఓం బిర్లాను తొలగించేందుకు తీసుకువచ్చిన తీర్మానం వార్తల్లో నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించింది. ఓం బిర్లా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారంటూ మద్దతు తెలిపింది. స్పీకర్ స్థానంలో ఉన్న వారు తమను తాము సమర్థించుకునేందుకు సభలో జరిగే ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటింగ్కు దూరంగా ఉండాలని బిర్లా నిర్ణయించుకున్నారు. హోం మంత్రి అమిత్ షా ప్రసంగంతో బుధవారం ఈ తీర్మానంపై చర్చ ముగియనుంది.తటస్థంగా ఉంటారని ఆశించాం. కానీ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు.సభా మర్యాదను కాపా డేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకే స్పీకర్ను తొలగించేందుకు ప్రతిపక్షం తీర్మానం తీసుకు రావాల్సి వచ్చిందన్నారు. ‘స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు’అని గొగోయ్ ఆరోపించారు. సభలో వాక్ స్వాతంత్య్రం లేనేలే దన్నారు. సభ్యులందరికీ వ్యక్తిగతంగా స్పీకర్తో సత్సంబంధాలే ఉన్నప్పటికీ, ఈ తీర్మా నం తేవాల్సి రావడం విచారకరమని గొగోయ్ పేర్కొన్నారు. అందరికీ అవకాశమిచ్చారు: మంత్రి రిజిజుఈ చర్చ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్పై ఆగ్రహం వ్యవక్తం చేశారు. వాస్తవానికి ఓం బిర్లా సభ్యుల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారన్నారు. అధికార పక్షం కంటే ప్రతిపక్ష సభ్యులకే తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎక్కువ అవకాశాలిచ్చారని తెలిపారు. అధికారం కోల్పోయిన 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈసారి స్పీకర్ పదవినే లక్ష్యంగా చేసుకుందని, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. డీఎంకే నేత టీఆర్ బాలు, టీడీపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, శివసేన(యూబీటీ) సభ్యుడు అర్వింద్ సావంత్, టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చలో పాల్గొన్నారు. -
వంటగ్యాసే ఫస్టు!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దేశంలో వంట గ్యాస్ సరఫరా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గృహ వినియోగానికి ప్రస్తుతం ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగినంత లేకపోవడంతో ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. రవాణా రంగానికి అవసరమైన గ్యాస్ సరఫరా నిలిచిపోతోంది.సమస్య పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేయాలని ఆదేశించింది. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి, తర్వాత ఎరువుల ఉత్పత్తికి, అనంతరం తేయాకు పరిశ్రమ, పారిశ్రామిక వినియోగదారులకు, ఆ తర్వాత సిటీ గ్యాస్ సరఫరాదారులకు సహజ వాయువును సరఫరా చేయాలని పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గ్యాస్ను మొదట ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎలీ్పజీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) తయారీకి అందజేయాలని తేలి్చచెప్పింది. పారిశ్రామిక వినియోగదారులకు 80%ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ఉత్పత్తిలో సహజ వాయువును ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఒక ఉపఉత్పత్తి ఎల్పీజీ. అలాగే సహజ వాయువును ప్రాసెస్ చేయడం ద్వారా ఎల్పీజీని తయారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి ప్రాధాన్యం ఇస్తూ సహజ వాయువును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆయా రంగాల్లో గత ఆరునెలల సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని అందులో 100 శాతం సరఫరా చేయాలి. ఈ మూడు రంగాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఎరువుల తయారీ, తేయాకు పరిశ్రమతోపాటు ఇతర పారిశ్రామిక వినియోగానికి గ్యాస్ అందజేయాలి.ఎరువుల తయారీ రంగానికి గత ఆరు నెలల సగటు డిమాండ్లో కనీసం 70 శాతం సరఫరా చేయాలి. ఇక తేయాకు పరిశ్రమ, ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగదారులకు గత ఆరు నెలల సగటు డిమాండ్లో 80 శాతం సహజ వాయువు అందజేయాలి. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సిటీ గ్యాస్ సరఫరాదారులకు(సీజీడీ) ఆరు నెలల సగటు డిమాండ్లో 80 శాతం ఇవ్వొచ్చు. దేశీయంగా నిత్యం 191 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు అవసరం. దేశంలో రోజువారీ మొత్తం అవసరాల్లో సగం దేశీయ సహజ వాయువే తీరుస్తోంది. పెట్రోకెమికల్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఈ గ్యాస్ను సరఫరా చేయకుండా నియంత్రణ విధించారు. మూసివేత దిశగా హోటళ్లువాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత హోటళ్లు, రెస్టారెంట్లపై పెను ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆహారశాలలు మూతపడుతున్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఔరంగాబాద్, నాగపూర్, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. రానున్న రెండు రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు సాగర్ దర్యానీ మంగళవారం చెప్పారు. పశ్చి మాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయినట్లు తెలియజేశారు.ఎల్పీజీ ఉత్పత్తి 10% పెంపు దేశంలో ఎల్పీజీ సంక్షోభం లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. తమ ఆదేశాల మేరకు చమురు శుద్ధి కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచాయని వెల్లడించింది. రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. వంట గ్యాస్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజలెవరూ నమ్మొద్దని కోరింది. ఎల్పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. మన ప్రజలు ఇబ్బంది పడొద్దు⇒ చమురు, గ్యాస్ సరఫరా, ధరల విషయంలో సమన్వయంతో పనిచేయండి ⇒ కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశం న్యూఢిల్లీ: పశ్చి మాసియా సంక్షోభం, తద్వారా దేశంలో చమురు, వంట గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. పశ్చి మాసియా యుద్దం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరల విషయంలో మన దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హొర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మన వినియోగదారులపై పడకుండా చూడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అంతేకాకుండా చమురు, వంట గ్యాస్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ధరలు పెరుగుతున్న తీరుపైనా ప్రధానమంత్రి సమీక్షించారు. పశ్చి మాసియా నుంచి చమురు సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా, అమెరికా, వెనెజువెలా, ఆ్రస్టేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపాయి. -
ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం హోటల్ రంగాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తుల దిగుమతికి ఆటంకాలు ఎదురవుతుండటంతో దేశంలో వాణిజ్యావసరాలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గృహావసరాలకు, అత్యవసర సేవలు అందించే ఆస్పత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. మరోవైపు ఈ నెల 7వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. కేంద్రం ఆంక్షల నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఇప్పటికే ముంబై, బెంగళూరులో 20 శాతం హోటళ్లు మూతపడినట్లు తెలుస్తోంది. చిన్న, మధ్య తరగతి హోటళ్లు, మెస్లు, హాస్టళ్లపై సైతం దీని ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లోనూ సమస్య తలెత్తుతున్నట్టు సమాచారం. వీరికి హోటళ్లే ఆధారం తెలంగాణలో 1.49 కోట్ల గృహ వినియోగదారులు ఉండగా, నెలకు కోటికి పైగా సిలిండర్లు వినియోగమవుతున్నాయి. అలాగే 5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా, వినియోగం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 వేలకు పైగా మీడియం స్థాయి హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా, చిన్న హోటళ్లు భారీ ఎత్తున ఉన్నాయి. మెస్లు, చిన్న చిన్న రోడ్డుపక్క హోటళ్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక స్టార్ హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు రోజుకు ఒక సిలిండర్, పెద్దవి 3–5 వినియోగిస్తాయి. వినియోగదారులను బట్టి రెస్టారెంట్లు, బార్లలో కూడా రోజుకు ఐదుకు తక్కువ కాకుండా సిలిండర్ల వినియోగం ఉంటుంది. అదే స్టార్ హోటళ్లు రోజుకు 25 సిలిండర్లకు పైగా వినియోగిస్తాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం వంటి నగరపాలక సంస్థలతో పాటు జిల్లా కేంద్రాలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాలలోని హోటళ్లలో కూడా గ్యాస్ సిలిండర్ల వినియోగం పెద్ద ఎత్తున ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు హోటల్ ఆహారమే ఆధారం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే హోటళ్లు మూత పడడమే కాకుండా లక్షలాది మంది ఉపాధికి గండి పడుతుంది. 60–65 శాతం ఎల్పీజీ దిగుమతి భారత్ 60–65 శాతం ఎల్పీజీ కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి సరఫరా ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. 2025లో ఎల్పీజీ వినియోగం 31 మిలియన్ టన్నులకు చేరగా, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి కేవలం 12–13 మిలియన్ టన్నులకే పరిమితమవడంతో సమస్య మరింత ఉధృతమైంది. ప్రత్యామ్నాయాల అన్వేషణలో హోటల్ రంగం తాజా పరిస్థితులతో ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు హోటల్ రంగం మొగ్గు చూపుతోంది. ఎలక్ట్రిక్ స్టవ్లు, బయోగ్యాస్ వంటి ఆప్షన్లు పరిశీలిస్తున్నప్పటికీ, అవి ఖర్చుతో కూడుకున్నవే గాక తక్షణ పరిష్కారానికి వీలుకానివనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వంటగదుల్లో విద్యుత్ వినియోగం పెంచే ఆలోచనలో హోటళ్ల యజమానులు ఉన్నారు. హైదరాబాద్లో పుష్కలంగా నిల్వలు యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో సాధారణ రోజుల కంటే ఇప్పుడు గృహ వినియోగం బుకింగ్ల సంఖ్య 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో సిలిండర్ల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వినియోగదారులు అనవసరంగా భయాందోళన చెందవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: భారత్ గ్యాస్ వంట గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఆందోళన చెందుతుండడంతో గ్యాస్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్..ఎల్పీజీ వినియోగదారులు ఆందోళన చెందవద్దంటూ సంక్షిప్త సందేశాలు పంపుతోంది. ‘ఇంధన సరఫరాలో కొరత ఉందని సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదారి పట్టించే, ఆధార రహితమైన వార్తలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. ఇంధనాన్ని సమర్థవంతంగా, అవసరానికి అనుగుణంగా వినియోగించడం మంచిది’ అని బీపీసీఎల్ ఆంగ్లంలో ఎస్ఎంఎస్లు పంపించింది. అయితే గృహ వినియోగదారులు ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత మరోసారి బుక్ చేయాలంటే ఇప్పటివరకు ఉన్న 21 రోజుల గడువును 25 రోజులకు పెంచుతూ ఆయిల్ కంపెనీల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఏజెన్సీలు చెబుతున్నాయి. హోటళ్లు మూతపడే ప్రమాదం: హోటల్స్ అసోసియేషన్ వాణిజ్య ఎల్పీజీ సరఫరా నిలిచిపోతే హోటల్ రంగం మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకటరెడ్డి, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాల్ తదితరులు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని కలిసి సమస్యను వివరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రి ఢిల్లీకి వెళ్లిన కారణంగా వచ్చిన తర్వాత ఆయన్ను కలుస్తామని వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో హోటళ్లు మూతపడిన దాఖలాలు లేవని, కానీ సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారని ఆయన వివరించారు.


