breaking news
National
-
ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో విస్తుపోయే విషయాలు
ఆ ఇద్దరూ క్లాస్మేట్స్. అయితే బ్యాక్లాగ్స్తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్లో.. అందులోనూ మెన్స్ టాయ్లెట్లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే.. మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే.. లిఫ్ట్లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్లో ఉన్న మెన్స్ టాయ్లెట్లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్మేట్స్కు ఆమెకు సలహా పడేశారు.అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి! -
నన్ను కలవొద్దని ఈ కుటుంబాన్ని బెదిరించారు: రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్ రాయ్బరేలీలో గాంధీ జయంతి నాడు దొంగ అనే అనుమానంతో హరీఓం వాల్మీకి అనే దళితుడ్ని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన అక్కడ తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం ఫతేపూర్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను కలవొద్దని ఈ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని బెదిరించిందని.. అది కుదరకపోవడంతో ఫేక్ ప్రచారానికి దిగిందని మండిపడ్డారాయన. దేశంలో దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కుటుంబం ఎలాంటి నేరం చేయలేదు. ఇది ఒక బాధిత కుటుంబం. కానీ వీళ్లేదో నేరస్తులన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నన్ను కలవొద్దని వీళ్లను పోలీసులు బెదిరించారు. వీళ్లను కనీసం ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. హరీఓం కుమార్తెకు శస్త్రచికిత్స అవసరం. వీళ్ల ఆంక్షలతో ఆమెకు కనీస వైద్యసేవలు అందడం లేదు. చర్యలు తీసుకోవాల్సింది నేరస్తుల మీద. వీళ్ల మీద కాదు. నేరస్తుల రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అని యోగి సర్కార్పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. మాకు మీ పరామర్శ అక్కర్లేదు.. ప్రభుత్వం తగినంత సాయం చేసింది అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పోస్టర్లను చించేయగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంకోవైపు.. హరీఓం సోదరుడు, ఆ కుటుంబం పేరిట కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యింది. मृतक हरिओम वाल्मीकि के भाई ने Rahul Gandhi को Expose कर दिया।शर्मा आनी चाहिए कांग्रेस को।pic.twitter.com/UnKZrN1Tlf— Unfileterd Rencho (@UnfileterdR) October 17, 2025రాష్ట్ర మంత్రులు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. మా సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు. నేరస్తులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో మేం సంతృప్తిగానే ఉన్నాం. రాహుల్ గాంధీ సహా నేతలెవరూ మా ఇంటి వైపు రావొద్దు అంటూ ఆయన చెప్పడం అందులో ఉంది. పైగా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయానే వాటిని పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వీడియోలపై మీడియా నుంచి రాహుల్ గాంధీకి ప్రశ్న ఎదురైంది.ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతీసారి బీజేపీ ఇలానే చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అది బలవంతంగా తీయించిన వీడియో అని, ఆ వీడియోను మోదీ అనుకూల మీడియా(Godi Media), బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారాయన. అయితే కాసేపటికే రాహుల్ను కలవడం సంతోషంగా ఉందంటూ మరో వీడియో ఆ కుటుంబం పేరిట బయటకు రావడం గమనార్హం.Whenever you think that BJP can’t stoop lower than this, they set a new parameter. Hariom Valamiki family told Rahul Gandhi Ji that they were threatened by the BJP govt to not meet him and they were forced to say this on camera. That video was made viral by Godi media and BJP. pic.twitter.com/q42JsYrBxc— Shantanu (@shaandelhite) October 17, 2025అక్టోబర్ 2వ తేదీన జమునాపూర్ వద్ద హరీఓం వాల్మీని దొంగగా అనుమానించి కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విమర్శల నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించింది యోగి ప్రభుత్వం. అక్టోబర్ 11వ తేదీన బాధిత కుటుంబాన్ని యోగి పరామర్శించారు. ఆ కుటుంబం కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆ సమయంలో భరోసా ఇచ్చారాయన. అంతేకాదు.. హరీఓం సోదరికి కాంట్రాక్ట్ బేస్ మీద స్టాఫ్ నర్స్గా ఉద్యోగం ఇప్పించారు. राहुल गांधी जी आज हमसे मिलने आए। वे हमारे लिए मसीहा हैं, हम चाहते हैं कि वे हमें न्याय दिलाएं। - हरिओम वाल्मिकी जी का परिवारअब बिलकुल चुप रह तू ।pic.twitter.com/wr7DkBZW5Y— Surbhi (@SurrbhiM) October 17, 2025ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిని అక్టోబర్ 10న ఎన్కౌంటర్లో పట్టుబడ్డాడు. ఇప్పటిదాకా 14 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమర్శల నేపథ్యంలో.. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. జాతి కోణంలో ఈ ఘటనను చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. -
శబరిమల బంగారం కేసు.. ప్రధాన నిందితుడు అరెస్ట్
తిరువనంతపురం: శబరిమల(Sabarimala) ఆలయంలో విగ్రహాల బంగారం తాపడం విషయంలో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తాజాగా ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని(Unnikrishnan Potti) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ముందు ఉన్నికృష్ణన్ను హాజరుపరచనున్నారు.కాగా, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టిని ఆయన ఇంట్లో (పులిమత్లో) అదుపులోకి తీసుకున్నట్లు (సిట్) అధికారులు తెలిపారు. అనంతరం, తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారించారని సిట్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం సిట్ ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ఇంజనీర్ కె.సునీల్ కుమార్ను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ గతంలో సస్పెండ్ చేశారు. కాగా, ఈ వివాదంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న రిటైర్డ్ అధికారులకు షోకాజ్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.#WATCH | Thiruvananthapuram, Kerala | Unnikrishnan Potti, the prime accused in the Sabarimala gold theft case, has been arrested after over ten hours of questioning by the Special Investigation Team (SIT). The arrest was officially recorded at 2:30 a.m. on Friday. Unnikrishnan… pic.twitter.com/AMqUBpLric— ANI (@ANI) October 17, 2025జరిగింది ఇదీ.. శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించడం జరిగింది. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ పేర్కొంది.అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. అలాగే ముందుస్తు అనుమతి తీసుకోకుండా ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడం పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వివాదంపై ఇప్పటికే న్యాయస్థానం సిట్ ఏర్పాటు చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. -
భార్య నరికివేత
కర్ణాటక: కుటుంబ కలహాలతో భార్యను భర్త నరికి చంపిన ఘటన చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. అజ్జంపుర తాలూకా చిక్కనావంగళ గ్రామానికి చెందిన తను (25) హతురాలు. వివరాలు ఇలా ఉన్నాయి.. తనుతో రమేశ్కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే భర్తతో తరచూ గొడవలు రావడంతో ఆమె రెండేళ్ల నుంచి వేరేగా ఓ వక్కతోటలోని ఇంటిలో నివసిస్తోంది. బుధవారం రాత్రి మద్యం మత్తులో రమేశ్ తను ఇంటికి వెళ్లాడు. ఆమెను కొడవలితో నరికి చంపాడు. తరువాతన తన చేతిని కోసుకొని.. భార్యే నన్ను చంపడానికి యత్నించినట్లు గ్రామస్థులకు చెప్పాడు. ఏమి జరిగిందో చూద్దామని ఆమె ఇంటికి గ్రామస్థులు వెళ్లగా రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. రమేశ్ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త, అతని అక్క, చెల్లెలు, అత్తమామలతో పాటు 9 మందిపై తను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 9 మందినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
లొంగిపోనున్న మరో కీలక దళం నేత! ఎవరంటే..
వరుస బెట్టి అన్నలు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కేంద్ర హోం శాఖ ఆపరేషన్ కగార్ ప్రభావంతో.. కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఈ ఏడాది మే 21న సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ చత్తీస్గఢ్లోని అబుజ్మాద్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే పార్టీ అంతర్గతంగా గందరగోళానికి లోనవుతూ వస్తోంది. ఆపరేషన్ కగార్(Operation kagar)తో మావోయిస్టు శిబిరాల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. బస్వరాజ్ మరణం తర్వాత CPI (మావోయిస్టు)లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ ఆంతర్గత విభేదాలు బయటపడడం, కీలక నేతల ఆరోగ్య సమస్యలు లొంగుబాటుకు కారణాలవుతున్నాయి. దీనికి తోడు భద్రతా దళాల ఒత్తిళ్ల కారణంగా అగ్రనేతలు వరుసగా లొంగిపోతున్నారు. తాజాగా కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆశన్న ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. జగదల్పూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో 208 మావోయిస్టులతో కలిసి ఆయన ఆయుధాలు అప్పగించారు. మొత్తం 153 తుపాకులు అగప్పించగా.. లొంగిపోయినవాళ్లలో 110 మంది మహిళా మావోయిస్టులు ఉండడం గమనార్హం. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న(రెడ్ సర్కిల్లో)ఆశన్న అసలు పేరు తక్కపల్లి వాసుదేవరావు. ములుగు జిల్లా వెంకటాపురం ఆయన స్వస్థలం. బైరంగూడా అడవుల్లో దశాబ్దాలుగా అండర్గ్రౌండ్గా జీవనం కొనసాగిస్తూ వచ్చారు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి, మాజీ మంత్రి మాధవరెడ్డి, IPS అధికారి ఉమేశ్ చంద్ర హత్యలకు ప్రధాన సూత్రధారిగా ఆయనకు పేరుంది. అలాంటి కీలక నేత లొంగుబాటును మావోయిస్టులకు భారీ దెబ్బ అనే చెప్పొచ్చు. లొంగిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లు తనను సంప్రదించవచ్చని తన చివరి ప్రసంగంలో ఆయన దళ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..మల్లోజుల, ఆశన్న.. రేపు ఎవరా? అనే చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మావోయిస్ట్ పార్టీకి మరో ఝలక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్(Bandi Prakash) లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ద్వారా లొంగుబాటు యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, అశోక్, క్రాంతి.. స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) తరఫున పోరాడారు. ఆపై మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేదా డీజీపీ లేకుంటే స్థానిక పోలీసుల ఎదుట బండి ప్రకాశ్ లొంగిపోయే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. 2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్ను ఉధృతం చేశారు. గత రెండేళ్లలో దేశంలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉండగా.. అందులో 8 మంది తెలంగాణ నుంచే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: ఆ ఒక్కడి లెక్క తేలిస్తే మావోయిస్టు పార్టీ ఖతమైనట్లే! -
అదే జరిగితే బెంగాల్లో రాష్ట్రపతి పాలనే.. సువేందు అధికారి హెచ్చరిక
జల్పాయ్గురి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి 2026లో జరగనున్న ఎన్నికలతో ప్రభుత్వం మారనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి జోస్యం చెప్పారు. సకాలంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.జల్పాయ్గురి జిల్లా నగ్రాకటలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తికాని పక్షంలో ఎన్నికలు జరగవన్నారు. ‘వచ్చే ఏడాది మే 4వ తేదీకల్లా ఎస్ఐఆర్ పూర్తి చేయాల్సి ఉంది. లేకుంటే ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల ముందు సెమీఫైనల్స్ వంటిది. ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదు’ అని సువేందు వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ‘2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలు పొందిన ఓట్లలో తేడా 42 లక్షలు మాత్రమే. అప్పట్లో అక్రమంగా చేర్చిన 2.4 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎస్ఐఆర్లో తొలగిస్తారు. అక్రమ వలసదారులు, ఇతరత్రా అనర్హుల పేర్లు సైతం ఉండవు. భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీకి తన చేతిలో ఓటమి తప్పదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
లొంగిపోయే ముందు ఆశన్న చివరి ప్రసంగం.. ఏమన్నారంటే?
భద్రాద్రి కొత్తగూడెం: లొంగిపోయే ముందు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చివరిసారిగా తన సహచర మావోయిస్టులకు భావోద్వేగ ప్రసంగం ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు వదిలిపెడుతున్నామని.. ఇది లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని ప్రభుత్వం ఒప్పుకుందని ఆయన అన్నారు. ఎవరికి వారే తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు.‘‘ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నన్నుకాంటాక్ట్ చేయండి. సహచరులందరూ ఎక్కడవాళ్లు అక్కడే లొంగిపోవడం మంచిది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఉద్యమంలో అమరులైన వారందరికీ జోహార్లు’’ అంటూ ఆశన్న ప్రసంగించారు.కాగా, అడవిని వీడి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆశన్న ఛత్తీస్గఢ్ మీడియాతో మాట్లాడారు. ఇకపై తమ పోరాటం రాజ్యాంగానికి లోబడి కొనసాగుతుందన్నారు. తాము సాయుధ పోరాటానికి మాత్రమే విరమణ ఇచ్చామని, ఇకపై శాంతియుగ మార్గంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘శాంతి చర్చల కోసం ప్రజా సంఘాలు, మేధావులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో సాయుధ పోరాటానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.ఈ సందర్భంగా మేము పెట్టిన ప్రధాన షరతుల విషయంలో ప్రభుత్వ స్పందన సానుకూలంగా ఉంది. గతంలో మా పార్టీ, అనుబంధ సంఘాల్లో పని చేశారనే ఆరోపణలపై పోలీసులు జైళ్లలో పెట్టిన వారిని వెంటనే విడుదల చేయాలి. దీంతోపాటు మూలవాసీ బచావో మంచ్ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేయాలి. ఆ సంస్థలో పనిచేస్తున్నారనే ఆరోపణలతో పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఇకపై మూలవాసీ బచావో మంచ్ వంటి సంస్థల ద్వారా చట్టబద్ధంగా మా పోరాటం కొనసాగిస్తాం. మేము కేవలం సాయుధ పోరాటానికే విరమణ ఇచ్చాం తప్పితే లొంగిపోలేదు. మా పోరాటం ఆపేది లేదు. జనజీవన స్రవంతిలో కలిసినవాళ్లు ప్రభుత్వ పోలీసు విభాగమైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ)లో చేరబోమని స్పష్టం చేశాం’అని ఆయన వెల్లడించారు. -
నితీశ్ మళ్లీ సీఎం.. డౌట్ కామెంట్స్ చేసిన అమిత్ షా!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార ఎన్డీయే కూటమిలో లుకలుకలు నడుస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అలాగే.. బీహార్ సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపైనా ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ స్పష్టత ఇచ్చారు.బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు(Amit Shah On Bihar CM Candidate). బీహార్ ఎన్డీయే కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పనికి మాలినవని తోసిపుచ్చారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోనే బీహార్ ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని షా ప్రస్తావించారు. అయితే.. బీహార్ ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు.. అంత తొందర ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారా? కారా?(Will Nitish Kumar CM Again) అనేది నేను ఒక్కడినే నిర్ణయించే అంశం కాదు. ప్రస్తుతానికి ఆయన సారథ్యంలోనే మేం ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలయ్యాక.. మిత్రపక్షాలన్నీ కూర్చుని అప్పుడు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తాయి అని షా స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల్లో(2020) జేడీయూ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు నెగ్గింది. ఆ టైంలో నితీశ్ కుమార్ ప్రధాని మోదీని కలిసి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండడం సబబని అన్నారు. కానీ, మా మిత్రపక్షానికి మేం ఎప్పుడూ గౌరవం ఇస్తాం. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని సీఎం చేశాం అని షా అన్నారు.నితీశ్ తరచూ పార్టీలు మారుతున్న సందర్భాన్ని ప్రస్తావించగా.. షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1974లో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణన్ సారథ్యంలో జరిగిన ఆందోళనతో నితీశ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని, అది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సందర్భాన్ని గుర్తు చేశారు. పైగా నితీశ్ రెండున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్తో అనుబంధం కొనసాగించారని.. ఎక్కువ కాలం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇక..నితీశ్ ఆరోగ్యం, పబ్లిక్లో ఆయన ప్రవర్తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా అమిత్ షా స్పందించారు. వయసు కారణంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ, ముఖాముఖిగా, ఫోన్ ద్వారానూ నితీశ్ సుదీర్ఘంగా, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారని షా అన్నారు. అంతేకాదు.. సీఎంగా ఆయన సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు.ఇక.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections 2025) ఎన్డీయే కూటమి మునుపెన్నడూ చూడని ఘన విజయం సాధిస్తుందని.. నవంబర్ 14న వెల్లడయ్యే ఫలితాలతో గత రికార్డులను బద్దలు కొడతామని షా ధీమా వ్యక్తం చేశారు.74 ఏళ్ల వయసున్న నితీశ్కుమార్ ఇప్పటికే 9 సార్లు(2000 సంవత్సరంలో తొలిసారి) బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ఆయన బీహార్ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని, గవర్నర్గానో, రాజ్యసభకో వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. అంతెందుకు మొన్నీమధ్యే ఉప రాష్ట్రపతి పదవి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. అయితే నితీశ్ 10వ సారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని జేడీయూ అంటోంది.ఇదీ చదవండి: కరూర్ ఘటన తర్వాత.. విజయ్ క్రేజ్ మరింత పెరిగిందా? -
అవినీతి తిమింగళం.. డీఐజీ ఇంట్లో నోట్ల కట్టలు, కిలోన్నర బంగారం..
చండీగఢ్: పంజాబ్లో అవినీతి తిమింగలం బయటపడింది. పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ)(DIG Harcharan Bhullar) ఆఫ్ పోలీస్ హర్చరణ్ భుల్లార్ను లంచం ఆరోపణలపై సీబీఐ(CBI) అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఎనిమిది లక్షల రూపాయల లంచం కేసులో సీబీఐ.. భుల్లార్కు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేయగా విస్తుపోయే దృశ్యాలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. మండి గోబింద్గఢ్కు చెందిన తుక్కు వ్యాపారి ఆకాశ్ బట్టాపై 2023లో కేసు నమోదైంది. ఈ కేసును మాఫీ చేసేందుకు, నెలవారీ మామూళ్లతోపాటు రూ.8 లక్షల లంచం ఇవ్వాలని డీఐజీ భుల్లార్ డిమాండ్ చేశారు. ఇందుకుగాను కిషన్ అనే మధ్యవర్తితో వ్యవహారం నడిపారు. ఈ మేరకు వ్యాపారి ఆకాశ్ నుంచి సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. గురువారం చండీగఢ్లో ఆకాశ్ నుంచి డీఐజీ తరఫున రూ.8 లక్షలు తీసుకుంటుండగా కిషన్ను పట్టుకున్నామని సీబీఐ తెలిపింది. Images from DIG Ropar (Punjab) Harcharan Singh Bhullar's residence.CBI raid unearthed ₹5Cr cash, Merc, Audi, 22 Expensive watches, 1.5kg gold..He was part of anti-drug campaign as well.Routine news of highly corrupt clans of India — IAS and IPS officers. pic.twitter.com/P8HEo0o1Jh— The Hawk Eye (@thehawkeyex) October 17, 2025ఈ సందర్భంగా డీఐజీ, మధ్యవర్తి కిషను, వ్యాపారి ఆకాశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా డీఐజీని అరెస్ట్ చేశామని పేర్కొంది డీఐజీ కార్యాలయం, నివాసంలో జరిపిన సోదాల్లో రూ.5 కోట్ల నగదు, కిలోన్నర బరువున్న ఆభరణాలు, ఆస్తి పత్రాలు, మెర్సిడెజ్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వివరించింది. ఇద్దరు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోపర్ రేంజ్ DIGగా భుల్లార్ విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.Recovery from DIG Harcharan Bhullar Ropar of #PunjabPolice from his house by @cbic_india today.What a corruption it would be very small amount of items? 😂😂😂😂 pic.twitter.com/jRd3tHUOlI— Thomas 🇮🇳🇷🇺🇮🇱🕊️✌️ (@Thomas11P) October 16, 2025 -
అయ్యో.. యామిని!
కర్ణాటక రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది జరిగింది. ఓ యువతిని వెనక నుంచి వచ్చిన ఓ యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటనలో.. గిలగిలా కొట్టుకుంటూ ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం మధ్యాహ్నాం శ్రీరాంపుర ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోస్కెరెహళ్లి ಹೊಸಕೆರೆಹಳ್ಳಿలో యామిని ప్రియ(20) కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బీఫార్మసీ చదువుతున్న ఆమె గురువారం పరీక్ష కోసమని ఉదయం 7.గంకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే.. మధ్యాహ్నాం 3గం. సమయంలో మంత్రిమాల్ వద్ద శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై ఓ యువకుడు దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యామిని ప్రియ కుప్పకూలిపోగా.. ఊహించని ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. శ్రీరాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.ప్రియా యామిని ఆ నిందితుడి బైక్ మీదే వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోణం ఉందనే చర్చ నడుస్తోంది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.A 20 year old college student, Yamini Priya,was murdered by a known individual who slit her throat near the railway tracks in Srirampura,#Bengaluru.The victim was returning from college when she was attacked.Police have launched a manhunt to apprehend the accused..@DCPNorthBCP pic.twitter.com/3zMrcVEx1s— Yasir Mushtaq (@path2shah) October 16, 2025ఇదీ చూశారా?.. యువకుడి టైమింగ్తో తల్లీబిడ్డా సేఫ్! -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్కు అదిరిపోయే గుడ్న్యూస్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.ఈ పరిస్థితులలో విజయ్కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్ ఘటనతో విజయ్కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. -
బీహార్లో ఓటర్ల సవరణ సర్వేలో తప్పుల్లేవు: ఈసీ
న్యూఢిల్లీ: బీహార్లో(Bihar Assembly Elections) నెలల తరబడి కొనసాగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లలేదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. ఈ సర్వే విశ్వసనీయతను దెబ్బతీసేందుకే కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయని ఈసీ(Election Commission Of India) పేర్కొంది.తుది ఓటర్ల జాబితా ప్రచురించాక తమ పేరు తొలగించాలని కనీసం ఒక్క ఓటరు(Bihar Voter List) కూడా ఫిర్యాదు రాలేదని ఈసీ గుర్తుచేసింది. ముస్లింల ఓట్లను అసహ జరీతిలో తొలగించారన్న ఆరోపణల్లో నిజంలేదు. ఇలా మతపర ఆరోపణలకు అడ్డుకట్ట పడాలి’’ అని ఈసీ వ్యాఖ్యానించింది. అయితే తుది జాబితా లోనూ ఓటర్ల పేర్లలో తప్పులు దొర్లడంపై ఈసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘‘టైపింగ్ తప్పులు ఉండకుండా చూసుకుంటే బాగుండేది. ఇలాంటి వాటికి తగు స్వల్ప పరిష్కారాలు చూపిస్తే మంచిది’’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీల ధర్మాసనం అభిప్రాయపడింది. -
కాంగ్రెస్, జేడీయూ అభ్యర్థుల ప్రకటన.. కూటమిలో ట్విస్ట్!
న్యూఢిల్లీ: బీహార్ (Bihar Assembly Election) అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ (Congress Party) శుక్రవారం 48 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ రామ్ కుటుంబా స్థానం నుంచి... కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత షకీల్ అహ్మద్ ఖాన్కు కద్వా నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ చీఫ్ ప్రకాశ్ గరీబ్ దాస్కు బెచ్వాడా సీటు కేటాయించారు.బగాహాలో జయేశ్ మంగళ్ సింగ్, నౌతన్లో అమిత్ గిరి, చన్పటియాలో అభిషేక్ రంజన్, బెట్టియాలో వాసి అహ్మద్, రక్జౌల్లో శ్యామ్ బిహారీ ప్రసాద్ పోటీ చేయనున్నారు. గోవింద్గన్ స్థానం నుంచి శశి భూషణ్ రాయ్ అలియాస్ గప్పు రాయ్, రిగా నుంచి అమిత్ కుమార్ సింగ్ పోటీకి దిగనున్నారు. కాగా, ఆర్జేడీ సహా మహా ఘఠ్బంధన్ పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాకమునుపే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17వ తేదీ ఆఖరు. రెండో దశ పోలింగ్కు నామినేషన్లకు ఈ నెల 20వ తేదీతో గడువు ముగియనుంది.101 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన జేడీయూమరోవైపు.. బీహార్లో అధికార ఎన్డీఏ (NDA) కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ జనతాదళ్(యునైటెడ్) తాము పోటీచేయబోయే మొత్తం 101 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 57 మందితో తొలిజాబితా విడుదలచేయగా గురువారం మిగతా 44 మంది అభ్యర్థులతో చివరి జాబితాను వెల్లడించింది. చాలా మంది అభ్యర్థులు వెనువెంటనే తమ నామినేషన్లు దాఖలుచేస్తూ బిజీగా కనిపించారు. మొత్తం 101లో ఓబీసీలకు 37, ఈబీసీలకు 22, అగ్రవర్ణాలకు 22 చోట్ల అవకాశం కల్పించింది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తన రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇచ్చారు. విజయ్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జామా ఖాన్, షీలా మండల్, లేశీ సింగ్, సుమిత్ సింగ్, విభా దేవి, చేతన్ ఆనంద్, శ్వేతా గుప్తా ఈసారి బరిలో దిగనున్నారు. -
శ్రీలంకను భారత భద్రతకు ముప్పుగా మారనివ్వను
న్యూఢిల్లీ: శ్రీలంక గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకుని తీరతానని శ్రీలంక మహిళా ప్రధాని హరిణి అమరసూర్య వ్యాఖ్యానించారు. ఢిల్లీలో డిగ్రీ చదువుకున్న రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. 1991–94కాలంలో ఢిల్లీ వర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో సోషియాలజీలో డిగ్రీ చదువుకున్న నేపథ్యంలో గురువారం ఆమె పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘శ్రీలంక నిరంతరం ఒకే నిబంధనకు కట్టుబడి ఉంటుంది. పొరుగున ఉన్న మిత్రదేశం భారత్కు ముప్పు వాటిల్లేలా మా భూభాగాన్ని ఎలాంటి భారతవ్యతిరేక కార్యకలాపాలకు నెలవు కానివ్వను. ఈ నియమాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తాం’’అని అన్నారు. తమ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి గత ప్రభుత్వం కూలిపోవడంపై ఆమె మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం అనేది ప్రేక్షకులు ఆస్వాదించే క్రీడ కాదు. అతి నిరంతర అవిశ్రాంత కృషి. అంటే మన సమాజంతో ఎల్లప్పుడూ మమేకం కావాలి. న్యాయం కోసం పోరాడాలి. ప్రతి ఒక్కరూ తమతమ స్థాయిలో అందరి సంక్షేమం కోసం పాటుపడాలి. శ్రీలంక దేశ చరిత్రలో భారత్ శాశ్వత భాగస్వామిగా కీర్తికిరీటం పొందింది. ద్వీపం అయిన మా దేశంలో ఆర్థికసంక్షోభం తలెత్తినప్పుడు భారత్ నిజమైన నేస్తంలా ఆపన్న హస్తం అందించింది’’అని ఆమె అన్నారు. జయసూర్య తెలుసా? ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని భారత్, శ్రీలంకలో చూడొచ్చు. నాలాంటి సాధారణ వ్యక్తులను సైతం సమాజంలోని సమస్యలు, విద్యావ్యవస్థ రాటుదేలేలా చేస్తాయి. దేశసేవ చేసే స్థాయికి ఎదగనిస్తాయి. పాక్ జలసంధి కేవలం 22 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే సముద్రం వెంట భారత్, శ్రీలంకలను విడదీస్తోంది. కానీ ఇరుదేశాల నాగరికత, సాంస్కృతి, మత, ప్రాచీన బంధం ఏకంగా 2,000 సంవత్సరాల క్రితమే బలపడింది. ఇప్పుడు క్రికె ట్ సైతం ఈ బంధాన్ని పెనవేస్తోంది. 1991 లో ఇక్కడ డిగ్రీ ఆనర్స్ చదివేందుకు హిందూ కాలేజీలో తొలిసారి అడుగు పెట్టినప్పుడు నా పేరు చెప్పా. నాది శ్రీలంక అని తెలిసి చాలా మంది ఒక్కటే ప్రశ్న వేశారు. నీకు క్రికెటర్ జయసూర్య తెలుసా?’’అని ఆమె అన గానే పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ అంజూ శ్రీవాస్తవసహా నాటి ఆమె స్నేహితులు పక్కున నవ్వారు. ‘‘భారత్, శ్రీలంకలు ఒకే సంప్రదాయ వారసత్వం, విలువలు, పరస్పర గౌరవాలతో ఎదిగాయి. ఈ సంస్కృతి బంధం పోగులే ఇరు దేశాల సమాజ సౌభ్రాత్వాన్ని పెనవేసేలా చేశాయి. కొన్ని విషయాల్లో మనలో మనకు కొన్ని పొరపొచ్చాలు రావొచ్చు. కానీ చివరకు అందరం ఇరుగుపొరుగున కలిసే జీవిస్తున్నాం. కలిసి పనిచేస్తున్నాం. చివరకు ఒకరినొకరం గౌరవించుకుంటున్నాం. శ్రీలంక ఆర్థిక పురోభివృద్ధికి భారత్ ఎంతగానో సాయపడుతోంది. కష్టకాలంలో మా ఆర్థిక స్థిరత్వం, ప్రగతికి భారత్ అండగా నిలబడింది. 2022లో తీవ్ర ఆర్థికసంక్షోభంలో మేం కూరుకుపోతే భారత్ రుణసాయం చేసింది. ఈ సాయాన్ని మేం ఏనాటికీ మరువం. ఇరుదేశాల భాగస్వామ్యం నేటి తాత్కాలిక అగత్యం కాదు. రేపటి శాశ్వత అవసరం. గత డిసెంబర్లో మా దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె ఢిల్లీలో పర్యటించడం, ఏప్రిల్లో లంకలో మోదీ పర్యటన బలపడుతున్న ఇరుదేశాల బంధానికి గుర్తులు’’అని ఆమె అన్నారు. -
కూచిపూడి నర్తకి అరుణిమకు అరుదైన గౌరవం
లండన్: భారతీయ నృత్యరూపకం కూచిపూడికి బ్రిటన్లో ఎనలేని గుర్తింపు తెస్తూ దేశవ్యాప్తంగా భారతీయ కళకు మరింత వన్నె తెచ్చిన ప్రముఖ నాట్యకళాకారిణి అరుణిమ కుమార్ను యూకే సర్కార్ అరుదైన గౌరవంతో సత్కరించింది. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 ‘గౌరవ బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం)’తో అరుణిమను గౌరవించారు. ఒక కూచిపూడి కళాకారిణి ఈ మెడల్ను సాధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా ప్రదర్శిస్తూ భారత్, బ్రిటన్సహా పలు దేశాల మధ్య సాంస్కృతి సంబంధాల బలోపేతానికి ఆమె తన కూచిపూడి కళ ద్వారా కృషిచేశారని బ్రిటన్ రాజకుటుంబం పేర్కొంది. యూకేలో పౌర, సైనిక కార్యకలాపాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్రిటన్ రాజు ప్రతిఏటా ఈ పురస్కారాన్ని ప్రదానంచేస్తారు. అరుణిమ ఇప్పటికే బ్రిటన్ సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాత సాధించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 వర్ధంతి వేడుకల్లో, బకింగ్హామ్ ప్యాలెస్లో, లండన్లోని యూకే ప్రధాని కార్యాలయం 10, డౌనింగ్ స్ట్రీట్లో అరుణిమ ఎన్నోసార్లు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ నృత్యరూపం అంబాసిడర్గా, ఇన్ఫ్లూయన్సర్గా, సాంస్కృతిక సారథిగా అరుణిమకు మంచి పేరుంది. తనకు బ్రిటిష్ ఎంపైర్ మెడల్ రావడంపై అరుణిమ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘రాజు నుంచి గౌరవ పురస్కారం పొందడం నిజంగా ఎంతో గర్వంగా, సముచితంగా గౌరవంగా అనిపిస్తోంది. కళలో నా కృషిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఇది నా వ్యక్తిగత గుర్తింపుగా భావించట్లేను. అంతర్జాతీయ వేదికపై భారతీయ శాస్త్రీయ నాట్యానికి దక్కిన గౌరవం. కూచిపూడి నాకు జీవితాంతం తోడుంటుంది. నా భావాల వ్యక్తీకరణకు మాధ్యం కూచిపూడి’’అని ఆమె అన్నారు. ఈమెకు చెందిన ‘అరుణిమ కుమార్ డ్యాన్స్ అకాడమీ’50కిపైగా దేశాల్లో 3,000కుపైగా నృత్య ప్రదర్శనలు ఇచి్చంది. ఐదేళ్ల చిన్నారి మొదలు 75 ఏళ్ల వృద్దుల దాకా ఈమె వద్ద కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఈమెకు వందలాది మంది శిష్యులు ఉన్నారు. పద్మ భూషణ్ శ్రీమతి స్వప్నసుందరి, పద్మశ్రీ జయరామారావు వద్ద అరుణిమ శిష్యరికం చేసి కూచిపూడిలో నైపుణ్యం సాధించారు. -
రైల్వేప్లాట్ఫాం పైనే మహిళకు పురుడు పోసిన యువకుడు
ముంబై: ఆ మధ్య వచ్చిన త్రీ ఇడియట్స్ సినిమాలో అత్యవసర సమయంలో ఓ డాక్టర్ వీడియోకాల్లో సూచనలు ఇస్తుండగా ఓ మహిళకు హీరో పురుడు పోసే సన్నివేశం ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజజీవితంలో ముంబైలో జరిగింది. గత మంగళవారం రాత్రి ముంబై లోకల్ రైళ్లో వికాస్ బిద్రే అనే వీడియో కెమెరామెన్ ప్రయాణిస్తుండగా అదే రైళ్లో 24 ఏళ్ల అంబికా ఝా పురుటి నొప్పులతో బాధపడటం గమనించాడు. చుట్టూ మరికొందరు ఉన్నా వికాస్ మెరుపులా స్పందించి అత్యవసర స్విచ్ నొక్కి రైలును రామ్మందిర్ స్టేషన్లో ఆపేశాడు. అప్పటికే అంబికాకు ప్రసవం కావటం ప్రారంభమైంది. శిశువు సగంవరకు బయటకు వచి్చంది. దీంతో ప్లాట్ఫాంపై ఉన్న దుకాణాల వద్దకు పరుగెత్తి పరుపుల్లాంటివి పట్టుకొచ్చి ఆమెను పడుకోబెట్టారు. వికాస్ వెంటనే తన స్నేహితురాలైన దేవిక అనే డాక్టర్కు ఫోన్చేసి విషయం చెప్పాడు. ఆమె వీడియోకాల్ చేసి సూచనలు ఇస్తుండగా అంబికకు వికాస్ డెలివరీ చేశాడు. అంతకుముందు ప్లాట్ఫాం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా పరిస్థితి తీవ్రతను గుర్తించి డెలివరీ చేసేందుకు వారు ముందుకు రాలేదు. దీంతో ఆమె బంధువులు మళ్లీ ప్లాట్ఫాం వద్దకు తీసుకురావటంతో వికాస్ ధైర్యం చేసి తన స్నేహితురాలి సహకారంతో పురుడు పోశాడు. అనంతరం తల్లి, బిడ్డను ప్రైవేటు అంబులెన్స్లో కూపర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంజీత్ థిల్లాన్ అనే వ్యక్తి ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేయటంతో వికాస్పై ప్రశంసలు కురుస్తున్నాయి. కజ్రత్ జమ్ఖేడ్ ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా ఈ ఘటనపై స్పందించారు. వికాస్ చేసిన పని మహారాష్ట్రకు గర్వకారణమని పేర్కొన్నారు. దేవిక సూచనలతోనే తాను పురుడు పోయగలిగానని వికాస్ తెలిపాడు. -
కుల గణనలో పాల్గొనబోం
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి ప్రకటించారు. తాము వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదన్నారు. ఇటీవల తమ నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లతో వారు.. ‘మా ఇంట్లో సర్వే చేపట్టవద్దు’అని తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా, ఎన్యుమరేటర్లకిచ్చిన ప్రొఫార్మాలో సుధామూర్తి..‘మేం వెనుకబడిన కులాలకు చెందిన వారము కాదు. అందుకే, ఆ గ్రూపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మేం పాల్గొనడం లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తంగదాడి స్పందిస్తూ.. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. ఈ పరిణామంపై సుధామూర్తి దంపతులు, ఇన్ఫోసిస్ అధికారులు స్పందించలేదు. -
తయారీ కేంద్రంగా భారత్: ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘21వ శతాబ్దం భారత్ది.. 140 కోట్ల మంది భారతీయులది.. ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ను ఓ తయారీ కేంద్రంగా చూస్తోంది.. భారత దేశ సామర్థ్యాన్ని మొత్తం ప్రపంచం గమనిస్తోంది.. దేశాభివృద్ధికి పునాది పడింది ఆత్మ నిర్భర్ భారత్తోనే.. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం. ఓకల్ ఫర్ లోకల్ పేరుతో ప్రజలు మన తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రతీ రంగంలో దేశం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఎన్డీఏ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వాహనం 16 నెలలుగా వేగంగా కదులుతోందని, డబుల్ ఇంజన్ సర్కారు వేగంగా నడుస్తోందని చెప్పారు. ఢిల్లీ, అమరావతి రెండూ వేగవంతంగా అభివృద్ధి వైపు పయనిస్తున్నాయన్నారు. రోడ్లు, విద్యుత్, రైల్వే, హైవే, వాణిజ్యం, పరిశ్రమలతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించి రూ.13,400 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఊతమిచ్చి ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తోందని, ఈ ప్రాజెక్టులతో కర్నూలు, పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. 2047కు భారత్కు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లవుతుందని, అప్పటికి భారత్ ‘వికసిత్ భారత్’గా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభలో ప్రధాని ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..ఇంధన రంగంలో విప్లవాత్మక అభివృద్ధిఏదేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం. రూ.3 వేల కోట్ల విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. దీంతో దేశ ఇంధన సామర్థ్యం పెరగబోతోంది. వేగవంతమైన అభివృద్ధి మధ్య గతాన్ని మరవొద్దు. 11 ఏళ్ల కిందట కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు తలసరి విద్యుత్ వినియోగం (ఏటా) వెయ్యి యూనిట్లలోపు ఉండేది. అప్పుడు దేశం తరుచూ విద్యుత్ కోతలు, సవాళ్లు ఎదుర్కొంది. వేల గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా వేయలేని దుస్థితి. నేడు భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి పూర్తి విద్యుత్ ఉత్పత్తి వరకూ ప్రతి రంగంలో దేశం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ప్రతి గ్రామంలో విద్యుదీకరణ జరిగింది. తలసరి విద్యుత్ వినియోగం 1,400 యూనిట్లకు పెరిగింది. దేశంలో ఇంధన విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం. శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైపు లైన్ ప్రారంభించాం. దీంతో 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా అవుతోంది. చిత్తూరులో కూడా రోజుకు 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యంతో ఎల్పీజీ ప్రాజెక్టు నిర్మించాం. దీనివల్ల ప్రజలకు సేవలతో పాటు కొత్త ఉద్యోగాలు వస్తాయి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగంగా సాధించే మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. గ్రామాల నుంచి నగరాలు, నగరాల నుండి పోర్టుల వరకూ కనెక్టివిటీ చేశాం. విశాఖలో సబ్బవరం నుంచి షీలానగర్ వరకు కొత్త హైవే నిర్మాణంతో కనెక్టివిటీ మరింత మెరుగు పడుతుంది. కొత్త రైల్వే లైన్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి.కనెక్టివిటీ హబ్గా విశాఖఆంధ్రప్రదేశ్ యువత టెక్నాలజీలో చాలా ముందుంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాం. రెండు రోజుల కిందట గూగుల్ సంస్థ పెద్ద పెట్టుబడి ప్రకటించింది. గూగుల్ కంపెనీ యాజమాన్యం వారు నాతో మాట్లాడారు. ‘అమెరికా కాకుండా చాలా దేశాల్లో గూగుల్ పెట్టుబడులు ఉన్నాయి కానీ, అన్నింటి కంటే ఎక్కువ పెట్టుబడి ఆంధ్రలో పెడుతున్నామని చెప్పారు. ఈ కొత్త గూగుల్ ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ సాంకేతిక పరిజ్ఞానం, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఉండబోతున్నాయి. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొత్త అంతర్జాతీయ గేట్వే తయారవుతోంది. అంతర్జాతీయంగా తూర్పు తీరంలోని విశాఖ నగరం కనెక్టివిటీ హబ్గా, ప్రపంచానికే ఏఐ హబ్గా మారబోతోంది.దేశాభివృద్ధికి ఆంధ్ర.. ఆంధ్ర అభివృద్ధికి ‘సీమ’ కీలకందేశాభివృద్ధికి ఆంధ్ర అభివృద్ధి చాలా అవసరం. అలాగే ఆంధ్ర అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి అంతే ముఖ్యం. కర్నూలులో ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి. రాయలసీమ అభివృద్ధికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయి. ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక వాడల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ విజన్ సాధించడంలో ఆంధ్ర కీలకంగా మారబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టాన్ని మిగిల్చాయి. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆంధ్రప్రదేశ్కు ఉంటే, ఆంధ్ర మాత్రం సొంత అభివృద్ధి కోసం పోరాటం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుతోంది. నిమ్మలూరులో అడ్వాన్స్ నైట్ విజన్ ఫ్యాక్టరీ ప్రారంభించాం. మన దేశ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర భారత్ సాధించడానికి ముందడుగు పడింది. ఈ ఫ్యాక్టరీ దేశ నైట్ విజన్ పరికరాలు, క్షిపణుల కోసం సెన్సార్లు, డ్రోన్ గార్డు వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచబోతోంది. ఇక్కడ తయారయ్యే పరికరాలు భారత దేశ రక్షణ ఎగుమతులను కొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు దోహదపడతాయి. భారత రక్షణ రంగం శక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్తో ప్రత్యక్షంగా చూశాం.దేశానికి డ్రోన్ హబ్గా కర్నూలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలును డ్రోన్ హబ్గా చేయాలని సంకల్పించడం సంతోషం. తద్వారా వచ్చే సాంకేతికతతో కర్నూలుతో పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక కొత్త రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఆపరేషన్ సింధూర్లో మన డ్రోన్లు కూడా అద్భుతాలు సృష్టించాయి. ఆ అద్భుతాలు చూసి ప్రపంచం అబ్బుర పడింది. రాబోయే రోజుల్లో కర్నూలు దేశానికి డ్రోన్ హబ్గా మారుతుంది. మా ప్రభుత్వ లక్ష్యం ‘సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్’. ఈ లక్ష్యంతో కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేయడం మా లక్ష్యం. దేశంలో రూ.12 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి పన్నులు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది. తక్కువ ధరకే మందులు, మెరుగైన చికిత్స, ఆయుష్మాన్ భారత్ కార్డులతో ప్రజల జీవన విధానం సౌకర్యవంతంగా చేస్తూ కొత్త అధ్యాయాన్ని మనం ప్రారంభించాం.ఆత్మగౌరవానికి, గొప్ప సంస్కృతికి ఏపీ నిలయంఅహోబిలం లక్ష్మీ నరసింహస్వామి, మహానందీశ్వరుడు, మంత్రాలయం రాఘవేంద్రుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నా. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ ఆలయం మొదటిదైతే, రెండోది శ్రీశైలం. సోమనాథుడు కొలువున్న గుజరాత్ భూమిపై జన్మించిన నాకు కాశీ విశ్వనాథుడికి సేవ చేసే అవకాశం లభించింది. ఇప్పుడు శ్రీశైల మల్లికార్జునుడి ఆశీస్సులు కూడా పొందాను. స్వామి దర్శనం తర్వాత ఛత్రపతి శివాజీ కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పించాను. ఈ వేదికపై నుంచి కూడా మరోసారి శివాజీ మహారాజ్కు నివాళులు అర్పిస్తున్నా. మహా శివభక్తులైన అక్క మహాదేవుళ్లను స్మరించుకుంటున్నా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, హరిసర్వోత్తమరావు లాంటి స్వాతంత్య్ర సమరయోధులకు కూడా నా నివాళులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆత్మ గౌరవానికి, గొప్ప సంస్కృతికి, సైన్స్, పరిశోధనలకు నిలయం. ఇక్కడ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. యువతకు అపారశక్తి ఉంది. ఆంధ్రకు ఇంకా ఏదైనా అవసరం ఉందంటే అది సరైన నాయకత్వం మాత్రమే. ఇప్పుడు శక్తివంతమైన నాయకత్వం ఉంది. దీనికి తోడు ఆం్ర«ధాకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంది.స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించండి⇒ దసరా నవరాత్రుల మొదటి రోజు నుంచి ప్రజలపై జీఎస్టీ భారాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఆంధ్రలో జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జీఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్లు ఆదా అవుతోందని తెలిసింది. ఈ పొదుపుతో పండుగ సీజన్ ఆనందాన్ని మరింత పెంచబోతోంది. ఓకల్ ఫర్ లోకల్ పేరుతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని మీ అందరికీ నా అభ్యర్థన. వికసిత్ ఆంధ్రప్రదేశ్తోనే వికసిత్ భారత్ కల నెరవేరుతుంది.⇒ ఈ సభలో ఇద్దరు చిన్న పిల్లలు ఫొటోలను మోదీకి ఇవ్వాలని ప్రయత్నిస్తుండటం చూసిన మోదీ.. వాటిని తన వద్దకు చేర్చాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, బీసీ జనార్దన్రెడ్డి, కందుల దుర్గేశ్, పార్థసారథితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.భారత్ సూపర్ పవర్ మోదీ నాయకత్వంతోనే సాధ్యంసూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్తో భవిష్యత్లో మరిన్ని సంస్కరణలు చూడబోతున్నాం. 21వ శతాబ్ధ్దం మోదీది. దేశానికి మోదీ లాంటి నాయకుడి అవసరం చాలా ఉంది. ఇలాంటి నాయకుడిని నేను చూడలేదు. భారత్ ప్రపంచంలో సూపర్ పవర్గా అవతరించాలంటే మోదీ నాయకత్వంతోనే సాధ్యం. 11 ఏళ్ల కిందట 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్.. ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. 2028కి మూడో స్థానానికి వస్తాం. 2038కి రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి మోదీ. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి రూ.15 వేలు ఆదాయం కలిగింది. యుద్ధాలు, టారిఫ్లు ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో మోదీ చెప్పిన స్వదేశీ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. కేంద్రం సహకారంతో అమరావతిని నిలబెట్టాం. పోలవరాన్ని గాడిన పెట్టాం. విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. ఏపీ యంగ్ స్టేట్. ఎక్కువ పెట్టుబడులు సాధిస్తోంది. గూగుల్, మిట్టల్.. బీపీసీఎల్, సెమీ కండక్టర్ యూనిట్, క్వాంటమ్ వ్యాలీతో సత్వర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. కర్నూలుకు తొందర్లోనే హైకోర్టు బెంచ్ వస్తుంది. అన్ని ఎన్నికల్లో మోదీ గెలవాలి. అదే భారత్ విజయం. – చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రికనీసం మరో 15 ఏళ్లు కూటమి నిలబడాలిప్రధానమంత్రిని కర్మయోగి అని పిలుస్తా. ఏ ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆలోచిస్తూ ధర్మాన్ని పట్టుకుని దేశాన్ని నడిపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన అదృష్టం. మోదీ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు. పుట్టే బిడ్డలకు కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు. భారత్ను ప్రపంచ పటంలో నిలబెట్టారు. పన్నులు ఎప్పుడూ పెరగడమే కానీ తగ్గవు. మోదీ వచ్చాక జీఎస్టీ తగ్గించారు. తద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగింది. రాష్ట్రంలో కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడాలి. సమష్టిగా పని చేయాలి. – పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారుగుజరాత్ను పవర్ ఫుల్ స్టేట్గా మార్చింది నమో. దేశాన్ని సూపర్ పవర్గా మార్చింది నమో. గతంలో ఉగ్ర దాడి జరిగితే ఇతర దేశాల సాయం అడిగే ప్రభుత్వాలు ఉండేవి. కానీ మోదీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. అమెరికా టాక్స్లు పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికి పోయాయి. కానీ మోదీ గుండె ధైర్యం ఆత్మ నిర్భర్ భారత్. ప్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు.. అని ధైర్యంగా నిలబడ్డారు. పేదరికం లేని దేశం నమో కల. కేంద్రంలో నమో.. రాష్ట్రంలో సీబీఎన్.. ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు. ప్రధాని మోదీ 16 నెలల్లో రాష్ట్రానికి 4 సార్లు వచ్చారు. ఆంధ్ర అంటే అపారమైన ప్రేమ. కోరిన కోర్కెలన్నీ తీరుస్తున్నారు.– నారా లోకేశ్, విద్యాశాఖ మంత్రి -
భావ ప్రకటనా స్వేచ్ఛకు మేం వ్యతిరేకం కాదు
న్యూఢిల్లీ: భావ ప్రకటనా స్వేచ్ఛ, మాట్లాడే హక్కు అనేవి ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసేలా, నిజాయితీని శంకించేలా ఉండకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సోషల్ మీడియాకు నియంత్రణ లేకపోవడం ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్పై లాయర్ రాకేశ్ కిశోర్ బూటు విసిరేందుకు ప్రయత్నించిన ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. డబ్బుల కోసం సోషల్ మీడియాలో దిగజారి పోస్టులు పెడుతున్నారని మండిపడింది. సీజేఐపై ఈ నెల 6న బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్(71)పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ ధర్మాసనం గురువారం స్పందించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంది. కానీ, అది ఇతరులను అగౌరవపర్చేలా ఉండకూడదని స్పష్టంచేసింది. రాకేశ్ కిశోర్ ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని, పైగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని, అవి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని వికాస్ సింగ్ చెప్పారు. సుప్రీంకోర్టు సమగ్రతను దెబ్బతీసేలా ప్రచారం సాగుతోందని అన్నారు. రాకేశ్ కిశోర్ ఇంటర్వ్యూలను ప్రసారం చేయకుండా సోషల్ మీడియాను కట్టడి చేయాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ... రాకేశ్ కిశోర్పై అత్యవసరంగా విచారణ చేపట్టలేమని పేర్కొంది. అలా చేస్తే సోషల్ మీడియాకు మరింత మేత అందించినట్లు అవుతుందని స్పష్టంచేశారు. దీపావళి తర్వాత విచారిస్తామని వెల్లడించింది. సహజ మరణంలాగే ఈ కేసు దానంతట అదే ముగిసిపోతుందని ధర్మాసనం వివరించింది. రాకేశ్ కిశోర్పై చర్యలకు అటార్నీ జనరల్ అంగీకారం లాయర్ రాకేశ్ కిశోర్పై క్రిమినల్ నేరం కింద చర్యలు చేపట్టేందుకు అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి గురువారం అంగీకారం తెలియజేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు లాయర్పై కంటెంప్ట్ ఆప్ కోర్ట్స్ చట్టం–1971లోని సెక్షన్ 2(సీ) ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్ గవాయ్ పట్ల రాకేశ్ కిశోర్ ప్రవర్తించిన తీరు అత్యంత గర్హనీయమని ఆర్.వెంకటరమణి స్పష్టం చేశారు. -
పరారీ నేరస్థుల కోసం రాష్ట్రానికో ప్రత్యేక సెల్
న్యూఢిల్లీ: బ్యాంక్ల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన బడా పారిశ్రామికవేత్తలు సహా ఉగ్రవాదం, డ్రగ్స్, మనీలాండరింగ్కు పాల్పడిన వారిని భారత్కు రప్పించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ‘‘పారిపో యిన నేరస్థులను రప్పించడం: సవాళ్లు, వ్యూహా లు’’అని అంశంపై ఏర్పాటుచేసిన సమావేశాన్ని అమిత్షా ప్రారంభించి ప్రారంభోపన్యాసంచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రాలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లు మొదలు ఉగ్రవాదం, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడిన వాళ్లు భారతీయ కఠిన న్యాయవ్యవస్థకు భయపడి విదేశాలకు పారిపోయారు. వీళ్లు భారత ఆర్థికాభివృద్ధి, సార్వభౌమత్వానికి ప్రతిబంధకాలుగా తయారయ్యారు. భారతీయ చట్టం ముందు వీళ్లను నిలబెట్టేందుకు మనం నిర్ధయగా నిర్ణయాలు తీసుకోవాలి. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి భారతీయ దర్యాప్తు సంస్థల అభ్యర్థనలతో విదేశాల్లో వీళ్లను అక్కడి దర్యాప్తు అధికారులు ఎలాగోలా అరెస్ట్చేసినా భారత్కు రప్పించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. భారత్కు అప్పగిస్తే అధ్వానంగా నెట్టుకొస్తున్న, చీకటి కొట్టాల్లాంటి జైలు గదుల్లోపడేస్తారని, తమ జీవన, మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందని నేరస్తులు అక్కడి న్యాయస్థానాల్లో వాదిస్తున్నారు. ఇలాంటి వాదన చేసే అవకాశం మనం వాళ్లకు ఎందుకివ్వాలి? ఇకపై ఇలాంటి ఆరోపణలకు చరమగీతం పాడుదాం. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఇలాంటి నేరస్థుల కోసం ప్రత్యేక జైలు సెల్ను నిర్మించండి. ధారాళంగా గాలి, వెలుతురు ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త జైళ్లను కట్టాలి. దాంతో భారతీయ కారాగారాలు దుర్భర స్థితిలో ఉంటాయనే వాదన అక్కడి న్యాయస్థానాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. ప్రతి రాష్ట్ర రాజధాని నగరంలో ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాలతో జైలు ఉండాల్సిందే’’ అని అమిత్షా అన్నారు. మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ సహా ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం, డ్రగ్స్, మనీలాండరింగ్ నేరాలకు సంబంధించి భారత్ ఇప్పటికే 338 మంది నేరస్థులను వెనక్కి రప్పించేందుకు శతథా ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. ‘‘కొత్త సాంకేతికతతో నేరస్థుల ఆట కట్టించవచ్చు. భారత్ నుంచి పారిపోయిన నేరస్థులపై అంతర్జాతీయంగా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన వెంటనే వాళ్ల పాస్పోర్ట్ను రద్దుచేయాలి. అప్పుడు ఆయా నేరస్తుల అంతర్జాతీయ ప్రయాణాలకు అడ్డుకట్ట పడుతుంది’’ అని రాష్ట్రాల పోలీస్ బాస్లకు అమిత్ సూచించారు. సదస్సులో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఇంటెలిజెన్స్బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
కులగణనకు రెడీ
న్యూఢిల్లీ: దేశంలో జన గణనకు రంగం సిద్ధమవుతోంది. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయబోతున్నారు. జన గణనలో మొదటి దశకు సంబంధించిన ప్రి–టెస్టు ఎక్సర్సైజ్ను ఈ ఏడాది నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన చోట్ల ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 1 నుంచి 7వ తేదీ దాకా సెల్ఫ్–ఎన్యూమరేషన్కు కూడా అవకాశం కలి్పస్తున్నట్లు రిజి్రస్టార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ చెప్పారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 దాకా దేశవ్యాప్తంగా జన గణనను చేపట్టబోతున్నారు. ఇది రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో హౌస్లిస్టింగ్ ఆపరేషన్, హౌసింగ్ షెడ్యూల్(హెచ్ఎల్ఓ) ప్రక్రియ, రెండో దశలో జన గణన చేపడతారు. మొదటి దశకు సంబంధించి ప్రి–టెస్టు ఎక్సర్సైజ్లో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇళ్ల సంఖ్యను ప్రయోగాత్మకంగా లెక్కిస్తారు. ఆయా ఇళ్ల స్థితిగతులు, వసతుల వివరాలు సేకరిస్తారు. ఈసారి జన గణనతోపాటు కుల గణన కూడా చేపట్టబోతున్నారు. ఇది పూర్తిగా డిజిటల్ సెన్సెస్ కావడం విశేషం. ప్రతి పౌరుడి కులం, సామాజిక–ఆర్థిక పరిస్థితుల వివరాలను నమోదు చేస్తారు. జన గణన, కుల గణన అనేది మహా యజ్ఞమే. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతోపాటు 1.3 లక్షల మంది సిబ్బందిని నియమిస్తున్నారు. దేశంలో జన గణన ప్రక్రియ మొదలైన తర్వాత ఇది 16వ జన గణన, స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఎనిమిదో జన గణన. -
ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై పరోక్షంగా ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర కేబినెట్ గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సర్క్యులర్ను జారీచేసింది. ఆర్ఎస్ఎస్ వంటి ప్రైవేట్ సంస్థల కార్యక లాపాలపై కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, సాంకేతికత శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాకు వెల్లడించారు. ‘‘మేం ఎలాంటి సంస్థ(ఆర్ఎస్ఎస్) కార్యకలాపాలను నియంత్రించబోము. కానీ ఏ సంస్థ అయినా రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో కవాతులు, కార్యక్రమాలు చేపట్టాలంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఆయా అభ్యర్థనల తర్వాత ఈ కార్యక్రమాలకు అనుమతి మంజూరు చేయాలా వద్దా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇకపై స్థానిక పాలనా యంత్రాంగానికి ఊరకే ముందస్తు సమాచారం ఇచ్చేసి రహదారులపై కర్రలు ఊపుతూ కవాతులు, మార్చ్లు, పథ సంచలన వంటి కార్యక్రమాలు చేస్తామంటే కుదరదు. బహిరంగ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో కొత్త నియమ నిబంధనలు అమలు చేయబోతున్నాం’’ అని ప్రియాంక్ చెప్పారు.పాత నిబంధనలే కొత్తగా..‘‘వాస్తవానికి గతంలో హోం శాఖ, న్యాయ విభాగం, విద్యా శాఖ జారీచేసిన ఉత్తర్వులనే గుదిగుచ్చి ఏకీకృత నిబంధనావళిగా మారుస్తున్నాం. వచ్చే రెండు, మూడ్రోజుల్లో ఈ కొత్త నియమావళి అమల్లోకి రానుంది. ఇది రాజ్యాంగంలోని చట్టాల మేరకే అమలవుతుంది’’ అని మంత్రి ప్రియాంగ్ స్పష్టంచేశారు. కర్ణాటక వ్యాప్తంగా ఆరెస్సెస్ కార్యకలా పాలను నిషేధించాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్ లేఖ రాసిన రెండు వారాలకే కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తుండటం గమనార్హం. ‘‘ బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న అంశం కేబినెట్ భేటీలో చర్చకొచ్చింది. విద్యాసంస్థలు సహా ప్రభుత్వ స్థలాల వినియోగంపై నియంత్రణ కోసం హోంశాఖ ఉత్తర్వులు జారీచేయనుంది. ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల సద్వినియోగం, దుర్విని యోగంపై సంబంధిత విభాగాలకు ఆదేశాలు వెళ్లనున్నాయి’’ అని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ చెప్పారు. -
మోదీ మాటిచ్చారు..!
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడిచమురు కొనుగోలు చేస్తుండడం పట్ల చాలా రోజులుగా అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ తన మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని స్పష్టంచేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని నిలిపివేసే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అవుతుందని అన్నారు. చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా ఉక్రెయిన్పై దండయాత్ర ఆగిపోతుందని ఉద్ఘాటించారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండడం తమకు ఎంతమాత్రం సంతోషం కలిగించడం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆర్థికంగా మేలు జరుగుతోందని, అంతిమంగా ఆ సొమ్మంతా ఉక్రెయిన్పై యుద్ధానికే ఖర్చవుతోందని తెలిపారు. ఎవరైనా సరే రష్యాకు ఆర్థికంగా సాయం అందించడం మానుకోవడం మంచిదని హితవు పలికారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న మతిలేని యుద్ధంలో లక్షల మంది బలైపోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేస్తామంటూ ఈరోజు తన మిత్రుడు మోదీ మాట ఇచ్చారని పేర్కొన్నారు. ఇక చైనా సైతం అదే దారిలో నడుస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలియజేశారు. చైనా ప్రభుత్వం రష్యా నుంచి చమురు దిగుమ తి చేసుకోవడం ఆపేస్తే మంచిదని సూచించారు. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ ప్రశంసించారు. తానంటే మోదీకి ఎంతో ప్రేమ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రేమ అనే పదాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. మోదీ రాజకీయ జీవితానికి ఇబ్బందులు సృష్టించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘భారత్ను చాలా ఏళ్లుగా గమనిస్తున్నా. అదొక నమ్మశక్యంకాని దేశం. ప్రతి సంవత్సరం ఒక కొత్త నాయకుడు అధికారంలోకి వస్తుంటారు. కొందరైతే కొన్ని నెలలపాటే ఉండొచ్చు కూడా. కానీ, నా స్నేహితుడు మోదీ చాలాఏళ్లుగా వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ ఆయన నాకు మాట ఇచ్చారు. నిజంగా నాకు తెలియదు గానీ అదొక బ్రేకింగ్ స్టోరీ కావొచ్చు! మోదీ వెంటనే ఆ పని చేయకపోవచ్చు. నా అంచనా ప్రకారం కొంత సమయం పట్టొచ్చు. కానీ, త్వరలోనే ఆ ప్ర క్రియ పూర్తవుతుంది. ఉక్రెయిన్పై యుద్ధం ముగిసిన తర్వాత రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్ పునరుద్ధరించుకోవచ్చు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాక్ను అనబోయి..భారత్లో ఏడాదికొక పాలకుడు అధికారంలోకి వస్తాడంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ పరిస్థితిని ట్రంప్ పొరపాటున భారత్కు అన్వయించి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగతోంది. ట్రంప్ మానసిక ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయని జనం పోస్టులు చేస్తున్నారు. నిజానికి భారత్లో ఏడాదికొక ప్రధానమంత్రి మారిపోయిన సందర్భాలు లేవు. పాకిస్తాన్లోనే అలాంటి పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.అంతా అబద్ధం‘మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరగలేదు’ రష్యా చమురు విషయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ గురువారం ఖండించింది. బుధవారం మోదీ, ట్రంప్ మధ్య ఫోన్లో ఎలాంటి సంభాషణ జరగలేదని తేల్చిచెప్పింది. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేసింది. దేశ అవసరాలు, ప్రయోజనాల కోణంలోనే రష్యా నుంచి ముడిచమురు కొంటున్నామని, ఇందులో మరో మాటకు తావులేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఇంధన విధాన నిర్ణయాలకు స్థిరమైన ధరలు, నిరంతరాయమైన సరఫరానే పతిప్రాదిక అని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన దిగుమతుల్లో మార్పులుచేర్పులు చేసుకుంటున్నామని ఉద్ఘాటించింది. ఇంధన వనరుల్లో వైవిధ్యం కొనసాగిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది. ట్రంప్ను చూస్తే మోదీకి భయం: రాహుల్ న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను మోదీ అమెరికాకు ఔట్సోర్సింగ్కు ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ పాలనలో విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందని మండిపడ్డారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ మిత్రుడు మోదీ మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించడంపై రాహుల్ గురువారం తీవ్రంగా స్పందించారు. రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకొని, ప్రకటనలు చేసే అధికారాన్ని ట్రంప్కు మోదీ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ వల్ల తరచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ అభినందన సందేశాలు పంపిస్తున్నారని ప్రధానమంత్రిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. భారత ఆర్థిక శాఖ మంత్రి అమెరికా పర్యటనను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించే విషయంలో ఈజిప్టులోని షెర్మ్ ఎల్–õÙక్లో జరిగిన భేటీకి ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందంటూ డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ గాంధీ నిలదీశారు. -
50 శాతం మించొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్ను కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేదు. రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు కేవలం షెడ్యూల్డ్ ఏరియాల్లోనే ఉన్నాయని గుర్తుచేస్తూ, 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రభుత్వం వాదన ఇదీ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లను నిర్ణయించుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అత్యంత శాస్త్రీయంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల సర్వే నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’నిబంధనలకు అను గుణంగా, డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి, ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సమగ్రంగా, శాస్త్రీయంగా సర్వే జరిపామని తెలిపారు. 94 వేల ఎన్యూమరేషన్ బ్లాక్లలో లక్షలాది మంది సమాచారాన్ని సేకరించి, బీసీ జనాభా డేటా ఆధారంగానే కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు పెంచామని వివరించారు. ఈ సందర్భంగా ఇందిరా సహానీ కేసులో తీర్పును సింఘ్వీ ఉటంకించారు. డేటా బేస్ ఆధారంగా, అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించి పెంచుకునే సౌలభ్యం ఉందని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. వికాస్ కృష్ణారావ్ గవాలి కేసు తీర్పు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోందన్నారు. అంతేగాక ఈ వ్యవహారంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యమైందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని, అయితే గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. బిల్లును సవాల్ చేయకుండా, దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్ చేయడం సరికాదని సింఘ్వీ వాదించారు. ఇంతటి విస్తృత కసరత్తు తర్వాత, ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండా హైకోర్టు స్టే విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కోటా 50% పరిమితి దాటరాదు: ప్రతివాదుల వాదన ప్రతివాది మాధవరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ ప్రభుత్వ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. కృష్ణమూర్తి కేసు తీర్పును ఉటంకిస్తూ ‘షెడ్యూల్డ్ ఏరియాలు, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఉంది. జనరల్ ఏరియాల్లో ఈ పరిమితిని దాటడానికి వీల్లేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెల్లడించింది’అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ట్రిపుల్ టెస్ట్లో కూడా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనేది ఒక కీలకమైన షరతు అని, దాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల ఉదంతాలను ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల్లో కూడా రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించి, 50 శాతం పరిమితికి లోబడే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో విభేదించింది. ‘ఎస్టీ ప్రాంతాల్లోనే రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు ఉన్నాయి కదా?’అని పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను, ముఖ్యంగా కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నిర్దేశించిన 50 శాతం పరిమితిని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఈ అంశం హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనబడటం లేదంటూ తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమ ఆదేశాలతో సంబంధం లేకుండా కేసు మెరిట్స్ ఆధారంగా తదుపరి విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతమున్న రిజర్వేషన్ల విధానం ప్రకారమే జరగనున్నాయి. -
లొంగిపోయేందుకు వస్తున్న.. 140 మంది మావోయిస్టులు
బీజాపూర్: మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోగా... అదే బాటలో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా ఇవాళ లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లో కీలక నేతలు రూపేష్, రనిత సహా 140 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. రేపు(శుక్రవారం, అక్టోబర్ 17న జగదల్పూర్లో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్, హోం మంత్రి విజయ్ శర్మ ఎదుట అధికారికంగా లొంగిపోనున్నారు.కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, ఇద్దరు DKSZC సభ్యులు, 15 మంది DVC సభ్యులు సహా మొత్తం 140 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి భైరామ్గఢ్ వైపు వెళుతున్నారు. వారు ఇంద్రావతి నది అవతలి వైపుకు చేరుకుంటారు. నక్సలైట్లందరూ లొంగిపోవడానికి 70కి పైగా ఆయుధాలను తీసుకువస్తున్నట్లు సమాచారం. భైరామ్గఢ్ నుండి ఇంద్రావతి నదిపై ఉన్న ఉస్పారి ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించాయి. దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని అడవుల నుంచి మావోయిస్టులు ఈ నదిని దాటి జగదల్పూర్కు చేరుకుంటున్నారు. ఉస్పారి ఘాట్ మార్గంలో బయటి వ్యక్తులెవరినీ ప్రయాణించడానికి అనుమతించడం లేదు.రూపేష్.. ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ మావోయిస్టు నేత. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC) లోని మాడ్ డివిజన్లో లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, శిక్షణ బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర కమిటీ మరియు స్థానిక జోనల్ నిర్మాణం మధ్య సంబంధాల వారధిగా పనిచేశారు. రనిత.. DKZC మాడ్ డివిజన్ ఇన్చార్జ్గా పనిచేసిన సీనియర్ మహిళా కమాండర్. బస్తర్ జిల్లాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వరుస ఆపరేషన్లతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. లొంగుపోక తప్పడం లేదు. కేంద్రంతో చర్చలు జరపాలని పదే పదే యత్నించినా అది విఫలం కావడంతో ఇక లొంగుబాటు ఒక్కటే సరైన మార్గమని ఎంచుకున్న వందల సంఖ్యలో మావోయిస్టులు.. జన జీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారు. గత రెండు రోజులుగా అగ్రనేతలతో సహా 283 మంది మావోయిస్టులు తాము చేతపట్టిన తుపాకులను, నమ్ముకున్న అడవుల్ని వదిలి సాధారణ జీవితం గడపడానికి సిద్ధమవుతున్నారు. -
మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు
బీజాపూర్: మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్నారని హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా, మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం(అక్టోబర్ 15) లొంగిపోగా... అదే బాటలో మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం ఇవాళ లొంగిపోయారు. నిన్న (బుధవారం) ఛత్తీస్గఢ్లోని వేర్వేరు జిల్లాల్లో మొత్తం 78 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో 27 మంది లొంగిపోగా, ఇందులో పది మంది మహిళా మావోలు ఉన్నారు. కాంకేర్ జిల్లాలో 32 మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తంగా 50 మంది అజ్ఞాతం వీడారు.ఇందులో మావోయిస్టు పార్టీలో కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రాజమన్ మండావి అలియాస్ రాజ్మోహన్, రాజు సలామ్ అలియాస్ శివప్రసాద్ కూడా ఉన్నారు. 50 మంది మావోయిస్టుల బృందాన్ని ప్రత్యేక బస్సులో కాంకేర్ తరలించి అక్కడ లొంగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ 7 ఏకే 47లతో పాటు మరో 17 ఇతర ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇక కొండగావ్ జిల్లాలో మరో మహిళా మావోయిస్టు లొంగిపోయింది.శాంతిచర్చలపై ముందుగా అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖ మార్చి 28న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నార్త్ వెస్ట్ సబ్జోనల్ బ్యూరో ఇన్చార్జిగా రూపేశ్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ నుంచి వరుసగా మూడు లేఖలు విడుదలయ్యాయి. అంతేకాక ఒక యూట్యూబర్కు వీడియో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అన్ని లేఖల్లోనూ ‘శాంతి చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొందాం. తుపాకీ కంటే చర్చల ద్వారానే సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుంది’అనే అభిప్రాయాన్నే ఆశన్న వ్యక్తంచేశారు. దీంతో మల్లోజుల, ఆశన్న ఒకేదారిలో ఉన్నారనే అభిప్రాయం ఏర్పడింది. అందుకు తగ్గట్టే మల్లోజుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే ఆశన్న సైతం లొంగిపోవడం గమనార్హం.తక్కెళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట. హæన్మకొండలో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్ ఉద్యమాల వైపు ఆకర్షితుడై 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ) చేపట్టిన పలు కీలక యాక్షన్లలో సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో 1999 సెపె్టంబర్ 4న ఐపీఎస్ అధికారి ఉమేశ్చంద్రను దారికాచి కాల్చి చంపిన ఘటన, ఆ తర్వాత 2000 మార్చి 7న అప్పటి ఉమ్మడి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్కేసర్ దగ్గర బాంబు పేల్చి చంపిన టీమ్లోనూ ఆశన్న ఉన్నారు. అంతేకాక 2003 అక్టోబర్లో తిరుపతి సమీపంలోని అలిపిరి దగ్గర సీఎం నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని క్లెమోర్ మైన్స్ పేల్చిన తొమ్మిది మంది సభ్యుల బృందానికి ఆశన్నే నాయకత్వం వహించారు. -
గుజరాత్లో కీలక పరిణామం.. మంత్రులంతా రాజీనామా
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. "ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారు" అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్త వారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు. -
Bihar Election: స్ఫూర్తినిస్తున్న ‘జన్ సురాజ్’ అభ్యర్థి నీరజ్
పట్నా: అతను ఢిల్లీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. అంచలంచలుగా ఎదుగుతూ రూ. 400 కోట్ల టర్నోవర్ గల కంపెనీని నడిపేస్థాయికి చేరుకున్నారు. అతనే బీహార్ పారిశ్రామికవేత్త నీరజ్ సింగ్. అతని జీవన ప్రయాణం సినిమా స్క్రిప్ట్ను తలపిస్తుంది.38 ఏళ్ల నీరజ్ సింగ్ రాబోయే బీహార్ ఎన్నికల్లో షియోహార్ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు.బీహార్లోని షియోహార్ జిల్లాలోని మధురాపూర్ గ్రామంలో జన్మించిన నీరజ్ సింగ్ పదవ తరగతి పూర్తిచేశాక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్యోగాల వేటలో పడ్డారు. ఎటువంటి ఉద్యోగం దొరక్క, గ్రామంలో పెట్రోల్, డీజిల్ విక్రయించడం మొదలుపెట్టాడు. తరువాత ఢిల్లీకి వెళ్లి, సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరారు. అనంతరం పూణేకు చేరుకుని, ఒక ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ అటెండెంట్గా చేరారు. 2010లో ధాన్యం వ్యాపారాన్ని ప్రారంభించారు. అది కలసివచ్చింది. దీంతో ఇటుకలు, బిల్డింగ్ బ్లాక్స్, టైల్స్, ఇతర సిరామిక్ వస్తువులను విక్రయించే ఉషా ఇండస్ట్రీస్ను స్థాపించారు. తదనంతర కాలంలో సింగ్ తన వ్యాపారాన్ని రోడ్డు నిర్మాణ రంగానికి కూడా విస్తరించారు. ఇటీవలే సొంత పెట్రోల్ పంపును ప్రారంభించారు. నీరజ్ సింగ్ స్థాపించిన కంపెనీ ప్రస్తుతం రూ. 400 కోట్ల టర్నోవర్తో, రెండువేల మంది సిబ్బందికి ఉపాధిని అందిస్తోంది. ఒకప్పుడు సైకిల్ కూడా లేని నీరజ్ సింగ్ దగ్గర నేడు అర డజనుకు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. సింగ్ తన ఇద్దరు సోదరులు, భార్య, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులతోపాటు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. పేద మహిళలకు వివాహాలు చేయడం, సీనియర్ సిటిజన్ల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు, వృద్ధుల కోసం తీర్థయాత్రలను నిర్వహించడం లాంటి సేవాకార్యక్రమాలను నీరజ్ సింగ్ నిర్వహిస్తున్నారు. -
170 మంది మావోయిస్టుల లొంగుబాటు: అమిత్ షా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్నారని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈరోజు(గురువారం, అక్టోబర్ 16వ తేదీ) చత్తీస్గఢ్లో 170 మంంది మావోయిస్టులు లొంగిపోయిన విషయాన్ని ఆయన తెలిపారు. నిన్న (బుధవారం, అక్టోబర్ 15వ తేదీ) 27 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. గత రెండు రోజుల్లో చూస్తే 258 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు అమిత్ షా ప్రకటించారు. నక్సలిజంపై పోరులో ఇదొక అరుదైన మైలురాయి అని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు తన ’ఎక్స్’ హ్యాండిల్లో మావోయిస్టులు లొంగుబాటు విషయాన్ని అమిత్ షా చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగంపై నమ్మకం ఉంచి హింసను త్యజించాలనే వారి నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రధానమంత్రి నిరంతర ప్రయత్నాల కారణంగా నక్సలిజం తుది శ్వాస విడిచిందని విషయం దీని ద్వారా రుజువైందినక్సలిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం నాయకత్వం వహిస్తుంది. మా విధానం స్పష్టంగా ఉంది: లొంగిపోవాలనుకునే వారికి స్వాగతం, తుపాకీని ప్రయోగించడం కొనసాగించే వారు మా దళాల ఆగ్రహానికి లోనుకాక తప్పదు. నక్సలిజం మార్గంలో ఇప్పటికీ ఉన్నవారు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.A landmark day in our battle against Naxalism.Today, 170 Naxalites have surrendered in Chhattisgarh. Yesterday 27 had laid down their arms in the state. In Maharashtra, 61 returned to the mainstream, yesterday. In total, 258 battle-hardened left-wing extremists have abjured…— Amit Shah (@AmitShah) October 16, 2025 ఇదీ చదవండి:న్యాయం కోసం సుప్రీంకోర్టుకు పైలెట్ తండ్రి.. -
Air India Crash Case: న్యాయం కోసం సుప్రీం కోర్టుకు పైలెట్ తండ్రి
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో విశ్వసనీయత, పారదర్శకత లోపించిదని ఆరోపిస్తూ దివంగత కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 241 మంది ప్రయాణికులతో సహా 260 మంది మృతి చెందిన ఘటనపై న్యాయ నిపుణుల పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు.పుష్కరాజ్ సభర్వాల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ)అక్టోబర్ 10న సంయుక్తంగా దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్లో ఏఐ 171 ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు కోర్ట్ మానిటర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) నిర్వహించిన అన్ని ముందస్తు దర్యాప్తులను మూసివేసినట్లుగా పరిగణిస్తూ, స్వతంత్ర విమానయాన,సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉన్న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని న్యాయ నిపుణుల కమిటీ పర్యవేక్షణలో విచారణ చేయాలని వారు కోరారు.ప్రమాదంపై దర్యాప్తులో విశ్వసనీయత, పారదర్శకత లేకపోవడంపై పుష్కరాజ్ సభర్వాల్తో పాటు ఎఫ్ఐపీ సభ్యులు ఆవేదన చెందుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. బోయింగ్ 787 డిజైన్ స్థాయి లోపాలను పరిశోధించడంలో వైఫల్యం చెందారని, ఇంధన స్విచ్ కదలిక అంటూ పైలట్పై నింద మోపారని ఆరోపించారు. ఆరోగ్యం, మానసిక స్థితి లోపం అంటూ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ప్రతిష్టను ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొన్నారు. జూలై 12 నాటి ఏఏఐబీ ప్రాథమిక నివేదిక లోపభూయిష్టంగా ఉందని పుష్కరాజ్ సభర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.తన కుమారుని మానసిక ఆరోగ్యం గురించి వచ్చిన కథనాలను తోసిపుచ్చుతూ పుష్కరాజ్ ఇలా అన్నారు. కెప్టెన్ సభర్వాల్ దాదాపు 15 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారని, కెప్టెన్ సభర్వాల్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడానికి కారణం గల కారణం అతని తల్లి మరణమని, ఆమె మూడేళ్ల క్రితం మృతిచెందారని పుష్కరాజ్ తెలిపారు. ఆ తర్వాత కెప్టెన్ సభర్వాల్ 100 కి పైగా విమానాలను ఎటువంటి ప్రమాదం లేకుండా నడిపారని, బోయింగ్ 787-8 విమానంలో 8,596 గంటలు సహా దాదాపు 15,638.22 గంటల విమాన ప్రయాణ అనుభవం కెప్టెన్ సుమీత్ సభర్వాల్కు ఉన్నదన్నారు. -
Bihar Election: లాలూకు రాహుల్ ఫోన్.. సీట్ల ఒప్పందంపై మంతనాలు
న్యూఢిల్లీ: బీహార్లో నవంబర్లో జరగనున్న ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయపార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష కూటమిలో సీట్ల కేటాయింపు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గురువారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో నేరుగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. పోటీ విషయంలో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని సమాచారం.బీహార్ ఎన్నికలకు సంబంధించి మొదటి దశ నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కీలక మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఇంతవరకూ సీట్ల కేటాయింపు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. తొలుత ఆర్జేడీ తన మిత్రపక్షం కాంగ్రెస్కు 52 సీట్లు ఇచ్చింది. అయితే దానిని కాంగ్రెస్ తిరస్కరించింది. కనీసం 60 నియోజకవర్గాలు కావాలని పట్టుపట్టింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు- ఆర్జేడీ మధ్య చర్చలు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో రెండు పార్టీల జాతీయ నాయకత్వం సీట్ల ప్రతిష్టంభనను తొలగించేందుకు రంగంలోకి దిగింది. అయితే ఆర్జేడీ నేతలు కాంగ్రెస్ 61 సీట్ల డిమాండ్ను నెరవేర్చడానికి ముందుకు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పట్టుబట్టిన కొన్ని కీలక నియోజకవర్గాలపై విభేదాలు మొదలయ్యాయని సమాచారం. నర్కటియగంజ్, వాసాలిగంజ్, కహల్గావ్ స్థానాలలో పోటీ విషయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. చైన్పూర్, బచ్వారాలలో ఇదే పరిస్థితి నెలకొన్నదని సమాచారం. కాగా రాహుల్ గాంధీ తాను చేపట్టిన ఓటరు అధికార్ యాత్ర రాష్ట్రంలో తమకు అవకాశాలను పెంచుతుందని నమ్ముతూ మరిన్ని సీట్లు కోరుతున్నారని తెలుస్తోంది. మీడియాకు ప్రాధమికంగా తెలిసిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 61 సీట్లతో సరిపెట్టుకునేందుకు అంగీకరించింది. ఇది 2020లో పోటీ చేసిన 70 సీట్ల కంటే తొమ్మిది సీట్లు తక్కువ. ఆ సమయంలో కాంగ్రెస్ 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయగా, 75 మంది అభ్యర్థులు గెలిచారు. ఇదిలా ఉండగా సీట్ల కేటాయింపు ఇంకా జరగకముందే బుధవారం రాత్రి కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బుధవారం రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కాంగ్రెస్ తమ అభ్యర్థులను తొలి జాబితాను ప్రకటించడం గమనార్హం. -
రాకేష్ కిషోర్పై చర్యలు.. సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ
తనపై షూ విసిరిన లాయర్(సస్పెండెడ్) రాకేష్ కిషోర్ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ క్షమించినా.. న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని తాజాగా అటార్నీ జనరల్ అనుమతిచ్చారు. అయితే.. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిదంటూ సుప్రీం కోర్టు గురువారం అభిప్రాయపడింది. అటార్నీ జనరల్ ఈ చర్యకు చట్టపరమైన అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే దానంతట అదే ఆగిపోతుంది. లేకుంటే.. సోషల్ మీడియాలో చర్చలతో సాగుతుంటుంది. పైగా ఈ అంశాన్ని పదే పదే చర్చించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 6వ తేదీన కేసు లిస్టింగ్లు జరుగుతున్న టైంలో.. అడ్వొకేట్ రాకేష్ కిషోర్ తన షూను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మీదకు విసిరారు. అయితే అది ఆయన దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన తోటి లాయర్లు కిషోర్ను అడ్డగించి.. కోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం ఊరుకోదు అంటూ కిషోర్ నినాదాలు చేశాడు. అయితే ఈ ఘటనను పట్టించుకోకుండా ప్రొసీడింగ్స్ కొనసాగించాలని జస్టిస్ గవాయ్ అక్కడున్నవాళ్లకు సూచించారు. ఇలాంటివి తనని ప్రభావితం చేయబోవని ఆ టైంలో అన్నారాయన.అటుపై చీఫ్ జస్టిస్ సూచనతో ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాకుండా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ చూసుకుంది. దీంతో రాకేష్ను మూడు గంటలపాటు ప్రశ్నించి.. షూ, ఆయన ఫైల్స్ను అందించి ఢిల్లీ పోలీసులు వదిలేశారు. ఈలోపు.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన లాయర్ లైసెన్స్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే తాను చేసిన పనికి పశ్చాత్తపం చెందడం లేదంటూ కిషోర్ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్.. ఆయన్ని సుప్రీం కోర్టు ఆవరణలోకి అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించింది. అయితే.. ఏజీ ఆదేశాల నేపథ్యంలో రాకేష్ కిషోర్పై క్రిమినల్ కంటెప్ట్ ఆఫ్ కోర్టుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు.. సీనియర్ లాయర్ వికాస్ సింగ్ ఇవాళ ద్విసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించే ఘటన అని, తీవ్రంగా పరిగణించి ఈ అంశాన్ని రేపు విచారణ జరపాలని బెంచ్ను కోరారు. అయితే.. ఈ అంశం సోషల్ మీడియాలో కొనసాగుతోందని వికాస్ సింగ్ అనగా.. కొంతమంది ఈ చర్యను సమర్థించారని, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ గౌరవాన్ని దెబ్బ తీసే అంశమని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ వద్ద అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని.. ఈ ఘటనలో సీజేఐ చాలా ఉదారంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు సంస్థను ప్రభావితం చేయవని హుందాగా అన్నారు. అయితే.. ఆయన స్పందన గౌరవప్రదంగానే ఉన్నా సోషల్ మీడియాలో ఈ చర్యను సమర్థించడం ఆందోళన కలిగిస్తోందని తుషార్ మెహతా చెప్పారు. ఈ వ్యవహారంలో John Doe injunction(కోర్టు నుంచి ముందస్తుగా తీసుకునే నిషేధ ఉత్తర్వు) జారీ చేయాలని లాయర్ వికాస్ సింగ్ కోర్టును కోరారు. ఆ సమయంలో జస్టిస్ బాగ్చీ కలుగజేసుకుని.. ‘‘ఇది కొత్త వివాదాలకు దారితీయవచ్చు. కోర్టులో మన ప్రవర్తనే ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓ బాధ్యతలేని పౌరుడి చర్యగా పరిగణించి సీజేఐ దీనిని పట్టించుకోలేదు. అలాంటి అంశాన్ని మళ్లీ తవ్వడం అవసరమా? అని అన్నారు. పైగా ఎన్నో ముఖ్యమైన అంశాలు పెండింగ్లో ఉన్నాయని, దీనిని పైకి తేవడం సమయాన్ని వృధా చేయడమేనన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం తన ఉద్దేశం కాదని, ఇక్కడితో నిలువరించమే తన అభిమతమని వికాస్ సింగ్ స్పష్టత ఇచ్చారు. ఆపై జస్టిస్ కాంత్ మాట్లాడుతూ.. నా సహ న్యాయమూర్తి చెబుతోంది మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించిన వెంటనే, మీడియాలో కథనాలు కొనసాగుతాయి అని అన్నారు. ఆ టైంలో..‘దురదృష్టవశాత్తు, మనం డబ్బు సంపాదించే వ్యాపారాలుగా మారిపోయాం…" అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో సాలిసిటర్ జనరల్ ఏకీభవించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారాలు అల్గోరిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయి. ప్రజలు వాటికి బానిసలుగా మారిపోయారు. ఆ బానిసత్వాన్ని ఈ ప్లాట్ఫారాలు డబ్బుగా మార్చుకుంటున్నాయి. మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నామనుకుంటాం, కానీ నిజానికి మనమే ఆ ప్లాట్ఫారాల ఉత్పత్తులం’’ అని మెహతా అన్నారు. ఆ సమయంలో జస్టిస్ కాంత్ కలుగజేసుకుని మనం ఉత్పత్తులమే కాదు.. వినియోగదారులం కూడా అని అన్నారు. సోషల్ మీడియా మనుషుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దాని అల్గోరిథమ్స్ ద్వారానే.. ద్వేషం, కోపం, కామం లాంటి భావనలకు గురవుతున్నాం. సోషల్ మీడియా మన ఈ వ్యసనాన్ని మానిటైజ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అది మళ్లీ మానిటైజ్ అవుతుంది. కాబట్టి దీనిని సహజంగా ముగియనివ్వడమే మంచిది అని జస్టిస్ కాంత్ అన్నారు. పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని.. అలాగే న్యాయస్థానం కూడా బార్ (న్యాయవాదుల సంఘం) ఆవేదనను అర్థం చేసుకోవాలని లాయర్ వికాస్ సింగ్ కోరారు. ‘‘బార్ (న్యాయవాదుల సంఘం) ఎప్పుడూ న్యాయ వ్యవస్థకు అండగా నిలిచింది. మీరు న్యాయాన్ని కోరే ప్రజలతో కోర్టును కలిపే వంతెన. మీ పరిస్థితిని, మీ భావోద్వేగాలను మేము అర్థం చేసుకుంటున్నాం’’ అని జస్టిస్ కాంత్ అన్నారు. ఈ అంశాన్ని శుక్రవారం విచారణకు తీసుకురావాలని వికాస్ సింగ్ మరోసారి కోరారు. అయితే.. దీపావళి తర్వాతే విచారించే అవకాశం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. ఒక వారం తర్వాత ఇది ఇంకా 'సేలబుల్' అంశంగా ఉంటుందేమో చూద్దాం అని జస్టిస్ కాంత్ సున్నితంగా వ్యాఖ్యానించారు. ఈలోపు.. అల్గోరిథమ్ కోసం కొత్త అంశం వస్తుందేమో చూడాలి అని జస్టిస్ బాగ్చీ అన్నారు. దీనికి సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ఇలాంటి అంశాలకు 24–48 గంటల లైఫ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి వస్తుంది అనడంతో నవ్వులతో విచారణ వాయిదా పడింది. -
Bihar Elections: తేజస్వి ఆస్తులెంత? బెరెట్టా పిస్టల్ వివాదమేంటి?
పట్నా: దేశంలో ఎక్కడ చూసినా బీహార్ ఎన్నికలకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం మొదలయ్యింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అధికారిక అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడిది ఎంతో ఆసక్తికరంగా మారింది.ఆర్జేడీ కోట నుండి వరుసగా మూడవసారి విజయం సాధించాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన తేజస్వి యాదవ్.. బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏపై పలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో బెరెట్టా పిస్టల్తో పాటు రూ. 8.98 కోట్ల విలువైన కుటుంబ ఆస్తులను వెల్లడించారు. అలాగే తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని కూడా తెలిపారు. ఆ వివరాలు..తేజస్వి యాదవ్ ఆస్తులు- రూ 1.88 కోట్లు (స్థిరచరాస్తులు) భార్య రాజ్శ్రీ యాదవ్ ఆస్తులు- రూ 59.69 లక్షలు(స్థిరచరాస్తులు)ఇద్దరు పిల్లల ఆస్తులు- రూ. 40 లక్షలు(స్థిరచరాస్తులు)మొత్తం కుటుంబపు చరాస్తులు- రూ. 6.12 కోట్లుబంగారం, వెండి- రూ. 85.9 లక్షలు- (980 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండి)ఆయుధాలు- రూ.1.05 లక్షలు ఇటాలియన్ బెరెట్టా ఎన్పీబీ 380 బోర్ పిస్టల్, 50 రౌండ్లుఎలక్ట్రానిక్స్- రూ. 85 లక్షలు డెస్క్టాప్, ల్యాప్టాప్మొత్తంగా ప్రకటించిన కుటుంబ ఆస్తులు రూ. 8.98 కోట్లుఈ అఫిడవిట్లో తేజస్వి యాదవ్ పేరు మీద ఏ వ్యక్తిగత వాహనం లేదా రియల్ ఎస్టేట్ వివరాలు లేవు. ఇది తేజస్వి సామాన్యుడనే ఇమేజ్ను బలోపేతం చేస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జాబితాలోని ఎలక్ట్రానిక్స్ , ఆయుధం విలువ అతని సామాన్య జీవనశైలికి విరుద్ధంగా ఉన్నాయనే వాదన విపిస్తోంది. కాగా అఫిడవిట్లో ఇటాలియన్ బెరెట్టా ఎన్పీబీ 380 బోర్ పిస్టల్, 50 బుల్లెట్లను చేర్చడం, దాని విలువ రూ. 1.05 లక్షలుగా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. 1984 నుండి దేశంలో పౌర ఆయుధాల దిగుమతిని నిషేధించారు. ఆయుధ చట్టం- 1959 ప్రకారం అధికారం కలిగిన భారతీయ డీలర్ నుండే ఆయుధాన్ని కొనుగోలు చేయాలి. అయితే తేజస్వి బెరెట్టా పిస్టల్ కలిగివుండటంపై పలు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇది అక్రమంగా వచ్చిన ఆయుధమనే వాదన వినిపిస్తోంది.తేజస్వి యాదవ్ తన అఫిడవిట్లో తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో నాలుగు అప్పీల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులు రాజకీయ ర్యాలీలు, నిరసనలు, వివాదాస్పద ప్రకటనల కారణంగా నమోదయ్యాయి. తాజగా అక్టోబర్ 13న ఢిల్లీ కోర్టు.. ఆయనతో పాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీ దేవిలపై ఐఆర్సీటీసీ హోటళ్ల అవినీతి కుంభకోణం, ల్యాండ్-ఫర్-జాబ్స్ స్కామ్లో అధికారికంగా అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఇది ఎన్నికలకు ముందు తేజస్వికి ఎదురుదెబ్బగా మారింది.రాఘోపూర్ నియోజకవర్గం ఆర్జేడీకి ఎంతో కీలకమైనది. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఇద్దరూ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమిది. తేజస్వి 2015, 2020లలో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక్కడి ఓటర్లలో యాదవులు 25 శాతం, ముస్లింలు 20 శాతం, ఈబీసీలు 30 శాతం ఉన్నారు. ఇది ఆర్జేడీ విజయానికి కీలకమైన జనాభాగా పరిగణిస్తుంటారు. హాజీపూర్ కలెక్టరేట్లో తేజస్వి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశాక తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ‘ఎక్స్’ ఖాతాలో ‘ఈ నామినేషన్ తేజస్వి ఒక్కడికే కాదు.. బీహార్ అంతటా మార్పు కోసం’ అని పేర్కొన్నారు. -
‘ఓఆర్ఎస్’ అనొద్దు: ఫుడ్ కంపెనీలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో ఫుడ్ ప్రొడక్టులను అమ్మే కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నూతన హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింకులపై ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్ఎస్) అని రాయడాన్ని పూర్తిగా నిషేధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న ఈ విధానాన్ని నిషేధిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.ఫుడ్ ప్రొడక్ట్ బ్రాండ్ పేరులో, లేదా ట్రేడ్ మార్క్ లో ఓఆర్ఎస్ అనే పదాన్ని వినియోగించడం ఇకపై చట్టవిరుద్ధమని వెల్లడించింది. ఈ నూతన నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని బుధవారం జారీ చేసిన ఒక ప్రకటనలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. డీహైడ్రేషన్ నివారణ కోసం మార్కెట్లో ఓఆర్ఎస్ పేరుతో పలు డ్రింకులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటితో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న ఫార్ములాతో తయారైనదే అసలైన ఓఆర్ఎస్గా గుర్తించాలి.అయితే మార్కెట్లో పలు రకాల ఆహార, పానీయాల తయారీ కంపెనీలు తమ పండ్ల రసాలు, పానీయాలకు ఓఆర్ఎస్ అనే పదాన్ని తగిలించి అమ్ముతున్నాయి. ఫలితంగా వినియోగదారులు సాధారణ డ్రింకులను కూడా వైద్యానికి వినియోగించే ఓఆర్ఎస్ అని భ్రమపడి కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే‘డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఓఆర్ఎస్ ఫార్ములా కాదు’ అనే హెచ్చరికతో ఓఆర్ఎస్ పదాన్ని వాడేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతిచ్చింది.ఈ విధంగా 2022 జూలై, 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా వినియోగదారులు వీటిని ఒరిజినల్ ఓఆర్ఎస్ అని భ్రమపడుతున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఈ నేపధ్యంలో పాత ఉత్తర్వులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. ఇకపై తప్పుదోవ పట్టించే లేబులింగ్తో విక్రయాలు జరపడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లు ఈ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. -
షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
బెంగళూరు: ఆ దంపతులు ఇద్దరూ వైద్యులు. అనారోగ్యం పాలైన భార్యకు వైద్యం చేయించడానికి బదులు ఏకంగా ఆమె ప్రాణమే తీశాడు ఆ భర్త. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హతమార్చి.. సహజ మరణంగా కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ చివరకు నిజం బయట పడింది. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, కృతికారెడ్డి గ్యాస్ట్రిక్, షుగర్ వంటి సమస్యలతో బాధ పడుతోంది. పెళ్లి సమయంలో ఈ సమస్యలు ఉన్నట్లు భార్య కుటుంబం తనకు చెప్పలేదని మహేంద్రరెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రోజూ వాంతులు, ఇతరత్రా రుగ్మతలతో ఇబ్బందులు పడే భార్యను హత్య చేసి, అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆరోగ్యం (Health) సరిగా లేదని కృతికారెడ్డి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, మహేంద్రరెడ్డి ఆమెకు ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా రెండు రోజులు వరుసగా ఇవ్వడంతో ఆమె ఏప్రిల్ 23వ తేదీన మరణించింది. ఆపై తన భార్య అనారోగ్యంతో బాధ పడుతోందని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో మారతహళ్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. వారి ఇంట్లో నుంచి ఇంజెక్షన్, ఐవీ సెట్ వంటి ఉప కరణాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మృతదేహం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులుఈ నెల 13వ తేదీన అందిన రిపోర్టులో కృతికారెడ్డి దేహంలో ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఆనవాళ్లు కనిపించాయని ఉంది. దీంతో అల్లుడే కూతురిని హత్య చేశాడని మృతురాలి తండ్రి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు డాక్టర్ మహేంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆమె భర్త తప్పుడు ఉద్దేశంతో కావాలనే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. -
భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి..పార్టీ ఇచ్చాడు!
కర్ణాటక: భార్యను హత్య చేసి బోరు బావిలో పాతిపెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అలఘట్ట గ్రామంలో నెలన్నర క్రితం విజయ్ తన భార్య భారతిని హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా తోటలోని బోరు బావిలో శవాన్ని పాతి పెట్టాడు. భార్య పీడ తప్పిందని మూడు జంతువులను బలిచ్చి బంధువులకు విందు భోజనం పెట్టాడు. రేకుపై భార్య పేరు రాసి దెయ్యం, పీడ, పిశాచి పట్టకూడదని రాసి పూజలు చేయించాడు. అనంతరం తన భార్య మానసిక అస్వస్థతతో ఇల్లు వదలి వెళ్లినట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించాడు. అదృశ్యమైన తన భార్య ఆచూకీ కనిపెట్టాలంటూ కడూరు పోలీసులకు విజయ్ ఫిర్యాదు చేశాడు. భారతి తల్లిదండ్రులు కూడా కుమార్తె అదృశ్యంపై పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. భర్త విజయ్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనకు సంబంధించి భర్త విజయ్తో పాటు అత్తమామలు తాయమ్మ, గోవిందప్పను అరెస్ట్ చేశారు. మృతురాలు భారతి తన అవ్వను చూడటానికి శివమొగ్గకు వెళ్లారు. తిరిగి వాపస్ రాలేదని సెపె్టంబర్ 5న భర్త విజయ్.. కడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెలన్నర తరువాత భారతి తల్లి, ఎమ్మెదొడ్డి పరదేశీహాళ్కు చెందిన లలితమ్మ కడూరు పోలీసులకు మళ్లీ అక్టోబర్ 13న ఫిర్యాదు చేశారు. ‘6 ఏళ్ల క్రితం భారతిని విజయ్కి ఇచ్చి వివాహం చేశాం. అనేక సార్లు కట్నం కావాలని విజయ్ వేధించేవాడని భారతి తల్లిదండ్రులు ఫిర్యాదులో వివరించారు. దీంతో పోలీసులు విజయ్ను విచారించగా అసలు విషయం బయట పడింది. లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్లుడు విజయ్, అతడి తలి తాయమ్మ, తండ్రి గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ట్రంప్ ప్రకటన.. రాహుల్ విమర్శలు.. స్పందించిన కేంద్రం
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందని, ఇందుకుగానూ భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్ను చూసి మోదీ భయపడ్డారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంధన దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ నోట్ రూపేణా స్పందించింది. అస్థిర పరిస్థితుల నడుమ.. వినియోగదారుల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం ఉంటుందని అందులో కేంద్రం స్పష్టం చేసింది(India Reacts On Trump Russia Oil Comments).మీడియా ప్రశ్నలకు బదులుగా.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తాజా పరిణామాలపై ఒక నోట్ విడుదల చేశారు. చమురు సంబంధిత దిగుమతులు భారత్కు ఎంతో కీలకం. మార్కెట్ అస్థిరతల మధ్య ఇక్కడి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రధాన ధ్యేయం. అందుకే దిగుమతుల విధానాలు ఆ దిశగా రూపొందించబడ్డాయి.... స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో కూడిన సరఫరా.. ఇవే మా ద్వంద్వ లక్ష్యాలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఇంధన వనరుల విస్తరణ, వివిధ దేశాల నుంచి సరఫరా పొందడం జరుగుతోంది అని అందులో పేర్కొన్నారాయన. అలాగే..Our response to media queries on comments on India’s energy sourcing⬇️🔗 https://t.co/BTFl2HQUab pic.twitter.com/r76rjJuC7A— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2025అమెరికాతో సంబంధం గురించి మాట్లాడుతూ.. గత దశాబ్దంగా ఇంధన సహకారం పెరుగుతోంది. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం భారత్తో సహకారం మరింతగా అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపుతోంది. చర్చలు కొనసాగుతున్నాయి అని జైస్వాల్ అందులో తెలిపారు. తద్వారా.. అంతర్జాతీయ ఒత్తిడులకు కాకుండా దేశ ప్రయోజనాల ఆధారంగా భారత్ ముందుకు వెళ్తుందని మరోసారి భారత్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) ముగింపు దిశగా కీలక అడుగు పడిందని, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయబోతోందని, మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. ట్రంప్ నుంచి సానుకూల స్పందన లేకపోయినా తరచూ అభినందన సందేశాలు ఎందుకంటూ మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ తరుణంలో కౌంటర్గా కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.ఇదీ చదవండి: మోదీ నన్ను ప్రేమిస్తారు.. అంటే మరోలా కాదు! -
30 ఏళ్లుగా భారత్లో ‘బంగ్లా’ ట్రాన్స్.. నకిలీ పత్రాలతో హల్చల్
ముంబై: భారత్లో అక్రమంగా ఉంటున్న విదేశీయుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో పలువురు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులు ‘గురు మా’ పేరుతో గుర్తింపు పొందిన జ్యోతి అనే బంగ్లాదేశ్కు చెందిన ట్రాన్స్ జెండర్ను అరెస్టు చేశారు.ట్రాన్స్ జెండర్ జ్యోతి గత 30 ఏళ్లుగా నకిలీ ధృవపత్రాలతో భారత్లో ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి అసలు పేరు బాబు అయాన్ ఖాన్. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ వచ్చి, ఇక్కడ ఉంటున్న వలసదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే జ్యోతితో పాటు ఆమె సహచరులను ముంబైలోని శివాజీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇతర ధృవీకరణ పత్రాలు ఉండటంతో తొలుత వదిలేశారు. అయితే ఆ తరువాత జ్యోతికి సంబంధించిన ధృవపత్రాలను మరోమారు తనిఖీ చేయడంతో అవి నకిలీవని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.శివాజీ నగర్, నార్పోలి, డియోనార్, ట్రోంబే, కుర్లాతో సహా ముంబై పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో జ్యోతిపై ఇప్పటికే పలు నేర సంబంధిత కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. జ్యోతికి ముంబైలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో జ్యోతిని ‘గురు మా’ పేరుతో పిలుస్తారు. జ్యోతికి పలువురు అనుచరులు కూడా ఉన్నారు. జ్యోతి అలియాస్ ‘గురు మా’ను పాస్పోర్ట్ చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని పలు నిబంధనల కింద అరెస్టు చేశారు.ఇదిలావుండగా ఢిల్లీలోని షాలిమార్ బాగ్, మహేంద్ర పార్క్ ప్రాంతాలలో నిర్వహించిన వరుస ఆపరేషన్లలో ఢిల్లీ పోలీసులు దేశంలో అక్రమంగా నివసిస్తున్న పది మందికి పైగా బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. వీరంతా మహిళలుగా కనిపించేందుకు సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, భిక్షాటన చేస్తుంటారని పోలీసులు దర్యాప్తులో తేలింది. ‘హైదర్పూర్ మెట్రో స్టేషన్, న్యూ సబ్జీ మండి ప్రాంతాలలో అనుమానిత బంగ్లాదేశీయుల గురించి అందిన సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదర్పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎనిమిది మందిని, న్యూ సబ్జీ మండి సమీపంలో ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారు చెబుతున్న భారత పౌరసత్వ వాదనలపై సందేహాలు తలెత్తాయని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. -
ప్రభుత్వం కీలక నిర్ణయం.. 35 మార్కులు రాకున్నా పాస్..
పదో తరగతి.. లేదా ఎస్ఎస్ఎల్సీ.. విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ఇది మొదటి మెట్టు. టెన్త్ పాసైతే పీయూసీ, ఆపై చదువులకు తలుపులు తెరుచుకుంటాయి. లేదా చిన్నా చితకా ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ఇందుకోసం ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులను తెచ్చుకోవాలి. కానీ చాలామంది విద్యార్థులు, పేదరికం, చదువు అర్థం కాక తదితర సమస్యలతో ఒకటీ అరా మార్కులతో పరీక్షలు తప్పి శాశ్వతంగా చదువుల తల్లికి దూరం కావడం అన్నిచోట్లా జరుగుతోంది. టెన్త్ ఫెయిల్ అనేది ఒక శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణతకు 33 శాతం మార్కులు చాలని కుదించింది. శివాజీనగర: రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 33 శాతం మార్కులు వస్తే చాలు పాసైపోయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. 35 శాతం మార్కులు పొందేందుకు అవస్థలుపడే అనేకమంది విద్యార్థులకు ఇది చాలా అనుకూలం కానుంది. ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తామని, ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. 206 మార్కులు చాలు బుధవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మధు.. ఈ విద్యా సంవత్సరం నుంచి 33 శాతం మార్కులు పొందితే ఎస్ఎస్ఎల్సీ పాస్ అయినట్లేనని తెలిపారు. మొత్తం మార్కులు 625 కాగా, 206 మార్కులు వస్తే చాలు విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పారు. అంతర్గత మార్కులు, బాహ్య మార్కులు రెండు కలిపి 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఒక మార్కు, రెండు మార్కుల్లో పరీక్షలు తప్పిపోయే వేలాది మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా పరీక్షలు రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీలో పరీక్షల వ్యవస్థ మెరుగుపరిచేందుకు మూడంచెల విధానాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, ఉత్తమ రీతిలో పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. ఉత్తీర్ణత వృద్ధి కోసం 33 శాతం పాసింగ్ మార్కులను నిర్ధారించామన్నారు. ఆయా సబ్జెక్టుల మార్కుల్లో 30 మార్కులు పొంది, అంతర్గత, బాహ్య మార్కులు కలిపి మొత్తం 33 శాతం మార్కులు వచ్చినా ఉత్తీర్ణులవుతారని తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు, రిపీటర్స్కు ఇది వర్తిస్తుందని చెప్పారు. -
తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజులు మిగిలి ఉంది. ఇప్పటికీ బీహార్లో విపక్ష మహాఘట్ బంధన్లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అయోమయం, గందరగోళం నడుమే ఆర్జేడీ 35 మందితో తన జాబితాను విడుదల చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 10 మంది పేర్లను ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.పది మంది అభ్యర్థులకు సింబల్ పంపిణీ చేసింది కాంగ్రెస్. ఆ ఫొటోలను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేశారు. అయితే.. సీట్ల పంపిణీ లెక్కలు తేలకుండానే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించిందా? లేదంటే ఒప్పందం ప్రకారమే చేసిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. గత అర్ధరాత్రి పాట్నా ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేగింది.బీహార్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అల్లవరు, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేష్ రామ్, సీనియర్ నేత షకీల్ అహ్మద్ ఖాన్లు ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలు జరిపిన అనంతరం పాట్నా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి.. బిక్రమ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా.. అది ఘర్షణకు దారి తీసింది.బీహార్లో బిక్రం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధార్థ్ సౌరభ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. తాజాగా.. కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థులలోఈ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు. అయితే.. विधानसभा क्षेत्र - बिक्रम सेINDIA गठबंधन समर्थित कांग्रेस उम्मीदवार श्री अनिल कुमार जी को अनंत बधाई एवं शुभकामनाएं!जीत रहा है INDIA ✊ pic.twitter.com/au4idsuiOm— Bihar Congress (@INCBihar) October 15, 2025ఈ పరిణామంపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాట్నా ఎయిర్పోర్టు వద్దకు చేరుకుని తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రూ.5 కోట్లకు సీటు అమ్ముకున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ మద్దతుదారుడు మనీష్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అలజడి రేగింది.దీంతో ఆ ముగ్గురు పెద్దలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. షకీల్ అహ్మద్ ఖాన్ను కార్యకర్తలు రౌండప్ చేయగా.. అతి కష్టం మీద తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఈ సీటు అభ్యర్థికి మార్పు తప్పదా? అనే చర్చ జోరందుకుంది.Congressmen clash at Patna airport, causing uproar over ticket dispute #Patna #Airport #Congress बिहार कांग्रेस के कार्यकर्ता पटना एयरपोर्ट पर टिकट बंटवारे से नाराज़! कृष्णा अल्लावरू, राजेश राम के सामने पहुंचे, लेकिन पप्पू यादव समर्थकों से भिड़ंत। गोली नहीं चली, यही बड़ी बात! pic.twitter.com/cpMcx35U5C— DVN TV (@dvntvnews) October 16, 2025ఇదిలా ఉంటే.. సీట్ల పంపిణీపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దఫా చర్చలు ఇవాళ ఓ కొలిక్కి వచ్చాక.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్జేడీ 130, కాంగ్రెస్ 60, వీఐపీ 18, వామపక్ష పార్టీలు 35 స్థానాలలో పోటీ చేస్తాయని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్! -
జడ్జీ కక్కుర్తి.. విచారణ లైవ్లో మహిళతో రాసలీలలు..
ఉన్నత వృత్తిలో ఉండి పలువురికి మార్గదర్శకంగా ఉండాల్సిన కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన కారణంగా సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే, వీరు చేస్తే పనుల కారణంగా ఆ వృత్తికే చెడ్డ పేరు వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా ఓ జడ్జీ.. లైవ్లోనే ఒక మహిళతో రాసలీలలు(Judge Viral Video) చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన చండీగఢ్లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ప్రకారం.. ఆన్లైన్లో కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కేసుల విచారణలో భాగంగా కోర్టుకు లాయర్లు, పోలీసులు వస్తున్నారు. ఈ జడ్జీ కూడా ఆన్లైన్లో కోర్టుకు హజరయ్యారు. తన కేసు విచారణ కంటే ముందే వచ్చి లైవ్లో రెడీగా కూర్చున్నాడు. అయితే, ఆయన తన లాప్ టాప్లో వీడియో మోడ్ను ఆన్ చేసిన సంగతి మర్చిపోయాడు.ఇంతలో ఒక మహిళ.. సదరు జడ్జీ వద్దకు రాగానే.. కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. అనంతరం, ఆయన ముద్దులాటకు దిగాడు. మహిళను బలవంతంగా తనవైపునకు లాగి.. ముద్దుపెట్టాడు. వీళ్ల రాసలీలలు.. లైవ్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో మిగత వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతలో కొంత మంది ఆయనకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జడ్జీలే ఇలా చేస్తే.. ఇంకా న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలని కామెంట్లు చేస్తున్నారు. -
ఆ ఒక్కడి లెక్క తేలిస్తే కగార్ ముగిసినట్లే!
నిన్న మల్లోజుల, నేడు ఆశన్న.. రేపు ఎవరో?. వరుస పరిణామాలతో యాభై ఏళ్ల మావోయిస్టు పార్టీ ఉద్యమం చివరి అంకానికి చేరుకుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar)తో పార్టీ కేడర్ కకావికలం కాగా.. అదే సమయంలో కీలక నేతలు వరుసగా లొంగిపోతుండడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 2026 మార్చికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. లెక్కలు చూస్తే.. ఆయన చెప్పినట్లు నిజంగానే గత పదేళ్లలో ఉద్యమం తీవ్రంగా క్షీణించింది కూడా. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు( Nambala Keshava Rao) ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అయ్యింది.గత రెండేళ్లలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండగా.. చేసేదేం లేక కింది స్థాయిలో కేడర్ కూడా పార్టీని వీడుతోంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో మరో విశేషం ఒకటి ఉంది. ఆ పన్నెండు మందిలో.. 8 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలే ఉన్నారు. హనుమంతు, గణపతి, తిరుపతి, చంద్రన్న, సంగం వీళ్లంతా ఇక్కడి వాళ్లే. ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్కడు మడావి హిడ్మా. ఛత్తీస్గఢ్కు చెందిన ఈయన పలు రాష్ట్రాలకు మోస్ట్వాంటెడ్. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉదృతంగా సాగుతోంది. ఆయన ‘లెక్క తేలిస్తే’.. మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం శాఖ బలంగా భావిస్తోంది. ఇదీ చదవండి: మడావి హిడ్మా ఎక్కడ?మావోయిస్టు ఉద్యమం 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి గ్రామంలో ప్రారంభమైంది.మార్క్సిజం–లెనినిజం–మావోయిజం సిద్ధాంతాల ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థను కూల్చి.. సమసమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఇంతకాలం సాగింది.ఉద్యమం కాలక్రమంలో.. CPI (ML) పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్(MCC) విలీనంతో 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఏర్పడింది.ఉద్యమం ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని భావించింది. కానీ హింసా మార్గం వల్ల పోను పోను ప్రజల మద్దతు తగ్గుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ ఉద్యమం తీవ్రంగా క్షీణించగా.. 2026 నాటికి పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో ఉంది. -
‘తెర’ వెనుక తెగిపోయిన కల
న్యూఢిల్లీ: అది ఢిల్లీలోని శాంతి నగర్, ఆ రోజు అక్టోబర్ 12. ఆ మధ్య తరగతి కుటుంబంలో ఎప్పుడూ ఉండే ఆనందం, నవ్వులు.. ఆరోజు భయంకరమైన నిశ్శ బ్దంలో కొట్టుకుపోయాయి. తండ్రి ఒక రియల్ ఎస్టేట్ డీలర్, తల్లి గృహిణి, 12వ తరగతి చదువుతున్న కుమార్తె, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు.. ఇంతే ఆ కుటుంబం. పద్నాలుగేళ్ల ఆ బాలునికి ఈ తరం పిల్లల్లాగే సోషల్ మీడియాపై ఆసక్తి ఉంది. తన గదిలోనే ఏదో కొత్త వీడియో తీయాలనే ఉత్సాహంతో ఉన్నా డు. అప్పుడు తెలియదు, ఆ ఉత్సాహమే తన జీవితంలో చివరి క్షణం అవుతుందని.. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని వేళ, తన గదిని ఓ చిన్న స్టూడియోలా మార్చుకున్నాడు. మొబైల్ ఫోన్ను ఒక చోట పెట్టి, ’ఆత్మహత్యను అనుకరించే’ దృశ్యాన్ని రికార్డు చేయడం మొదలు పెట్టాడు. తెరపై చూపించే ఉత్కంఠను తానూ అనుభూతి చెందాలనుకున్నాడు. కానీ, ఆ ప్రయత్నంలో, బాలుడు నిల్చున్న కుర్చీపై నుంచి కాలు జారింది. అంతే.. క్షణాల వ్యవధిలో అంతా మారిపోయింది. బాలుడికి ఊపిరి అందలేదు. కొద్దిసేపటి తరువాత, తల్లిదండ్రులు గదిలోకి వచ్చి చూడగానే.. వారి గుండెలు బద్దలయ్యా యి. ఆందోళనతో వెంటనే దగ్గర్లోని ఆసు పత్రికి తీసుకెళ్లినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ఈ సంఘటనలో ఎలాంటి కుట్ర లేదు. ఆ బాలుడు వీడియో షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపోయి ఉండవచ్చు. వీడియో ఫుటేజీ లోని బాలుని హావభావాలు చూస్తే అతను ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది’.. అని పేర్కొన్నారు. బీజేఆర్ఎం ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి బాలుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమా దవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేశారు. -
భారత పాస్పోర్టుకు 85వ ర్యాంకు
సింగపూర్: భారత పాస్పోర్టు స్థానం గత ఏడాదితో పోలిస్తే పడిపోయింది. 2025 హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్లో 85వ ర్యాంకు దక్కించుకుంది. భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌలభ్యం ఉంది. గత ఏడాది ఇదే ఇండెక్స్లో 80వ ర్యాంకు లభించింది. అప్పట్లో 62 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌకర్యం ఉండేది. ఏడాది కాలంలో 5 స్థానాలు పడిపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా సింగపూర్ పాస్పోర్టు తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ పాస్పోర్టు ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఈ జాబితాలో దక్షిణ కొరియా పాస్పోర్టుకు రెండో ర్యాంకు దక్కింది. దీంతో 190 దేశాలకు వీసాతో నిమిత్తం లేకుండా వెళ్లే వీలుంది. మూడో స్థానంలో ఉన్న జపాన్ పాస్పోర్టుతో 189 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. జర్మనీ, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ పాస్పోర్టులు నాలుగో ర్యాంకు దక్కించుకున్నాయి. వీటితో 188 దేశాలకు వీసా–ఫ్రీ సౌలభ్యం ఉంది. -
పోస్టుకార్డులతో గిన్నిస్ బుక్ రికార్డు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గుజరాత్ సహకార రంగానికి సంంధించిన ప్రజలు ఏకంగా 1.11 కోట్లకుపైగా లేఖలు రాశారు. పోస్టుకార్డులు పంపించారు. ఒకేసారి ఒకే వ్యక్తికి భారీసంఖ్యలో పోస్టుకార్డులు రాయడం గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులోకి చేరిందని అధికారులు బుధవారం చెప్పారు. జీఎస్టీ సంస్కరణతోపాటు ఇతర చర్యలు చేపట్టినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,11,75,000 పోస్టుకార్డులు పంపించడం గమనార్హం. ఈ అరుదైన ఘట్టాన్ని గిన్నిస్బుక్ ప్రపంచ రికార్డు ప్రతినిధులు గుర్తించారు. ఆయా పోస్టుకార్డులను లెక్కించారు. ప్రపంచ రికార్డు సృష్టించినట్లుగా సంబంధిత ధ్రువపత్రాన్ని మంగళవారం అధికారులకు అందజేశారు. ఇప్పటిదాకా 6,666 పోస్టుకార్డులే అతిపెద్ద రికార్డు. గతంలో స్విట్లర్లాండ్లో ఈ ఘనత సాధించారు. ఈ రికార్డును గుజరాత్ ప్రజలు తిరగరాశారు. -
నిందితుల విచారణ వేళ లాయర్ ఉండాలా?
న్యూఢిల్లీ: నేరారోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్పై పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు కేసు విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం కురిపించే వేళ పిటిషనర్ తరఫు న్యాయవాదులు అక్కడే ఉండొచ్చా? అనే ప్రశ్నకు సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం రాబట్టదల్చుకుంది. ఇందుకోసం ఈ అంశంలో మీ స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాజ్యాంగంలోని 20(3), 21, 22 అధికరణాల ప్రకారం సంక్రమించిన హక్కులమేరకు కేసుల విచారణ సందర్భంలో వ్యక్తులు తమ న్యాయవాదులను పోలీసులు, ఇంటరాగేషన్ అధికారుల సమక్షంలో హాజరుపర్చవచ్చని, ఈ మేరకు అనుమతి మంజూరుచేయాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం న్యాయవాది షరీఫ్ మధార్ వేశారు. ఈ పిల్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం బుధవారం విచారించింది. లాయర్ మధార్ తరఫున సీనియర్ మహిళా న్యాయవాది మేనకా గురుస్వామిని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రన్ ప్రశ్నించారు. ‘‘పోలీసులు, దర్యాప్తు సంస్థలు ప్రశ్నించేటప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్లు భౌతికంగా హింసకు గురైన ఘటనలు ఉన్నాయా? దర్యాప్తు వేళ లాయర్లు తప్పనిసరిగా ఉండాలా?’’అని ప్రశ్నించారు. దీంతో లాయర్ ‘ఇండియా: హింసా సంబంధ 2019 వార్షిక నివేదిక’ను గుర్తుచేశారు. ‘‘పోలీస్, దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉన్నప్పుడు పిటిషనర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడి, వేదన అంశాలను నివేదిక సవివరంగా వివరించింది. నేరాన్ని ఒప్పుకునేలా చేసేలా ప్రశ్నలు వేస్తే వాటిని లాయర్ సాయంతో పిటిషినర్ గుర్తించేందుకు, చేయని నేరాన్ని పొరపాటున ఒప్పుకున్నట్లు సమాధానాలు ఇచ్చే ప్రమాదకర స్థితిని లాయర్ తప్పించగలరు. ప్రస్తుతం లాయర్లను చాలా వరకు విచారణవేళ నిరాకరిస్తున్నారు. ఒకవేళ అనుమతించినా దూరంగా కూర్చోబెడుతున్నారు. తమ పిటిషనర్ను ఎలాంటి ప్రశ్నలను అడుగుతున్నారనేది లాయర్ వినిపించట్లేదు. పోలీసులు చేసే స్వీయ నేరాంగీకార ప్రయత్నాన్ని అడ్డుకునేలా పౌరులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ద్వారా సంక్రమించిన హక్కు ఉల్లంఘనకు గురవుతోంది. ఆర్టికల్ 22(1) ప్రకారం తన లాయర్ ద్వారా తనను తాను రక్షించుకునే, లాయర్ సలహాలు తీసుకునే హక్కులూ ఉల్లంఘనకు గురవుతున్నాయి’’అని లాయర్ వాదించారు. -
కాలం మారుతున్నా ప్రభుత్వం మారదా?
న్యూఢిల్లీ: దేశంలో మరణ శిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరణ శిక్ష పడిన దోషులకు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా శిక్ష అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆక్షేపించింది. కాలానుగుణంగా మారడానికి సిద్ధంగా లేదని తప్పుపట్టింది. దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని రద్దు చేయాలని, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణ శిక్ష అమలు చేయాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ రిషీ మల్హోత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. మరణ శిక్ష ఎలా అమలు చేయాలన్న సంగతి దోషికే వదిలివేయాలని పిటిషనర్ వాదించారు. ఉరిశిక్షా? లేక ప్రాణాంతక ఇంజెక్షనా?.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకొనే అవకాశం దోషికి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక ఇంజెక్షనే సరైన విధానమని పేర్కొన్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉండగా, 49 రాష్ట్రాల్లో ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్ష అమలు చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఉరిశిక్ష అత్యంత క్రూరమైనది, అనాగరికమైనదని, దోషి ప్రాణం పూర్తిగా పోవడానికి మృతదేహాన్ని దాదాపు 40 నిమిషాలపాటు ఉరికొయ్యకు వేలాడదీస్తారని చెప్పారు. ఉరిశిక్షతో పోలిస్తే ఇంజెక్షన్ విధానంలో ప్రాణం త్వరగా పోతుందని, ఇది మానవీయంగా, గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అది ప్రభుత్వ విధాన నిర్ణయం మరణ శిక్ష అమలు చేసే విషయంలో అడ్వొకేట్ రిషీ మల్హోత్రా సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదికి జస్టిస్ సందీప్ మెహతా స్పష్టంచేశారు. సదరు న్యాయవాది స్పందిస్తూ... శిక్ష విషయంలో దోషికి ఆప్షన్ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టుకు ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్లో స్పష్టంచేశామని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మెహతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలం మారుతున్నా ప్రభుత్వం మారదా? అని ప్రశ్నించారు. కాలానుగుణంగా ప్రభుత్వం మారకపోవడమే అసలు సమస్య అని అన్నారు. దోషికి ఉరి ద్వారా మరణ శిక్ష అమలు చేయడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అఫిడవిట్లో ప్రస్తావించామని న్యాయవాది గుర్తుచేశారు. ఈ విషయంలో 2023 మే నెలలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును ప్రస్తావించారు. మరణశిక్ష ఎలా అమలు చేయాలన్నదానిపై సమీక్ష కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నట్లు ఆ ఉత్తర్వులో కోర్టు వెల్లడించింది. కమిటీ ఏర్పాటు అంశం ఏమైందన్న సంగతిని ప్రభుత్వం వద్ద ఆరా తీస్తానని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. దాంతో తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వాన్ని ఆదేశించలేంఅడ్వొకేట్ రిషీ మల్హోత్రా 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉరిశిక్ష రద్దుకు లా కమిషన్ మొగ్గుచూపిందని పేర్కొన్నారు. 187వ నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించిందని తెలిపారు. ఇప్పుడున్నర ఉరిశిక్ష స్థానంలో తక్కువ నొప్పితో కూడిన శిక్ష విధానాలను అమల్లోకి తీసుకురావాలని వాదించారు. ప్రాణాంతక ఇంజెక్షన్ లేదా తుపాకీతో కాల్చడం లేదా విద్యుత్ షాక్ ఇవ్వడం లేదా గ్యాస్ చాంబర్లోకి పంపించడం విధానాలను సూచించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ సమర్పించింది. ఉరిశిక్షను రద్దు చేయలేమని తేల్చిచెప్పింది. ఈ కేసులో తాజాగా మరోసారి విచారణ జరిగింది. మరణశిక్షను అమలు చేసే విషయంలో ఒక కచ్చితమైన విధానం పాటించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని ధర్మాసనం వెల్లడించింది. -
నేడు కర్నూలుకు వస్తున్నా: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: గురువారం(నేడు) ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. ‘ఈనెల 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తా. ఆ తర్వాత కర్నూలులో విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలు, తదితర రంగాలకు సంబంధించిన రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు నిర్వహించే శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాల్లో పాల్గొంటాను’ అని ప్రధాని తెలిపారు. -
సార్ను కాదు.. మీ సోదరుడిని
న్యూఢిల్లీ: మహిళా శక్తే దేశానికి బలం, రక్షణ కవచం, స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తనను సార్ అని పిలవొద్దని, సోదరుడిగా సంబోధించాలని బిహార్కు చెందిన బీజేపీ బూత్ స్థాయి మహిళా కార్యకర్తకు సూచించారు. బిహార్లో నవంబర్ 14న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయని, అదేరోజు ప్రజలు మరో దీపావళి నిర్వహించుకోబోతున్నారని స్పష్టంచేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. తమ కూటమి విజయంలో మహిళలే కీలకపాత్ర పోషించబోతున్నారని తెలిపారు. బిహార్ బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ బుధవారం వర్చువల్గా సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి నమో యాప్ ద్వారా వారితో సంభాషించారు. ప్రజాస్వామ్య వేడుకలో మహిళలంతా ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ గుంపులుగా వెళ్లి ఓటు వేయాలని, పాటలు పాడుతూ, థాలీలు(గిన్నెలు) మోగిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. బిహార్ ప్రజలకు ఈసారి డబుల్ దీపావళి వస్తోందని వ్యాఖ్యానించారు. సోదరీమణులు, ఆడబిడ్డల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని స్పష్టంచేశారు. నా తరఫున గ్యారంటీ ఇవ్వండి భాయి దూజ్ పండుగ సందర్భంగా ఈ నెల 23న సోదరీమణుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. లఖ్పతీ దీదీలను, డ్రోన్ దీదీలను గౌరవించుకోవాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేయాలని, వారికి అవగాహన కల్పించాలని కోరారు. ‘ఏక్జుట్ ఎన్డీఏ, ఏక్జుట్ బిహార్(ఐక్య ఎన్డీఏ, ఐక్య బిహార్)–ఇసే బనేగీ సుశాసన్ కీ సర్కార్’ అనే నినాదాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చారు. మరోసారి సుపరిపాలన అందిస్తామన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ఎన్నికల్లో కచ్చితంగా విజయం లభిస్తుందన్నారు. ప్రతి బూత్ స్థాయి కార్యకర్త ఒక మోదీయేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తన తరఫున ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలని సూచించారు. పథకాలకు సంబంధించిన వీడియోలను అందరికీ చూపించాలన్నారు. బిహార్లో గతంలో జంగిల్రాజ్ రాజ్యమేలిందని, అప్పటి పరిస్థితుల గురించి నేటి యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్జేడీ పాలనపై విరుచుకుపడ్డారు. బిహార్లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మళ్లీ నక్సలైట్ల చేతికి అప్పగించవద్దని ప్రజలను కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్ల నుంచి బిహార్ను రక్షించుకొనే బాధ్యత ప్రజలపైనే ఉందని మోదీ ఉద్ఘాటించారు. బిహార్లో నవంబర్ 6, 11న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
‘ఓటుకు కోట్లు’పై నేడు సుప్రీం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో దాఖలైన ‘ఓటుకు కోట్లు’కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని కోరుతూ 2021 జూలై 22న రేవంత్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ అంతకుముందు ఏప్రిల్ 13న సండ్ర వెంకట వీరయ్య కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై తాజాగా బుధవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని గతంలో బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి వారి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం తొలుత వాదనలు వినిపించారు. అనంతరం రేవంత్రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహిత్గీ సుమారు గంటకుపైగా వాదనలు వినిపించారు. ఏసీబీ కేసు అక్రమం: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో దాఖలైన కేసు చెల్లుబాటు కాదని రోహత్గీ వాదించారు. ఈ కేసులో ముందుగా రేవంత్రెడ్డిని ట్రాప్ చేసిన తర్వాతే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్ఐఆర్ను నమోదు చేసిందని చెప్పారు. ఏసీబీ ట్రాప్ అక్రమమని పేర్కొన్నారు. 2015లో అమలుల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టాలను అనుసరించి లంచం ఇవ్వడం నేరం కూడా కాదన్నారు. తమ కేసు 2015లో దాఖలైనందున, ఆనాటి చట్టాలే వర్తిస్తాయని చెప్పారు. మరోవైపు.. అప్పట్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి మరోసారి తమ వైపు వాదనలు వినాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం ధర్మాసనాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. గురువారం వాదనల అనంతరం తీర్పును వెలువరించనుంది. -
మందులు నాసి..ప్రాణాలు తీసి!
విషపూరిత దగ్గు మందు సేవించి మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో పిల్లల మరణాలు సంభవించిన ఘటనతో నాణ్యత లేని మందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ ఏడాది జనవరి – ఆగస్టు మధ్య నిర్వహించిన నాన్–స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్ (ఎన్ఎస్క్యూడీ) పరీక్షల్లో 1,184 మందులు నాణ్యత లేనివిగా తేలింది. వీటిలో ట్యాబ్లెట్స్ 51%, ఇంజెక్షన్లు 18%, సిరప్స్ 11% ఉన్నాయి. నియంత్రణ సంస్థలు నిర్దేశించినట్టుగా నాణ్య త, భద్రత, సామర్థ్య ప్రమాణాలు లేని ఔషధాలను ఎన్ఎస్క్యూడీగా పరిగణిస్తారు. 2019తో పోలిస్తే ఎన్ఎస్క్యూడీ పరీక్షల్లో నాసిరకమైనవని తేలిన ఔషధాల సంఖ్య దాదాపు మూడింతలు కావడం ఆందోళన కలిగించే అంశం. మనదేశంలో తయారైన దగ్గు సిరప్స్ 2023లో గాంబియాలో డజన్ల కొద్దీ పిల్లల మరణాలకు కారణమై వివాదానికి దారితీసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టులో లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 5 ఏళ్లలో నాణ్యత లేని ఔషధాల సంఖ్య పెరుగుతోంది. 2024–25లో మొత్తం 1.16 లక్షలకుపైగా ఔషధాల శాంపిళ్లు పరీక్షించగా.. 3,104 నాణ్యత లేనివిగా తేలాయి. నకిలీ / కల్తీగా గుర్తించినవి 245. కల్తీ మందులపై పెడుతున్న కేసులు కూడా ఏటా పెరుగుతున్నాయి. నకిలీ మందులను అరికట్టడానికి.. కేంద్ర ప్రభుత్వం బార్ కోడ్ / క్యూఆర్ కోడ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఔషధాల లేబుళ్లు లేదా వీలున్న చోట బార్ కోడ్ ద్వారా.. ఆ ఔషధానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలి. పశ్చిమ బెంగాల్లో ఎక్కువకేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) నివేదిక ప్రకారం.. గత మూడేళ్లలో నాణ్యత లేని మందులకు సంబంధించి కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రం పశ్చిమబెంగాల్. అత్యధిక కేసులు (శాతాల్లో) నమోదైన రాష్ట్రాలు.. -
నిన్న మల్లోజుల.. నేడు ఆశన్న
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ హైదరాబాద్: మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోగా... అదే బాటలో మరో అగ్రనేత,కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది. ఆయనతోపాటు దాదాపు 60 మంది వరకు లొంగిపోతారని సమాచారం. వీరంతా ఇప్పటికే జగదల్పూర్కు చేరుకున్నట్లు చెబుతున్నారు. కీలక మహిళా మావోయిస్టు రణిత కూడా లొంగిపోయే వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి వీరంతా జనజీవన స్రవంతిలో కలవనున్నారు. మరోవైపు బుధవారం ఛత్తీస్గఢ్లోని వేర్వేరు జిల్లాల్లో మొత్తం 78 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో 27 మంది లొంగిపోగా, ఇందులో పది మంది మహిళా మావోలు ఉన్నారు. కాంకేర్ జిల్లాలో 32 మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తంగా 50 మంది అజ్ఞాతం వీడారు. ఇందులో మావోయిస్టు పార్టీలో కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రాజమన్ మండావి అలియాస్ రాజ్మోహన్, రాజు సలామ్ అలియాస్ శివప్రసాద్ కూడా ఉన్నారు. 50 మంది మావోయిస్టుల బృందాన్ని ప్రత్యేక బస్సులో కాంకేర్ తరలించి అక్కడ లొంగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ 7 ఏకే 47లతో పాటు మరో 17 ఇతర ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇక కొండగావ్ జిల్లాలో మరో మహిళా మావోయిస్టు లొంగిపోయింది. మల్లోజుల మార్గంలో.. శాంతిచర్చలపై ముందుగా అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖ మార్చి 28న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నార్త్ వెస్ట్ సబ్జోనల్ బ్యూరో ఇన్చార్జిగా రూపేశ్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ నుంచి వరుసగా మూడు లేఖలు విడుదలయ్యాయి. అంతేకాక ఒక యూట్యూబర్కు వీడియో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అన్ని లేఖల్లోనూ ‘శాంతి చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొందాం. తుపాకీ కంటే చర్చల ద్వారానే సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుంది’అనే అభిప్రాయాన్నే ఆశన్న వ్యక్తంచేశారు. దీంతో మల్లోజుల, ఆశన్న ఒకేదారిలో ఉన్నారనే అభిప్రాయం ఏర్పడింది. అందుకు తగ్గట్టే మల్లోజుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే ఆశన్న సైతం లొంగిపోతుండట గమనార్హం.యాక్షన్లలో దిట్ట తక్కెళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట. హæన్మకొండలో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్ ఉద్యమాల వైపు ఆకర్షితుడై 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ) చేపట్టిన పలు కీలక యాక్షన్లలో సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో 1999 సెపె్టంబర్ 4న ఐపీఎస్ అధికారి ఉమేశ్చంద్రను దారికాచి కాల్చి చంపిన ఘటన, ఆ తర్వాత 2000 మార్చి 7న అప్పటి ఉమ్మడి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్కేసర్ దగ్గర బాంబు పేల్చి చంపిన టీమ్లోనూ ఆశన్న ఉన్నారు. అంతేకాక 2003 అక్టోబర్లో తిరుపతి సమీపంలోని అలిపిరి దగ్గర సీఎం నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని క్లెమోర్ మైన్స్ పేలి్చన తొమ్మిది మంది సభ్యుల బృందానికి ఆశన్నే నాయకత్వం వహించారు. వేర్వేరు లొంగుబాట్లు.. ప్లాన్లో భాగమే దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడిందనే అభిప్రాయం కలిగించడానికే అగ్రనేతల లొంగుబాటు కార్యక్రమాలను వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఏపీ, తెలంగాణలో ఉనికి కోల్పోయింది. ఏఓబీలో వరుస ఎన్కౌంటర్లలో చలపతి, గాజర్ల గణేశ్, మోడెం బాలకృష్ణ వంటి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు చైతే వంటి మహిళా అగ్రనేతలు చనిపోయారు. ఇక ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్, మైలారపు ఆడేళ్లు చనిపోయారు. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లలో ప్రయాగ్ మాంఝీ, అంజు సోరేన్ మృతి చెందారు. దీంతో దండకారణ్యం అందునా అబూజ్మడ్, దక్షిణ బస్తర్కే మావోయిస్టు పార్టీ పరిమితమైంది. ఇక్కడ కూడా ఆ పార్టీ పట్టు కోల్పోయిందనే విషయం ప్రపంచానికి చాటేందుకే అబూజ్మాడ్లో మహారాష్ట్ర కేడర్కు చెందిన మావోలంతా మల్లోజుల వెంట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదే మాడ్ ఏరియాలో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన మావోయిస్టులంతా ఆశన్నతో కలిసి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయ్ ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతకు మూడు రోజుల ముందు దక్షిణ బస్తర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అగ్రనేతలు హైదరాబాద్లో లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు కీలక నేతలంతా మాడ్ అడవుల్లోనే తలదాచుకు న్నారు. అక్కడి నుంచి సురక్షితంగా లొంగిపోవాలంటే వారి ముందున్న ప్రత్యామ్నాయాలు మహరాష్ట్ర, ఛత్తీస్గఢ్ మాత్రమేనని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. -
‘చెత్త రోడ్లు..మేమెందుకు కట్టాలి ట్యాక్స్’.. భీష్మిస్తున్న నగర వాసులు
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం మరోసారి మౌలిక సదుపాయాల సమస్యలతో చర్చకు దారితీసింది. నగరంలోని అధ్వాన్న రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే పలు మార్లు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా, మౌలిక సదుపాయాలు లేకపోతే తాము ఆస్తిపన్ను ఎందుకు చెల్లించాలి అంటూ పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.నగరంలో గుంతలు పడిన రోడ్ల విషయంలో ప్రభుత్వ చర్యలు వేగవంతం చేసింది. రోడ్లను గుర్తించి మరమత్తులు కూడా చేపట్టింది. అయినా నగర వాసులు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోతే ఆస్తిపన్ను కట్టబోమని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. అలా ఇప్పటి వరకు 13వేల గుంతలు పూడ్చినట్లు తెలిపారు. అలాగే, 550 కిలోమీటర్ల ప్రధాన రహదారుల అభివృద్ధికి వెయ్యి కోట్ల యాక్షన్ ప్లాన్ను రూపొందించమని అధికారులను ఆదేశించారు.బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై వ్యక్తిగత పన్ను చెల్లింపు దారుల ఫోరం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసింది. లేఖలో, గ్రేటర్ బెంగళూరు మునిసిపల్ సంస్థలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే, ఆస్తిపన్ను వసూలు చేయకుండా ఉండాలని సూచించారు.వర్తూర్-బలగేరె-పనతూర్ ప్రాంతాల్లో అసంపూర్ణ, శాస్త్రీయతలేని రోడ్ల పనులు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షాకాలంలో వరదలు, డ్రైనేజ్ పూర్తికాకముందే రోడ్ల పనులు ప్రారంభించడం, కొత్త రోడ్లు త్వరగా దెబ్బతినే ప్రమాదం, వైట్ టాపింగ్, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ పనులు ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం వంటి అంశాలను హైలెట్ చేశారు. మౌలిక సదుపాయాలు లేకుండా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడం అన్యాయం. బెంగళూరు ఐటీ హబ్గా గుర్తింపు పొందినప్పటికీ ‘గుంతలరోడ్లు, ట్రాఫిక్ జామ్, గార్బేజ్ సిటీ’ వంటి పేర్లు నగర గౌరవాన్ని తగ్గిస్తున్నాయని వాపోయారు. -
జాక్పాట్ కొట్టేసింది..ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్కు ఎమ్మెల్యే సీటు!
పాట్నా: ప్రముఖ ఫోక్ సింగ్ మైథిలీ ఠాకూర్ జాక్ పాట్ కొట్టేశారు. బుధవారం బిహార్ బీజేపీ అభ్యర్థుల జాబితాలో స్థానం సంపాదించారు. 12 మంది అభ్యర్థులు, వారు పోటీ చేసే నియోజక వర్గాలను బీజేపీ బుధవారం ప్రటించింది. రెండోసారి విడుదల చేసిన బిహార్ బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ (Maithili Thakur), మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు ఉన్నారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ పోటీ చేయనుండగా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా పోటీ చేస్తారు. బిహార్ బీజేపీ రెండవ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 12 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించగా, అలీనగర్ నియోజకవర్గం నుంచి ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్కు అవకాశం కల్పించారు. అత్యంత కీలకమైన అలీనగర్ స్థానాన్ని మైథిలీ ఠాకూర్కు కట్టబెట్టే విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. మిథిలాంచల్ ప్రాంతానికి చెందిన మైథిలీ ఠాకూర్ ఈ ప్రాంతపు సాంస్కృతిక ప్రతినిధిగా గుర్తింపు పొందారు. మిథిలాంచల్ అనేది భారత్–నేపాల్ మధ్య విస్తరించిన సాంస్కృతిక ప్రాంతం. సీతమ్మతల్లి జన్మస్థలంగా ఈ ప్రాంత స్థల పురాణాలు చెబుతున్నాయి. అలీనగర్ నియోజకవర్గం, దర్భంగా జిల్లాలో ఉంది. ఇది కూడా మిథిలాంచల్లో భాగమే. అందుకే మైథిలీ ఠాకూర్ను ‘మిథిలా కుమార్తె’గా అభివర్ణిస్తూ, ప్రాంతీయ గౌరవాన్ని, యువతలో ఆదరణను ఆకర్షించేందుకు బీజేపీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది.మైథిలీ ఠాకూర్ ఇంటర్ చదువుకున్న తర్వాత, చిన్న వయస్సులోనే ఫోక్ సింగర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. భోజ్పురి, మైథిలీ, హిందీ భక్తి పాటలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పాడిన పాటలకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ద్వారా యువతను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం జేడీయూ చేతిలో ఉండగా, ఈసారి పొత్తు కారణంగా బీజేపీకి దక్కింది. #WATCH | Ahead of #BiharElection2025, folk and devotional singer Maithili Thakur joins the BJP in Patna, Bihar. pic.twitter.com/qkY1ocUsIZ— ANI (@ANI) October 14, 2025క్లాసికల్, ఫోక్ సంగీతంలో శిక్షణ పొందిన ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం పొందారు. ఓవైపు ఫోక్ సింగర్గా రాణిస్తూనే రాజకీయాల్లో రాణించాలని కోరికగా ఉందంటూ పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా, ఆమె తన అభిరుచులకు అనుగుణంగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ,బిహార్ సీఎం నితీష్ కుమార్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. వారిలాగే తానుకూడా సమాజానికి సేవ చేయడానికి, బిహార్ అభివృద్ధికి తోడ్పడటానికి నేను ఇక్కడ ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు.కాగా,మైథిలీ ఠాగూర్ గతంలో ప్రధాన మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2024 జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాడిన ‘మా శబరి’పాటను ప్రధాని ప్రశంసించారు. अयोध्या में प्राण-प्रतिष्ठा का अवसर देशभर के मेरे परिवारजनों को प्रभु श्री राम के जीवन और आदर्शों से जुड़े एक-एक प्रसंग का स्मरण करा रहा है। ऐसा ही एक भावुक प्रसंग शबरी से जुड़ा है। सुनिए, मैथिली ठाकुर जी ने किस तरह से इसे अपने सुमधुर सुरों में पिरोया है। #ShriRamBhajan…— Narendra Modi (@narendramodi) January 20, 2024 -
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. సీఎం ఎదుట లొంగిపోనున్న ‘ఆశన్న’
ముంబై: మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. గురువారం (అక్టోబర్ 16) ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట సరెండర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మావోయిస్టు ఉద్యమానికి ఓ కుదుపేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మావోయిస్టు అగ్రనేత ఆశన్న (వాసుదేవ్ రావు) నేతృత్వంలోని 70 మంది మావోయిస్టులు జగదల్పూర్ చేరుకుని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని జాతీయ మీడియా కథనాలు ధృవీకరిస్తున్నాయి. తమ ఆయుధాలను సైతం అప్పగించే ఈ బృందంలో డీకేఎస్డ్సీ సభ్యులు రాజమన్, రనితలతో సహా ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన పలువురు. డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ పార్టీ కమిటీల సభ్యులు ఉన్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే బుధవారం ఉదయం మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత మేధావి, ఆలోచన పరుడిగా పేరుపొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మల్లోజులతో పాటు ఆయన నాయకత్వంలో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. -
Tamil Nadu: హిందీ హోర్డింగులు, సినిమాలపై నిషేధం!
చెన్నై: త్రిభాషా సూత్రంపై తమిళనాట కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు నడుంబిగించింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి.న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశంఇండియా టుడే వెల్లడించిన వివరాల ప్రకారం తమిళానాడు అంతటా హిందీ బోర్డులు, హోర్డింగ్లు, హిందీ సినిమాలు, హిందీ పాటల ప్రదర్శనను త్వరలో నిలిపివేయనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిని చూస్తుంటే త్రిభాషా సూత్రం అమలుపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య నెలకొన్న విభేదాలు మరింత తీవ్రం అయ్యేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే లక్ష్యంతో అసెంబ్లీలో ఒక బిల్లును త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం రూపకల్పనలోని న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు న్యాయ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.హిందీని రుద్దడానికి వ్యతిరేకంగా..ఈ బిల్లును భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకేతో సహా అనేక రాజకీయ పార్టీలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. దీనిని అడ్డుకోవడంలో భాగంగానే డీఎంకే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నదని సమాచారం. హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా శాసనసభ ఇటీవల ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.తమిళ భాషను కాపాడటమే లక్ష్యంగా..ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతూ, రాష్ట్రపతికి పార్లమెంటరీ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళం సహా ఇతర రాష్ట్రాల భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అప్పట్లో ప్రధాని నెహ్రూ ఇచ్చిన హామీ ప్రకారం హిందీయేతర రాష్ట్రాలు కోరుకునేంత వరకు ఆంగ్లం అధికారిక భాషగా కొనసాగుతుందని తెలిపారన్నారు. ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపాదిత బిల్లులోని వివరాల ప్రకారం బహిరంగ ప్రదర్శనలలో అంటే హోర్డింగులు, బోర్డులు, వినోద ప్రదర్శనలు, సినిమాలు పాటలు ఈ తరహా మాధ్యమాలలో హిందీ వాడకాన్ని నిషేధించనున్నారు. ఈ బిల్లు రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని, తమిళ భాష గుర్తింపును కాపాడటమే లక్ష్యంగా బిల్లును రూపొందించనట్లు అధికారులు తెలిపారు. -
Bihar Election: ఎన్నికల బరిలో ప్రముఖ గాయకుని భార్య?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ నేతలతో పాటు పలువురు గాయనీగాయకులు, నటులు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా భోజ్పురి గాయకుడు, నటుడు ఖేసరి లాల్ యాదవ్ ఈ ఎన్నికల్లో తన పాత్రపై ఏమిటనేది వెల్లడించారు. తాను ఆర్జేడీ తరపున ప్రచారం చేయనున్నానని, తన భార్యను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నానని తెలిపారు. #WATCH | Patna: On the Bihar Assembly elections, Bhojpuri singer and actor Khesari Lal Yadav says, "I want my wife to contest the election, I have been trying to convince her for the last 4 days. If she agrees, we will file the nomination; otherwise, I will only campaign and try… pic.twitter.com/EjzOgdduS3— ANI (@ANI) October 15, 2025భోజ్పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తన భార్య చేత పోటీ చేయించాలని అనుకుంటున్నానని, ఇందుకోసం ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఒకవేళ ఆమె ఇందుకు అంగీకరిస్తే, తమ నామినేషన్ దాఖలు చేస్తామని, లేనిపక్షంలో తాను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. ఇటు తేజస్వి యాదవ్, అటు అఖిలేష్ యాదవ్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పోటీ చేసే విషయంలో రెండు పార్టీల నుండి తనపై ఒత్తిడి ఉన్నదని ఖేసరి లాల్ యాదవ్ పేర్కొన్నారు. తన భార్య అంగీకరిస్తే, ఆమె చేత ఖచ్చితంగా పోటీ చేయిస్తానని తెలిపారు. -
ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!
ప్రమాదాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో చెప్పలేం. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలంటారు పెద్దోళ్లు. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం. బైకులు, కార్లలో పిల్లలను ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తుండడం ఇటీవల కాలంలో పెరిగింది. ఇదిలావుంచితే కారులో తండ్రి ఒడిలో కూర్చున్న బాలుడు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని ఆలత్తూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కారులో హఠాత్తుగా ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఆరేళ్ల పిల్లాడు చనిపోయాడు.వివరాల్లోకి వెళ్తే.. కల్పకం (Kalpakkam) సమీపంలోని పుదుపట్టిణం గ్రామానిక చెందిన వీరముత్తు, తన భార్య, కుమారుడు, మరో ఇద్దరితో కలిసి సోమవారం రాత్రి రెంటల్ కారులో చెన్నైకి బయలు దేరారు. విఘ్నేష్(26) అనే డ్రైవర్ కారు నడుపుతున్నాడు. వీరముత్తు తన ఆరేళ్ల కొడుకు కవిన్ను ఒళ్లో పెట్టుకుని ముందు సీట్లో కూర్చుకున్నాడు.తిరుపోరూర్ సమీపంలోని ఆలత్తూర్ (Alathur) పెట్రోల్ బంక్ వద్ద వీరికి కారుకు ప్రమాదం సంభవించింది. ముందెళున్న కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారులోని ఎయిర్బ్యాగ్ (airbag) కవిన్ ముఖంపై వేగంగా తెరుచుకోవడంతో అతడు కుప్పకూలిపోయాడు. బాలుడిని వెంటనే తిరుపోరూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పాడు. కుమారుడి ఆకస్మిక మరణంతో వీరముత్తు, అతడి భార్య హతాశులయ్యారు.ముందు వెళ్లిన కారు ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా సడన్గా కుడివైపు తిరగడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు గుర్తించారు. ఇందులో ఉన్న వ్యక్తిని తిరుపోరూర్ సమీపం పయ్యనూర్ గ్రామానికి చెందిన సురేష్ (48)గా గుర్తించారు. అతడు కారులో పయ్యనూర్ నుంచి తిరుపోరూర్ వెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపి బాలుడి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో సురేష్పై తిరుపోరూర్ (Thiruporur) పోలీసులు కేసు నమోదు చేశారు.నివేదిక వచ్చాకే..బాలుడి మృతదేహానికి చెంగల్పట్టు మెడికల్ కాలేజీలో పోస్ట్మార్టం నిర్వహించారు. కవిన్ మరణానికి గల వాస్తవ కారణాలు పోస్ట్మార్టం నివేదిక వచ్చాక వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. అతడి ఒంటిపై కనిపించే గాయాలేవీ లేవన్నారు. షాక్, అంతర్గత రక్తస్రావం కారణంగా మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్ -
విజయ్ మౌనం.. అయోమయంలో టీవీకే, అభిమానులు!
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి. ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే.. తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
Bihar Polls: 57 మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా
పట్నా: బీహార్లో నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్కు చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)బుధవారం 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది.రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే కీలక అభ్యర్థుల్లో సోన్బార్సా నుండి రత్నేష్ సదా, మోర్వా నుండి విద్యాసాగర్ నిషాద్, ఎక్మా నుండి ధుమల్ సింగ్, రాజ్గిర్ నుండి కౌశల్ కిషోర్ ఉన్నారు. ఈ జాబితాలో పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విజయ్ కుమార్ చౌదరి.. సరాయ్ రంజన్ నుంచి పోటీ చేయనున్నారు. Janata Dal United (JDU) releases the first list of candidates for the Bihar Assembly Elections. pic.twitter.com/Zb2G7PZvv0— ANI (@ANI) October 15, 2025ఆలంనగర్ నుంచి నరేంద్ర నారాయణ్ యాదవ్, బీహారీగంజ్ నుంచి నిరంజన్ కుమార్ మెహతా, సింగేశ్వర్ నుండి రమేష్ రిషి దేవ్, మాధేపురా నుండి కవితా సాహా, మహిసి నుండి గండేశ్వర్ షా, కుశేశ్వరస్థాన్ నుంచి అతిరెక్ కుమార్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇతర ప్రముఖ అభ్యర్థుల విషయానికొస్తే అనంత్ కుమార్ సింగ్ (మొకామా), శ్యామ్ రజక్ (ఫుల్వారీ), కౌశల్ కిషోర్ (రాజ్గిర్), ధుమల్ సింగ్ (ఎక్మా), మహేశ్వర్ హజారీ (కళ్యాణ్పూర్), రత్నేష్ సదా (సోన్బర్సా), సంతోష్ కుమార్ నిరాలా (రాజ్పూర్), మదన్ సాహ్ని (బహదూర్పూర్), శ్రీష్వా సింఘ్పూర్పూర్), (గైఘాట్) విద్యా సాగర్ సింగ్ నిషాద్.. మోర్వా నుంచి పోటీ చేస్తున్నారు. -
దీపావళి సెలవులు: ఏ రాష్ట్రాల్లో ఎన్ని రోజులు?.. తెలంగాణ, ఏపీల సంగతేంటి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలయ్యింది. దీపాల పండుగను దేశమంతటా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలలకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తుంటారు. దీపావళి వేళ ఏ రాష్ట్రంలో ఎన్నిరోజులు సెలవులు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.ఢిల్లీలో..దేశ రాజధాని ఢిల్లీలోని దీపావళి వేడుకలను అక్టోబర్ 20న జరుపుకుంటున్నారు. గోవర్ధన్ పూజకు అక్టోబర్ 22న జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కాగా దీపావళి సందర్భంగా నోయిడాలోని పాఠశాలలను అక్టోబర్ 20 నుండి 23 వరకు మూసివేయనున్నారు. గురుగ్రామ్లో అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 23 వరకూ సెలవులు ప్రకటించారు.ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని పాఠశాలలకు అక్టోబర్ 20 నుండి 23 వరకు దీపావళి సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 24న పాఠశాలలను తిరిగి తెరవనున్నారు. అక్టోబర్ 19 ఆదివారం కావడంతో యూపీలోని విద్యార్థులు ఐదు రోజుల సెలవులు ఎంజాయ్ చేయనున్నారు. ఈ సారి చిన్నారులకు దీపాల పండుగను జరుపుకునేందుకు తగినంత సమయం దొరికింది.హర్యానా హర్యానాలోని పాఠశాలలకు అక్టోబర్ 19 నుండి 23 వరకు దీపావళి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.రాజస్థాన్రాజస్థాన్లోని పాఠశాలలకు దీపావళి సందర్భంగా అక్టోబర్ 13 నుండి 24 వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మొత్తం 12 రోజుల పాటు దీపావళి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.బీహార్ దీపావళి,ఛట్ పూజల సందర్భంగా బీహార్లోని పాఠశాలలు అక్టోబర్ 18 నుండి 29 వరకు మూసివేయనున్నారు. ఈ సెలవులను ఇంకా పొడిగించనున్నారని తెలుస్తోంది.పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని పాఠశాలలను అక్టోబర్ 24 వరకు మూసివేయనున్నారు. స్థానిక విద్యార్థులు ఇటీవలే దుర్గా పూజ సెలవులను ఎంజాయ్ చేశారు.కర్ణాటకరాష్ట్ర సామాజిక, విద్యా సర్వేలో ఉపాధ్యాయులు పాల్గొనేందుకు వీలుగా కర్ణాటకలోని పాఠశాలలు అక్టోబర్ 18 వరకు మూసివేశారు ఇప్పుడు అదనంగా అక్టోబర్ 20 (నరక చతుర్దశి), అక్టోబర్ 22 (బలిపాడ్యమి/ దీపావళి) తేదీలలో పాఠశాలలు మూసివేయనున్నారు.జమ్ముకశ్మీర్ జమ్ముకశ్మీర్లోని అధికారులు వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. జమ్ము డివిజన్లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి పాఠశాల కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా పాఠశాలకు సెలవులు ప్రకటించనున్నారు.ఒడిశాదీపావళి, కాళి పూజ వేడుకల కోసం ఒడిశాలోని పాఠశాలలను అక్టోబర్ 20న మూసివేయనున్నారు.అసోందీపావళి, కాళి పూజ వేడుకల కోసం అక్టోబర్ 20న అసోంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.తెలుగు రాష్ట్రాలలో..రాబోయే దీపావళికి.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో ఒకేరోజు(అక్టోబర్ 20 సోమవారం) అధికారిక సెలవు ప్రకటించారు. అయితే దానికి ముందు రోజు ఆదివారం రావడంతో రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. -
హైవేపై ట్రాఫిక్ జామ్.. 500 మంది విద్యార్థులకు 12 గంటల నరకం..
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై దాదాపు 12 గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, దాదాపు 500 మంది విద్యార్థులు హైవేపై ట్రాఫిక్లో చిక్కుకుని అల్లాడిపోయారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుమజాము వరకు ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే, థానేలోని ఘోడ్బందర్ హైవేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే సమయంలో పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు తమ ఇళ్లకు బయలుదేరారు. దీంతో, 5-10 తరగతులు విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. థానే, ముంబై వైపు నుంచి వస్తున్న వాహనాల రద్దీ కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యార్థులంతా ట్రాఫిక్లోనే చిక్కుకుపోయారు.I challenge the gov. of Maharashtra Ministers to make a travel from Bhiwandi to Wada. The Mumbai Ahmedabad highway for all the reasons is always with hours of traffic snarls. Should even Industries function in Maharashtra any more? @AjitPawarSpeaks @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/xSyeAoarJi— Vedang Dongre (@VedangDongre) October 14, 2025మంగళవారం సాయంత్రం నుంచి దాదాపు 12 గంటల పాటు ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో విద్యార్థులంతా ట్రాఫిక్లోనే ఉన్నారు. దీంతో, స్థానికులు వారికి ఆహారం అందించారు. చాలా మందికి ఆహారం, నీరు అందకపోవడంతో ఆవేదన చెందారు. విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా రోడ్డుమీదే ఉన్నారు. ఈ కారణంగా వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ట్రాఫిక్లో చిక్కుకున్న విద్యార్థుల చివరి బస్సు బుధవారం ఉదయం బయటకు వచ్చినట్టు పిల్లల పేరెంట్ ఒకరు చెప్పుకొచ్చారు.वसई, मुंबई: मुंबई-अहमदाबाद महामार्ग पर, घोड़बंदर से लेकर वसई फाटा तक, आज भारी ट्रैफिक जाम की स्थिति देखी गई। मार्ग पर वाहनों की लंबी कतारें लगी हुई हैं, जिससे यात्रियों को भारी असुविधा का सामना करना पड़ रहा है। pic.twitter.com/a0mRI6VxFr— मुकेश त्रिपाठी- Mukesh Tripathi/✍️ (@mukesht37) October 13, 2025వాహనాల రద్దీ కారణంగా పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, థానేలోని ఘోడ్బందర్ హైవేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. భారీ వాహనాలను మళ్లించడం వల్ల ఈ జామ్ ఏర్పడిందని.. దీని ఫలితంగా ముంబై-అహ్మదాబాద్ మార్గంలో అధిక ట్రాఫిక్ భారం ఏర్పడిందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. NH46, NH30, NH19, NH49...Every day you wake up, a new NH is in the news for construction quality issues, and that too usually within months of being built. Shri @nitin_gadkari, please give petrol a break from ethanol and sort out your dept first. pic.twitter.com/hvZMGHM4sy— THE SKIN DOCTOR (@theskindoctor13) October 14, 2025 -
Goa: గుండెపోటుతో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
పణజీ: గోవా వ్యవసాయ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్(79) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పీటీఐ తెలిపిన వివరాల పణజీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని స్వస్థలం ఖడ్పబంద్లో మంత్రి రవి నాయక్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను పోండాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.అనంతరం కుటుంబ సభ్యులు నాయక్ మృతదేహాన్ని పోండాలోని ఖడ్పబంద్లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. మంత్రి రవి నాయక్కు నివాళులు అర్పించేందుకు పలువురు నేతలు, అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మంత్రి రవి నాయక్కు భార్య, ఇద్దరు కుమారులు, కోడలు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. Saddened by the passing away of Shri Ravi Naik Ji, Minister in the Goa Government. He will be remembered as an experienced administrator and dedicated public servant who enriched Goa’s development trajectory. He was particularly passionate about empowering the downtrodden and…— Narendra Modi (@narendramodi) October 15, 2025ప్రధాని మోదీ సంతాపం‘గోవా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రవి నాయక్ మరణం బాధాకరం. గోవా అభివృద్ధి పథాన్ని సుసంపన్నం చేసిన అనుభవజ్ఞుడైన నేతగా, అంకితభావంతో కూడిన ప్రజా సేవకునిగా ఆయనను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంపై ఆయన ఆసక్తి చూపారు. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.Saddened by the passing away of Shri Ravi Naik Ji, Minister in the Goa Government. He will be remembered as an experienced administrator and dedicated public servant who enriched Goa’s development trajectory. He was particularly passionate about empowering the downtrodden and…— Narendra Modi (@narendramodi) October 15, 2025గోవా ముఖ్యమంత్రి సంతాపంగోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. మంత్రి రవి నాయక్ మృతికి విచారం వ్యక్తం చేశారు. అతని నాయకత్వం, ప్రజా సేవ పట్ల అంకితభావం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయన్నారు. ‘మన సీనియర్ నేత, క్యాబినెట్ మంత్రి రవి నాయక్ మరణం విచారకరం. గోవా రాజకీయాల్లో ప్రముఖునిగా, ముఖ్యమంత్రిగా దశాబ్దాలుగా ఆయన అంకితభావంతో పనిచేశారు. కీలక శాఖల్లో మంత్రిగా పనిచేసిన ఆయన ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన నాయకత్వం, వినయం ప్రజా సంక్షేమానికి చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం’ అని సావంత్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
బీహార్ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
న్యూడిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు(సైలెన్స్ పీరియడ్) ఎలాంటి బల్స్ ఎస్ఎంఎస్లు, ఆడియో మెసేజ్లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్వర్క్లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. పోలింగ్నాడు ఆయా ప్రాంతంలో ఆడియో, విజువల్డిస్ప్లేలు నిషేధించినట్లు పేర్కొంది. సోషల్మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పొందుబరచాలని ఆదేశించింది. ముందస్తు అనుమతులు తప్పనిసరి: రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందుస్తు అనుమతులు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎల్రక్టానిక్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఏదైనా రాజకీయ ప్రకటనలు ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధృవీకరణ పొందడం తప్పనిసరి అని తెలిపింది. ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలుమీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీలను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు(అక్టోబర్ 10వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది). అక్టోబర్ 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్లో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అంత కంటే 48 గంటల ముందు ప్రచారం ముగుస్తుంది. ఇందులో పాట్నా, ముజఫర్పూర్, గోపాల్గంజ్, దర్భంగా, బక్సర్, బీహార్ షరీఫ్ లాంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 123 స్థానాల రెండో ఫేజ్ పోలింగ్కు అక్టోబర్ 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 23 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 9వ తేదీన ప్రచారానికి చివరి తేదీ. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది. -
నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?
భారతదేశంలో నక్సల్స్/ మావోయిస్టులు లొంగిపోవడం అనేది నిరంతర ప్రక్రియ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాలు, ఇతర కొన్ని కారణాల వల్ల చాలా మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. అయితే ముఖ్య నేతలపై ఉండే భారీ నజరానా (రివార్డు)ను లొంగిపోయిన తర్వాత వారికి అందిస్తారు. ఈ నేపథ్యంలో లొంగిపోయిన నక్సల్స్కు ఇచ్చే నజరానాపై ఆదాయపు పన్ను (Income Tax) ఉంటుందా? అనే అనుమానం సహజంగా ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. తొలితరం మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను గడ్చిరోలి(మహారాష్ట్ర) పోలీసులకు లొంగిపోయారు. ఆయనపై రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. తనతోపాటు మరో 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు.నక్సల్స్ లొంగుబాటు, నజరానానక్సల్స్కు ప్రభుత్వాలు ప్రకటించే లొంగుబాటు విధానంలో భాగంగా సాయుధ దళాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే వారికి పునరావాసం కల్పిస్తారు. ఈ విధానంలో లొంగిపోయిన నక్సల్స్కు, ముఖ్యంగా కీలక స్థానాల్లో ఉండి లొంగిపోయేవారికి వారి స్థాయి, హింసాత్మక చర్యల తీవ్రత ఆధారంగా ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతి (నజరానా/రివార్డు) ఇస్తుంది. లొంగిపోయిన తర్వాత సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు, ఇల్లు కట్టుకోవడానికి, వృత్తిపరమైన శిక్షణ పొందడానికి వారికి ఇది ఆర్థిక సాయంగా ఉంటుంది.ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది?భారతదేశ ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ప్రభుత్వాల నుంచి పొందే కొన్ని రకాల అవార్డులు లేదా నజరానాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.సెక్షన్ 10(17A): ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(17A) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా సంస్థ ద్వారా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన అవార్డు లేదా నజరానా కింద నగదు రూపంలో, ఇతర రూపంలో పొందిన ఏదైనా చెల్లింపులపై పన్ను మినహాయింపు ఉంటుంది.ప్రభుత్వ లక్ష్యం: నక్సల్స్ లొంగుబాటు అనేది ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన ఒక కార్యక్రమం. నక్సలిజాన్ని అంతం చేయడానికి, శాంతిని పునరుద్ధరించడానికి, హింసను విడిచిపెట్టినవారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఈ రివార్డులు, పునరావాస విధానాలు రూపొందించారు. ఈ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే నక్సల్స్ లొంగుబాటుపై ఇచ్చే నజరానా ప్రజా ప్రయోజనం కిందకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పునరావాస విధాన మార్గదర్శకాలు, కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారిక నోటిఫికేషన్లను పరిశీలించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: ధన త్రయోదశికి ముందే అంతులేని ధరలు -
ఆయుధం వీడిన మల్లోజుల.. ఆరు కోట్ల రివార్డు అందించిన సీఎం
ముంబై: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మహారాష్ట్ర పోలీసుల ఎదుట మల్లోజుల మంగళవారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్(Devendra Fadnavis) సమక్షంలో మల్లోజుల సహా మావోయిస్టులు తమ ఆయుధాలు సరెండర్ చేశారు.బుధవారం ఉదయం మల్లోజులతో పాటు మరో 61 మంది మావోయిస్టులు(maoists) ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను పోలీసులకు అందించారు. ఇక, మల్లోజులపై దాదారు ఆరు కోట్ల రివార్డు ఉండటంతో(ఆరు రాష్ట్రాల్లో కోటి చొప్పున) ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. రివార్డును ఆయనకు అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మోస్ట్వాంటెడ్గా మల్లోజులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ..‘మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలో మావోయిజానికి చోటులేదు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మిస్తాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Gadchiroli, Maharashtra: Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati, surrenders in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 Naxalites surrendered today.Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati gave a… pic.twitter.com/stBiJWEJvd— ANI (@ANI) October 15, 2025అయితే, మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.#WATCH | Gadchiroli, Maharashtra: Naxalites surrender in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 surrendered today, including Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati surrendered today. pic.twitter.com/DoZucnsWGH— ANI (@ANI) October 15, 2025 -
Delhi: గ్రీన్ క్రాకర్స్కు సుప్రీంకోర్టు అనుమతి
న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రజలకు దీపావళికి ముందుగానే పండుగలాంటి వార్త వెలువడింది. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కు అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఐదేళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ 18 నుంచి, 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ వెలిగించేందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే రాత్రి 8 నుంచి 10 గంటల వరకే బాణసంచా కాల్చేందుకు అనుమతిచ్చింది. ఇదేవిధంగా సర్టిఫైడ్ క్రాకర్స్ దుకాణాలవారు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ విక్రయించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయి ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.ఢిల్లీ–ఎన్సీఆర్లో గ్రీన్ పటాకుల విక్రయానికి సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే ఈ-కామర్స్ ద్వారా పటాకుల విక్రయంపై నిషేధం విధించింది. అలాగే క్యూఆర్ కోడ్ ఉన్న గ్రీన్ పటాకుల విక్రయానికే అనుమతులిచ్చింది. పటాకులు విక్రయాలతో పాటు వాటిని వెలిగించే సమయంలో పోలీస్ అధికారులు ప్రత్యేక పహారా బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. సాంప్రదాయ పటాకులు అక్రమంగా విక్రయిస్తున్నారని, వీటివలన కాలుష్యం పెరిగిపోతున్నదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘అర్జున్ గోపాల్’ కేసు తీర్పు దరిమిలా అందుబాటులోకి వచ్చిన గ్రీన్ పటాకుల కారణంగా ఉద్గారాలు తగ్గినట్లు కోర్టు అభిప్రాయపడింది. నీరీ సంస్థ గ్రీన్ పటాకుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని సుప్రీంకోర్టు ప్రశంసించింది. పర్యావరణ పరిరక్షణ–సాంప్రదాయ ఉత్సవాల మధ్య సమతౌల్యం సాధించడమే లక్ష్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.గ్రీన్ క్రాకర్స్ అంటే..కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్గా పిలుస్తున్నారు.మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతినిచ్చింది.గ్రీన్ క్రాకర్స్ను గుర్తించడం ఎలా ?.. ఎన్ఈఈఆర్ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి. స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయిస్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయిసఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్లో మెగ్నీషియమ్కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ. కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
Maharashtra Gurukul: ‘అభ్యంతరకరంగా తాకాడు’: బాధిత విద్యార్థిని
రత్నగిరి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే తప్పుదారి పట్టిన ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరిలో గల వార్కారి గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహారాజ్ ఒక మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పోలీసులు అతనితో పాటు అతనికి సహకరించిన ఒక ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు.గురుకుల క్యాంపస్లో మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్తో పాటు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్ అనే ఉపాధ్యాయుని పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చెందిన బాలురు, బాలికలు ఆధ్యాత్మిక విద్యను చదువుకునేందుకు ఈ గురుకులంలో చేరారు. బాధితురాలు జూన్ 12న ఈ గురుకులంలో అడ్మిషన్ తీసుకుంది. అనంతరం మొదటి ఎనిమిది రోజులు బాగానే గడిచాయని, ఆ తరువాత తాను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అతను లోపలికి వచ్చి, తనను కొట్టేవాడని, తాకరాని చోట తాకేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని బెదిరించాడని కూడా బాధితురాలు పేర్కొంది. ఆ సమయంలో ప్రీతేష్ ప్రభాకర్ తనను మాట్లాడవద్దని హెచ్చరించాడని, కోకరే తన పలుకుబడితో తన తండ్రిని, సోదరుడిని చంపేస్తాడని బెదిరించాడని బాధితురాలు వివరించింది. కాగా బాధితురాలు సోమవారం తన తండ్రికి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది.దీంతో అతను ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టంలోని సెక్షన్ 12, 17 కింద గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్తో పాటు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్లపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి, రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు. కాగా మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ ఈ ఘటనపై స్పందిస్తూ, గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్ లైంగిక వేధింపులకు పలువురు బాలికలు గురై ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కోకరేతో సంబంధాలు కలిగిన రాజకీయ నేతల బండారం త్వరలోనే బయటపడనున్నదని భాస్కర్ జాదవ్ అన్నారు. -
ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(prashant kishor) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారాయన. తాజాగా ఆ పార్టీ తరఫున అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. అందులోనూ ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బరిలో నిల్చోవడం లేదంటూ స్పష్టత ఇచ్చారాయన. పోటీకి బదులు తనను సంస్థాగత పనులపై దృష్టిసారించాలని పార్టీ నిర్ణయించింది అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఒకవేళ తాను ఎన్నికల్లో గనుక పోటీ చేస్తే తన స్వస్థలం కర్గాహర్ లేదంటే రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పారు. రాఘోపూర్ ఆర్జేడీ కంచుకోట. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి నెగ్గిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్.. హ్యాట్రిక్పై కన్నేశారు. అయితే.. జన్ సురాజ్ తరఫున ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారని ప్రచారం నడిచింది. కానీ, జన్ సురాజ్ రెండో జాబితాలో రాఘోపూర్ నుంచి చంచల్ సింగ్ పేరును ప్రకటించారు. దీంతో ఆ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. అయితే పోటీ చేయకున్నా పార్టీని బలోపేతం చేయడానికి.. ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి తాను కృషి చేస్తానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారాయన. జేడీయూకి ఎలాంటి ఓటమి దక్కబోతోందో చెప్పడానికి సెఫాలజిస్ట్( ఎన్నికల విశ్లేషకుడు) అయి ఉండాల్సిన అవసరమేమీ లేదని అన్నారాయన. అలాగే జన్ సురాజ్పార్టీ లక్ష్యం భారీదని, 150 స్థానాలకు ఒక్క సీటు తగ్గినా తమ పార్టీ ఓడిపోయినట్లేనని పీకే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
‘పూరన్ భార్యను అరెస్ట్ చేస్తేనే పోస్ట్మార్టం, అంత్యక్రియలు జరగనిస్తాం’
హర్యానాలో పోలీసుల బలవర్మనణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. సంచలన ఆరోపణలు చేస్తూ.. తెలుగు ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ తొలుత ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఏఎస్సై సందీప్ కుమార్ కూడా సూసైడ్ చేసుకోవడం, అందులో పూరన్ కుమార్పై సంచలన ఆరోపణలు చేయడం.. మొత్తంగా ఊహించని మలుపులతో సాగుతోంది ఈ వ్యవహారం. పూరన్ కుమార్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించేందుకు ఎట్టకేలకు ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ ఎట్టకేలకు అంగీకరించారు. దీంతో ఇవాళ సాయంత్రమే ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోపు అటు రోహ్తక్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఎస్సై సందీప్ కుమార్కు పోస్ట్మార్టం జరగనీయకుండా ఆయన కుటుంబం అడ్డుపడింది. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించకుండా తమ వెంట స్వగ్రామానికి తీసుకెళ్లింది. తమ బిడ్డ మరణానికి ఐఏఎస్ అధికారిణి అమ్నిత్ పూరన్ కుమార్(పూరన్ భార్య)కు సంబంధం ఉందని, ఆమెను అరెస్ట్ చేయాల్సిందేనని ఏఎస్సై సందీప్కుమార్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. 2001 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఏపీ వాసి పూరన్ కుమార్.. ఛండీగఢ్లోని తన నివాసంలో అక్టోబర్ 7వ తేదీన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుననారు. తనపై సీనియర్ అధికారులు కుల వివక్ష ప్రదర్శించారని, అవమానాలతో మానసికంగా వేధించారని 9 పేజీల సూసైడ్ నోట్లో 10 మంది సీనియర్ పోలీస్ అధికారుల పేర్లను పూరన్కుమార్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. సీనియర్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆయన సతీమణి అమ్నీత్ పూరన్ కుమార్ తన భర్తకు 13 మంది ఐపీఎస్ అధికారులు కారణమంటూ SC/ST చట్టం కింద కేసు నమోదు చేయించారు. అయితే పోలీసు పెద్దల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడంతో ఆమె పోస్ట్మార్టం, అంత్యక్రియలు జరపబోమని ఇప్పటిదాకా అడ్డుపడుతూ వచ్చారు. అయితే ఈలోపు.. అక్టోబర్ 14వ తేదీన రోహ్తక్ సైబర్ సెల్లో పని చేసే ఏఎస్సై సందీప్ కుమార్ పానిపట్ రోడ్డులోని ఓ వ్యవసాయ బావి వద్ద మృతదేహాంగా లభ్యమయ్యారు. మూడు పేజీల సూసైడ్ నోట్, ఆరు నిమిషాల వీడియో మెసేజ్లో సందీప్ చనిపోయిన ఐపీఎస్ పూరన్ కుమార్పై సంచలన ఆరోపణలు చేశారు. పూరన్ అవినీతిపరుడని.. తనకు అనుకూలమైన వారిని విధుల్లో చేర్చుకుని వేల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టారని.. వాటిపై దర్యాప్తు చేయించాలని సందీప్ డిమాండ్ చేశాడు. అంతేకాదు.. లిక్కర్షాపుల నుంచి బలవంతపు వసూళ్లు చేసేవారని.. మహిళా పోలీసుల్ని పూరన్ వేధించారని ఆరోపించాడు.తననూ ఈ కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని, అరెస్ట్ భయంతోనే తాను ఈ ఘాతుకానికి పాల్పడుతున్నానని.. న్యాయం గెలవాలని, నిజం ఎలాగైనా బయటపడాలని చెబుతూ ఆత్మహత్య చేసుకున్నారాయన. ఇదిలా ఉండగా.. పూరన్ కుమార్ దగ్గర గన్మెన్గా పని చేసిన హెడ్కానిస్టేబుల్ను ఏఎస్సై సందీప్ కుమార్ అవినీతి కేసులో(లంచం) అరెస్ట్ చేశాడు. అప్పటి నుంచి సందీప్కు వేధింపులు ఎదురయ్యాయని, అది భరించలేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. ఈ వేధింపుల్లో అమ్నీత్ హస్తం కూడా ఉందని, అందుకే ఆమెను అరెస్ట్ చేయాలని, పూరన్ ఆస్తులపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించాలని.. అప్పటిదాకా అంత్యక్రియలు జరపబోమని సందీప్ కుటుంబం ఖరాకండిగా చెబుతోంది. సందీప్ది సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి ఎస్సై. గత ఐదారేళ్లుగా రోహ్తక్లోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అవినీతి, కుల రాజకీయాలు సందీప్ను బలిగొన్నాయని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఐపీఎస్ పూరన్ కుమార్ సూసైడ్ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతోంది. ఈలోపు ఏఎస్సై సందీప్ సూసైడ్.. సంచలన ఆరోపణలతో ఈ కేసు క్లిష్టతరంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
పాతాళంలో దాక్కున్నా వదలం.. అమిత్ షా హెచ్చరిక
మనేసర్ (హరియాణా): ఆపరేషన్ సిందూర్(operation Sindoor) ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాద ప్రధాన కేంద్రాలు, స్థావరాలు, లాంచ్పాడ్లను ధ్వంసం చేసి.. ఇక వారికి ఎక్కడా సురక్షిత ప్రాంతం అనేది లేకుండా చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా మన సైనిక బలగాలు వేటాడుతా యని స్పష్టంచేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్’ (ఎన్ఎస్జీ) 41వ వ్యవస్థాపక దినోత్స వంలో మంగళవారం ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా అమిత్ షా.. ‘పాకిస్తాన్లోని(Pakistan) ఉగ్రవాద ప్రధాన కేంద్రాలు, శిక్షణ స్థావరాలు, లాంచ్పాడ్లను ధ్వంసం చేయగలమని ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. పహెల్గాం దాడికి కారణమైన ఉగ్రవా దులను మన భద్రతా దళాలు ఆపరేషన్ మహ దేవ్ ద్వారా అంతమొందించాయి. ఈ రెండు ఆపరేషన్లు మన భద్రతాబలగాలపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాయి. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఉగ్రవాదుల పట్ల ఏమాత్రం కనికరం లేని విధానాన్ని అమలు చేస్తున్నాం. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని తొలగించినప్పటి నుంచి సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్ వరకు గమనిస్తే.. మన భద్రతా బల గాలు ఉగ్రవాదులు ఏ మూలలో దాక్కున్నా అంతమొందించగలవని అర్థమవుతుంది.ఉగ్ర వాదుల నుంచి దేశాన్ని రక్షించేందుకు 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఎన్ఐఏ చట్టం, మనీలాండరింగ్ నిరో ధక చట్టం వంటివి అందులో భాగమే. కొత్త క్రిమినల్ లాలో ఉగ్రవాదాన్ని మొదటిసారి నిర్వచించి, గతంలో ఉన్న లొసుగులను తొల గించాం. ఇప్పటివరకు 57 మంది వ్యక్తులు, సంస్థలను చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించాం’అని అమిత్ షా వివరించారు. ఉగ్రవాదులు ఏరివేతలోనే కాకుండా మతపరమైన స్థలాలు, దేశ అంతర్గత జలమార్గాలు, పార్లమెంటు తదితర 770 ప్రాంతాల్లో ఎన్ఎస్జీ నిఘా కొనసాగిస్తోందని ప్రశంసించారు. ఆయా ప్రాంతాల 3డీ మోడళ్లను కూడా రూపొందిస్తున్నామని ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ బ్రిఘు శ్రీనివాసన్ తెలిపారు. -
బీహార్ కూటమిలో తేలని సీట్ల లెక్క.. లాలూను అడ్డుకున్న తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత కొనసాగుతోంది. అధికార ఎన్డీయేలోని ప్రధాన పక్షం బీజేపీ ఇప్పటికే 71 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించగా ఇండియా కూటమి ఇంకా పోటీచేసే స్థానాలపైనే సిగపట్లు పడుతోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో బుధ, గురువారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని మిత్రపక్షాలు తేల్చి చెబుతున్నాయి.రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లకు గానూ కాంగ్రెస్ గతేడాది పోటీ చేసిన సంఖ్యతో సమానంగా సీట్లను కోరుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీచేసి 19 చోట్ల నెగ్గింది. ఈసారి సైతం తమకే అంతే స్థానాలను కోరుతుండగా, ఆర్జేడీ మాత్రం 54–55 సీట్లకు మాత్రమే ఆఫర్ ఇస్తోంది. ఇదే అంశమై సోమవారం ఏఐసీసీ పెద్దలతో జరిగిన చర్చల సందర్భంగా మరో 3 స్థానాలు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, తమకు కనీసంగా 65 స్థానాలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు సమాచారం. దీనిపై బుధ, గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.తేజస్వీ జోక్యంతో టికెట్లు ఇవ్వడం ఆపేసిన లాలుఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సోమవారం రాత్రి పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇది సరైన విధానం కాదంటూ కుమారుడు తేజస్వీ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటికే టికెట్లు అందుకున్న నేతలు తిరిగి ఇవ్వాలని తేజస్వి కోరారు. ఇందుకు స్పందించింది కొందరే. గత వారమే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సునీల్ సింగ్ మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ల వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్ నేతల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా నడుస్తున్నాయి. -
గ్యాంగ్ రేప్ కేసు.. స్నేహితుడి పనే?! అరెస్ట్
తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్రేప్ ఉదంతం కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్రేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్ షేక్, షేక్ రియాజుద్దీన్లను అరెస్ట్చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. దుర్గాపూర్/కోల్కతా: పశ్చిమబెంగాల్లో తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్రేప్ ఉదంతం(Durgapur Gang Rape Case) కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్రేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్ షేక్, షేక్ రియాజుద్దీన్లను అరెస్ట్చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్చేశారు. ఘటన జరిగిన తీరుపై బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలానికి, స్నేహితుడు ఇచ్చిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని మంగళవారం సాయంత్రం బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని(No Gang Rape), క్లాస్మేట్ అయిన ఈ స్నేహితుడు మాత్రమే రేప్ చేశాడని ప్రాథమిక అంచనాకు వచ్చామని పోలీసులు చెప్పారు. నిందితులందరి దుస్తులు, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించామని నివేదిక వచ్చాకే కేసులో స్పష్టత వస్తుందని అసన్సోల్–దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌద్రీ చెప్పారు. చౌద్రీ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఘటన జరిగిన రోజు గంటన్నర ఆలస్యంగా తమ కూతురి స్నేహితుడు తమకు సమాచారం ఇచ్చాడని, అతనిపైనా తమకు అనుమానం ఉందని బాధితు రాలి తండ్రి అక్టోబర్ 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చివరకు ఆ స్నేహితుడు సైతం అరెస్ట్కావడం గమనార్హం. దుర్గాపూర్ పట్ణణ శివారులోని ప్రైవేట్ ఎంబీబీఎస్ కళాశాల హాస్టల్ నుంచి దూరంగా ఉన్న ధాబాలో భోజనం చేసేందుకు ఈ స్నేహితుడే బాధితురాలిని బయటకు తీసుకెళ్లగా గ్యాంగ్రేప్ జరిగిందని కేసు నమోద వడం తెల్సిందే. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అభిషేక్ గుప్తా సారథ్యంలోని బృందం సీన్ రీక్రియేషన్ కోసం ఐదుగురు నిందితులను మంగళవారం మధ్యాహ్నం ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రశ్నించింది. ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రించారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితులు విడివిడిగా చెప్పిన సమాధానాలకు పొంతన కుదరలేదు. దీనికితోడు బాధితురాలు ముగ్గురిలో కేవలం ఒక్కరే రేప్ చేశారని తొలుత వాంగ్మూలం ఇవ్వడం, తర్వాత ఐదుగురు రేప్ చేశారని మరోలా వాంగ్మూలం ఇవ్వడం, స్నేహితుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో ఆ స్నేహితుడిని అరెస్ట్చేశామని కమిషనర్ చెప్పారు. ‘‘బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాలు, లభించిన ఆధారాలు, నిందితుల స్టేట్మెంట్లను గమనిస్తే ఇది గ్యాంగ్రేప్ కాదని అర్థమవుతోంది. ఒక్కరు మాత్రమే అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది’’ అని కమిషనర్ వ్యాఖ్యానించారు.వాంగ్మూలాలకు, సీసీటీవీ ఫుటేజీకి కుదరని లంకెనిందితులు, బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలా లకు, సీసీటీవీలో ఉన్న దృశ్యాలకు సైతం పొంతన కుదరకపోవడం ఈ కేసులో సంక్లిష్టతను మరింత పెంచుతోంది. ఐదుగురు నిందితులు తనను లాక్కెళ్లినప్పుడు స్నేహితుడు పారిపో యాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. కానీ బాధితురాలు, స్నేహితుడు అసలేం జరగనట్లు, ముఖాల్లో ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా హాస్టల్కు తిరిగొచ్చినట్లు ఘటన తర్వాత హాస్టల్ గేటు దగ్గరి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. రేప్ వేళ పెనుగులాటలో బాధితురాలి దుస్తులు చిరిగిపోవడమో, జుట్టు చిందరవందరగా ఉండటమో లాంటివి లేకుండా బాధితురాలు ఆ వీడియోలో మా మూలుగానే కనిపించింది. తనకు హాని జరిగిందని బాధితురాలు హాస్టల్ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదుచేసినట్లు ఫుటేజీలో కనిపించలేదు. వాళ్ల సాయం కోరిన ట్లుగా కూడా లేదు. ‘‘ఘటన తర్వాత బాధితు రాలి ఫోన్ నుంచి స్నేహితునికి ఆగంతకులు ఫోన్ చేసి రమ్మన్నారు. ఫోన్ తిరిగి ఇవ్వాలంటే రూ.3,000 ఇవ్వాలని బాధితురాలిని డిమాండ్చేశారు. ఆమె వద్ద ఉన్న రూ. 200 లాగేసుకున్నారు’’ అని కమిషనర్ వెల్లడించారు. ఇదీ చదవండి: బస్సులో.. క్షణాల్లోనే కాలి బుగ్గైన 20 మంది -
బాణసంచా ఘటనపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికులు చనిపోయేంతగా పెద్ద ఘటన జరగడానికి కారణాలను ప్రశ్నించింది. రెండు వారాల్లో వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ‘కోనసీమ జిల్లాలోని కొమరిపాలెం గ్రామంలో బాణసంచా తయారీ యూనిట్లో ఈ నెల 8న జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. వాటి ఆధారంగా కేసును సుమోటోగా స్వీకరిస్తున్నాం. ఈ ఘటనలో తయారీ యూనిట్ యజమాని కూడా మరణించినట్లు మా దృష్టికి వచ్చింది. మీడియా నివేదికలోని విషయాలు నిజమైతే, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. అందువల్ల ఈవిషయంపై రెండు వారాల్లో వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేశాం. బాధితుల సమీప బంధువులకు పరిహారం అందించారా లేదా కూడా నివేదికలో తెలుపుతారని ఆశిస్తున్నాం. పేలుడు జరిగిన సమయంలో 12 మంది కార్మికులు యూనిట్ లోపల ఉన్నారు. పేలుడు పదార్థాల మిశ్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు’ అని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. -
జననాలు 2.52 కోట్లు..మరణాలు 86.6 లక్షలు
దేశవ్యాప్తంగా 2023లో 2.52 కోట్ల జననాలు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 2.32 లక్షలు తక్కువ. 2023లో 86.6 లక్షల మరణాలు నమోదయ్యాయి. మొత్తం జననాల్లో దాదాపు 75 శాతం ఆసుపత్రుల్లోనే జరగడం గమనార్హం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, జన గణన కమిషనర్ కార్యాలయం 2023 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను ‘వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా’ పేరిట విడుదల చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కోవిడ్–19 డ్యాష్బోర్డ్లో 2025 మే 5 నాటికి మహమ్మారి వల్ల సంభవించిన మరణాల సంఖ్య 5,33,665గా ఉంది. 2022, 2023లో మరణాలలో పెద్దగా పెరుగుదల లేదని నివేదిక వెల్లడించింది. 2020తో పోలిస్తే 2021లో 21 లక్షలకు పైగా అధిక మరణాలు సంభవించాయి. 2020లో 81.2 లక్షలు, 2021లో 1.02 కోట్ల మంది కన్నుమూశారు. కొన్ని రాష్ట్రాలే..: నిర్ణీత కాలపరిమితి అయిన 21 రోజుల్లోపు 90% కంటే ఎక్కువ జననాల నమోదును 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే సాధించాయి. వీటిలో గుజరాత్, తమిళనాడు, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, గోవా, పంజాబ్ వంటివి ఉన్నాయి. ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 80–90% జననాల నమోదు చేశాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, బిహార్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో 50–80% జననాలు మాత్రమే నిర్ణీత కాలపరిమితి లోపు నమోదయ్యాయి.మగపిల్లలే ఎక్కువ2023 నమోదిత జనన గణాంకాలుజననాల్లో మగపిల్లలు 52.4%, ఆడపిల్లలు 47.6%పట్టణాల్లో 58.3%, గ్రామీణ ప్రాంతాల్లో 41.7% మంది పుట్టారు. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జననాల నమోదు ప్రక్రియను 100% పూర్తి చేశాయి.మరణాల్లో పురుషులే అధికంమరణాల్లో 60.6% పురుషులు, 39.4% స్త్రీలు ఉన్నారు.మరణాల్లో గ్రామీణులు 57.7%, పట్టణవాసులు 42.3% ఉన్నారు.ఆసుపత్రుల్లో మృతి చెందినవారు (సిక్కిం మినహా) 24%శిశువుల మరణాల్లో పట్టణాల వాటా 85.7%, గ్రామీణ ప్రాంతాల వాటా 14.3%. విదేశాల్లో జననాలు, మరణాలుప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో ఉంటున్న భారతీయులకు 2023లో మొత్తం 62,182 మంది జన్మించారు. ఇందులో సగానికిపైగా యూఏఈ, యూకే, ఖతార్లలోనే పుట్టడం విశేషం. విదేశాల్లోని భారతీయుల్లో 10,531 మంది మరణించారు. ఇందులో సగానికిపైగా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్లలోనే సంభవించాయి.అత్యధిక శిశు మరణాలు..: 2023లో అత్యధిక శిశు మరణాలు సంభవించిన రాష్ట్రాలు.. మహారాష్ట్ర (17,436), గుజరాత్ (13,676), హరియాణా (11,622). ఏపీలో 6,852, తెలంగాణలో 3,956 సంభవించాయి. -
ఏఐ వచ్చినా..మన ఉద్యోగాలు సేఫ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉపాధి కోల్పోతాం అన్న భావన చాలామందిలో ఉంది. ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఈ ఆందోళన నెలకొంది. ఈ విషయంలో మనం సేఫ్! భారత్లో కేవలం 6.4 శాతం ఉద్యోగాలకు మాత్రమే ఏఐ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. అంటే కృత్రిమ మేధ రాకతో భారతీయులపై ప్రతికూల ప్రభావం అతి తక్కువే అన్నమాట. పైగా ఈ నూతన సాంకేతికత వల్ల 15 శాతానికిపైగా ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయని వివరించింది. ఏఐ నియామకాల్లో దేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ పోటీపడుతుండడం విశేషం. ఇక ఏఐ పరివర్తనలో దక్షిణ ఆసియాలో భారత్ ముందంజలో దూసుకెళుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఉద్యోగ ప్రకటనల్లో ఏఐ వాటా దక్షిణాసియాలో ఇలా..శ్రీలంక 7.3భారత్ 5.8నేపాల్: 3.4బంగ్లాదేశ్: 1.4» ఏఐ రాకతో భారత్లో 15.6 శాతం ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయి.» 6.4 శాతం జాబ్స్ను మాత్రమే ఏఐ కైవసం చేసుకుంటుంది.» సాంకేతిక సేవలకు పేరొందిన బెంగళూరు, హైదరాబాద్లలో ఏఐ సంబంధ ఉద్యోగాలు కేంద్రీకృతమయ్యాయి.» మొత్తం జాబ్ పోస్టింగ్స్లో ఏఐ సంబంధ ఉద్యోగాల వాటా మన దేశంలో 5.8 శాతం.» ఏఐ జాబ్స్లో జాతీయ సగటును మించి నాలుగు నగరాలు ముందంజలో ఉన్నాయి. దేశాల వారీగా ఏఐ రాకతో వివిధ రంగాల్లో మెరుగుపడే ఉద్యోగాలు, ప్రభావితం అయ్యే జాబ్స్, ఏమాత్రం ప్రభావం లేని విభాగాల శాతం -
ఐజీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్
చండీగఢ్: హరియాణా సీనియర్ పోలీస్ అధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) పూరన్కుమార్ కుమార్ ఆత్మహత్య వ్యవహారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పూరన్కుమార్పై వచ్చిన అవినీతి ఆరోపణపై విచారణ దర్యాప్తు జరుపుతున్న రోహ్తక్ ఏఎస్ఐ సందీప్కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఆయన పూరన్ కుమార్పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. సందీప్కుమార్ మృతదేహాన్ని రోహ్తక్లోని ఆయన నివాసంలో గుర్తించారు. మృతదేహం వద్ద మూడు పేజీల లేఖతోపాటు ఆయన మొబైల్లో ఆరు నిమిషాల సెల్ఫీ వీడియో లభించాయి.అందులో ఆయన పూరన్కుమార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ను కులం పేరుతో వేధించారని ఆరోపిస్తూ పూరన్ కుమార్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్న 8 మంది పోలీస్ అధికారుల్లో ఒకరైన రోహ్తక్ ఎస్పీ బిజర్నియా ఎంతో నిజాయితీగల మంచి వ్యక్తి అని సందీప్కుమార్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొనటం గమనార్హం. సందీప్కుమార్ తన రివాల్వర్తో కాల్చుకుని మరణించాడని రోహ్తక్ ప్రస్తుత ఎస్పీ ఎస్ఎస్ భోరియా తెలిపారు. ‘మా డిపా ర్ట్మెంట్లో సందీప్కు మార్ ఎంతో కష్టపడి పనిచేసే నిజాయితీగల వ్యక్తి’అని చెప్పారు. సందీప్ ఆత్మహత్య లేఖ గురించి మీడియా ప్రశ్నించగా.. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం సమస్యలకు దారితీస్తుందని, ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు.కాగా, తన మరణంతో అయినా దేశం నిజం తెలుసుకుంటుందని సందీప్ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ‘పూరన్కుమార్ అవినీతిపరుడు. అందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. దర్యాప్తులో వివక్షను నిరసిస్తూ నేను ప్రాణత్యాగం చేస్తున్నాను. ఆ అవినీతి కుటుంబాన్ని అస్సలు వదలొద్దు. కులరాజకీయాలతో వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు’ అని అందులో పేర్కొన్నాడు. లిక్కర్ కాంట్రాక్టర్ నుంచి పూరన్కుమార్ తరఫున రూ.2.5 లక్షలు లంచం తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ సుశీల్కుమార్ను అరెస్టు చేయటంలో సందీప్కుమార్ కీలకంగా వ్యవహరించారు. కాగా, పూరన్కుమార్పై కుల వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్ను నాయబ్సింగ్ సైనీ ప్రభుత్వం సెలవుపై పంపింది. ఆయన స్థానంలో తాత్కాలిక డీజీపీగా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఓపీ సింగ్కు బాధ్యతలు అప్పగించింది.మోదీ రాతిగుండె కరగదా?: రాహుల్పూరన్కుమార్ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూరన్ కుమార్ను కులంపేరుతో వేధించి ఆత్మహత్యకు కారణమై అధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భర్త మృతదేహానికి గౌరప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు పూరన్కుమార్ సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారి అమ్నీత్ పీ కుమార్, ఆయన ఇద్దరు కుమార్తెలు వారాలుగా ఎదురు చూస్తున్నారని.. అయినా ప్రధాని మోదీ, సీఎం సైనీ రాతి మనసులు కరగటం లేదని ఆరోపించారు. ఎంత చదువుకున్నా, ఎంత ప్రజ్ఞా పాఠవాలు ఉన్నా, జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగి నా ఈ దేశంలో దళితులపై అణచివేత తప్పదని పూరన్కుమార్ ఆత్మహత్య ఘటన నిరూపిస్తోందని రాహుల్గాంధీ పేర్కొన్నారు. -
20 ప్రాణాలు బుగ్గిపాలు
జైసల్మీర్: దాదాపు 57 మంది ప్రయాణికులతో మొదలైన ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణం అత్యంత విషాదాంతంగా ముగిసింది. బస్సు వేగంగా దూసుకెళ్తున్నప్పుడు ఒక్కసారిగా అంటుకున్న అగ్నికీలలు రెప్పపాటులో బస్సును ఆవహించి అందులోని 20 మంది ప్రయాణికుల ప్రాణాలు తీశాయి. రాజస్థాన్లోని జైసల్మీర్ నగరం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జైసల్మీర్–జోధ్పూర్ జాతీయరహదారిపై ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బస్సు వెనక భాగంలో షాట్ సర్క్యూట్ సంభవించడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ రావడం మొదలైంది.బస్సు అత్యంత వేగంగా వెళ్తుండటంతో గాలులు తోడై మంటలు చెలరేగి వేగంగా బస్సును చుట్టుముట్టాయి. డ్రైవర్ గమనించి బస్సును రహదారిపై ఒక పక్కకు ఆపి అందర్నీ అప్రమత్తంచేసేలోపే 20 మంది ప్రయాణికులు ఆ మంటలకు సజీవ దహనమయ్యారు. 16 మంది ప్రయాణికులకు తీవ్రస్థాయిలో కాలిన గాయాలయ్యాయి. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెల్సుకున్న అగ్నిమాపక, ఆర్మీ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.మార్గమధ్యంలో ఇతర వాహనాలు, ట్రాఫిక్ అడ్డుతగలకుండా గ్రీన్చానల్ ఏర్పాటుచేశారు. జోధ్పూర్ ఆస్పత్రిలో గాయపడిన ప్రయాణికులకు పూర్తిస్థాయిలో చికిత్స, సహాయ సహకారాలు అందించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం జైసల్మీర్కు చేరుకున్నారు.మొత్తంగా కాలిపోయిన బస్సుతొలుత మంగళవారం మధ్యాహ్నం జైసల్మీర్ నుంచి బస్సు జోధ్పూర్కు బయల్దేరింది. బయల్దేరిన 10 నిమిషాలకే బస్సు అగ్ని ప్రమాదానికి గురైందని పోక్రాన్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ పురీ మీడియాతో చెప్పారు. వేగంగా వెళ్తున్న బస్సులో చెలరేగిన మంటలు గాలుల ధాటికి రెప్పపాటులో మొత్తంగా అంటుకోవడంతో ప్రమాదతీవ్రత భారీస్థాయిలో ఉంది. మంటలకు బస్సు మొత్తం కాలిపోయింది. బస్సులో పడుకుని ప్రయాణించే విభాగం మొత్తం కాలిబూడిదైంది. కొందరి ప్రయాణికుల మృతదేహాలు అగ్నికికాలిపోయి మాంసం ముద్దలుగా మారిపోయాయి.డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాలను కుటుంబసభ్యులు అప్పగించనున్నారు. విషయం తెల్సి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి తలో రూ. 50,000 అందజేయనున్నారు. ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ హరిబావూ బగాదే సైతం తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గురైన బస్సును కొత్త యజమాని కేవలం ఐదు రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. ప్రమాద సమయంలో బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టంగా పొగ వెలువ డుతున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారా యి. -
మీ అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి
న్యూఢిల్లీ: మంగోలియా దేశాభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నాలుగురోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నా(Khurelsukh Ukhnaa) ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉఖ్నా భారత్కు రావడం ఇదే తొలిసారి. ఇరువురి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, మంగోలియా బంధం కేవలం ద్వైపాక్షికం కాదు. అంతకుమించిన గాఢమైన, ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధం. మన ఇరుదేశాల భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజల సత్సంబంధాల్లో ప్రతిబింబిస్తోంది.భారత్ అందించిన 1.7 బిలియన్ డాలర్ల ఆర్థికసాయంతో మంగోలియాలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ ఆ దేశ ఇంధన రక్షణకు మరింత భద్రత చేకూరుస్తుంది. విదేశాల్లో భారత్ చేపట్టిన అతిపెద్ద అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్ట్ ఇదే. ఇందులో మంగోలియా సిబ్బందితోపాటు 2,500 మందికిపైగా భారతీయ నిపుణులు పనిచేస్తూ ఈ ప్రాజెక్ట్ను సుసాధ్యం చేస్తున్నారు. ఇది మాత్రమేకాకుండా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇండో–పసిఫిక్లో స్వేచ్ఛా, సులభతర, సమగ్రత వాణిజ్యానికి ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. గ్లోబల్ సౌత్ వాణిని గట్టిగా ఇరుదేశాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మంగోలియా పౌరులకు భారత్ ఉచితంగా ఈ–వీసాలను అందించనుంది’’ అని మోదీ చెప్పారు. పలు రంగాల్లో పరస్పర సహకారంఈ సందర్భంగా ఉఖ్నా భారత్ను పొగిడారు. ‘‘స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ అద్భుతంగా నాయకత్వ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సౌరకూటమిలోనూ భారత్ తనదైన కీలక భూమిక పోషిస్తోంది’’ అని శ్లాఘించారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘బౌద్ధమతం విషయంలో ఇరుదేశాలు తోబుట్టువులే. గౌతమ బుద్దుడి ముఖ్య శిష్యులైన సరిపుత్ర, మౌద్గల్యయానల పవిత్ర అవశేషాలు వచ్చే ఏడాది మంగోలియాకు భారత్ అప్పగించనుంది. గందన్ బౌద్ధారామానికి భారత్ త్వరలో ఒక సాంస్కృతిక ఉపాధ్యాయుడిని పంపనుంది. ఆయన అక్కడి బౌద్ధ ప్రాచీన ప్రతులను అధ్యయనం చేయనున్నారు.మంగోలియాలో బౌద్ధమత వ్యాప్తికి నాటి బిహార్లోని పురాతన నలంద విశ్వవిద్యాలయం ఎంతగానో సాయపడింది. ఇప్పుడు అదే రీతిలో గందన్ మఠం, నలంద వర్సిటీల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాం ’’అని మోదీ చెప్పారు. ‘‘లద్దాఖ్ స్వయంప్రతిపత్తి పర్వతప్రాంత అభివృద్ధి మండలి, మంగోలియాలోని అర్ఖాంగాయ్ ప్రావిన్స్ల మధ్య సాంస్కృతిక బంధం బలపడేందుకు మంగళవారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. రక్షణ మొదలు భద్రత, ఇంధనం, గనులు, సమాచార సాంకేతికత, విద్య, ఆరోగ్యం, సంస్కృతిక సహకార రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం, పరస్పర సహకారం మరింత బలపడింది’’ అని మోదీ అన్నారు. 1955లో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలయ్యాయి. -
తెలుగు ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్: హర్యానాలో తెలుగు సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రివాల్వర్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు పూరాన్ కుమార్ తన మరణానికి కారణమైన పోలీస్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తుల పేర్లు రాశారు. వారిలో ఒకరైన రోహత్క్ సైబర్ సెల్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సందీప్ కుమార్ సైతం ‘సత్యం’ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు లేఖ రాయడం కలకలం రేపుతోంది.రోహ్తక్లోని ఓ పొలంలో సందీప్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ వీడియో,మూడుపేజీల సూసైడ్ నోట్ రాశారు. ఆ నోట్లో ‘ఐపీఎస్ పూరన్ కుమార్ అవినీతి పోలీసు అధికారి. తన అవినీతి బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత పూరన్ కుమార్ బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారి గన్మెన్ మద్యం కాంట్రాక్టర్ నుండి రూ. 2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా నేనే పట్టుకున్నాను. ఓ గ్యాంగ్స్టర్ బెదిరించడంతో కాంట్రాక్టర్ పూరన్ కుమార్ను కలిశాడు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పుడు.. ఐపీఎస్ అధికారి దానికి కులం రంగు పులిమేందుకు ప్రయత్నించారు. పూరన్ కుమార్ను రోహ్తక్ పరిధిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అవినీతికి అంతులేకుండా పోయింది. రోహ్తక్లో బాధ్యతలు చేపట్టి నిజాయితీపరులైన పోలీసు అధికారుల స్థానంలో అవినీతిపరులైన అధికారులను నియమించడం ప్రారంభించారు. సదరు అధికారులు బ్లాక్మెయిల్ చేయడం, పిటిషనర్లకు ఫోన్ చేసి, డబ్బులు అడిగి వారిని మానసికంగా హింసించేవారు. బదిలీలకు బదులుగా మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా వేధించారు. ‘ఐపీఎస్ పూరన్ కుమార్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. అతనిపై వచ్చిన ఫిర్యాదులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆస్తులపై దర్యాప్తు చేయాలి. ఇది కుల సమస్య కాదు. నిజం బయటకు రావాలి. అతను అవినీతిపరుడు. ఈ నిజం కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను. నేను నిజాయితీతో నిలబడినందుకు గర్వపడుతున్నాను. నా కుటుంబ సభ్యులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు’ అంటూ తన బలవన్మరణానికి ముందు సైబర్ సెల్ ఏఎస్ఐ సందీప్ కుమార్ రాసిన సూసైడ్ నోట్లో సంచలన ఆరోపణలు చేశారు. కాగా, సందీప్ కుమార్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్న పదిమంది అధికారులలో ఒకరైన రోహ్తక్ పోలీస్ చీఫ్ నరేంద్ర బిజార్నియాను ప్రశంసించారు. వెనువెంటనే బిజార్నియా రోహ్తక్ నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం. -
ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు ..12మంది సజీవ దహనం?
జైసల్మేర్: రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మంగళవారం (అక్టోబర్14)జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు వ్యాపించారు. ఈ దుర్ఘటనలో 10 నుంచి 12 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బస్సు ప్రమాద సమయంలో మొత్తం 57మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ ట్రావెల్ బస్సు జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తుండగా మార్గం మధ్యలో బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో వేగంగా వ్యాపించిన మంటలు బస్సు మొత్తాన్ని అంటుకున్నాయి. ఈ ఘటనలో భయాందోళనకు గురైన ప్రయాణికులు తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు హాహాకారాలు చేస్తూ బస్సు నుంచి బయటకు దూకారు. ఆ సమయంలో బస్సులో ఉన్న పలురువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బస్సు నిర్వహణలో లోపం ఉందా? మంటలు ఎలా చెలరేగాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ పెను ప్రమాదం ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు నిరంతర తనిఖీలు, తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
‘తాలిబన్ నేతకు డిన్నర్ ఇస్తారా?: అవమానంతో తలదించుకున్నట్లుంది’
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్లో తాలిబన్ ఏర్పాటైన సుమారు నాలుగేళ్ల తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖీ భారత్ పర్యటనపై ప్రముఖ కవి, రచయిత జావేద్ అక్తర్ విమర్శలు గుప్పించారు. ఒక తాలిబన్ నేతను భారత్కు ఆహ్వానించడమే కాదు.. డిన్నర్ కూడా ఇస్తారా? అవమానంతో తలదించుకున్నట్లైంది అంటూ మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే మనం, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన తాలిబన్ నేతకు విందు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. అన్ని ఉగ్రవాద సంస్థలపై పోరాటం చేసే మనం, ఇలా వారిని ఆహ్వానించి ప్రత్యేక విందులు ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు.I hang my head in shame when I see the kind of respect and reception has been given to the representative of the world’s worst terrorists group Taliban by those who beat the pulpit against all kind of terrorists . Shame on Deoband too for giving such a reverent welcome to their “…— Javed Akhtar (@Javedakhtarjadu) October 13, 2025 కాగా, ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా అమిర్ ఖాన్ ముత్తఖీ.. ఇటీవల ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ మేరకు భారత్ ప్రభుత్వ పెద్దల్ని కలుస్తూ తాము అఫ్గాన్ను ముందుకు నడిపిస్తున్న తీరును వివరించారు. అదే సమయంలో తమ దేశంలో ఉగ్రజాడలు లేకుండా చేశామని కూడా చెప్పుకొచ్చారు. భారత్ గడ్డపై నుంచే పాక్ ఉగ్రవాదాన్ని వీడాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇలా ముత్తఖీ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పాకిస్తాన్-అఫ్గాన్ల మధ్య పోరు రాజుకుంది. తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులు చివరకు తాలిబాన్, పాక్ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రుదేశానికి భారీ నష్టం వాటిల్లజేశామని అటు అఫ్గానిస్తాన్, ఇటు పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. ఇదీ చదవండి:అంతా మాలా ఉండండి.. ఉగ్రవాదాన్ని తరమండి: అఫ్గాన్ మంత్రి -
66 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల నేర చరిత్రను బహిర్గతం చేసింది. 66 శాతం మంది శాసనసభ్యులపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. 241 మంది ఎమ్మెల్యేల్లో 158 మంది (66 శాతం) తమపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఏడీఆర్ తన నివేదికలో (ADR Report) పొందుపరిచింది.అరాయ్ బీజేపీ ఎమ్మెల్యే రామ్సురత్ కుమార్, సూర్యగర్హా జేడీయూ ఎమ్మెల్యే పహ్లాద్ యాదవ్ అఫిడవిట్లు అందుబాటు లేనందున వారిద్దరి వివరాలు పరిగణనలోకి తీసుకోలేదని ఏడీఆర్ తెలిపింది. 2020 ఎన్నికల అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకున్నందున కొంతమంది ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్యలో ఇప్పుడు కొన్ని మార్పులు ఉండవచ్చని తెలిపింది.ముఖ్యంశాలు119 మంది (49 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 8 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై హత్య కేసులు (ఐపీసీ సెక్షన్ 302) ఉన్నాయి.30 మందిపై హత్యాయత్నం కేసులు (ఐపీసీ సెక్షన్ 307) ఉన్నాయి.53 మంది (64 శాతం) బీజేపీ ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 53 మంది (74 శాతం) ఆర్జేడీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.21 మంది (45 శాతం) జేడీయూ ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 14 మంది (82 శాతం) కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.9 మంది (82 శాతం) సీపీఐ (ఎంఎల్) (ఎల్) ఎమ్మెల్యేలపైనా కేసులున్నాయి.విద్యార్హత- వయసుసిట్టింగ్ ఎమ్మెల్యేల విద్యార్హతలను పరిశీలిస్తే.. 82 మంది (34 శాతం) ఎమ్మెల్యేలు 5 నుంచి 12వ తరగతి చదివిన వారు. గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ చదివిన వారు 149 (62 శాతం) మంది ఉన్నారు. వయసులవారీగా చూస్తే.. 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు 122 మంది (51 శాతం) ఉన్నారు. 241 మంది ఎమ్మెల్యేల్లో 29 మంది (12 శాతం) మాత్రమే మహిళలు.బిహార్ అసెంబ్లీకి తాజా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.చదవండి: అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆమెనే! -
కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
ఢిల్లీ: ఏపీ కురుపాం గిరిజన హాస్టల్లో అనారోగ్యానికి గురై మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతార్ సింగ్ ఆర్యను వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది.ఈ భేటీలో కురుపాం గిరిజన హాస్టల్ ఉంటున్న భారీ సంఖ్యలో విద్యార్థులు పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడినా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందంటూ జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతార్ సింగ్ ఆర్యకు ఫిర్యాదు చేశారు.గిరిజన హాస్టల్స్లో పరిశుభ్రమైన మంచినీరు, భోజనం కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భారీ ఎత్తున పచ్చకామెర్ల వ్యాధి బారిన పడ్డారని పేర్కొన్నారు. గిరిజన హాస్టల్స్లో చంద్రబాబు సర్కార్ బాలల హక్కుల ఉల్లంఘన, ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వహించడంపై ఆందోళన వ్యక్తం చేసస్తూ.. గిరిజన విద్యార్థులను కాపాడాలని వినతి పత్రం సమర్పించారు.వైఎస్సార్సీపీ నేతల బృందంలో ఎంపీ, డాక్టర్ తనుజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర , పరీక్షిత్ రాజు, రేగమ్ మత్స్య లింగం, భాగ్యలక్ష్మి మాజీ ఎంపీ మాధవి, సుభద్ర, శోభా స్వాతి రాణి ఉన్నారు.అనంతరం తనూజ రాణి మాట్లాడుతూ.. ‘ గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం కనీసం పరిశుభ్రమైన మంచినీరు ఇవ్వలేకపోతోంది కలుషిత తాగునీరు తాగి 170 మంది గిరిజన విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి సోకింది. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. గిరిజన విద్యార్థులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల అనారోగ్యం పాలయ్యారని మంత్రి చెప్పడం దౌర్భాగ్యం’ అని విమర్శించారు. పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. ‘ గిరిజన విద్యార్థులపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. గిరిజనుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఇద్దరు విద్యార్థులు చనిపోతే ఇప్పటివరకు కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 170 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడ్డారు. ఆర్వో ప్లాంట్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు’ అని మండిపడ్డారు.రాజన్న దొర మాట్లాడుతూ.. ‘ గిరిజనుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కనీసం మానవత్వం ప్రదర్శించడం లేదు. గిరిజన విద్యార్థులు పిట్టల రాలిపోతున్న ప్రభుత్వం చలించడం లేదు. చనిపోయిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
విజయ్ టీవీకే పార్టీలో కీలక వ్యక్తులు తెలుగువారే
సాక్షి,చెన్నై: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్కు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కరూర్ తొక్కిసలాటపై దర్యాప్తు చేపట్టే బాధ్యతల్ని సీబీఐకి అప్పగించింది. ఆ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీం నియమించింది. అయితే, విజయ్ (Vijay) ఇప్పటి వరకు నిర్వహించిన బహిరంగ సభల్లో అధికార, గత పాలకుల అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో విజయకు మద్దతు ఎవరిస్తారు? విజయ్ మద్దతు ఎవరికుంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయ్కు విశ్వాసపాత్రులుగా ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. వారిలో ఒకరు తమిళనాడు తిరుచ్చికి చెందిన అధవ్ అర్జున్ రెడ్డి. ఈయన దేశంలో లాటరీ కింగ్ పేరు పేరొందిన మార్టిన్ అల్లుడే ఈ అర్జున్ రెడ్డి. ఎలక్టోరల్ బాండ్స్ కోసం రూ. 1318 కోట్లు ఇచ్చి దేశంలో అగ్రగామిగా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన డీఎంకేకి మద్దతు ఇచ్చారు. ఇంకొకరు ఆనంద్, విజయ్ ఫాన్స్ అసోసియేషన్ తరపున పుదుచ్చేరి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. వారిద్దరు విజయ్కు విశ్వాస పాత్రులుగా ఉంటూ టీవీకే (TVK) కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఇక తాజా, సుప్రీంకోర్టు నిర్ణయంతో విజయ్ త్వరలో జిల్లాల పర్యటన ఉండనుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలతో విజయ్.. ఏఐఏడీఎంకే, బీజేపీతో పొత్తుపెట్టుకుంటారా? లేదంటే ప్రశాంత్ కిషోర్ (prashant kishor) సూచనలు మేరకు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగతాడా? అన్నది తేలాలంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చదవండి: అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆమెనే! -
Bihar: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ తొలి జాబితా విడుదల చేసింది. 71 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం(అక్టోబర్ 14వ తేదీ) తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది బీజేపీ. ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ. తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు. లకిసరాయి నుంచి డిప్యూటీ సీఎం విజయసింహ పోటీచేయనున్నారు. సివన్ నుంచి మంగళ్ పాండే పోటీకి సిద్ధమయ్యారు. ఇక స్పీకర్ నందకిషోర్ యాదవ్కి టికెట్ దక్కలేదు. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ పొత్తులో భాగంగా 101 సీట్లలో పోటీ చేయనుంది. भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति द्वारा बिहार विधानसभा चुनाव-2025 के लिए चयनित सभी प्रत्याशियों को हार्दिक बधाई एवं विजयश्री की अग्रिम शुभकामनाएं।#आएगी_NDA pic.twitter.com/vENiqKpx1w— BJP Bihar (@BJP4Bihar) October 14, 2025 రెండు రోజుల క్రితం బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించారు మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఇచ్చారు. ఇదిలా ఉంచితే బిహార్లో నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఒప్పందం ఇలా..జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లుభారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లుహిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం): 6 సీట్లురాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం): 6 సీట్లు ఇదీ చదవండి: బిహార్లో సంపన్న ఎమ్మెల్యే ఆమెనే..! -
బిహార్లో సంపన్న ఎమ్మెల్యే ఆమెనే!
బిహార్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు వ్యూహాల్లో తలమునకలయ్యాయి. సీట్ల లెక్కలు, ప్రచార పర్వంపై అధికార, విపక్ష కూటముల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ప్రస్తుత ఎమ్మెల్యేలకు సంబంధించిన సమగ్ర నివేదికను వెల్లడించింది. 2020 ఎన్నికలు, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ రిపోర్ట్ తయారు చేసింది ఏడీఆర్. బిహార్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 241 మందికి సంబంధించిన పూర్తి డేటాను విడుదల చేసింది.రూ. 1,121 కోట్ల ఆస్తులుఏడీఆర్ నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 194 మంది అంటే 80 శాతం మంది కోటీశ్వరులు. 241 మంది శాసనసభ్యుల మొత్తం ఆస్తులు విలువ దాదాపు రూ. 1,121.6 కోట్లుగా తేలింది. బీజేపీలో 72 మంది (87 శాతం) సంపన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కమలం పార్టీకి మొత్తం 83 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆర్జేడీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 63 మంది (88 శాతం) కోటీశ్వరులు. జేడీయూ పార్టీ ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది (83 శాతం) సంపన్నులే.కాంగ్రెస్ పార్టీకి ఉన్న 17 మంది శాసనసభ్యుల్లో 13 మంది (76 శాతం) కరోడ్పతులున్నారు. హిందూస్తానీ అవామీ మోర్చా (సెక్యులర్) పార్టీలోని నలుగురు ఎమ్మెల్లో ఇద్దరు (50 శాతం) సంపన్నులు ఉన్నారు. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) నుంచి ఒక్కొక్కరు చొప్పున కోటీశ్వరులు ఉన్నారు. బిహార్ శాసనసభలో ఉన్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ. 4.7 కోట్లుగా అంచనా వేసింది.నీలం దేవి టాప్బిహార్లోని అత్యంత సంపన్న శాసనసభ్యుల జాబితాలో జేడీయూ ఎమ్మెల్యే నీలం దేవి (Neelam Devi) అగ్రస్థానంలో ఉన్నారు. 2022 ఉప ఎన్నికల్లో మోకామా నియోజకవర్గం నుంచి ఆమె గెలిచారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆమెకు రూ. 80 కోట్లుపైగా విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ. 29.8 కోట్ల చరాస్తులు, రూ. 50.6 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. సంపద విషయంలో తన తోటి శాసనసభ్యుల కంటే ఆమె చాలా ముందున్నారు. గయ జిల్లాలోని బెలగంజ్కు చెందిన జేడీయూ మరో మహిళా ఎమ్మెల్యే మనోరమా దేవి రెండో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.72.8 కోట్లు. భాగల్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.43.2 కోట్లు.నిరుపేద ఎమ్మెల్యే ఆయనేఖగారియా జిల్లాలోని అలౌలి (ఎస్సీ) ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్వృక్ష సదా నిరుపేద ఎమ్మెల్యే అని ఏడీఆర్ రిపోర్ట్ (ADR Report) తెలిపింది. ఆయన మొత్తం ఆస్తులు కేవలం 70,000 రూపాయలు మాత్రమే. వీటిలో రూ.30,000 చరాస్తులు, రూ.40,000 స్థిరాస్తులు ఉన్నాయి. ఫుల్వారీ (ఎస్సీ) నియోజకవర్గ సీపీఐ (ఎంఎల్) గోపాల్ రవిదాస్ (Gopal Ravidas) తదుపరి స్థానంలో ఉన్నారు. ఆయనకు రూ. 1.59 లక్షలు విలువచేసే ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఇదే పార్టీ నుంచి పాలిగంజ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సందీప్ సౌరవ్ రూ. 3.45 లక్షల విలువైన ఆస్తులను ప్రకటించారు.చదవండి: చెట్లకు సెల్ఫోన్లు.. మహిళలకు తప్పని పాట్లుఅంత వ్యత్యాసమా?బిహార్లో ధనిక, పేద ఎమ్మెల్యేల మధ్య భారీ వ్యత్యాసం.. అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దం పడుపడుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో బిహారీలకు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Election) రెండు విడతల్లో.. నవంబర్ 6, 11న జరగనున్నాయి. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. -
‘ఏయ్ అరవకు.. ఇంకొందరిని పిలవమంటావా?’
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో మెడికల్ కాలేజీ స్టూడెంట్పై జరిగిన సామూహిక ఘటన దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అయితే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలు ఆనాడు ఏం జరిగిందో చెప్పిన విషయాలు ఓ జాతీయ మీడియా కథనం ద్వారా బయటకు వచ్చింది.వాళ్లు తమ వాహనాల నుంచి దిగి మా వైపు నడుచుకుంటూ వచ్చారు. అది గమనించి మేం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాం. వాళ్లలో ముగ్గురు నన్ను పట్టకుని దగ్గర్లోని అడవిలోకి లాక్కెళ్లారు. నా ఫ్రెండ్కు కాల్ చేయమని నాపై ఒత్తిడి చేశారు. అయితే అవతలి నుంచి స్పందన లేకపోవడంతో.. నన్ను అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. గట్టిగా అరిచేందుకు ప్రయత్నిస్తే.. అరిస్తే మరికొంత మందిని పిలిపిస్తామని బెదిరించి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అని స్టేట్మెంట్లో బాధితురాలు పేర్కొంది. మరోవైపు ఒడిశా నుంచి వచ్చిన హక్కుల కమిషన్ బాధితురాలిని పరామర్శించి.. ఘటనపై నివేదికను సిద్ధం చేస్తోంది.ఒడిశా జలేశ్వర్కు చెందిన యువతి.. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. గత శుక్రవారం డిన్నర్ కోసం ఫ్రెండ్తో ఆమె బయటకు వెళ్లింది. ఆ సమయంలో.. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గ్యాంగ్రేప్కు గురైంది. ఈ కేసుకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వాళ్లకు 10 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు అర్దరాత్రి పూట ఆమె బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. అయితే పోలీసుల నివేదిక ప్రకారం.. అత్యాచారం రాత్రి 9గం. ప్రాంతంలోనే జరిగింది. -
‘అగ్రకులాల వాళ్లు వెళ్తుంటే.. ఇప్పటికీ లేచి నిలబడుతున్నారు!’
ఓబీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే 15,000 పేజీల ఆ అఫిడవిట్ ఆసక్తికర అంశాలనే పొందుపరిచింది. ప్రాచీన భారతంలో లేని కుల వివక్ష.. విదేశీ ఆక్రమణల కాలం నుంచే మొదలైందని, అది ఇప్పటికీ సమాజంలో కొనసాగుతోందంటూ ఉదాహరణలతో సహా అందులో ప్రస్తావించింది.మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 21, 2021లో.. ఓబీసీ రిజర్వేషన్లను 14 శాతం నుంచి 27 శాతానికి పెంచింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 73 శాతానికి చేరాయి. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధంగా 50% రిజర్వేషన్ పరిమితిని ఉల్లఘించేలా ఉందని(ఇంద్రా సాహ్నీ కేసు), ఈ నిర్ణయం రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నమేనని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో రాజ్యాంగ పరిమితులు, సామాజిక న్యాయం మధ్య సమతుల్యతపై చర్చ మొదలైంది. ఈ లోపు.. నిశ్చయ సోనిర్బే అనే ఓబీసీ నేతతో పాటు ఎనిమిది మంది ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అఫిడవిట్ దాఖలు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజాగా.. ఆ అఫిడవిట్లో రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం సమర్థించుకుంది. ప్రాచీన భారతదేశం కులాల లేని, ప్రతిభ ఆధారిత సమాజంగా ఉండేదని అందులో ప్రముఖంగా పేర్కొంది. వేద కాలాన్ని సమానత్వ యుగంగా అభివర్ణిస్తూ.. విదేశీ ఆక్రమణల వల్ల కుల వివక్ష వచ్చిందని తెలిపింది. అదే సమయంలో, రైతులు, కళాకారులపై కుల ఆధారిత దోపిడీ వల్ల దేశ ఆర్థిక పతనం జరిగిందని పేర్కొంది. వర్గ వివక్ష ఇంకా కొనసాగుతోందని వాదించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో 56% ఓబీసీ ఉద్యోగులు.. ఉన్నత కులాల వారు పక్కన నుంచి పోతుంటే ఇప్పటికీ లేచి నిలబడతారు అని ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ క్రమంలో.. దామోహ్లో జరిగిన ఓ ఘటనను ప్రముఖంగా ప్రస్తావించింది. ఓబీసీ కుష్వాహా వర్గానికి చెందిన ఓ యువకుడు, ఓ బ్రాహ్మణుడి ఏఐ ఇమేజ్ క్రియేట్ చేశాడని పాదాలు కడిగించి.. బలవంతంగా ఆ నీటిని తాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కేసు నమోదైంది కూడా. ఇలాంటి ఘటనలతో.. కుల వివక్ష సమాజంలో పేరుకుపోయిందనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. జాతి నిర్మాణంలో భాగంగానే.. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో.. ఓబీసీ రిజర్వేషన్లను పెంచామని అఫిడవిట్లో పేర్కొంది. ఇదే కాదు.. సుదీర్ఘమైన అఫిడవిట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ 2023లో గోప్యంగా నిర్వహించిన ఓ సర్వే వివరాలను పొందుపరిచింది. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా 10 వేల గ్రామీణ కుటుంబాలను ఈ సర్వేలో భాగం చేశారు. ఇందులో 5,578 మంది అంటే 56 శాతం.. అగ్రవర్ణాల వాళ్లు తమ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నారని, ఆఖరికి వాళ్లు వెళ్తుంటే మంచంలో కూడా కూర్చోనివ్వరని.. లేచి నిలబడి గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. 3,397 కుటుంబాలు అంటరానితనం, అస్పృశ్యత కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 3,763 కుటుంబాలు.. కలిసి భోజనం చేసేందుకు ఇతర కులాల వాళ్లు అంగీకరించరని తెలిపారు. చివరకు.. కులం కారణంగానే తమ ఇళ్లలో పూజలు నిర్వహించేందుకు పూజారులు ముందుకు రావడం లేదని 3,238 మంది తెలిపారు. ఓబీసీకి చెందిన సగం మహిళలు.. వ్యవసాయ కూలీలుగానో, కూలీ పనులు చేసుకుంటున్నో గడుపుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో OBCల జనాభా అత్యధికంగా ఉందని.. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారని వాదించింది.అయితే ఈ అఫిడవిట్లో సాంకేతిక అంశాలు ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంటూ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును సమయం కోరారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రోజువారీ విచారణకు అనుకూలమైన కేసు అని, వాయిదాలు వల్ల ప్రజలకు న్యాయం ఆలస్యం అవుతుందని తెలిపింది. అత్యంత ప్రాధాన్యత గల కేసుగా అభివర్ణిస్తూనే.. చివరకు నవంబర్ 9వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించగా.. దానిని ఎత్తివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇటు మధ్యప్రదేశ్ రిజర్వేషన్ కోటా పిటిషన్ విచారణ కొనసాగుతుండడం గమనార్హం. -
యువతిపై సామూహిక అత్యాచారం
కర్ణాటక: డ్రాప్ చేస్తామని యువతిని బైక్ ఎక్కించుకున్న యువకులు ఆమెను నిర్జనప్రదేశానికి తీసికెళ్లి అత్యాచారం జరిపిన దారుణ సంఘటన చిక్కబళ్లాపురం పట్టణంలో జరిగింది. స్థానికంగా మెకానిక్ పని చేస్తున్న సికిందర్ బాబా (30), గుజరీ వ్యాపారి జనార్ధనాచారి(31)లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సమీప గ్రామానికి చెందిన యువతి పని మీద ఆదివారం చిక్కబళ్లాపురానికి వచ్చింది. సాయంత్రం తిరిగి ఊరికి నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో బైక్పై వచ్చిన సికిందర్ డ్రాప్ చేస్తానని ఆమెను బైక్పై ఎక్కించుకున్నాడు. దారిలో నిర్జన ప్రదేశంలో ఆమైపె అత్యాచారం చేసి వెళ్లిపోయాడు. మళ్లీ స్నేహితుడు జనార్ధనాచారిని తీసుకుని వచ్చి యువతిపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను బైక్పై కూర్చోబెట్టుకుని సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద వదిలి వెళ్లిపోయారు. రోడ్డు మీదే యువతి ఏడుస్తూ కూర్చుని ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న మహిళా ఠాణా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు యువతిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.మహిళా వైద్యురాలితో అసభ్య ప్రవర్తనఇటీవల బస్సుల్లో కామాంధులు ఎక్కువయ్యారు. తాజాగా దొడ్డబళ్లాపురం నుంచి బెంగళూరుకు బస్సులో వస్తున్న మహిళా వైద్యురాలిని ఓ దుండగుడు వేధించాడు. ఆమె పక్కన కూర్చుని అసభ్యంగా తాకసాగాడు. దీంతో ఆమె కండక్టర్, డ్రైవర్కు విషయం చెప్పగా, పోలీసులకు ఫోన్ చేసి నిందితుడు ఫిరోజ్ఖాన్ని పట్టించారు. సంజయ్ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.బస్సులో మరో దురాగతంబెంగళూరులో ఆర్టీసీ బస్సులో మరో దుస్సంఘటన జరిగింది. తుమకూరు నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సులో ఓ వ్యక్తి ఎక్కి మహిళ పక్కనే కూర్చున్నాడు. ప్యాంట్ జిప్ తీసి యువతి దుస్తులపై వీర్యం చిమ్మాడు. ఈ చర్యతో భయంతో యువతి గట్టిగా కేకలు వేసింది. తోటి ప్రయాణికులు ఆ కామాంధున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు, మార్గమధ్యలో క్యాత్సంద్ర వద్ద బస్సు ఆపి స్థానిక పోలీసులకు అప్పగించారు. -
కలెక్టర్, ఎమ్మెల్యేతో యువతి వాగ్వాదం
తమిళనాడు: 30 సంవత్సరాలుగా తమ ఆదీనంలోని భూమిని 60 సంవత్సరాల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరిట పట్టా ఇవ్వడాన్ని తప్పుబడుతూ యువతి చంటి పాపతో వచ్చి కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్తో వాగ్వాదానికి దిగిన సంఘటన కలెక్టర్ కార్యాలయంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా విడయూర్ గ్రామానికి చెందిన గోవిందరాజ్కు అదే ప్రాంతంలో 30 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. సంబంధిత పొలంలో గోవిందరాజ్ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గోవిందరాజ్ పొలానికి సమీపంలోనే కుళ్లప్పరెడ్డి కుమారుడు ఏలుమలై, గోవిందరాజ్ సోదరుడు నాగరత్నంకు చెందిన వ్యవసాయ పొలం ఉంది. కుళ్లప్పరెడ్డి సుమారు 60 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈ క్రమంలో గత మూడు సంవత్సరాల క్రితం గోవిందరాజ్ అ«దీనంలోని వ్యవసాయ పొలాన్ని కుళ్లప్పరెడ్డి పేరిట పట్టాను నాగరత్నం మార్చినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గోవిందరాజ్ కుమార్తె అనిత పట్టా మారి్పడిపై గత రెండు సంవత్సరాలుగా వినతిపత్రాలు ఇస్తోంది. అయితే ఇంత వరకు ఫలితం లేదు. దీంతో సోమవారం ఉదయం గ్రీవెన్స్డేలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రతాప్, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ను కలిసి వినతి పత్రం సమరి్పంచారు. ఈ వినతి పత్రంపై తక్షణం విచారణ చేయాలని కలెక్టర్‡ ఆర్డీఓ రవిచంద్రన్ను ఆదేశించారు. అయితే కలెక్టర్ ఆదేశాలపై యువతి వాగ్వాదానికి దిగింది. ఇప్పటి వరకు 9 సార్లు వినతి పత్రం ఇచ్చామని, వినతి పత్రం ఇచ్చిన ప్రతి సారీ విచారణ అంటూనే కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించింది. న్యాయం జరిగేది ఎప్పుడూ అంటూ గట్టిగా కేకలు వేయడంతో గ్రీవెన్స్ హాలు నిశ్శబ్దంగా మారిపోయింది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పడంతో కలెక్టర్ యువతిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను పిలిపించి యువతిని బయటకు పంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. -
రూ.2 కోట్లు లంచం కేసులో కేంద్ర ప్రభుత్వ అధికారి అరెస్టు?
సాక్షి, చెన్నై: బాణసంచాలకు ఉపయోగించే పేలుడు పదార్థాల పరిశ్రమలు, విక్రయ దారుల నుంచి రూ. 2 కోట్లు లంచం పుచ్చుకున్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరిని సీబీఐ, అవినీతి నిరోధక విభాగం అధికారులు పథకం ప్రకారం సేలంలో అరెస్టు చేశారు. ఆయన్ని విచారిస్తున్నారు. వివరాలు..పేలుడు పదార్థాలకు అనుమతి వ్యవహారానికి సంబంధించిన విభాగంలో గణేష్ కీలక అధికారిగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఆయన గత రెండు రోజులుగా సేలంలోని ఓ హోటల్లో బస చేసి ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన బయటకు వెళ్లి రావడం జరుగుతూ వచ్చింది. ఈ వ్యవహారం సీబీఐ, అవినీతి నిరోధక విభాగం అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆదివారం అర్థరాత్రి వేళ ఆయన బస చేసిన హోటల్ గదిలో సోదాలు చేశారు. ఇక్కడ రూ. 2 కోట్లు పట్టుబడట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆయన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా దీపావళి మాముళ్ల వేటలో భాగంగా ఇక్కడి పరిశ్రమలు, విక్రయదారులను ఆయనకలుస్తూ వచ్చినట్టు, వారి నుంచి లంచంగా ఈ మొత్తం పుచ్చుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, చెక్పోస్టులు పరిసరాలలో ఏసీబీ రంగంలోకి దిగింది. దీపావళి మాముళ్ల వేట సాగే అవకాశాలతో ని«ఘాతో వ్యవహరిస్తున్నారు. ఈ దృష్ట్యా, ఈసారి అవినీతి నిరోధక శాఖకు ఏఏ అధికారి చిక్కబోతున్నాడో వేచిచూడాల్సిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వ అధికారి చిక్కడం చర్చకు దారి తీసింది. -
ఐపీఎస్ పూరన్ కుటుంబ సభ్యులకు రాహుల్ పరామర్శ
చండీగఢ్: హర్యానా కేడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాన్ కుమార్ ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చండీగఢ్లోని పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరేళ్ల నుంచి పురన్పై వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. డ్రామాలు ఆపి పూరన్ అంత్యక్రియలు నిర్వహించాలంటూ బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో ప్రపంచానికి తెలియాలని రాహుల్ అన్నారు. ఈ నెల 7న పూరన్కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా, ఉన్నతాధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమంటూ ఎనిమిది పేజీల సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాన్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశాల్లో ఉన్నారు. భర్త మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. భారత్కు పయనమయ్యారు.అయితే, తన భర్త మరణానికి కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ పురాన్ కుమార్ భార్య అమ్నీత్ పీ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా భర్త ఐపీఎస్ పురాన్ కుమార్ను పోలీస్ శాఖలో పనిచేసి రిటైరైన ఉన్నాతాధికారులు, పలువురు పనిచేస్తున్న వారు వేధింపులకు గురి చేయడం,అవమానించడంతో పాటు మానసిక హింసకు గురి చేశారని వాపోయారు. అందుకే ఆయన మరణించినా.. చండీగఢ్ పోలీసులు పట్టించుకోలేదని అమ్నీత్ పీ కుమార్ ఆరోపించారు. -
మావోయిస్టులకు భారీ దెబ్బ.. మల్లోజుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలింది. కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ సోను పోలీసులకు(Mallojula Surrender News) లొంగిపోయారు. గచ్చిరోలి(మహారాష్ట్ర)లో 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్బ్యూరో సభ్యుడిగా ఇయన ఇంతకాలం కొనసాగారు. అయితే.. ఇకపై పార్టీలో కొనసాగబోనని, అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు తాజాగా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదంటూ తాజాగా ఆయన లేఖ రాయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఆయన గతంలో రాసిన లేఖను మిగతా అగ్రనేతలైన హిడ్మా, దేవ్జీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా వేణుగోపాల్ 22 పేజీల సుదీర్ఘ లేఖను ఈ మధ్యే విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఆ లేఖలో సారాంశం ఇలా.. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యతవహిస్తూ పొలిట్బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నా. ఇంతనష్టానికి, ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగడానికి ఇక ఎంతమాత్రం అర్హుడిని కాదని భావిస్తున్నా. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైంది కాదని భావించవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని అనివార్యంగా చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. 28 ఏళ్లు కేంద్ర కమిటీ, 18 ఏళ్లు పొలిట్బ్యూరో సభ్యుడిగా పార్టీలో ఎన్నో లోపాలను గమనించాను. 1998 నుంచి ఉమ్మడి ఏపీలో దెబ్బతింటూ వచ్చాం. 2003లో ఉత్తర తెలంగాణ నుంచి బలగాలను దండకారణ్యానికి తరలించాం. 2005 నాటికి ఏపీలో పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. మన బలాన్ని ఎక్కువగా, ప్రత్యర్థి బలాన్ని తక్కువగా అంచనా వేయడం తప్పుడు నిర్ణయం. పార్టీ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆదివాసీ రైతులకు ప్రభుత్వాలు ఇచ్చే భూమి పట్టాలు వద్దన్నాం. దీనికి ప్రతిగా జనతన సర్కారే పట్టాలిస్తుందని చెప్పాం. కానీ ఆ పట్టాలకు విలువలేదని, రైతుల అవసరాలు తీర్చలేవని కేంద్ర కమిటీ గ్రహించలేకపోయింది. జనతన సర్కారు బడుల్లో చదువులకు కూడా విలువ లేకుండా పోయింది. చివరకు ప్రజలు ఆధార్కార్డులు తెచ్చుకోవడాన్నీ వ్యతిరేకించాం. ప్రజలు చాటుగా వెళ్లి వాటిని తెచ్చుకున్నారు. ఇలాంటి తప్పులు సరిదిద్దుకోవాలంటే ప్రజల మధ్యకు వెళ్లాలి. ఇప్పుడు ఉద్యమాన్ని కాపాడుకోవడం, కేడర్ను రక్షించుకోవడం కావాలి. అనవసర త్యాగాలకు అంతం పలుకుతూ నూతన పద్ధతుల్లో పురోగమిస్తే అంతిమ విజయం ప్రజలదే. ఈ లేఖ పూర్తిగా చదివి, సహచరులతో చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా’ అంటూ తోటి మావోయిస్టు నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.అయితే ఈ లేఖను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయుధాలను సరెండర్ చేయాలని ఆయన్ని ఆదేశించింది. ఈ లేఖల యుద్ధం కొనసాగుతున్న తరుణంలోనే ఆయన పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఆయన ఆయుధాలు వదిలేసినట్లు గచ్చిరోలి అధికారిక వర్గాలు ధృవీకరించాయి. -
ఎల్లో కవర్ల కలకలం.. అర్ధరాత్రి బీహార్లో పొలిటికల్ హైడ్రామా
బీహార్ రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన పరిణామాలు నిజంగానే హైడ్రామాను తలపించాయి. రాష్ట్రీయ జనతా దళ్(RJD) పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, వాళ్లకు సీల్డ్ కవర్ల అందజేత, కొద్దిగంటలకే తిరిగి వెనక్కి తీసుకోవడం.. తీవ్ర కలకలం రేపాయి. అధిష్టానం పెద్దల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. అసలేం జరిగిందంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం మహాఘట్ బంధన్లో సీట్ల సర్దుబాటు జరిగిపోయిందంటూ జాతీయ మీడియా చానెల్స్లో హడావిడి నడుస్తోంది. ఈ తరుణంలో సోమవారం ఢిల్లీలో ఐఆర్సీటీసీ కేసు కోర్టు విచారణ అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో సహా పాట్నాకు చేరుకున్నారు. అయితే కాసేపటికే ఆర్జేడీ శ్రేణులకు అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది(RJD Candidates). కాసేపటికి.. లోపలికి వెళ్లిన కొందరు.. నిమిషాల తర్వాత చేతుల్లో ఎల్లో కవర్లతో(RJD Yellow Covers Drama) బయటకు వచ్చి తమ వర్గీయులతో కోలాహలంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందులో వాళ్ల పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే పత్రాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం నడిచింది. అయితే.. కొద్దిసేపటికే లాలూ తనయుడు తేజస్వి యాదవ్, లాలూ నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే కవర్లు అందుకున్నవాళ్లకు మరోసారి ఫోన్లు వెళ్లాయి. కవర్లు తీసుకెళ్లినవాళ్లు.. అర్ధరాత్రి తిరిగి లాలూ నివాసానికి చేరి వాటిని అప్పగించారు. ఎల్లో కవర్లు అందుకున్నవాళ్లలో.. జేడీయూ నుంచి తాజాగా ఆర్జేడీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నాగేంద్ర కుమార్ సింగ్ అలియాస్ బోగో కూడా ఉన్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందనే దానిపై ఆర్జేడీ నేతలెవరూ స్పష్టత ఇవ్వలేదు. అయితే.. అష్రాఫ్ ఫాతిమా మాత్రం తాము ఎలాంటి కవర్లు అందుకోలేదని, అవి ఏఐ జనరేటెడ్ ఫొటోలు అని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. మహాఘట్ బంధన్లో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిందనేది తాజా సమాచారం. మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుందని, కాంగ్రెస్ 70 స్థానాల్లో, ముకేష్ సాన్హీ వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయింపు జరిగిందనేది ఆ కథనాల సారాంశం. బీహార్ ఫస్ట్ ఫేస్కు ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ నడుస్తోంది. నవంబర్ 6న పొలింగ్ జరుగుతుంది. రెండో దశ పోలింగ 11వ తేదీన జరుగుతుంది. నవంబర్ 14న కౌంటింగ్.. ఆరోజే ఫలితాలు వెల్లడించనున్నారు.ఇదీ చదవండి: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ -
వీడియో చూస్తే షాకే.. వామ్మో.. ఒక్కసారిగా 30 అడుగులు..!
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని బిల్ఖేరియాలో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డు సడన్గా 30 అడుగుల మేర కుంగిపోయింది. మండిదీప్ నుండి ఇంత్ఖేడి వెళ్లే రోడ్డులోని వంతెన సమీపంలో ఈ ఘటన జరగ్గా.. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ వంతెనను దశాబ్దం క్రితం నిర్మించారు.ఈ రహదారి.. మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MPRDC) పరిధిలోకి వస్తుంది. ఇండోర్, హోషంగాబాద్, జబల్పూర్, జైపూర్, మాండ్లా, సాగర్ వంటి ముఖ్యమైన మార్గాలను కలుపుతుంది. ఈ ఘటనతో రహదారుల నాణ్యతపై చర్చ నడుస్తోంది.రహదారి కూలిపోవడానికి గల కారణాన్ని పరిశోధించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక పరిశీలనలో రీఎన్ఫోర్స్డ్ ఎర్త్ (RE) గోడ కూలిపోవడం వల్ల జరిగిందని తెలుస్తోంది. దర్యాప్తు నివేదిక విడుదలైన తర్వాత ప్రమాదానికి గల కారణం స్పష్టమవుతుందని MPRDC డివిజనల్ మేనేజర్ సోనాల్ సిన్హా మీడియాకు తెలిపారు.#WATCH | Bhopal, Madhya Pradesh | A major section of the road near Bilkhiriya village collapsed. The road has been barricaded, and traffic has been diverted. (13.10) pic.twitter.com/mVI74tn8If— ANI (@ANI) October 13, 2025ఈ వంతెన 2013లో నిర్మించారు. అయితే, నిర్మాణ సంస్థ M/s ట్రాన్స్స్ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్ను 2020లో రద్దు చేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డు మార్గాన్ని అధికారికంగా ఏ సంస్థ కూడా పర్యవేక్షించలేదు. గతంలో, గ్వాలియర్లో 18 కోట్ల రూపాలయతో నిర్మించిన రోడ్డు ప్రారంభించిన 15 రోజులకే కుంగిపోయిన సంగతి తెలిసిందే. -
కొలిక్కి వచ్చిన మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాటు
కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాష్ట్రీయ జనతా దళ్(RJD) మిత్రపక్షం కోసం కాస్త దిగొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీహార్ ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. కోరుకున్న సీట్లకు కేటాయించడంతో మహాఘట్ బంధన్లో సీట్ల కేటాయింపు సస్పెన్స్కు దాదాపుగా తెర పడినట్లేనని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి(Bihar Seats Sharing). మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 144 స్థానాలకు పోటీ చేయాలని తొలుత భావించింది. అయితే సర్దుబాటు నేపథ్యంలో ఇప్పుడు 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అలాగే.. కాంగ్రెస్ పార్టీ తొలుత 61 స్థానాలను కేటాయిస్తారనే ప్రచారం జరగ్గా.. ఇప్పుడు 70 స్థానాల్లో పోటీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కూటమిలో భాగమైన ముకేష్ సాన్హీ వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షాలు మాత్రం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అని బహిరంగంగా చెప్పేశాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పోస్టుకు సంబంధించిన అంశమేదీ మహాఘట్ బంధన్లో చర్చకు రాలేదని సమాచారం. అంతకు ముందు..బీహార్లో ప్రతిపక్ష కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ 70 స్థానాలు తమకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఒకవైపు రాహుల్ గాంధీ సమక్షంలోనే తాను సీఎం అభ్యర్థినంటూ తేజస్వి యాదవ్ ప్రకటించినా.. సీట్ల డిమాండ్ను నేరవేర్చుకునేందుకే కాంగ్రెస్ ఆ అంశంపై సైలెంట్గా ఉంటూ వచ్చింది. ఇంకోవైపు.. బీహార్ మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకాన్ని ఇరకున పడేసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM), ఐపీ గుప్తా నేతృత్వంలోని ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ(IIP) విపక్షాలతో చేతులు కలిపాయి. దీంతో.. ఎనిమిది పార్టీలకు ఈ కూటమి విస్తరించింది. అదే సమయంలో వీఐపీ పార్టీ అధినేత ముకేశ్ సాహ్ని.. 50 స్థానాలు+ఉపముఖ్యమంత్రి డిమాండ్ చేయడంతో సీట్ల పంపకంలో జాప్యం జరిగింది. చివరకు 16 పార్టీలకు సాహ్ని ఒప్పుకోగా.. ఆర్జేడీ తన కోటా నుంచి జేఎంఎంకు, కాంగ్రెస్ తన కోటా నుంచి IIP పార్టీకి స్థానాలు కేటాయించేందుకు అంగీకరించడంతో.. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లైంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. మొత్తం 243 స్థానాలకుగానూ.. 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ కాగా.. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశలో నవంబర్ 6న, రెండో దశలో నవంబర్ 11న పోలింగ్ ఉంటుంది. ఓట్లు లెక్కించే తేదీ నవంబర్ 14. ఇదీ చదవండి: లాలూ కుటంబానికి భారీ షాక్ -
హిజాబ్ వివాదంతో స్కూల్కు సెలవు
కొచ్చి: కొచ్చిలోని పళ్లూరుత్తిలో ఒక క్రైస్తవ యాజమాన్యం నడుపుతున్న ప్రైవేట్ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని హిజాబ్ ధరించడంపై.. విద్యాసంస్థ యాజమాన్యానికి.. విద్యార్థిని తల్లిదండ్రులతో వివాదం తీవ్రమవడంతో రెండు రోజుల సెలవు ప్రకటించవలసి వచ్చింది. ఈ విద్యార్థిని తల్లిదండ్రులకు సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఇస్లామిస్ట్ (ఎస్డీపీఐ) అనుకూల రాజకీయ సంస్థ మద్దతు ఉందని, ఆ పార్టీ సభ్యులు ఎక్కువగా క్రైస్తవ సన్యాసినులైన విద్యాసంస్థ అధికారులతో దురుసుగా ప్రవర్తించారని పాఠశాల పీటీఏ అధికారి ఒకరు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఎస్డీపీఐ ఇంకా స్పందించలేదు. సెయింట్ రీటాస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ హెలెనా ఆర్సీ విడుదల చేసిన ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ వివాదం బహిర్గతమైంది. ఈ లేఖలో సోమ, మంగళవారాల్లో పాఠశాలకు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. నిర్ణీత యూనిఫాం లేకుండా వచ్చిన విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు.. పాఠశాలకు సంబంధం లేని వ్యక్తుల ఒత్తిడితో మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న కొంతమంది విద్యార్థులు, సిబ్బంది సెలవు కావాలని కోరారని ప్రిన్సిపాల్ లేఖలో పేర్కొన్నారు. దీంతో పేరెంట్ టీచర్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులతో సంప్రదించాక.. అక్టోబర్ 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించాలని నిర్ణయించినట్లు ఆ లేఖలో తెలిపారు. ‘దేశం హామీ ఇచ్చిన స్వేచ్ఛకు, పాఠశాల యాజమాన్యాల హక్కులకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. మీ నిరంతర సహకారాన్ని ఆశిస్తున్నాం’.. అని అందులో పేర్కొన్నారు. భయాందోళనలు సృష్టించారు. పీటీఏ సభ్యుడు జోషి కైతవలప్పిల్ పీటీఐతో మాట్లాడుతూ, పాఠశాల 30 సంవత్సరాలుగా ఒకే విధమైన డ్రెస్ కోడ్ను అనుసరిస్తోందని, అన్ని వర్గాల విద్యార్థులు దీనిని పాటించారని స్పష్టం చేశారు. ‘అయితే, ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె తలపై దుపట్టా కప్పుకుని పంపుతామని పట్టుబట్టారు. ఇటీవల, వారు ఒక గుంపుతో పాఠశాలకు వచ్చి రచ్చ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులలో భయాందోళనలు సృష్టించారు. అందుకే రెండు రోజుల సెలవు ప్రకటించాలని నిర్ణయించుకున్నాం’.. అని వివరించారు. సిస్టర్స్తో అనుచిత ప్రవర్తన పాఠశాల యాజమాన్యం పోలీసు రక్షణ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించి, అనుకూల ఉత్తర్వులు పొందిందని కైతవలప్పిల్ తెలిపారు. ‘పాఠశాలకు వచ్చిన వ్యక్తులు తాము ఎస్డీపీఐకి చెందినవారిమని చెప్పుకున్నారు, సిస్టర్స్తో సరిగ్గా ప్రవర్తించలేదు’.. అని ఆయన ఆరోపించారు. కాగా, విద్యార్థిని తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాలలో చేరిందని చెప్పారు. ‘ఆమె తలపై దుపట్టా ధరించడం వల్ల సమానత్వం దెబ్బ తింటుందని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. ఇంతకుముందు, ఆమెను తరగతి గదిలో దుపట్టా తీసివేయమని అడిగేవారు. కానీ ఇప్పుడు వారు పాఠశాల గేటు వద్ద కూడా అభ్యంతరం చెప్పడం ప్రారంభించారు’.. అన్నారు. దీనిపై జిల్లా విద్యాధికారికి, సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ‘తలపై దుపట్టా కప్పుకోవడానికి అనుమతించకపోతే మా కుమార్తెను మరో పాఠశాలలో చేర్చుతాం.’అని స్పష్టం చేశారు. -
పాలియేటివ్ కేర్పై మార్గదర్శకాల అమలు విధానాన్ని తెలపండి
న్యూఢిల్లీ: పాలియేటివ్ కేర్పై 2017లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై వివరాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు ఇచి్చంది. కేసు తదుపరి విచారణను నవంబర్ 25కు వాయిదా వేసింది. టర్మీనల్ ఇల్నెస్ (వ్యాధి)తో బాధపడుతున్న రోగులకు జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పాలియేటివ్ కేర్ విధానాన్ని వర్తింపజేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రానికి ఈ ఆదేశాలను జారీ చేసింది. కేంద్రం మాత్రమే కాకుండా రాష్ట్రాల నుండి కూడా సమగ్ర సమాచారం సేకరించి తెలియజేయాలని కేంద్రం తరఫు హాజరైన అదనపు సాలిసిటర్ జనరల్, సీనియర్ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశాలిచి్చంది. పాలియేటివ్ కేర్: తీవ్రమైన లేదా చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అందించే ప్రత్యేక వైద్య సంరక్షణ విధానం. టర్మీనల్ ఇల్నెస్ రోగి: నయంకాని వ్యాధి లేదా వైద్య పరిస్థితితో బాధపడుతూ, చివరికి మరణానికి దారితీసే అవకాశం ఉన్న వ్యక్తి. -
ముళ్ల పెరియార్ డ్యామ్ పటిష్టతకు మార్గదర్శకాలు అవసరం: సుప్రీం
న్యూఢిల్లీ: కేరళలోని 130 ఏళ్ల ముళ్ల పెరియార్ డ్యామ్ భద్రత, నిర్మాణ స్థిరత్వంపై ఉన్న ఆందోళనల నేపథ్యంలో.. ఈ డ్యామ్ను పటిష్టం, బలోపేతం చేయడానికి కొన్ని మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఈ విషయమై కేంద్రం, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు అలాగే జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ)లకు నోటీసులు జారీ చేసింది. పాత డ్యామ్కు ప్రత్యామ్నాయంగా కొత్త డ్యామ్ నిర్మించాలని కోరుతూ సేవ్ కేరళా బ్రిగేడ్’అనే ఎన్జీఓ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై (పిల్) చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తాజా నోటీసులు జారీ చేసింది. డ్యామ్ భద్రతా అంశాలను అంచనా వేయడానికి, అలాగే కొత్త నిర్మాణం అవకాశాలను పరిశీలించడానికి నిపుణుల బృందం ద్వారా సమీక్ష చేయించాలని కూడా పిల్ కోరడం గమనార్హం. 1895లో కేరళ ఐడుక్కీ జిల్లాలోని పెరియార్ నది మీద ముళ్ల పెరియార్ డ్యామ్ నిర్మాణం జరిగింది. లీజ్ అగ్రిమెంట్ ప్రాతిపదికన ఈ డ్యామ్ను తమిళనాడు రాష్ట్రం నిర్వహిస్తోంది. -
చీకటి ‘వేదం’!
43 ఏళ్ల చీకటి తర్వాత వెలుగు.. కానీ అంతలోనే కారుచీకట్లు! నిర్దోషిగా విడుదలైన ఆ అమాయకుడికి ఆ ఆనందం మిగల్లేదు. వేదనల ‘వేదం’ విషాదానికి అంతేలేదు. ఇది న్యాయమా? మానవత్వమా? అంటే సమాధానాలే లేవు. కళ్ల ముందు రెండు తరాలు గడిచిపోయాయి. కానీ ఆయన మాత్రం ఏం మారలేదు. చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా (43 ఏళ్లు) జైలు గోడల మధ్య నలిగిపోయిన సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం (64), ఎట్టకేలకు న్యాయం గెలిచి, నిర్దోషిగా విడుదలయ్యాడు. జీవితం, స్వేచ్ఛ, కుటుంబం.. ఈ బంధాల రుచి మళ్లీ చూడబోతున్నానని ఆశపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. అమెరికా చట్టం అతన్ని మళ్లీ బందీగా మార్చింది.అప్పుడు తప్పుడు శిక్ష.. ఇప్పుడు దేశ బహిష్కరణ ముప్పు చేయని హత్య కేసులో నాలుగు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత, సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం ఎంతో కాలంగా ఎదురుచూసిన స్వేచ్ఛకు బదులుగా, కొత్త కష్టాలు ఎదురయ్యాయి. పెద్దగా పరిచయం లేని భారతదేశ బహిష్కరణ ముప్పు అతనికి ఏర్పడింది. తనపై ఉన్న హత్య కేసు శిక్షను రద్దు చేయడంతో, అక్టోబర్ 3న పెన్సిల్వేనియాలోని హంటింగ్డన్ స్టేట్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్ నుండి విడుదలైన 64 ఏళ్ల సుబు వేదంను, వెంటనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులోకి తీసుకుంది. చేయని హత్యకు చెరసాలలో మగ్గి.. కేవలం తొమ్మిది నెలల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వచి్చన వేదం, శాశ్వత ఆమెరికా నివాసి. కానీ 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన 19 ఏళ్ల థామస్ కిన్సర్ కాలి్చవేత కేసులో.. దాదాపు మొత్తం వయోజన జీవితాన్ని జైలులోనే గడిపాడు. స్టేట్ కాలేజ్ సమీపంలోని సింక్హోల్లో కిన్సర్ మృతదేహం లభించింది, అతనితో చివరిగా కనిపించిన వ్యక్తి వేదం (కిన్సర్ మాజీ హైసూ్కల్ సహ విద్యారి్థ) అని పోలీసులు ఆరోపించారు. వేదం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అతన్ని 1983, 1988లలో రెండుసార్లు దోషిగా నిర్ధారించారు. పెరోల్ కూడా లేకుండా జీవిత ఖైదు విధించారు. శిక్ష రద్దు, ఎఫ్బీఐ నివేదిక ఆగస్ట్ 2025లో, ఒక సెంటర్ కౌంటీ న్యాయమూర్తి అతని శిక్షను రద్దు చేస్తూ, ప్రాసిక్యూటర్లు చట్టవిరుద్ధంగా ఒక ఎఫ్బీఐ నివేదికను డిఫెన్స్ న్యాయవాదుల నుండి దాచిపెట్టారని తీర్పు చెప్పారు. ఈ తీర్పు తరువాత, సెంటర్ కౌంటీ జిల్లా అటార్నీ బెర్నీ కాంటోర్నా అన్ని అభియోగాలను అధికారికంగా కొట్టివేశారు. ‘కాలం గడిచిపోవడం, కీలక సాక్షుల నష్టం, వేదం దశాబ్దాల జైలు శిక్షను కారణాలుగా’ పేర్కొన్నట్లు ‘ది ఫిలడెలి్ఫయా ఎంక్వైరర్’ వెల్లడించింది. సుదీర్ఘ అన్యాయం ‘వేదం.. పెన్సిల్వేనియా చరిత్రలో సుదీర్ఘకాలం అన్యాయంగా శిక్షకు గురైన వ్యక్తిగా, అమెరికాలో అత్యధిక కాలం శిక్ష అనుభవించిన వారిలో ఒకరిగా నిలబెట్టింది. ‘వేదం.. తన జీవితంలో అత్యంత విలువైన నాలుగు దశాబ్దాల కాలాన్ని తప్పుడు శిక్ష వల్ల కోల్పోయాడు. ఇప్పుడాయన వయసు 64. ఈ దేశంలోనే ఆయన సోదరి, మేనకోడళ్లు, మనవరాళ్లు.. కుటుంబ బంధాలు అన్నీ ఉన్నాయి. ఏ బంధుత్వం, ఏ పరిచయం లేని దేశానికి, తను ఏమాత్రం తెలియని భారత్కు పంపాలని నిర్ణయించడం ఏం న్యాయం?’.. అని ఆయన న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. చీకటిలోనూ అక్షర దీపం సుబు తన జైలు జీవితాన్ని దుఃఖంతో ముగించలేదు. ఆయన తన చుట్టూ ఉన్న చీకటిలో జ్ఞాన దీపాలను వెలిగించారు. జైలులో ఖైదీల కోసం అక్షరాస్యత తరగతులు, డిప్లొమా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు డిగ్రీలు, 4.0 జీపీఏతో ఎంబీఏ కూడా పూర్తి చేసి, 150 ఏళ్ల జైలు చరిత్రలోనే అరుదైన ఖైదీగా నిలిచారు. మా పోరాటం మానవత్వం కోసమే.. సుబు మేనకోడలు జోయ్ మిల్లర్ వేదం మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. ‘43 ఏళ్ల పాటు జైలులో బంధించి వేదం జీవితాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు, ఆయనను ప్రేమించే వారందరికీ దూరంగా, ఏమీ తెలియని ప్రపంచానికి పంపడం అనేది, ఆ అన్యాయాన్ని మరింత పెంచడమే. వేదం తల్లిదండ్రులు ఆయన్ని చూసేందుకు ఏళ్ల తరబడి జైలుకు వచ్చి కన్నుమూశారు. దయచేసి, మా కుటుంబాన్ని ఇకనైనా కలవనివ్వండి. ఈ పోరాటం చట్టం గురించి కాదు... మానవత్వం కోసం’.. అని కన్నీటిపర్యంతమయ్యారు. తప్పుడు శిక్ష పడిన ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం, కుటుంబంతో కలవడం కోసం చేస్తున్న ఈ ఆఖరి పోరాటానికి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. -
ఐదేళ్లు.. 3.63 లక్షల కిడ్నీ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ, కేన్సర్, గుండె జబ్బులకు సంబంధించిన కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో జిల్లాలలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఈ వ్యాధులకు సంబంధించిన నమోదైన కేసులు, జరిగిన చికిత్సలు, అయిన ఖర్చు చూసి ఆరోగ్యశాఖ కూడా ఆందోళన చెందుతోంది. 13 వ్యాధులకు సంబంధించి ఐదేళ్లలో ఆరోగ్య శ్రీ కింద నమోదైన కేసులు ఏకంగా 12.59 లక్షలు ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధులకు సగటున ప్రభుత్వం నెలకు ఆస్పత్రులకు చెల్లించిన మొత్తం రూ.50 కోట్లు. అంటే ఐదేళ్లలో ఏకంగా రూ.3,000 కోట్లు ఈ వ్యాధుల చికిత్సలకు మాత్రమే ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద చెల్లించినట్లు లెక్క తేల్చారు. ఇందులో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 25 కి.మీ.పరిధిలో ఓ డయాలసిస్ కేంద్రంరాష్ట్రంలో 2020 నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు ఆరోగ్యశ్రీ కింద 12 వ్యాధులకు సంబంధించి 12.59లక్షల కేసులు నమోదు కాగా, అందులో అత్యధికంగా మూత్రపిండాలకు సంబంధించి 3,63,197 కేసులు నమోదయ్యాయి. వీటిలో 80% డయాలసిస్ కేసులే కావడం గమనార్హం. రాష్ట్రంలో 102 ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లు ఉండగా, పెరుగుతున్న రోగులకు ఈ కేంద్రాలు సరిపోవడం లేదు. దీంతో జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లోని డయాలసిస్ సెంటర్లను రోగులు ఆశ్రయిస్తున్నారు.ఈ పరిస్థితిని సమీక్షించిన మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాల్లో డయాలసిస్ సెంటర్ల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించారు. ఎక్కడి నుంచైనా 25 కిలోమీటర్ల పరిధిలో ఓ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు ఆస్పత్రులకు రోగుల తాకిడిని నిరోధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల తరువాత అత్యంత ఆందోళన కలిగించే వ్యాధిగా కేన్సర్ను గుర్తించారు. గత ఐదేళ్లలో కేన్సర్ సంబంధ వ్యాధులతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్న వారి సంఖ్య 3,06,702గా గుర్తించారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎంజీఎం ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి ఒక్కటే ఉంది.ఉస్మానియా, గాం«దీ, ఇతర జిల్లా ఆస్పత్రుల్లో కేన్సర్కు మందులు తప్ప పూర్తిస్థాయి చికిత్స అందించే సౌకర్యాలు లేవు. నిమ్స్తోపాటు ప్రైవేటు రంగంలో కేన్సర్ చికిత్స అత్యంత ఖరీదైనదిగా మారింది. ఆరోగ్యశ్రీ కింద కేన్సర్ వ్యాధికి చికిత్స లభిస్తుండటంతో జిల్లాల్లోని ఆస్పత్రులలో వైద్యం పొందుతున్నారు. ప్రైవేటు బోధనాస్పత్రులు కేన్సర్కు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తూ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. అంకాలజీ విభాగాన్ని ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలపై నివేదిక అందజేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. గుండె, ఆర్థోపెడిక్ కూడా⇒ కిడ్నీ, కేన్సర్ తరువాత అధికంగా నమోదవుతున్న కేసుల్లో ఆర్థోపెడిక్ మూడో స్థానంలో ఉంది. ప్రమాదాలు సంభవించినప్పుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయేవారు కొందరైతే.. కాళ్లు, చేతులు విరిగి అంగ వికలులుగా మారేవారు మరికొందరు. ఈ ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద నమోదైన ఆర్థోపెడిక్ కేసులు 1,91,852. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 లోపే ట్రామా కేర్ సెంటర్లు ఉండగా, మరో 74 ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.త్వరలోనే వీటిని ఏర్పాటుచేసేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆమోదం తెలిపారు. అలాగే గుండె సంబంధ వ్యాధుల కేసులు కూడా 1,45,814 నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్డియాలజీ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. 2డీ ఈకో, ఆంజియోగ్రామ్, స్టెంట్స్ వేసే సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇవి కాకుండా ఐదేళ్లలో జనరల్ మెడిసిన్లో 73,697 కేసులు, ఆప్తల్మాలజీలో 57,639 కేసులు, న్యూరోలో 40,667 కేసులు, జనరల్ సర్జరీలో 31,214 కేసులు, పీడియాట్రిక్స్లో 28,924, గైనకాలజీలో 9,517 కేసులు, ఈఎన్టీలో 7,251 కేసులు, గ్రాస్ట్రో ఎంటరాలజీ కింద 1,636, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లో 1,272 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధులకు వైద్య సౌకర్యాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ‘సాక్షి’కి తెలిపారు. -
కర్ణాటక ఓటర్ల జాబితా మోసాలపైసిట్ ఏర్పాటుకు సుప్రీం నో
న్యూఢిల్లీ: బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ‘మేము పిటిషనర్ తరఫు వాదనలు విన్నాం. ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్)గా దాఖలైన ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము. పిటిషనర్ కావాలంటే ఎన్నికల సంఘం ముందు తన అభ్యర్థనను ఉంచవచ్చు’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తమ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది రోహిత్ పాండే చేసిన అభ్యర్థనను సైతం ధర్మాసనం త్రోసిపుచి్చంది. ఇలాంటి సందర్భాల్లో తగిన న్యాయ మార్గాలను అనుసరించవచ్చని సుప్రీం సూచించింది. -
రాజస్తాన్లో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఆర్మీ మేజర్ కన్నుమూత
జైసల్మీర్: రాజస్తాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీకి చెందిన ఒక అధికారి చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన మేజర్ టీసీ భరద్వాజ్(33) స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు అని అధికారులు తెలిపారు. ఈ ఘటన జైసల్మీర్ జిల్లాలోని గమ్నే వాలా గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. రామ్గఢ్ వైపు నుంచి లొంగెవాలా వైపు వెళ్తున్న ఆర్మీ జిప్సీ వాహనం మూలమలుపులో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో లెఫ్టినెంట్ కల్నల్, ముగ్గురు మేజర్ స్థాయి అధికారులు, డ్రైవర్కు గాయాలయ్యాయి. వెంటనే వీరిని రామ్గఢ్ ఆస్పత్రికి తరలించారు. భరద్వాజ్ అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్షతగాత్రులైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రశాంత్ రాయ్(33), మేజర్ అమిత్, మేజర్ ప్రాచీ శుక్లా, డ్రైవర్ జవాన్ నసీరుద్దీన్లను ప్రాథమిక చికిత్స అనంతరం జైసల్మీర్, జోధ్పూర్లలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మేజర్ ప్రాచీ శుక్లా తలకు, మేజర్ అమిత్ కుడి కన్ను వద్ద తీవ్ర గాయాలైనట్లు తనొత్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మేజర్ భరద్వాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆర్మీకి అప్పగించారు. -
బందీల విడుదలను స్వాగతిస్తున్నాం: మోదీ
న్యూఢిల్లీ: గాజాలో బందీలుగా ఉన్న మొత్తం 20 మందిని హమాస్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు నిజాయితీతో సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న బందీలందరి విడుదలను స్వాగతిస్తున్నాం. వారి స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి, అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన శాంతి ప్రయత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ బలమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది’అని ప్రధాని మోదీ సోమవారం ఎక్స్లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలకు తాము తోడుగా ఉంటామన్నారు. -
సంబంధాల బలోపేతానికి భారత్–కెనడా రోడ్మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, కెనడాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నాయి. సోమవారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్లతో చర్చలు జరిపారు. 2023లో సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యానంతరం రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఆమె భారత్కు రావడం తెల్సిందే. రెండు దేశాల వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, ప్రపంచ ఆర్థిక పరిణామాల ఆధారంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సాధ్యమైనంత త్వరగా మంత్రుల స్థాయి చర్చలు ప్రారంభించాలని జై శంకర్, అనితా ఆనంద్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కెనడా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటు వాదులు సాగిస్తున్న కార్యకలాపాలపై జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పక్షాలు పరస్పర ఆందోళనలు, సున్నితమైన అంశాలపై నిర్మాణాత్మక, సమతుల్య భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘భారత్, కెనడా ప్రధాన మంత్రులు నాలుగు నెలల క్రితం రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఊపును తెచ్చేందుకు ప్రాధాన్యతలను నిర్దేశించారు. వాటికి అనుగుణంగా, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటూ పరస్పర గౌరవం ఆధారంగా కొత్త రోడ్మ్యాప్పై ఏకాభిప్రాయానికి చేరుకున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా యురేనియం సరఫరాదారులతో భారత అణు ఇంధన సంస్థ అధికారులు జరుపుతున్న చర్చలను ఇద్దరు నేతలు స్వాగతించారు. అంతకు ముందు, అనితా ఆనంద్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, వ్యవసాయం, ప్రజల మధ్య సహకారం పెంచుకునే అంశాలను మంత్రి అనితా ఆనంద్తో చర్చించినట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. కెనడా ప్రధాని కార్నీతో చర్చలకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానన్నారు. -
అసాంక్రమిక వ్యాధులతో ముప్పే
అసాంక్రమిక వ్యాధులు మానవాళి బతుకును భారంగా మారుస్తున్నాయి. జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. అకాల మరణాలపాలు చేస్తున్నాయి. మనుషులను రోగ పీడితులుగా, విగత జీవులుగా మార్చటంలో అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీలు) పాత్ర మూడింట రెండు వంతులని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) తాజా అధ్యయనం వెల్లడించింది.1990లలో ప్రపంచ ప్రజల మధ్యస్థ ఆయుర్దాయం (మీన్ ఏజ్) 46.8 ఏళ్లు. 2023 నాటికి అది 63.4 ఏళ్లకు పెరిగింది. ఇది మానవ జాతి సాధించిన గొప్ప విజయాల్లో అత్యంత ప్రధానమైనది. అయినప్పటికీ హార్ట్ స్ట్రోక్, టైప్ 2 మధుమేహం, ఐహెచ్డీ (గుండెకు తగినంత రక్తం అందకపోవటాన్ని ఇస్కీమిక్ గుండె వ్యాధి అంటారు) వంటి అసాంక్రమిక వ్యాధుల బారిన పడిన మనుషుల్లో మూడింట రెండొంతుల మంది చనిపోవటమో, తీవ్రంగా జబ్బుపడి జీవన నాణ్యతను కోల్పోవటమో జరుగుతోంది. అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ తాజా సంచికలో ప్రచురితమైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనం రోగగ్రస్త జీవన నష్టాల తీవ్రతను తెలిపే ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది.వాటిలో మార్పు తేగలిగితే..: పురుషుల మధ్యస్థ ఆయుర్దాయం 45.4 ఏళ్ల నుంచి 61.2 ఏళ్లకు, మహిళల ఆయుర్దాయం 48.5 నుంచి 65.9 ఏళ్లకు పెరిగింది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, అధిక బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) వంటి కొన్ని ప్రధాన ఆరోగ్య సూచికల్లో మార్పు తేగలిగితే సగానికి సగం అకాల మరణాలు, రోగగ్రస్త జీవనం నుంచి మనుషులను రక్షించవచ్చని పరిశోధకుల అంచనా. భారీగా తగ్గిన జీవన నష్టం..: అకాల మరణం వల్ల కోల్పోయిన సంవత్సరాలను ‘జీవిత నష్ట సంవత్సరాలు (ఇయర్స్ ఆఫ్ లైఫ్ లాస్ట్–వైఎల్ఎల్)’ పేరిట గణాంక శాస్త్రవేత్తలు లెక్కిస్తారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, టీబీ, పౌష్టికాహార లోపాలు, ఇతర సాంక్రమిక వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాలు గత 30 ఏళ్లలో గణనీయంగా తగ్గాయని పరిశోధకులు తెలిపారు.5 ఏళ్లలోపు పిల్లలే!2023లో ప్రపంచవ్యాప్తంగా 6.01 కోట్ల మంది మృత్యువాతపడ్డారు. అందులో 46.7 లక్షల మంది ఐదేళ్ల లోపు పిల్లలు! 1950 తర్వాత జనాభా సంఖ్య, వృద్ధుల శాతం పెరుగుతున్న నేపథ్యంలో 1950–2023 మధ్య కాలంలో ప్రపంచ సగటు మరణాల సంఖ్య 35.2% పెరిగింది. అయితే, ఇదే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలు, వయసుల వ్యత్యాసాలను ప్రామాణీకరించి శాస్త్రీయంగా విశ్లేషించి చూస్తే.. మరణాల రేటు 66.6% తగ్గటం శుభపరిణామమని ఈ అధ్యయనం వెల్లడించింది.12.6% తగ్గిన వ్యాధుల భారంప్రపంచవ్యాప్తంగా 204 దేశాల్లో ప్రజలను వయసు, లింగం, సకల వ్యాధి కారక మరణాలు, ఆయుర్దాయం తదితర అంశాలను పరిశీలిస్తే గతంలో కన్నా ఆరోగ్యస్థితి మెరుగ్గానే ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. వయసు– ప్రామాణిక వైకల్యం సర్దుబాటు చేసిన జీవిత సంవత్సరం (డిజŒ అబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్–డాలీ) రేటు అనేది యావత్ జనాభాపై ఉన్న వ్యాధి భారాన్ని లెక్కించడానికి ఉపయోగపడే ఒక కొలబద్ద. వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో భిన్న వయస్కులతో కూడిన జనాభా ఉంటారు. వారి అందరిపై గల వ్యాధుల భారాన్ని సముచితంగా పోల్చి విశ్లేషించే క్రమంలో ఎదురయ్యే వ్యత్యాసాలను గణాంకపరంగా సర్దుబాటు చేయటానికి ఉపయోగపడే సంవత్సరాల సంఖ్యను ‘డాలీ’లలో లెక్కిస్తారు. 2010–2023 మధ్యలో వ్యాధుల భారం 12.6% డాలీల మేరకు తగ్గాయని అధ్యయనం పేర్కొంది.పెరిగిన మానసిక రుగ్మతలుమానసిక రుగ్మతలు ముఖ్యంగా మనో వ్యాకులత, కుంగుబాటు వంటివి 2010 తర్వాత భారీగా పెరిగాయని ఈ అధ్యయనం తెలిపింది. వ్యాధుల భారాన్ని పెంచుతున్న 26 అంశాల్లో సిర్రోరిస్, క్రానిక్ లివర్ డిసీజ్, అల్జీమర్స్ (మతిమరుపు) వంటివి ఉన్నాయి. 2023లో గుర్తించిన అత్యధిక హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్లలో ఉన్న కొన్ని ప్రధానాంశాలు.. అధిక రక్తపోటు, గాలిలో అధికంగా ఉండే సూక్ష్మ కణాలు, అధిక గ్లూకోజ్, ధూమపానం, అధిక బీఎంఐ, తక్కువ బరువు ఉండే శిశు జననాలు, నెలలు నిండకముందు జన్మించే పిల్లల సంఖ్య.నివారించదగిన జబ్బులపై దృష్టియూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) డైరెక్టర్ డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రేతో పాటు మరో 16,500 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య, పుట్టుకొస్తున్న కొత్త సమస్యలు ప్రపంచ ఆరోగ్య సవాళ్లుగా మారుతున్నాయని ముర్రే వ్యాఖ్యానించారు. ప్రపంచ జనాభాపై జబ్బుల భారం గురించి తాజా అధ్యయనం వెల్లడించిన వాస్తవ గణాంకాలు పాలకులకు మేలైన ప్రజారోగ్య విధానాల రూపకల్పనకు మేలుకొలుపు కావాలన్నారు. -
చెట్లకు సెల్ఫోన్లు కడుతున్నారు.. ఎందుకంటే?
ఆ ఊర్లో చెట్లకు సెల్ఫోన్లు కాస్తాయి.. ఏంటి వింతగా అనిపించిందా! ఇందులో కొంచెం చేంజ్.. ఆ ఊర్లో చెట్లకు సెల్ఫోన్లు కడతారు. ఇలా ఎందుకు చేస్తారని ఆశ్చర్యపోతున్నారా? ఓటీపీ కోసం అని చెబితే నమ్ముతారా? అవును ఇది అక్షరాలా నిజం. ఓటీపీ కోసం ఆ ఊరి ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. అంతగా ఎందుకు కష్టపడుతున్నారంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కోసం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందాం పదండి.అరగంట నడిచి కొండపైకి ఎక్కుతారు. తర్వాత సెల్ఫోన్లను చెట్లకు కట్టేసి దానికి వచ్చే ఓటీపీ కోసం ఎండలో ఎదురు చూస్తుంటారు. మహారాష్ట్రలోని ధడ్గావ్ తాలూకా ఖార్డే ఖుర్ద్ గ్రామంలోని (Kharde Khurd village) మహిళలకు ఈ తంతు నిత్యకృత్యంగా మారింది. సెల్ఫోన్లో వచ్చే ఒకే ఒక సిగ్నల్ బార్ కోసం మరాఠా మహిళలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్రలోని చాలా గిరిజన ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పేర్కొంది.లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. లబ్ధిదారులు రెండు నెలల్లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గడువు విధించింది. దీంతో మహిళలు కేవైసీ పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సెల్ఫోన్ సిగ్నల్ (Cell Phone Signal) లేక కష్టాలు పడాల్సివస్తోంది. రోజంతా కష్టపడినా వంద మందిలో నలుగురైదురికి మాత్రమే కేవైసీ పూర్తవుతోంది.మహిళల అవస్థలుఖార్డే ఖుర్ద్ గ్రామ మహిళలకు ఉల్గులన్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సహాయం చేస్తోంది. దగ్గరలోని కొండగుట్టపై శిబిరం ఏర్పాటు చేసి కేవైసీ చేయిస్తోంది. "మేము ఇక్కడ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మొబైల్ డేటాను పట్టుకునే ఏకైక ప్రదేశం ఇదే" అని ఉల్గులన్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు రాకేష్ పవారా అన్నారు. అలాగే కొండపైకి చేరుకోవడానికి మహిళలు అవస్థలు పడాల్సి వస్తోందని తెలిపారు. మరోవైపు కేవైసీ పూర్తి చేసిన అర్హులైన మహిళలకు మాత్రమే లడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇబ్బందులు ఉన్నాయి.. కానీఈ-కేవైసీ పూర్తి చేయాల్సిందేనని, ఇందులో మరో మాటకు తావులేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. పుణేలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "ధృవీకరించబడిన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కేవైసీ నమోదులో ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు, కానీ ప్రత్యామ్నాయం లేదు. అవసరమైతే గడువును పొడిగించవచ్చు, కానీ పూర్తి చేయడం తప్పనిసర''ని పేర్కొన్నారు.బలహీనంగా కనెక్టివిటీప్రభుత్వం విధించిన గడువు నవంబర్ 15తో ముగుస్తుంది. అయితే ఇంటర్నెట్ నెట్వర్క్ సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కేవైసీ పూర్తిచేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. ధడ్గావ్ తాలూకా తహసీల్దార్ జ్ఞానేశ్వర్ సప్కలే కూడా దీన్ని ఒప్పుకున్నారు. "మొబైల్ టవర్లు నాలుగైదు నెలల క్రితం వచ్చాయి. కానీ కనెక్టివిటీ ఇప్పటికీ బలహీనంగా ఉంది. సమస్యను పరిష్కరించమని ఆపరేటర్లను కోరాము. సాధారణ సేవా కేంద్రాలు, ఆధార్ ఆపరేటర్ల ద్వారా మహిళలకు సహాయం చేస్తున్నాము" అని ఆయన అన్నారు.చదవండి: ఖరీదైన స్టంట్.. ట్విస్ట్ అదిరింది! సమస్యను పరిష్కారిస్తాంలడ్కీ బహిన్ యోజన కింద మహిళలకు సెప్టెంబర్లో ఆర్థిక సహాయం చేశామని, లబ్ధిదారులు మరో రెండు నెలల్లోపు ఈ- కేవైసీ పూర్తి చేయాలని మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అదితి తత్కరే (Aditi Tatkare) ఇటీవల ప్రకటించారు. ఇంటెర్నెట్, ఆధార్ సమస్యలతో కేవైసీ ఆలస్యమవుతోందని మహిళలు వాపోతున్నారు. సేవా కేంద్రాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ, డేటా సమస్యలను పరిష్కరించడానికి తన విభాగం కృషి చేస్తోందని తత్కరే హామీ ఇచ్చారు. లడ్కి బహిన్ యోజన కింద 2.5 కోట్లకు పైగా మహిళలు నమోదు చేసుకున్నారని తెలిపారు. -
భర్త క్షేమం కోరి కర్వా చౌత్ ఉపవాసం ఉంటే..పాపం విధి మరోలా..
"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు" అన్న పాటలానే జీవితం ఉంటుంది. అప్పటి వరకు మనతో ఆడుతూ పాడుతూ సందడి చేసినవాళ్లు హఠాత్తుగా మనల్ని వదిలేసి వెళ్లిపోతే కచ్చితంగా ఠక్కున మన ఘంటసాలగారు పాడిన పాటల మదిలోకి వచ్చేస్తుంది. మనం ఒకటి అనుకుని సరదాగా గడిపితే విధి మరోలా మన కథ రాసేస్తుంటుంది. అలాంటి విషాద ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర సంఘటన పంజాబ్లో జరిగింది. పంజాబ్లోని బర్నాలాలో కర్వాచౌత్ వేడుకల సందర్భంగా తన భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంది 59 ఏళ్ల ఆశా రాణి. దక్షిణ భారతదేశంలో జరుపుకునే అట్లతద్ది మాదిరిగా జరుపుకునే పండుగే ఈ కర్వా చౌత్. అయితే ఈ కర్వాచౌత్ పండుగలో ఉపవాస విరమణ భర్తచేతుల మీదుగా జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆశారాణి అనే మహిళ కూడా భర్త క్షేమం కోరి ఉపవాసం ఉంది. అయితే ఈ వేడుకను ఆ రోజు(శుక్రవారం) సాయంత్రం స్నేహితుల ఇంటిలో జరుపుకోవాలని భావించి మనవరాలు, భర్తతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ చంద్రుడి రాకకై నిరీక్షిస్తూ..అంతా సందడి సందడిగా గడిపారు. ఈలోపు నీరసం రాకుండా ఉత్సాహంగా ఉండేలా కాస్త ఆటపాటలు, నృత్యాలతో నిరీక్షిస్తున్నారు. ఈ ఆశారాణి కూడా అందులో భాగంగానే ఓ పాటకు వారందరితో కలిసి నృత్యం చేస్తూ..ఒక్కసారిగా కుప్పకూలిపోయింద. సకాలంలో వైద్యుడి వద్దకు తీసుకువెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు దృవీకరించారు వైద్యులు. అప్పటిదాక ఆనంద సంతోషాలతో తేలియాడిన ఆ రెండు కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి..ఆమెనే సుమంగళిగా మృత్యుఒడికి వెళ్లిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఇలాంటి ఘటనలు చూడగానే.. ఏ క్షణంలో ఏం జరగుతుందో ఎవ్వరికీ తెలియదు..విధి చాలా బలీయమైనది అన్న మాటలు స్పురణకు వస్తాయి కదూ..!. ..ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ..అప్పటి దాక ఆడిపాడి..మనముందే తనువు చాలిస్తే..ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేరెవ్వరూ..!. సో బీకేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో..సదా అప్రమత్తంగా ఉండండి.Karwa Chauth celebration in Barnala turn tr@gic after woman coll@pses while dancing#KarwaChauth #KarwaChauthcelebration pic.twitter.com/dz3G5APp7r— True Scoop (@TrueScoopNews) October 13, 2025 (చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు) -
కాంగ్రెస్లోకి మాజీ ఐఏఎస్ అధికారి
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగింపును నిరసిస్తూ ఆరేళ్ల క్రితం తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన కన్నన్ గోపీనాథన్.. తాజాగా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ & కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన కేంద్ర నిర్ణయానికి నిరసనగా, ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఐఏఎస్ గోపీనాథన్.ఢిల్లీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా సమక్షంలో గోపీనాథన్.. సోమవారం(అక్టోబర్ 13వ తేదీ) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనిలో భాగంగా గోపీనాథన్ మాట్లాడుతూ.. దేశం సరైన దిశలో పోవాలంటే కాంగ్రెస్ పార్టీనే సరైన మార్గమని నమ్మే ఇందులో జాయిన్ అయినట్లు పేర్కొన్నారు.అందుకే రాజీనామా చేశా..‘2019లో నేను నా పదవికి రాజీనామా చేశా. ఆ సమయంలో ప్రభుత్వం సరైన మార్గంలో పయనించలేదు,. అదే నాకు అర్థమైంది. వారు చేసిన దానిని నిరసిస్తూ నా పదవికి రాజీనామా చేశా. నేను దేశ వ్యాప్తంగా 80 నుంచి 90 జిల్లాలు తిరిగాను. ప్రజలతో మాట్లాడాను. అదే సమయంలో చాలా మంది పార్టీ నేతల్ని కూడా కలిశాను. నాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే దేశాన్ని సరైన దిశలో నడిపిస్తుందనే విషయం నాకు అర్థమైంది. అందుచేతే కాంగ్రెస్లో జాయిన్ అయ్యా’ అని ఆయన పేర్కొన్నారు.ధైర్యశాలి.. గోపీనాథన్కాంగ్రెస్లో చేరిన గోపీనాథన్పై వేణుగోపాల్ ప్రశంసలు కురిపించారు. అత్యంత సాహసోపేతమైన అధికారుల్లో గోపీనాథన్ ఒకరని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉన్నారని, సామాజిక న్యాయం కోసం, ఐక్యత కోసం పాటుబడుతున్న వ్యక్తి గోపీనాథన్ అని ప్రశంసించారు.కాగా, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గోపీనాథన్. ఆయన 2012 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ -కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన కేంద్ర నిర్ణయానికి నిరసనగా గోపీనాథన్ తన ఉన్నత పదవిని వదులుకున్నారు. కరోనా సమయంలో తిరిగి పదవిలో చేరమని చెప్పినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాజీనామాను ఆమోదించలేదని చెప్పినా ఇక తిరిగి పదవిలో జాయిన్ అయ్యేది లేదని తెగేసి చెప్పారు. ఇదీ చదవండి: సినిమాలే ముఖ్యం.. రాజీనామాకు సిద్ధం: సురేష్ గోపీ -
ప్రముఖ ఐఏఎస్ఫై అవినీతి దుమారం.. 51 కోట్ల ఫైన్ 4వేలకు తగ్గించారా?
భోపాల్: ప్రముఖ ఐఏఎస్ అధికారిణి సృష్టి దేశ్ముఖ్ గౌడ భర్త ఐఏఎస్ నాగార్జున బి.గౌడ చుట్టూ అవినీతి అరోపణల ఉచ్చు బిగుస్తోంది. మైనింగ్ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఓ కంపెనీకి భారీ మొత్తంలో ప్రభుత్వం జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కోట్ల నుంచి రూ.10వేల లోపుకు తగ్గించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చింది. ఆ అవినీతి ఆరోపణల్ని జిల్లా మేజిస్ట్రేట్ మేజ సిద్ధార్థ్ జైన్ ఖండించారు. 2019 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ నాగార్జున బి. గౌడ, ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా పంచాయతీ సీఈవోగా పనిచేస్తున్నారు. గతంలో హర్దా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) గా పనిచేసే సమయంలో మైనింగ్ శాఖ ఓ సంస్థకు విధించిన కోట్ల రూపాయాల జరిమానాను భారీ మొత్తంలో తగ్గించారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆనంద్ జాట్ ఇదే అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఐఏఎస్ నాగార్జున గౌడ ఓ ప్రైవేట్ సంస్థపై విధించిన రూ. 51 కోట్ల అక్రమ మైనింగ్ జరిమానాను కేవలం రూ. 4,032 కు తగ్గించారని ఆరోపణలు గుప్పించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో హర్దా జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ మేజ సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ.. మైనింగ్లకు సంబంధించిన కేసులలో ప్రాథమిక నోటీసులను వివరణ కోరుతూ ఇచ్చారని గుర్తు చేశారు. అందులో అవినీతికి తావులేదన్నారు. సంబంధిత ప్రిసైడింగ్ అధికారి (ఐఎఎస్ నాగార్జున గౌడ) చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించారు. ఈ ఆర్డర్పై ఎవరైనా సంతృప్తి చెందకపోతే, దానిపై కోర్టుకు అప్పీల్ చేసుకునేలా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఇది న్యాయ ప్రక్రియ’అని జైన్ అన్నారు.విచిత్రం ఏంటంటే?.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ పరీక్షల్లో పోటీ పడుతున్న అభ్యర్ధులకు ఉపయోగపడేలా గతేడాది ‘ద మ్యాన్యువల్ ఆన్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్’ అనే బుక్ సైతం రాశారు. అలాంటి వ్యక్తి చుట్టూ అవినీతి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. UPSC topper Srushti Deshmukh’s IAS husband Nagarjun accused of taking Rs 10 crore bribeName: Nagarjun B. Gowda 🏛️Post: IAS Officer 👔Wife: IAS Officer 💼Work: Motivational Speaker 🎤Achievement: Book on Ethics 📖Allegation: ₹10 Cr Bribe 💸Gowda, while serving as the… pic.twitter.com/63A9tfAiup— Karnataka Portfolio (@karnatakaportf) October 11, 2025తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ఐఏఎస్ సృష్టి జయంత్ దేశ్ముఖ్ 2018 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా ఐదవ ర్యాంక్ సాధించారు. ఆమె 2019 బ్యాచ్కు చెందిన ఐఎస్ అధికారిణి. మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్ని క్లియర్ చేశారు.ఆమె శ్రమ, క్రమశిక్షణ, స్వయంగా చదివే విధానం యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రేరణగా నిలుస్తోంది. ఓ వైపు మధ్యప్రదేశ్లో ఐఏఎస్ అధికారిణిగా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మోటివేషనల్ మెసేజ్లు,యూపీఎస్సీ టిప్స్, పాజిటివ్ ఆలోచనలు తరచూ షేర్ చేస్తూ ప్రేరణగా నిలుస్తున్నారు. -
ఖరీదైన స్టంట్.. అదిరింది ట్విస్ట్!
బండితో రోడ్డెక్కితే చాలు కొంత మంది సినిమాల్లో హీరోల్లా ఫీలైపోతున్నారు. తమ చేతిలోని వాహనాలతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాము ఉన్నది రహదారులపై అని మరిచిపోయి మితిమీరిన విన్యాసాలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. థ్రిల్ కోసమే, ఫేమ్ కోసమే ఇలాంటి ఫీట్లు చేస్తూ ఒక్కోసారి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియో ఒకటి తాజాగా గ్రేటర్ నోయిడాలో (Greater Noida) బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి.. ఓవరాక్షన్ చేసిన వ్యక్తి తిక్క కుదిర్చారు.వీడియోలో ఏముందంటే..మెయిన్ రోడ్డులో వేగంగా దూసుకుపోతున్న కారు.. కొంచెం దూరం వెళ్లాక సడన్గా రివర్స్ తిరుగుతుంది. మరొక కారులోని వీడియో ద్వారా దృశ్యాన్ని రికార్డు చేశారు. అదే కారు మళ్ళీ అదే స్టంట్ చేసి.. ఓ రెసిడెన్షియల్ సొసైటీ పార్కింగ్లోకి వేగంగా దూసుకెళ్లి ఆగుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) కావడంతో గ్రేటర్ నోయిడా ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కారుతో ప్రమాదకర విన్యాసాలు చేసిన వ్యక్తికి 57,500 రూపాయల జరిమానా విధించారు. నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా వాహనం నడిపినందుకు ఈ జరిమానా వేశారు."గ్రేటర్ నోయిడా రోడ్లపై ఓ వ్యక్తి కారుతో విన్యాసాలు చేశాడు. నోయిడా ట్రాఫిక్ పోలీసులు చర్య తీసుకుని రూ. 57,500 జరిమానా విధించారు. నోయిడా ట్రాఫిక్ పోలీసులు మంచి పని చేశారని" పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ వీడియోను షేర్ చేశారు. దీన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించినందుకు సంబంధిత వాహనంపై నిబంధనల ప్రకారం ఈ-చలాన్ (రూ. 57,500/- జరిమానా) జారీ చేయడం జరిగిందన్నారు.సోషల్ మీడియా స్పందనఈ వ్యహారంపై సోషల్ మీడియాలో నెటిజనులు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. "ఖరీదైన స్టంట్'' అని ఒక నెటిజన్ (Netizen) కామెంట్ చేశారు. జరిమానా విధించకుండా.. కారును స్వాధీనం చేసుకోవాల్సింది. ప్రమాదకర విన్యాసాలు చేసిన వ్యక్తికి కర్రలతో బడితపూజ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అప్పుడే ఇలాంటి వారు గుణపాఠం నేర్చుకుంటారని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.చదవండి: 'బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు'''ఇలాంటి వారికి ప్రతిరోజూ ఇది మామూలే. ఆల్ఫా 2 మార్కెట్ చుట్టూ నేను ప్రతిరోజూ ఇలాంటి డ్రైవర్లను చూస్తుంటాను. గ్రేటర్ నోయిడాలో ట్రాఫిక్ నియమాలను ఎలా జోక్గా చూస్తారో చూసి నేను ఆశ్చర్యపోతుంటాను. యూపీ అంతటా ఇలాంటి సమస్య ఉందని అనుకుంటున్నాను. నేను బెంగళూరులో (Bengaluru) ఉన్నప్పుడు ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ను ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రధానంగా పౌర సమస్య అయినప్పటికీ, మరి పోలీసింగ్ మాట ఏమిటి?'' అంటూ మరో నెటిజన్ వాపోయారు.A guy performed stunts with his car onthe streets of Greater Noida. 🚗💨Noida Traffic Police took action and imposed a fine of ₹57,500.Good Job, @Noidatraffic 👏👏 pic.twitter.com/Qn1nmGpmJj— Greater Noida West (@GreaterNoidaW) October 10, 2025 -
నం.1, 2 లోహాలు.. ఎందులో వాడుతున్నారంటే..
బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో అసాధారణ రీతిలో పెరుగుతున్నాయి. ఇటీవల కేజీ వెండి ధర ఏకంగా రూ.1.95 లక్షలకు చేరింది. తులంగా బంగారం రూ.1.20 పైమాటే. ఈ పెరుగుదలకు ప్రధానంగా ఆర్థిక అంశాలు దోహదపడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, దీనికి విరుగుడుగా సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం, వెండిపై మదుపరుల దృష్టి మళ్లడం ఒక ముఖ్య కారణం. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం నిల్వలను కొనుగోలు చేస్తుండడం వంటివి కూడా ఈ ధరల పెరుగుదలకు ఇంధనంగా పనిచేస్తున్నాయి. అయితే కేవలం ఆర్థిక కారకాలు, ఆభరణాల తయారీ మాత్రమే కాకుండా ఈ లోహాలకు అనేక పారిశ్రామిక, అత్యాధునిక రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ కూడా ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది.బంగారం, వెండి రెండూ విద్యుత్ వాహకత, తుప్పు నిరోధకత, సులభంగా సాగే (ductility), రేకులుగా మలిచే గుణం (malleability) వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా వీటి వినియోగం కేవలం పెట్టుబడులు లేదా ఆభరణాల తయారీకే పరిమితం కాకుండా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తోంది.బంగారం వినియోగంబంగారాన్ని అత్యధికంగా ఆభరణాల తయారీలో వినియోగించినప్పటికీ దాని ప్రత్యేక లక్షణాల కారణంగా అనేక అత్యాధునిక రంగాల్లో దీనికి ప్రాధాన్యత ఉంది.ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీబంగారం అత్యుత్తమ విద్యుత్ వాహకాల్లో ఒకటి. తుప్పు పట్టదు కాబట్టి దీన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కనెక్టర్లు, స్విచ్లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులలోని కీలకమైన భాగాలలో దీర్ఘకాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధనఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్ల్లోని కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను రక్షించడానికి, విద్యుత్ ప్రసారం కోసం బంగారాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బంగారాన్ని పూతగా కూడా ఉపయోగిస్తారు.వైద్య పరికరాలుబంగారం జీవసంబంధితంగా స్థిరంగా ఉంటుంది (శరీరంలో సులభంగా చర్యలకు గురికాదు). తుప్పు పట్టదు. నాన్-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటికి ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సా పరికరాలు, అతిపెద్ద వైద్య ఇమేజింగ్ పరికరాల్లో బంగారాన్ని వాడుతున్నారు.నానోటెక్నాలజీబంగారు నానోపార్టికల్స్కు వైద్య రంగంలో మెరుగైన సామర్థ్యం ఉంది. వీటిని క్యాన్సర్ చికిత్స, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ (మందులను లక్షిత ప్రాంతానికి చేర్చడం), జీవసంబంధిత సెన్సార్ల (Biosensors) తయారీలో పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు.గ్లాస్, కిటికీలుకొన్ని భవనాల అద్దాలు, కిటికీలపై సన్నని బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. ఈ పూత వేడిని నిరోధించి, లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.వెండి వినియోగంవెండి కూడా బంగారంతో సమానంగా విస్తృత పారిశ్రామిక అనువర్తనాలను కలిగి ఉంది. ఇది అన్ని లోహాల్లో అత్యుత్తమ విద్యుత్, ఉష్ణ వాహకతను కలిగి ఉంది.సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలుప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తి (Solar Energy) రంగంలో వెండి వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్లో విద్యుత్తును సేకరించి సరఫరా చేయడానికి వెండి పేస్ట్లను (Silver Paste) వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే కొన్ని రకాల బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు.ఎలక్ట్రానిక్స్, కండక్టర్లువెండి అత్యుత్తమ విద్యుత్ వాహకతను కలిగి ఉండటం వల్ల అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో సర్క్యూట్ బోర్డులు, స్విచ్లు, ఫ్యూజులు, కనెక్టర్లలో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా అధిక విశ్వసనీయత అవసరమయ్యే పరికరాలలో దీని వినియోగం తప్పనిసరి అవుతోంది.పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలువెండిని రసాయన పరిశ్రమల్లో ఉత్ప్రేరకాలుగా (Catalysts) వాడుతున్నారు. ఉదాహరణకు, ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తిలో (ఇది అనేక ప్లాస్టిక్ల తయారీలో ముఖ్యమైనది) ఇది ప్రముఖంగా ఉపయోగపడుతుంది.నీటి శుద్ధి, వైద్య రంగంవెండికి బలమైన యాంటీమైక్రోబియల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే) లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని నీటి శుద్ధి పద్ధతుల్లో, కొన్ని వైద్య ఉపకరణాలు, కట్టులు (Bandages) తయారీలో వాడుతున్నారు. ఆసుపత్రి పరికరాలపై క్రిమిసంహారక పూతగా కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.ఫొటోగ్రఫీసాంప్రదాయ ఫిల్మ్ ఫొటోగ్రఫీలో ఫిల్మ్, పేపర్పై కాంతిని గుర్తించడానికి వెండి హాలైడ్లను విస్తృతంగా వాడుతున్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీ రాకతో ఈ వినియోగం తగ్గినప్పటికీ ప్రత్యేక ఫొటోగ్రఫీ రంగాలలో ఇంకా ఉపయోగిస్తున్నారు.ఇదీ చదవండి: జరిమానా చెల్లించి, తప్పు అంగీకరిస్తే కేసు మూసివేత!బంగారం, వెండి వాటి ప్రత్యేక భౌతిక, రసాయన లక్షణాలు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వాటి వినియోగాన్ని అనివార్యంగా మార్చాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ, ఏరోస్పేస్, వైద్య పరికరాలు వంటి కీలక రంగాలలో పెరుగుతున్న డిమాండ్ ఈ లోహాల ధరల పెరుగుదలకు ఒక బలమైన పారిశ్రామిక కోణాన్ని జోడిస్తోంది. భవిష్యత్తులో సాంకేతిక ఆవిష్కరణలు పెరిగే కొద్దీ ఈ అమూల్యమైన లోహాల వినియోగం, వాటి విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. -
లాలు ఫ్యామిలీకి భారీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్సీటీసీ హోటళ్ల అవినీతి కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్డీ దేవి, కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్తో పాటు ఇతర నిందితులపై అభియోగాలను ఖరారు చేసింది. వీరంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా, నిందితుల పాత్ర ఆధారంగా న్యాయస్థానం వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. ముఖ్యంగా రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్లపై ఐపీసీ సెక్షన్ 420 (మోసం), 120బీ (నేరపూరిత కుట్ర) కింద అభియోగాలు మోపింది. అయితే నిందితులందరిపై నేరపూరిత కుట్ర అభియోగం ఉమ్మడిగా ఉంది. తమపై మోపిన ఆరోపణలను లాలు కుటుంబం ఖండించింది. తాము నిర్దోషులమని, విచారణను ఎదుర్కొంటామని కోర్టుకు తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘టెండర్ కుంభకోణానికి సంబంధించిన పూర్తి కుట్ర లాలు ప్రసాద్ యాదవ్కు తెలిసే జరిగింది. టెండర్ ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఈ కుట్ర ద్వారా లాలు కుటుంబం లబ్ధి పొందింది. రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్లకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమి లభించింది’అని పేర్కొంది. కోర్టు లాలు యాదవ్ను ఉద్దేశించి, ‘మీరు మీపై మోపిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా? లేక విచారణను ఎదుర్కొంటారా?’అని ప్రశ్నించగా, ‘ఈ ఆరోపణలన్నీ అవాస్తవం’అని లాలూ యాదవ్ బదులిచ్చారు. అదేవిధంగా, రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్లు కూడా తాము ఏ కుట్రలో, మోసంలో పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు. ఏంటీ కుంభకోణం?2004– 2009 మధ్యకాలంలో లాలు ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. సీబీఐ ఆరోపణల ప్రకారం, రాంచీ, పూరీలలో ఉన్న ఐఆర్సీటీసీకి చెందిన రెండు బీఎన్ఆర్ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను ‘సుజాత హోటల్స్’అనే ప్రైవేట్ సంస్థకు అక్రమంగా కట్టబెట్టారు. ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాంట్రాక్టుకు ప్రతిఫలంగా, లాలు కుటుంబానికి పట్నాలోని అత్యంత విలువైన భూమిని సుజాత హోటల్స్ యజమానులు బదిలీ చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. 2017 జూలై 17న సీబీఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. #WATCH | Delhi: RJD leader Tejashwi Yadav leaves from the Rouse Avenue Court.The Rouse Avenue court framed charges against former Railway Minister Lalu Prasad Yadav, former Bihar CM Rabri Devi, RJD leader Tejashwi Yadav and others in the IRCTC hotels corruption case. This case… https://t.co/F9E3EhYfJM pic.twitter.com/zpX2ecXFcC— ANI (@ANI) October 13, 2025మరోవైపు.. బీహార్లో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో లాలూ ఫ్యామిలీపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఆర్జేడీకీ పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కరూర్ తొక్కిసలాటపై సీబీ‘ఐ’
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని కరూర్ పెను విషాద తొక్కిసలాట ఘటన కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై సీబీఐ జరిపే దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించడం విశేషం. కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు తమిళనాడు కేడర్కు చెందిన ఐపీఎస్లు ఉంటారని ధర్మాసనం తెలిపింది. తమిళనాడులో గత నెల 27వ తేదీన కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ ప్రచార సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట పెను విషాదానికి దారి తీసింది. ఈ కేసును ఐజీ అష్రా కార్గ్ నేతృత్వంలోని సిట్ విచారిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టీవీకే సుప్రీంను కోరింది. కాగా, బీజేపీసహా కొందరు బాధితులు సీబీఐ విచారణను కోరుతూ పిటిషన్ను దాఖలు చేశారు. వీరి పిటిషన్లను విన్న జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.వి. అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు సిట్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా, ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ అరుణా జగదీషన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ యథావిధిగా కొనసాగుతుందని, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్ చేయలేదని ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో పాటు వాదనలు వినిపించిన న్యాయవాది, డీఎంకే ఎంపీ విల్సన్ తెలిపారు. కాగా, బాధితులుగా పేర్కొంటూ బాధితులు కానివారు సైతం కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారన్న విషయాన్ని న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకునిరావడంతో ఈ అంశంపై విచారణ జరుపుతామని బెంచ్ పేర్కొన్నట్లు విల్సన్ తెలియజేయడం గమనార్హం. ఇదీ చదవండి: 'మీరేం ఒంటరి కాదు..' విజయ్కు బీజేపీ సపోర్ట్!! -
3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం..
భారతదేశ విద్యారంగం చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోబోతోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను పాఠశాల పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే భవిష్యత్తు కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడం, చిన్న వయసు నుంచే డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ చర్య జాతీయ విద్యా విధానం (NEP)-2020కి అనుగుణంగా ఉంది. ఇది సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది.ముఖ్య ఉద్దేశాలు.. సన్నద్ధతవిద్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకీకృతం చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వివిధ గ్రేడ్ స్థాయిల్లో సమర్థవంతమైన ఏఐ విద్యను అందించడానికి ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేస్తోంది. ఏఐ భావనలను సమర్థవంతంగా బోధించడానికి దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్నారని నిర్ధారించడం ఈ ప్రణాళిక అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పేర్కొంది.విద్యార్థులపై ఏఐ ప్రభావం🚨 India will introduce Artificial Intelligence (AI) in the school curriculum from Class 3 onwards starting 2026-27. - Ministry of Education. pic.twitter.com/IACvizFCCv— Indian Tech & Infra (@IndianTechGuide) October 11, 2025ప్రస్తుతం జనరేటివ్ ఏఐ వేగంగా పురోగమిస్తోంది. చాట్జీపీటీ, జెమినీ, గ్రోక్ఏఐ.. వంటి సాధనాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విద్యా పద్ధతులను మారుస్తున్నాయి. పాఠశాలల్లో ఏఐ పరిచయం విద్యార్థులకు క్లిష్టమైన ఆలోచన, సమస్య పరిష్కారం, వినూత్న నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. చిన్నప్పటి నుంచే ఏఐ సాధనాలను ఉపయోగించడం, వాటిని నేర్చుకోవడం వల్ల సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి, పరిష్కరించగల సృజనాత్మక పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుంది. ఏఐ ఆధారిత నైపుణ్యాల వల్ల భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్లో పోటీపడే అవకాశం ఉంటుంది.గ్రామీణ విద్యార్థుల అవసరాలు.. మౌలిక సదుపాయాలుపట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడం ఏఐ బోధనను దేశవ్యాప్తంగా అమలు చేయడంలో అతిపెద్ద సవాలుగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను అందించాలి. ఏఐ బోధన క్రమంలో పాఠశాలల్లో తప్పనిసరిగా మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరం. ఇందులో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రతీ విద్యార్థికి లేదా కనీసం ఇద్దరు విద్యార్థులకు ఒక కంప్యూటర్/ టాబ్లెట్ అందుబాటులో ఉండాలి. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా జాగ్రత్తపడాలి.మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామాల్లో పాఠశాల సమయం తర్వాత కూడా విద్యార్థులు ఏఐ, కంప్యూటర్లను ఉపయోగించడానికి వీలుగా ‘కమ్యూనిటీ లెర్నింగ్ కేంద్రాలు’ లేదా ‘డిజిటల్ ల్యాబ్లు’ ఏర్పాటు చేయడం అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ బోధన, అభ్యాస సామగ్రిని స్థానిక భాషల్లో అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఏఐ భావనలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.ఫీజుల నియంత్రణకు ప్రభుత్వ చర్యలుఈ నూతన ఆవిష్కరణను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ఉన్న అధిక ఫీజులను మరింత పెంచే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులను నివారించడానికి ప్రభుత్వం తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో ఫీజు నియంత్రణ మండలిని బలోపేతం చేసి ఏఐ విద్య పేరుతో విధించే అదనపు ఫీజులపై పారదర్శకతను, నియంత్రణ తీసుకురావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన మౌలిక సదుపాయాలను అత్యంత ఉన్నత ప్రమాణాలకు మెరుగుపరచడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలి. ఇది ప్రైవేట్ పాఠశాలలు తమ ఫీజులను అనవసరంగా పెంచకుండా నిరోధించడానికి పరోక్షంగా ఒత్తిడిని సృష్టిస్తుంది. ఏఐ బోధనను పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల అయ్యే వాస్తవ ఖర్చుల ఆధారంగా మాత్రమే ఫీజులను పెంచడానికి అనుమతించే కఠినమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయాలి.ఇదీ చదవండి: బంగారంతో ప్రైవేట్ జెట్ కొనొచ్చు! ఎప్పుడంటే.. -
‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు ఎఫెక్ట్.. తమిళనాడులో ఈడీ సోదాలు
చెన్నై: మధ్యప్రదేశ్ ‘కోల్డ్రిఫ్’(Coldrif Syrup) దగ్గు మందు కారణంగా 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందును తయారు చేస్తున్న తమిళనాడులోని(Tamil Nadu) శ్రీసన్ ఫార్మా(Sreesan Pharma) సంస్థపై ఈడీ ఫోకస్ పెట్టింది. తాజాగా చెన్నైలో(Chennai) శ్రీసన్ ఫార్మాకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఈడీ(Enforcement Directorate) అధికారులు తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. చిన్నారుల మరణాలకు కారణమైన ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారుచేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids In Tamilnadu) అధికారులు సోమవారం శ్రేసన్ ఫార్మాతో సంబంధమున్న చెన్నైలో ఏడు ప్రదేశాల్లో సోదాలు, తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దగ్గు మందు తయారుచేసిన శ్రేసన్ ఫార్మా యూనిట్ యజమాని రంగనాథన్(73)ను ఇటీవల అరెస్టు చేసిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.#Coldrif #CoughSyrupDeaths pic.twitter.com/zzVw4roe8J— NDTV (@ndtv) October 13, 2025మరోవైపు.. మధ్యప్రదేశ్లో చిన్నారుల మరణాల నేపథ్యంలో శ్రేసస్ ఫార్మా కంపెనీలో తనిఖీ చేయగా.. సిరప్లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండగా దగ్గు, జలుబు, జ్వరాలతో వెళ్లిన చిన్నారులకు వైద్యులు కోల్డ్రిఫ్ సిరప్ను సూచించగా అందులోని విషపదార్థం వల్ల పిల్లల కిడ్నీలు విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్రిఫ్ను నిషేధించాయి.ఇదిలా ఉండగా.. ఔషధ తయారీ సంస్థగా ఈ కంపెనీ కేంద్ర పోర్టల్లో రిజిస్టర్ కాలేదని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ఇచ్చే గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (GMP) సర్టిఫికెట్ లేకుండానే దశాబ్దాల పాటు ఫార్మా సంస్థ నడిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలిపారు. దీంతో, ఫార్మా కంపెనీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
సినిమాలే ముఖ్యం.. రాజీనామాకు రెడీ: కేంద్ర మంత్రి సురేష్ గోపి
మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి(Suresh Gopi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాల కోసం తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు తన స్థానంలో రాజ్యసభ సభ్యుడు సీ సదానందన్ మాస్టర్ను కేంద్ర మంత్రిని చేయాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారాయన. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సురేష్ గోపి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను వదిలేసి మంత్రిని కావాలని ఏనాడూ నేను కోరుకోలేదు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత నటించలేకపోతున్నా. తద్వారా నా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. నా పిల్లలు ఇంకా స్థిరపడలేదు. నాకు ఆదాయం అవసరం. అందుకే నటన కొనసాగించాలి అనుకుంటున్నా. నేను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మనస్ఫూర్తిగా చెబుతున్నా.. నన్ను మంత్రి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో సదానందన్ మాస్టర్(Sadanandan Master)ను కేంద్ర మంత్రిని చేయండి. ఇది కచ్చితంగా కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం అవుతుంది అని సురేష్ గోపి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సదానందన్ పక్కనే ఉన్నారు.మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 200 చిత్రాల్లో నటించారు సురేష్ గోపి. ప్రత్యేకించి 90వ దశకంలో యాక్షన్ చిత్రాల హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు. డబ్ చిత్రాలతో తెలుగులోనూ ఆయన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2016లో బీజేపీలో చేరిన సురేష్ గోపి.. తొలుత రాజ్యసభ సభ్యుడిగా, ఆపై 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి నెగ్గారు. కేరళ చరిత్రలో బీజేపీ తరపున లోక్సభకు ఎన్నికైన వ్యక్తి ఈయనే. అందుకే ఆయనకు కేంద్ర పెట్రోలియం.. ప్రకృతి వాయువు, పర్యాటక శాఖల సహాయ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ఈ మధ్యకాలంతో తరచూ పలు వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.ఇదిలా ఉంటే.. సదానందన్ ఇటీవలె రాజ్యసభకు ఎన్నికయ్యారు. కన్నూరు జిల్లాకు చెందిన సదానందన్.. 1994లో సీపీఎం కార్యకర్తల దాడిలో రెండు కాళ్లను పొగొట్టుకున్నారు. -
కిడ్నాప్ చేసి చిత్రహింసలు
కర్ణాటక: డబ్బుతిరిగి ఇవ్వాలన్నందుకు చిత్రహింసలకు గురిచేశారు, ఈ ఘటన బెంగళూరు కోరమంగల ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. తండ్రికి కిడ్నీలు దెబ్బతిన్నాయి, వైద్యంచేయించాలని సగాయ్రాజ్ నుంచి అనందకుమార్, అతని కూతురు ఐశ్వర్య రూ. 3 లక్షలు తీసుకున్నారు. ఇంటిని విక్రయించి డబ్బు ఇస్తానని ఆనంద్కుమార్ చెప్పగా, తనకే అమ్మాలని సగాయ్రాజ్ కోరాడు. అగ్రిమెంట్ కు ముందు కోటి రూపాయలు ఇవ్వగా మిగిలిన డబ్బు తరువాత ఇస్తానని మాట్లాడుకున్నారు. డబ్బు తీసుకున్న ఆనందకుమార్ ఇంటిని రాసివ్వలేదు, డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదు. దీంతో డబ్బు ఇవ్వాలని సగాయ్రాజ్ ఒత్తిడి చేయసాగాడు. ఈ నేపథ్యంలో సగాయ్రాజ్ని తండ్రీ కూతురు, మరో వ్యక్తి ఆశీష్లు కలిసి కిడ్నాప్ చేశారు, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చేతులు కాళ్లుకట్టి వేసి మర్మాంగానికి సిగరేట్తో కాల్చి, ఇంజెక్షన్ వేసి చిత్రహింసలకు గురిచేశారు. అంతేగాక వీడియో తీసి బెదిరించారు. కారులో రాత్రంతా నగరంలో తిప్పి వేధించారు. ఉదయం సమయంలో సగాయ్రాజ్ కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేసి స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పాడు. ఈ మేరకు కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బీహార్లో పొలిటికల్ ట్విస్ట్.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో, ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఎమ్మెల్యేలు నవాడా ఎమ్మెల్యే విభాదేవి, రజౌలి ఎమ్మెల్యే ప్రకాశ్ వీర్ ఆదివారం స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్ను కలిసి రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. విభా దేవి భర్త, మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ పోక్సో కేసులో కొన్నేళ్లుగా జైలులో ఉండి, ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చారు. గత లోక్సభ ఎన్నికల్లో తమ కుటుంబంలోని వారికి టిక్కెట్ ఇవ్వలేదని ఆర్జేడీపై ఈయన ఆగ్రహంతో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్ వీర్ మరోసారి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. బీహార్లో సీట్ల సర్దుబాటు పరిష్కారమైంది. బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల నుంచి పోటీచేయాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీ(యూ)తోపాటు బీజేపీ సైతం చెరో 101 సీట్ల నుంచి బరిలో దిగనుంది. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి(రామ్ విలాస్) పార్టీ 29 స్థానాల నుంచి పోటీ చేయనుంది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(సెక్యూలర్), ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాలు చెరో ఆరు స్థానాల నుంచి పోటీచేయనున్నాయి. 243 నియోజకవర్గాలున్న బీహార్లో పాలక ఎన్డీఏ కూటమిలో ఎవరే స్థానం నుంచి పోటీచేయాలన్న దానిపై కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. -
కాబోయే వరుని గొంతెమ్మ కోర్కెలు
కర్ణాటక: కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం అనేది అందరికీ తెలిసిందే. కానీ సమాజంలో కట్నవ్యవస్థ పాతుకుపోయింది. కూలీల నుంచి కుబేరుల వరకు వధువుల తల్లిదండ్రులు కట్నకానుకలను ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే పెళ్లి క్యాన్సిల్ అనే మాట వినిపిస్తుంది. అలాంటి సంఘటనే కళా సాంస్కృతిక నగరం మైసూరులో చోటుచేసుకుంది. మరో రూ.25 లక్షలు, కారు కోసం పట్టు.. అడిగినంత కట్నం ఇవ్వలేదని కాబోయే వరుడు, అతని కుటుంబసభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో వ్యవహారం పోలీసు స్టేషన్కు చేరింది. వివరాలు... నగరంలోని గంగోత్రి లేఔట్లో మమతాదేవి కుమార్తె డాక్టర్.నీతు కు కుర్గళ్ళికి చెందిన తేజస్తో ఆగస్టు ఆఖరిలో ఘనంగా నిశ్చితార్థం చేసింది. వరునికి 150 గ్రాముల బంగారం, ఒక వజ్రాల ఉంగరం, రూ. 10 లక్షల నగదును అందజేశారు. వారు కోరినట్లుగానే కోటె హుండి గ్రామంలోని ఓ విలాసవంత హోం స్టేలో నిశి్చతార్థాన్ని జరిపించారు. అలాగే సా.రా కన్వెన్షన్ హాల్ళో పెళ్ళి జరిపించాలని షరతు పెట్టగా వధువు కుటుంబీకుల అంగీకరించారు. రూ. 1.50 లక్షల అడ్వాన్స్ కట్టి హాల్ని బుక్ చేసుకుని, పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో తేజస్, తల్లిదండ్రులకు మరింత దురాశ పుట్టింది. మరో రూ.25 లక్షల నగదు ఇవ్వాలని, రూ. 20 లక్షల కారును కొనివ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరారు. దీంతో వధువు తల్లి, కుటుంబీకులు విసిగిపోయారు. ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇంక ఇవ్వలేదని తెలిపారు. వరుడు, తల్లిదండ్రులు భగ్గుమన్నారు, కారు కొనివ్వలేనివారు ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారు, ఈ పెళ్లి మాకు వద్దని చెప్పేశారు. వధువు కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వారు అంగీకరించలేదు. దీంతో న్యాయం చేయాలని సరస్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు తేజస్, అతని తల్లిదండ్రులు నాగరత్న, మహాదేవ, కుటుంబీకులు శశికుమార్, సుమపై కేసు పెట్టారు. -
ఢిల్లీలో దీపావళి ధమాకా..?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి టపాసుల మోత మోగే అవకాశాలున్నాయి. వాయు కాలుష్యం దృష్ట్యా ఏళ్లుగా కొనసాగుతున్న సంపూర్ణ నిషేధంపై బీజేపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రజల మతపరమైన, సాంస్కృతిక మనోభావాలను గౌరవిస్తూ, పర్యావరణానికి హాని కలగని రీతిలో హరిత (గ్రీన్) టపాసులకు అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు టపాకాయలపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. గ్రీన్ కాకర్స్కే అనుమతి! సంపూర్ణ నిషేధం బదులుగా, ప్రభుత్వం నిర్దేశించిన, ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే పరిమిత సమయం పాటు కాల్చేందుకు అనుమతించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. పండుగ ఉత్సాహాన్ని దెబ్బతీయకుండా, అదే సమయంలో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేసేలా ఈ మధ్యేమార్గం ఉత్తమమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యాలని, అందుకే కేవలం తక్కువ ఉద్గారాలు వెలువరించే హరిత టపాసుల వైపే మొగ్గు చూపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఫలించని సంపూర్ణ నిషేధం కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంపూర్ణ నిషేధం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ప్రభుత్వం వాదించనుంది. నిషేధం ఉన్నప్పటికీ, ప్రజలు అక్రమ మార్గాల్లో ప్రమాదకరమైన, అధిక కాలుష్యాన్ని వెదజల్లే టపాసులను కొనుగోలు చేసి కాలుస్తున్నారని, దీనివల్ల కాలుష్య తీవ్రత తగ్గకపోగా కొన్నిసార్లు మరింత పెరుగుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కఠినమైన నిషేధం కంటే నియంత్రిత పద్ధతిలో గ్రీన్ క్రాకర్స్ను అనుమతించడమే ఆచరణాత్మక పరిష్కారమని బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచి్చంది. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి, గ్రీన్ క్రాకర్స్కు అనుమతిస్తే నిబంధనల అమలులో ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరం అంతటా పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. -
కాళ్లు కడిగించి.. ఆ నీరు తాగించి!
దమోహ్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందించిన ఒక ’అభ్యంతరకరమైన’ చిత్రాన్ని పంచుకున్నందుకు మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లాలో ఒక యువకుడిని బ్రాహ్మణుడి కాళ్లు కడిగించి.. ఆ నీటిని తాగమని బలవంతం చేశారన్న ఆరోపణలపై ఆదివారం పోలీసు కేసు నమోదైంది. జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోని పతేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సతరియా గ్రామంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి.చెప్పుల దండ వేసినట్లు ఏఐ చిత్రం ఓబీసీ వర్గానికి చెందిన పురుషోత్తం కుషా్వహా, అదే గ్రామానికి చెందిన అన్నూ పాండే అనే వ్యక్తికి చెప్పుల దండ వేసినట్లు ఏఐ రూపొందించిన చిత్రాన్ని ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో కుష్వాహా ఆ పోస్ట్ను తొలగించి, బహిరంగంగా క్షమాపణ చెప్పాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రుత్ కీర్తి సోమ్వంశీ తెలిపారు. అనంతరం గ్రామంలో పంచాయతీ నిర్వహించి కుషా్వహాతో బలవంతంగా పాండే కాళ్లు కడిగించి.. అదే నీటిని అతనితో తాగించారు. పంచాయతీ అతనికి రూ.5,100 జరిమానా కూడా విధించింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో వీడియోలో, కుష్వాహా మాట్లాడుతూ.. తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పానని, ఈ సంఘటన రాజకీయ అంశంగా మారాలని కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నట్లు ఉంది. కాగా, బాధితుడు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, పాండేతో సహా నలుగురిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 196 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు దమోహ్ కలెక్టర్ సు«దీర్ కుమార్ కోచర్ విలేకరులకు తెలిపారు.నిందితులను అరెస్టు చేసే ప్రక్రియ జరుగుతోందని ఎస్పీ తెలిపారు. ఈ సంఘటన మానవత్వంపై మచ్చని కాంగ్రెస్ పార్టీ ’ఎక్స్’లో పేర్కొంది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్చార్జ్ ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ప్రతి నేరాన్నీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. -
బంగారు పూత కలశం చోరీ
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో జైన దేవాలయం గోపురం నుండి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు పూత కలశం చోరీ అయ్యింది. ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైన చోరీకి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాలివి. జ్యోతి నగర్ ప్రాంత నివాసితులు శుక్రవారం అర్ధరాత్రి భారీ ఎత్తున కర్వా చౌత్ వేడుకల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. నిందితుడు విద్యుత్తీగల ఆధారంగా ఆలయం పైకప్పు ఎక్కి, గోపురం పైకి చేరుకున్నాడు. అక్కడున్న బంగారు పూత కలశాన్ని చోరీ చేసి పారిపోయాడు. అష్ట ధాతువులతో కలశం తయారీ చోరీ అయిన కలశం ’అష్ట ధాతువులు’ (ఎనిమిది లోహాల మిశ్రమం)తో తయారైంది. దీని తయారీకి సుమారు 200 గ్రాముల బంగారం వినియోగించారు. కలశం విలువ సుమారు రూ.35–40 లక్షలు ఉంటుందని అంచనా. కలశం సుమారు 25 నుండి 30 కిలోగ్రాముల రాగి, బంగారు పూతతో తయారైందని పోలీసులు తెలిపారు. చోరీపై ఆలయ కమిటీ అధ్యక్షుడు నీరజ్ జైన్ శనివారం ఉదయం ఈస్ట్ జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు బృందాలను ఏర్పాటు చేశామని, అతని కదలికలను తెలుసుకోవడానికి సాంకేతిక నిఘా ఉపయోగిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రోజూ 113 ఆర్థిక నేరాలు
భారత్లో పెద్ద నగరాల్లో ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. 2023లో పెద్ద నగరాల్లో సగటున రోజుకు 113 ఆర్థిక నేరాలు నమోదుకాగా.. 2018లో ఈ సంఖ్య 86గా ఉంది. దాదాపు 20% ఆర్థిక నేరాలు నగరాల నుంచే నమోదవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ప్రకారం 2018తో పోలిస్తే 2023లో ఈ నేరాలు దాదాపు 31 శాతం అధికం అయ్యాయి. వీటిలో రూ.1–10 లక్షల విలువ చేసే ఆర్థిక నష్టాల కేసులే ఎక్కువ.కోట్ల విలువైన మోసాలూ జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. దేశవ్యాప్తంగా 2018లో పెద్ద నగరాల్లో 31,501 ఆర్థిక నేర సంబంధ కేసులు నమోదవగా, 2023లో ఈ సంఖ్య 41,220కి చేరింది. ఆ ఏడాది నగరాల్లో నేరాల రేటు లక్ష జనాభాకు 36.1గా ఉంది. దాదాపు 10లో 9 కేసులు ఫోర్జరీ, మోసానికి సంబంధించినవి. ఇటీవలి సంవత్సరాల్లో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ.. కోర్టుల్లో పెండింగ్ కేసుల్లో తగ్గుదల నమోదైంది. -
మనిషిలా మాత్రమే జీవిస్తా
గువాహటి: అసోంలోని గువాహటిలో గాయకుడు జుబీన్ గార్గ్కు దహన సంస్కారాలు జరిపి ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ బ్రాహ్మణ యువకుడు.. ‘ఇకపై కేవలం మనుషులా మాత్రమే జీవిస్తా. కులమతాల ప్రస్తావన వదిలేస్తా’అంటూ తన జంధ్యాన్ని తెంపి, చెత్తలో పడేశాడు. సన్ భగవతి అనే 30 ఏళ్ల ఆ యువకుడు.. ఇకపై గార్గ్ నడిచిన బాటలోనే నడుస్తానని తెలిపాడు. కులమతాల అడ్డుగోడలను పగులగొట్టాలన్నాడు. ‘పుట్టుకతో నా కులం బ్రాహ్మణ. ఇప్పుడిక నాకు కులం, మతం అంటూ ఏదీ లేదు’అంటూ తన దుస్తుల్లోపలున్న జంధ్య తీసి, మీడియా చూస్తుండగానే తెంచి చెత్తలోకి వేశాడు. నా సోదరుడు జుబీన్ సాక్షిగా చెబుతున్నా. జంధ్యం మళ్లీ ధరించను. ఇటీవల సోషల్ మీడియాలో హిందూముస్లింలకు సంబంధించిన అంశాలే ప్రముఖంగా వస్తున్నాయి. హిందువుల్లోనూ చాలా కులాలున్నాయి. శూద్రుడు ఇచ్చిన వాటిని బ్రాహ్మణుడు పట్టుకోడు. ఇలాంటి ఆచారాలు, విశ్వాసాలు ఎన్నో. అందుకే జబీన్ దా సాక్షిగా వాటన్నిటినీ వదిలేస్తున్నా. ఆరేళ్ల నా కుమారుడికి కూడా జంధ్య వేయను. మనుషుల్లాగా జీవించడం మనం నేర్చుకోవాలి. మానవత్వం అన్నిటికీ మించింది’అని పేర్కొన్నాడు. కాగా, బ్రాహ్మణ కుటుంబంలో జి»ొన్ బొర్తాకుర్ పేరుతో జని్మంచిన జుబీన్ గార్డ్ కూడా తనకు కులం–మతం లేదంటూ ప్రకటించుకున్నారు. జంధ్యాన్ని దోమ తెర కట్టేందుకు తాడు మాదిరిగా వాడుకున్నట్లు గతంలో ఓ సందర్భంలో తెలిపారు. -
బీఎస్ఎఫ్ తొలి మహిళాఫ్లైట్ ఇంజనీర్గా భావనా చౌదరి
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం వైమానిక విభాగం 50 ఏళ్లకు పైగా చరిత్రలో.. తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ను నియమించింది. ఈమె సంస్థలోనే తొలి అంతర్గత శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఘనత సాధించడం విశేషం. ఇన్స్పెక్టర్ భావనా చౌదరి సహా అయిదుగురు పురుష సబార్డినేట్ అధికారులకు.. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌధరి ఇటీవల ఫ్లయింగ్ బ్యాడ్జ్లను అందజేశారు. సరిహద్దు దళం 1969 నుండి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏవియేషన్ యూనిట్ను నిర్వహణ బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఇది అన్ని పారా మిలిటరీ దళాలు, ఎన్ఎస్జీ, ఎన్డీఆర్ఎఫ్ వంటి ప్రత్యేక దళాల కార్యాచరణ అవసరాలను తీరుస్తుంది. బీఎస్ఎఫ్ వైమానిక విభాగంలోని శిక్షకులు ఐదుగురు సబార్డినేట్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇటీవలే రెండు నెలల సుదీర్ఘ శిక్షణను పూర్తి చేశారు. 130 గంటల తర్ఫీదు ఆగస్టులో ప్రారంభమైన ఈ రెండు నెలల అంతర్గత శిక్షణలో ఐదుగురు సిబ్బందికి 130 గంటల పాటు నైపుణ్యం అందించారు. శిక్షణ సమయంలో, పంజాబ్తో పాటు ఇతర రాష్ట్రాలలో ఇటీవల సంభవించిన వరదల్లో సహాయక చర్యల్లో పాల్గొనడం ద్వారా.. వీరు బీఎస్ఎఫ్ వైమానిక విభాగంలోని వివిధ విమానాలపై అనుభవం పొందారు. ఫ్లైట్ ఇంజనీర్లకు తీవ్ర కొరత ‘బీఎస్ఎఫ్ వైమానిక విభాగం దాని ఎంఐ–17 హెలికాప్టర్ల ఫ్లీట్లో ఫ్లైట్ ఇంజనీర్ల తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. భారత వైమానిక దళం మొదటి బ్యాచ్లోని ముగ్గురు సబార్డినేట్ అధికారులకు శిక్షణ ఇచి్చంది, అయితే వివిధ పరిమితుల కారణంగా ఐదుగురు సిబ్బందితో కూడిన రెండో బ్యాచ్ అక్కడ శిక్షణ స్లాట్ను పొందలేకపోయింది’.. అని ఒక అధికారి తెలిపారు. దీంతో బీఎస్ఎఫ్, తన వైమానిక విభాగంలో ఫ్లైట్ ఇంజనీర్ల కోసం అంతర్గత శిక్షణ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎంహెచ్ఏను అభ్యరి్థంచింది. ఇన్స్పెక్టర్ చౌదరితో సహా ఐదుగురు సిబ్బంది ఇటీవల తమ శిక్షణను పూర్తి చేశారని ఆ అధికారి తెలిపారు. ఇన్స్పెక్టర్ చౌదరి, బీఎస్ఎఫ్ వైమానిక విభాగంలో మొదటి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ యూనిట్ ఎంఐ17 1వి, ఎంఐ 17 వి5, చీతా, ఏఎల్హెచ్ ధ్రువ్ వంటి హెలికాప్టర్లతో పాటు, వీఐపీ విధుల కోసం ఫిక్స్డ్ వింగ్ ఎంబ్రేయర్ జెట్ను కూడా నిర్వహిస్తుంది. సుమారు 3 లక్షల మంది సిబ్బంది ఉన్న బీఎస్ఎఫ్ 1965 డిసెంబర్లో ఏర్పాటైంది. అంతర్గత భద్రతలో వివిధ విధులను నిర్వర్తించడంతో పాటు, ఇది ప్రధానంగా భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల పరిరక్షణ బాధ్యతలను నిర్వర్తించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. -
డీప్ఫేక్, ఏఐలతో బాలికలకు వేధింపులు
న్యూఢిల్లీ: డీప్ఫేక్, కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత సాంకేతికతతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపుల పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఆదివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు తగిన చట్టాలు అవసరమన్నారు. బాలికలపై జరుగుతున్న ఈ తరహా సాంకేతిక పరమైన దురి్వనియోగాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకునే దిశలో ‘‘ఏఐ సైబర్క్రైమ్ అడ్వైజరీ కమిటీ ఆన్ గర్ల్ చైల్డ్’’అనే ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సూచించారు. న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమని పేర్కొన్నారు. లింగ ఆధారిత బ్రూణ, శిశు హత్యలపై ప్రస్తుత చట్టాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. వీటితోపాటు బాలికలకు పోషకాహారం అందించాల్సిన ఆవశ్యకతనూ ఉద్ఘాటించారు. ఆయా అంశాలు అన్నింటిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపునకూ కృషి జరగాలని ఉద్భోదించారు. యూనిసెఫ్ ఇండియాతో కలిసి సుప్రీంకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ (జేజేసీ) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో బాలిక రక్షణ– సురక్షిత, ప్రోత్సాహక వాతావరణం’అనే అంశంపై ఇక్కడ జరిగిన రెండు రోజుల జాతీయ వార్షిక భాగస్వామ్య సదస్సులో జస్టిస్ బీవీ నాగరత్న ముగింపు ఉపన్యాసం చేశారు. జేజేసీ సభ్యులు కూడా అయిన జస్టిస్ నాగరత్న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... → తరచుగా మారుతున్న టెక్నాలజీల వల్ల కలిగే ప్రమాదాలు.. నిరంతరం తలపై వేలాడుతున్న ఖడ్గం లాంటిది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్, ఏఐ ఆధారిత టెక్నాలజీల ద్వారా బాలల హక్కులు దురి్వనియోగం కాకుండా తగిన చట్టాలను రూపొందించాలి. ఆయా అంశాలపై 24 గంటల సమాచారం వ్యవస్థ, నిరంతరం స్పందించే జాతీయ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలి. → చట్టం ఒక్కటే సమాజాన్ని మార్చలేదు. తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. బాలిక భారమనే అపోహను తొలగించే దిశలోకి తల్లిదండ్రుల దృక్పథం మారాలి. → బాలికను కాపాడటం అంటే తరతరాలను కాపాడడమంటూ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయం హర్షణీయం. → ఆహారమే ఉత్తమ ఔషధం అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పిల్లలలో పోషకాహారంపై అవగాహన పెంచడానికి పాఠశాల సిలబస్లో పోషకాహార విద్యను చేర్చాలి. పాఠశాలల చుట్టూ జంక్ఫుడ్ ప్రకటనలను నిషేధించాలి. → బాలికల అక్రమ రవాణా నిరోధక చర్యలు మరింత ఫలప్రదం కావాలంటే ఆయా నేరాలకు సంబంధించిన దర్యాప్తును ఫోరెన్సిక్, ఫైనాన్షియల్ ట్రేసింగ్తో అనుసంధానించి ప్రొఫెషనల్గా నిర్వహించాలి. అలాంటి బాలికల పునరావాసాన్ని ప్రభుత్వ బాధ్యతగా వ్యవస్థ పటిష్టం కావాలి. ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించే వ్యవస్థను నెలకొల్పాలి. → బాధితుల సమస్యల పరిష్కారంపైనే దృష్టి కేంద్రీకరించే విధంగా ప్రతి జిల్లాలో పిల్లలకు, మహిళలకు వైద్య, మానసిక, న్యాయ సేవలు అందుబాటులో ఉండాలి. → పోలీసులకు, న్యాయ వ్యవస్థ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం, విభాగాల మధ్య సమన్వయం, బాధితుల సంతృప్తి తీరుపై వార్షిక సమీక్ష అవసరం. → అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, వికలాంగుల విభాగాలకు సంబంధించిన బాలికలకు రాజ్యాంగం, అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందాల ప్రకారం తగిన గుర్తింపు ఇవ్వాలి. ఆయా ప్రయోజనాలు వారికి అందేట్లు చూడాలి. → లింగ నిష్పత్తి మెరుగుదల కోసం జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో గణాంకాల ను సమీక్షిస్తూ సంస్థల పనితీరును నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలపై పటిష్ట దర్యాప్తు పద్దతులు లేవు: జస్టిస్ పార్దీవాలా సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా మాట్లాడుతూ క్లిష్టమైన సైబర్ నేరాలను ఎదుర్కొనే దర్యాప్తు విధానాలు దేశంలో సమర్థంగా లేవని అన్నారు. ప్రస్తుత సైబర్ యుగంలో బాలికలు బాధితులుగా మారే ప్రమాదం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలుసహా భారతదేశంలోని అనేక స్థానిక తెగలలో బాలిక పుట్టినప్పుడు సంతోషంగా ఉత్సవాలను జరుపుకుంటారని, అది అందరూ నేర్చుకోవాల్సిన విషయమని సూచించారు. -
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచే పార్టీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడు పేర్లను ముందు పెట్టుకుని చర్చించిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ.. అందులో ఒక పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ప్రధానంగా పోటీలో ఉన్న దీపక్రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలతల్లో ఒకరి పేరును ఖరారుచేసినట్లు తెలుస్తోంది. బిహార్ సహా జూబ్లీహిల్స్ అభ్యరి్థత్వాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన కమిటీ ఆదివారం సమావేశమైంది.ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఇప్పటికే అధిష్టానం పెద్దలకు నివేదిక అందించారు. దీపక్రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలతల పేర్లతోనే ఆ నివేదిక అందింది. కమిటీ దీపక్రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. అభ్యరి్థని సోమవారం ప్రకటించే అవకాశం ఉందని కె.లక్ష్మణ్ చెప్పారు. -
శాంతి శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని బదులు మంత్రి కేవీ సింగ్
న్యూఢిల్లీ: ఈజిప్టులోని ఎర్ర సముద్ర తీర నగరం షర్మ్ ఎల్ షేక్లో సోమవారం జరిగే శాంతి శిఖరాగ్ర సదస్సు(పీస్ సమిట్)కు మన దేశం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ హాజరవనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా 20కి పైగా దేశాల నేతలు పాల్గొనే ఈ సమావేశానికి రావాలంటూ ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసి ప్రధాని మోదీకి ఆదివారం ఆహ్వానం పంపించారు. అయితే, ఆయన తన బదులుగా మంత్రి కేవీ సింగ్ను పంపిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాతోపాటు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్ప డమే లక్ష్యంగా జరిగే కార్యక్రమానికి ఈజిప్టు అధ్యక్షు డు ఎల్ సిసి, ట్రంప్ సహాధ్యక్షత వహించనున్నారు. గాజా శాంతి ఒప్పందంపై ఈ సందర్భంగా సంతకాలు జరుగుతాయి. శిఖరా గ్రానికి ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటె రస్, యూకే ప్రధాని స్టార్మర్, ఇటలీ ప్రధాని మెలోనీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తదితర నేతలు హాజరవ నున్నారు.బాంబు పేల్చిన హమాస్అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం అమలుపై అప్పుడే అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆదివారం హమాస్ చేసిన ప్రకటనే ఇందుకు తాజా ఉదాహరణ. సోమవారం ఈజిప్టులో జరిగే శాంతి శిఖరాగ్రాన్ని తాము బహిష్కరిస్తున్నామని హమాస్ తెలిపింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై తాము సంతకం చేసేది లేదని స్పష్టం చేసింది. -
పదపద.. ప్రపంచాన్ని చుట్టొద్దాం..!
ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో జీవితంలో ఆనందాలు అనుభవించేందుకు అందులో కొంత ఖర్చు చేసేందుకు వెనుకాడటంలేదు. ముఖ్యంగా విహార యాత్రలపై భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రత్యక్షంగా చూద్దామా అన్న ఆసక్తిని రేకెత్తించేలా సామాజిక మాధ్యమాల్లో విదేశీ నగరాలు, సందర్శనీయ స్థలాలు ఊరిస్తుండటంతో విదేశీ ప్రయాణాలు పెరుగుతున్నాయి. విదేశాలను చుట్టివస్తున్న భారతీయుల సంఖ్య అయిదేళ్లుగా పెరుగుతోంది. భారతీయుల విదేశీ ప్రయాణాల్లో 2020లో 31.9 శాతంగా ఉన్న విహార యాత్రికుల వాటా, 2024లో 42.5 శాతానికి చేరిందంటే ప్రజల్లో ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు.కేంద్ర పర్యాటక శాఖ ఇటీవల విడుదల చేసిన ఇండియా టూరిజం గణాంకాల ప్రకారం భారత్ నుంచి 2020లో మొత్తం 72.9 లక్షల మంది వివిధ దేశాల్లో పర్యటించారు. ఈ సంఖ్య 2024లో 3.08 కోట్లకు పెరిగింది. విహార యాత్రల్లో భారతీయుల తొలి డెస్టినేషన్గా థాయ్లాండ్ నిలిచింది. గత ఏడాది ఈ దేశానికి వెళ్లిన వారిలో ఏకంగా 92.93 శాతం మంది విహార యాత్రలకే వెళ్లారు. 2022తో పోలిస్తే థాయ్లాండ్ వెళ్లిన విహార యాత్రికుల సంఖ్య రెండింతలు పెరిగి గత ఏడాది 19.1 లక్షలకు చేరింది. -
మహాఘట్బంధన్ సంయుక్త మేనిఫెస్టో
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అధికార ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైన నేపథ్యంలో విపక్ష ‘మహాఘట్బంధన్’ కూటమి పార్టీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్, ఆర్జేడీ ముఖ్య నేతల మధ్య కీలక భేటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే సీట్ల పంపకాన్ని ఖరారుచేసి ఈ వారంలోనే సంయుక్త మేనిఫెస్టోను ప్రకటించాలని విపక్ష కూటమి భావిస్తోంది. నేడు జరగబోయే సమావేశం కోసం ఇప్పటికే ఆర్జేడీ అగ్రనేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్లు ఢిల్లీకి చేరుకున్నారు. భేటీ కోసం వచ్చానని లాలూ చెప్పగా కోర్టు కేసు కోసం వచ్చానని తేజస్వీ ఎయిర్పోర్ట్లో మీడియాతో చెప్పారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ తక్కువ సీట్లనే కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆనాడు 70 చోట్ల పోటీచేసి 17 చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెల్చిన విషయం తెల్సిందే. కాంగ్రెస్ గౌరవప్రదమైన ఆమోదనీయమైన స్థానాలను సాధించవచ్చని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అన్నారు. -
ఆపరేషన్ బ్లూస్టార్ తప్పుడు నిర్ణయం
సిమ్లా: సిక్కులకు పరమ పవిత్రమైన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో తిష్ట వేసిన సిక్కు వేర్పాటువాదులను ఏరివేసేందుకు 1984లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమలుచేసిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. వేరే విధంగా ఉగ్రవాదులను లొంగదీసుకునే మార్గం ఉన్నా, బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. ఆ తప్పుడు నిర్ణయానికి ఇందిరాగాంధీ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చిదంబరం వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తంచేయగా, కాంగ్రెస్పై బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది.ఇందిర ఒక్కరి నిర్ణయం కాదుఆపరేషన్ బ్లూస్టార్ ఇందిరాగాంధీ ఒక్కరి నిర్ణయం కాదని పీ చిదంబరం తెలిపారు. హిమాచల్ప్రదేశ్లోని కసౌలీలో నిర్వహించిన కుశ్వంత్సింగ్ లిటరరీ ఫెస్టివల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత హరిందర్సింగ్ భవేజా రాసిన తన అనుభవాలు, జ్ఞాపకాల సంకలనం ‘దె విల్ షూట్ యూ మేడం: మై లైఫ్ త్రూ కాన్ఫ్లిక్ట్’ ఆవిష్కరణ సందర్భంగా భవేజాతో చర్చలో చిదంబరం పాల్గొన్నారు. ‘మిలిటెంట్లను తరిమివేసేందుకు (గోల్డెన్టెంపుల్ నుంచి) వాళ్లందరీ నిర్బంధించేందుకు వేరే మార్గాలు ఉన్నాయి. కానీ, ఆపరేషన్ బ్లూస్టార్ తప్పుడు మార్గం. ఆ పొరపాటుకు ఇందిరాగాంధీ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించారని నేను అంగీకరిస్తాను. అయితే, ఆ నిర్ణయం ఇందిరాగాంధీ ఒక్కరిదే కాదు. సైన్యం, నిఘా వర్గాలు, పోలీసులు, సివిల్ డిఫెన్స్ సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం. అందువల్ల ఇందిరాగాంధీని ఒక్కరినే పూర్తిగా నిందించటం సరికాదు. ఇక్కడ ఏ సైన్యాధికారినీ తప్పుబట్టం లేదు. కానీ, ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిన కొన్నాళ్ల తర్వాత మిలిటరీ ప్రమేయం లేకుండా ఉగ్రవాదులను ఎలా లొంగదీసుకోవచ్చో మేం చూపించాం’ అని చిదంబరం అన్నారు. ఏమిటీ ఆపరేషన్ బ్లూస్టార్పంజాబ్ను స్వంతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సిక్కు వేర్పాటువాద నేత జర్నైల్ సింగ్ బింద్రన్వాలే నాయకత్వంలో వందలమంది సాయు«ధులు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో తిష్టవేశారు. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, వారిని అంతమొందించేందుకు 1984 జూన్ 1 నుంచి 10 వరకు ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. సైనికులు బూట్లు, ఆయుధాలతో గోల్డెన్ టెంపుల్లోకి ప్రవేశించటంతో సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో అదే ఏడాది అక్టోబర్ 31న ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే కాల్చి చంపారు. అయితే, 1986, 88లో కూడా స్వర్ణ దేవాలయంలో సిక్కు వేర్పాటువాదులు స్వర్ణ దేవాలయంలో తిష్టవేశారు. అప్పుడు సైనిక చర్య లేకుండానే వారిని ప్రభుత్వం లొంగదీసుకుంది. కాంగ్రెస్ అసహనం.. బీజేపీకి అవకాశంచిదంబరం వ్యాఖ్యలపై సొంతపార్టీ కాంగ్రెస్ నేరుగా స్పందించకపోయినా.. తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానం తీవ్ర మనస్తాపం చెందిందని కాంగ్రెస్ వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. ‘పార్టీ నుంచి పదవులు, అవకాశాలు అన్నీ పొందిన సీనియర్ నాయకులు ఏవైనా ప్రకటనలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పార్టీకి ఇబ్బందులు కలిగించేలా మాట్లాడవద్దు. అలా మాట్లాడటం అలవాటుగా అస్సలు మారకూడదు. పార్టీ అగ్ర నాయకత్వంతోపాటు పార్టీ మొత్తం తీవ్రంగా కలత చెందింది (చిదంబరం వ్యాఖ్యలతో). పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై ఆగ్రహంగా ఉంది’ అని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ముంబైపై 2008లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంతో యుద్ధం చేయాలని భావించినా, అమెరికా అడ్డుకోవటం వల్లే ఆగిపోయామని చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ను ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించేందుకు బీజేపీకి చిదంబరం వ్యాఖ్యలు మంచి అవకాశంగా మారాయి. కాంగ్రెస్ తప్పిదాలను చిదంబరం చాలా ఆలస్యంగా అంగీకరిస్తున్నారు. ముంబై దాడుల తర్వాత అమెరికా, అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్లనే పాకిస్తాన్తో యుద్ధం చేయకుండా వెనక్కు తగ్గామని మొన్ననే తెలిపారు. ఇప్పుడు ఆపరేషన్ బ్లూస్టార్ కూడా తప్పిదమని ఒప్పుకున్నారు’ అని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. నిజాన్ని చరిత్ర కచ్చితంగా రిక్డారు చేయాలి. ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టడం నాడు జాతీయ అత్యవసరం కాదు. అది రాజకీయ దుస్సాహసం. ఒక జాతీయవాదిగా ఆపరేషన్ బ్లూస్టార్ పూర్తిగా అవసరం లేని చర్య అని నేను భావిస్తున్నా. చిదంబరం నిజమే చెప్పారు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ పేర్కొన్నారు. -
అర్ధరాత్రి బయటకు ఎందుకొచ్చింది?
దుర్గాపూర్/కోల్కతా: పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాలో వైద్యవిద్యార్థిని సామూహిక అత్యాచార ఉదంతంలో భద్రతా వైఫల్యాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి వేళ విద్యార్థిని మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నార్త్బెంగాల్ ఏరియాలో ప్రకృతివిపత్తుతో ధ్వంసమైన ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తూ కోల్కతా ఎయిర్పోర్ట్లో మీడియాతో ఆమె మాట్లాడారు. మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించడంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ విఫలమైందని ఆరోపించారు. ‘‘ బాధిత విద్యార్థిని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకుంటోంది. ఈ లెక్కన ఆ కాలేజీలోని విద్యార్థినుల భద్రత, రక్షణ బాధ్యత ఆ కాలేజీదే. అర్ధరాత్రి 12.30 గంటలకు ఆ అమ్మాయి కాలేజీ నుంచి ఎందుకు బయటకు వచ్చింది? అమ్మాయి అర్ధరాత్రి బయటకు వస్తుంటే కాలేజీ సెక్యూరిటీ విభాగం ఏం చేస్తోంది? జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమని నేను కూడా ఒప్పుకుంటా. కానీ అసలు అమ్మాయి అర్ధరాత్రి బయటకు వెళ్తుంటే కాలేజీ యాజమా న్యం ఏం పట్టించుకుంటున్నట్లు? అర్ధరాత్రి బయ టకు అనుమతించే సంస్కృతిని ప్రైవేట్ కాలేజీని విడనాడాలి. అటవీ ప్రాంతంలోని ఆ కాలేజీ నుంచి అర్ధరాత్రి ఎవరినీ బయటకు అనుమతించకూడదు. అయినాసరే బయటకొ స్తామంటే వాళ్ల రక్షణ బాధ్యత వాళ్లే చూసుకోవాలి. అది పూర్తిగా అటవీప్రాంతం. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులను తప్పుబట్టడానికి ఏం లేదు. ఎందుకంటే పోలీసులకు సైతం కొన్ని పరిమితులు ఉంటాయి. వ్యక్తులు వ్యక్తిగతంగా రాత్రిళ్లు చేసే షికార్లను పోలీసులు ఎలా ముందే పసిగట్టగలరు?. రాత్రి ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తున్నారో పోలీసులకు ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్క ఇంటి ముందు పోలీసులు రక్షణగా నిలబడలేరుకదా?. రాష్ట్రేతర మహిళా విద్యార్థులు తాముండే హాస్టళ్ల నిబంధనలను అతిక్రమించకూడదు. రాత్రివేళ బయటకు వచ్చే సాహసం చేయకండి’’ అని మమత అన్నారు.బెంగాల్ మీదే ఎందుకు కక్ష ?‘‘చాలా రాష్ట్రాల్లో ఇలా గ్యాంగ్రేప్లు జరుగుతున్నాయి. ఒక్క బెంగాల్లో జరిగిన ఘటనలనే ఎందుకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుస్తున్నారు?’’ అని మీడియాను మమత ఎదురు ప్రశ్నించారు. ‘‘ఇలాంటి ఘటనలు పొరుగున ఉన్న బిహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశాలోనూ జరుగుతున్నాయి. కేసు విచారణ కోసం న్యాయస్థానాలకు వెళ్తున్న బాధితులను యూపీలో మార్గమధ్యంలోనే తగలబెడుతున్నారు. ఒడిశాలో బీచ్లలో రేప్ ఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటనల్లో అక్కడి ప్రభుత్వాలు ఏపాటి చర్యలు తీసుకున్నాయి. గత ఏడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఉదంతంలో మా ప్రభుత్వం నెలలోపే చార్జ్షీట్ దాఖలు చేసింది. కింది కోర్టు ఇప్పటికే మరణశిక్ష సైతం విధించింది’’అని మమత గుర్తుచేశారు.మండిపడ్డ విపక్షందారుణోదంతంపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వాల్సిందిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మమతా బెనర్జీపై విపక్ష బీజేపీ మండిపడింది. ‘‘ బాధితురాలికి అండగా నిలబడకుండా ఆమెనే నేరస్తురాలు అన్నట్లు మమత అత్యంత కర్కశంగా మాట్లాడుతున్నారు. బాధితురాలిని కష్టకాలంలో ఆదుకుని అండగా నిలబడాల్సిందిపోయి ఇలా మాట్లాడుతున్న మమతకు కనీసం పరిపాలించే హక్కు లేదు. మహిళాలోకానికే మమత మాయని మచ్చ’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఆర్జీ కర్ ఉదంతం, సందేశ్ఖాలీ ఘటనల తర్వాత రేప్ కేసుల్లో న్యాయం చేయడం మానేసి బాధితురాలినే సీఎం మమత తప్పుబడుతున్నారు’’ అని గౌరవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాత్రిళ్లు అవసరమైనా బయటకు వెళ్లకూడదట. వెళితే ఇలా రేప్లను ఎదుర్కోక తప్పదు అన్నట్లు మమత వ్యాఖ్యలున్నాయి’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు.ముగ్గురు నిందితుల అరెస్ట్, రిమాండ్గ్యాంగ్రేప్ ఘటనలో నిందితులు షేక్ రియాజుద్దీన్, షేక్ ఫిర్దౌస్, అప్పూలను ఆదివారం పోలీసులు అరెస్ట్చేశారు. ఘటన వేళ బాధితు రాలి ఫోన్ను లాక్కున్న నిందితులు వేరే వ్యక్తికి ఫోన్ చేశారు. అలా బాధితురాలి ఫోన్ కాల్డేటా విశ్లేషణ ద్వారా నిందితుల జాడ కనిపెట్టారు. బాధితురాలి స్నేహితురాలి పాత్ర పైనా పోలీసు లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసా గుతోంది. ముగ్గురు నిందితులను పోలీసులు ఆదివారం దుర్గాపూర్ సబ్ డివిజినల్ జ్యుడీషి యల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీళ్లను 10 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆయన ఆదేశాలి చ్చారు. రేప్ ఘటనలో పరోక్ష ప్రమేయం ఉండొచ్చన్న అనుమానంతో మరో వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.