breaking news
National
-
బ్రిక్స్ వేదిక: పాటతో అదరగొట్టిన మలేషియా ప్రధాని
సాధారణంగా శిఖరాగ్ర సమావేశాలు అంటే.. అధికారిక ప్రసంగాలు, తీవ్రమైన చర్చలే ఉంటాయి. బ్రిక్స్ వేదికగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తన గానంతో సందడి చేశారు. నిన్న(శనివారం) సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అందరినీ అలరించేలా ఓ క్లాసిక్ బాలీవుడ్ పాటను పాడారు. 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన.. డిన్నర్ కార్యక్రమంలో 1965 నాటి తీన్ దేవియాన్ సినిమాలోని కిషోర్ కుమార్ అమర ప్రేమ గీతం "ఖ్వాబ్ హో తుమ్ యా కోయ్ హకీకత్" పాటను పాడి ఉర్రూతలూగించారు.మజ్రూహ్ సుల్తాన్పురి రాసిన ఈ పాటను ఆలపించిన ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. సభలోని అందరి దృష్టిని ఆకర్షించారు. దౌత్యం, రాజకీయాలతో నిండిన ఆ రాత్రిని వినోదంగా మార్చారు. అన్వర్ ఇబ్రహీం తన వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పాటను పాడేందుకు అనుమతి కోరుతున్నట్లు క్యాప్షన్ రాశారు. ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "సర్, మీరు చాలా బాగా పాడారు; భారత్లో మీకు అద్భుతమైన సమయం గడిచిందని ఆశిస్తున్నాను’’ అంటూ ఓ యూజర్ కామెంట్ సెక్షన్లో రాశారు."వావ్, మిస్టర్ అన్వర్ ఇంత మధురంగా పాడగలరని నాకు తెలియదు. చాలా బాగుంది. మలేషియాలో ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడి నుంచి బోలెడన్ని ప్రేమపూర్వక శుభాకాంక్షలు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. భారతీయ పాటలపై మలేషియా ప్రధాని తన అభిమానాన్ని చాటుకోవడం ఇదే మొదటిసారి కాదు. భారతీయ సినిమా, సంగీతం పట్ల అభిమానాన్ని గతంలో కూడా పంచుకున్నారు. భారత్లో పర్యటించిన సమయంలోనూ ఆయన మీడియా సమావేశంలో సరిగ్గా ఇదే కిషోర్ కుమార్ పాటనూ, ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖేష్ క్లాసిక్ పాట "దోస్త్ దోస్త్ నా రహా"ను కూడా ఆలపించారు.Guru mintak izin nyanyi kejap ok! pic.twitter.com/NzazFHV509— Anwar Ibrahim (@anwaribrahim) September 12, 2026కాగా, బిక్స్ సదస్సులో మలేషియా ప్రధాని.. ప్రపంచ సమస్యలు, ఆర్థిక సంబంధాలు, వాణిజ్య పద్ధతులపై చర్చించారు. భారత్-మలేషియా దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశాలలో డిజిటల్ టెక్నాలజీ, పర్యాటకం వంటి రంగాలలో సహకారాన్ని మరింత విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే ప్రధాని మోదీ ప్రపంచ స్థాయి గుర్తింపును కొనియాడారు.ఇదీ చదవండి: లాడెన్ హిట్లిస్ట్లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు -
మోదీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. ఏం జరిగింది?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల సందర్భంగా షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక విందుకు మాత్రం హాజరుకాలేదు. శనివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించిన జిన్పింగ్.. రాత్రి జరిగిన గాలా డిన్నర్కు దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.కాగా, ప్రధాని మోదీ శనివారం బ్రిక్స్ దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల కోసం విందును ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే జిన్పింగ్ మాత్రం విందుకు రాలేదు. ఆయన ఎందుకు హాజరుకాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడికాలేదు. అయితే ఓ వర్గం సమాచారం ప్రకారం.. సదస్సు కార్యక్రమాల తర్వాత జిన్పింగ్ హోటల్కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ కూడా విందుకు హాజరుకాలేదు. అయితే ఆయన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వెళ్లారు. జిన్పింగ్ గైర్హాజరుపై కారణం స్పష్టత లేకపోవడంతో ఆయన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఏడేళ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన జిన్పింగ్.. మోదీతో డిన్నర్కు దూరంగా ఉండటం ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది కేవలం విశ్రాంతి కోసమేనా.. లేక మరేదైనా కారణమా అన్నది మాత్రం అధికారికంగా తేలాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. నిన్న (సెప్టెంబర్ 12) మోదీ-జిన్పింగ్ మధ్య సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా సరిహద్దు వివాదం, వాణిజ్య లోటు, మార్కెట్ యాక్సెస్, సరఫరా చైన్, రవాణా-ప్రజల మధ్య సంబంధాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా సరిహద్దు విషయంలో న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పనిచేయాలని ఇద్దరూ అంగీకరించారు. మోదీ ఇప్పటికే ఉన్న సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలను గౌరవించాలని స్పష్టం చేశారు. ఇక ఆర్థిక అంశాల్లో భారత్-చైనా మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం, మార్కెట్ యాక్సెస్ను సులభతరం చేయడం, సప్లై చెయిన్ సమస్యలను పరిష్కరించడంపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య విమానాలు, వీసాలు, కైలాస్ మానసరోవర్ యాత్ర వంటి సంబంధాలు కూడా క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ! -
‘బ్రిక్స్’కు చేరుకున్న ప్రధాని మోదీ.. రెండో రోజు అజెండా ఇదే..
న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు రెండో రోజుకు చేరుకుంది. దీనిలో పాల్గొనేందుకు ప్రధాని మోదీతో పాటు బ్రిక్స్ దేశాల నేతలు వేదిక వద్దకు చేరుకున్నారు. తొలి రోజు సమావేశాల్లో సభ్య దేశాల నేతలు ‘న్యూఢిల్లీ ప్రకటన-2026’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రపంచ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్కు మరింత పెద్ద పాత్ర కల్పించాలన్న ఆకాంక్షలకు మద్దతు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతోపాటు ఏకపక్ష ఆంక్షలు, సుంకాలు, వాణిజ్య పరిమితులపై ఆందోళన వ్యక్తం చేశారు.రెండో రోజు సమావేశాల్లో భారత్ 2026 అధ్యక్షతన నిర్దేశించిన స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే నాలుగు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పాలనలో సంస్కరణలకు సంబంధించి పది ప్రతిపాదనలు చేశారు. ప్రపంచ దక్షిణాది దేశాలు కేవలం నిబంధనలు అనుసరించే స్థాయి నుంచి వాటి రూపకల్పనలో భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ సాంకేతికతలు, వాటికి సంబంధించిన నియమాల రూపకల్పనలో సమాన భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. సముద్ర రవాణా సిబ్బంది అత్యవసర సహాయానికి ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi, Russian President Vladimir Putin and other world leaders at Bharat Mandapam PM Modi has hosted gala dinner for global leaders and delegates here (Source: DD) https://t.co/lOlKp0W7Df— ANI (@ANI) September 12, 2026బ్రిక్స్ ప్రకటనలో పశ్చిమాసియా సంక్షోభంపై ఆందోళన వ్యక్తమైంది. పౌరులు, పౌర మౌలిక వసతుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రపంచ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన ప్రవాహం సజావుగా కొనసాగేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పేర్కొంది. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారమే మార్గమని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు. భారత్-చైనా సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నట్లు జిన్పింగ్ పేర్కొన్నారు. మరోవైపు, బ్రిక్స్ దేశాలు కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికత, డిజిటల్ మౌలిక వసతులు, స్టార్టప్లు, సరఫరా వ్యవస్థల వంటి రంగాల్లో సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించి, మూల దేశాలకు పురాతన వస్తువులు, ఆధ్యాత్మిక, చారిత్రక వస్తువులను తిరిగి అప్పగించేందుకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. -
భారీ వర్షంలో గణేశుడు మీద పడి నలుగురు విలవిల
నలసోపారా: మహారాష్ట్రలోని నలసోపారాలో శనివారం సాయంత్రం వర్షం కారణంగా గణేశ్ విగ్రహం అదుపుతప్పి మీదపడటంతో నలుగురు మండప సభ్యులు దాని కింద చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి, వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. పశ్చిమ నలసోపారాలోని యశ్వంత్ గౌరవ్ ప్రాంతంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణేశ్ మండపానికి భారీ విగ్రహాన్ని తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. దీంతో విగ్రహం తడవకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పేందుకు వెంట వచ్చిన కొందరు ప్రయత్నించారు. ఈ క్రమంలో విగ్రహం పడిపోయింది.విగ్రహం కూలిన సమయంలో గణేశ్ మండపానికి చెందిన నలుగురు వ్యక్తులు దాని కింద చిక్కుకుపోయారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. అందులో కొందరు విగ్రహం కింద చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనను గమనించిన అక్కడున్న వారు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులు కూడా వారితో కలిసి విగ్రహాన్ని పైకి లేపి, కింద చిక్కుకున్న నలుగురిని బయటకు తీశారు. వేగంగా స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సహాయక చర్యలు పూర్తయిన అనంతరం విగ్రహాన్ని పైకి లేపి గణేశ్ మండపం వద్దకు సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. దీంతో మండప సభ్యులు, అక్కడున్న ఇతరులు ఊపిరి పీల్చుకున్నారు.ఇదీ చదవండి: ‘పద్మ’లో పడవ బోల్తా.. 10 మందిని రక్షించిన బీఎస్ఎఫ్ -
భార్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త!
భార్య వివాహేతర ప్రియుడిని గొంతు కోసి చంపిన భర్తకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ధర్మపురి జిల్లాలోని కరిమంగళంకు చెందిన పార్థిబన్, శారదాను గతంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత పార్థిబన్, అతని భార్య కృష్ణగిరి జిల్లాలోని హోసూర్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ నగర్లో నివసిస్తూ, సిబ్ కాట్ లోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈ స్థితిలో హోసూర్ పార్వతీ నగర్ కి చెందిన అమావాసై, శారదాకి మధ్య పరిచయం ఏర్పడి, అది చివరికి వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పార్థిబన్, ఆ సంబంధాన్ని వదులుకోమని తన భార్యను చాలాసార్లు మందలించాడు. అయినప్పటికీ, వారు తమ సంబంధాన్ని వదులుకోలేదు. ఈ స్థితిలో, 14.3.2017న, పార్థిబన్ తన భార్యతో తాను పనికి వెళ్తున్నానని చెప్పి, పనికి వెళ్లకుండా ఇంటి దగ్గర దాక్కున్నాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన అమావాసై, శారద సరదాగా గడుపుతున్నారు. ఇది చూసిన పార్థిబన్, తీవ్రమైన కోపంతో అమావాసై గొంతు కోసి చంపేశాడు. ఇది చూసి అతని భార్య శారద పారిపోయింది. ఈ విషయమై సిబ్కకట్ పోలీసులు కేసు నమోదు చేసి పార్థిబన్ ను అరెస్టు చేశారు. హోసూర్ అదనపు జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ జరుగుతున్న ఈ కేసులో జడ్జి సంతోష్ తీర్పు వెలువరించారు. అందులో, అమావసై గొంతు కోసి హత్య చేసినందుకు పార్థిబన్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. -
‘పద్మ’లో పడవ బోల్తా.. 10 మందిని రక్షించిన బీఎస్ఎఫ్
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో పద్మా నదిలో పడవ బోల్తా పడటంతో నదిలో కొట్టుకుపోయిన 10 మంది బంగ్లాదేశీయులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) రక్షించింది. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. బంగ్లాదేశ్లోని చాపైనవాబ్గంజ్ జిల్లాకు చెందిన వీరంతా నదిలోని ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయారు. పద్మా నదిలో చిక్కుకున్న వారిని బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించి, వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల వద్దకు చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చేందుకు లాల్గోలా పరిధిలోని తారానగర్ ప్రాంతం నుంచి స్పీడ్బోట్ను పంపించారు.బాధితులను రక్షించిన అనంతరం వారిని ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని నిర్ధారించిన తర్వాత, వారిని సురక్షితంగా బంగ్లాదేశ్కు తిరిగి పంపే ఏర్పాట్లను బీఎస్ఎఫ్ చేసింది. బంగ్లాదేశ్లో గత 24 గంటల్లో పద్మా నది నీటిమట్టం 3 సెంటీమీటర్లు పెరిగింది. హార్డింజ్ బ్రిడ్జి పాయింట్ వద్ద ప్రమాదకర స్థాయికి కేవలం 75 సెంటీమీటర్ల దిగువన నది ప్రవహించింది. పబ్నా వాటర్ డెవలప్మెంట్ బోర్డు (పీడబ్ల్యూడీబీ) హైడ్రాలజీ విభాగం ప్రకారం ఉదయం 9 గంటలకు నీటిమట్టం 13.05 మీటర్లుగా నమోదైంది. ప్రమాద స్థాయి 13.80 మీటర్లు కాగా, శుక్రవారం ఇదే సమయానికి 13.02 మీటర్లుగా ఉంది.ఇదీ చదవండి: ట్రంప్ చిన్ననాటి ఇంటికి భారీ ధర! -
హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్కు జరిమానా
బెంగళూరు: హెల్మెట్ ధరించకపోతే ద్విచక్ర వాహనదారులకు పోలీసులు జరిమానా విధించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే కారు డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని రూ.500 జరిమానా విధించిన సంఘటన బెళగావి జిల్లా అథణి పట్టణంలో వెలుగు చూసింది. అథణి పట్టణ నివాసి సుభాష్ అనే వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు నోటీసులు పంపించడంతో ఆశ్చర్యపోయాడు. తరువాత హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తూ వీడియో తీసి తనకు వచ్చిన నోటీసును సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఏఐ కెమెరా పనితీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: రష్యా పోలీసులు చిత్రహింసలు పెట్టారు -
లాడెన్ హిట్లిస్ట్లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు
అమెరికా సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ.. అమెరికా గూఢచార సంస్థ (CIA) సంచలన విషయాలు బయటపెట్టింది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. భారత్పై కూడా దాడులకు ప్లాన్ చేసినట్లు షాకింగ్ విషయం వెలుగులోకి తెచ్చింది. 1998లోనే ఈ కుట్రకు పథకం రచించినట్లు సీఐఏ తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాల ద్వారా బయటపడింది. బిన్ లాడెన్కు సంబంధించిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్లను, 100 పేజీలకు పైగా సమాచారాన్ని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ బహిర్గతం చేశారు.ఒసామా బిన్ లాడెన్ దాడులు జరపాలనుకుంటున్న దేశాల జాబితాలో భారత్తో పాటు పాకిస్థాన్, ఈజిప్ట్, అరేబియన్ ద్వీపకల్పంలోని దేశాలు, ఉగాండా, నైజీరియా ఉన్నాయి. అయితే, ఆ పత్రాల్లో భారత్లో ఎక్కడ? ఎప్పుడు? దాడి చేయాలనుకున్నారో వంటి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. "బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ స్టిల్ ఏ థ్రెట్" అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక.. అమెరికా దాడుల తర్వాత కూడా లాడెన్ నెట్వర్క్ చెదిరిపోలేదని పేర్కొంది.కాగా, ఉగ్రవాదుల ఉన్మాదానికి 2,977 మంది బలైపోయిన సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయ్యాయి. అగ్రరాజ్యం అమెరికానే సవాలు చేస్తూ ముష్కరులు సాగించిన మారణహోమాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై విరుచుకుపడింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడికి నిలిచిపోయింది. అల్ఖైదా శిక్షణలో రాటుతేలిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి పలు లక్ష్యాలను ఢీకొట్టారు.ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలపై జరిగిన దాడులు భారీ ప్రాణనష్టాన్ని, పెను విధ్వంసాన్ని సృష్టించాయి. న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన దాడిలో దాదాపు 2,750 మంది, పెంటగాన్ వద్ద 184 మంది, పెన్సిల్వేనియాలో 40 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగించిన మొత్తం 19 మంది ఉగ్రవాదులు సైతం మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో 400 మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరణించడం గమనార్హం. 9/11 దాడుల వల్ల అమెరికాకు 10 బిలియన్ డాలర్లుకుపైగా నష్టం వాటిల్లింది.ఇదీ చదవండి: ఘోర కలికి పాతికేళ్లు -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
కర్ణాటక: పక్షవాతంతో మంచాన పడిన భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య ఉదంతమిది. ఈ ఘటన బెంగళూరు అవలహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ముబారక్, షహీనాబాను దంపతులకు 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. ముబారక్కు పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. వీరి కుమార్తెకూ ఆరోగ్యం బాగాలేదు. బాలికకు చికిత్స అందించే సాకుతో నహీముద్దీన్ ఖురేషి అనే వ్యక్తి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కొద్దిరోజులకు షహీనాతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో ఉండడంతో తమ సంతోషానికి అడ్డు అని, పైగా రోగిష్టి అని షహీనా భావించింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక రచించింది. తల్లి హసీనా జాన్తో కలిసి భర్త మర్మాంగాన్ని కాలితో తన్ని తలపై దిండు పెట్టి చంపేసింది. కిత్తగనూరులోని యల్లప్ప గార్డెన్లో సెపె్టంబర్ 9న రాత్రి ముబారక్ (45) చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడని విలపిస్తూ షహీనా అందరినీ నమ్మించే యత్నం చేసింది. అయితే షహీనా వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ముబారక్ బంధువులు పోలీసులకు విషయం చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముబారక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ముబారక్ది సాధారణ మరణం కాదని, హత్యని తేలడంతో షహీనాబానును, ఆమె తల్లి హసీనా జాన్ను, షహీనా ప్రియుడు నహీముద్దీన్ ఖురేషిని అరెస్టు చేశారు. -
డ్యాన్స్ వీడియోపై కేరళం సీఎం విస్మయం
కొచ్చి: కొందరు ఉద్యోగులతో కలిసి తాను డ్యాన్స్ చేస్తున్నట్లుగా కృత్రిమ మేధ(ఏఐ)తో రూపొందించిన ఓ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతుండటంపై కేరళం సీఎం వీడీ సతీశన్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ వీడియో చూసి షాకైనట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, తరచూ కరెంటు కోతల నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి సతీశన్ డ్యాన్స్ చేస్తున్నట్లుగా వచ్చిన వీడియో వైరల్గా మారింది. శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సతీశన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ అంశాన్ని ఆయన సీరియస్గా తీసుకోలేదు. మలయాళం సూపర్స్టార్ మోహన్లాల్, తన స్నేహితుడు, తమిళనాడు సీఎం విజయ్ కంటే చాలా బాగానే డ్యాన్స్ చేసినట్లుగా అందులో కనిపించిందన్నారు. ఆ ఇద్దరు డ్యాన్సర్ల కంటే తానే బాగా డ్యాన్స్ చేశానంటూ నవ్వేశారు. అయితే, ఇలాంటి వీడియోలను ఏఐతో సృష్టించడంతో చూసి షాకయ్యానన్నారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కాపీరైట్ పరిరక్షణ చట్టాల్ని కఠినతరం చేయాల్సిన అవసరముందని సతీశన్ అన్నారు. -
బీఎస్పీలో ఆకాశ్, ఇషాన్లకు చోటు లేదు
లక్నో: సోదరుడు ఆనంద్ కుమార్ కుమారులు ఆకాశ్ ఆనంద్, ఇషాన్ ఆనంద్లకు బీఎస్పీలో ఎటువంటి రాజకీయ పదవులు ఇవ్వడం లేదని, ఇది తన అంతిమ నిర్ణయమని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. పార్టీలో కీలక పదవుల నుంచి ఆకాశ్ను తొలగిస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన మాయావతి..తాజాగా శనివారం ఈ విషయం తెలిపారు. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా పార్టీలో నాయకత్వ సమస్యలున్నాయంటూ వ్యాఖ్యానించిన మాయ కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సోదరుడు ఆనంద్ కుమార్ తన వెంటే ఉంటూ అవసరమైతే ఆయన ఏకైక కుమార్తె దీపికా ఆనంద్ సాయం తీసుకోవచ్చని అన్నారు. తన అంతిమ లక్ష్యం కాన్షీరాం జీ మాదిరిగానే బహుజన్ సమాజ్ కుటుంబ సంక్షేమమేనన్నారు. ఆయన మాదిరిగానే కుటుంబసభ్యులకు, బంధువులు పార్టీలో ఎలాంటి పదవులు కూడా ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. -
పీఎం మ్యూజియం, బ్రిక్స్ బజార్ను సందర్శించిన పెజెష్కియాన్ కుమార్తె
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తోపాటు భారత్ మండపానికి విచ్చేసిన ఆయన కుమార్తె జహ్రా శనివారం ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి మ్యూజియం’, బ్రిక్స్ బజార్లను సందర్శించారు. ప్రధానిమ్యూజియంలో ప్రజాస్వామ్య ఘనచరితను, భారతదేశ సాంస్కృతిక వారసత్వం తాలూకు విశేషాలను ఆమె తెల్సుకున్నారు. శిఖరాగ్ర సదస్సు జరిగే మండపానికి సమీపంలోని నేషనల్ క్రాఫ్స్ మ్యూజియంను సైతం ఆమె సందర్శించారు. అక్కడి బ్రిక్స్ బజార్లో ఆమె కలియతిరిగారు. చేతి వృత్తి కళాకారులు, సంప్రదాయక వస్తువుల విశేషాలను అడిగి తెల్సుకున్నారు. జహ్రా పెజెష్కియాన్ బ్రిక్స్ బజార్ను ఎంతో ఆసక్తిగా చూశారని ఆమెకు అక్కడ స్వాగతం పలికిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. బ్రిక్స్ బజార్లో బ్రెజిల్ మృణ్మయ పాత్రలు మొదలు బెలారస్లో విల్లో చెట్ల కొమ్మలతో అల్లిన కళాకృతులదాకా బ్రిక్స్ దేశాలకు చెందిన సంపద్రాయక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. తీన్ మూర్తి భవన్ కాంప్లెక్స్లోని మ్యూజియంను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ జూనియర్ సతీమణి లీజా అరానేటా కూడా సందర్శించారు. -
మాది అత్యంత పారదర్శక పద్ధతి: సీఈసీ
అహ్మదాబాద్: భారతదేశ ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాతో మొదలుపెట్టి ఓట్ల లెక్కింపు వరకూ ప్రతిదశలోనూ ధ్రువీకరణ జరుగుతూండటం ఇందుకు కారణమని ఆయన చెప్పారు. అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్శిటీ అటల్ కలామ్ హాల్లో శుక్రవారం బూత్ లెవల్ ఆఫీసర్లతో సీఈసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రతిదశలోనూ రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు నిరంతరం ధ్రువీకరణ చేస్తూంటారు కాబట్టి ఇది అత్యంత పారదర్శక ఎన్నికల విధానమని స్పష్టం చేశారు. -
గణేశ్ మండపం వ్యర్థాలతో ఇంధనం
ముంబై: ఈ ఏడాది ముంబైలోని ప్రఖ్యాత లాల్బాగ్చా గణేశ్ మండపం వద్ద ఏర్పడే ప్రసాద వ్యర్థాలు మొత్తం ఇంధనంగా మారనుంది. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన ‘ప్రసాద్ టు ఎనర్జీ’ కార్యక్రమంలో భాగంగా ప్రసాదం తయారీ, పంపిణీల సమయంలో పుట్టుకొచ్చే సుమారు 80 టన్నుల వ్యర్థాలను బయోమెథనైజేషన్ ద్వారా వంట గ్యాస్గా మార్చనున్నారు. ఈ గ్యాస్తో ఉత్పత్తి అయ్యే 7700 యూనిట్ల విద్యుత్తును ముంబైలోని నాలుగు మున్సిపల్ ఆసుపత్రుల్లో వాడనున్నారు. సెలెబ్రిటీలు సహా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే లాల్బాగ్చా రాజా మండల్ సాయంతో తామీ కార్యక్రమం చేపట్టినట్లు బీఎంసీ ప్రకటించింది. సోమవారంతో మొదలై మొత్తం పదకొండు రోజులపాటు జరిగే గణేశ్ ఉత్సవాల్లో రోజూ కనీసం 8 నుంచి పది టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూంటుందని బీఎంసీ అంచనా వేస్తోంది. ఈ చెత్తను అక్కడికక్కడే వేరు చేసి ప్రత్యేక వాహనాల ద్వారా నాయర్, కస్తూర్బా, జీటీబీ, సియాన్ ఆసుపత్రుల్లోని బయోమెథనైజేషన్ ప్లాంట్లకు తరలిస్తారు. ఈ ప్లాంట్లు ఒకొక్కటి రోజుకు రెండు టన్నుల వరకూ చెత్తను గ్యాస్గా మార్చగలవు. అయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మాత్రం చెత్తను బట్టి మారిపోతూంటుంది. ఆసుపత్రుల్లోని విద్యుత్తు దీపాలను వెలిగించేందుకు ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడతామని బీఎంసీ తెఇపింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ కంపెనీకి అప్పగించామని తెలిపింది. తడిచెత్త సాయంతో విద్యుత్తు ఉత్పత్తి చేసి చెత్త సమస్యను పరిష్కరించవచ్చునన్న సందేశాన్ని అందరికీ పంపేందుకే తామీ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపింది. -
రష్యా పోలీసులు చిత్రహింసలు పెట్టారు
కాన్పూర్: రష్యా రాజధాని మాస్కోలో పోలీసులు తనను అనవసరంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశారని యూపీలోని కాన్పూర్కు చెందిన చందన్ గుప్తా(45) ఆరోపించారు. నోయిడాలోని యూఫ్లెక్స్ అనే కంపెనీ తరఫున 2023 నుంచి భార్య, కుమారుడితోపాటు మాస్కోలో ఉంటున్నట్లు చందన్ చెప్పారు. రష్యా పోలీసుల కస్టడీలో దాదాపు 48 గంటలు గడిపిన తర్వాత మాస్కో నుంచి తిరిగి స్వదేశానికి వచ్చేశానన్నారు. అక్కడి పోలీసులు తనను, తన స్నేహితుడిని దుర్భాషలాడటంతోపాటు, బెదిరించి, చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఈ సంఘటన తనను ఎంతో వేదనకు గురిచేసిందని, ఇకపై రష్యా ఒక్కటే కాదు, విదేశాలలో ఎన్నడూ పనిచేయరాదని నిర్ణయించుకున్నట్లు శనివారం చెప్పారు. ‘ఈ నెల 5వ తేదీ రాత్రి మిత్రుడు ఆశిష్తో కలిసి మాస్కోలోని కిటే గొరోడ్ మెట్రో స్టేషన్కు, హాంగింగ్ బ్రిడ్జి, అటు నుంచి రెడ్ స్క్వేర్ వైపు నడిచి వెళ్తుండగా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. తాము మద్యం మత్తులో ఉన్నట్లు, అంబులెన్సు కిటికీ అద్దాన్ని పగులగొట్టామని ఆరోపిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఏవో పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులను కూడా కలవనివ్వలేదు. మా కంపెనీ లాయర్ల జోక్యంతో దాదాపు 48 గంటల తర్వాత విడిచిపెట్టారు’అని ఆరోపించారు. రెండు రోజుల క్రితం చందన్ గుప్తా భార్య స్నేహ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన భర్తను విడిపించేందుకు సాయం చేయాలంటూ యూపీ సీఎం యోగిని అందులో కోరారు. మాస్కోలోని భారత ఎంబసీ తమకు ఎటువంటి సాయం చేయలేదని, రష్యా పోలీసులు చేసిన ఆరోపణలనే వినిపించిందన్నారు. -
బ్రిక్స్ ఎఫెక్ట్..! దేశ రాజధానిలో హోటళ్లకు ఫుల్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు హోటల్ పరిశ్రమకు భారీ డిమాండ్ను తీసుకొచ్చింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు, దౌత్యవేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో, ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో హోటల్ గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సుమారు 3 వేల గదులు బుక్కయినట్లు సమాచారం. హోటల్ గది అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. రూ.80 వేల నుంచి రూ.2.3 లక్షల దాకాసాధారణ రోజుల్లో ఫైవ్స్టార్ హోటళ్లలో రూ.10వేల నుంచి రూ.18 వేల వరకు ఉండే లగ్జరీ హోటల్ గది అద్దె ప్రస్తుతం రూ.80 వేలు, అంతకంటే ఎక్కువకు చేరినట్లు హాస్పిటాలిటీ రంగ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని ఫైవ్స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో రోజుకు రూ.18వేల నుంచి రూ.25 వేల వరకు అద్దె వసూలు చేసే హోటళ్లు ఇప్పుడు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. హోటల్ ఐటీసీ మౌర్యాలో గదికి 11, 12వ తేదీల్లో కేవలం ఒకే ఒక్క రాత్రికిగాను ఏకంగా రూ.2.30 లక్షల బిల్లు వేయడం గమనార్హం. కొన్ని హోటళ్లలో గదులు పూర్తిగా బుక్ కాగా, మరికొన్ని చోట్ల గదులు అందుబాటులో లేకుండా పోయాయి. సదస్సు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, దాదాపు సెప్టెంబర్ 20 వరకు టారిఫ్లు అధికంగానే ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హోటల్ ‘ఐటీసీ మౌర్య’లో రష్యా అధ్యక్షుడు పుతిన్ బస చేస్తున్న క్రమంలో ఆయన దృష్టిని ఆకర్షించేందుకు వారం రోజుల ముందే దేశంలోని సంపన్న వర్గాలకు చెందిన వారు సైతం ఆ హోటల్లో ప్రైవేటు గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బస చేసిన తాజ్ ప్యాలెస్లోని గదులకూ డిమాండ్ ఆకాశాన్నంటింది.సెంట్రల్ ఢిల్లీకే పరిమితం కాని డిమాండ్బ్రిక్స్ శిఖరాగ్రం ప్రభావం కేవలం సెంట్రల్ ఢిల్లీలోని ఒబెరాయ్, తాజ్ ప్యాలెస్, లీలా ప్యాలెస్ వంటి ఫైవ్స్టార్ హోటళ్లకే పరిమితం కాలేదు. ఏరోసిటీ, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లోని హోటళ్లకూ భారీగా బుకింగ్స్ వచ్చాయి. అనేక హోటళ్లలో గదుల లభ్యత దాదాపు లేనట్లు సమాచారం. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ సభ్యుడు రాజన్ సెహగల్ మాట్లాడుతూ.. బ్రిక్స్ సదస్సు భారత్ ఆతిథ్య, పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించే గొప్ప అవకాశమని అన్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, భారీ ప్రతినిధి బృందాలతో భారత్కు వస్తున్నప్పుడు హోటళ్లలో డిమాండ్ పెరగడం సహజమేనని తెలిపారు. ల్యూటెన్స్ ఢిల్లీతో పాటు ఎన్సీఆర్లోని హోటళ్లు కూడా భారీ బుకింగ్స్తో కళకళలాడుతున్నాయని చెప్పారు.అధినేతల కోసం అత్యున్నత స్థాయి గదులుదేశాధినేతలు, మంత్రులు, సీనియర్ దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు సాధారణంగా హోటళ్లలో అత్యున్నత కేటగిరీ గదులనే ఎంచుకుంటారని కేంద్ర అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో పరిమిత సంఖ్యలో ఉన్న ప్రీమియం గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగి అద్దెలు భారీగా పెరిగాయి. భారత ఆతిథ్యానికి ప్రపంచ వేదికబ్రిక్స్ సదస్సు కేవలం హోటల్ రంగానికి వ్యాపార అవకాశాలను కల్పించడమే కాకుండా.. ప్రపంచానికి భారతీయ సంçస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, సంగీతం, నృత్యాలు, ఆతిథ్యాన్ని పరిచయం చేసేందుకు గొప్ప అవకాశమని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ ఇప్పటికే జీ20, ఏఐ సదస్సు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని గుర్తుచేస్తూ.. బ్రిక్స్ సదస్సుతో కూడా దేశ పర్యాటక రంగానికి మరింత అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని అంటున్నాయి.ప్రాంతీయ వంటకాలు.. సాంస్కృతిక కార్యక్రమాలుబ్రిక్స్ ప్రతినిధులకు మన దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు, వంటకాలను పరిచయం చేస్తున్నట్లు ఢిల్లీ హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ మురళీమణి మీడియాకు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన సంçస్కృతి, ఆహార వైవిధ్యం ఉందని, అందుకు అనుగుణంగా వివిధ రకాల వంటకాలను హోటళ్లలో అందిస్తున్నట్లు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. బడ్జెట్ హోటళ్లలోనూ ప్రాంతీయ వంటకాలను అందించేలా హోటల్ యాజమాన్యాలకు కేంద్రం ముందుగానే సూచనలు చేసినట్లు తెలిసింది. -
భారత్ ఇన్నోవేషన్కు ప్రపంచ దేశాలు ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: 18వ ‘బ్రిక్స్’శిఖరాగ్ర సద స్సు వేదికగా భారత్ తన సాంకేతిక, పరిశోధ నా, స్టార్టప్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్లు, ల్యాబొరేట రీలు, రీసెర్చ్ పార్క్ల నుంచి వెలువడిన అత్యాధునిక డీప్టెక్ ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో ‘బ్రిక్స్’లో ప్రదర్శన ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో దేశానికి చెందిన 37 అత్యాధునిక డీప్టెక్ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజారోగ్యం, వైద్యం, పునరుత్పాదక ఇంధనం, సముద్ర సాంకేతికత, విద్యుత్ వాహనాలు, మాతా–శిశు ఆరో గ్యం వంటి విభిన్న రంగాలకు చెందిన సాంకేతిక పరిష్కారాలను ఇందులో ప్రదర్శించారు. వాటిలో ము ఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యవస్థ, నీటిపై ఏర్పాటు చేసే ఫ్లోటింగ్ సోలార్ పీవీ సాంకేతికత, మెరైన్ రోబోటిక్స్, అరుదైన ఖనిజాల అవసరం లేని రేర్ ఎర్త్ ఫ్రీ ఈ–పవర్ట్రెయిన్లు, ఏఐ ఆధారిత తల్లి– గర్భస్థ శిశువు ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ వంటి వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు. భారత్ ఉన్నత విద్యా వ్యవస్థలో రూపుదిద్దు కుంటున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కేంద్రం పే ర్కొంది. దేశంలోని స్టార్టప్లు, ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రయోగ శాలలు, రీసెర్చ్ పార్క్లను ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, విశ్వవిద్యాల యాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వాలు, విదేశాల్లోని భారతీయ పూర్వ విద్యార్థుల నెట్వర్క్తో అనుసంధానం చేయడానికి ఇది ఉపయోగపడనున్నట్లు వేదిక సందర్భంగా కేంద్రం పేర్కొంది. ఈ వేదిక ద్వారా భారత ఆవిష్కర్తలకు కేవలం తమ సాంకేతికతను ప్రదర్శించే అవకాశమే కాకుండా పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాలు, అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశం వంటి అవకాశాలు లభించనున్నాయి.‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరంతో..శుక్ర, శనివారాల్లో జరిగిన ‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరం కార్యక్రమంతో ఈ ప్రదర్శనను అను సంధానం చేశారు. దీంతో ‘బ్రిక్స్’ సభ్య దేశాలకు చెందిన సీఈఓలు, పెట్టుబడి దారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ ప్రతినిధులతో భారతీయ స్టార్టప్లు నేరుగా పరిచయం ఏర్పరుచుకునే అవకాశం లభించింది. బిజినెస్–టు–బిజినెస్(బీ2బీ) సమావేశాలు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, పెట్టుబడి చర్చలు, వ్యాపార సంబంధాల ఏర్పాటు అంశాలకు ఈ వేదిక దోహదపడిందని కేంద్రం పేర్కొంది. భారత్ 2026 ‘బ్రిక్స్’ అధ్యక్షతన నిర్దేశించిన ‘బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబి లిటీ’ అనే థీమ్కు అనుగుణంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. బిక్స్ ఎడ్యుకేషన్ ట్రాక్లో గుర్తించిన ఐదు ప్రాధాన్య రంగాల్లో ఒకటైన ‘పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్లను బలోపేతం చేయడం’ లక్ష్యాన్ని ఈ ప్రదర్శన ముందుకు తీసుకెళ్తుందని కేంద్రం తెలిపింది. 2026లో భారత డీప్టెక్ స్టార్టప్ల కోసం నిర్వహిస్తున్న ప్రధాన ఎక్స్పోజిషన్లలో ఇది రెండోది. తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జూన్ 14 నుంచి 16 వరకు నిర్వహించారు. తాజాగా బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ రెండో ఎడిషన్ ద్వారా భారత ఆవిష్క రణలను ‘బ్రిక్స్’ దేశాల నాయకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల దృష్టికి తీసికెళ్లడం గమనార్హం.ఆవిష్కర్తలతో విద్యాశాఖ మంత్రి ముచ్చటకేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి భారత్ మండపంలోని ఎక్స్ పోజిషన్ను సందర్శించి డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలతో మాట్లా డారు. వివిధ రంగాల్లో భారతీయ యువ ఆవిష్కర్తలు రూపొందించిన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ఆయన పరిశీలించారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని డీప్టెక్ స్టార్టప్లకు అంతర్జాతీయ స్థాయి వేదిక లభిస్తోందని జోషి పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనే ప్రపంచ నాయకుల ముందు భారతీయ స్టార్టప్లు తమ ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ వేదిక ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందని వ్యాఖ్యానించారు. -
2 దశాబ్దాల బ్రిక్స్ స్మారక స్టాంప్
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా రెండు స్మారక తపాలా బిళ్లలను పోస్టల్ శాఖ శనివారం విడుదలచేసింది. ఢిల్లీలో 18వ సమావేశంలో ఈ రెండు పోస్టల్ స్టాంప్లను విడుదలచేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు తపాలా బిళ్లలపై ‘బ్రిక్స్: రెండు దశాబ్దాల సహకారం, 2006–2026’ అని ఇంగ్లిష్, హిందీలో ముద్రించారు. పరస్పర విశ్వాసానికి ప్రతీకగా తొలి స్టాంప్ను, భారత్ అధ్యక్షత సమావేశాలు, కూటమి దార్శనికత, లోగోను గుర్తుచేస్తూ మరో స్టాంప్ను విడుదలచేశారు. -
ద్విపాత్రాభినయం తప్పదు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాల నూతన అంతర్జాతీయ విపణుల మధ్య సహకారానికి అత్యంత ప్రభావవంతమైన వేదికగా బ్రిక్స్ కూటమి ఎదిగిందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ఆయన ఈ కూటమి దేశాల అగ్రనేతలనుద్దేశించి కీలక ప్రసంగంచేశారు. ‘‘పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపనకు బ్రిక్స్ దేశాలు ద్విపాత్రాభినయం చేయాల్సిందే. ఎందుకంటే పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లోని యుద్ధాలు, మారుతున్న విపరిణామాలతో ఆయా ప్రాంతాల ప్రజలు కష్టాల కడలిలో పడిపోయారు. అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్గుతోంది. ఇకనైనా పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల అగ్రనేతలు ఉమ్మడిగా పోరాడాలి. చరిత్ర గుర్తుంచుకునేలా సరైన పథంలో నడిచి ఈ ప్రాంతాల పురోభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలి’’అని జిన్పింగ్ పిలుపునిచ్చారు. చైనా సైతం పశ్చిమాసియా, గల్ఫ్లో శాంతి,సుస్థిరత కోసం ఈ కూటమితో కలిసి సమష్టిగా కృషిచేస్తుందని స్పష్టంచేశారు. ఆ మనస్తత్వం మానండి.. ‘‘ఇకనైనా బ్రిక్స్ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి మనస్తత్వాన్ని వీడాలి. సభ్య దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం మానుకోవాలి. ఆయా దేశాల సార్వ¿ౌమత్వాలకు భంగం వాటిల్లేలా వ్యవహరించడం వంటి పనులకు చరమగీతం పాడాలి. శత్రుత్వాలకు త్యజించాలి. ఇందుకోసం పరస్పర అవగాహన, విశ్వాసం పెంచుకోవడంపై కూటమి దేశాలు దృష్టిపెట్టాలి. బ్రిక్స్ దేశాలు స్వావలంబన సాధిస్తూనే, దేశీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే సరికొత్త అభిృవృద్ధిబాటల్లో పయనించడం శుభసూచకం. అగ్రదేశాల ఆధిపత్య విధానాలు, కేంద్రీకృత రాజకీయాల విపరిణామాల దుష్పఫలితాలను మనందరం చవిచూస్తున్నాం. దీంతో శాంతి, అభివృద్ధి, భద్రత, సుపరిపాలన అనేవి కష్టమవుతున్నాయి. వీటికి పరిష్కారాలు వెతుకుదాం. కోవిడ్ సంక్షోభాన్ని సమష్టిగా ఎదుర్కొన్నట్లు ఇకమీదటా వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకుందాం’’అని జిన్పింగ్ అన్నారు. -
జిన్పింగ్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సుకు హాజరైన అగ్రనేతల గౌరవార్థం ప్రధాని మోదీ శనివారం రాత్రి ఇచ్చిన విందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరుకాలేదు. విందులో జిన్పింగ్ ఎందుకు హాజరుకాలేదనే విషయంలో అధికారికంగా ఎలాంటి కారణాలు వెల్లడికాలేదు. కానీ శిఖరాగ్ర సదస్సులో సుదీర్ఘంగా పాల్గొని అలసిపోయిన ఆయన తన హోటల్ గదికి విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రధాన సమావేశానికి హాజరైన అబూదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ సైతం వెంటనే స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. దీంతో ఈయన సైతం బ్రిక్స్ గాలా డిన్నర్కు గైర్హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇతర బ్రిక్స్ దేశాల అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విందులో పాల్గొన్నారు. విందులో అత్యంత రుచికరమైన గుజరాతీ చిరుతిండి అయిన ఖండ్వీ మిలే ఫియులే, కుంభ్ గలౌతీ కబాబ్, పనీర్ లబాబ్దార్, గుచ్చీ మారి్మక్, క్యారెట్–బీన్ పొరియల్, చిరుధాన్యాల పులావ్లను వడ్డించారు. పాత ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్, జిలేబీ, షతూత్ ఫిర్నీలనూ అందించారు. -
విభేదాలు వివాదాలుగా మారొద్దు
న్యూఢిల్లీ: భారత్–చైనా సంబంధాలు మరింత బలోపేతం కావాలంటే ఇరుదేశాల సరిహద్దు వద్ద శాంతియుత వాతావరణం నెలకొనడం అత్యవసరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు స్పష్టం చేశారు. సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత ఒప్పందాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానంగా భారత్, చైనా సంబంధాలపై చర్చించారు. వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం, బహుపాక్షిక వేదికలపై న్యాయమైన, పారదర్శక వాణిజ్యం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇరువురు నేతలు పునరుద్ఘాటించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని వారు పేర్కొన్నట్లు వెల్లడించింది. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం వాణిజ్య అసమతుల్యత, సప్లై చైన్లు, మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేయడం వంటి అంశాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయానికి వచ్చారు. సమగ్ర ద్వైపాక్షిక సంబంధాలు, ఇరుపక్షాల దీర్ఘకాలిక ప్రయోజనాల ఆధారంగా సరిహద్దు సమస్యకు న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పరస్పర సంబంధాల విషయంలో భారత్, చైనాలు పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం అనే మూడు అంశాల ఆధారంగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు జిన్పింగ్ శనివారం ఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటల తర్వాత ఈ సమావేశం జరిగింది. జిన్పింగ్ భారత్లో పర్యటిస్తుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఉమ్మడి కార్యాచరణ మరింత విస్తృతం గత ఏడాది ఆగస్టులో టియాంజిన్లో జరిగిన తమ చివరి సమావేశం తర్వాత భారత్–చైనా సంబంధాల్లో సాధిస్తున్న స్థిరమైన పురోగతిని మోదీ, జిన్పింగ్ స్వాగతించారని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. రెండు దేశాలు తమ సంబంధాల పట్ల వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండాలని వారు పునరుద్ఘాటించినట్లు వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులే ప్రాతిపదికగా నిలుస్తాయని ప్రధాని మోదీ తేల్చిచెప్పారని ఉద్ఘాటించింది. సరిహద్దు సంబంధిత అంశాలపై ప్రస్తుతం అమల్లో ఒప్పందాలు, అవగాహనలను ఇరుపక్షాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారని పేర్కొంది. ప్రజల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని ఇద్దరు నేతలు గుర్తించారని, రెండు దేశాల మధ్య సాంస్కృతిక మారి్పడి, వాణిజ్య సంబంధాలు, రాకపోకలను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చారని తెలిపింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో ఉమ్మడి కార్యాచరణను మరింత విస్తృతం చేయాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయించినట్లు సమాచారం. భారత్ చేపట్టిన బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలకు చైనా అందించిన మద్దతును, కూటమి శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావడంలో చైనా చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు.భారత్, చైనాలపై పెద్ద బాధ్యత: జిన్పింగ్ భారత్–చైనా సంబంధాల అభివృద్ధిని బీజింగ్ ఎల్లప్పుడూ వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతోనే చూస్తోందని జిన్పింగ్ స్పష్టంచేశారు. మన రెండు దేశాల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నప్పటికీ మనం ఒకరికొకరు అండగా నిలుస్తూ ఉమ్మడి అభివృద్ధి మార్గంలో పయనించవచ్చని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా, గ్లోబల్ సౌత్లో కీలక సభ్యులుగా భారత్, చైనాలు పెద్ద బాధ్యతలను కలిగి ఉన్నాయని వివరించారు. ఇరుపక్షాలు మానవాళి భవిష్యత్తును, తమ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సహకారాన్ని పెంపొందించుకోవడానికి, సమ్మిళిత ఆర్థిక భవిష్యత్తు దిశగా మనం కలిసి పనిచేయాలని జిన్పింగ్ భారత్కు పిలుపునిచ్చారు. -
స్నేహగీతం..!
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో అత్యంత విశేషమైన ఘట్టం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన కుడివైపున రష్యా అధ్యక్షుడు పుతిన్తో, ఎడమ వైపున చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చేతులు కలిపి చిరునవ్వులు చిందించారు. ముగ్గురు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. తామంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నామని ప్రపంచానికి చాటిచెప్పారు. సరిహద్దు వివాదాలు, విభేదాలు ఉన్నప్పటికీ భారత్, చైనా మధ్య అనుబంధం చెక్కుచెదరలేదని మోదీ సంకేతాలిచ్చారు. శనివారం బ్రిక్స్ సదస్సు జరిగిన భారత్ మండపం వద్ద తీసిన ఈ చిత్రాన్ని ప్రధానమంత్రి ఇన్స్టా్రగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు ‘కింగ్డమ్ బీజీఎం’అనే పాట నేపథ్య సంగీతంగా వినిపిస్తోంది. ముగ్గురు దేశాధినేతల స్నేహగీతం సదస్సు వేదిక వద్ద అందరినీ ఆకట్టుకుంది. ఆప్యాయతతో కూడిన ఈ క్షణం ప్రత్యేకంగా నిలిచింది. మోదీ సోషల్ మీడియాలో మరికొన్ని ఫొటోలను సైతం మోదీ పోస్ట్ చేశారు. పుతిన్, షీ జిన్పింగ్లతోపాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో దిగిన చిత్రాలున్నాయి. మరొక చిత్రంలో పుతిన్, షీ జిన్పింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోలతో మోదీ ఉత్సాహంగా చర్చిస్తూ కనిపించారు. -
చర్చలే శరణ్యం!
న్యూఢిల్లీ: సంఘర్షణలు, సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల్లోనే శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న భారతదేశం పిలుపును బ్రిక్స్ కూటమి దేశాల అధినేతలు సమరి్థంచారు. ఈ మేరకు శనివారం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇరాన్తోపాటు సౌదీ అరేబియా, యూఏఈ సైతం ఆమోదం తెలిపాయి. పశ్చిమాసియా యుద్ధంపై నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి ఇరాన్, యూఏఈలు ఈ డిక్లరేషన్ విషయంలో ఒక్కటి కావడం విశేషం. భారతదేశానికి ఇది ముఖ్యమైన దౌత్యవిజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ ప్రకటనలో ఇరాన్పై అమెరికా దాడుల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని కూడా తప్పుపట్టలేదు. గాజాలో హింసాకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తేల్చిచెప్పారు. ‘వర్తించే’అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్యం, సప్లై చైన్లు, ఇంధన సరఫరా సజావుగా కొనసాగానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని కూటమి నేతలు నొక్కిచెప్పారు. తొలుత ఇరాన్, యూఏఈలు తమ కఠిన వైఖరిని ప్రదర్శించడంతో ఈ డిక్లరేషన్ పాఠంపై చర్చలు చివరి నిమిషం వరకు కొనసాగాయి. బ్రిక్స్ అనేది ఏకాభిప్రాయం ఆధారంగా పనిచేసే కూటమి. ఏ ఒక్క సభ్య దేశం వ్యతిరేకించినా డిక్లరేషన్ ఆమోదం పొందదు. ఏకపక్ష ఆంక్షలు, బలవంతపు చర్యలు వద్దు విచక్షణారహిత సుంకాలు, నాన్–టారిఫ్ చర్యలు, సంరక్షణవాదం వంటి వాణిజ్య నిరోధక చర్యలపై బ్రిక్స్ దేశాలు తమ డిక్లరేషన్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి ప్రపంచ వాణిజ్యాన్ని మరింత తగ్గించి, సప్లై చైన్లకు అంతరాయం కలిగించి, ఇప్పటికే ఉన్న ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను పరోక్షంగా తప్పుపట్టాయి. అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమైన ఏకపక్ష ఆంక్షలు, బలవంతపు చర్యలను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాయి. బ్రిక్స్ సదస్సులో తొలి రోజు చర్చల ముగింపు సందర్భంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించినట్లు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని డిక్లరేషన్ పేర్కొంది. గరిష్ట సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టంచేసింది. ఇతర దేశాల సార్వ¿ౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని తెలిపింది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా పౌరులు, పౌర మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించాలని వెల్లడించింది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి, భద్రత, స్థిరత్వానికి దోహదపడే దీర్ఘకాలిక అవగాహన కోసం చర్చలు, దౌత్యం ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నామని స్పష్టంచేసింది. ఉగ్రవాదులను కోర్టు ముందు నిలబెట్టాల్సిందే గత ఏడాది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో 26 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడిని బ్రిక్స్ కూటమి అత్యంత తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే సహించడానికి వీల్లేదని, ఈ ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలన్న భారత్ పిలుపునకు పూర్తి మద్దతు తెలిపింది. ఉగ్రవాద సవాలును ఎదుర్కోవడంలో సమష్టి విధానాన్ని అవలంబించడానికి కూటమి నేతలు అంగీకరించారు. ‘‘సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఆశ్రయం కల్పించడం సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం’’అని డిక్లరేషన్లో తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ఏ మతం, జాతీయత, నాగరికత, జాతి సమూహంతో ముడిపెట్టకూడదని ఉద్ఘాటించారు. -
రూల్స్ మనమే రూపొందించాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్ సౌత్ దేశాలు ‘నియమాలను రూపొందించేవిగా’మారాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ప్రపంచ పాలనలో ప్రస్తుతం ఉన్న ‘విశేషాధికారాల పిరమిడ్’స్థానంలో ‘భాగస్వామ్య వేదిక’కావాలని తేల్చిచెప్పారు. రెండు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా మొదలైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. బ్రిక్స్ చట్రం కింద ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 పాయింట్ల రోడ్మ్యాప్ను ప్రతిపాదించారు. ప్రపంచ, ప్రాంతీయ సంక్షోభాల వల్ల అధిక ముప్పును ఎదుర్కొంటున్న నావికుల రక్షణ కోసం ‘సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్’ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో, అబూదాబీ యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది బ్రిక్స్కు భారత్ నేతృత్వం వహిస్తోంది. కీలకమైన ప్రపంచ సంస్థగా బ్రిక్స్ బ్రిక్స్ కూటమి ఒక కీలకమైన ప్రపంచ సంస్థగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. తీవ్రమైన ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాబోయే 20 ఏళ్లలో కూటమికి ఒక నూతన, ప్రతిష్టాత్మక ఎజెండా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక పిరమిడ్ను పోలి ఉందని చెప్పారు. అధికారం, నిర్ణయాధికారం పైస్థాయిలో కేంద్రీకృతమై ఉండగా, కింది స్థాయిలోని దేశాలు ఆ నిర్ణయాల ప్రభావానికి లోనవుతున్నాయి తప్ప వాటిని ప్రభావితం చేయలేకపోతున్నాయని వెల్లడించారు. నేడు ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడంలో ‘గ్లోబల్ సౌత్’ముందు వరుసలో ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉందన్నారు. అందుకే విశేషాధికారాల పిరమిడ్ స్థానంలో అన్ని దేశాలతో కూడిన భాగస్వామ్య వేదికను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికీ గళం వినిపించే అవకాశం ఉండాలన్నారు. ప్రతి ప్రయత్నానికీ మానవాళి అభివృద్ధే కేంద్ర బిందువుగా ఉండేలా చూడాలని తెలిపారు. ఉమ్మడిగా రోడ్మ్యాప్ మానవాళి సంక్షేమం కోసం బ్రిక్స్ కూటమి సంస్కరణ ప్రణాళికా చట్రం పరిధిలోనే ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 అంశాలతో కూడిన రోడ్మ్యాప్ను ఉమ్మడిగా రూపొందించాలని మోదీ ప్రతిపాదించారు. తదుపరి శిఖరాగ్ర సమావేశం నాటికి ఈ రోడ్మ్యాప్ను ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మనం మూడు కీలక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘ప్రాతినిధ్యం, స్పందించే గుణం, నియమావళి రూపకల్పన’అవసరమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని, దీనికి సంబంధించిన చర్చలను ఒక నిర్దిష్ట కాలపరిమితితో స్పష్టమైన ఫలితాల దిశగా ముందుకు తీసుకెళ్లాలని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆర్థిక సంస్థల్లో ఓటింగ్ అధికారం, నాయకత్వ స్థానాలు, విధానపరమైన ప్రాధాన్యతలు నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే దేశాలు ప్రపంచ ఆర్థిక పాలనను తీర్చిదిద్దడంలోనూ తగిన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రపంచ నియమాలను నిర్ణయించడంలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం అత్యంత కీలకమని తేల్చిచెప్పారు. కృత్రిమ మేధస్సు, సైబర్ స్పేస్, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కీలక సాంకేతికతల వంటి రంగాలు భవిష్యత్తు అవకాశాలను తీర్చిదిద్దడమే కాకుండా, భవిష్యత్తు నియమాలను కూడా నిర్దేశిస్తున్నాయన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఇక కేవలం నియమాలను పాటించేవారి స్థాయిలో ఉండడానికి వీల్లేదన్నారు. నియమాలను రూపొందించే స్థాయికి ఎదగాలని స్పష్టంచేశారు. ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఏడాది బ్రిక్స్ 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మానవ జీవితంలో 20 ఏళ్ల వయస్సు అనేది పరిపక్వత, బాధ్యతతో కూడిన ఒక కొత్త దశకు ఆరంభమని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ కూడా పరిపక్వత సాధించే దశకు చేరుకుందని, ప్రపంచ వేదికపై క ప్రత్యేక గుర్తింపును సాధించిందని అన్నారు. తాము ఇతరుల ఆకాంక్షలను గౌరవిస్తామని, ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని వివరించారు. ఎవరినో వ్యతిరేకించడం ద్వారా కాకుండా అందరినీ కలుపుకొని వెళ్లడం ద్వారా పురోగతి సాధించడానికి కృషి చేస్తామన్నారు. కూటమిలో మనకున్న ఐక్యతను, ఏకాభిప్రాయాన్ని ప్రపంచ వేదికపై ప్రత్యక్ష ఫలితాలుగా మార్చుకోవాలని సూచించారు. రాబోయే 20 ఏళ్లకు సంబంధించిన బలమైన ఎజెండాపై మనం కృషి చేయాలన్నారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు ఏటా మారుతున్నప్పటికీ అది మన సంస్థాగత పురోగతికి ఆటంకం కలిగించకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’మన ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ తీర్మానాలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడం మన బాధ్యత అని ఉద్బోధించారు. 10 పాయింట్ల రోడ్మ్యాప్ 1. నియమాలను పాటించేవారి నుంచి నియమాలను రూపొందించేవారిగా బ్రిక్స్ ఎదగడం 2. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు 3. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం బలోపేతం 4. కూటమి అధ్యక్షులు మారినప్పటికీ నిర్ణయాలు కొనసాగింపు 5. కూటమి నిర్ణయాల అమలుపై దృష్టి 6. వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం 7. సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరింపజేసుకోవడం 8. అభివృద్ధి భాగస్వామ్యాలను బలోపేతం చేయడం 9. గ్లోబల్ సౌత్కు మరింత ప్రాధాన్యత ఇవ్వడం 10. ప్రపంచ వేదికపై బ్రిక్స్ను మరింత సమర్థవంతంగా మార్చడం -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి...
సాక్షి, చెన్నై: పరిచయం పెంచుకుని యువతిని మాయ మాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని తీయని కబుర్లుచెప్పి గదికి తీసుకెళ్లి శీతలపానీయంలో మత్తు మందు కలిపి లైంగికదాడికి తెగబడ్డాడు. వీడియో చిత్రీకరించి పిలిచినప్పుడల్లా రావాలని బ్లాక్మెయిల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్లో శుక్రవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన 25 ఏళ్ల యువతి తిరుప్పూర్ జిల్లా మొదలిపాలయంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కుట్టుపని చేస్తోంది. అదే ప్రాంతంలో పనిచేస్తున్న బిహార్కు చెందిన వికాష్ కుమార్ యాదవ్ ఆమెను పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఆశలు రేపాడు. ఈ పరిస్థితులలో పని ముగించుకుని శుక్రవారం సాయంత్రం తన కోసం వచ్చిన యువతిని వికాష్ కుమార్ తన గదికి తీసుకెళ్లాడు. ఆమెకు తెలియకుండా శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ కోల్పోవడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను తన సెల్ఫోన్లో వీడియోగా చిత్రీకరించి, ఫోటోలూ తీశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత యువతి ఆందోళన చెంది తనను పెళ్లి చేసుకోవాలని వేడుకోవడంతో తనకు అప్పటికే పెళ్లయినట్టు చెప్పాడు. తను తీసిన చిత్రాలను ఆమెకు చూపి ఇక, తాను పిలిచినప్పుడల్లా రావాలని హెచ్చరించి పంపాడు. ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. అంతే కాకుండా ఆ వీడియోను తన బంధువు ఒకరికి అతడు పంపించి పైశాచికానందం పొందాడు. దీంతో ఆ యువతి తిరుప్పూర్ పోలీసులను శనివారం ఆశ్రయించింది. కాంగేయం ఆల్ ఉమెన్ పోలీసులు తక్షణం రంగంలోకి దిగి వికాష్కుమార్యాదవ్ను అరెస్టు చేశారు. అతడి ఫోన్ను పరిశీలించగా అందులో ఆయువతితో గడిపిన వీడియోలతో పాటుగా మరికొన్ని అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. నిందితుడు మరెవరినైనా ఈ తరహాలో వేధించాడా? అన్న అనుమానంతో విచారణ జరుపుతున్నారు. -
వడివడిగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ, వాణిజ్యపరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పురోగతిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో శనివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ భేటీలో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కిషన్రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టు అమలును పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు రక్షణ శాఖ, పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ అధికారిని వచ్చే వారంలోగా నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రాజెక్టు డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించారు. ఉత్తర తెలంగాణలో పౌర విమానయాన మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రాంతీయ వైమానిక అనుసంధాన మెరుగుదలకు ఈ ప్రాజెక్టు బాటలు వేస్తుందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.రక్షణ శాఖ సంపూర్ణ సహకారం..దేశ రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్, ఎయిర్ఫోర్స్ స్టేషన్ అభివృద్ధికి రక్షణ శాఖ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా కీలక ముందడుగు పడిందని కిషన్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులు ఆదిలాబాద్ విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ కోసం 2.75 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మాణం అవసరమని తేల్చారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధీనంలో 369.45 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూసేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. -
తలా అజిత్తో సీఎం విజయ్.. ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ట్రీట్!
తమిళనాడు సీఎం, హీరో విజయ్.. స్టార్ హీరో అజిత్ కుమార్ను లండన్లోని సిల్వర్స్టోన్ రేసింగ్ ట్రాక్లో కలిశారు. ప్రస్తుతం ‘మిచెలిన్ లీ మ్యాన్స్ కప్’లో పాల్గొంటున్న అజిత్ను విజయ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండేది. వీరిద్దరి అభిమానుల మధ్య రైవల్రీ కూడా ఉన్నప్పటికీ.. వీరి తాజా భేటీ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లగా.. అక్కడే అజిత్తో ఈ అరుదైన కలయిక చోటుచేసుకుంది. ఒకరిని ఒకరు చూసిన వెంటనే ఆనందంతో విజయ్ పరుగెడుతూ వెళ్లి అజిత్ను ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకరు రాజకీయ నాయకుడిగా, మరొకరు సినీ రంగంతో పాటు మోటార్ స్పోర్ట్స్లో రాణిస్తున్నారు. ఇలా ఇద్దరూ తమ తమ రంగాల్లో సరికొత్త ప్రయాణం సాగిస్తున్న వేళ జరిగిన ఈ భేటీపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.The way Thalapathy Vijay Hugged Ajith Kumar & AK welcomed @actorvijay ❤️ What an incredible Moment !!! An WHOLESOME Video !!! https://t.co/5IxWCYarp0— Let's X OTT GLOBAL (@LetsXOtt) September 12, 2026 -
పాముల మధ్యే విధులు నిర్వహించిన డాక్టర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో గంగా నది ఉప్పొంగడంతో రతువా బ్లాక్ ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. ఆసుపత్రిలో దాదాపు 40 శాతం ప్రాంతం నీటిలో మునిగిపోయింది. ప్రధాన రహదారితో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అక్కడికి చిన్న పడవల ద్వారానే చేరుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లోనూ డాక్టర్ అరిజీత్, కొద్దిమంది వైద్య సిబ్బందితో కలిసి ఆసుపత్రిని వీడకుండా రోగులకు చికిత్స అందిస్తున్నారు.వరద నీటితో నిండిన ఆసుపత్రి కారిడార్లలో విషపూరిత పాములు, ఇతర కీటకాలు సంచరిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ డాక్టర్ అరిజీత్ చికిత్స అవసరమైన రోగుల వద్దకు వెళ్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేని రోగులకు వైద్యం అందించడమే తమ ప్రాధాన్యంగా ఆయన, వైద్య సిబ్బంది విధులు కొనసాగిస్తున్నారు.ఈ పరిస్థితిని డాక్టర్ అరిజీత్ కష్టతరమైన సమయంగా అభివర్ణించారు. “ఇది చాలా కష్టంగా ఉంది. కానీ వైద్యులు, వైద్య సిబ్బందిగా చికిత్స అందించడం కూడా అవసరం. ప్రజలకు మన అవసరం ఎక్కువగా ఉండే సమయం ఇదే. ఈ ఆసుపత్రిలో పాములు, కీటకాలు ఉన్నాయి. అయినా ఈ కష్టకాలంలో రోగులను చూసుకోవడం మరింత ముఖ్యం” అని ఆయన తెలిపారు.వరదల కారణంగా రతువా, మాణిక్చక్, రతన్పూర్ ప్రాంతాల్లో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. మొత్తం ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రిలోనూ అంధకారం నెలకొంది. అయినా డాక్టర్ అరిజీత్, వైద్య సిబ్బంది రోగుల సంరక్షణ కొనసాగిస్తున్నారు. “ఒక వైద్యుడికి ఆసుపత్రిని వదిలి వెళ్లడం ఎప్పుడూ ఒక ఎంపిక కాదు” అని డాక్టర్ అరిజీత్ చెప్పారు. వరద పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సేవలు అందించడం, సిబ్బంది భద్రత రెండూ కీలకంగా మారాయి. -
రీల్స్ పిచ్చి.. నదీ ప్రవాహంలో చిక్కుకుని విలవిల
సామాజిక మాధ్యమాల్లో అద్భుతమైన వీడియో పోస్ట్ చేసి పాపులర్ కావాలనే ప్రయత్నంలో కొందరు యువకులు అత్యంత ప్రమాదకరమైన చర్యకు పాల్పడ్డారు. ఓ ఎస్యూవీని నదిలోకి నడిపిస్తూ వీడియో చిత్రీకరించారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వారు వాహనాన్ని నదిలోకి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఈ ఘటన జమ్మూ కశ్మీర్లోని సింధ్ నది ప్రాంతంలో, హోటల్ సింధ్ రిసార్ట్స్ సమీపంలో జరిగింది. నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా బలంగా ఉండటంతో స్కార్పియో నీటిలో చిక్కుకుపోయింది. వాహనంలోని వారు దాన్ని బయటకు తీసుకురాలేకపోయారు. వాహనంలోని అందరి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. ఘటనపై జమ్మూకశ్మీర్ పోలీసులు సమాచారమందుకుని అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.వైరల్గా మారిన వీడియోలో.. కొందరు వ్యక్తులు ఎస్యూవీలో ప్రయాణిస్తూ నదిలోకి వెళ్లడం కనిపిస్తుంది. వాహనం నీటిలోకి వెళ్లిన తర్వాత కూడా వారు వీడియో చిత్రీకరణ కొనసాగించారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రమాదకర చర్యకు పాల్పడ్డారు.వాహనం నదిలోకి వెళ్లడంతో పరిస్థితి ఎప్పుడు అదుపు తప్పుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. వాహనం నీటిలో చిక్కుకుంటే అందులో ఉన్నవారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయినా వీడియో కోసం వారు ఈ ప్రమాదాన్ని పట్టించుకోలేదు.ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఇటువంటి వీడియో తీసుకోవడం కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వాహనాన్ని నదిలోకి తీసుకెళ్లిన వ్యక్తుల తీరును విమర్శిస్తున్నారు.#Watch | SUV gets stuck in Nallah #Sindh during reported stunt attempt near SonamargA Scorpio vehicle became stranded in Nallah Sindh near #Sonamarg after its occupants allegedly attempted a stunt. Police and locals launched a rescue operation to retrieve the vehicle. pic.twitter.com/GbFzTouW48— Greater Kashmir (@GreaterKashmir) September 11, 2026 -
విషాదం.. విమానం ఎగరడానికి కొన్ని గంటల ముందే..
ఢిల్లీ: ఓ స్టార్ హోటల్ రూమ్లో ఎయిరిండియా పైలట్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన వసంత్ కుంజ్లో ఉన్న స్టార్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, ఫ్లైట్ కెప్టెన్గా పనిచేస్తున్న ఆ వ్యక్తి ది గ్రాండ్ హోటల్లోని తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని సన్నీ అసల్దేకర్గా పోలీసులు గుర్తించారు.పైలట్ సెప్టెంబర్ 10న హోటల్లో చెక్-ఇన్ చేశారు. మరుసటి రోజు ఆయన ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో ఆయన సోదరుడు హోటల్ మేనేజర్ను సంప్రదించాడు. దీంతో మేనేజర్ గదికి వెళ్లగా.. తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. మాస్టర్ కీ సహాయంతో తలుపు తెరిచి చూడగా పైలట్ స్పందన లేకుండా కనిపించారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఆయనకు పోస్టుమార్టం నిర్వహించారు. మరణానికి కచ్చితమైన కారణం తెలియలేదు. పోస్ట్మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.ఇవాళ (శనివారం) తెల్లవారుజామున విధులకు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీ నుంచి సియోల్కు వెళ్లే విమానాన్ని నడపాల్సి ఉంది. గుండెపోటు కారణంగానే ఆయన మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నాయి. పైలట్ గతంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో పనిచేశారు. కొద్ది నెలల క్రితమే ఎయిర్ ఇండియాకు మారారు.ఇదీ చదవండి: ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? -
‘‘మేము చోటా రాజన్ మనుషులం.. రూ.32 కోట్లు ఇస్తావా? చస్తావా?’’
ముంబై పశ్చిమ శివారు ప్రాంతాల్లో చేపట్టిన పునరాభివృద్ధి ప్రాజెక్టు కేంద్రంగా ఓ వసూళ్ల కుట్ర జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ డెవలపర్ను హత్య చేస్తామని, ఇతర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి తొలుత రూ.32 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈ మొత్తం రూ.11 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ గాలింపు చేపట్టింది. వీరిలో ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎన్జీవో నిర్వాహకుడు కూడా ఉన్నారు.ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన యాంటీ ఎక్స్టార్షన్ సెల్ ఈ వసూళ్ల యత్నంపై దర్యాప్తు చేస్తోంది. పనులు కొనసాగిస్తే డెవలపర్ సిబ్బందికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, ప్రభుత్వ సంస్థలు, పౌర అధికారులకు ఫిర్యాదులు చేసి పనులను అడ్డుకుంటామని, చివరకు చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఎఫ్ఐఆర్లో ఎనిమిది మంది నిందితులతో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయి. వీరిలో చోటా రాజన్ గ్యాంగ్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్విందర్ సింగ్కు చెందిన రాజ్లక్ష్మి సంస్థ పేరు ఉంది. ఎన్జీవో నిర్వాహకుడు క్లెమెంటినస్ ఫారో, టోనీ అనే మరో నిందితుడి పేర్లు కూడా ఉన్నాయి. ఫారో, టోనీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసు బాంద్రా వెస్ట్లోని ఓ ఆస్తికి సంబంధించినది. ఈ ఆస్తి బాంబే ఆర్చ్డియోసిస్కు చెందినది. సుమారు 50 ఏళ్లుగా అక్కడ ఆస్తి ఉంది.ఈ ప్రాపర్టీ వల్లే..బాంద్రా వెస్ట్లోని పెరీరా రోడ్డులో ఉన్న ఆస్తి పునరాభివృద్ధికి బాంబే ఆర్చ్డియోసిస్ టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో దిల్జయ్ ప్రాపర్టీస్ అత్యధిక ధరను ప్రతిపాదించింది. అవసరమైన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఛారిటీ కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతులు పొందిన తర్వాత ఆర్చ్డియోసిస్ యాజమాన్యం ఆస్తిని పునరాభివృద్ధి కోసం దిల్జయ్ ప్రాపర్టీస్కు అప్పగించింది.సుమారు 50 ఏళ్ల నాటి ఈ ఆస్తి శిథిలావస్థకు చేరుకుంది. 2024లో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దీనిని సీ-1 కేటగిరీ ప్రమాదకర భవనంగా ప్రకటించింది. సురక్షితంగా కూల్చివేసేందుకు వీలుగా మొత్తం ఆస్తికి విద్యుత్, నీటి సరఫరాను పౌర సంస్థ నిలిపివేసింది.ఎథెల్ స్టీవెన్, డేనియల్ స్టీవెన్, వారి కుటుంబ సభ్యుల్లో కొందరు ఆ ఆస్తిలో అక్రమంగా నివసిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2026 జూన్ నాటికి భవనం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. బీఎంసీ ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది సమక్షంలో అధికారిక తనిఖీ నిర్వహించారు. దీనిని పంచనామా అంటారు. ఆ తర్వాత కేర్టేకర్ ఎథెల్ స్టీవెన్, డేనియల్ స్టీవెన్, టోనీ కుటుంబ సభ్యుల వస్తువులను అక్కడి నుంచి తొలగించారు. నిర్దేశిత విధానాల ప్రకారం ప్రమాదకర భవనాన్ని కూల్చివేశారు.కూల్చివేత తర్వాత బెదిరింపులుభవనం కూల్చివేసిన తర్వాత ఎథెల్, డేనియల్ కుటుంబ సభ్యులు నేర చరిత్ర ఉన్న వ్యక్తులుగా పేర్కొన్న కొందరితో కలిసి తరచూ ఆ ప్రాంతానికి రావడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు ప్రకారం.. చోటా రాజన్ గ్యాంగ్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెంబూర్, కుర్లా ప్రాంతాలకు చెందిన గ్యాంగ్ సభ్యులు వారితో కలిసి వచ్చేవారు. డెవలపర్కు చెందిన భద్రతా సిబ్బంది, ఇతర ఉద్యోగులపై దాడి చేసి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనలపై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. 2026 జూలై 11న ఎఫ్ఐఆర్ నంబర్ 1393, జూలై 29న ఎఫ్ఐఆర్ నంబర్ 1564 కింద 2 కేసులు నమోదయ్యాయి. ప్లాట్ వద్ద భద్రతా కంచె ఏర్పాటు పనులు చేపడుతున్న సమయంలోనూ బెదిరింపులు కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎథెల్, డేనియల్ తమ సహచరులతో కలిసి అక్కడికి వచ్చి ఎలాంటి పనిని కొనసాగించనివ్వబోమని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.రూ.32 కోట్ల డిమాండ్చెంబూర్లో చోటా రాజన్ గ్యాంగ్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్విందర్ సింగ్, కుర్లాకు చెందిన అబ్దుల్లా ఖాన్, బాంద్రాకు చెందిన రెమీ, నజీర్లతో తమకు సంబంధాలు ఉన్నాయని నిందితులు డెవలపర్కు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిలో కొందరితో లేదా అందరితో కలిసి డెవలపర్ ప్రతినిధులను చంపుతామని బెదిరించారు.“పని కొనసాగించి ప్రాణాలు కాపాడుకోవాలంటే మాకు రూ.32 కోట్లు చెల్లించండి” అని నిందితులు డెవలపర్కు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు ఆస్తి వద్దకు పదేపదే వచ్చి బెదిరింపులకు పాల్పడటంతో బాంద్రా పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు నమోదైంది. 2026 ఆగస్టు 24న నిందితులు కంపెనీ బాంద్రా కార్యాలయానికి వెళ్లి దిల్జయ్ ప్రాపర్టీస్ డైరెక్టర్ గగన్ శర్మను కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే తుది హెచ్చరిక అని చెప్పి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కంపెనీపై ఒత్తిడి తెచ్చారు.ఆ తర్వాత రూ.11 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1న తొలి విడతగా రూ.25 లక్షలు ఇవ్వాలని, మిగిలిన మొత్తాన్ని తదుపరి 4 వారాల్లో చెల్లించాలని నిందితులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.క్రైమ్ బ్రాంచ్ను ఆశ్రయించిన డెవలపర్ఈ వ్యవహారం మరింత తీవ్రమై ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని భయపడిన డెవలపర్ ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ను ఆశ్రయించాడు. రికార్డింగ్లు, ఫొటోలు, గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ల ప్రతులతో అధికారులు ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ అనిల్ కుంభారేను కలిసి అధికారిక ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఈ వ్యవహారాన్ని సున్నితమైన కేసుగా పరిగణించి దర్యాప్తును యాంటీ ఎక్స్టార్షన్ సెల్కు అప్పగించారు.పోలీసుల వలలో ఐదుగురు సెప్టెంబర్ 1న ఎథెల్, డేనియల్, వారి సహచరులు రూ.25 లక్షల తొలి విడతను తీసుకునేందుకు డెవలపర్ బాంద్రా కార్యాలయానికి వచ్చారు. దీంతో యాంటీ ఎక్స్టార్షన్ సెల్ వల పన్ని, డబ్బు తీసుకుంటుండగా వారిని అరెస్ట్ చేసింది. వలలో భాగంగా ఏర్పాటు చేసిన డబ్బులో ఎక్కువ భాగం పిల్లలు ఆడుకునే నకిలీ కరెన్సీ. దీని విలువ రూ.24.95 లక్షలు. దాని పైన అసలైన రూ.500 నోట్లు రూ.5,000 విలువ మేర ఉంచారు.ఆ తర్వాత పోలీసులు ఎథెల్ స్టీవెన్, డేనియల్ స్టీవెన్, నసీర్ షేక్, అబ్దుల్లా ఖాన్, రెమీ ఫెర్నాండెజ్లను అరెస్ట్ చేశారు. వల పన్నిన సమయంలో ముగ్గురు నిందితులు పట్టుబడగా, ఆ చర్యకు సంబంధించి మరో ఇద్దరిని తర్వాత అరెస్ట్ చేశారు. ఎన్జీవో నిర్వాహకుడు, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.ఎఫ్ఐఆర్లో 8వ నిందితుడిగా పేర్కొన్న ఎన్జీవో నిర్వాహకుడు క్లెమెంటినస్ ఫారో, టోనీ కోసం క్రైమ్ బ్రాంచ్ గాలింపు చేపట్టింది. అభివృద్ధి ప్రాజెక్టులో అడ్డంకులు సృష్టిస్తామని బెదిరించి తన ఎన్జీవో కోసం రూ.కోటి వసూళ్లుగా ఫారో డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చోటా రాజన్ గ్యాంగ్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్విందర్ సింగ్కు చెందిన రాజ్లక్ష్మి సంస్థ పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. నిందితులకు ఇతర వ్యక్తులు, గ్యాంగ్లతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న సంబంధాలపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. -
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ
ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు వివాదాలు, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. భారత్తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమన్నారు. అభివృద్ధి అంశాలపైన కలిసి పని చేయాలని.. తరచుగా సమావేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ప్రపంచ శాంతికి భారత్ చైనా సంబంధాల బలోపేతం అవసరం. ఇండియా, చైనా దీర్ఘకాలిక సంబంధాలపైన దృష్టి సారించాలి. ప్రపంచశాంతికి భారత్- చైనా సంబంధాల బలోపేతం అవసరం. మన దేశాల బలబలలు అందరికీ తెలుసునని జిన్పింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమన్నారు. విస్తృతమైన అంశాల పైన ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న మోదీ.. బ్రిక్స్ అధ్యక్షతకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.తొలి రోజు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఢిల్లీ డిక్లరేషన్ను “బ్రిక్స్” శిఖరాగ్ర సదస్సు ఆమోదించింది. శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నట్లు సంయుక్త ప్రకటన చేశాయి. యుద్ధాలు, ఘర్షణలు, సమస్యల మూలాలను పరిష్కరించాలన్న బ్రిక్స్ దేశాలు.. ఏకపక్షంగా సుంకాల విధింపు పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని బ్రిక్స్ దేశాల కూటమి పిలుపునిచ్చాయి.ఇదీ చదవండి: భారత్కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? -
గూగుల్ సీఈఓకు సన్యాసి షాక్.. ఒక్క మాటతో దిమ్మతిరిగే సమాధానం
యవ్వనంలో ఉన్నప్పుడు ఒకే దారిలో నడిచిన ఇద్దరు వ్యక్తులు.. ఒకరు ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరితే, మరొకరు పూర్తిగా భిన్నమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. వీరిద్దరూ ఎదురుపడినప్పుడు జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి ఈ ఘటన గతంలోనే జరిగినప్పటికీ ఇటీవల కృష్ణాష్టమి జరగడంతో ఇది ఇళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ 1993లో ఐఐటీ పూర్తి చేశారు. సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్పూర్లో చదవగా.. గౌరంగ దాస్ ఐఐటీ బాంబేలో చదివారు. ఇద్దరూ ఒకే సంవత్సరం ఐఐటీలో పట్టభద్రులైనా.. తర్వాత వారి జీవిత ప్రయాణాలు పూర్తిగా భిన్నంగా సాగాయి.సుందర్ పిచాయ్ 1993లో ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మెటీరియల్స్ సైన్స్, ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ పాఠశాలలో ఎంబీఏ పూర్తి చేశారు. 2004లో గూగుల్లో చేరిన పిచాయ్.. గూగుల్ క్రోమ్, క్రోమ్ ఓఎస్ వంటి ఉత్పత్తులపై పనిచేశారు. 2015 ఆగస్టులో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబరులో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా నియమితుడయ్యారు.మరోవైపు గౌరంగ దాస్ ఐఐటీ బాంబేలో చదువు పూర్తి చేసిన తర్వాత భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కార్పొరేట్ జీవితాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు. అనంతరం సన్యాసిగా మారి ఇస్కాన్లో సీనియర్ నాయకుడిగా ఎదిగారు. ఆధ్యాత్మిక విద్య, సామాజిక కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పనిచేస్తున్నారు.ఏళ్ల తర్వాత సుందర్ పిచాయ్, గౌరంగ దాస్ 2019లో ఆకాశ్ అంబానీ వివాహ వేడుకలో కలుసుకున్నట్లు దాస్ తెలిపారు. ఆ సమావేశం గురించి 2025 జూన్లో లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరమ్ కార్యక్రమంలో గౌరంగ దాస్ మాట్లాడారు. పిచాయ్ తనను చూసి ‘‘నాకంటే నువ్వు చిన్నవాడిలా కనిపిస్తున్నావు’’ అని చెప్పినట్లు దాస్ గుర్తుచేసుకున్నారు.దానికి గౌరంగ దాస్ స్పందిస్తూ.. ‘‘మీ వ్యవహారం అంతా గూగుల్తో ఉంటుంది.. అది ఒత్తిడిని సృష్టిస్తుంది. నా వ్యవహారం అంతా దేవుడితో ఉంటుంది.. ఆయన ఒత్తిడిని తొలగిస్తాడు’’ అని చెప్పినట్లు తెలిపారు. వారి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇద్దరి జీవన మార్గాల మధ్య ఉన్న తేడాను ప్రతిబింబించింది. -
బ్రిక్స్ ప్రారంభోపన్యాసంలో మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: బ్రిక్స్ సదస్సులో తీసుకునే నిర్ణయాల అమలు కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్నే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో భరతమండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వచ్చే 20ఏళ్ల కాలానికి అవసరమైన ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణీత గడువులోగా నిర్ణయాల అమలు కోసం వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.మోదీ మాట్లాడుతూ.. "ప్రస్తుతం గ్లోబల్ సౌత్ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని ప్రజల మేలు కోసం దేశాలన్నీ కలిసి పని చేయాల్సి ఉంది ప్రపంచ పరిపాలన మరింత మెరుగుపడాల్సి ఉంది. పరస్పరం గౌరవం, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం" అని మోదీ అన్నారు. అయితే అంతకుముందు ప్రధాని మోదీ అబూదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయద్ అలీ నహియాన్తో హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతలు మలేషియా, ఇథీయోపియా దేశాధినేతలతో రక్షణ రంగంలో సహకారం అంశంపై చర్చలు జరిపారు.కాగా మరికోద్దిసేపట్లో సాయంత్రం 5:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా జిన్పింగ్ భారత్ లో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడితో ఆ దేశానికి చెందిన వ్యాపార ,అధికార ప్రతినిధి బృందంతో ఢిల్లీకి చేరుకుంది. గతంతో పోలిస్తే ఈ సారి పెద్ద మెుత్తంలో అధికార బృందం జిన్పింగ్తో ఉంది. భారత్తో ఆర్థిక వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని చైనా భావిస్తోన్నట్లు సమాచారం. -
భారత్కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?
ఒకేలా కనిపించే రెండు విమానాలు.. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విమానంలో ఉన్నారో ఎవరికీ తెలియదు.. అత్యాధునిక భద్రతా వ్యవస్థలు.. రహస్య కమ్యూనికేషన్ టెక్నాలజీ, అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ కమాండ్ సెంటర్గా మారే సామర్థ్యం.. ఇవన్నీ కలగలిసిన పుతిన్ ‘డూమ్స్డే ప్లేన్’ ఇప్పుడు భారత్లో హాట్ టాపిక్గా మారింది. బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి చేరుకోవడంతో అసలు ఈ ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’లో ఏముంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం విస్తరణపై చర్చించారు. ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకులలో ఒకరైన రష్యా అధ్యక్షుడు కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణించే విమాన శ్రేణిలో ఒకేలా ఉండే రెండు విమానాలు ఉంటాయి. వాటిలో ఒకటి 'డికాయ్'.. అత్యంత సురక్షితమైన ప్రత్యేక అధ్యక్ష విమానం('ఇల్యుషిన్ IL-96-300PU). దీనినే ఫ్లయింగ్ క్రెమ్లిన్ లేదా డూమ్స్డే ప్లేన్ అని కూడా పిలుస్తారు.రష్యా అధ్యక్షుడు ప్రయాణించేందుకు ఒకేలా ఉండే రెండు ఇల్యుషిన్ IL-96-300PU విమానాలను ఉపయోగిస్తారు. రష్యా అధ్యక్షుడు ఏ విమానంలో ఎక్కారనేది ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఈ రెండు విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగురుతాయి. మాస్కోకు ఈ డబుల్-షీల్డ్ భద్రత కొత్త వ్యూహం కాదు. అదనపు భద్రత కోసం పుతిన్ గతంలో కూడా ఇతర దేశాలకు ఇలాగే ప్రయాణించారు.1980లలో ఇల్యుషిన్ డిజైన్ బ్యూరో చేత అభివృద్ధి చేయబడిన ఈ విమానం.. రష్యా అధ్యక్షుడికి అత్యంత సురక్షితమైన కమాండ్ సెంటర్గా పనిచేస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లగల నాలుగు ఇంజిన్ల రష్యన్ విమానం ఇది. అత్యంత ప్రమాద పరిస్థితుల నుంచి రష్యా అగ్ర నాయకత్వాన్ని రక్షించేలా దీనిని రూపకల్పన చేశారు. సుదూర ప్రయాణాలు చేసే IL-96 ప్లాట్ఫారమ్పై నిర్మించిన ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్"లో అవిాద్విగటెల్ PS-90A టర్బోఫాన్ ఇంజిన్లు ఉన్నాయి. ఇది ఒకేసారికీ సుమారు 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలలో పదే పదే ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. ఈ విమానం పొడవు 55.35 మీటర్లు కాగా.. దీని రెక్కల వెడల్పు 60.12 మీటర్లు. అధ్యక్షుడి ప్రయాణాలన్నింటినీ పర్యవేక్షించే రష్యా ప్రత్యేక విమాన స్క్యాడ్రన్ దీనిని నడుపుతుంది.జాతీయ అత్యవసర పరిస్థితుల్లో IL-96-300PU పూర్తి స్థాయి మొబైల్ కమాండ్ సెంటర్గా పనిచేయగలదు. ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సైనిక, నిఘా, ప్రభుత్వ నెట్వర్క్లను సురక్షితంగా సంప్రదించగల ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ విమానంలో రాడార్-జామింగ్ సాంకేతికత ఉంది. అంతేకాకుండా ఇది అధునాతన రక్షణాత్మక వ్యవస్థలను కలిగి ఉంటుంది. అంతరాయం లేని, సురక్షితమైన సంభాషణను కొనసాగించడానికి శాటిలైట్ లింక్లు, రక్షిత రేడియో, డేటా ఛానెల్లను కూడా ఇది కలిగి ఉంది.భద్రతతో పాటు, ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్" విలాసవంతంగా కూడా రూపుదిద్దుకుంది. ఇందులో బెడ్రూమ్లతో కూడిన ప్రైవేట్ ప్రెసిడెన్షియల్ సూట్, విలాసవంతమైన బాత్రూమ్లు, ప్రైవేట్ కిచెన్, డైనింగ్ ఏరియాలు, బోర్డ్రూమ్ సీటింగ్తో కూడిన పెద్ద సమావేశ మందిరం ఉన్నాయి. ఇవి కాకుండా ఈ విమానంలో బంగారంతో పూత పూసిన ఫిట్టింగ్లు, ఆకర్షణీయమైన కలప, ప్రీమియం లెదర్, అప్హోల్స్టరీ తదితర విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ -
అంతర్జాతీయ ఖ్యాతి.. అద్భుత ఆకృతి
ఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అతిథ్యమివ్వడంతో ప్రపంచ దేశాధినేతలు భారత్కు తరలివచ్చారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి భారత్పై పడింది. ఈ నేపథ్యంలో ఈ అంతర్జాతీయ శిఖరాగ్రసదస్సుకు ఆతిథ్యమిస్తున్న భరతమండపం ప్రత్యేకతలు ఏంటి..దానిని ఎప్పుడు నిర్మించారు. అనే వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ప్రపంచ దేశాల అగ్రనేతలు హాజరవుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు భారత్ రాజధాని న్యూఢిల్లీ వేదికైంది. ఈ వార్షిక సదస్సు కోసం దేశ నడిబొడ్డున ఉన్న అత్యాధునిక 'భారత్ మండపం' సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే ఇది వరకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సహా పలువురు ప్రపంచ స్థాయి నాయకులు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.భరత మండపం నిర్మాణంప్రగతి మైదాన్ కాంప్లెక్స్లో 123 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్ల వ్యయంతో ఈ వేదికను నిర్మించారు. 2023లో ప్రారంభమైన ఈ సముదాయం నేడు భారతదేశ ఆతిథ్య సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. 12వ శతాబ్దపు 'అనుభవ మండపం' స్ఫూర్తితో దీనికి 'భారత్ మండపం' అని నామకరణం చేశారు.నటరాజ విగ్రహం ప్రత్యేకతఈ సముదాయంలో ఏర్పాటు చేసిన 27 అడుగుల ఎత్తు, 18 టన్నుల బరువు కలిగిన భారీ నటరాజ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అష్టధాతువులతో తమిళనాడు శిల్పులు దీనిని అద్భుతంగా మలిచారు. ప్రధాన సమావేశ మందిరం భవనం 'శంఖం' ఆకారంలో రూపొందించబడింది. ఇది చేతన శక్తిని, శుభారంభాన్ని సూచిస్తుంది. సూర్య శక్తి, జీరో నుంచి ఇస్రో సాధించిన ప్రయాణం, పంచ మహాభూతాల ప్రాముఖ్యతను తెలిపేలా దీని లోపలి బయటి డిజైన్లు భారతీయ నాగరికతను ప్రతిబింబిస్తున్నాయి.భారత్ మండపంలో వివిధ హాళ్లు150 దేశాల ప్రతినిధులకు సరిపడే సామర్థ్యం ఉన్న ఈ హాలులో కీలకమైన ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమం ఇక్కడే జరిగింది. డ్రోన్ టెక్నాలజీతో పాటు భారత్ సాధించిన నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు.హాల్ నెం. 14: బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనే ఈ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాపార వర్గాలనుద్దేశించి ప్రసంగించనున్నారు.హాల్ నెం. 5: ప్రపంచ వ్యాప్తంగా విచ్చేసిన సుమారు 1,200 నుంచి 1,400 మంది జర్నలిస్టుల కోసం ఇంటర్నేషనల్ మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాలు, ఉగ్రవాద నిరోధక విధానాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సవాళ్లపై ప్రపంచ నేతలు చర్చిస్తున్నారు. అలాగే బ్రిక్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విధానాలను చర్చించనున్నారు.కట్టుదిట్టమైన భద్రతభారత్ మండపంలో భద్రతా వ్యవస్థ అత్యంత అత్యాధునిక సాంకేతికతతో, అభేద్యమైన కోటను తలపించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది. అంతర్జాతీయ సదస్సులు జరిగే సమయంలో ఇక్కడ శత్రు దుర్భేద్యమైన మల్టీ-లేయర్డ్ (బహుళ అంచెల) భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంగణంలోని ప్రధాన సెక్యూరిటీ ప్రత్యేకతలు భారత్ మండపం చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల మేర బహుళ అంచెల భద్రతా వలయం ఉంటుంది. ఔటర్ రింగ్లో ఢిల్లీ పోలీస్ మరియు పారామిలటరీ బలగాలు కాపలా ఉంటే, అంతర్గత కోర్ జోన్లో (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోలతో పాటు ప్రత్యేక దళాలు మోహరిస్తాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నైజేషన్: ఇక్కడి నిఘా వ్యవస్థలో AI సాంకేతికతను ఉపయోగిస్తారు. హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనుసంధానించబడి ఉంటుంది. ఇది అనుమానాస్పద వ్యక్తులను లేదా నేరస్థుల డేటాబేస్లో ఉన్న ముఖాలను క్రౌడ్లో సైతం క్షణాల్లో గుర్తించి అలర్ట్ చేస్తుంది.డ్రోన్ సిస్టమ్స్ ఆకాశ మార్గం నుండి ఎలాంటి ముప్పు రాకుండా భవనం చుట్టూ అత్యాధునిక యాంటీ-డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్స్ అప్రమత్తంగా ఉంటాయి. అనుమతి లేని ఏ డ్రోన్ లేదా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అయినా ఈ పరిధిలోకి వస్తే వాటిని జామ్ చేయడం లేదా కూల్చివేయడం జరుగుతుంది. ఇలా భరతమండపంకు ఆధునాతనమైన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. -
జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా!
ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో (Zomato) తన వినియోగ దారుల నెత్తిన భారీ పిడుగు వేసింది. 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) ఎంచుకునే వినియోగదారులకు అదనంగా రూ.5 వసూళ్లను షురూ చేసి కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే వినియోగదారులపై మోపుతున్న ఛార్జీల బాదుడుకు మరో వడ్డన తోడైంది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం జొమాటోను సొంతం చేసుకున్న ‘ఎటర్నల్’ (Eternal) సంస్థ, తమ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో క్యాష్ ఆన్ డెలివరీ (Cash on Delivery) ఎంచుకునే వినియోగదారులపై అదనంగా ఈ ఫీజును వసూలు చేయనుంది.ఈ కొత్త “పే ఆన్ డెలివరీ ఫీజు” (Pay on delivery fee) జొమాటో బిల్లు వివరాలలో ప్రత్యేక లైన్ ఐటమ్గా కనిపిస్తోంది. ఆహారం ఇంటికి వచ్చాక నగదు రూపంలో చెల్లించే (CoD) ఆర్డర్లపై ఈ రుసుము విధిస్తుస్తోంది.. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఫీజు రూ. 7 నుండి రూ. 20 వరకు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ రుసుము జొమాటో ఇప్పటికే వసూలు చేస్తున్న ప్లాట్ఫామ్ ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు , GST కి అదనమైనది. ఆన్లైన్లో చెల్లించే వారికి ఈ ఫీజు వర్తించదు, కేవలం క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న వినియోగదారులు మాత్రమే ఈ అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీఇప్పటికే ప్లాట్ఫామ్ ఫీజు కింద ప్రతి ఆర్డర్పై రూ. 14.99 వరకు వసూలు చేస్తున్న జొమాటో రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, జీఎస్టీ వాయింపునకు తోడుఈ సీఓడీ ఫీజు అదనం. ప్రస్తుత లెక్కల ప్రకారం జొమాటో రోజుకు సగటున 2.3 నుండి 2.5 మిలియన్ల (23-25 లక్షల) ఆర్డర్లను ప్రాసెస్ చేస్తుంది. తాజా పెంపుతో కంపెనీకి ఏడాదికి వందల కోట్ల అదనపు ఆదాయాన్ని దండుకోనుంది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ తీవ్రమవుతున్న సమయంలో జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. రాపిడోకి చెందిన ‘ఓన్లీ’ (Ownly) ఆదరణ పొందుతుండటం, ఫ్లిప్కార్ట్ ‘ఈట్ ఇన్’ (Eat In) పేరుతో ఫుడ్ డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించడం మరియు ‘స్విష్’ (Swish) వంటి స్టార్టప్లు కొత్తగా నిధులు సమకూర్చుకోవడంతో జొమాటో, స్విగ్గీ వంటి దిగ్గజాలపై పోటీ ఒత్తిడి పెరుగుతోందంటున్నారు మార్కెట్ నిపుణులు.ఇదీ చదవండి: నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్ -
జైలులో తనిఖీలు.. ఫోన్తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జనతాదళ్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ప్రజ్వల్ రేవణ్ణ ఉన్నారు. ఆగస్టు 11న క్రైమ్ బ్రాంచ్ అధికారులు జరిపిన ఆకస్మిక దాడిలో రేవణ్ణ మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు గుర్తించారు. అలాగే.. ప్రజ్వల్ ఉంటున్న హై సెక్యూరిటీ బ్యారెక్ నుంచి ఛార్జర్, పెన్ డ్రైవ్, నోట్బుక్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్, పెన్ డ్రైవ్ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా.. ఫోన్లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు, పెన్ డ్రైవ్లో వెబ్ సిరీస్లు ఉన్నట్లు తేలింది.ఫోన్లో వాట్సాప్, వీడియో కాల్స్ జరిగినట్లు కాల్ రికార్డుల పోలీసుల పరిశీలనలో తేలింది. పలువురు మహిళలతో సంప్రదింపులు జరిగినట్లు కూడా గుర్తించారు. బెంగళూరు సెంట్రల్ జైలులో 'వీఐపి' ఖైదీలకు అందుతున్న ప్రత్యేక సౌకర్యాల అంశంపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి.. ఆ లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను సర్క్యులేట్ చేసిన కేసులో రేవణ్ణ గత ఏడాది దోషిగా తేలాడు.హాసన్ జిల్లా హోళేనరసీపురలోని రేవన్న కుటుంబానికి చెందిన ఫామ్హౌస్లో డొమెస్టిక్ హెల్ప్గా పనిచేస్తున్న ఆ బాధితురాలు.. 2021 నుంచి ప్రజ్వల్ రేవణ్ణ తనపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేసిన రేవణ్ణ.. ఎవరికైనా చెబితే ఆ వీడియోలను విడుదల చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. రేవణ్ణ సెల్ నుంచి ఫోన్ లభ్యం కావడంతో అధికారులు ఓ జైలు అధికారిని సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదేశించారు. జైళ్లలో వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పూర్తిగా నిషేధించారు. కేవలం గట్టి నిఘా ఉన్న ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్లైన్లు, పబ్లిక్ కాల్ ఆఫీసులు, నిర్దేశిత వీడియో-కాలింగ్ సిస్టమ్ల ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ అనుమతిస్తారు.ఇదీ చదవండి: భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే! -
రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ
అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'కౌన్ బనేగా కరోడ్పతి 18' గురువారం ఎపిసోడ్లో, ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన రోల్ఓవర్ కంటెస్టెంట్ 27 ఏళ్ల ఉద్దేశ్య సచన్ రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో విఫలమై, రూ. 12.5 లక్షల నగదు బహుమతితో గేమ్నుంచి నిష్క్రమించారు. అయితే ఈ ఎపిసోడ్ సందర్భంగా ఉద్దేశ్య వెల్లడించిన వివరాలు నెట్టింట విశేషంగా నిలిచాయి.కాన్పూర్లో పేద పిల్లల కోసం ఒక పాఠశాలను నడుపుతున్నానని, అక్కడ 400 మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నానని ఉద్దేశ్య సచన్ చెప్పారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని ఒక చెట్టు కింద కొద్దిమంది పిల్లలకు పాఠాలు చెప్పడం ద్వారా ఈ పాఠశాలను ప్రారంభించారు. గత కొన్నేళ్లలో ఈ పాఠశాల విస్తరించి, ప్రస్తుతం సొంత భవనాన్ని కలిగి ఉంది. 12వ తరగతి వరకు పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఫీజులు లేకుండా మరింత మంది పిల్లలకు విద్యను అందించడానికి దీనిని ఇంకా విస్తరించాలని ఆయన భావిస్తున్నారు.ఇదీ చదవండి: నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్విద్యావ్యవస్థ చాలా ఖరీదైనదిగా మారిందని, పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారనే ఈ పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. వీరిలో చాలామంది పిల్లలు సమీపంలోని మురికివాడల (స్లమ్స్) నుండి వస్తారు. దీని ద్వారా తనకు ఎలాంటి ఆదాయం రాదని, తన ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం తన అన్నయ్య చూసుకుంటారని తెలిపారు.కాగా ఉద్దేశ్య తండ్రి దర్జీగా (టైలర్) పనిచేస్తూ నెలకు రూ. 4000-5000 మాత్రమే సంపాదించేవారు. విద్యుత్ షాక్ కారణంగా ఆయన తల్లి అనారోగ్యానికి గురైన తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. తండ్రి ఫీజు చెల్లించలేకపోవడంతో ఉద్దేశ్యను 6 - 9 ఏళ్ల వయస్సులో రెండుసార్లు పాఠశాల నుండి పంపించివేశారు. ఫీజులు చెల్లించనందుకు పాఠశాల ఉపాధ్యాయులు ఆయన తల్లిదండ్రులను తరచూ అవమానించేవారని గుర్తు చేసుకున్నారు. ఆ వయసులోనే అయన అనుభవించిన అవమానాలు, మానసిక క్షోభే ఈనాటి ఉచిత విద్యకు పునాది అని చెప్పారు.ఇదీ చదవండి : నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్రూ. 250తో స్కూలుకు నాంది పడిందిలా ధాబా, కేఫ్ ,కొన్ని కర్మాగారాల్లో (ఫ్యాక్టరీలు) చిన్న చిన్న పనులు చేస్తూ, తండ్రి సహాయంతో తన చదువును పూర్తి చేశారు. అయితే తనలాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉంటారని గ్రహించి, వారి జీవితాలను మార్చడానికి విద్య ఒక్కటే మార్గమని నమ్మి ఈ దిశగా అడుగులు వేశారు.తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని స్థానికంగా ప్రచారం చేయడానికి కొన్ని పాంప్లెట్లు ప్రింట్ చేయించి పాఠశాలను ప్రారంభించినట్లు ఉద్దేశ్య చెప్పారు. ప్రారంభ రోజుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి పిల్లలను చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఆయన పాఠశాలకు విరాళాలు ఇచ్చారు. నటుడు ఆర్. మాధవన్ దీనిపై ఒక పోస్ట్ షేర్ చేసినప్పుడు పాఠశాలకు భారీగా విరాళాలు వచ్చాయి. ఇది విన్న అమితాబ్ బచ్చన్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈ పాఠశాల గురించి ప్రచారం చేస్తానని ప్రకటించారు.KBC 18లో ఉద్దేశ్య ఎదుర్కొన్న రూ. 25 లక్షల ప్రశ్న: ఏ ప్రాచీన భారతీయ పాలకుడిని 'అమిత్రఘాత' అనే బిరుదుతో కూడా పిలిచేవారు?ఆప్షన్లు: సమ్రాట్ అశోకుడు, బింబిసారుడు, సముద్రగుప్తుడు, బిందుసారుడుఉద్దేశ్య 'మహాఫ్లిప్' లైఫ్లైన్ ఉపయోగించిన తర్వాత ఈ ప్రశ్న వచ్చింది. దీని సమాధానంపై కూడా ఆయనకు స్పష్టత లేకపోవడంతో 50:50 లైఫ్లైన్ ఎంచుకున్నారు. లైఫ్లైన్ తర్వాత తెరపై మిగిలిన రెండు ఆప్షన్లు: బింబిసారుడు , బిందుసారుడు.సరియైన సమాధానం తెలియకపోవడంతో, ఆయన గేమ్ను క్విట్ చేసి క్విట్ చేసిన తర్వాత, ఊహించి ఒక సమాధానం చెప్పమని కోరగా, ఆయన 'బిందుసారుడు' అని చెప్పారు. నిజానికి అదే సరైన సమాధానం.‘అమిత్రఘాత’ అంటేమగధను పాలించిన మౌర్య సామ్రాజ్య రెండవ చక్రవర్తి బిందుసారుడిని 'అమిత్రఘాత' అని పిలిచేవారు. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని కుమారుడు, అలాగే మౌర్య సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడైన అశోకుడి తండ్రి. బిందుసారుడి పాలన క్రీ.పూ. 297 నుండి క్రీ.పూ. 273 వరకు కొనసాగింది. ఈ పేరు 'అమిత్ర' (శత్రువు), 'ఘాత' (సంహారకుడు) అనే పదాల కలయికతో ఏర్పడింది. అంటే "శత్రు సంహారకుడు" అని అర్థం. విశేషమేమిటంటే, ప్రాచీన గ్రీకు రచయిత స్ట్రాబో ఆయనను 'అమిట్రోచేట్స్' (Amitrochates) అని పిలిచారు, సంస్కృత పదం,అమిత్రఘాతను గ్రీకులో 'అమిట్రోచేట్స్ అంటారు. -
భారత్కు కీలక దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్కుఆమోదం
భారత్ ఆతిథ్యంగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వేళ భారత్కు దౌత్య పరంగా కీలక విజయం లభించింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలన్నీ *"న్యూఢిల్లీ డిక్లరేషన్"*కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. గతంలో పశ్చిమాసియా యుద్ధంపై విభేదాల కారణంగా విదేశాంగ మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటన వెలువడకపోయినా, ఈసారి నాయకుల స్థాయిలో ఏకాభిప్రాయం వెలువడనుంది.న్యూఢిల్లీ డిక్లరేషన్లో అత్యంత ప్రధాన సందేశంగా "సంభాషణ (Dialogue), దౌత్యం (Diplomacy) ద్వారానే వివాదాలకు పరిష్కారం" అనే సూత్రాన్ని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ ఘర్షణల నేపథ్యంలో ఇదే భారత్ నిరంతరం చెబుతున్న వైఖరిని ప్రధాని మోదీ పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన వెలువడింది. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ప్రధాన అంశాలుఅంతర్జాతీయ వివాదాలకు యుద్ధం కంటే చర్చలు, దౌత్యమే పరిష్కార మార్గమని స్పష్టం.ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తూ దానికి ఎలాంటి సమర్థన ఉండదని పునరుద్ఘాటింపు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ పాలనా వ్యవస్థల్లో సమగ్ర సంస్కరణలకు మద్దతు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ నిర్ణయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్.వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, డిజిటల్ సహకారం, ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలపై సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిర్ణయం.బ్రిక్స్ విస్తరణ తర్వాత ఇరాన్–యూఏఈ వంటి విభేదాలున్న దేశాలను ఒకే ప్రకటనపై ఏకాభిప్రాయానికి తీసుకురావడం భారత్ అధ్యక్షతకు పెద్ద పరీక్షగా నిలిచింది. అయినప్పటికీ ఈ పరీక్షలో సభ్యదేశాలన్నిటినీ ఏకతాటిపైకి తేవడం దౌత్య పరంగా భారత్కు కీలక విజయం.బ్రిక్స్ నాయకుల సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీ డిక్లరేషన్తో కూడిన ఉమ్మడి ప్రకటన అధికారికంగా విడుదల కానుంది. ఇందులో భారత్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి మద్దతు, బహుపాక్షిక ప్రపంచ వ్యవస్థ బలోపేతంపై కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం. -
నెక్ట్స్ మిషన్ ప్రకటించిన బిట్టూ భాయ్
ఒక నది బాగుపడాలంటే అధికారులు రావాలి.. భారీ నిధులు కేటాయించాలి.. పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేయాలి. కానీ 20 ఏళ్ల యువకుడు మాత్రం ఇవేవీ లేకుండానే ఓ నదిని శుభ్రం చేసి చూపించాడు. నెలల తరబడి ఒంటరిగా శ్రమిస్తూ ప్లాస్టిక్, చెత్తాచెదారం తొలగించి అజ్నార్ నదికి కొత్త రూపు తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో అతడి పని వైరల్ కావడంతో ఆపై ఏకంగా అంతర్జాతీయ పర్యావరణ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి కార్యాచరణ సైతం ప్రకటించేశాడు..మధ్యప్రదేశ్కు చెందిన బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌధరి. అజ్నార్ నది కాలుష్యంతో నిండిపోవడాన్ని చూసిన అతడు.. సమస్య గురించి మాట్లాడటంతో ఆగిపోలేదు. స్వయంగా రంగంలోకి దిగి నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించడం మొదలుపెట్టాడు. అవసరమైన ప్రాథమిక సామగ్రిని తన సొంత డబ్బుతో సమకూర్చుకుంటూ.. ఎవరూ తోడుగా లేకపోయినా పదేపదే నది వద్దకు వెళ్లి శుభ్రం చేస్తూ వచ్చాడు.మార్పును వీడియోలుగా..నది శుభ్రం చేసే ముందు పరిస్థితి ఎలా ఉంది.. తాను శ్రమించిన తర్వాత ఎలా మారింది అన్న విషయాలను బిట్టూ సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకున్నాడు. తొలుత స్థానికంగా కనిపించిన ఈ ప్రయత్నం క్రమంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చెత్తతో నిండిన నది ప్రాంతాన్ని స్వయంగా శుభ్రం చేస్తున్న అతడి వీడియోలు వైరల్ కావడంతో బిట్టూ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.డచ్ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్..బిట్టూ చేసిన పని చివరకు ‘ది ఓషన్ క్లీన్అప్’ దృష్టిని కూడా ఆకర్షించింది. డచ్ పర్యావరణవేత్త బోయన్ స్లాట్ స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదుల్లోని ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తోంది. బిట్టూ కృషిని గుర్తించిన సంస్థ అతడికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో అతడికి మరింతగా అభినందనలు వెల్లువెత్తాయి.‘తర్వాత ఏ రాష్ట్రానికి రావాలి?’..ఉద్యోగ ఆఫర్ వచ్చిన తర్వాత బిట్టూ సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశాడు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అతడు.. ఇక తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్లి శుభ్రత కార్యక్రమం చేపట్టాలని అడిగాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి నదులు, పరిసరాలను శుభ్రం చేయాలనే తన ఆలోచనను వెల్లడించాడు.దీంతో నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు. బిహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల పేర్లను సూచిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.కొసమెరుపు.. బిట్టూ శుభ్రం చేసిన అజ్నార్ నది మళ్లీ కాలుష్యం బారిన పడడం ప్రారంభమైంది. కొందరు చెత్తాచెదారం అందులో వేయడం.. వాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో కొందరు యువకులు అక్కడ గస్తీ కాస్తూ బిట్టూ కష్టం వృథా కానివ్వకుండా కాపాడుకుంటున్నారు. -
గణపతి ఉత్సవాలకు కార్పొరేట్ హంగులు
ముంబై: మహానగరం ముంబైలోని ప్రముఖ గణపతి మండపాలకు కార్పొరేట్ సంస్థల సహకారం అంతకంతకు పెరుగుతోంది. ముంబయిలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా, చించ్పోక్లీచా చింతామణి మండపాలు ఈ వరుసలో ముందున్నాయి. ఈ ఏడాది చించ్పోక్లీచా చింతామణికి అదానీ గ్రూప్ సహకారం అందిస్తున్నది. గత ఏడాది అనంత్ అంబానీ లాల్బాగ్చా రాజా మండలిలో అధికారికంగా చేరారు. ప్రముఖ మండపాలతో అనుబంధం ద్వారా కార్పొరేట్ కంపెనీలు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి.లాల్బాగ్చా రాజా మండపానికి ఉన్న విస్తృత ప్రజాదరణ, ప్రముఖుల సందర్శనలను తమ ప్రచారానికి అనువుగా కార్పొరేట్ కంపెనీలు మలచుకుంటున్నాయి. అదానీ గ్రూప్ నుంచి రూ.3.5 కోట్లు పొందిన చింతామణి మండపం మరింత వ్యవస్థీకృత విధానాన్ని అనుసరిస్తోంది. అర కిలోమీటరు పొడవైన ప్రత్యేక ప్రచార ప్రాంతాన్ని ఏర్పాటు చేసి, సొంత మార్కెటింగ్ బృందాన్ని నియమించింది. తొలిసారిగా ఎల్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేసింది. ఉత్సవానికి ముందే చింతామణి విగ్రహం ఆగమన్కు పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేయడంతో భారీగా జనం తరలివచ్చారు.లాల్బాగ్చా రాజా వద్ద సర్దార్ హోటల్ నుంచి కాలాచౌకీ పోలీస్ స్టేషన్ వరకు ప్రధాన రహదారులపై బ్రాండింగ్ కేంద్రీకృతమైంది. భారీగా భక్తులు వచ్చే ప్రాంతాల్లో స్పాన్సర్ల బ్రాండింగ్ను ఏర్పాటు చేశారు. చింతామణి మండపంలో నిర్వాహకులే ప్రచార సందేశాలు, కంటెంట్ను నిర్వహిస్తూ భక్తుల భాగస్వామ్యం, స్పాన్సర్లకు కనిపించే స్థాయికి ప్రాధాన్యమిస్తున్నారు. చింతామణితో అనుబంధం తమకు గౌరవప్రదంగా ఉందని అదానీ ప్రతినిధి తెలిపారు. భక్తుల భద్రత, జనసమూహాల నిర్వహణపైనే తమ దృష్టి ఉందని, అదే సమయంలో చింతామణి సంప్రదాయాలను గౌరవిస్తూ, పరిరక్షిస్తున్నామని చెప్పారు.విగ్రహాల వద్దకు వెళ్లే రహదారులు, సందులు కూడా ప్రకటనల స్థలాలుగా మారుతున్నాయి. గణేశోత్సవ సమయంలో లక్షలాది భక్తుల కోసం ప్రత్యేక దర్శన మార్గాలు, బ్యారికేడ్లు, ప్రజలకు అందుబాటులో ఉండే మార్గాలకు అనుమతులు తీసుకుంటారు. ఈ మార్గాల్లోని బ్యారికేడ్లు, స్వాగత తోరణాలు, బ్యానర్లు, దిశానిర్దేశక బోర్డులు తదితరాలు స్పాన్సర్షిప్లో భాగమవుతున్నాయి. క్యూల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు ప్రకటనదారులకు ఒకే చోట లభించే వినియోగదారులుగా మారుతున్నారని, జనసందోహం పెరిగే కొద్దీ ఈ ప్రాంతాల వాణిజ్య విలువ కూడా పెరుగుతోందని స్పాన్సర్షిప్తో సంబంధం ఉన్న వ్యక్తి తెలిపారు.స్పాన్సర్ల ప్రాధాన్యం పెరుగుతుండటంపై ఉత్సవ నిర్వాహకుల్లో చర్చ మొదలైంది. వాణిజ్య భాగస్వామ్యం ఉత్సవ స్వభావాన్ని మార్చడం లేదని, భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేందుకు ఇది అవసరమని నిర్వాహకులు చెబుతున్నారు. అయినప్పటికీ సంప్రదాయానికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని, ఆచారాలు, పూజా విధానాలు, ఉత్సవ నిర్ణయాలు సంప్రదాయాలు, విలువల ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు.ఇదీ చదవండి: నీమ్ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం -
‘నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా’ : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం సంచలన ప్రకటన చేశారు. గోవాకు వెడుతున్నా.. పెద్ద ప్రకటన రానుంది అంటూ ట్వీట్ చేశారు. 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ చేయనున్న కీలక ప్రకటన ఏమిటా అన్నది పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా నిలిచింది. కేజ్రీవాల్ రాకకు ముందు, స్థానికంగా, ఆప్ గోవా ఫార్వార్డ్ పార్టీ (GFP)లకు సంబంధించిన హోర్డింగ్లు దర్శనమివ్వడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.తాను గోవా పర్యటనకు వెళ్తున్నట్లు వెల్లడిండిన కేజ్రీవాల్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. రానున్న గోవా ఎన్నికల నేపథ్యంలోఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా ఉంటే "మిమ్మల్ని మూడవసారి మోసం చేయనివ్వకండి" అనే స్లోగన్స్తో స్థానికంగా వెలసిన హోర్డింగ్లలో రెండు పార్టీల చిహ్నాలు ఉన్నాయి. 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, విజయ్ సర్దేశాయి నేతృత్వంలోని GFP మధ్య ఎన్నికల పూర్వ పొత్తు ఉండవచ్చనే చర్చకు ఇది ఆజ్యం పోసింది.ఆదివారం జరగనున్న విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగించనున్నారని, ఆ సందర్భంగా రెండు పార్టీల మధ్య పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెందిన ఒక సీనియర్ నేత తెలిపారు. అంతేకాదు ఈ పొత్తును బీజేపీ,కాంగ్రెస్ రెండింటికీ ప్రత్యామ్నాయంగా ఉండబోతోందని కూడా పేర్కొన్నారు.అలాగే శ్రీ గురుసాహిబ్ జీ సదా మనకు తోడుగా ఉంటూ, ప్రతి అడుగులోనూ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అంటూ మరో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. Am going to Goa today to make a very big announcement.— Arvind Kejriwal (@ArvindKejriwal) September 12, 2026ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్కాగా గోవా శాసనసభ ఎన్నికలు 2027 మార్చిలోపు జరగాల్సి ఉంది. ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన ఆప్ అధినేత గోవాలొ అధికారి పీఠాన్ని దక్కించుకోవాలని పథక రచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే కొన్ని హామీలను గుప్పించారు కూడా. గోవాలో ఆద్మీ పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోగా E20 పెట్రోల్ బ్యాన్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక వేళ తాము ఈ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైతే రాజికీయాలనుంచి తప్పుకుంటానని కూడా ప్రకటించారు. E20 పెట్రోల్ కారణంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనీ, E20 వల్లే చక్కెర ధరలూ పెరుగుతున్నాయని ఆరోపిస్తున్న ఆప్ E20పై జాతీయ ప్రచారాన్ని కూడా చేపట్టింది.ఇదీ చదవండి : నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్ -
నీమ్ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం
‘హనుమాన్ అంశ్’.. హిందీ సినిమా విడుదలైన తరువాత చాలామంది నీమ్ కరోలీ బాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. నీమ్ కరోలి బాబా.. మహరాజ్ జీగా కూడా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు. ఆయన లోతైన ఆధ్యాత్మిక బోధనలను ఎంతో ప్రశాంతతను అందిస్తాయని పలువురు చెబుతుంటారు. కష్టాలను ఎదుర్కొనే సమయంలో.. జీవితంలోని సత్యాలను అంగీకరించడంపై ఆయన బోధనలు ప్రధానంగా దృష్టి సారించాయి. నిజాయతీగా జీవించడం, క్షమించడం ఎంతో ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు. భౌతిక వస్తువులన్నీ శాశ్వతం కాదని, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనదని మహరాజ్ జీ వివరించారు. ఈ బోధనలు అంతర్గత ప్రశాంతతను అందించడంతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యానికి దోహదపడతాయి.నీమ్ కరోలీ బాబా తన మాటలు, చేతలతో కోట్లాది మంది హృదయాలను ప్రభావితం చేశారు. ‘మిరాకిల్ బాబా’గా కూడా పేరొందిన ఈయన.. హనుమంతుడి భక్తుడు. జీవితంలోని అత్యంత కఠినమైన సవాళ్లను అధిగమించేందుకు సహాయపడే నాలుగు శక్తివంతమైన నీమ్ కరోలీ బాబా బోధనలు ఇవే..1. ‘మీరు బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఏదైనా అంత్యక్రియలను చూసినప్పుడు.. జీవిత సత్యాలను వాస్తవంగా నేర్చుకుంటారు’ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఎదురవుతుంటాయి. ఇది విశ్వంలోని సహజ నియమం. కొన్నిసార్లు వర్షం పడుతుంది.. మరికొన్నిసార్లు ఎండ కాస్తుంది. కష్టాలను ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకునే నైపుణ్యాన్ని అలవర్చుకోవడం ఇక్కడ కీలకమైనది. కఠిన పరిస్థితులను జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సత్యాలను నేర్చుకునే కాలంగా పరిగణించాలని నీమ్ కరోలీ బాబా చెప్పారు. ఆధునిక మనస్తత్వశాస్త్రంలో ఈ వైఖరినే ‘మానసిక స్థైర్యం’గా పిలుస్తారు.2. ‘సంపూర్ణ నిజాయితీ, సత్యం అత్యవసరం. మీరు చెప్పిన దాని ప్రకారమే జీవించాలి’ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగేందుకు మనం పెంపొందించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణాల్లో నిజాయతీ ఒకటి. దాచాల్సిన విషయం ఏదైనా ఉన్నప్పుడు మనుషులు భయపడతారు. మీతో మీరు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు నిజం చెప్పడం ప్రారంభించినప్పుడు.. వెలుగు వచ్చిన వెంటనే చీకటి మాయమైనట్లుగా భయం కూడా మీ నుంచి దూరమవుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ ప్రపంచంలో సత్యమే గొప్ప శక్తి. ఈ వెలుగును ఎప్పటికీ వదులుకోవద్దు.3. ‘క్షమించడమే గొప్ప ఆయుధం. ఎందుకంటే ఆ ఆయుధం కలిగిన వ్యక్తి చలించనివాడిగా ఉంటాడు. అతను వెంటనే కోపాన్ని వదులుకోగలుగుతాడు’ద్వేషం, పగ, అసూయ మొదలైనవి మన ప్రశాంతతను, అంతర్గత సామరస్యాన్ని నిశ్శబ్ద వ్యాధిలా దెబ్బతీసే ప్రతికూల భావాలు. వీటిని వదిలేయడం అనేది మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మరో గొప్ప శక్తి. వదిలేయడాన్ని అలవర్చుకునే కళను నేర్చుకునేందుకు ధ్యానం ఒక గొప్ప సాధనగా ఉపయుక్తమవుతుంది.నిటారుగా వెన్నెముకను ఉంచి సౌకర్యంగా కూర్చొని, మీలో ఉద్భవిస్తున్న ఆలోచనలు, భావోద్వేగాలను గమనించండి. అవి వచ్చి వెళ్లిపోతున్నాయనే సత్యాన్ని గుర్తించండి. వాటికి ప్రతిస్పందించవద్దు. ఈ సాధనను ప్రతిరోజూ కొనసాగిస్తే.. మీ అంతరంగంలో ప్రశాంతత నెలకొంటున్న అనుభూతిని గుర్తిస్తారు.4. ‘దేవుని ప్రేమ తప్ప ప్రతిదీ అశాశ్వతమే’ఈ భౌతిక ప్రపంచంతో మనల్ని మనం అంటిపెట్టుకోవడం ఎప్పటికీ దుఃఖానికే దారితీస్తుంది. ఎందుకంటే ఏది ఉద్భవిస్తుందో అది అంతరించిపోతుంది. ఏదీ శాశ్వతంగా ఉండదు. అయితే మన ఆత్మల్లో ఉన్న దైవిక తత్వం శాశ్వతమైనది. అది నిత్యమైనది, మార్పులేనిది. ఈ సత్యంపై ధ్యానం చేయండి.భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూచించిన విధంగా కర్మయోగాన్ని ఆచరించండి. మీ విధులను నిర్వర్తించండి.. ఫలితాల విషయంలో మీకు మీరు అతిగా ఆపాదించుకోవద్దు. మీ కర్మలను దేవుని పాదాల వద్ద అర్పించండి. జనన మరణాల శాశ్వత చక్రం నుంచి విముక్తి పొందేందుకు, ముక్తి లేదా మోక్షాన్ని సాధించేందుకు ఇదే ఏకైక మార్గం.ఇదీ చదవండి: వీఐపీ కల్చర్కు దూరంగా.. రైలెక్కిన గవర్నర్ -
నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్
సాక్షి,ముంబై : బాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమీషా పటేల్ తల్లిదండ్రుల చర్చిగేట్ (ముంబై) నివాసం నుండి , బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంటి పనిమనిషే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నటి తల్లి ఆశా పటేల్ ఫిర్యాదు మేరకు నిందితురాలు సీమా ఘాటేను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం జనవరి 2026లో ఒక గాజు చోరీకి గురైంది. దీనిపై సీమాను అనుమానించిన ఆశా పటేల్, తప్పు ఒప్పుకుని, పోయిన ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరారు.అయితే, ఆ గాజును తిరిగి ఇవ్వకపోవడంతో, ఆశా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.దీంతో పాలఘర్కు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటే అనే ఇంటి పనిమనిషిని మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ 5 లక్షలకు పైమాటే. వీటిల్లో డైమండ్గాజులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో గృహ కార్మికురాలిగా పని చేస్తోంది.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్దీనిపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్, పనిమనిషి ఘాటేపై అనుమానం వ్యక్తం చేస్తూ మెరైన్ డ్రైవ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు విరార్లో ఘాటేను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు.నిందితురాలు సీమ నేర చరిత్ర, సహచరులు ప్రాతను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు సెప్టెంబర్ 15 వరకు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..! -
బ్రిక్స్ సదస్సు: భారత్లో అడుగుపెట్టిన జిన్పింగ్
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ సదస్సు-2026లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జింగ్పిన్ ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన భారత అధికారులు స్వాగతం పలికారు. బ్రిక్స్లో భాగంగా.. సాయంత్రం జిన్పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. పాలమ్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్పింగ్తో పాటు సుమారు 400 మందితో కూడిన భారీ బృందం భారత్కు వచ్చింది. భారత అధికారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో సాదర స్వాగతం పలికారు. మోదీతో జరిగే ద్వైపాక్షిక భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇరు దేశాల సంబంధాల మెరుగుదలతో పాటు వాస్తవాధీన రేఖ (LAC) పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.New Delhi: Chinese President Xi Jinping arrives in New Delhi to attend the 18th BRICS Summit https://t.co/jqG0LAC3Rw pic.twitter.com/QG6cB1BtXH— IANS (@ians_india) September 12, 2026గాల్వాన్ ఘటన నేపథ్యంలో.. దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్కు రావడం గమనార్హం. ఆ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ భారత్ మండపం వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు ఇవాళ మధ్యాహ్నాం 2గం.లకు ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు ఆ సమావేశాలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత్ పర్యటనకు ముందు బీజింగ్ కీలక సందేశం ఇచ్చింది. రెండు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పెంచుకుని, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చైనా పేర్కొంది. భారత్–చైనా సంబంధాలు సుస్థిరంగా, ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడం ఇరు దేశాల ప్రయోజనాలకు మాత్రమే కాకుండా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా కీలకమని స్పష్టం చేసింది.ఇటు చైనా, భారత్ కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నట్లు భారత్లో చైనా రాయబారి షూ ఫెంగ్హాంగ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాలు పరస్పర విభేదాలను సరిగ్గా పరిష్కరించుకుంటూ.. సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్ అధ్యక్షుడి చేతిలో చెయ్యేసి.. -
వీఐపీ కల్చర్కు దూరంగా.. రైలెక్కిన గవర్నర్
కాన్పూర్: యూపీలోని ఛత్రపతి సాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న రెండు రోజుల ఏఐ మంథన్ 2.0 కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉత్తర్ప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఆనందీబెన్ పటేల్ శనివారం రైలులో కాన్పూర్ సెంట్రల్కు చేరుకున్నారు. ఉత్సర్గ్ ఎక్స్ప్రెస్లో ఆమె కాన్పూర్కు వచ్చారు. విశ్వవిద్యాలయంలో జరిగే ఏఐ మంథన్ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించనున్నారు. శని, ఆదివారాలలో ఈ కార్యక్రమం జరగనుంది.గవర్నర్ రైలులో కాన్పూర్కు రావడం విశ్వవిద్యాలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక్ ఆమెకు స్వాగతం పలికారు. గతంలో జులై 9న జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా ఆనందీబెన్ పటేల్ రైలులోనే కాన్పూర్కు వచ్చారు. ఈసారి కూడా రైలు ప్రయాణానికే ప్రాధాన్యతనిచ్చారు. ఆమె నిర్ణయం నిరాడంబరతను ప్రోత్సహించే సందేశాన్ని ఇస్తోందని పలువురు అంటున్నారు.ఏఐ మంథన్ 2.0లో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, పరిపాలనా రంగాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రోబోటిక్స్, పాలన, పరిశోధన, ఉపాధి రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై చర్చించనున్నారు. ఐఐటీ, ఎయిమ్స్, బిట్స్ పిలానీ, గూగుల్, ఐబీఎం తదితర సంస్థలకు చెందిన నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.మంథన్లో పాల్గొనే అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు కూడా రైలు ద్వారా లేదా ఒకే వాహనంలో కార్యక్రమానికి రావాలని గవర్నర్ సూచించారు. వేర్వేరు వాహనాల రాకపోకలను తగ్గించడం, సామూహిక ప్రయాణాన్ని ప్రోత్సహించడం ఈ సూచన ఉద్దేశం.రెండు రోజుల కార్యక్రమానికి విశ్వవిద్యాలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏఐ ఆచరణాత్మక వినియోగం, భారతదేశ భవిష్యత్తులో కృత్రిమ మేధ పాత్రపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను సిద్ధం చేయడం, పరిశోధన-ఆవిష్కరణలను ప్రోత్సహించడం, కొత్త ఉపాధి అవకాశాలపై కూడా నిపుణులు మేధోమథనం చేయనున్నారు.ఇదీ చదవండి: 5జీ రావడం లేదని.. టెక్నీషియన్ను టవర్కు కట్టేసి.. -
భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే!
వివాహేతర సంబంధాల మోజులో నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజుల్లో.. భర్తను చంపే భార్యలు, భార్యలను హతమార్చే భర్తలు, ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేసే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా.. ఒక భార్య తనకు భర్త వద్దని, ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కథలో ట్విస్టులు మాత్రం సినిమాను మించి ఉన్నాయి!..ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన కన్యాదానం చిత్రంలో.. తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు భార్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపిస్తాడు హీరో. ఆ క్లైమాక్స్ను ఏమాత్రం తీసిపోని రేంజ్లో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటే.. ఆమె మాత్రం అతను వద్దని తెగేసి చెప్పింది. దీంతో ఆ సినిమాలో శ్రీకాంత్ చేసినట్లే.. ప్రియుడి వద్దకే భార్యను చేర్చాడా భర్త. లక్నోకు చెందిన ప్రాంతీయ రక్షక్ దళ్ (PRD) జవాన్ విక్కీకి సొనాలీతో ఏడాది క్రితం వివాహమైంది. అయితే పెళ్లికి ముందే సొనాలీకి తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ స్కూల్ టైం నుంచే స్నేహితులు. ఆ స్నేహం కాస్తా వాళ్లతో పాటే పెరిగి ప్రేమగా మారింది. అయితే అతనితో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. బలవంతంగా విక్కీకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. భర్తను మోసం చేయొద్దని.. సుఖంగా కాపురం చేసుకోమని ఆ ప్రియుడు ఆమెకు హితబోధ చేస్తూ వచ్చాడు. అయితే ఆమె మాత్రం అలా ఉండలేనంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న సొనాలీ అత్తింటి నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త విక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీప జిల్లాలకు సమాచారం పంపి గాలింపు చేపట్టారు. చివరకు..సొనాలీ హర్దోయ్లో ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అతను తన ప్రియుడని చెప్పడంతో అంతా కంగుతిన్నారు. బుధవారం పోలీసులు ఇద్దరినీ లక్నోకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడించారు. గంటల తరబడి నచ్చజెప్పినా సొనాలీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భర్తతో ఒక్క క్షణం కూడా ఉండటం తనకు ఇష్టం లేదని, తన చిన్ననాటి ప్రియుడితోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో ప్రియుడు.. భర్త వద్దకే వెళ్లిపోవాలంటూ సూచించడం గమనార్హం.అయితే భార్య మాటలు విన్న విక్కీ కొంతసేపు షాక్కు గురైనా.. చివరకు ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. “ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో వారితోనే ఉండు” అని చెప్పాడు. అనంతరం ఇరువర్గాల అంగీకారంతో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సొనాలీ, ఆమె చిన్ననాటి ప్రియుడు స్థానిక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. ఈ సమయంలో ఆమె భర్త విక్కీ స్వయంగా భార్యను ప్రియుడికి అప్పగించాడు.పెళ్లి తర్వాత కూడా చిన్ననాటి ప్రేమను కొనసాగించిన సొనాలీ.. చివరకు తన ప్రియుడినే ఎంచుకుంది. అయితే ఈ ప్రేమకథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు బయటపడితే గొడవలు, దాడులు, హత్యలు, బ్లాక్మెయిలింగ్ల వరకు వెళ్లే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.. భర్త బలవంతం చేయకుండా భార్య నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు.. ఆమె చేయిని ప్రియుడి చేతిలో పెట్టి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఆ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.In #Lucknow's Malihabad, a PRD (Prantiya Rakshak Dal) jawan arranged his wife's marriage to her lover. His wife had run away from home, and upon discovering she was having an affair, the husband deemed it appropriate to have her married to the man rather than create a dispute. pic.twitter.com/9SC6Vdq05m— Siraj Noorani (@sirajnoorani) September 11, 2026 -
బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ
వినాయక చవితి వేడుకలు దేశీయ వర్తక శ్రేణులకు సరికొత్త కళను తీసుకొచ్చాయి. కొవిడ్ తర్వాతి కాలంలో ప్రశాంతంగా, అట్టహాసంగా జరుగుతున్న ఈ ఉత్సవాలు ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వర్తక రంగాలకే కాక దేశవ్యాప్త రిటైల్ మార్కెట్కు ఊపునిస్తున్నాయి. ఈ పండుగ సీజన్లో సుమారు రూ.10,000 కోట్లకు పైగా వ్యాపారం సాగుతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వినాయక విగ్రహాల తయారీ నుంచి డెకరేషన్, పూజా సామగ్రి, స్వీట్లు, లైటింగ్.. వరకు ప్రతి విభాగానికి ఈ పండుగ కొత్త ఊపిరి పోస్తోంది.విగ్రహాల తయారీ, మండపాల ఏర్పాటుగణేష్ ఉత్సవాల్లో ప్రధానాకర్షణ విగ్రహాలు, మండపాలే. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరగడంతో మట్టి గణపతులకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో వేల సంఖ్యలో వెలసిన భారీ మండపాల నిర్మాణం కోసం స్థానిక కాంట్రాక్టర్లు, పందిరి నిర్మాతలు, డెకరేషన్ సిబ్బందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో భారీ మండపం ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. విగ్రహాల విక్రయాలు, రవాణా, మండపాల డెకరేషన్ ఖర్చులతో కలిపి కేవలం ఈ విభాగంలోనే వేల కోట్ల రూపాయల ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నాయి.లైటింగ్, మైక్ సిస్టమ్స్ఉత్సవాల వేళ మండపాల్లోని రంగురంగుల లైటింగ్, ఆకట్టుకునే థీమ్ డెకరేషన్లు మార్కెట్ను ఏలుతున్నాయి. ఎల్ఈడీ లైట్లు, లేజర్ షోలు, సౌండ్ సిస్టమ్ల అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఈసారి డిజిటల్ డెకరేషన్లు, ఫ్లవర్ ఆర్ట్ కాన్సెప్ట్లకు నిర్వాహకులు ప్రాధాన్యమిస్తున్నారు. ఎలక్ట్రికల్ వ్యాపారులు, లైటింగ్ కాంట్రాక్టర్లు, ఈవెంట్ మేనేజర్లు ఈ పండుగ సీజన్లో దాదాపు 30-40 శాతం అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు లైటింగ్, సౌండ్ సిస్టమ్ వ్యాపారం జోరుగా సాగుతోంది.పూలు, పండ్లు, పూజా సామగ్రిపండుగ రోజుల్లో పూలు, పండ్ల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. వినాయకుడికి ఇష్టమైన తులసి, గరిక, పత్రి, మందార, చామంతి పూలకు భారీ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్కు తగ్గట్లుగానే పూలు, పండ్ల ధరలు సాధారణ రోజుల కంటే పెరిగాయి. ఇక పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, ధూపం, కర్పూరం, వెండి ఉత్పత్తుల విక్రయాలు పుంజుకుంటున్నాయి. చిరు వ్యాపారుల నుంచి పెద్ద షాపుల వరకు పూజా విభాగానికి సంబంధించిన బిజినెస్ రూ.1,500 కోట్లకు పైగానే నడుస్తోందని అంచనా.లడ్డూలు, స్వీట్లువినాయకుడి నైవేద్యం అంటేనే లడ్డూలు, మోదకాలు, కుడుములు. ఈ ఉత్సవాల వేళ దేశవ్యాప్తంగా స్వీట్ షాపులు కిటకిటలాడుతున్నాయి. సాంప్రదాయ మోదకాలతో పాటు డ్రై ఫ్రూట్ స్వీట్లు, ఆర్గానిక్ బెల్లంతో చేసిన మిఠాయిలకు గిరాకీ పెరిగింది. ప్రసాదాల తయారీ కోసం పాల ఉత్పత్తులు, నెయ్యి, పిండి పదార్థాల వినియోగం పుంజుకుంది. ప్రముఖ స్వీట్ బ్రాండ్లు వినాయక చవితి ప్రత్యేక ఆఫర్లు, గిఫ్ట్ ప్యాక్లతో భారీగా లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: 2030 నాటికి 20 లక్షల కొలువులు..! -
బెంగళూరుపై పెరుగుతున్న విమర్శలు.. డీకే సంచలన నిర్ణయం!
ఇటీవలి కాలంలో బెంగళూరు పేరు చెబితే ఐటీతో పాటు ట్రాఫిక్ కూడా గుర్తొస్తోంది. దేశ ఐటీ రాజధానిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరం.. ఇప్పుడు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ, ఖరీదైన ఇళ్లు, మౌలిక వసతులపై ఒత్తిడితో సతమతమవుతోంది. బెంగళూరు ఎంత వేగంగా ఎదిగిందో.. దాని సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఇక నగరంపై మరింత భారం మోపితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉండటంతో.. కర్ణాటక ప్రభుత్వం కొత్త దారిని ఎంచుకుంటోంది. బెంగళూరును మాత్రమే విస్తరించడం కాకుండా.. రాష్ట్రంలోని మరో ఆరు నగరాలను కూడా ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలకు కీలక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం డీకే శివకుమార్ సర్కార్ భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది.కర్ణాటక అభివృద్ధి అంటే బెంగళూరు.. బెంగళూరు అంటే ఐటీ, స్టార్టప్లు, గ్లోబల్ కంపెనీలు, లక్షలాది ఉద్యోగాలు. దశాబ్దాలుగా ఈ సమీకరణమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలిచింది. కానీ అదే విజయంతో బెంగళూరుపై ఒత్తిడి పెరిగింది. సుమారు 1.25 కోట్ల జనాభా, 1.15 కోట్లకు పైగా వాహనాలు నగరం ఎదుర్కొంటున్న భారాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఉద్యోగాలు బెంగళూరులోనే కేంద్రీకృతం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వలసలు పెరుగుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్, నివాస వ్యయం, ప్రజా రవాణా, మౌలిక వసతులపై ఒత్తిడి మరింత తీవ్రమవుతోంది.ఈ సమస్యకు డీకేఎస్ ప్రభుత్వం చూపిస్తున్న పరిష్కారం.. బెంగళూరును తగ్గించడం కాదు.. బెంగళూరు వెలుపల అవకాశాలను పెంచడం. ఇటీవల 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా డీకే శివకుమార్ ఇదే దిశలో తన ఆలోచనను స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కథ కేవలం రాజధాని చుట్టూనే తిరగకూడదని పేర్కొంటూ.. ‘బియాండ్ బెంగళూరు’ వ్యూహానికి మరింత ఊపు ఇచ్చారు. ఈ ప్రణాళికలో మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి-ధార్వాడ్-బెలగావి, తుమకూరు, కలబురగి, శివమొగ్గ కీలకంగా మారనున్నాయి. ఒక్కో ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను బట్టి ఐటీ, తయారీ, ఏఐ, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, డిజిటల్ ఎకానమీ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి.. అక్కడే ఉద్యోగాలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.మైసూరుపై భారీ ఆశలుబెంగళూరుకు సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూరును కర్ణాటకలో రెండో ప్రధాన ఐటీ నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విద్య, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో ఉన్న బలాన్ని ఉపయోగించుకుని మరిన్ని కంపెనీలను ఆకర్షించాలన్నది ప్రణాళిక. 2030 నాటికి మైసూరు నుంచి 10 బిలియన్ డాలర్ల డిజిటల్ ఆదాయం, కనీసం 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.మంగళూరుకు మరో గుర్తింపుతీర ప్రాంతానికి కీలక నగరమైన మంగళూరుకు పోర్టు, విద్య, వైద్యం, బ్యాంకింగ్, మత్స్య పరిశ్రమ, పర్యాటకం వంటి రంగాల్లో ఇప్పటికే బలమైన పునాది ఉంది. దీనికి టెక్నాలజీ, డేటా సెంటర్లు, డిజిటల్ ఎకానమీని జోడించి కొత్త పెట్టుబడులను తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. అంటే తీర ప్రాంత యువత ఉద్యోగాల కోసం తప్పనిసరిగా బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించాలన్నమాట.ఉత్తర కర్ణాటకకు టెక్నాలజీ బూస్ట్హుబ్బళ్లి-ధార్వాడ్-బెలగావి ప్రాంతాన్ని ఇంజినీరింగ్, తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ సంబంధిత రంగాలు, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న స్టార్టప్ వాతావరణాన్ని మరింత బలోపేతం చేసి ఉత్తర కర్ణాటకలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించాలన్నది లక్ష్యం. తూమకూరు, దొడ్డబళ్లాపురంను పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చూస్తుండగా.. చారిత్రకంగా వెనుకబడిన కల్యాణ కర్ణాటక ప్రాంతంలో టెక్నాలజీ, పరిశ్రమల పెట్టుబడులను పెంచడంపై దృష్టి పెట్టారు. కలబురగి, బెలగావి, హుబ్బళ్లి-ధార్వాడ్, మంగళూరు, మైసూరులో ఐదు గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ల ప్రతిపాదన కూడా ఉంది.అయితే ఇక్కడే అసలు సవాల్ ఉంది. ప్రాజెక్టులకు ఆమోదం లభించడం ఒక ఎత్తయితే.. అవి వాస్తవంగా ఏర్పాటై ఉద్యోగాలు కల్పించడం మరో ఎత్తు. గత ‘బియాండ్ బెంగళూరు’ కార్యక్రమంలో 2021-22 నుంచి 2024-25 మధ్య మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి–ధార్వాడ్ క్లస్టర్లలో దాదాపు 5,600 ఉద్యోగాలే వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లక్ష్యాలు దీనితో పోలిస్తే చాలా పెద్దవి. బెంగళూరు కర్ణాటకకు కిరీటం అయితే.. ఆ కిరీటం భారాన్ని మోయడానికి మరిన్ని నగరాలను సిద్ధం చేయాలన్నదే డీకేఎస్ సర్కార్ కొత్త వ్యూహం.ఇదీ చదవండి: కాంగ్రెస్కు బిగ్ షాక్.. మాజీ సీఎం రాజీనామా -
కోర్టుకు దర్శన్ అవసరమా?
బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు, నటుడు దర్శన్ కోర్టుకు హాజరు కావడానికి అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద విచారించారు. సాక్షుల విచారణ సమయంలో నిందితుడు దర్శన్ కోర్టులో స్వయంగా హాజరు కావాలని ఆయన న్యాయవాది వాదించారు. జడ్జి స్పందిస్తూ దర్శన్ను కోర్టుకు తీసుకొస్తే పోలీసు భద్రత ఇవ్వాల్సి ఉంటుంది, జనం రద్దీని అడ్డుకోవడం కష్టమని అన్నారు. వీలైతే పరప్పన అగ్రహార జైలులోనే విచారణ జరపవచ్చు. వ్యక్తిగత హాజరు కంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చాలా సులువుగా ఉంటుందని తెలిపారు. ఇరువర్గాలూ మాట్లాడుకుని ఒక తీర్మానానికి రావాలని, వాయిదాలకు ప్రతిసారీ నిందితులు రావాల్సిన అవసరం లేదని జడ్జి చెప్పడం గమనార్హం. వన్యప్రాణుల కేసు? మైసూరు జిల్లా టి నరసీపుర రోడ్డులో ఉన్న దర్శన్ ఫౌంహౌస్లో గతంలో అరుదైన పక్షులు, వన్యజీవులు ఉన్నట్లు వీడియోలు వచ్చాయి. అటవీశాఖ నిబంధనలకు విరుద్ధం కావడంతో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. -
12 ఏళ్ల క్రితం హతమైన మహిళ తిరిగి రావడంతో..
ససారం: బిహార్లోని రోహ్తాస్ జిల్లాలో 12 ఏళ్ల క్రితం నమోదైన హత్య కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. హత్యకు గురైనట్లు భావించి కేసు నమోదు చేసిన సరస్వతీ దేవి జార్ఖండ్లో సజీవంగా కనిపించడంతో అప్పట్లో ఆమె భర్త, మామ, బావతో సహా ఎనిమిది మంది కుటుంబ సభ్యులపై నమోదైన కేసుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2014 ఆగస్టులో దేహ్రీలోని ముఫుస్సిల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బల్రతి బిఘా-దహౌర్ ప్రాంతానికి చెందిన సరస్వతీ దేవి ఇంటి నుంచి అదృశ్యమైంది.ఆమె తన బావతో కలిసి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సమయంలో ఆగస్టు 22న ఖండా గ్రామం సమీపంలోని కాలువలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. సరస్వతీ దేవి సోదరుడు ఆ మృతదేహాన్ని తన సోదరిదిగా గుర్తించాడు. అనంతరం పోలీసులు పోస్ట్మార్టం నిర్వహించి హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో సరస్వతీ దేవి భర్త అరుణ్ మెహతా, మామ దిలీప్ మెహతా, బావ గోవింద్ కుమార్తో పాటు మొత్తం ఎనిమిది మందిపై ఆరోపణలు నమోదయ్యాయి. వారిలో పలువురు జైలులో, కోర్టు విచారణల్లో సంవత్సరాల పాటు గడిపారు.అయితే ఇటీవల సరస్వతీ దేవి జార్ఖండ్లో జీవించి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దేహ్రీ ముఫుస్సిల్ పోలీసులు.. గర్వా జిల్లాలోని కండి పోలీస్స్టేషన్ పరిధి లహరి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఆమెను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తన పేరును కాంతి దేవిగా మార్చుకుని, రట్టు సింగ్ అనే వ్యక్తితో కలిసి నివసిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆమెను బిహార్కు తీసుకువచ్చి ససారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో 2014లో కాలువలో లభించిన మృతదేహం ఎవరిది? దానిని సరస్వతీ దేవిగా ఎలా గుర్తించారు? గుర్తింపు ప్రక్రియలో ఏ విధానాలు అనుసరించారు? వంటి ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.సరస్వతీ దేవికి ప్రస్తుతం 22 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు అతను చిన్నవాడు. జార్ఖండ్లో ఆమె సజీవంగా లభించడంతో 12 ఏళ్ల క్రితం నమోదైన హత్య కేసును పూర్తిగా పునఃపరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలువలో లభించిన మృతదేహం గుర్తింపును నిర్ధారించడమే ప్రస్తుతం పోలీసులకు ప్రధాన సవాలుగా మారింది.ఇదీ చదవండి: మేరీకోమ్పై బిగ్ బాస్ అభిమానుల ఆగ్రహం -
కాంగ్రెస్కు బిగ్ షాక్.. మాజీ సీఎం, సీనియర్ నేత రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ పార్టీకి చెందిన కీలక పదవులకు రాజీనామా చేశారు. తనతో ముడిపడిన ఏ అంశం కూడా.. అవినీతిపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని బలహీనపరచకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.అయితే, తన మాజీ ఓఎస్డీ, సన్నిహితుడు జీనా ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను రావత్ ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు. జీనా సౌమ్యుడు, కష్టపడి పనిచేసే వ్యక్తి అని పేర్కొంటూనే.. గ్రామీణాభివృద్ధి అధికారుల నియామకంలో ఓఎంఆర్ షీట్లతో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు బయటపడితే తాను చేసేదేమీ లేదన్నారు. అయితే ప్రస్తుత ఆరోపణలను తాను నమ్మడం లేదని స్పష్టం చేశారు.ఇక, నియామక పరీక్షల్లో అక్రమాలు అంటే యువత భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని రావత్ వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ హయాంలో నియామక వ్యవస్థను బలోపేతం చేశామని, మూడేళ్లలో 42 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఈ ప్రక్రియలో తనవైపు నుంచి తెలిసో తెలియకో తప్పులు జరిగి ఉంటే ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.తన ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు ఎవరి వద్ద ఉన్నా సీబీఐ, ఈడీ లేదా రాష్ట్ర పోలీసులకు అందించాలని రావత్ కోరారు. తాను తప్పు చేసి ఉంటే చట్టం తనను శిక్షించాలని, ప్రజా బాధ్యతల్లో ఉన్నవారు ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటాన్ని తన కారణంగా బలహీనపరచకూడదనే ఉద్దేశంతోనే ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యత్వంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది 2027లో ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
మేరీకోమ్పై బిగ్ బాస్ అభిమానుల ఆగ్రహం
బిగ్ బాస్ హౌస్లోకి బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ ప్రవేశించిన నాలుగు రోజులకే ఆమె మాటతీరు, వైఖరిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తన కష్టం, తన విజయాలు, తన బలం గురించి మేరీకోమ్ తరచూ ప్రస్తావించడం కొంతమంది ప్రేక్షకులకు అసహనం కలిగిస్తోందనే మాట వినిపిస్తోంది. ఆమె సంభాషణల్లో ‘నేను’ అనే భావన ఎక్కువగా కనిపిస్తోందంటూ పలువురు యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు.రీతి తివారితో జరిగిన సంభాషణలో మేరీకోమ్ ‘ప్రపంచమంతా నన్ను గుర్తుపడుతుంది. మీరు ఎవరో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించడంపై చర్చ చెలరేగుతోంది. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకరి గుర్తింపును ప్రశ్నించడం కంటే, ఆ మాట చెప్పిన తీరు కొంతమంది ప్రేక్షకులకు అహంకారంగా అనిపించింది. షోలో మేరీకోమ్ తన ఫిట్నెస్, శారీరక బలం గురించి కూడా మాట్లాడింది. రింగ్లో తనతో పోటీ పడటం అంత సులభం కాదని, తనతో ఎవరూ సరిపోలరని ఆమె చెప్పింది. తన విజయాలకు కఠోర శ్రమే కారణమని, ఎవరినైనా ఎత్తి విసిరేయగల శక్తి తనకు ఉందని ఆమె చెప్పినట్లు తెలిపింది.తన పిల్లలు కూడా తనలా మారడం అంత సులభం కాదని మేరీకోమ్ వ్యాఖ్యానించింది. దీంతో ‘నా లాంటి వారు ఎవరూ లేరు’ అనే భావన ఆమె మాటల్లో కనిపిస్తోందంటూ కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేరీకోమ్ దేశానికి ఎన్నో టైటిళ్లు సాధించిన బాక్సింగ్ ఛాంపియన్. ఆమె విజయాలు, కృషిపై దేశవ్యాప్తంగా గౌరవం ఉంది. అయితే బిగ్ బాస్ వేదికపై విజయాలతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యమేనని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఆమె వైఖరిని కొంతమంది యూజర్లు ‘అహంకార భావన’తో ముడిపెడుతున్నారు. రానున్న ‘వీకెండ్ కా వార్’లో ఈ అంశంపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.ఇదీ చదవండి: ‘ఫస్ట్లుక్’లో లాల్బాగ్చా రాజా.. జనం క్యూ.. -
భారత్కు డబుల్ టెన్షన్.. హౌతీల చర్యతో మరో సంక్షోభం!
ఒకవైపు హార్ముజ్ జలసంధి.. మరోవైపు బాబ్ ఎల్-మండేబ్! ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన రెండు సముద్ర ద్వారాలపైనా ముప్పు పెరగడంతో భారత్కు కొత్త తలనొప్పి మొదలైంది. యెమెన్ తీరంలో కేవలం 18 గంటల్లో హౌతీలు చేపట్టిన మెరుపు దాడులు ఇప్పుడు ప్రపంచ దృష్టిని బాబ్ ఎల్-మండేబ్పైకి మళ్లించాయి. ఈ కీలక జలసంధిపై హౌతీలు పట్టు సాధించారు. దీంతో, గల్ఫ్ చమురు సరఫరాల నుంచి భారత్-యూరప్ వాణిజ్యం వరకు దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హార్ముజ్ సంక్షోభంతో ఇంధన సరఫరాలపై ఒత్తిడి ఎదురవుతున్న వేళ.. మరో సముద్ర మార్గం కూడా ప్రమాదంలో పడటం భారత్కు డబుల్ షాక్గా మారే అవకాశముంది.బాబ్ ఎల్-మండేబ్ ఎందుకంత కీలకం?యెమెన్, జిబౌటీ మధ్య ఉన్న బాబ్ ఎల్-మండేబ్ సుమారు 29 కిలోమీటర్ల వెడల్పు గల కీలక జలసంధి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఆపై అరేబియా సముద్రంతో అనుసంధానించే ఈ మార్గం.. సూయజ్ కాలువ ద్వారా యూరప్, ఆసియా మధ్య సముద్ర వాణిజ్యానికి ప్రధాన ద్వారం. చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, కంటైనర్ సరుకులు, పారిశ్రామిక ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఈ మార్గం గుండా రవాణా అవుతాయి. భారత్కు ఈ మార్గం మరింత కీలకం. దేశం నుంచి యూరప్కు డీజిల్, ఏవియేషన్ ఇంధనం, ఔషధాలు, వస్త్రాలు, యంత్ర పరికరాలు సహా అనేక ఉత్పత్తులు సూయజ్ మార్గం మీదుగా వెళ్తాయి. ఈ మార్గానికి అంతరాయం ఏర్పడితే భారత ఎగుమతుల రవాణా ఖర్చులు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది.హౌతీల మెరుపు దాడులుతాజా పరిణామాల్లో హౌతీలు యెమెన్ ఎర్ర సముద్ర తీరంలో వేగంగా ముందుకు సాగినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. వ్యూహాత్మకమైన మోఖా పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించగా.. బాబ్ ఎల్-మండేబ్లో కీలక స్థానంలో ఉన్న మయూన్ (పెరిమ్) ద్వీపం కూడా హౌతీల ఆధీనంలోకి వెళ్లినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. జుకర్, హనిష్ దీవుల వైపునకు కూడా వారు చేరుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ పరిణామాలతో బాబ్ ఎల్-మండేబ్ ప్రవేశ మార్గాలపై హౌతీల నియంత్రణ పెరిగింది. హౌతీ నేతలు ఇప్పటికే ఈ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ప్రకటించారు.మూసుకుపోతే ఏం జరుగుతుంది?బాబ్ ఎల్-మండేబ్లో నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడితే.. షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గాన్ని దాటేందుకు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. సముద్ర బీమా ప్రీమియాలు పెరగడం, నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లడం అనివార్యంగా మారొచ్చు. 2023లో హౌతీల దాడుల సమయంలోనే దీనికి ఉదాహరణ కనిపించింది. వందలాది కాదు.. వేలాది నౌకలు సూయజ్ కాలువ మార్గాన్ని తప్పించి ఆఫ్రికా చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయం, సరుకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి.Houthis chant in celebration on the captured Bab el-Mandeb coastMany take a break to cool off with a dip https://t.co/yZxW5lL1pn pic.twitter.com/E3GPN3iO0C— RT (@RT_com) September 11, 2026భారత్పై డబుల్ ఎఫెక్ట్?బాబ్ ఎల్-మండేబ్ సంక్షోభం భారత్ను రెండు వైపులా దెబ్బతీసే అవకాశం ఉంది. మొదటిది.. ఇంధన ధరలు. సముద్ర రవాణాకు అంతరాయం ఏర్పడితే చమురు సరఫరాలపై ఒత్తిడి పెరిగి అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు మరింత పెరగొచ్చు. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన మార్కెట్లు ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో ఇది భారత్కు భారంగా మారొచ్చు.రెండోది.. ఎగుమతులు. భారత్ నుంచి యూరప్కు వెళ్లే సరుకులు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తే ప్రయాణ దూరం భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు ముంబై నుంచి రోటర్డామ్కు సూయజ్ మార్గంలో దాదాపు 15,700 కిలోమీటర్ల దూరం ఉండగా.. కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ వెళ్లాల్సి వస్తే దాదాపు 23,000 కిలోమీటర్లకు చేరుతుంది. అంటే అదనపు ఇంధనం, ఎక్కువ సమయం, అధిక బీమా, పెరిగిన ఫ్రైట్ ఛార్జీలు భారత ఎగుమతులపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే బాబ్ ఎల్-మండేబ్ ఇప్పుడు యెమెన్ తీరంలోని ఓ చిన్న జలసంధి మాత్రమే కాదు.. భారత్ ఇంధన భద్రత, యూరప్ వాణిజ్యం, ప్రపంచ షిప్పింగ్ వ్యవస్థకు కీలక పరీక్షగా మారింది.ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సుకు దేశాధినేతలు, విశిష్ట అథితులు -
‘ఫస్ట్లుక్’లో లాల్బాగ్చా రాజా.. జనం క్యూ..
ముంబై: గణేశ్ చతుర్థి వేడుకలకు ముందుగా ముంబైలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా 2026 తొలి దర్శనాన్ని శుక్రవారం సాయంత్రం అధికారికంగా ఆవిష్కరించారు. లాల్బాగ్చా రాజా గణేశోత్సవ మండల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీంతో నగరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గణేశోత్సవ వేడుకల సందడి ప్రారంభమైంది. లాల్బాగ్చా రాజా ముంబయిలో అత్యంత ప్రసిద్ధి చెందిన గణేశ విగ్రహాల్లో ఒకటి. కళాత్మక నైపుణ్యంతో రూపొందించే ఈ విగ్రహం కేవలం ప్రతిమ మాత్రమే కాకుండా భక్తి, కళా వైభవం, ముంబై ఉత్సాహభరిత స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ మండపాన్ని, గణేశుడిని దర్శించుకుంటారు.2026లో గణేశ్ చతుర్థి వేడుకలు సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్నాయి. లాల్బాగ్చా రాజా తొలి దర్శనం ముంబై గణేశోత్సవానికి ముందు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టాల్లో ఒకటిగా ఉంది. లాల్బాగ్-పరేల్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం సింహాసనంపై ఆసీనుడై ప్రశాంతమైన, దయామయమైన, ప్రేమపూర్వక రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. లాల్బాగ్చా రాజా గణపతి విగ్రహం పుట్లాబాయి చాల్లో ఉన్న లాల్బాగ్చా రాజా గణేశోత్సవ మండల్కు అనుబంధంగా ఉంది. ఈ పూజా స్థలాన్ని 1934లో స్థాపించారు. అప్పటి నుంచి ఇది ముంబయి గణేశ్ చతుర్థి వేడుకల్లో అంతర్భాగంగా మారింది. ఎనిమిది దశాబ్దాలకు పైగా ఈ గణపతి విగ్రహ సంరక్షణ బాధ్యతలను కాంబ్లీ కుటుంబం కొనసాగిస్తోంది. #WATCH | Mumbai, Maharashtra: First look of Lalbaugcha Raja unveiled ahead of Ganesh Chaturthi on September 14. https://t.co/WZurtiJ7wf— ANI (@ANI) September 11, 2026భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున ప్రారంభమయ్యే గణేశ్ చతుర్థి ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయి. చతుర్థితో ప్రారంభమై అనంత చతుర్దశితో ముగుస్తుంది. వినాయక చతుర్థి, వినాయక చవితి పేర్లతోనూ దీనిని పిలుస్తారు. మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు ఇళ్లలో గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి, సంప్రదాయ వంటకాలు తయారు చేసి, మండపాలను సందర్శించి పూజలు చేస్తారు. పర్యావరణహిత ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెరుగుతోంది. గత దశాబ్దంగా ముంబైకి చెందిన ఓ కళాకారుడు మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్కు బదులుగా పర్యావరణహిత కాగితంతో గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు.ఇదీ చదవండి: గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి? -
వానల్లేకున్నా.. గంగమ్మ గర్జన! బిహార్లో 47 లక్షల మంది విలవిల!
వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా.. బిహార్ను వరద కష్టాలు మాత్రం వీడటం లేదు. గంగమ్మ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఊళ్లు, రహదారులు, పంట పొలాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజల దైనందిన జీవనం అస్తవ్యస్తమైంది. వరద ఉధృతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న సోషల్ మీడియా వీడియోలు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి. నీటమధ్య చిక్కుకున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నా పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.భాగల్పూర్ జిల్లా సుల్తాన్గంజ్ వద్ద గంగానది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. సెప్టెంబర్ 11 ఉదయం అక్కడ నీటిమట్టం 36.62 మీటర్లకు చేరింది. ఇది ప్రమాద స్థాయి కంటే 2.12 మీటర్లు ఎక్కువ. అయితే ఈ ఉదయం అక్కడ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ పలు చోట్ల నదీ రక్షణ కట్టలు దెబ్బతినడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.వర్షం తక్కువైనా.. వరద ఎలా?ఈసారి బిహార్ వరదలకు ఒకే కారణం లేదని అధికారుల వివరణ, తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. ఆసక్తికరంగా.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు బిహార్లో సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 1 నాటికి వర్షపాతం లోటు దాదాపు 30 శాతంగా ఉంది. అంటే కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్రం వర్షాభావ పరిస్థితినే ఎదుర్కొంది. ఆ తర్వాతే ఒక్కసారిగా నదుల్లో ప్రవాహం పెరగడంతో వరద పరిస్థితి తలెత్తింది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, వారాణసి పరిసర ప్రాంతాలతో పాటు ఎగువ గంగా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల నీరు గంగలోకి చేరి దిగువకు ప్రవహించింది. దీంతో బిహార్లో గంగానది నీటిమట్టం వేగంగా పెరిగింది.అంతేకాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నీటి ప్రవాహం, బిహార్లో అక్కడక్కడ కురిసిన వర్షాలు కూడా పరిస్థితిని తీవ్రం చేశాయి. గంగా నీటిమట్టం పెరగడంతో దానిలో కలిసే చిన్న, పెద్ద నదుల నీరు వెనక్కి నిలిచే బ్యాక్వాటర్ ప్రభావం ఏర్పడింది. దీంతో ఇప్పటికే నీటితో నిండిన ప్రాంతాల్లో ముంపు మరింత పెరిగింది.నేపాల్ వర్షాల పాత్ర ఎంత?బిహార్ వరదల ప్రస్తావన వచ్చినప్పుడల్లా నేపాల్ పేరు ముందుకు వస్తుంది. కారణం.. ఉత్తర బిహార్లోని అనేక ప్రధాన నదులు నేపాల్ హిమాలయ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ రాష్ట్రంలోకి రావడమే. కోసి, గండక్, బాగ్మతి వంటి నదులకు ఎగువ పరీవాహక ప్రాంతాలు నేపాల్లో ఉన్నాయి. అక్కడ భారీ వర్షాలు కురిస్తే దిగువ ప్రాంతాలకు ఒక్కసారిగా భారీగా నీరు చేరే అవకాశం ఉంటుంది.ఆగస్టు చివరి వారంలో నేపాల్లోని కొన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల నుంచి వచ్చే నదుల్లోనూ ప్రవాహం పెరిగింది. దీనికి తోడు.. ఈసారి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలు, అక్కడి నుంచి వచ్చిన వరదనీరు ముంచెత్తాయి.బిహార్కే వరద ముప్పు ఎందుకింత?బిహార్ భౌగోళిక స్వరూపమే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మారుస్తోంది. ముఖ్యంగా ఉత్తర బిహార్ హిమాలయాల నుంచి వచ్చే నదులు విస్తారమైన మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించే ప్రాంతం. కొండ ప్రాంతాల్లో వేగంగా ప్రవహించే నదులు మైదానాల్లోకి వచ్చిన తర్వాత ప్రవాహ వేగం తగ్గుతుంది. దీంతో అవి తీసుకొచ్చే ఇసుక, మట్టి, సిల్ట్ నదీ పడగలో పేరుకుపోతాయి. దీంతో నదుల నీటిని మోసుకెళ్లే సామర్థ్యం తగ్గి, భారీ ప్రవాహం వచ్చినప్పుడు నీరు ఒడ్డులను దాటి బయటకు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గంగా, కోసి, గండక్, బాగ్మతి, బుడి గండక్, ఘాఘ్రా, మహానంద, పున్పున్ వంటి నదులు బిహార్లోని వివిధ ప్రాంతాలకు వరద ముప్పును కలిగిస్తుంటాయి. ముఖ్యంగా కోసి నది తరచూ తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం, భారీగా సిల్ట్ పేరుకుపోవడం వల్ల ఉత్తర బిహార్లో వరద సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే కోసిని చాలాకాలంగా ‘బిహార్ దుఃఖదాయిని’గా పిలుస్తారు.#WATCH | Bhagalpur, Bihar: Over 90 panchayats and several urban areas in the Bhagalpur area remain severely flooded. NH-80 on the Bhagalpur-Patna route has been shut near Bhavnathpur for five days as floodwater flows nearly two feet deep across the road. Floodwaters have also… pic.twitter.com/nuVuW3LYNa— ANI (@ANI) September 12, 2026రక్షణ కట్టలకూ గండంఅదే సమయంలో వరదనీరు గ్రామాలు, పట్టణాలు, పంట పొలాల్లోకి చేరకుండా నదుల వెంట నిర్మించే ఎత్తైన కట్టలను రక్షణ కట్టలు అంటారు. బిహార్లో దశాబ్దాలుగా ఇలాంటి కట్టలపై ఆధారపడి వరద నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అయితే నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగినప్పుడు ఈ కట్టలపై నీటి ఒత్తిడి కూడా పెరుగుతుంది. తాజా వరదల్లో భాగల్పూర్లో పలు ప్రాంతాల్లో రక్షణ కట్టలు దెబ్బతినడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఒకచోట కట్ట తెగితే పెద్ద మొత్తంలో నీరు ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలు, రహదారులు, పొలాల్లోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది.లక్షల మందిపై ప్రభావంతాజా అధికారిక సమాచారం ప్రకారం 15 జిల్లాల్లో 46.88 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. 88 బ్లాకులు, 561 గ్రామ పంచాయతీల్లో ముంపు పరిస్థితులు నెలకొన్నాయి. రహదారులు, ఇతర రవాణా మార్గాలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాల్లో పడవలే ప్రజలకు ప్రధాన రవాణా మార్గంగా మారాయి. భాగల్పూర్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ వరదనీటిలో చిక్కుకున్న వారిని తరలించేందుకు పడవలను ఉపయోగిస్తున్నారు. తాజాగా వరదనీటిలో ఒక వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు మరో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన కూడా చోటుచేసుకుంది.The floods in Bihar should now be declared a national disaster, and immediate assistance should be provided to Bihar. pic.twitter.com/H2YlFNH6HW— Sameera Jain (@SameeraJain6) September 7, 2026సహాయక చర్యలు ముమ్మరంవరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. దాదాపు 33 రెస్క్యూ బృందాలు, సుమారు 700 ప్రభుత్వ పడవలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ కిచెన్లు పనిచేస్తున్నాయి. పొడి రేషన్, పాలిథిన్ షీట్లు తదితర సహాయ సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం బోటు అంబులెన్సులను కూడా వినియోగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 1,194 కమ్యూనిటీ కిచెన్లు పనిచేస్తున్నాయి.ఇప్పుడేం జరుగుతోంది?కొన్ని ప్రాంతాల్లో గంగానది నీటిమట్టం స్వల్పంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నా.. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. సుల్తాన్గంజ్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టినా ప్రమాద స్థాయికి రెండు మీటర్లకు పైగా ఎగువన ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రక్షణ కట్టలపై నీటి ఒత్తిడి కొనసాగుతోంది.ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం మాత్రమే కాకుండా.. నదుల్లో పేరుకుపోయే సిల్ట్ నిర్వహణ, రక్షణ కట్టల బలోపేతం, వరద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, నదుల ప్రవాహ మార్గాలపై శాస్త్రీయ అధ్యయనాలు, దీర్ఘకాలిక వరద నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తాజా పరిస్థితి మరోసారి గుర్తుచేస్తోంది.వైరల్ ఫెర్రీ వీడియో సంగతేంటి?ఇక భారీగా ప్రయాణికులతో నిండిన ఫెర్రీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో సుమారు 200 మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వీడియో ప్రస్తుత బిహార్ వరదలకు సంబంధించినదా? పాతదా? లేదా ఏఐ సాయంతో రూపొందించిందా? అనేది క్లారిటీ లేదు. అయితే జులై చివరి వారంలోనే ఓ యూట్యూబ్ చానెల్లో ఈ వీడియో అప్లోడ్ కావడం గమనార్హం. అయితే ప్రస్తుత వరద పరిస్థితుల్లో రోడ్డు మార్గాలు దెబ్బతినడంతో పడవలపై ప్రజలు ఆధారపడుతున్న విషయం మాత్రం వాస్తవం.This is not an ocean; this is the Mighty Ganges in Bihar. pic.twitter.com/ecSUSLCahb— Magadh Updates (@magadh_updates) September 11, 2026ఇదీ చదవండి: దుర్మార్గులు: ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కావట్లేదని.. -
ఐదు రోజుల్లో రిటైర్మెంట్.. ఇంతలో కలెక్టర్కు బిగ్ షాక్!
సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్కు కౌంట్డౌన్ మొదలైన వేళ.. ఆయనపై అవినీతి కేసు నమోదవడం సంచలనంగా మారింది. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అతి తక్కువ మొత్తానికే బదలాయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలతో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.హర్యానా పరిపాలనా వర్గాల్లో సంచలనం రేపిన భూ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి డి. సురేశ్పై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) కేసు నమోదు చేసింది. ఆయన రిటైర్మెంట్కు కేవలం ఐదు రోజుల ముందు.. ఆగస్టు 26న ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రధాన కార్యదర్శి అనుమతితో నమోదైన ఈ కేసులో 1995 బ్యాచ్కు చెందిన డి. సురేశ్తో పాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు ప్రధాన కార్యదర్శి అనుమతి లభించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సురేశ్ ఆగస్టు 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అందుకు కేవలం ఐదు రోజుల ముందు కేసు నమోదు కావడం మరింత చర్చకు దారితీసింది.కాగా, గురుగ్రామ్ సెక్టార్-23లోని 500 చదరపు గజాల HSVP స్థలానికి సంబంధించిన వ్యవహారమే ఈ కేసుకు కేంద్రంగా మారింది. ఈ ప్లాట్ మార్కెట్ విలువ సుమారు రూ.3.5 కోట్లు కాగా.. కలెక్టర్ రేటు ప్రకారం దాని విలువ దాదాపు రూ.1.75 కోట్లు ఉంటుందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఆ స్థలాన్ని కేవలం రూ.6.71 లక్షలకే బదలాయించినట్లు అవినీతి నిరోధక శాఖ ఆరోపించింది. 1988లో కేటాయించిన ఈ ప్లాట్కు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో 2002లో HSVP దానిని తిరిగి స్వాధీనం చేసుకుంది. అనంతరం దాదాపు ఏడేళ్లపాటు సాగిన విజిలెన్స్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. మరో ప్లాట్ పునరుద్ధరణకు సంబంధించిన కోర్టు ఉత్తర్వులను ఉపయోగించి నకిలీ నోట్షీట్లను అధికారులు, సిబ్బంది సిద్ధం చేశారన్నది ప్రధాన ఆరోపణ.2019 మార్చిలో HSVP చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న డి. సురేశ్.. డిఫాల్ట్ అయిన ప్లాట్ పునఃస్వాధీన నిర్ణయాన్ని రద్దు చేశారని, అనంతరం అత్యంత తక్కువ విలువకు కన్వేయన్స్ డీడ్ అమలు జరిగేలా సహకరించారని ఏసీబీ ఆరోపించింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పటి ఎస్టేట్ అధికారి ముకేశ్ కుమార్తో పాటు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదైంది. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు పెట్టారు. అయితే ఈ వ్యవహారంలో సురేశ్కు పంజాబ్-హర్యానా హైకోర్టు మధ్యంతర ఊరట కల్పించింది. తనను అరెస్టు చేసే ముందు కనీసం ఏడు రోజుల నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 16న జరగనుంది.ఇదీ చదవండి: యూపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ -
గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి?
వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశమంతా గణనాథుని నామస్మరణతో మార్మోగిపోతుంది. అయితే మహారాష్ట్రలో ఈ పండుగకు మరో ప్రత్యేకత ఉంది. గణపయ్యను ఒక్కచోట దర్శించుకోవడం కాదు.. ఎనిమిది పవిత్ర క్షేత్రాల్లో ఎనిమిది విశిష్ట రూపాల్లో కొలువైన విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడమే ‘అష్టవినాయక యాత్ర’. స్వయంభూ గణేశులుగా భక్తులు విశ్వసించే ఈ ఎనిమిది ఆలయాలు.. ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎనిమిది క్షేత్రాలు మహారాష్ట్రలోని పుణె, రాయ్గఢ్, అహ్మద్నగర్ జిల్లాల్లో ఉన్నాయి. గణేశ చతుర్థి సందర్భంగా ఈ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అసలు ఈ సంప్రదాయ అష్టవినాయక యాత్ర ఎక్కడ మొదలై.. ఎక్కడ ముగుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.వినాయక చవితి వేళ మహారాష్ట్రలోని గణేశ ఆలయాలు భక్తులతో సందడిగా మారుతాయి. ముఖ్యంగా అష్టవినాయక యాత్రకు ఈ సమయంలో మరింత ప్రాధాన్యత ఉంది. సంప్రదాయంగా ఈ యాత్ర మొరగావ్ నుంచి ప్రారంభమై తిరిగి అక్కడే ముగుస్తుంది.1. మొరగావ్ మయూరేశ్వరుడుఅష్టవినాయక యాత్రలో మొరగావ్లోని శ్రీ మయూరేశ్వర ఆలయం తొలి, చివరి దర్శన స్థలంగా ఉంటుంది. ఇక్కడ గణేశుడిని మయూరేశ్వరుడు లేదా మృగమూర్తి రూపంలో పూజిస్తారు. ఈ రూపానికి వాహనం నెమలి అని చెబుతారు. మహారాష్ట్ర టూరిజం సమాచారం ప్రకారం.. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. అందుకే సంప్రదాయ యాత్రలో మొరగావ్ ప్రత్యేక ప్రారంభ, ముగింపు క్షేత్రంగా నిలుస్తుంది.2. సిద్ధటెక్ సిద్ధివినాయకుడుఅష్టవినాయక యాత్రలో తదుపరి ముఖ్యమైన క్షేత్రం సిద్ధటెక్లోని సిద్ధివినాయక ఆలయం. ఇక్కడ గణేశుడిని ‘సిద్ధివినాయకుడు’గా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయం పౌరాణిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందింది. అష్టవినాయక యాత్రలో భాగంగా ఈ క్షేత్రాన్ని దర్శించడం సంప్రదాయంలో ముఖ్యమైన అంశంగా భావిస్తారు.3. పాలి బల్లాళేశ్వరుడురాయ్గఢ్ జిల్లాలోని పాలి గ్రామంలో ఉన్న బల్లాళేశ్వర ఆలయానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అష్టవినాయక ఆలయాల్లో గణేశుడి పేరుతో కాకుండా ఆయన భక్తుడైన బల్లాళుడి పేరుతో ఉన్న ఏకైక ఆలయం ఇదే. గణేశుడిపై బల్లాళుడికి ఉన్న భక్తితో ఈ ఆలయ కథ ముడిపడి ఉంది. అందువల్ల అష్టవినాయక క్షేత్రాల్లో బల్లాళేశ్వర ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది.4. మహడ్ వరదవినాయకుడురాయ్గఢ్ జిల్లాలోని మహడ్లో వరదవినాయక ఆలయం ఉంది. అష్టవినాయక యాత్రలో ఇది మరో ముఖ్యమైన మజిలీ. ఇక్కడ గణేశుడిని వరదవినాయక రూపంలో పూజిస్తారు. ఆనందం, సౌభాగ్యం, సమృద్ధి, మనశ్శాంతి కోసం భక్తులు ప్రధానంగా స్వామివారిని ప్రార్థిస్తారు. అష్టవినాయక సంప్రదాయంలోని ప్రముఖ గణేశ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి.5. థేవూర్ చింతామణిపుణె సమీపంలోని థేవూర్లో చింతామణి ఆలయం ఉంది. అష్టవినాయక యాత్రలో ఇది కూడా కీలకమైన క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణంతో పాటు అధికమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర టూరిజం ప్రకారం.. మూళా, ముఠా, భీమా నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. దీంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది.6. లేణ్యాద్రి గిరిజాత్మజుడులేణ్యాద్రిలోని గిరిజాత్మజ ఆలయం ప్రత్యేక ఆరాధనా రూపానికి ప్రసిద్ధి చెందింది. అష్టవినాయక ఆలయాల్లో గణేశుడిని బాలరూపంలో పూజించే ఏకైక క్షేత్రంగా దీనికి గుర్తింపు ఉంది. పార్వతిదేవి తపస్సు అనంతరం గణేశుడు ఇక్కడ గిరిజాత్మజుడిగా ప్రత్యక్షమయ్యాడనే నమ్మకం ఉంది. ఈ కారణంగా అష్టవినాయక యాత్రలో గిరిజాత్మజ క్షేత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.7. ఓజర్ విఘ్నేశ్వరుడుఓజర్లోని విఘ్నేశ్వర గణపతి ఆలయం కూడా అష్టవినాయక యాత్రలోని ముఖ్యమైన క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం నిర్మాణశైలి, బంగారు విగ్రహాల కారణంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణేశుడిని ‘విఘ్నేశ్వరుడు’గా, అంటే అడ్డంకులను తొలగించే స్వామిగా పూజిస్తారు. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.8. రంజన్గావ్ మహాగణపతిఅష్టవినాయక యాత్రలో ఎనిమిదో ప్రధాన ఆలయం రంజన్గావ్లోని మహాగణపతి ఆలయం. ఇది పుణెకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించిన కథ శివుడు, త్రిపురాసురుడి కథతో ముడిపడి ఉంది. ఇలా ఎనిమిది గణేశ క్షేత్రాల దర్శనంతో అష్టవినాయక యాత్ర పూర్తవుతుంది. గణేశ చతుర్థి సందర్భంగా ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. యాత్రకు వెళ్లాలని భావించేవారు దర్శన సమయాలు, స్థానిక రవాణా సదుపాయాలు, పండుగ సమయంలో అమల్లో ఉండే ప్రయాణ సంబంధిత సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని వెళ్లడం ఉత్తమం.ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి? -
భూమికి ఆధార్ లాంటి గుర్తింపు
న్యూఢిల్లీ: వ్యక్తులకు ఉన్నట్లే ఇకపై భూములకు ప్రత్యేక ఆధార్ లాంటి గుర్తింపు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఒక్క అంకెతో ప్రభుత్వంలోని అన్ని విభాగాలూ... ఆ భూమి ఎక్కడ ఉంది? హద్దులేమిటి? యజమాని ఎవరు? వంటి వివరాలన్నీ తెలుసుకోగలదు. భూమి రికార్డుల ఆధునికీకరణ, డిజిటలీకరణ మూడో దశ కార్యక్రమాని (డీఐఎల్ఆర్ఎంపీ 3.0) కి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయడం ఇందుకు కారణం... 2026–31 మధ్యకాలంలో జరిగే ఈ కార్యక్రమానికి సుమారు రూ.565.5 కోట్ల ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా భూమి రికార్డులు, మ్యాపులు, రిజిస్ట్రేషన్ల తాలూకూ వివరాలన్నీ ఒక దగ్గరకు చేర్చనున్నారు. జీఐఎస్ ఆధారిత డిజిటల్ ప్రేమ్వర్క్ ద్వారా భూమికి సంబంధించిన సమీకృత రికార్డులను సృష్టించనున్నారు. ఇది వ్యక్తుల రికార్డులను డిజిటలీకరించడం కాదని, సమీకృత భూ నిర్వహణ వ్యవస్థ అని మార్గదర్శకాల జారీ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ‘‘భూమి అంటే మట్టి ముక్క కాదు. మన రైతుల ఆత్మగౌరవం. పూర్వీకులిచ్చిన ఆశీర్వాదం. భవిష్యత్తు తరాల ఉనికికి నిదర్శనం’’అని ఆయన వ్యాఖ్యానించారు. డీఐఎల్ఆర్ఎంపీ 3.0 కింద ప్రతి రాష్ట్రం తనదైన ‘ల్యాండ్ స్టాక్’అభివృద్ధి చేసుకోవచ్చు. భూమికి సంబంధించి డేటాసెట్స్, వ్యవస్థలను ఏపీఐల ద్వారా ఒక దగ్గరకు చేర్చడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. రాష్ట్రాల ల్యాండ్ స్టాక్లు కాస్తా జాతీయ ల్యాండ్ స్టాక్కు ఆధారంగా మారుతుంది. రాష్ట్రాలు, కేంద్రాలు రెండింటికీ ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో సమాచారం తాలూకూ యాజమాన్యం, ని యంత్రణ మాత్రం సంబంధిత అధికారులకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి భూమికి 14 అంకెల బీహెచ్యూ–ఆధార్ నంబర్ ఒకదాన్ని కేటాయిస్తారు. ఇంకోలా చెప్పాలంటే మీ భూమిని గుర్తించేందుకు ప్రత్యేకమైన అంకె ఒకటి అందుబాటులోకి వస్తుందన్నమాట. దీని ద్వారా భూమి యజమాని, హ ద్దులను సులువుగా తెలుసుకోవచ్చు. దేశంలో అత్యధికంగా రిజి్రస్టేషన్లు జరిగే 75 రిజి్రస్టార్ కార్యాలయాలను ‘‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు’’గా ఆధునికీకరించనున్నారు. అచ్చం పాస్పోర్టు సేవా కేంద్రాల మాదిరిగా అన్నమాట. దీంతోపాటే ప్రభుత్వం పాత భూమి రికార్డులను స్కానింగ్ చేయడంపై దృష్టి కేంద్రీకరించనుంది. రిజి్రస్టేషన్ల సమాచారం, రెవెన్యూ కోర్టుల కంప్యూటరీకరణ ద్వారా దీన్ని సాధ్యం చేయనున్నారు. -
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రాధాన్యం
ముంబై: ఎదుగుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సంస్థల్లో మరింత ఎక్కువ ప్రాతినిథ్యం కల్పింంచాలని బ్రిక్స్ దేశాల ఆర్థిక శాఖ మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు పిలుపునిచ్చారు. టారిఫ్ల విధింపు, వాణిజ్య పోకడలు ఏకపక్షంగా సాగుతూండటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సహకారం మరింత దృఢతరం కావాలని ఆకాంక్షించారు. ముంబైలో శుక్రవారం ముగిసిన బ్రిక్స్ దేశాల ఆర్థిక శాఖ మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఈ మేరకు ఉమ్మడి తీర్మానం చేసింది. వ్యాపారం, పెట్టుబడులకు స్థానిక కరెన్సీలను వాడేందుకు సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు మద్దతు తెలపగా... చెల్లింపులకు బ్రిక్స్ దేశాల మధ్య ప్రత్యేక వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్యం ముక్కలైపోతూండటం, రక్షణాత్మక విధానాలు, ఆర్థిక, ద్రవ్యోల్బణ సంబంధిత ఒత్తిళ్ల ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఎక్కువవుతోందని బ్రిక్స్ దేశాలు ఉమ్మడి తీర్మానంలో గుర్తించాయి. నిర్దిష్టంగా ఏ దేశం పేరుప్రస్తావించకున్నా ఈ ముప్పు ప్రభావం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ఉందని స్పష్టం చేశాయి. డబ్ల్యూటీవో కేంద్రంగా పారదర్శక, అందరినీ కలుపుకుని పోయే, వివక్షరహిత వ్యవస్థకు బ్రిక్స్ మద్దతు తెలుపుతుందని ప్రకటించింది. అమెరికా వాణిజ్య విధానాల వల్ల ప్రపంచ వాణిజ్యం అస్తవ్యస్తమైన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. దీంతోపాటు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు అధిపతుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పింంచేలా ఉండాలని కూడా బ్రిక్స్ పిలుపునిచ్చింది. స్థానిక కరెన్సీల్లో రుణాలు, ప్రాజెక్టులకు సన్నద్ధత నిధులు, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే హామీ పథకాలను పెంచాలని తీర్మానించింది. -
అడ్డంకులు అధిగమించి ముందడుగు
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యం అంతరాయాలు లేకుండా కొనసాగాలంటే నౌకాయాన స్వేచ్ఛ, సురక్షిత సముద్ర మార్గాలు, నావికుల భద్రత అత్యవసరమని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. పెరుగుతున్న ఆర్థిక బలాన్ని భారీ పెట్టుబడులుగా, నూతన వ్యాపార సంబంధాలుగా మార్చుకోవాలని బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. 10 ప్రధాన వాణిజ్య అవరోధాలను గుర్తించి తొలగించాలని చెప్పారు. ప్రతి సంవత్సరం 100 బ్రిక్స్ స్టార్టప్లను ఇతర సభ్య దేశాల మార్కెట్లలోకి విస్తరించాలని, అలాగే ఏటా 1,000 కొత్త వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై మన పురోగతిని ప్రతి ఏటా సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన అడ్డంకులు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి అడ్డంకులను అధిగమిస్తూ మన ఆర్థిక శక్తిని నూతన వ్యాపార అవకాశాలుగా మార్చుకోవాలని స్పష్టంచేశారు. నౌకాయాన స్వేచ్ఛకు, నావికుల భద్రతకు భారత్ మద్దతిస్తోందని తెలిపారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ జీడీపీలో 40 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు వృద్ధి చెందగా, బ్రిక్స్ దేశాల ఉమ్మడి జీడీపీ మాత్రం నాలుగున్నర రెట్లు పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ప్రపంచ వ్యాపారాలకు భారతదేశం చేసే ప్రతిపాదనలో మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక సాంకేతికతలను ప్రధానాంశంగా మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాల వేగవంతమైన విస్తరణతోపాటు నౌకా నిర్మాణం, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ రంగాల్లో నూతన సామర్థ్యాలను ప్రస్తావించారు. ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ వరల్డ్’అన్నారు. ప్రపంచ మార్కెట్లకు భారత్ ఒక తయారీ కేంద్రంగా, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత లోతైన సహకారం కోసం భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. బ్రిక్స్ దేశాలు తమ సొంత మార్కెట్లకు అనువైన డిజిటల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారతదేశ అనుభవాన్ని వాడుకోవచ్చని అన్నారు. ఇండియాలో 2 లక్షలకు పైగా స్టార్టప్లు, 120కి పైగా యూనికార్న్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సహాయపడాలని కోరారు. వాణిజ్య అనుసంధానం అనేది మరో ప్రధాన అంశమని చెప్పారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, వ్యాపార అవకాశాలను విస్తరించడంపై బ్రిక్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి చెప్పారు. -
ఐరాస చీఫ్ గుటేరస్తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, నౌకాయాన స్వేచ్ఛ, సుస్థిరాభివృద్ధి, మానవ కేంద్రీకృత కృత్రిమ మేధ(ఏఐ), ప్రపంచ ఆహార భద్రత వంటి పలు అంశాలపై చర్చించారు. బహుళ ధ్రువత్వం ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారు. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ నాలుగోసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆంటోనియా గుటేరస్ అభినందనలు తెలియజేశారు. గుటేరస్తో అద్భుతమైన సమావేశం జరిగిందని మోదీ ఎక్స్లో పోస్టుచేశారు. భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ కార్యకలాపాలు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలపై చర్చించానని పేర్కొన్నారు. -
దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోండి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభాన్ని చర్చలు, దౌత్య మార్గాల్లో ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్కు సూచించారు. శుక్రవారం ఇరువురు నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, ఇరాన్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొడానికి పెజెష్కియాన్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే ఈ భేటీ జరగింది. పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపైమోదీ, పెజెష్కియాన్ చర్చించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న భారతదేశ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడం, నౌకాయాన స్వేచ్ఛ, వాణిజ్య కార్యకలాపాలు, నావికుల భద్రత, సంక్షేమాన్ని పరిరక్షించడం కోసం కృషి అవసరమని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్ప టికీ బ్రిక్స్ సమావేశాల్లో ఇరాన్ భాగస్వామ్యం వహిస్తున్నందుకు పెజెష్కియాన్కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఘర్షణను నివారించడానికి సహకరించాలని మోదీని ఇరాన్ అధ్యక్షుడు కోరారు. -
బ్రిక్స్ సదస్సుకు దేశాధినేతలు, విశిష్ట అతిథులు
న్యూఢిల్లీ: బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సుకు కూటమి దేశాల అధినేతలతోపాటు పలువురు విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. శనివారం నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఈజిప్ట్ అధినేత అబ్దెల్ ఫతాహ్ ఎల్–సిసీ, ఇండోనేíసియా ప్రెసిడెంట్ ప్రబొవో సుబియాంతో, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేíసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, సౌదీ అరేబియా యువరాజు ఫైజల్ బిన్ ఫర్హాన్ అలీ సౌద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బ్రెజిల్ విదేశీ వ్యవహారాల మంత్రి మౌరో వియేరా పాల్గొనబోతున్నారు. అలాగే ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, నైజీరియా ఉపాధ్యక్షుడు సెనేటర్ కాషిమ్ షెట్టిమా, క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పారిల్లా, బెలారస్ విదేశాంగ మంత్రి మాక్సిమ్ రిజెన్కోవ్, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్ మరియు కజకిస్తాన్ అధ్యక్షుడు కాస్సిమ్–జోమార్ట్ టోకాయెవ్ సైతం హాజరు కాబోతున్నారు. బ్రిక్స్ కూటమిలో గత ఏడాది బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేíసియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా మారాయి. -
మా మనసులు గాయపడ్డాయి
సాక్షి, న్యూఢిల్లీ: ‘నడిరోడ్డుపై.. పట్టపగలు అందరూ చూస్తుండగా మహిళా ప్రజాప్రతినిధుల చీరలను లాగారు. గొంతు నొక్కి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తెలంగాణలో పోలీసులు మాపై అత్యంత క్రూరత్వంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై పోరాడతామని మమ్మల్ని ప్రజలు చట్టసభలకు పంపారు. కానీ, ఈరోజు మాకు జరిగిన అన్యాయంపై మేం రోడ్డెక్కి న్యాయం కోసం, సమస్య పరిష్కారానికి పోరాడాల్సి వస్తుంది. ఆఖరకు ఢిల్లీ వరకూ వచ్చి మీకు మా బాధను చెప్పుకోవాల్సి వచి్చంది’అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి జాతీయ మహిళా కమిషన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే.. ప్రజాప్రజానిధులను గాయపరుస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించి మా సమస్యను పరిష్కరించాలని, తెలంగాణలో పోలీసుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు రెండు కమిషన్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, పోలీసులు వ్యవహరించిన తీరుపై శుక్రవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిశోర్ రహత్కర్, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్లకు రాజ్యసభ ఫ్లోర్లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ దామోదర్, మాజీమంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం నుంచి బీఎస్ ప్రసాద్, సోమా భరత్, లలితారెడ్డి తదితరులతో కలిసి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 100 గంటలు దాటినా ఎఫ్ఐఆర్ లేదు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి సభకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. నల్ల దుస్తులు ధరించడాన్ని కారణంగా చూపారని, అయితే తమ దుస్తులపై ఎలాంటి అభ్యంతరకరమైన రాతలు లేవని స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పురుష పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందన్నారు. చీర, జుట్టు పట్టుకొని లాగారని, ఇతర ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కారన్నారు. ‘మా మనసులు గాయపడ్డాయి. మహిళలుగా మాకు అవమానం జరిగింది. శాసనసభ్యులుగా మా హక్కులకు భంగం కలిగింది’అని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి జరిగి 100 గంటలు దాటినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, తిరిగి తమపైనే కేసులు పెట్టడం రాజకీయ నాటకమని విమర్శించారు. ‘మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేయించి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం బాధాకరం. మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా చీరలు లాగారు’అంటూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. మహిళా ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మగ పోలీసుల్ని విధుల్లో పెట్టడం, మగ ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మహిళా పోలీసులను పెట్టి ప్రభుత్వం రాజకీయం చేసిందని మండిపడ్డారు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు దాడికి గల వీడియోలు, ఫొటోలు, న్యూస్ క్లిప్పింగులన్నీ మహిళా కమిషన్, ఎన్హెచ్ఆర్సీకి మహిళా ప్రతినిధి బృందం అందచేసింది. వాటిని పరిశీలించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రహత్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు రాజకీయాలతో సంబంధం లేదు. అసెంబ్లీకి వెళుతున్న మహిళా ప్రజాప్రతినిధులను మగ పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? చీర లాగడం, గొంతు నులమడం అన్నీ పరిశీలించాం. ఇది మేం అంత ఈజీగా వదిలిపెట్టే ఇష్యూ కాదని మాకు అర్థమైంది. తక్షణం డీజీపీ నుంచి వివరణ కోరతాం.. ఆ తర్వాత మేం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం’అంటూ ఆమె భరోసా ఇచ్చారు. ‘ఈ తరహా ఘటనలు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో కమిషన్ ఏం చేస్తుంది? ఏం చేయాలి అనేది స్పష్టంగా ఉంటుంది. కచి్చతంగా చర్యలు అయితే తీసుకుంటాం’అంటూ ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్పర్సన్ విజయభారతి సయానీ భరోసా ఇచ్చారు. -
బ్రిక్స్ అతిథులకు ‘దేశీ’ విందు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే దేశాధినేతలకు, విశిష్ట అతిథులకు భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డించేందుకు కేంద్ర ప్రభుత్వం, నగరంలోని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల అభిరుచులకు అనుగుణంగా ఆహార మెనూను రూపొందించాయి. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ దేశీ, విదేశీ రుచుల కలయికతో వంటకాలను సిద్ధం చేస్తున్నాయి. సిరిధాన్యాలతో వంటకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్న సిరిధాన్యాలతో (బాజ్రా, జొన్న, రాగి) కూడిన వంటకాలకు మెనూలో ప్రత్యేక స్థానం కల్పించారు. రాగి దోశ, బాజ్రా ఉప్మా, మిల్లెట్ పొంగల్తో పాటు సీజనల్ పండ్లు, కొబ్బరి నీళ్లు, తాజా మజ్జిగను అల్పాహారంగా అందించనున్నారు. మధ్యాహ్న భోజనంలో గుజరాతీ, రాజస్తానీ, దక్షిణ భారతీయ థాలీలను ఏర్పాటు చేశారు. కశ్మీరీ పులావ్, దక్కనీ తడ్కా, హైదరాబాదీ వెజ్, నాన్వెజ్ బిర్యానీ, సౌత్ ఇండియన్ సాంబార్ ఈ మెనూలో ఉన్నాయి. విదేశీ ప్రతినిధుల డైట్ను దృష్టిలో ఉంచుకుని నూనె, మసాలాలు లేని కస్టమైజ్డ్ కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ కోసం లైవ్ కుకింగ్ కౌంటర్లు కూడా అందుబాటులో ఉంచారు. జైశంకర్ ఆధ్వర్యంలో ‘దేశ్ కీ థాలీ’ బ్రిక్స్ సదస్సు జరుగునన్న ‘భారత్ మండపం’లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విదేశీ ప్రతినిధులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాలకు చెందిన నలభీములు ‘దేశ్ కీ థాలీ’ని సిద్ధం చేయబోతున్నారు. దేశాధినేతల కోసం లక్నోవీ కబాబ్, తందూరీ వంటకాలు, స్లో కుక్డ్ గ్రేవీ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తారు. వారి మతపరమైన ప్రాధాన్యతలు, వ్యక్తిగత అభిరుచులను దృష్టిలో పెట్టుకొని శాకాహార, మాంసాహార వంటకాల తయారీ కోసం వేర్వేరు సెక్షన్లు, ప్రత్యేక కిచెన్లను ఏర్పాటు చేశారు. ల్యాబ్లో ఆహార పదార్థాల పరీక్షలు బ్రిక్స్ సదస్సులో అతిథులకు వడ్డించే ఆహారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై భారత ఆహార భద్రత, నాణ్యాతా ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) పకడ్బందీ చర్యలు చేపట్టింది. హోటళ్లలో వంటలకు వాడే ముడిసరుకులు, సుగంధ ద్రవ్యాలు, బేకరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ల్యాబ్లో పరీక్షిస్తున్నారు. అతిథులకు వడ్డించే ముందు ఆహార నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, మైక్రోబయాలజిస్టులను నియమించారు. ఐదు నక్షత్రాల హోటళ్లలో బస సదస్సుకు హాజరవుతున్న అతిథుల బస కోసం ఢిల్లీలోని ల్యుటియెన్స్లో ఉన్న తాజ్మహల్ హోటల్, తాజ్ ప్యాలెస్, ఐటీసీ మౌర్య, ద లీలా ప్యాలెస్, ద ఒబెరాయ్, షాంగ్రిలా, ద లలిత్ తదితర ఫైవ్ స్టార్ హోటళ్లలో వీవీఐపీ బ్లాక్లను కేటాయించారు. రష్యా, చైనా, యూఏఈ, దక్షిణాఫ్రికా తదితర దేశాల ప్రభుత్వ, వ్యాపార ప్రతినిధులకు ద లలిత్ హోటల్లో బస కల్పించారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్్ట, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల అగ్రనేతలు, దౌత్యవేత్తలకు ఐటీసీ మౌర్య, తాజ్మహల్, ద లీలా ప్యాలెస్ హోటళ్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
ఆందోళనకర పోషకాలపై మరింత స్పష్టత
న్యూఢిల్లీ: ఆహార పొట్లాల్లో (ప్యాకేజ్డ్ ఫుడ్) పోషకాల వివరాలతో కూడిన లేబుళ్లకు సంబంధించి మరింత స్పష్టతనివ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ను ఆదేశించింది. దశలవారీగా ఆహార పొట్లాలపై లేబుళ్లు అతికించడాన్ని అమలు చేస్తామన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ కొవ్వు, చక్కెర, ఉప్పు వంటి ‘‘ఆందోళనకరమైన పోషకాల’గురించి మరింత వివరణతో రావాలని జస్టిస్ జే.బి.పార్డీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన బెంచ్ ఆదేశించింది. దేశంలో పిల్లలు అనారోగ్య ఆహారపు అలవాట్లకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన బెంచ్.. పోషకాలపై వారికి అవగాహన పెంచేందుకు పాఠశాలల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘బోధనాంశాలు, వర్క్షాపులు, కార్యక్రమాల ద్వారా ఆహారపు పొట్లాలపైని సమాచారాన్ని అర్థం చేసుకునేలా చేసేందుకు పాఠశాలలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాయో కేంద్రం నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఆహారపు పొట్లాలపైని లేబుల్లు, పోషకాల సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోషకాలపై అవగాహనకు సంబంధించిన అంశాలు రెండింటిపై కేంద్రం స్పందించాలి’’అని బెంచ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28న జరగనుంది. ‘త్రీఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ’అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆహారపు పొట్లాలపై పోషకాలకు సంబంధించిన లేబుళ్లను తప్పనిసరిగా అతికించేలా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించాలని ఈ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్లో కోరింది. అయితే అసంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారపు పొట్లాల ముందుభాగంగా స్పష్టంగా కనిపించేలా లేబుళ్లను ఏర్పాటు చేయిస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ గతంలోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అంశం అమలుకు సంబంధించి గత నెలలో ఒక అఫిడవిట్ దాఖలు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబుళ్లను అతికించే ప్రక్రియను రెండు దశల్లో చేపడుతున్నట్లు తెలిపింది. అయితే ఈ రెండు దశలు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలపాలని, వినియోగదారులు ఆమోదించేందుకు, కంపెనీలకు తగిన సమయం ఇచ్చేందుకు వేచి చూడటం సరికాదని స్పష్టం చేసింది. మరో పది రోజుల్లోగా ఏ దశను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తెలపాలని ఆదేశించింది. -
2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా సంఘర్షణను ముగించడానికి చేపట్టే ఏ శాంతి ప్రయత్నానికైనా మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నల్ల సముద్రంలోని భారతీయ నావికుల తగిన భద్రతకు కల్పింంచాలని రష్యా అధినేత పుతిన్కు విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అస్థిరత నేపథ్యంలో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం భారత్ మండపంలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. 45 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. భారత్, రష్యా సంబంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను సైతం సమీక్షించారు. ప్రస్తుతం 65 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఈ సందర్భంగా భారత్, రష్యాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్–రష్యా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో వేగం పెంచాలని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించింది. రెండు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర చర్చల కోసం రష్యాలో పర్యటించాలన్న పుతిన్ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారని తెలియజేసింది. చర్చలు, దౌత్యమే సరైన మార్గం రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, పౌర అణు శక్తి, ఎరువుల సరఫరా, ప్రజల మధ్య పరస్పర సంబంధాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలో సముద్ర వాణిజ్యం, భారతీయ నావికుల భద్రత సహా ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్య బదిలీ సహా ప్రజల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణ త్వరగా ముగిసిపోవాలని మోదీ ఆకాంక్షించినట్లు సమాచారం. సంఘర్షణల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని పుతిన్ దృష్టికి మరోసారి తీసుకెళ్లినట్లు తెలిసింది. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా సహకరిస్తుందని మోదీ అన్నారు. రష్యా మార్కెట్లో అవకాశాలు ఇప్పటికే బలంగా ఉన్న తమ రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడంపైనా ఇరుపక్షాలు లోతుగా చర్చించాయి. ఇంధన రంగంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకరించాయి. అంతేకాకుండా పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడం, రైలు, సొరంగ మార్గాల నిర్మాణాల్లో కలిసి పనిచేయడం, ఉక్కు సప్లై చైన్లను అభివృద్ధి చేయడం, భారతీయ ఎగుమతిదారులకు రష్యా మార్కెట్లో అవకాశాలను పెంచడం వంటి అంశాలు కూడా ఈ చర్చల్లో చోటుచేసుకున్నాయి. మోదీ, పుతిన్ కలుసుకోవడం 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత్ మండపంలో బిజినెస్ ఫోరమ్ వేదిక వద్దకు చేరుకోవడానికి మోదీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. అంతకుముందు వారిద్దరూ భారత్ మండపంలో ‘ఇన్నోప్రోమ్ ఇండియా’ప్రదర్శనను సందర్శించారు. అందులో పాల్గొన్న వారితో సంభాషించారు. పరస్పర సహకారంపై చర్చించా: మోదీ మౌలిక సదుపాయాలు, ఇంధనం, సాంకేతికత, రక్షణ, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పర సహకారంపై పుతిన్తో చర్చించానని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘ఆర్థిక సహకార కార్యక్రమం–2030’అమలు సహా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తాము చర్చించినట్లు పేర్కొన్నారు. పుతిన్కు ‘తిరుక్కురళ్’బహూకరణ ప్రఖ్యాత తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన ప్రాచీన తమిళ కావ్య సంకలనం ‘తిరుక్కురళ్’రష్యన్ అనువాద గ్రంథాన్ని ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్కు బహూకరించారు. అనేక అంశాలపై జ్ఞానోపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. భాషలు, సరిహద్దులకు అతీతంగా శాశ్వత జ్ఞానాన్ని అందించే తిరుక్కురళ్ రష్యన్ అనువాదాన్ని పుతిన్కు అందజేశానంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పుతిన్తో ఆప్యాయంగా కరచాలనం చేసిన దృశ్యాలతో కూడిన ఒక చిన్న వీడియో క్లిప్ను కూడా షేర్చేశారు. -
సివిక్ యాక్టివిస్ట్ సంతోష్ పండిట్ అరెస్ట్ వెనుక అసలు కథ ఇదే!
పుణె: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ప్రముఖ సివిక్ యాక్టివిస్ట్ సంతోష్ పండిట్ అరెస్ట్ ఉదంతం మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశమైంది. మహరాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్, మహిళా కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో పుణె పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 3 తెల్లవారు జామున సుమారు ఒంటి గంట ప్రాంతంలో పుణె పోలీసులు కొత్రుడ్లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత సంతోష్ పండిట్ను కోర్టులో హాజరుపరచగా, విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పుణె నగరంలో రోడ్ల దుస్థితి, ప్రమాదకర గుంతలు, వీఐపీ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ సంతోష్ పండిట్కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. రాజకీయ నాయకులను, అధికారులను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వీడియోలు వైరల్ అయిన వేళ, పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఆయనను అరెస్ట్ చేయడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, చర్చలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతున్న ఆయన గొంతును అణచివేసేందుకే ఈ అరెస్ట్ జరిగిందంటూ ఆయన మద్దతుదారులు ఆరోపిస్తుండగా.. చట్ట వ్యతిరేక, దూషణపూరిత వ్యాఖ్యలు చేయడం వల్లే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.Pune civic activist Santosh Pandit was reportedly detained at midnight after complaints over videos criticizing potholes, civic issues, VIP culture, and politicians.FT- Muskan Lodhi#TheCSRJournal #PuneNews #CivicActivism #FreeSpeech pic.twitter.com/uWVDfSNeQS— The CSR Journal (@thecsrjournal) September 7, 2026 -
అసలు బ్రిక్స్లో ఏం చర్చిస్తారు?
భారత రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ ఏడాది భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. అంతేకాక సంస్థ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలు దేశాధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొననున్నారు.ప్రధాన చర్చనీయాంశాలుగ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలపై నేతలు చర్చించనున్నారు. ప్రపంచ పాలనా వ్యవస్థలు ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా మార్పులు తేవాలన్నది ప్రధాన డిమాండ్గా ఉంది. ఇందులో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించే అంశం కీలకంగా మారనుంది.వాణిజ్యం, ఆర్థిక సహకారం: సభ్యదేశాలు వాణిజ్య మార్గాలను బలోపేతం చేసేందుకు 2026-2030 బ్రిక్స్ గ్లోబల్ వేల్యూ చైన్ యాక్షన్ ప్లాన్ను ఆమోదించాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యంత్రాంగం, సహకార పోర్టల్ ఏర్పాటుపై చర్చలు జరగనున్నాయి.సాంకేతికత, ఇన్నోవేషన్: స్టార్టప్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటుతో పాటు ఏఐ గవర్నెన్స్పై కూడా నేతలు దృష్టి సారించనున్నారు. భవిష్యత్ సాంకేతిక పోటీలో సభ్యదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగే వ్యూహాలపై చర్చిస్తారు.ఆహార, ఇంధన భద్రత: ఆహారం, ఇంధన భద్రత, ఆరోగ్యం, వ్యవసాయం రంగాల్లో సహకారంపై నేతలు లోతైన చర్చలు జరపనున్నారు. పేదరిక నిర్మూలన, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంయుక్త కార్యాచరణపై దృష్టి పెడుతారు.ద్వైపాక్షిక భేటీలు, ప్రపంచ అంశాలు: భారత్-చైనా సహా వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు. అలాగే వాణిజ్యం, అభివృద్ధి, సంస్థాగత సంస్కరణలపై సభ్యదేశాల మధ్య సన్నిహిత సహకారంపైనా చర్చించనున్నారు.ఇదీ చదవండి: కొత్త బిజినెస్లోకి ఫ్లిప్కార్ట్! -
ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదే: మోదీ
ఢిల్లీ: ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ఆయన ప్రసంగిస్తూ.. బ్రిక్స్ 4 దేశాలతో మొదలై 21 దేశాలకు చేరిందన్నారు. ప్రపంచ జనాభాలో 50 శాతం బ్రిక్స్ దేశాలదే. బ్రిక్స్ కూటమి ప్రపంచంలో సగం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కారం చూపిస్తుందన్నారు.బ్రిక్స్ జీడీపీ 4.5 శాతం పెరిగింది. సుస్థిరాభివృద్ధి, సహకారం, ఇన్నోవేషన్స్కి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. రోడ్డు, రైళ్లు, ఎయిర్పోర్టుల వంటి మౌలిక సదుపాయాల్లో భారత్ వేగంగా విస్తరిస్తోందని మోదీ అన్నారు. -
5జీ వేగం తగ్గిందని.. మొబైల్ టవర్కు కట్టేశారు..!
మనిషిని చెట్టు కట్టేయడం.. టవర్లకు కట్టేయడం అనేది ఎవరైనా తప్పు చేసిన సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ గ్రామ స్థాయిలో తారస పడుతూ ఉంటుంది. ఊరంతా ఒక్కటై తప్పు చేసిన మనిషిని స్తంభాలకో, చెట్లకో, టవర్లకో కట్టేస్తూ ఉంటారు. ఇది అనాగరిక సంస్కృతే అయినా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. కానీ ఇక్కడ చిత్రమేమింటంటే ఓ వ్యక్తి ఒక సంస్థలో టెక్నీషియన్గా పని చేస్తున్నందుకు ఈ అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి అసలు కారణం 5జీ నెట్వర్క్.. ఇది ప్రస్తుతం అత్యంత వేగవంతమైన నెట్వర్క్. ఇది మనకు తెలిసిన విషయమే. మొబైల్ చూడటంలో కానీ వాడటంలో కానీ వేగానికి అలవాటు పడిన ప్రస్తుత సమాజంలో అత్యధిక శాతం మంది.. 5జీ నెట్వర్క్ పట్ల ఆకర్షితులయ్యారనేది కాదనలేని సత్యం. మరి ఆ వేగంలో ఏమైనా మార్పులు వచ్చి ఆ నెట్వర్క్ స్పీడ్ తగ్గితే.. వారు చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతారనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఇక్కడ సాటి మనిషి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నామా.. అనే సంగతిని కూడా మర్చిపోయి మరీ రెచ్చిపోయారు.తమ ఊరిలో 5జీ నెట్వర్క్ స్పీడ్ తగ్గిందనే కారణంతో సదరు సంస్థకు సంబంధించిన టెక్నీషియన్ను మొబైల్ టవర్కు కట్టేసిన వైనం వెలుగు చూసింది. సాధారణంగానే ఆ టెక్నీషియన్ ఊరిలోకి వచ్చిన సందర్భంలో గ్రామస్తులు తిరగబడ్డారు. తాము 5జీ నెట్వర్క్ను వాడుతుంటే అది ఎందుకు సరిగా పనిచేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇన్స్టా రీల్స్ సరిగా స్ట్రీమింగ్ కావడం లేదని ఆరోపిస్తూ సదరు టెక్నీషియన్ను మొబైల్ టవర్కు కట్టేసి ఎవరొస్తారో రండి అంటూ కూడా సవాల్ విసిరారు. దీనిపై ఆ సంస్థకు చెందిన అధికారులు వచ్చి 5జీ నెట్వర్క్ స్పీడ్ను పెంచే వరకూ టెక్నీషియన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఏమైతే కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే ఉన్నతాధికారులు వచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఉత్తర్ ప్రదేశ్లోని ఫతేపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. Frustrated that Instagram Reels wouldn’t stream properly due to poor 5G speeds, angry villagers in UP's Fatehpur tied a Jio technician to the mobile tower and demanded that senior officials come to the site immediately to fix the connectivity problems. pic.twitter.com/eVE0kFDjfA— Piyush Rai (@Benarasiyaa) September 11, 2026 ఇదీ చదవండి:కాబోయే భార్యను ఇంప్రెస్ చేద్దామని.. -
‘ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపండి’.. పుతిన్తో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ యుద్ధాన్ని తక్షణమే ఆపి, శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ తన వంతు సహాయసహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా ఇరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యన్ భాషలోకి అనువదించిన ప్రముఖ తమిళ ప్రాచీన కావ్యమైన ‘తిరుక్కురళ్’ ప్రతిని పుతిన్కు ప్రత్యేక బహుమతిగా అందజేశారు. దాదాపు రెండు వేల ఏళ్ల నాటి ఈ గ్రంథంలోని మానవతా విలువలను మోదీ ఈ సందర్భంగా పుతిన్కు వివరించారు.రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష రంగాల బలోపేతంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.రష్యాలో జరగబోయే 24వ ఇండో-రష్యా వార్షిక శిఖరాగ్ర సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ఆహ్వానించగా.. ఆయన ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన తుది తేదీలను దౌత్య అధికారులు త్వరలోనే ఖరారు చేయనున్నారు.👉ఇదీ చదవండి: ప్రధాని మోదీతో పుతిన్ భేటీ -
కళ్లల్లో కారం కొట్టి ఎస్బీఐలో భారీ చోరీ... వీడియో వైరల్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో చోరీ యత్నం కలకలం రేపింది. సినీ ఫక్కీలో బ్యాంక్ కస్టమర్లా ఎంట్రీ ఇచ్చిన ఒక నిరుద్యోగి క్యాష్ కౌంటర్ వద్ద గలాటా సృష్టించాడు. బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం చల్లి, రూ. 4 లక్షల నగదుతో పరారు కావడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పోలీసుల సమాచారం ప్రకారం నిందితుడిని 28 ఏళ్ల సూరజ్ భోజ్రాజ్ బోర్కర్గా గుర్తించారు. ఇతను B.Sc పూర్తి చేసి నిరుద్యోగిగా ఉన్నాడు. సాధారణ వినియోగ దారుడిలా నటిస్తూ బ్యాంక్లోకి ప్రవేశించి, క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లడంతో అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో రూ. 4 లక్షల నగదుని తస్కరించి అక్కడినుంచి ఉడాయించాడు. కానీ బ్యాంక్ సిబ్బంది, అక్కడే ఉన్న కొందరు పోలీసులు నిందితుడిని వెంటాడారు. బ్యాంక్కు సుమారు కిలోమీటర్ దూరంలో, ఘటన జరిగిన 30 నిమిషాల్లోనే అతడిని పట్టుకున్నారు.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్ महाराष्ट्र,नागपुर इनसे मिलिए,इनका नाम है सूरज भगवा कपड़ा पहन कर उसका भी इज़्ज़त डूबा दिए,दरअसल इसने SBI बैंक में चोरी की प्लानिंग की और लालमिर्च का पाउडर कर्मचारियों के आँख में झोंक दिया,कम से कम 4.5 लाख लेकर फरार हुआ था लेकिन कुछ ही देर में धर लिया गया pic.twitter.com/fXzOd3DUJ4— Anvi Yadav (@Yadavanviroyal) September 11, 2026 పోలీసులు అతని వద్ద నుండి దొంగిలించిన రూ. 4 లక్షల పూర్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను ఉద్యోగం లేకపోవడం వల్లే ఈ దోపిడీకి ఒడిగట్టాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేరానికి గల ఖచ్చితమైన కారణాలు, ఇందులో ఇంకెవరి పాత్ర ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఇదీ చదవండి: బసంతి పులావ్-చేపల ప్రసాదాన్ని స్వీకరించిన బెంగాల్ సీఎం -
బసంతి పులావ్-చేపల ప్రసాదాన్ని స్వీకరించిన బెంగాల్ సీఎం
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి(Suvendu Adhikari) అత్యంత పవిత్రంగా భావించే కౌశికి అమావాస్య (Kaushiki Amavasya) సందర్భంగా కోల్కతా కాళీఘాట్లోని పవిత్ర కాళీమాత అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శతాబ్దాల చరిత్ర కలిగిన కాళీఘాట్ ఆలయ సంప్రదాయం ప్రకారం చేపల ప్రసాదాన్ని కళ్ల కద్దుకుని మరీ స్వీకరించారు. దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారం తినడాన్ని ఒక హిందూ పూజారి ఖండించిన నేపథ్యంలో సీఎం మాంసాహార ప్రసాదాన్ని స్వీకరించడం ఆసక్తికరంగా మారింది.కాళీఘాట్ ఆలయంలో నేలపై కూర్చుని, కాళీఘాట్ భోగ్ ప్రసాదంలో ప్రత్యేకమైన పెద్ద చేప తల (Fish head), వేయించిన చేపలు, బసంతి పులావ్ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.Putting all controversy at rest. CM Suvendu Adhikari is currently eating Kalighat Kali Maa's Fish Bhog. Today is the final Amavasya and it's a special day for us pic.twitter.com/rLIqwcWg3u— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) September 10, 2026 #WATCH पश्चिम बंगाल के मुख्यमंत्री सुवेंदु अधिकारी ने आज शाम कालीघाट मंदिर में पूजा-अर्चना की।(वीडियो सोर्स: सुवेंदु अधिकारी/फेसबुक) pic.twitter.com/Y3L7Cvkplv— ANI_HindiNews (@AHindinews) September 10, 2026 మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల శాఖాహార అలవాట్లను మాంసాహారం ఎక్కువగా తినే బెంగాల్పై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలను బీజేపీ తరచూ ఎదుర్కొంటోంది. అయితే సువేందు అధికారి కాళీఘాట్ వీడియోను ప్రస్తావిస్తూ బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. "ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలి. కాళీఘాట్లో సీఎం సువేందు అధికారి మా కాళీ సంప్రదాయ చేపల భోగ్ను స్వీకరించడం ద్వారా బెంగాల్ సంస్కృతి, విశ్వాసాలు, జీవన విధానాన్ని గౌరవించారు. బెంగాల్ సంప్రదాయాలు, ప్రయోజనాలకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.కాగా కాళీఘాట్ దేవాలయంలో అధిష్టాన దేవత అయిన కాళికాదేవికి చేపలు, బలి ఇచ్చిన మేక మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.నాన్-వెజ్ వివాదం ఏమిటంటే:బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) ఇటీవల చేసిన శాకాహార వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. దుర్గాపూజ సమయంలో మాంసాహారం తినకూడదని బెంగాలీ హిందువులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దుర్గాపూజ సమయంలో మాంసాహారం తినే బెంగాలీ హిందువులను "పాషాండులు" అని వ్యాఖ్యానించడమేకాదు రాష్ట్రవ్యాప్తంగా మాంస విక్రయాలు, మద్యం దుకాణాలను మూసివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. భారత్ మండపంలో ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ భేటీ అయ్యారు. భారత్, రష్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిపారు. కీలక రక్షణ ఒప్పందాలు, వ్యాపారం, వాణిజ్యం, భద్రత, ఎల్ఎన్జీ దిగుమతి, అధునాతన యుద్ధ విమానాల తయారీ సాంకేతికత బదిలీ తదితర అంశాలపై చర్చించారు. రెండు నెలల్లోనే రెండోసారి ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్కు మోదీ కానుకద్వైపాక్షిక భేటీలో పుతిన్కు రష్యన్ భాషలో అనువదించిన ఓ పుస్తకాన్ని ప్రధాని మోదీ కానుకగా అందించారు. తమిళ కవి తిరువళ్లువరు రచించిన ‘తిరుక్కురళ్’ పుస్తకాన్ని అందజేశారు. పుతిన్ మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. కాగా, బ్రిక్స్ సదస్సుకు షీ జిన్పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ నిర్ధారించింది.జిన్పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్లో భారత్లో పర్యటించారు. బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్ను సైతం షేర్ చేశారు.ఇదీ చదవండి:బ్రిక్స్తో మనకు లాభాలున్నాయండోయ్..! -
భార్య, పెళ్లికెదిగిన ముగ్గురు కుమార్తెల హత్య, స్థానికంగా కలకలం
రాజస్థాన్లోని జైపూర్ పరిధిలోని గోవింద్ పురాలో భార్యాబిడ్డల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అక్కడి నుంచి ఉడాయించాడో వ్యక్తి. ఈ అమానుషం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ దాడిలో 40 ఏళ్ల గీతా ఝా, ఆమె ముగ్గురు కుమార్తెలు నందిని, గిరీష, రాధిక (17-23 ఏళ్లు) మృతి చెందారు. మృతురాలి భర్త, పిల్లల తండ్రి రాహుల్ ఝాగా నిందితుడిగా గుర్తించారు. కుటుంబంలో చెలరేగిన తీవ్రమైన వివాదాలే ఈ దారుణ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యల అనంతరం ఏమీ ఏరగనట్టుగా పాలవాడి దగ్గర పాలుతీసుకొని, తండ్రికి టీ పెట్టి వచ్చి, ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. రాహుల్ ఝా షేర్ ట్రేడింగ్ చేసేవాడు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే ఆయన గుజరాత్ నుండి జైపూర్కు తిరిగి వచ్చారు. భార్య గీతా ఝా తమ ఇంటి మొదటి అంతస్తులో ఒక బొటిక్ను నడిపేవారు. వారి పెద్ద కుమార్తె నందిని చదువుకుంటూనే ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు.ఈ హత్యలకు కేవలం మూడు రోజుల ముందు రాహుల్ ఒక పొరుగింటి వ్యక్తి వద్ద రూ. 25,000 అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!వెలుగులోకి వచ్చిందిలాశుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఎలాంటి కదలికలు లేకపోవడంతో పొరుగువారు, బంధువులకు అనుమానం వచ్చి చూడటంతో ఈ ఘోరం బయటపడింది. మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడి 85 ఏళ్ల తండ్రి ఇంట్లోనే ఉన్నారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు, డాగ్ స్క్వాడ్ ప్రదేశాన్ని పరిశీలించి రక్త నమూనాలు, ఆధారాలను సేకరించాయి. దాడికి ఉపయోగించిన ఇటుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసిపి (వెస్ట్) ప్రశాంత్ కిరణ్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నగర సరిహద్దుల్లో తనిఖీలు తీవ్రతరం చేసి, రాహుల్ ఝా ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.ఇదీ చదవండి: రూ. 100 కోట్ల బ్లాక్ బ్లస్టర్ : వారికి లగ్జరీ కార్లు, వామికాకు మొండి చేయి? -
మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?
సాక్షి ముంబై: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన వేదికను గుజరాత్లోని కెవాడియాకు తరలించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. 72 ఏళ్లుగా ఢిల్లీలో కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఇప్పుడు కొత్తగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి తరలించాలనుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ముంబైను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. గుజరాత్కు ప్రాధాన్యం ఎందుకు?ఈనెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా గుజరాత్లోని కెవాడియా (ఏక్తానగర్)లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 1954లో ప్రారంభమైన ఈ అవార్డుల వేడుక ఇన్నేళ్లుగా ఢిల్లీలోనే జరుగుతోంది. తొలిసారిగా రాజధాని వెలుపల కార్యక్రమాన్ని నిర్వహించనుండటంపై రాజ్ ఠాక్రే సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై విమర్శలు గుప్పించారు.దేశంలోని కీలక కార్యక్రమాలు, ప్రాజెక్టుల విషయంలో గుజరాత్కే వరుసగా ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దేశ అభివృద్ధికి గుజరాతే కేంద్రం అన్న భావనను కల్పించే ప్రయత్నం జరుగుతోందా? అని ప్రశ్నించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు పునాది వేసిన దాదాసాహెబ్ ఫాల్కే మహారాష్ట్రకు చెందినవారని రాజ్ ఠాక్రే గుర్తుచేశారు. దేశంలో అత్యధిక చిత్రాల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో మహారాష్ట్రతోపాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రాల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేయకుండా గుజరాత్నే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు.ఇదీ చదవండి: 'ఐడీ కార్డులు చెక్ చేయండి.. మతాన్ని కాదు''‘జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకను ఢిల్లీ నుంచి తరలించాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ అలా తరలించాలనుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్రను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. భారతదేశపు ప్రస్తుత స్థాయికి ఏ ఒక్క రాష్ట్రం మాత్రమే కారణం కాదని.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తరతరాలుగా చేసిన కృషి, త్యాగం, శ్రమ ఉన్నాయని పేర్కొన్నారు.కళాకారులు ప్రశ్నించాలిప్రస్తుత పాలకులకు కళలపై ఆసక్తి లేదని, ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా మారిందని రాజ్ ఠాక్రే విమర్శించారు. కళాకారులు అధికారాన్ని పొగడటానికే పరిమితం కాకుండా.. ప్రజలకు సంబంధించిన నిర్ణయాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్లో జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడి అధ్యక్షులు తమ సొంత రాష్ట్రానికి ఆ కార్యక్రమాన్ని తరలించేందుకు ప్రయత్నించలేదని వ్యాఖ్యానించారు.దక్షిణాది రాష్ట్రాలు గళమెత్తాలి జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక తరలింపు విషయంలో మహారాష్ట్రతోపాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గట్టిగా స్పందించాలని రాజ్ ఠాక్రే కోరారు. ఈ అంశంపై కళాకారులు కూడా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాలని పిలుపునిచ్చారు. కాగా, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన వేడుకలను ఢిల్లీ నుంచి గుజరాత్కు తరలించడాన్ని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా వ్యతిరేకించారు. -
బ్రిక్స్తో మనకు లాభాలున్నాయండోయ్..!
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో మన దేశానికి పెద్దగా ఒరిగేదేం లేదని.. ఒకవేళ నిజంగా ప్రయోజనం ఉంటే అదేంటో చెప్పాలని కేంద్రానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సవాల్ విసిరారు. అయితే దీనికి బీజేపీ తీవ్రంగా స్పందించింది. అదే టైంలో.. కాంగ్రెస్ నుంచే కౌంటర్ రియాక్షన్ వచ్చింది. చిదంబరం వేసిన ప్రశ్నలకు సొంత పార్టీకే చెందిన మరో సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బదులిచ్చారు. ఆ ప్రయోజనాలు ఇవేనంటూ వివరించారు. ఈ వేదిక భారత్ దౌత్యపరమైన ప్రభావాన్ని, ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురాగల సామర్థ్యాన్ని చాటుతుందని పేర్కొన్నారు.‘గ్లోబల్ సౌత్కు కీలక వేదిక’ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ముందు మాట్లాడిన థరూర్.. గ్లోబల్ సౌత్కు బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పారు. విస్తరించిన బ్రిక్స్లో 11 దేశాలు ఉన్నాయని, ఇవి ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. ఇలాంటి దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం చిన్న విషయం కాదన్నారు.‘ప్రపంచ వేదికపై భారత్ దౌత్య బలం’బ్రిక్స్ సదస్సుకు పలువురు దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు హాజరవుతుండటం భారత్కు ప్రతిష్టాత్మక విషయమని థరూర్ అన్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ ‘డిప్లొమాటిక్ కన్వీనింగ్ పవర్’ను చూపిస్తుందని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్లో అన్నీ సానుకూల అంశాలే లేవని కూడా స్పష్టం చేశారు.ఇదీ సవాల్.. ఏకాభిప్రాయం కష్టమే!విభిన్న దేశాలు, విభిన్న ప్రయోజనాలు ఉన్నందున కీలక అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయం సాధించడం బ్రిక్స్లో పెద్ద సవాలని థరూర్ అన్నారు. మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరాన్-యూఏఈ మధ్య విభేదాల కారణంగా ఉమ్మడి ప్రకటన వెలువడలేదని గుర్తుచేశారు. దీంతో భారత్ చైర్ ప్రకటనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా సదస్సులోనూ అలాంటి పరిస్థితి వస్తే అది బ్రిక్స్ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందన్నారు.చిదంబరం ఏమన్నారు?ఇటీవల చిదంబరం మాట్లాడుతూ.. గత రెండు, మూడు బ్రిక్స్ సదస్సుల నుంచి భారత్కు వచ్చిన స్పష్టమైన ప్రయోజనాలు తనకు కనిపించలేదన్నారు. బ్రిక్స్తో పాటు ఎస్సీఓ, జీ20, క్వాడ్లో భారత్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. వాటి నుంచి దేశానికి వస్తున్న స్పష్టమైన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.వాణిజ్య లోటుపైనా థరూర్ ఆందోళనమరోవైపు బ్రిక్స్ దేశాలతో భారత్ వాణిజ్యం పెరుగుతున్నప్పటికీ.. అది పూర్తిగా భారత్కు అనుకూలంగా లేదని థరూర్ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు తగ్గుతుండగా.. దిగుమతులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. అంటే బ్రిక్స్ వేదిక భారత్కు దౌత్యపరంగా ప్రాధాన్యమైనదే అయినప్పటికీ.. వాణిజ్యపరంగా మరింత సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నది థరూర్ వ్యాఖ్యల సారాంశం.ఇదీ చదవండి: పార్టీ కంటే పిల్లనిచ్చిన మామే ఎక్కువయ్యాడా? -
కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందు తుపాకీతో ఒక యువకుడు అరెస్ట్ అయిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ (PMO) నకిలీ ఐడీ కార్డు, తుపాకీతో షాపింగ్ మాల్ నుండి 24 ఏళ్ల రోహన్ పారిఖ్, అతని అంగరక్షకుడు దిలీప్ కుండేలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు చెప్పిన సంగతులు విని పోలీసులు విస్తుపోయారు. తన కాబోయే భార్య, అత్తమామలను ఇంప్రెస్ చేయడానికి డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న రోహన్ తాను కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన అధికారినని , ప్రధాని కార్యాలయంతో నేరుగా సంబంధాలున్నాయి గప్పాలు కొట్టాడు. ఈ విషయాలో వారిని నమ్మించాలనుకుని పథకం వేశాడు.ఇందుకు ప్రధాని మోదీ హాజరు కానున్న ఎన్ఎంఏసీసీ వేదికను ఎంచుకున్నాడు. ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, మరో ముగ్గురికి తీవ్ర గాయాలుఏఐ టూల్స్ ఉపయోగించి నిజమైన పీఎంఓ కార్డ్ను పోలిన డిజిటల్ ఐడీ కార్డును (దీన్ని 2025లోనే తయారు చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది) ఉపయోగించి వీవీఐపీ మార్గం ద్వారా దర్జాగా లోపలికి వెళ్లాలనే ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగానే రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించాడు. జియో వరల్డ్ ప్లాజాలోకి వివిఐపి (VVIP) ప్రవేశ మార్గం ద్వారా వెళ్ళి,వారికి "పవర్" చూపించాలని ప్లాన్ చేశాడు. కానీ ప్రధాని పర్యటనకు ముందు భారీ భద్రతా తనిఖీల్లో దొరికిపోయాడు.ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజంఈ కేసులో రోహన్, అతని బాడీగార్డ్, డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేయగా, పారిఖ్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రథమేష్ బాగుల్ కోసం గాలిస్తున్నారు. వీరిపై మోసం, ఫోర్జరీ, VVIP భద్రతా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్-పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నాగ్పూర్-రాయ్పూర్ జాతీయ రహదారిపై ఉన్న పింపల్గావ్ రోడ్డు ప్రాంతంలోని 'భౌ ధాబా' సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ట్రక్, పికప్ వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది మృతి మరణించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రమాద స్థలం నుండి వెలికితీశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గుర్ని సకోలి సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంతమేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజం -
రష్యా మంత్రికి మన సినిమాల్లో హీరో ఛాన్స్!.. గోయల్ సరదా ఆఫర్
‘‘మీరు ఒప్పుకుంటే.. త్వరలో మా సినిమాల్లో చూస్తామేమో’’ అంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్యా మంత్రి ఆంటోన్ అలిఖానోవ్ను ఉద్దేశించి గోయల్ ఆ వ్యాఖ్య చేశారు. వృత్తి రీత్యా రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన లుక్, కటౌట్లు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోదన్నట్లుగా ఉంటుంది. ఇదే విషయాన్ని మన మంత్రి ప్రస్తావించారు..ఇన్నోప్రామ్ ఇండియా 2026 కార్యక్రమంలో భారత్, రష్యా మధ్య పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలపై చర్చ సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. అలిఖానోవ్ చూడటానికి చాలా డ్యాషింగ్గా ఉన్నారని పేర్కొన్న గోయల్.. ఆయన బహుశా పొరపాటున రాజకీయాల్లోకి వచ్చారేమో అని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఆడియోవిజువల్ సహకారాన్ని కూడా మరింత పెంచుకోవాలని, త్వరలోనే ఆయనను బాలీవుడ్ సినిమాలో చూడొచ్చేమోనని సరదాగా వ్యాఖ్యానించారు.2030 నాటికి 100 బిలియన్ డాలర్ల టార్గెట్అలిఖానోవ్కు గోయల్ ఇచ్చిన బాలీవుడ్ ఆఫర్ సరదా వ్యాఖ్యే అయినప్పటికీ.. ఆయనతో జరిగిన చర్చలు మాత్రం పూర్తిగా వ్యాపారపరమైనవే. భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అలాగే రెండు దేశాల మధ్య పెట్టుబడులను 50 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయి.ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు 60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇది రికార్డు స్థాయిలో 68.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఈ వాణిజ్యంలో భారత్ నుంచి రష్యాకు జరిగే ఎగుమతులు తక్కువగా ఉండగా.. రష్యా నుంచి భారత్కు దిగుమతులు భారీగా ఉన్నాయి.Bollywood calling? Piyush Goyal sees a movie star in Russia’s trade minister“Possibly we’ll see him starring in a movie in Bollywood very soon,” Goyal joked about Anton Alikhanov at the India–Russia Business Dialogue 2026. pic.twitter.com/yvRpLn26en— Sputnik India (@Sputnik_India) September 10, 2026పుతిన్ మెచ్చుకుని మరీ..ఆంటోన్ ఆండ్రేయెవిచ్ అలిఖానోవ్ 1986 సెప్టెంబర్ 17న సుఖుమిలో జన్మించారు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న ఆయన.. ఆర్థికశాస్త్రం, న్యాయశాస్త్రం చదివారు. రష్యా ప్రభుత్వంలో వివిధ బాధ్యతలు చేపట్టి రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. 2016లో కేవలం 30 ఏళ్ల వయసులో కలినిన్గ్రాడ్ ప్రాంతానికి తాత్కాలిక గవర్నర్గా నియమితులై.. అప్పట్లో రష్యాలోనే అత్యంత పిన్న వయస్కుడైన రీజియనల్ లీడర్గా పేరు దక్కించుకున్నారు. 2017లో పూర్తిస్థాయి గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు సన్నిహిత అధికారిక సమన్వయం కొనసాగింది. 2024లో పుతిన్ ప్రభుత్వం ఆయనకు కీలకమైన పరిశ్రమలు, వాణిజ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి రష్యా పారిశ్రామిక విధానాలు, విదేశీ వాణిజ్యంపై కీలక నిర్ణయాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.భారీగా వాణిజ్య లోటురష్యా నుంచి భారత్ ప్రధానంగా ముడిచమురు, ఇంధనం వంటి ఉత్పత్తులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో భారీ అసమతుల్యత(trade imbalance) ఉంది. దీన్ని తగ్గించేందుకు భారత్ నుంచి రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, టెక్స్టైల్స్ తదితరాల ఎగుమతులను పెంచాలని గోయల్ లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదే సమయంలో భారత్–యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ (EAEU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలను వేగవంతం చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. రష్యాతో పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. పీయూష్ గోయల్ సెప్టెంబర్ 10న అలిఖానోవ్తో పాటు ఈఏఈయూ వాణిజ్య మంత్రి ఆండ్రే స్లెప్నెవ్తోనూ చర్చలు జరిపారు.రేర్ ఎర్త్స్, మైక్రోఎలక్ట్రానిక్స్పై దృష్టిఇరు దేశాల మధ్య సహకారాన్ని సంప్రదాయ వాణిజ్యానికి మాత్రమే పరిమితం చేయకుండా కొత్త రంగాలకు విస్తరించాలన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలను అలిఖానోవ్ ప్రస్తావించారు. రష్యాలో ఏపీఐ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు భారత ఫార్మా కంపెనీలను ఆయన ఆహ్వానించారు.ఇలా ఇరు దేశాల మధ్య కీలకమైన వాణిజ్య, పారిశ్రామిక చర్చలు జరుగుతున్న వేళ.. అలిఖానోవ్ లుక్ను ప్రస్తావిస్తూ గోయల్ చేసిన ఒక్క సరదా వ్యాఖ్య మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. వ్యాపార చర్చల మధ్య ‘‘బాలీవుడ్లోకి వస్తారా?’’ అంటూ గోయల్ చేసిన చమత్కారం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఏఐతో ఎంతో ఈజీగా వినాశనం! -
పిల్లలు పుట్టడం లేదని టెస్టులకు వెళ్తే.. లోపల గర్భాశయం!
పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి.. వైద్య పరీక్షల్లో ఊహించని విషయం బయటపడింది. సాధారణంగా పురుషుల్లో ఉండని గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి అవయవాలు అతడి శరీరంలో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. అంతేకాదు.. రెండు వృషణాలు కూడా సాధారణ స్థానంలో లేకపోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఇన్ఫెర్టిలిటీకి కారణమేంటో తెలుసుకునేందుకు చేసిన పరీక్షలతో ఈ అరుదైన పరిస్థితి వెలుగులోకి వచ్చింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడికి వీర్యంలో శుక్రకణాలు పూర్తిగా లేకపోవడం (అజూస్పెర్మియా) గుర్తించారు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో గర్భాశయంతోపాటు ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి ముల్లెరియన్ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. దీనిని పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS)గా నిర్ధారించారు.అసలు PMDS అంటే ఏమిటి?మగ శిశువు గర్భంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు.. వృషణాల నుంచి ఉత్పత్తయ్యే యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (AMH) ప్రభావంతో ముల్లెరియన్ డక్ట్స్ అనే ప్రారంభ నిర్మాణాలు సాధారణంగా కనుమరుగవుతాయి. అయితే ఈ హార్మోన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం లేదంటే దానికి శరీరం సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ నిర్మాణాలు అలాగే ఉండిపోవచ్చు. దీంతో జన్యుపరంగా పురుషుడైన వ్యక్తిలో సాధారణ పురుష బాహ్య జననాంగాలు ఉన్నప్పటికీ.. శరీరం లోపల గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి అవయవాలు ఉండొచ్చు. ఈ అరుదైన పరిస్థితినే పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారు.పిల్లలు కలగకపోవడానికి కారణమేంటి?ఈ కేసులో ప్రధానంగా గుర్తించిన సమస్య.. వృషణాలు సాధారణ స్థానంలో లేకపోవడం. సాధారణంగా వృషణాలు శరీరం బయట ఉండే సంచిలో ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రత శరీరం లోపల కంటే కొంత తక్కువగా ఉంటుంది. శుక్రకణాల ఉత్పత్తికి ఈ పరిస్థితి అవసరం. అయితే వృషణాలు పొత్తికడుపులో లేదంటే గజ్జల ప్రాంతంలోని మార్గంలోనే ఉండిపోతే.. శుక్రకణాల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. పీఎండీఎస్లో ఇది తరచుగా కనిపించే లక్షణాల్లో ఒకటి. అలాగని PMDS ఉన్న ప్రతి వ్యక్తికీ సంతానలేమి ఉంటుందని చెప్పలేం. వృషణాల పనితీరు, శుక్రకణాల ఉత్పత్తి, పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై సంతాన సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.చికిత్స ఎలా ఉంటుంది?వీర్యంలో శుక్రకణాలు కనిపించని సందర్భాల్లో.. వృషణాల్లో శుక్రకణాలు ఉత్పత్తి అవుతున్నాయా? అనే విషయాన్ని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైతే వృషణాల నుంచి నేరుగా శుక్రకణాలను సేకరించే ప్రయత్నం చేస్తారు. శుక్రకణాలు లభిస్తే ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి సహాయక పునరుత్పత్తి విధానాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. కొన్ని కేసుల్లో వృషణాల పనితీరు సరిగా లేకపోతే.. ఇతర సంతానోత్పత్తి మార్గాలను కూడా వైద్యులు సూచించవచ్చు. పీఎండీఎస్ ఉన్న కొందరు పురుషుల్లో సంతానోత్పత్తి సాధ్యమేనని వైద్య కేసు నివేదికలు చెబుతున్నాయి. చాలా అరుదైన పరిస్థితిపీఎండీఎస్ చాలా అరుదైన వైద్య పరిస్థితి. కొందరిలో చిన్న వయసులోనే వృషణాలు కిందికి దిగకపోవడం లేదంటే గజ్జల్లో హెర్నియా వంటి సమస్యల కారణంగా ఇది బయటపడుతుంది. మరికొందరిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకపోవడంతో.. పెద్దయ్యే వరకు గుర్తించకపోవచ్చు. సంతానలేమి కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు అనుకోకుండా నిర్ధారణ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితిని కేవలం ‘వింత’గా చూడకుండా.. వృషణాల పనితీరు, హార్మోన్లు, జన్యు కారణాలు, పునరుత్పత్తి వ్యవస్థను పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది. సరైన సమయంలో గుర్తిస్తే సంతానోత్పత్తి అవకాశాలను కాపాడేందుకు, భవిష్యత్ ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించేందుకు చికిత్సా మార్గాలను ఎంచుకోవచ్చు. ఇదీ చదవండి: ఫాస్ట్గా తింటున్నారా? అయితే ఇది మీకోసమే! -
#80sTrend: హద్దులు దాటిన మీమ్ వార్
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. కానీ ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘మీమ్ వార్’ మరో స్థాయికి చేరింది. తాజాగా రెట్రో ట్రెండ్ ఏఐ ద్వారా దేశాన్ని ఊపేస్తోంది. తమ ఫొటోలను 70, 80 కాలం నాటి ఫొటోల్లా మార్చేసుకుని మురిసిపోతున్నారు చాలామంది. అయితే ఈ ట్రెండ్ వెనుక సైబర్ నేరాలకు అవకాశం ఉందనే హెచ్చరికలూ జారీ చేస్తున్నారు నిపుణులు. ఆ సంగతి పక్కన పెడితే.. పొలిటికల్గా ఇది మరో టర్న్ తీసుకుంది. ఒక పార్టీ పాతకాలం నాటి ఫొటోతో సెటైర్ వేస్తే.. మరో పార్టీ దానికి అంతకుమించిన వ్యంగ్య చిత్రంతో కౌంటర్ ఇచ్చింది. చివరకు ఈ పోస్టుల వ్యవహారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ టార్గెట్ చేసే వరకు వెళ్లింది. దీంతో ఇరు పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.కాంగ్రెస్ పోస్టుతో మొదలు..ఈ వివాదానికి కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చేసిన ఓ పోస్టు కారణమైంది. ‘1980ల నాటి గుజరాత్ వీధి’ అంటూ ఓ చిత్రాన్ని పోస్టు చేసింది. దీన్ని బీజేపీ తెలంగాణ కౌంటర్ చేసింది. 1970ల నాటి తరహాలో ఉన్న ఓ మహిళ బార్ కౌంటర్పై డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని ‘లుసియానా, ఇటలీ’ అనే క్యాప్షన్తో పోస్టు చేసింది. ఇక్కడితో ఆగని బీజేపీ కేరళ విభాగం మరో బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. పాతకాలం నాటి రాజకీయ పార్టీ కార్యాలయాన్ని తలపించేలా ఉన్న ఈ చిత్రంతో కాంగ్రెస్పై సెటైర్ వేసింది.అయితే ‘లుసియానా’ ప్రస్తావనతో పాటు వరుస పోస్టులను పరిశీలించిన పలువురు.. ఈ వ్యంగ్యానికి అసలు లక్ష్యం సోనియా గాంధీనేనని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఇటలీలోని లుసియానాలో జన్మించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ గుజరాత్ ఖాతా నుంచి చేసిన ఓ పోస్టును తర్వాత తొలగించినట్లు సమాచారం. దీంతో వివాదం మరింత ముదిరింది.దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పేజీలు గుజరాత్ గజదొంగ, చాయ్ పేరిట రైల్వే స్టేషన్లో చోరుడు, మొసలిని పట్టుకున్న మొనగాడు అంటూ రెట్రో స్టైల్లోనే పలు పోస్టులు చేసింది. దీంతో ఇది నరేంద్ర మోదీని ఉద్దేశించేనంటూ బీజేపీ భగ్గుమంది. ఇలా ఇరు పార్టీలు ఈ ట్రెండ్ను తమ మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు వేదికగా మార్చేశాయి.రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంపోస్టులపై ఇరు పార్టీల మద్దతుదారులు తీవ్రంగా స్పందించారు. బీజేపీ పోస్టుల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిని వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వాన్ని కించపర్చడంగా అభివర్ణించాయి. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సైతం ఈ విషయంలో బీజేపీపై మండిపడ్డారు. అయితే బీజేపీ మద్దతుదారులు తమ పోస్టులను రాజకీయ వ్యంగ్యంగా సమర్థిస్తూ.. ప్రత్యర్థి పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో కొందరు మాత్రం ‘రెండు పార్టీలు బురదలో కొట్టుకుంటున్నట్లుగా ఉంది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రాజకీయ అంశాలపై చర్చించాల్సిన సోషల్ మీడియా వేదికలు.. ఇలా పాత ఫొటోలు, మీమ్స్, వ్యక్తిగత విమర్శలకు వేదికలుగా మారడంపై కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.వైరల్ ట్రెండ్.. రాజకీయ పోరుకు ఆయుధంఇటీవల సోషల్ మీడియాలో పాతకాలం నాటి ఫొటోలు, మీమ్స్ను కొత్త క్యాప్షన్లతో వైరల్ చేయడం ట్రెండ్గా మారింది. రాజకీయ పార్టీలు కూడా ఇదే ట్రెండ్ను తమ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. ఈ ఘటనలోనూ ఓ పార్టీ పోస్టుకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడంతో మొదలైన వ్యవహారం.. చివరకు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. దీంతో రాజకీయాల్లో సోషల్ మీడియా మీమ్ సంస్కృతి ఎంతగా ప్రభావం చూపుతోందన్న చర్చ మరోసారి మొదలైంది.ఇదీ చదవండి: కోతులు అలా చేయడానికి మనమే కారణమా? -
బ్రిక్స్ సదస్సు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ: 18 అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుకు భారత్ అతిథ్య నివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12,13 ఢిల్లీలోని భరత మండపంలో జరిగే ఈ సదస్సుకు ప్రపంచ అగ్రనేతలతో పాటు విదేశీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఢిల్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యంత కఠిన ఆంక్షలు విధించనుంది. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గాల మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.రేపు బ్రిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటి నుంచి (శుక్రవారం) ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆ రోజు పనిచేయవు. వారాంతం అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఢిల్లీ మెట్రో సేవలు కొనసాగింపుఅయితే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైలు సేవలు పూర్తిగా నిలిపివేయడం లేదు. నగరవ్యాప్తంగా మెట్రో సేవలు కొనసాగుతాయి. అయితే సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్లోని ఢిల్లీ మెట్రో మ్యూజియాన్ని సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూసివేయనున్నారు. 35కుపైగా రహదారులపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదేశీ ప్రముఖులు, వీవీఐపీల కాన్వాయ్ల రాకపోకల కోసం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 4,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లో మోహరించారు. వీవీఐపీ రాకపోకలు, కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో 22 ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించనున్నారు.మథురా రోడ్, సర్దార్ పటేల్ మార్గ్, శాంతి పథ్, జనపథ్, అశోకా రోడ్, బరాఖంబా రోడ్, టాల్స్టాయ్ మార్గ్, ఆఫ్రికా అవెన్యూ రోడ్, నీతి మార్గ్, ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ తదితర 35కుపైగా రహదారులపై వివిధ సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు లేదా మళ్లింపులు ఉండవచ్చని అధికారులు తెలిపారు.బస్సులు, క్యాబ్లకు మార్గ మళ్లింపులుసదస్సు జరిగే రోజుల్లో పరిస్థితిని బట్టి బస్సుల రూట్లను మళ్లించడం లేదా కొంతకాలం నియంత్రించడం జరగవచ్చని అధికారులు పేర్కొన్నారు. క్యాబ్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరం కాని ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలని, బయలుదేరే ముందు తాజా ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించాలని ఢిల్లీ వాసులకు అధికారులు సూచించారు. -
పాక్ వక్రబుద్ధి.. హేమ్కుండ్ సాహిబ్ దర్శనానికి అడ్డంకి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయిటపెట్టింది. భారత్లోని సిక్కు పుణ్యక్షేత్రమైన శ్రీహేమ్కుండ్ సాహిబ్ను దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికులను ఎన్వోసీ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' పేరుతో అడ్డుకుంది. దీంతో యాత్రికులు నిరాశ చెందాల్సి వచ్చింది. అయితే, తమ ప్రయాణానికి NOC అవసరమని అధికారులు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని దీంతో తమ విమానాన్ని కోల్పోయి విమానాశ్రయంలోనే చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.యాత్రికుల వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు ఫైసలాబాద్ నుంచి షార్జాకు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో NOC కోసం అధికారులు పట్టుబట్టడంతో వారు ప్రయాణం చేయలేకపోయారు. అంతకుముందు నంకానా సాహిబ్లో పాకిస్థాన్ పంజాబ్ సిక్కు మైనారిటీ మంత్రి, పాకిస్థాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (PSGPC) అధ్యక్షుడు రమేశ్ అరోరా, ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు డిప్యూటీ సెక్రటరీ నాసిర్ ముష్తాక్ యాత్రికులను కలిశారు.విమాన మార్గంలో భారత్కు వెళ్లకుండా అట్టారి–వాఘా భూసరిహద్దు ద్వారా రోడ్డు మార్గంలో పంపిస్తామని వారు హామీ ఇచ్చినట్లు సింగ్ తెలిపారు. అయితే NOC విషయాన్ని ముందుగా తమకు ఎవరూ చెప్పలేదని, విమానాశ్రయంలో అధికారులు NOC అడిగినప్పుడు దాన్ని సమకూర్చాలని రమేశ్ అరోరాను కోరినా ఆయన తమకు సహాయం చేయలేకపోయారని సింగ్ పేర్కొన్నారు. యాత్రికులకు ఢిల్లీ, అమృత్సర్, శ్రీ ఆనంద్పూర్ సాహిబ్, శ్రీ హేమ్కుండ్ సాహిబ్లను సందర్శించేందుకు భారత వీసాలు ఇప్పటికే మంజూరయ్యాయి.అట్టారి–వాఘా భూసరిహద్దు మూసివేయడంతో తమకు విమాన మార్గం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని యాత్రికులు తెలిపారు. శ్రీ హేమ్కుండ్ సాహిబ్ యాత్ర కోసం భారత్ 92 మంది సిక్కు భక్తులకు వీసాలు జారీ చేసిందని పపిందర్ సింగ్ చెప్పారు. ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్ల కోసం వారు దాదాపు 2 కోట్ల పాకిస్థాన్ రూపాయలు ఖర్చు చేశారని, ఇప్పుడు ప్రయాణానికి అనుమతి లభించక తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. ఫైసలాబాద్–షార్జా విమానం ఇప్పటికే మిస్ కావడంతో, షార్జా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన తదుపరి విమానం సైతం మిస్ అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రస్తుతం యాత్రికులు విమానాశ్రయంలోనే ఉండి, పాకిస్థాన్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించి అట్టారి–వాఘా భూసరిహద్దు ద్వారా భారత్కు వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. హేమ్కుండ్ సాహిబ్ యాత్రను సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని వారు పాకిస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
యూపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మాయావతి మేనల్లుడిపై వేటు!
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్పై మరోసారి వేటు వేశారు. ఈసారి ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచే తొలగించారు. పార్టీ కంటే కుటుంబానికే ఆకాశ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని.. పైగా తాను చేసిన ట్వీట్ను అతను రీ-ట్వీట్ చేయలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారామె.బీఎస్పీ మాజీ రాజ్యసభ సభ్యుడు అశోక్ సిద్ధార్థ్ను మాయావతి ఆగస్టులో పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోవడం, పార్టీ నాయకత్వ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించడం వంటి కారణాలతో ఆయనపై మాయావతి చర్యలు తీసుకున్నట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 9న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.అశోక్ సిద్ధార్థ్ గనుక రాజకీయాల నుంచి తప్పుకుంటే.. ఆకాశ్ ఆనంద్ పార్టీ కోసం స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి వస్తుందని సూచించారు. ఆ వ్యాఖ్యల మరుసటి రోజే.. తన అల్లుడి రాజకీయ భవిష్యత్తు కోసం అశోక్ సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఇక ఆకాశ్కు మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు దక్కుతాయని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మాయావతి అతడినే పార్టీ నుంచి పూర్తిగా తొలగించారు.ఆ ఒక్క రీపోస్ట్ చేయలేదని..ఆకాశ్పై చర్యకు కారణాన్ని మాయావతి స్వయంగా వెల్లడించారు. తాను ఎక్స్లో పెట్టే పోస్టులను ఆకాశ్ గతంలో తరచూ రీపోస్ట్ చేసేవాడని చెప్పారు. కానీ అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని తాను చేసిన సూచనను మాత్రం ఆకాశ్ రీపోస్ట్ చేయలేదని పేర్కొన్నారు. అతని రాజకీయ భవిష్యత్తు కోసమే తాను ఆ పోస్టు పెట్టినా.. ఆకాశ్ దానిని పట్టించుకోకపోవడం తనకు ఆగ్రహం తెప్పించినట్లు మాయావతి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. పార్టీ ప్రయోజనాల కంటే కుటుంబ బంధానికే ప్రాధాన్యం ఇస్తున్నాడనే సంకేతంగా ఆమె దీనిని పరిగణించారు. ఇలా రెండు వైపులా ఆలోచించే వ్యక్తి బీఎస్పీ ప్రయోజనాల కోసం ఎలా పనిచేయగలడని మాయావతి ప్రశ్నించారు. పార్టీ, బహుజన ఉద్యమం కంటే కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చేవారితో ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.ఆకాశ్ ఆనంద్కు రాజకీయంగా ఇబ్బందులు రావడానికి అతనికి పిల్లనిచ్చిన అశోక్ సిద్ధార్థ్ ప్రధాన కారణంగా మాయావతి భావిస్తూ వచ్చారు. సెప్టెంబర్ 9న సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించిన తర్వాత.. గురువారం ఆయన సన్యాసం ప్రకటించారు. మాయావతిని తన రాజకీయ గురువుగా, అక్కగా పేర్కొన్న సిద్ధార్థ్.. ఆమె ఆదేశమే తనకు అన్నింటికంటే ముఖ్యమని చెప్పారు. తన వల్ల ఆకాశ్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతోనే రాజకీయాలకు దూరమవుతున్నట్లు తెలిపారు.అయితే ఆయన నిర్ణయం మాయావతిని సంతృప్తిపరచలేదు. సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం తీసుకున్నప్పటికీ అది చాలా ఆలస్యమైన నిర్ణయమని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ముందుగానే రాజకీయాల నుంచి తప్పుకుని ఉంటే బీఎస్పీ, బహుజన ఉద్యమం, ఆకాశ్ ఆనంద్ ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని అన్నారు. అంతేకాదు.. ఆకాశ్ రాజకీయ భవిష్యత్తు గురించి నిజంగా ఆలోచించి ఉంటే సిద్ధార్థ్ ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉండాల్సిందని మాయావతి వ్యాఖ్యానించారు.రెండేళ్లలో మూడోసారి..ఆకాశ్ ఆనంద్పై మాయావతి చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత రెండేళ్లలో ఆయనపై ఇది మూడో కీలక చర్య. వాస్తవానికి.. 2023 డిసెంబర్లో మాయావతి ఆకాశ్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బీఎస్పీ భవిష్యత్ నాయకుడిగా ఆయనకు ప్రాధాన్యం పెరిగింది. జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అప్పగించారు.2024 మేలో ఆకాశ్కు అప్పగించిన కీలక పార్టీ బాధ్యతలను మాయావతి తొలగించారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. 2025 మార్చిలో మరోసారి ఆయనపై చర్య తీసుకుని పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆకాశ్ క్షమాపణ చెప్పడంతో తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 3న జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో ఉండేందుకు మాత్రం అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వారం రోజులు కూడా తిరగకముందే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్నే రద్దు చేశారు.తమ్ముడికి కీలక బాధ్యతలు..ఆకాశ్పై వరుస చర్యలు జరుగుతున్న సమయంలోనే ఆయన తమ్ముడు ఇషాన్ ఆనంద్ బీఎస్పీలో కీలకంగా ఎదగడం ఆసక్తికరంగా మారింది. ఆకాశ్ను జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగించిన కొద్ది రోజులకే 27 ఏళ్ల ఇషాన్ ఆనంద్కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో బీఎస్పీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను ఆయనకు ఇచ్చారు. తన తండ్రి, బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్ కుమార్కు ఇషాన్ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఆకాశ్ నిర్వహించిన బాధ్యతల్లో కొంత భాగం ఇప్పుడు ఇషాన్ చేతికి వెళ్లడంతో.. ఆయన మాయావతికి రాజకీయ వారసుడిగా ఎదుగుతారా? అనే చర్చ మొదలైంది.ఎన్నికల ముందు బీఎస్పీలో కలకలంఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఎస్పీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీని బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి రావాలని మాయావతి లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 403 స్థానాల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్నీ గెలవలేకపోయింది. ఓటు శాతం కూడా 9.39 శాతానికి పడిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీ భవిష్యత్తుకు కీలకంగా భావించిన ఆకాశ్ ఆనంద్నే బయటకు పంపడం బీఎస్పీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇషాన్ ఆనంద్కు కీలక బాధ్యతలు అప్పగించడం మరింత ఆసక్తిని రేపుతోంది.2027 ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని మాయావతి ఇప్పటికే పిలుపునిచ్చారు. పూర్తి మెజార్టీతో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టాలని కోరారు.అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆకాశ్ ఆనంద్కు మళ్లీ బీఎస్పీలో కీలక స్థానం దక్కుతుందని భావించినా.. సీన్ పూర్తిగా మారిపోయింది. మామ రాజకీయ సన్యాసం తీసుకున్నా.. మేనల్లుడికి మాత్రం పార్టీ తలుపులు మూసుకుపోయాయి. అందుకు కుటుంబంపై ఉన్న అనుబంధమే కారణమని మాయావతి భావించడం ఇప్పుడు బీఎస్పీలో హాట్టాపిక్గా మారింది.ఇదీ చదవండి: టీవీకేకు తొలి పరీక్ష.. నెగ్గుతారా? -
క్విక్ కామర్స్ సంస్థలపై దాడులు.. సంచలన విషయాలు?
జైపూర్: రాజస్థాన్లోని క్విక్ కామర్స్ సంస్థలపై ఆహరభద్రత అధికారులు చేసిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ ఈ క్విక్-కామర్స్ సంస్థలైన బ్లింకిట్, జెప్టో సంస్థలు నిర్వహిస్తున్న డార్క్ స్టోర్లపై ఆహార భద్రత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, దెబ్బతిన్న ఉత్పత్తులు, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయని పాల ఉత్పత్తులు పెద్ద మొత్తంలో గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసి తనిఖీల నిమిత్తం ల్యాబ్కు తరలించినట్లు పేర్కొన్నారు. జగత్పురాలోని Zepto డార్క్ స్టోర్లో సుమారు 1,550 పాల ఉత్పత్తుల ప్యాకెట్లు సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం లేదని అధికారులు గుర్తించారు. పాలు, పెరుగు, మజ్జిగ వంటి డెయిరీ ఉత్పత్తులను నిర్దేశిత తక్కువ ఉష్ణోగ్రతల్లోనే ఉంచాలి. అయితే అక్కడి రిఫ్రిజరేషన్ యూనిట్లలో ఉష్ణోగ్రత 6 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. దీంతో అక్కడ నిల్వ ఉంచిన సుమారు 1,550 ప్యాకెట్లను అధికారులు ధ్వంసం చేసినట్లు తెలిపారు.అదే స్టోర్లో గడువు ముగిసిన సుమారు 7 కిలోల ఆహార పదార్థాలు కూడా బయటపడ్డాయని వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.అనంతరం జైపూర్లోని ఆదర్శ్ నగర్లో ఉన్న Blinkit డార్క్ స్టోర్ను తనిఖీ చేశారు. అక్కడ సుమారు 800 పాల ఉత్పత్తుల ప్యాకెట్లతో పాటు మరికొన్ని గడువు ముగిసిన దెబ్బతిన్న ఆహార పదార్థాలు సైతం గణనీయమైన పరిమాణంలో ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అంతేకాకుండా పాలు, ఫుడ్-గ్రేడ్ నెయ్యి, Paper Boat కార్బొనేటెడ్ వాటర్ నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల నివేదికల ద్వారా ఆ ఉత్పత్తుల నాణ్యతపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.ఈ తనిఖీలపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అవిచల్ చతుర్వేది మాట్లాడుతూ, ఆహార పదార్థాల నిల్వలో నిర్దేశిత ఉష్ణోగ్రతలు, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన, పాడైన ఉత్పత్తులను వెంటనే తొలగించి ధ్వంసం చేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే డార్క్ స్టోర్లలో పరిశుభ్రత, కోల్డ్-చైన్ నిర్వహణ, ఆహార నిల్వ విధానాల్లో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలని అధికారుల బృందం సూచించింది.మొత్తంగా, జైపూర్లో జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 2,350 డెయిరీ ఉత్పత్తుల ప్యాకెట్లను, అలాగే గడువు ముగిసిన మరియు దెబ్బతిన్న ఇతర ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ముఖ్యంగా పాల ఉత్పత్తులను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, గడువు ముగిసిన వస్తువులు స్టోర్లలో ఉండటం, పరిశుభ్రత లోపాలు వంటి అంశాలను అధికారులు తీవ్రంగా పరిగణించారు. సేకరించిన నమూనాల ప్రయోగశాల పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. -
విజయ్ సర్కార్కు తొలి పరీక్ష.. అన్నాడీఎంకే కంచుకోటల్లో బిగ్ ఫైట్!
తమిళనాడు రాజకీయాల్లో వేడి పెరిగింది.. విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష ఎదురైంది. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బైపోల్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు అన్నాడీఎంకేకు కంచుకోటలుగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో టీవీకే.. మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలనే తమ అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో విజయ్ వర్సెస్ స్టాలిన్ పోరుకు.. అన్నాడీఎంకే కౌంటర్తో ముక్కోణపు యుద్ధం మొదలైంది. అక్టోబర్ 6న జరగనున్న ఈ రెండు ఉపఎన్నికలు ఎవరి బలమెంతో తేల్చడమే కాదు.. విజయ్ కొత్త ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు తొలి సంకేతంగా మారే అవకాశముంది.అక్టోబర్ 6న తమిళనాడులో జరగనున్న రెండు అసెంబ్లీ ఉపఎన్నికలకు టీవీకే అధినేత, సీఎం విజయ్ అభ్యర్థులను ప్రకటించారు. మదురాంతకం నుంచి మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కె. మరగతం కుమారవేల్, ధారాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే పి. సత్యబామను బరిలోకి దింపారు. ఇద్దరూ ఏప్రిల్ 23 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.త్రిముఖ పోరు తప్పదా?ఈ రెండు నియోజకవర్గాలు అన్నాడీఎంకేకు బలమైన స్థానాలుగా పరిగణిస్తుండటంతో.. ఇప్పుడు అక్కడ టీవీకే, డీఎంకేతో పాటు అన్నాడీఎంకే కూడా బరిలోకి దిగడంతో త్రిముఖ పోరు నెలకొంది. మదురాంతకంలో డీఎంకే తరఫున మాజీ ఎమ్మెల్యే ఐ. పరందామన్, ధారాపురంలో ఎస్. సుగన్య పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే మదురాంతకంలో మాజీ ఎమ్మెల్యే కనిత సంపత్, ధారాపురంలో కె. బానుమతిని అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే ఈ ఉపఎన్నికలు విజయ్ ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారనున్నాయి. ఏప్రిల్ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత టీవీకే ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల పోరు ఇదే కావడంతో.. ఈ రెండు ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విజయ్ ఈ ఉపఎన్నికలను కాంగ్రెస్, ఎండీఎంకేతో కూడిన ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ ఫ్రంట్’ కూటమి పేరుతో ఎదుర్కోనున్నట్లు ప్రకటించారు.డీఎంకే, అన్నాడీఎంకే ఫుల్ ఫోకస్..తమకు ఇప్పటికే ఉన్న వ్యక్తిగత ఓటు బ్యాంకు, నియోజకవర్గాల్లో పరిచయం ఉన్న నాయకత్వం కలిసి పనిచేస్తుందని టీవీకే అంచనా వేస్తోంది. మదురాంతకం అభ్యర్థి మరగతం కుమారవేల్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో సాధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిస్తామని చెప్పారు. మరోవైపు.. అన్నాడీఎంకే తన బలమైన స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తుండగా, అధికార టీవీకేను నిలువరించేందుకు డీఎంకే కూడా గట్టిగానే పోరాడుతోంది. టీవీకే ఎదుగుదలను అడ్డుకోవడమే డీఎంకేకి ప్రధాన రాజకీయ సవాల్గా కనిపిస్తోంది. ఇందులో భాగంగా మదురాంతకం, ధారాపురం రెండింటిలోనూ డీఎంకే అభ్యర్థులను ముందుగానే ప్రకటించి పోరుకు తెరతీసింది. ఇదిలా ఉండగా.. మదురాంతకంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు అదే స్థానంలో బలాన్ని పెంచుకోవడం స్టాలిన్ పార్టీకి పెద్ద సవాల్గా ఉంది. ఇక, విజయ్ ప్రభుత్వానికి ఈ రెండు బైపోల్స్ తొలి రాజకీయ పరీక్షగా మారాయి. రెండు స్థానాలకు సంబంధించి అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇదీ చదవండి: తమిళనాట సంచలనం.. స్టాలిన్కు పళని బిగ్ ఆఫర్ -
విజయ్ మాల్యాకు ఈడీ స్ట్రాంగ్ కౌంటర్
బ్యాంకుల బకాయిల్లో దాదాపు రూ.15 వేల కోట్లు రికవరీ అయ్యాయి.. కాబట్టి తనపై పెండింగ్లో ఉన్న కేసులను ముగించాలని ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా వాదిస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వంపైనా, ఇక్కడి దర్యాప్తు వ్యవస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన వాదనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి కౌంటర్ ఇచ్చింది. డబ్బు రికవరీ, కేసులనేవి వేర్వేరు అంశాలని చెబుతోంది. బ్యాంకులు తమ బకాయిలను రికవరీ చేసుకోవడం, మనీలాండరింగ్ కేసులో క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగడం రెండూ వేర్వేరు అంశాలని ఈడీ అంటోంది. బకాయిలు తిరిగి వచ్చాయన్న కారణంతోనే మనీలాండరింగ్ కేసు ముగిసిపోదని తేల్చిచెప్పింది.విజయ్ మాల్యా 2020లో దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టులో పెండింగ్లో ఉంది. తన ఆస్తుల స్వాధీనం, రికవరీ ప్రక్రియను సవాల్ చేస్తూ ఆయన ఈ పిటిషన్ వేశారు. ఇటీవల ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా.. బ్యాంకులు దాదాపు రూ.15 వేల కోట్లు రికవరీ చేసినందున, ఇక ఈ పిటిషన్ కొనసాగించాల్సిన అవసరం లేదని మాల్యా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ అంశంపై ఈడీని కోర్టు వివరణ కోరింది. అయితే, బ్యాంకుల బకాయిలు రికవరీ కావడం వల్ల మనీలాండరింగ్ కేసు మాత్రం ముగియదని ఈడీ తన సమాధానంలో స్పష్టం చేసింది.బ్యాంకులు రికవరీ చేసిన మొత్తానికి సివిల్ బకాయిల లెక్కల్లో ప్రాధాన్యం ఉండొచ్చని ఈడీ పేర్కొంది. అయితే ఆ మొత్తాన్ని బట్టి మాల్యాపై నమోదైన షెడ్యూల్డ్ నేరాలు లేదంటే మనీలాండరింగ్ ఆరోపణలు రుజువయ్యాయా? లేదా? అన్నది నిర్ణయించలేమని తెలిపింది. బ్యాంకులకు ఎంత డబ్బు తిరిగి వచ్చిందన్నది క్రిమినల్ కేసులో నేరం జరిగిందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం కాదని స్పష్టం చేసింది.మాల్యా తరఫు న్యాయవాదులు.. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాదాపు రూ.15,000 కోట్లు రికవరీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు క్లెయిమ్ వడ్డీతో కలిపి సుమారు రూ.6,203 కోట్లు మాత్రమేనని, ఈ నేపథ్యంలో సివిల్ బాధ్యతలు దాదాపు పరిష్కారమయ్యాయని పేర్కొంటూ పెండింగ్ కేసును ముగించాలని కోరారు.రూ.14,131 కోట్ల ఆస్తుల పునరుద్ధరణఅయితే ఈ వాదనను ఈడీ తోసిపుచ్చింది. సుమారు రూ.14,131.60 కోట్ల విలువైన ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియానికి పునరుద్ధరించిన విషయాన్ని ప్రస్తావించింది. పీఎంఎల్ఏలోని సెక్షన్ 8(8) కింద ఆస్తుల పునరుద్ధరణ అనేది బాధిత లేదంటే చట్టబద్ధ హక్కు ఉన్న వ్యక్తికి ఆస్తిని తిరిగి అందించే ప్రక్రియ మాత్రమేనని తెలిపింది. ఆస్తులు తిరిగి ఇచ్చినంత మాత్రాన షెడ్యూల్డ్ నేరం/మనీలాండరింగ్ జరిగిందా లేదా అనే అంశం తేలిపోదని పేర్కొంది. అందువల్ల ఆస్తుల రికవరీని చూపించి పెండింగ్లో ఉన్న పీఎంఎల్ఏ ప్రొసీడింగ్స్ను నిరర్థకంగా భావించలేమని స్పష్టం చేసింది.భారత్కు దూరంగా ఉండటంపైనా ప్రస్తావనమాల్యా భారత్కు తిరిగి రాకపోవడం, సంబంధిత క్రిమినల్ కోర్టు పరిధికి తనను తాను అప్పగించకపోవడం కూడా కీలక అంశాలని ఈడీ కోర్టుకు తెలిపింది. కేసులపై ఆయన కోరుతున్న ఉపశమనాన్ని పరిశీలించే సమయంలో ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.మాల్యా 2016లో భారత్ను విడిచి వెళ్లి ప్రస్తుతం యూకేలో ఉన్నారు. 2019లో ఆయనను ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్ (పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు)గా ప్రకటించారు. ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేయడంతో పాటు, తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడంపై కూడా ఆయన న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.ఇటీవల బాంబే హైకోర్టు.. భారత్కు తిరిగి వచ్చి కోర్టు పరిధికి లోబడే ఉద్దేశం ఉందా? లేదా? అన్నదానిపై మాల్యాకు చివరి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు బ్యాంకుల రికవరీతో కేసులు ముగిసిపోవన్న ఈడీ వాదనపై కూడా కోర్టు తదుపరి విచారణలో పరిశీలన జరపనుంది.ఇదీ చదవండి: మాల్యా నోట కాక్రోచ్ మాట.. ఎందుకసలు? -
ఏనుగు మెడకు ట్రాక్టర్ టైరు
గువాహటి: హాయిగా అందినకాడికి తినేసే గజరాజుకు మహా కష్టం వచ్చిపడింది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగు అనూహ్యంగా ఒక ట్రాక్టర్ టైరును తొండంతో పైకి లాక్కుంది. అది కాస్తా మెడకు పట్టేయడంతో తెగ ఇబ్బందులు పడుతూ అడవిలో తిరగడం స్థానికుల కంటపడింది. విషయం ఖుంతాయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మృణాల్ సైకియా చెవిన పడటంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది ఏనుగు కోసం అన్వేషించి ఎట్టకేలకు మోరోంగీలోని బొకియాల్ అటవీప్రాంతంలో ఏనుగును గుర్తించారు. మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి ఏనుగు కాస్తంత శాంతించేలా చేశారు. సిబ్బంది శ్రమకోర్చి ఎలాగోలా ఏనుగు తల నుంచి ట్రాక్టర్ టైరును తొలగించారు. గురువారం జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ తాలూకు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అడవి ఏనుగుకు టైరు బాధ తప్పించిన అటవీ సిబ్బందిని అటవీ మంత్రి అభినందించారు. -
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు
వాషింగ్టన్: భారత్ వద్ద 190 వరకు అణ్వాయుధాలు ఉండొచ్చంటూ అమెరికాకు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్(ఎఫ్ఏఎస్)అనే లాభాపేక్షలేని ఓ సంస్థ ఇందుకు సంబంధించిన ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వం బహిర్గతం చేసిన గణాంకాలు, ఇతర వర్గాల నుంచి సేకరించిన సమాచారం, వాణిజ్య ఉపగ్రహాల చిత్రాల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు వివరించింది. ‘భారత్ వద్ద ఉన్న అణు సామర్థ్య ప్రయోగ వాహనాల అమరిక, వ్యూహాలకు సంబంధించిన బహిరంగ సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్న కొత్త క్షిపణుల కోసం ఉద్దేశించిన 30 అదనపు వార్హెడ్లు సహా సుమారు 190 అణు వార్హెడ్లను తయారు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. ఇందులో వాడకంలో ఉన్న ప్రయోగ వేదికల కోసం 160కి పైగా వార్హెడ్లు కూడా ఉన్నాయి’అని ’ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ –2026’ పేరుతో ఎఫ్ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సన్ ఆ నివేదికలో పేర్కొన్నారు.‘భారత్ తన అణ్వాయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటోంది. ఇటీవలి కాలంలో అనేక కొత్త ఆయుధ వ్యవస్థలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అణు సామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలు, భూమి, గగనతలం నుంచి ప్రయోగించే వ్యవస్థలను బలోపేతం చేసుకుంటోంది. పాత వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఇంకొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి’అని క్రిస్టెన్సన్ తెలిపారు. భారత్ 140 నుంచి 225 అణ్వాయుధాలకు సరిపడా సైనిక అవసరాల ప్లుటోనియంను సిద్ధం చేసుకుని ఉండొచ్చని కూడా ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఈ నిల్వలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. అయితే, 1998లో పొఖ్రాన్–2 ఆపరేషన్లో భాగంగా అణు పరీక్షలు చేపట్టిన భారత్..శత్రువుపై ముందుగా అణ్వాయుధాన్ని ప్రయోగించరాదనే విధానాన్ని ప్రకటించడంతోపాటు అందుకు కట్టుబడి ఉందని గుర్తు చేశారు. 2026 ఆరంభం నాటికి భారత్ వద్ద 730 కిలోల (సుమారు 170 కిలోలు అటూఇటుగా) అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే ప్లుటోనియం నిల్వలున్నట్లు ’ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఫిజైల్ మెటీరియల్స్’ అంచనా వేసినట్లు కూడా క్రిస్టెన్సన్ ఉటంకించారు. -
‘ఇస్రో’తో ప్రపంచానికి లబ్ధి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండే సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పారదర్శకత, సమగ్రతతో కూడిన శాస్త్రీయ సమాచారం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలని స్పష్టంచేశారు. గురువారం ఫ్రాన్స్లో జరిగిన తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ వర్చువల్గా ప్రసంగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సాంకేతికతలు, భాగస్వామ్యాలు భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నాయని వెల్లడించారు. సువిశాల అంతరిక్షం శతాబ్దాలుగా ప్రజల ఊహాశక్తిని ప్రేరేపిస్తూనే ఉందని తెలిపారు. వాతావరణం, పంటల నుంచి సముద్రాలు, సమాజాల వరకు భూమిపై జీవనాన్ని అంతరిక్షమే నిర్దేశిస్తోందని పేర్కొన్నారు. అంతరిక్షం ఇవ్వగల శక్తి అనంతమైనదని వ్యాఖ్యానించారు. అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఘర్షణకు బదులుగా సహకారం, స్వల్పకాలిక లాభానికి బదులుగా సుస్థిరత అవసరమని అన్నారు. భారతదేశ విధానం వసుధైక కుటుంబం(ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు) అనే భావనలో ఇమిడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూగోళం దాటి విస్తరించాలని మోదీ ఆకాంక్షించారు. అంతరిక్షంలోకి 34 దేశాల ఉపగ్రహాలు భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఇస్రో’తన అత్యుత్తమ పనితీరు, తక్కువ వ్యయంతో కూడిన ప్రయోగాల ద్వారా ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇస్రో సామర్థ్యాలు రైతులకు, మత్స్యకారులకు, వాతావరణ అంచనాకు, విపత్తు నిర్వహణకు, నౌకాయానానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలు భారతీయ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లాయని తెలిపారు. ఇస్రోతో ఎన్నో దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని వివరించారు. ఈ విజయం వెనుక భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు తరాల తరబడి సాగించిన అంకితభావం, కృషి ఉన్నాయని ఉద్ఘాటించారు. వారు పగలు రాత్రి అవిశ్రాంతంగా పనిచేస్తూ ఇస్రోకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టారని కొనియాడారు. అంతరిక్షయాన దేశాల సరసన భారతదేశానికి గరి్వంచదగిన స్థానాన్ని కల్పించారని ప్రశంసించారు. 2040 నాటికిచంద్రుడిపైకి భారతీయుడు చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఆదిత్య–ఎల్1 మిషన్ సూర్యుడి రహస్యాలను వెలికితీస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చాడని గుర్తుచేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. వీటి ప్రయోజనాలు మొత్తం మానవాళికి అందాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టంచేశారు. భారత్లో ఇస్రోతోపాటు ప్రైవేట్ అంతరిక్ష రంగం కూడా పురోగమిస్తోందని అన్నారు. ఇస్రో సాధించిన అత్యుత్తమ నైపుణ్యానికి పారిశ్రామిక ఉత్సాహం తోడవుతోందని తెలియజేశారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో ఫ్రాన్స్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతోందని తెలిపారు. భారతదేశపు తదుపరి అంతరిక్ష ప్రస్థానంలో భాగస్వాములుగా చేరాలని ఫ్రాన్స్ను, ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సుకు తనను ఆహ్వానించినందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్త మానవాళి కోసం, భావి తరాల కోసం మనమంతా కలిసి అంతరిక్షాన్ని అన్వేషిద్దామని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు చేద్దామని, అంతరిక్షాన్ని పరిరక్షించుకుందామని సూచించారు. -
టీవీకే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారిక గుర్తింపునిచ్చింది. దీనితోపాటు విజిల్ గుర్తును టీవీకే పార్టీకి శాశ్వత ఎన్నికల గుర్తుగా కేటాయించింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే అత్యధికంగా 108 స్థానాలలో విజయం సాధించింది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం టీవీకేని తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో అధికారిక ప్రాంతీయ పార్టీగా గుర్తించింది. దీంతో తమిళనాడులో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన 7వ రాష్ట్ర పార్టీగా టీవీకే నిలిచింది. టీవీకే పార్టీకి భారత ఎన్నికల సంఘం గుర్తింపునివ్వడం ప్రజల మద్దతుతోనే సాధ్యమైందని తమిళనాడు సీఎం విజయ్ హర్షం వ్యక్తం చేశారు. -
ప్రధాని మోదీతో ప్రిన్స్ ఆగా ఖాన్ భేటీ
న్యూఢిల్లీ: ఇస్మాయిలీ ముస్లింల 50వ ఇమామ్ ప్రిన్స్ రహీం ఆగా ఖాన్–5 గురువారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్(ఏకేడీఎన్)తో భారత్ భాగస్వామ్యంపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని మోదీ ఎక్స్లో.. ప్రిన్స్ రహీం ఆగా ఖాన్ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన తండ్రి, దివంగత ఆగా ఖాన్–4 జ్ఞాపకాలను, భారత్ అభివృద్ధి కోసం ఆయన అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నాం. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారిత వంటి రంగాల్లో ఏకేడీఎన్తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు గల మార్గాలపై చర్చించాం’అని పేర్కొన్నారు. భారత్ సమ్మిళిత వృద్ధి, సామాజిక పురోగతికి ఏకేడీఎన్ కట్టుబడి ఉందని ఆగా ఖాన్ పునరుద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానంపై పర్యటనకు వచ్చిన ఆగాఖాన్ ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు భారత్లో ఉంటారు. ఏకేడీఎన్ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను ఆగా ఖాన్ సందర్శించనున్నారు. ఇస్మాయిలీ వర్గం 50వ ఇమామ్గా గతేడాది బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. -
‘చైల్డ్ పోర్న్’ కట్టడికి చర్యలేవి?
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్, సోషల్ మీడియా వేదికలపై చిన్నారులకు సంబంధించిన అసభ్యకర, అశ్లీల కంటెంట్ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆన్లైన్లో పిల్లలకు రక్షణ కల్పించేలా కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేంద్రంతో పాటు ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయ మంత్రిత్వ శాఖలకు గురువారం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం ఈ కేసును గురువారం విచారించింది. ఇంటర్నెట్ను వినియోగించే పిల్లలను రక్షించేందుకు ఇంటర్నెట్లో ఫైర్వాల్స్ ఏర్పాటు చేయడం అత్యవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. అశ్లీల కంటెంట్ నిరోధానికి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లు ఆటోమేటెడ్ కంటెంట్–ఫిల్టరింగ్, వయో నిర్ధారణ యంత్రాంగాలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని పిటిషనర్ కోర్టు దష్టికి తీసుకెళ్లారు. అల్గారిథమిక్ రికమండేషన్ల కారణంగా చిన్నపిల్లలు పదేపదే అసభ్య కంటెంట్ బారిన పడుతున్నారని వివరించారు. పోక్సో చట్టం కింద అశ్లీల కంటెంట్ను రిపోర్ట్ చేయని ఇంటర్నెట్ సంస్థలు, ఐటీ చట్టం కింద లభించే చట్టపరమైన రక్షణ కోల్పోతాయని 2024 నాటి తీర్పును పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది హెచ్ఎస్ ఫూల్కా కోర్టుకు గుర్తుచేశారు. ఆన్లైన్ వేదికల్లో ఉన్న అల్గారిథమిక్ ఆడిట్లు, అమలులో ఉన్న కంటెంట్ ఫిల్టరింగ్ ప్రొటోకాల్స్పై పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. -
క్రయోజనిక్ ఇంజిన్ ఫ్లైట్ ‘హాట్ టెస్ట్’ విజయవంతం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బాహుబలి రాకెట్గా పేరు ప్రఖ్యాతులు పొందిన ఎల్వీఎం3 ఏడవ కార్యాచరణ మిషన్ కోసం క్రయోజనిక్ ఇంజిన్ ఫ్లైట్ హాట్ టెస్ట్ను గురువారం విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగాత్మక పరీక్షను మహేంద్రగిరిలోని ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ)లోని మెయిన్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ (ఎంఈటీ)లో నిర్వహించారు. ప్రయోగించబోయే ప్రతి ఎల్వీఎం3 రాకెట్కు సంబం«ధించి క్రయోజనిక్ ఇంజిన్లు ఆమోదం పొందడంలో భాగంగా హాట్టెస్ట్ ప్రక్రియను చేయడం పరిపాటి. అధిక ఎత్తులో పనిచేయడానికి రూపొందించిన నాజిల్తో ఈ అప్పర్ స్టేజ్ ఇంజిన్ హాట్ టెస్ట్ను నిర్వహించేందుకు ఒక నాజిల్ ప్రొటెక్షన్ సిస్టంను అభివృద్ధి చేసి పలు క్వాలిఫికేషన్ల ద్వారా ధ్రువీకరించుకుంటారు. హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటిలో ప్రయోగానికి సమానమైన వాక్యూమ్ పరిస్థితులను అనుకరించడం ద్వారా క్రయోజనిక్ ఇంజిన్ల పరీక్షకు పట్టే సమయాన్ని, శ్రమను తగ్గిస్తుంది. ఎల్వీఎం3 రాకెట్ ద్వారా పేలోడ్స్ సామర్థ్యాన్ని పెంచడానికి భవిష్యత్తులో ప్రయోగించబోయే ఎల్వీఎం3 రాకెట్లలో క్రయోజనిక్–20 (సీఈ–20) క్రయోజనిక్–32 (సీఈ–32) దశలను 22 టన్నుల థ్రస్ట్ స్థాయిలో పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీఈ–20 ఇంజిన్ పనితీరు పరీక్షలోని అన్ని లక్ష్యాలను చేరుకుందని, ఇంజిన్ వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరీక్షలో గగన్యాన్ కోసం సీఈ–32 దశలకు ఉద్దేశించిన ఎల్ఓఎక్స్ ట్యాంక్ ప్రెషరైజేషన్ మాడ్యూల్ కూడా విజయవంతంగా ప్రదర్శించినట్లు తెలిపారు. ఆదోని పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనితో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో గురువారం రాత్రి భూమి కంపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. రాత్రి 7.45 గంటల కొన్ని సెకన్ల పాటు భూమి అదురుతున్నట్లు అనిపించడంతో ఇళ్లలో ఉన్నవారు బయటకు పరుగులుదీశారు. అలాగే, ఆలూరు మండలంలోని గ్రామాల్లోనూ భూమి కంపించినట్టు స్థానికులు చెప్పారు. తహసీల్దార్ వేణుగోపాల్, డీఎస్పీ వెంకటరమణ తదితరులు కూడా భూమి కంపించినట్టు ధ్రువీకరించారు. -
రేపటి నుంచే బ్రిక్స్ సదస్సు
న్యూఢిల్లీ: భారత్ అతిథ్యం ఇవ్వనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శనివారం, ఆదివారం జరిగే ఈ సదస్సుకు చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తదితరులు హాజరు కాబోతున్నారు. షీ జిన్పింగ్ భారత్లో అడుగుపెడుతుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పె రుగుతున్న ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా విధిస్తున్న సుంకాల ప్రతికూల ప్రభావాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండు రోజుల బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై కూటమి సదస్సులో చర్చించబోతున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా ఇందులో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం కూడా భాగస్వామ్య దేశాలుగా మారాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతి నిధ్యం వహిస్తోంది. 11 ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో బలమైన కూటమిగా ఆవిర్భవించింది. భారత్ బ్రిక్స్లో వ్యవస్థాపక సభ్య దేశం. 2012, 2016, 2021లో కూటమికి సారథ్యం వహించింది. ఇప్పుడు నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఈసారి ‘సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం’అనే ఇతివృత్తంతో బ్రిక్స్ సదస్సు శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు ప్రధాని మోదీ ఏర్పాటు చేసే విందుతో మొదటి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రెండో రోజు ఆదివారం పలు సమావేశాలు, చర్చలు జరుగుతాయి. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’విడుదలతో సదస్సు ముగుస్తుంది. నేడే పుతిన్ రాక రష్యా అధినేత పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున భారత్లో అడుగుపెట్టబోతున్నారు. ఆయన మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని రష్యా ప్రతినిధి యురీ ఉషకోవ్ తెలిపారు. శుక్రవారం వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో పుతిన్ ప్రసంగించనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3.30 గంటలకు పుతిన్తో, సాయంత్రం 6.15 గంటలకు మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని మోదీ భేటీ అవుతారు. జిన్పింగ్, మోదీ ప్రత్యేక భేటీ! ఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు షీ జిన్పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. సదస్సు సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకు జిన్పింగ్, నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారని సమాచారం. జిన్పింగ్ భారత పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. రెండు ఆసియా అగ్రరాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి జరుగుతున్న ప్రయత్నంగా పేర్కొంటున్నారు. జిన్పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్లో భారత్లో పర్యటించారు. బ్రిక్స్కు అంతా సిద్ధం: మోదీ బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్ను సైతం షేర్ చేశారు. -
‘జంక్’ వల్లే జంకు లేదు!
సాక్షి, స్పెషల్ డెస్క్ : మన దేశంలో కోతులు, హనుమాన్ లంగూర్లను దైవస మానంగా భావించి భక్తితో లేదా జాలితో వాటికి బిస్కెట్లు, బ్రెడ్లు, వేపుళ్లు, సమోసాలు, స్వీట్లు వంటి ఆహార పదా ర్థాలను పెట్టటం రోడ్ల పక్కన, దేవాలయాల దగ్గర సర్వసాధా రణంగా కనిపించే దృశ్యాలు. అయితే, మనం చేసే ఈ చిన్న ‘ఉపకారం’ వాటి ఆరోగ్యానికే కాక, తిరిగి మన భద్రతకే పెనుముప్పుగా మారుతోంది. ఇటీవలి కాలంలో కోతులు మనుషులపై తీవ్రంగా దాడులు చేయటానికి, చేతుల్లోని వస్తువులను లాక్కోవటానికి మనం అలవాటు చేస్తున్న ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ ప్రధాన కారణమని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం మారి.. అసహనం పెరిగి..కోతులు, లంగూర్లు సహజంగా అడవుల్లో దొరికే ఆకులు, కాయలు, పండ్లు, బెరడులు తిని జీవించే శాకాహార జీవులు. వాటి జీర్ణవ్యవస్థ అధిక పీచుపదార్థాలు కలిగిన సహజాహారాన్ని అరిగించుకోవటానికి అనువుగా రూపొందినది. వీటికి మనం తినే ఉప్పు, నూనె, శుద్ధి చేసిన చక్కెర, మైదాతో తయారైన కృత్రిమ పదార్థాలు పెట్టటం వల్ల కడుపుబ్బరం, తీవ్రమైన అసిడిటీ, జీర్ణకోశ సమస్యలు, మధుమేహం తలెత్తుతాయి. ప్రాసెస్డ్ ఆహారంలోని కృత్రిమ చక్కెరలు కోతుల్లో ఒకేసారి విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేసి, వాటి నాడీవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. శరీరంలో కలిగే ఈ అనారోగ్యకరమైన మార్పులు, శారీరక అసౌకర్యం వాటి ప్రవర్తనను మార్చేస్తాయి. దీనివల్లే అవి అత్యంత అసహనంగా, ఆవేశంగా ప్రవర్తిస్తాయంటున్నారు.స్వతంత్రంగా జీవించనివ్వటమే మేలుఅడవుల్లో ఆహారాన్ని వెతుక్కునే సహజ స్వభావాన్ని కోల్పోయి, నగరాల్లో సులువుగా దొరికే కేలరీలు అధికంగా ఉండే ఆహారానికి ఇవి బానిసలవుతాయి. ఎవరైనా ఆహారం ఇవ్వకపోయినా, ఆలస్యం చేసినా అవి కోపంతో మనుషులపై భౌతిక దాడులు చేసి, గాయపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారానికి అలవాటు పడటం వల్ల కోతులు అడవులను వీడి జనావాసాలు, రహదారుల వైపు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించటం లేదా రోగాల బారిన పడటంతోపాటు నగరాల్లో జనంపై దాడులు పెరగటానికి ఇది కారణమవుతోంది. కుక్క కాట్ల తర్వాత అంత ఎక్కువగా జరుగుతున్నది కోతుల దాడులే. అందుకే, అటవీ ప్రాంతాల్లో అక్కడక్కడా అధికారులు ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కోతులకు ఆహారం ఇవ్వటం వాటి మనుగడకే ప్రమాదమని స్పష్టం చేస్తున్నారు. భక్తి, జాలి చూపించాల్సింది వన్యప్రాణులకు ఆహారం విసరటంలో కాదు, వాటిని తమ సహజ వాతావరణంలో స్వతంత్రంగా జీవించనివ్వటం కోసం అడవులను పెంపొందించటం వంటి పనుల్లోనే ఉందన్నది వన్యప్రాణి నిపుణుల మాట. కోతులకు ఆహారం వేయటం ఆపటం ద్వారానే మనుషులు వన్యప్రాణుల మధ్య ఘర్షణను దీర్ఘకాలంలోనైనా నివారించగలం. -
వృద్ధుడి వీపుపైకి ఎక్కి కాలువ దాటిన ప్రభుత్వ ఉద్యోగి ..వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి అహంకార పూరిత చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. తన బూట్లు తడవకుండా ఉండేందుకు ఒక రెవెన్యూ అధికారి (పట్వారీ) వృద్ధుడి వీపుపై కూర్చుని పిల్ల కాలువ దాటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. సిద్ధి జిల్లాలోని మాతా గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే లాల్వా కేవత్ (65) అనే వృద్ధుడి ఇల్లు, పంట పొలాలను పరిశీలించేందుకు నీలేష్ నామ్దేవ్ అనే పట్వారీ అక్కడికి వెళ్లారు. అయితే, అక్కడ కాలువను దాటే సమయంలో తన బూట్లు తడవకుండా ఉండేందుకు ఆ పట్వారీ వికృత ఆలోచనకు తెరతీశాడు. తనను వీపుపై ఎక్కించుకుంటేనే ఇంటి సర్వే చేస్తానని ఆ వృద్ధుడిని బెదిరించినట్లు తెలుస్తోంది.దీంతో చేసేది లేక ఆ వృద్ధుడు ఆ అధికారిని తన వీపుపై ఎక్కించుకుని నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేర్చాడు. ఈ అమానుష ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ప్రభుత్వ అధికారై ఉండి ఒక వృద్ధుడి పట్ల ఇలా ప్రవర్తించడంపై స్థానికులు నెటిజన్లు, స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది. సిద్ధి కలెక్టర్,సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు, బాధ్యుడైన పట్వారీ నీలేష్ నామ్దేవ్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలేకాని, ఇలా వృద్ధులతో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.यह सीधी जिले के पटवारी साहब ।जूते गंदे नहीं हो जाएं इसलिए एक बुजुर्ग के पीठ पर चढ़कर पानी से भरा गड्ढा पार किया pic.twitter.com/R2zDg0u6Z4— SanjayGupta_Journalist (@sanjaygupta1304) September 9, 2026 -
గుండెజబ్బులను గుర్తించేందుకు మరో ఆయుధం
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, కోరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)ని ముందస్తుగా గుర్తించడంలో సెరోట్రాన్స్ఫెరిన్ (Serotransferrin - TF) అనే ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. శరీరం మొత్తానికి ఐరన్ సరఫరా చేసేందుకు ఉపయోగపడే సెరోట్రాన్స్ఫెరిన్ అనే ప్రొటీన్ తక్కువగా ఉంటే కరోనా ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఐజీఐబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తనాళాల్లో గార లాంటి పదార్థం పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త ప్రసారం తగ్గడాన్నే కరోనా ఆర్టరీ డిసీజ్ అంటారు. అయితే ఈ సమస్యకు గురైన వారిలో ఐరన్ తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ జబ్బును ముందుగానే గుర్తించడం కష్టం. ఈ నేపథ్యంలో సెరోట్రాన్స్ఫెరిన్ మోతాదులను పరిశీలించడం ద్వారా ఒక వ్యక్తి కరోనా ఆర్టరీ డిసీజ్కు గురయ్యే అవకాశం ఎంత ఉందో ముందుగానే తెలుసుకోవచ్చు నని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త సాగరికా బిశ్వాస్ తెలిపారు. సెరోట్రాన్స్ఫెరిన్ పనితీరును క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా గుండెజబ్బులకు కొత్త చికిత్సలు అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే గుండెజబ్బు ఉన్న వారిలో మొత్తం 197 ప్రొటీన్లలో ఒక్క సెరోట్రాన్స్ఫెరిన్ మాత్రమే తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిసిందని ‘ఆక్టా కార్డియోలాజికా’జర్నల్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. గుండెజబ్బులున్న వారు యాభై మందిని, ఆరోగ్యంగా ఉన్న 40 మందిని పరిశీలించినప్పుడు జబ్బులున్న వారిలో ‘ట్రోపోనిన్–1’ఎక్కువగా ఉన్నట్లు కూడా ఈ పరిశోధన ద్వారా తెలిసిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా : కేంద్రమంత్రి గడ్కరీ ధ్వజంరాబోయే రోజుల్లో సెరోట్రాన్స్ఫెరిన్పై మరిన్ని మాలిక్యులర్, క్లినికల్ పరిశోధనలు జరిగితే, ఇది గుండె జబ్బుల నివారణ మరియు చికిత్సలో ఒక కొత్త మార్గాన్ని సుగమం చేస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. గుండె కండరాల్లో ఉండే ఈ ప్రత్యేక ప్రొటీన్ ఏదైనా నష్టం, గాయమైనప్పుడు రక్తంలోకి చేరుతూంటుంది. ఇది ఎక్కువగా ఉంటే గుండెజబ్బు ఉన్నట్లు లెక్క. అలాగే సెరోట్రాన్స్ఫెరిన్ తక్కువగా ఉన్నా జబ్బు ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదీ చదవండి: మిన్ను విరిగి మీద పడినా : పెళ్లి ఆగేదే లేదు! -
విజయ్పై టీటీవీ దినకరన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఎంకే స్టాలిన్ దవడ గాయాన్ని సీఎం విజయ్ ఎగతాళి చేశారంటూ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ సినిమాల్లోనే హీరో.. నిజ జీవితంలో పెద్ద విలన్” అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే నేతల కంటే తీవ్రంగా స్పందించిన దినకరన్.. విజయ్ను స్వార్థపరుడిగా అభివర్ణించారు. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి చేస్తారంటూ మండిపడ్డారు.విజయ్ పార్టీ టీవీకే అధికారంలో వచ్చిన తర్వాత తమిళనాడు రాజకీయ వాతావరణం వ్యక్తిగత విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్.. నటి త్రిషతో విజయ్కు ఉన్న సంబంధాన్ని అడ్డం పెట్టుకుని ఆయన్ని కార్నర్ చేయడానికి ప్రయత్నించగా.. ముఖ్యమంత్రి మాత్రం డీఎంకే చీఫ్కు 1976లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో తగిలిన దవడ గాయాన్ని ఎగతాళి చేశారనే ఆరోపణలు వచ్చాయి.సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష డీఎంకే అవినీతిపై ఆయన విమర్శలు గుప్పిస్తూ ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ సైగ.. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. అసెంబ్లీ సమావేశంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గతంలో ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, నిర్బంధం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో విజయ్ తన దవడను తాకుతూ ఒక రకమైన సైగ చేశారు. విజయ్ చేసిన ఈ బాడీ లాంగ్వేజ్ సైగ.. ఎమర్జెన్సీ (1975-77) కాలంలో ‘మీసా’ చట్టం కింద అరెస్టై, పోలీస్ కస్టడీలో దాడికి గురై దవడ గాయపడిన ఎంకే స్టాలిన్ను అపహాస్యం చేసేలా ఉందని డీఎంకే పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.విజయ్పై విమర్శలు గుప్పించిన ఎంకే స్టాలిన్.. అదే సమయంలో తన దవడకు గాయం ఎలా జరిగిందో వివరించారు. 1975-77 మధ్య అమలైన ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం రద్దయిన తర్వాత 1976లో తాను అరెస్టయిన విషయాన్ని స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. జైలులో మేము ఎన్నో రకాల వేధింపులు ఎదుర్కొన్నాం. మమ్మల్ని కుష్ఠు రోగులతో కలిసి ఉంచారు. పది మందిని ఒక చిన్న గదిలో బంధించారు. ఆ గదిలో ఒకే ఒక మూత్రశాల ఉండేది. చుట్టూ దుర్వాసన ఉన్నప్పటికీ అక్కడే నిద్రించాల్సి వచ్చేదంటూ స్టాలిన్ తెలిపారు.పోలీసులు రాత్రిళ్లు మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. లాఠీలతో కొట్టేవారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలతో కూడా మమ్మల్ని కొట్టించారు. నాతో పాటు జైలులో ఉన్న ఎంపీ చిట్టిబాబు అక్కడే మరణించారు. ఆ దాడిలో నా దవడ ఎముక విరిగింది” అని చెప్పారు. విజయ్ తాను ఆ హావభావం చేయలేదన్న వివరణను స్టాలిన్ తోసిపుచ్చారు.ఇదీ చదవండి: తమిళనాడులో భగ్గుమన్న ‘దవడ’ రాజకీయం -
ఎట్టకేలకు ఐఫోన్ డ్యూయో : సోషల్మీడియాలో పేలుతున్న మీమ్స్
యాపిల్ సంస్థ ఎట్టకేలకు తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ను 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo) ను లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ఫీచర్లు, ఫోల్డబుల్ స్క్రీన్, ఇతర ప్రత్యేకతలపై కాకుండా సోషల్మీడియాలో జరుగుతున్న సంభాషణ మాత్రం విభిన్నంగా సాగుతోంది. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న జోక్కు IYKYK (if you know, you know) ) అనేది ట్రెండింగ్ ట్యాగ్లైన్గా మారింది.మైక్రోసాఫ్ట్ 2020లోనే తన రెండు స్క్రీన్ల ఫోల్డబుల్ డివైజ్ను యాపిల్ కాపీ కొట్టిందంటూ మీమ్స్, జోకులు పేలిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన ఫోన్కు 'Surface Duo' అని పేరు పెట్టింది. దీంతో 'Duo' అనేది కొత్త పేరేమీ కాదు, పాతదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాపిల్ 'Fold' అని పెట్టకుండా మైక్రోసాఫ్ట్ను కాపీ కొట్టిందని కొందరు ఎక్స్లో విమర్శించారు. మరికొందరు ఇది మైక్రోసాఫ్ట్దే కాకుండా, గతంలొ వచ్చిన ఇంటెల్ (Core Duo) చిప్ల పేరును కూడా గుర్తుచేస్తోందన్నారు. అయితే, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో కంటే ముందే, అంటే 1990లలోనే యాపిల్ తన PowerBook Duo ల్యాప్టాప్లకు ఈ పేరును వాడిందని మరికొందరు గుర్తుచేశారు.విండోస్ సెంట్రల్ ఎడిటర్ జాక్ బౌడెన్ మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ తమ 'Duo' ప్రాజెక్ట్ను మధ్యలోనే వదిలేయడం వల్ల యాపిల్ ఉద్దేశపూర్వకంగానే ఈ పేరును (మరియు MacBook Neo రూపంలో 'Neo' పేరును) ఉపయోగించుకుందని నిపుణులంటున్నారు. పేర్కొన్నారు. డ్రాయిడ్ లైఫ్ అనే టెక్ సైట్ వ్యాఖ్యానిస్తూ, మైక్రోసాఫ్ట్ తయారు చేసిన అత్యంత దారుణమైన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకటైన సర్ఫేస్ డ్యూయో పేరునే యాపిల్ ఎంచుకోవడం నవ్వు తెప్పిస్తోందని రాసుకొచ్చింది.విండోస్ లేటెస్ట్ కథనం ప్రకారం, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో హార్డ్వేర్ అద్భుతంగా ఉన్నప్పటికీ సోఫ్ట్వేర్ పరంగా విఫలమైంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఆ ప్రాజెక్ట్ను కొనసాగించి ఉంటే సర్ఫేస్ డ్యూయో ఎలా ఉండేదో, యాపిల్ ఐఫోన్ డ్యూయో ఇప్పుడు అలా వచ్చిందని విశ్లేషించింది.యాపిల్ గతంలో 'MagSafe Duo' ఛార్జర్ వంటి వాటికి ఈ పేరు వాడినప్పటికీ, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ విఫలమైన ప్రాజెక్ట్ పేరు మళ్లీ యాపిల్ ఫోన్కు రావడాన్ని నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. అయితే ఈ పేర్ల సారూప్యతపై యాపిల్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.'Huawei made a foldable phone five years ago...' '"Junk, that phone will break in an instant... Chinese junk... Why do you need so much screen on a single phone? Just buy a tablet."' 'Apple makes a foldable phone...' '"Only Apple could pull this off."'😁😁😁 pic.twitter.com/kbeCGujp8d— FierceGoys (@GrahamInHell) September 10, 2026 -
స్పేస్ పరిశోధనల్లో భారత్తో చేతులు కలపండి.. ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ : అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, భవిష్యత్ పరిశోధనల్లో భారత్కు సహ ప్రయాణికులుగా మారాలని ఫ్రాన్స్,ఇతర దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పారిస్లో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును (ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్) ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భూమిపై మానవ జీవితానికి అంతరిక్షం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. శతాబ్దాలుగా అంతరిక్షం మానవ ఊహాశక్తిని ప్రేరేపిస్తోందని, నేడు అది వాతావరణం, వ్యవసాయం, సముద్రాలు, సమాజాల అభివృద్ధిని ప్రభావితం చేస్తోందని తెలిపారు.అంతరిక్ష కక్ష్యలు రద్దీగా మారుతున్న తరుణంలో.. ఘర్షణల కంటే సహకారానికి, స్వల్పకాలిక లాభాల కంటే సుస్థిరతకు, మినహాయింపుల కంటే సమ్మిళిత విధానానికి మన ఎంపికలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని స్పష్టం చేశారు. 1960ల నుంచి భారత్, ఫ్రాన్స్లు అంతరిక్ష రంగంలో నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాంకేతికతను అందించడంలో ఇస్రో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ప్రశంసించారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలను భారతీయ రాకెట్లు అంతరిక్షంలోకి విజయవంతంగా చేరవేశాయని తెలిపారు.రైతులు, మత్స్యకారులకు సహాయం చేయడం నుంచి వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ, నావిగేషన్ వరకు ఇస్రో సాంకేతికతలు కేవలం భారత్కే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలు, చర్చలు, సహకారంతో సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగాన్ని రూపొందించడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. -
ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ
ముంబై- గోవా హైవే విస్తరణ పనులు నత్త నడకన సాగుతుండటంపై కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల ఆలస్యంపై ఇక ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పనుల్లో విపరీతమైన ఆలస్యం జరగడం పట్ల సిగ్గుపడుతున్నానని, అందుకే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను హాజరుకాబోవడం లేదని ఆయన కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. గోవాలోని పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ వద్ద ఆరు లేన్ల ఎలివేటెడ్ రోడ్డు కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు తన హెచ్చరికలను కార్యరూపంలోకి తెచ్చేందుకు, గడ్కరీ అక్టోబర్లో ముంబై నుండి గోవా వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి ఈ హైవే పనుల పూర్తి పొడవును స్వయంగా తనిఖీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆలస్యానికి, నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. తన శాఖకు ఏడు ప్రపంచ రికార్డులు ఉన్నాయి కానీ ఇపుడు ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో కాంట్రాక్టర్లను బ్లాక్లిస్ట్లో పెట్టడం, అధికారులను సస్పెండ్ చేయడంలో సరికొత్త రికార్డు సృష్టించాలనుకుంటున్నానంటూ కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అదే సమయంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యాలకు, నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని గడ్కరీ తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు మహారాష్ట్రలోని తీరప్రాంత కొంకణ్ గుండా వెళుతుంది. భూసేకరణ వివాదాలు, న్యాయపరమైన చిక్కులు, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, అటవీ శాఖ అనుమతులు లభించడంలో ఆలస్యం కావడం వంటి అంశాలు పనుల పురోగతిని దెబ్బతీశాయని గడ్కరీ వివరించారు. ప్రస్తుతం అటవీ శాఖ అనుమతుల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గడ్కరీ వివరాల ప్రకారం ఈ హైవే పనులు ప్రస్తుతం సుమారు 93-94 శాతం పూర్తయ్యాయి. గణేష్ ఉత్సవాలకు ముందే సుమారు 90-95 శాతం పనులు పూర్తయ్యాయని మహారాష్ట్ర అధికారులు అంచనా వేశారు. అలాగే చిప్లున్ బైపాస్ వర్షాకాలం తర్వాత ప్రారంభమవుతుందని, మంగావ్ బైపాస్ పనులు జనవరి 2027 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు ఉన్నాయని అంచనా. ఇటీవలి నివేదికల ప్రకారం, ముంబై-గోవా హైవే ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 16,000 కోట్లు ఖర్చు చేశారు.🚨 Union Minister Nitin Gadkari says he feels “ashamed” over the prolonged delay in widening the Mumbai–Goa Highway.- He says he will not attend the highway’s inauguration when the project is finally completed and blacklist the contractors pic.twitter.com/5R89KCHuNg— Radio India 🇮🇳 (@Radio_India_) September 10, 2026కాగా ముంబై-గోవా హైవే విస్తరణ ప్రాజెక్ట్ దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. పాత రెండు లేన్ల హైవేను నాలుగు లేన్లుగా మార్చడం ద్వారా ముంబై - గోవా మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 12 గంటల నుండి ఆరు గంటలకు తగ్గించే లక్ష్యంతో 2011లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ మొదట 2016 నాటికి పూర్తవుతుందని భావించినప్పటికీ, ఇంకా అసంపూర్తిగానే ఉంది.ఇదీ చదవండి: రూ. 2.5 లక్షల అప్పు, 19 మంది పేర్లు : సివిల్స్ విద్యార్థి ఆత్మహత్య -
దావూద్ ఇబ్రహీంను కాపాడింది అదృశ్య శక్తా?.. లేక మన పోలీసుల అతి తెలివా?
భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లు.. ప్రపంచంలో ఏమూల దాగున్నా అజ్ఞాత వ్యక్తులు వారిని మట్టుబెడుతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం..! ఇంకా చెప్పాలంటే.. భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు విదేశాల్లో తలదాచుకుంటున్నా.. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అయితే.. భారత్కు మోస్ట్ వాంటెడ్గా ఉన్న అండర్ వరల్డ్ డాన్.. దావూద్ ఇబ్రహీం విషయంలో ప్రభుత్వం ఎందుకు సఫలం కావడం లేదు? చిక్కడు.. దొరకడు అన్నట్లుగా తప్పించుకు తిరుగుతున్న దావూద్ను లేపేయడానికి రెండు దశాబ్దాల క్రితమే భారత్ స్కెచ్ వేసినా.. ఇలాంటి ఆపరేషన్లలో అత్యంత దురంధరుడిగా ఉన్న అజిత్ దోబాల్ వ్యూహం పన్నినా.. ముంబై పోలీసులు చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా.. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యిందంటే మీరు నమ్ముతారా?భారత గూఢచర్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్.. క్లుప్తంగా రా ఎన్నెన్నో ఆపరేషన్లు చేపట్టింది. అయితే.. దావూద్ ఇబ్రహీంను మాత్రం ఓ అదృశ్య శక్తి కాపాడిందని చెబుతుంటారు. రా ఆపరేషన్లలో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న డైనమిక్ ఆఫీసర్ అజిత్ దోబాల్ 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఉన్నారు. ఆయనే ‘ఆపరేషన్ దావూద్’కి స్కెచ్ వేశారు. ఈ పని చేసింది మాత్రం రా కాదు.. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అప్పటికే ఐక్య రాజ్య సమితి కూడా దావూద్ను డిసిగ్నేటెడ్ టెర్రరిస్టుగా గుర్తించింది. దాంతో.. పాక్లో ఉన్నంత కాలం దావూద్పై దాడులకు చాన్సే ఉండదు. అప్పుడే.. దావూద్ కూతురు మహరూఖ్ పెళ్లి విషయం దోబాల్కు తెలిసింది. క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్తో అదే ఏడాది జూలై 9న మక్కాలో నిఖా.. జూలై 13న దుబాయ్లోని గ్రాండ్ హయాత్ హోటల్లో రిసెప్షన్ అనే సమాచారం భారత్కు అందింది. దాన్ని చక్కటి అవకాశంగా మలచుకోవాలని దోబాల్ భావించారు.దావూద్ను మట్టుబెట్టడానికి భారత్ ముందు ఓ అడ్డంకి కనిపించింది. అయితే.. దుబాయ్లో ఆ ఆపరేషన్ను అధికారికంగా చేపట్టడం వల్ల సమస్యలను కొని తెచ్చుకోవడం తప్పదని దోబాల్ భావించారు. దీంతో.. అధికారిక ఆపరేషన్ మాదిరిగా కమాండోలను కాకుండా.. సంఘ విద్రోహక శక్తులనే పావులుగా వాడుకోవాలని నిర్ణయించారు. అప్పటికే దావూద్కు, అండర్ వరల్డ్ ప్రపంచాన్ని శాసించాలని ఉవ్విళ్లూరుతున్న ఛోటారాజన్కు మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఛోటారాజన్ను లేపేసేందుకు స్కెచ్లు కూడా వేశాడు. ఈ వైరాన్ని అనుకూలంగా మలచుకోవాలనుకున్న దోబాల్.. కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారనేలా ఛోటారాజన్ సాయంతో పనికానివ్వాలని పక్కా ప్లాన్ వేశారు. ఛోటారాజన్ అనుచరులు, షార్ప్ షూటర్లుగా పేరున్న విక్కీ మల్హోత్రా, ఫరీద్ తనాషాకు ఆ బాధ్యతలను అప్పగించారు.అనుకున్నదే తడవుగా విక్కీ, ఫరీద్లను దోబాల్ ఢిల్లీకి పిలిపించుకున్నారు. మూడు వారాలపాటు ఓ రహస్య ప్రదేశంలో ప్రత్యేక శిక్షణనిప్పించారు. ప్లాన్ ఎగ్జిక్యూషన్కు వారు సిద్ధమయ్యారనుకున్నాక.. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వాళ్లకు దోబాల్ బ్రీఫింగ్ ఇచ్చారు. వారిద్దరికీ సూడాన్ పాస్పోర్టులు ఇచ్చి.. విమానంలో బిజినెస్ క్లాస్ ప్రయాణానికి టికెట్లు అందజేశారు.తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందన్నట్లు అజిత్ దోబాల్ స్కెచ్కు పెద్ద అడ్డంకి ఏర్పడింది. అదికూడా ముంబై పోలీసుల కారణంగా..! మరో ఐదు రోజుల్లో విక్కీ, ఫరీద్లను దుబాయ్ పంపించే ముందు.. ఆ ఫైవ్ స్టార్ హోటల్లో దోబాల్ వారిద్దరికీ తన స్కెచ్ గురించి చెబుతుండగా.. ‘టక్.. టక్.. టక్’ అంటూ హోటల్ గది తలుపులను బయటి నుంచి కొందరు వ్యక్తులు బాదారు. తలుపులు తెరిచిన దోబాల్ ఎదుట.. ముంబై డీసీపీ ధనుంజయ్ కమలాకర్, అతని టీమ్ కనిపించింది. వారు దోబాల్కు అరెస్టు వారెంట్ను చూపించి.. విక్కీ, ఫరీద్లను బెదిరింపు కేసుల్లో అరెస్టు చేయడానికి వచ్చినట్లు వివరించారు. దోబాల్ ఎంత నచ్చజెప్పినా.. కమలాకర్ వినలేదు. అది రహస్య ఆపరేషన్ కావడంతో.. దోబాల్ మరోమాట మాట్లడలేదు. ఫలితంగా.. వారిద్దరినీ అరెస్టు చేసి, తీసుకెళ్తున్నా.. మిన్నకుండిపోయారు.అయితే.. దావూద్ను కాపాడిన ఆ అదృశ్య శక్తి ఎవరనేది ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. విక్కీ, ఫరీద్లను అరెస్టు చేసిన టీమ్లో ఉన్న మీరా చద్దా బోర్వంకర్ వంటివారు ఆ తర్వాతి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాత్రం.. ‘‘ఇది రెండు సంస్థల మధ్య సమన్వయ లోపంతో జరిగిన తప్పిదం. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. దావూద్ను రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఐబీ చీఫ్ మాకు కనీస సమాచారం ఇవ్వకపోవడం వల్లే.. ఈ గందరగోళం జరిగింది’’ అని పేర్కొనడం గమనార్హం..! దీనికి మీరేమంటారు..? దావూద్ను నిజంగానే అదృశ్య శక్తి కాపాడిందా?? కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా.. ఓ అండర్ వరల్డ్ డాన్ను తుదముట్టించేందుకు భారత్కు వచ్చిన ఓ అద్భుతమైన అవకాశం మాత్రం కొద్దిలో చేజారింది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ మీ ముందుకు వస్తాను. -
బొజ్జ గణపయ్య.. బిలియనీర్ సీక్రెట్స్!
విఘ్నాలను తొలగించి, విజయాన్ని ప్రసాదించే లంబోదరుడి ఆగమనం ప్రతి ఇంటా సంతోషాలను అందిస్తుంది. బొజ్జ గణపయ్య రూపం కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాదు.. అందులో లోతైన జీవిత సత్యాలతో పాటు క్రమశిక్షణతో కూడిన పర్సనల్ ఫైనాన్స్ సూత్రాలు నిగూఢమై ఉన్నాయి. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి అనే చందంగా, ఆర్థిక కష్టాలు దరిచేరక ముందే జాగ్రత్త పడటానికి వినాయకుడి శారీరక లక్షణాలు అద్భుతమైన మార్గదర్శకాలుగా నిలుస్తాయి.పెద్ద తల.. విస్తృత ఆలోచనగజాననుడి పెద్ద తల సుదూర ఆలోచనకు ప్రతీక. ఆర్థిక జీవితంలో కూడా స్వల్పకాలిక లాభాలకే పరిమితం కాకుండా దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించుకోవాలి. రూపాయి పొదుపు – వంద రూపాయిల ఆదాయం అనే రీతిలో కష్టపడి సంపాదించిన సొమ్మును కాంపౌండింగ్ పవర్ ద్వారా దీర్ఘ కాలంలో సంపదగా మార్చడానికి ఇది పునాది వేస్తుంది.చిన్న కళ్లు.. సూక్ష్మ పరిశీలనగణపతి చిన్న కళ్లు దేనినైనా లోతుగా, సూక్ష్మంగా పరిశీలించడాన్ని సూచిస్తాయి. మార్కెట్లో కనిపించే మెరుపులన్నీ బంగారం కావు. పక్కవారి మాటలు విని గుడ్డిగా పెట్టుబడులు పెట్టకూడదు. ఏదైనా పథకంలో లేదా షేర్లలో ఇన్వెస్ట్ చేసే ముందు దాని రిస్క్, రాబడిని నిశితంగా విశ్లేషించాలి.పెద్ద చెవులు.. శ్రద్ధగా వినడంఏనుగు చెవుల వలే పెద్దగా ఉండే వినాయకుని చెవులు మనకు అవసరమైన అంశాలను శ్రద్ధగా వినాలని నేర్పుతాయి. పర్సనల్ ఫైనాన్స్లో మార్కెట్ వార్తలు, ఆర్థిక నిపుణుల సలహాలు జాగ్రత్తగా వినాలి. మంచి చెడులను బేరీజు వేసి మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలి.తొండం.. అనుకూలతతొండం ఫ్లెక్సిబిలిటీకి ప్రతీక. భారీ వృక్షాలను కూల్చగలదు.. అలాగే చిన్న గడ్డిపరకను కూడా సున్నితంగా పట్టుకోగలదు. అన్ని గుడ్లను ఒకే గంపలో పెట్టకూడదు అనే సామెతలాగా, మన పెట్టుబడులను ఈక్విటీలు, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి వివిధ రకాల ఆస్తుల్లో విభజించాలి (డైవర్సిఫికేషన్). ఇది అత్యవసర సమయాల్లో ఆర్థిక రక్షణను ఇస్తుంది.పెద్ద బొజ్జ.. ఆర్థిక క్రమశిక్షణగణనాథుడి లంబోదరం అన్ని మంచి చెడులను మింగి జీర్ణించుకునే శక్తికి సంకేతం. మన ఆర్థిక ప్రయాణంలో ఎదురయ్యే ఆకస్మిక నష్టాలు, ఆర్థిక అత్యవసర పరిస్థితులు (ఉద్యోగం పోవడం, వైద్య ఖర్చులు) తట్టుకోవడానికి తగినంత అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) ఏర్పాటు చేసుకోవాలి.చిన్న ఎలుక.. ఖర్చులపై నియంత్రణభారీ ఆకారం ఉన్న గణనాథుడు చిన్న మూషికాన్ని వాహనంగా ఉపయోగిస్తాడు. అంటే ఎంతటి భారీ ఆదాయం ఉన్నా చిన్న ఆశలను, అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలని ఇది సూచిస్తుంది. ఆదాయం చూసి ఖర్చు చేయాలి అన్నట్లుగా చిన్న అప్పులు లేదా అనవసరపు ఖర్చులు సుడిగుండాల్లా మారి సంపదను దెబ్బతీయకుండా చూసుకోవాలి.ఇదీ చదవండి: ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్.. కెమెరాలో అదిరిపోయే మార్పులు! -
సబ్కలెక్టర్గా శుభ్ర పండా
ఒడిశా : జయపురం సబ్ కలెక్టర్గా శుభ్ర పండా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న జాదుమణి నాయిక్ను బదిలీ చేసి ఆమె స్థానంలో శుభ్ర పండాను నియమించారు. కొత్త సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జయపురం మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారి (ఈఓ) బాధ్యతలను కూడా అదనంగా అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.జయపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో సబ్ కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తారు. మునిసిపాలిటీ ఈఓ బాధ్యతలు కూడా అప్పగిస్తే పట్టణ పరిపాలనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.ఇదిలా ఉండగా, ప్రస్తుతం సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న జాదుమణి నాయిక్కు తదుపరి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆమె బదిలీకి సంబంధించిన తదుపరి నియామక వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.చదవండి: ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు -
రూ. 2.5 లక్షల అప్పు, 19 మంది పేర్లు : సివిల్స్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, ముంబై: పూణేలోని శనివార్ పేట్ ప్రాంతంలో విషాదంచోటు చేసుకుంది. కేవలం రూ. 2.5 లక్షల అప్పు తీర్చలేక సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న 28 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో తన అప్పులపై రాసిన రెండు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతుడిని ధారాశివ్ జిల్లాలోని పరందా తహసీల్ పరిధిలోని ఖసాపురి గ్రామానికి చెందిన ప్రథమేష్ దేశ్ముఖ్గా గుర్తించారు. గత ఎనిమిది నెలలుగా పూణేలోని ఒక భవనంలో మూడవ అంతస్తులో ఉన్న వన్-BHK ఫ్లాట్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలతో సహా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు.బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు దేశ్ముఖ్ రాసినట్లు భావిస్తున్న లేఖ సూచిస్తోందని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నవనాథ్ జగ్తాప్ తెలిపారు.MPSC ची तयारी करणाऱ्या परांडा तालुक्यातील (जि. धाराशिव) विद्यार्थी प्रथमेश देशमुख याने पुण्यात आत्महत्या केल्याची घटना अत्यंत दुःखद आहे.गेल्या काही काळात पेपरफुटीसह विविध गैरप्रकार होत असल्याने एक स्वप्न उराशी बाळगून अभ्यास करणाऱ्या विद्यार्थ्यांमध्ये डावलल्याची भावना निर्माण… pic.twitter.com/UWiw9vcyVQ— Riven (@R1v3n_0x) September 9, 2026ఇదీ చదవండి: కేవలం రూ.15 కోసం ప్రొఫెసర్పై కత్తితో దాడిసొంత ఖర్చుల కోసం దేశ్ముఖ్ రూ. 2.5 లక్షలు అప్పు తీసుకున్నానని, అందులో అతను ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాడో వారి పేర్లను కూడా అందులో పేర్కొన్నాడు. అతను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, తల్లిదండ్రులను కూడా విచారించనున్నామని డీసీపీ (జోన్-1) రుషికేష్ రావలే చెప్పారు.మరోవైపు మార్చిలో జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి) స్క్రీనింగ్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో సహా, నియామక పరీక్షలలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై పూణే , మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో MPSC అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్న తరుణంలోనే అతని బలవన్మరణం పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. An MPSC aspirant died by suicide. Exam delays, irregularities and years of uncertainty have made the pressure unbearable for many students.How many more students have to suffer before the government takes accountability?https://t.co/SbWkzoej5h— Cockroach Janta Party - CJP (@Cockroachisback) September 9, 2026ఇంకా ఎంతమంది బలికావాలి - సీజేపీమరోవైపు ఈ ఘటనపై సీజేపీ కూడా స్పందించింది. పరీక్షల ఆలస్యం, అక్రమాలు , సంవత్సరాల అనిశ్చితి ఒత్తిడి చాలా మంది విద్యార్థులను బలితీసుకుంటోంది. ఇంకా ఎంతమంది బలికావాలి? ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాన్ని కలుసుకున్న సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు -
ముంబై పేలుళ్ల కేసు.. అబూ సలేంకు సుప్రీంకోర్టు ఝలక్!
న్యూఢిల్లీ: ముంబై 1993 వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ అబూ సలేం ముందస్తు విడుదలకు చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. 25 ఏళ్ల జైలు శిక్షను ఇప్పటికే పూర్తి చేశానంటూ సలేం దాఖలు చేసిన పిటిషన్ను గురువారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు ఏప్రిల్ 2026లో ఇచ్చిన తీర్పును సమర్థించింది.పోర్చుగల్ నుంచి భారత్కు అప్పగించే సమయంలో అక్కడి ప్రభుత్వానికి భారత్ ఇచ్చిన హామీని సలేం తన పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించాడు. తనను భారత్కు అప్పగిస్తే మరణశిక్ష విధించబోమని, అలాగే 25 ఏళ్లకు మించి జైలులో ఉంచబోమని 2002లో భారత్ హామీ ఇచ్చిందని పేర్కొన్నాడు. 2005 నవంబర్ 11న అతడిని పోర్చుగల్ నుంచి భారత్కు తీసుకొచ్చారు. తాను విచారణ ఖైదీగా గడిపిన కాలం, శిక్ష అనుభవించిన కాలం, మంచి ప్రవర్తనకు లభించిన రిమిషన్ అన్నింటినీ కలిపితే 2025 మార్చి 31 నాటికే 25 ఏళ్లు పూర్తయ్యాయని సలేం వాదించాడు. అందువల్ల ఇకపై తనను జైలులో ఉంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ముందస్తు విడుదల కోరాడు.అయితే, ఈ వాదనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. సలేం పిటిషన్ ముందుగానే దాఖలైందని, 25 ఏళ్ల వ్యవధి 2030లో పూర్తవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సలేం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గతంలో 2022లో ఇదే అంశంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. సలేం 25 ఏళ్ల జైలు కాలాన్ని పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అతడి ముందస్తు విడుదలను నిర్ధారించాలని పేర్కొన్నప్పటికీ.. అతడి శిక్షను కమ్యూట్ చేయడం లేదని స్పష్టం చేసింది. పోర్చుగల్లో పాస్పోర్టు మోసం కేసులో గడిపిన జైలు కాలాన్ని 25 ఏళ్ల వ్యవధిలో లెక్కించరాదని కూడా తేల్చింది.కాగా, అబూ సలేం 2002లో పోర్చుగల్లో అరెస్టయ్యాడు. 1993 ముంబై పేలుళ్ల కేసుతో పాటు మరో టాడా కేసులో అతడికి వరుసగా 2015, 2017లో జీవిత ఖైదు పడింది. ఈ నేపథ్యంలో 2025కే 25 ఏళ్లు పూర్తయ్యాయన్న అబూ సలేం వాదనను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించడంతో.. తక్షణ విడుదలకు అతడి ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడింది.ఇదీ చదవండి: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్కు బంపరాఫర్ -
త్వరలోనే ‘పీఎం-కుసుమ్ 2.0’ ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘పీఎం-కుసుమ్’ రెండో విడతను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఏడో అగ్రివోల్టాయిక్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పీఎం-కుసుమ్ 2.0 కింద ఫేజ్-2 ప్రక్రియ శరవేగంగా జరుగుతోందన్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని మీడియా సమావేశంలో తెలియజేశారు.ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. రెండో విడత పీఎం-కుసుమ్ పథకంలో అగ్రివోల్టాయిక్స్ కోసం ప్రత్యేక విభాగాన్ని కేటాయించనున్నట్లు ప్రకటించారు. అగ్రివోల్టాయిక్స్ విధానం ద్వారా ఒకే భూమిలో పంటల సాగుతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని సమర్థవంతంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఇది రైతులకు రెండు రకాల ఆదాయ మార్గాలను అందిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచే క్రమంలో ప్రభుత్వం ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు, పంచాయతీలకు ప్రాధాన్యతనిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన భద్రతను సాధించడంతో పాటు రైతు స్వయంసమృద్ధికి ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు.అగ్రివోల్టాయిక్ సాంకేతికతపై పరిశోధనలు మరింత ముమ్మరం చేయాలని, భారతీయ వాతావరణ పరిస్థితులకు తగిన నమూనాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా పరిశ్రమల ప్రతినిధులు, పరిశోధకులకు ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు.పీఎం-కుసుమ్ గురించి కీలక వివరాలు..పీఎం-కుసుమ్ అనేది రైతులకు ఇంధన భద్రత కల్పించడం, వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం.రైతులు తమ బంజరు లేదా నిరుపయోగమైన భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చు. ఉత్పత్తి అయిన విద్యుత్ను స్థానిక విద్యుత్ సంస్థలకు (డిస్కమ్) విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.గ్రిడ్ విద్యుత్ సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఆఫ్-గ్రిడ్ సోలార్ పంప్సెట్లను (7.5 హెచ్పీ వరకు) ఏర్పాటు చేయడానికి సబ్సిడీ అందిస్తారు.ఇప్పటికే ఉన్న గ్రిడ్-ఆధారిత డీజిల్ లేదా విద్యుత్ పంప్సెట్లను సోలార్ పంప్సెట్లుగా మారుస్తారు. దీనిద్వారా సాగుకు ఉచితంగా విద్యుత్ అందడమే కాకుండా, మిగిలిన విద్యుత్ను డిస్కంలకు అమ్మి ఆదాయం సంపాదించవచ్చు.ఇదీ చదవండి: ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే.. -
కేవలం రూ.15 కోసం ప్రొఫెసర్పై కత్తితో దాడి
బిహార్లోని ఛప్రా నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ. 15 కోసం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్పై అమానుషంగా దాడిచేసిన ఘటన కలకలం రేపింది.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రొఫెసర్ చికిత్స పొందుతుండగా, పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.నంద్లాల్ సింగ్ కాలేజీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న భగవాన్ ఠాకూర్, ఎప్పటిలాగే అర లీటరు పాలు కొనుగోలు చేయడానికి ఒక దుకాణానికి వెళ్లారు. దీనికోసం ఆయన రూ. 500 నోటును దుకాణదారుడికి ఇచ్చాడు. అతను తిరిగి రూ. 450 మాత్రమే ఇచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, తనకు రావాల్సిన చిల్లరలో రూ. 15 తక్కువగా వచ్చాయని ఠాకూర్ గమనించారు. దాంతో ఆయన తిరిగి దుకాణానికి వెళ్లి, ఆ డబ్బును దుకాణదారుడికి చూపించి, రూ. 15 కూడా తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే షాప్ ఓనర్ కుమారుడు వెనకనుంచి ఉన్నట్టుండి దాడి చేశాడు. కత్తితో ఆయన చెవిలో పొడిచాడు. ఈ హఠాత్పరిణామానికి ఠాకూర్ కింద పడిపోయారు. ఎలాగోలా తన సహోద్యోగికి ఫోన్ చేయగలిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న సహోద్యోగి ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది మరియు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు -
తమిళనాడులో సంచలనం.. స్టాలిన్కు పళనిస్వామి బంపరాఫర్!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో కొత్త సమీకరణాలపై ఉత్కంఠ పెరుగుతోంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి డీఎంకేతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకేకు వ్యతిరేకంగా తమ కూటమిలోకి ఇతర పార్టీలు వస్తే స్వాగతిస్తామని చెప్పిన ఆయన.. ‘డీఎంకే వస్తుందా?’ అంటూ ఆ పార్టీకి నేరుగా సవాల్ విసిరారు.టీవీకేకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడుతోందా అని మీడియా ప్రశ్నించగా.. తాము కూడా టీవీకేకు వ్యతిరేకమేనని ఈపీఎస్ స్పష్టం చేశారు. తమ కూటమి ఇప్పటికే ఉన్న విధంగానే కొనసాగుతుందని, ఇతర పార్టీలు చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అదే సమయంలో ‘డీఎంకే వస్తుందా?’ అంటూ ప్రశ్నించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో టీవీకే నేతృత్వంలోని కూటమి, డీఎంకే నేతృత్వంలోని ఫ్రంట్, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.మరోవైపు విజయ్ ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, ధరల పెరుగుదల, శాంతిభద్రతలు, డ్రగ్స్ సమస్య, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సీఎం విజయ్ నేరుగా సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.ఇప్పటికే అసెంబ్లీ వేదికగా విజయ్, డీఎంకే మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మాజీ డీఎంకే ప్రభుత్వంపై విజయ్ అవినీతి ఆరోపణలు చేయడంతో డీఎంకే సభ్యులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈపీఎస్ డీఎంకేతో కలిసి టీవీకేకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమంటూ సంకేతాలు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఇక, విజయ్ కూటమి బలం పెంచుకుంటున్న వేళ.. పాత ప్రత్యర్థులైన డీఎంకే-అన్నాడీఎంకే ఒకే వేదికపైకి వస్తాయా? ఈపీఎస్ వ్యాఖ్యలు నిజంగా పొత్తుకు సంకేతాలా? అన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.ఇదీ చదవండి: తమ్ముడు విజయ్.. నువ్వుచెప్పింది కరెక్టే: స్టాలిన్ -
12న మోదీ-జిన్పింగ్ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సెప్టెంబరు 12న న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు సందర్భంగా భేటీ జరిగే అవకాశముంది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖిగా ద్వైపాక్షిక చర్చలు జరపడం ఇదే తొలిసారి కానుంది. అయితే ఈ భేటీపై భారత్, చైనా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబరు 12, 13 తేదీల్లో భారత్ ఆతిథ్యంలో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు జిన్పింగ్ శనివారం న్యూఢిల్లీకి రానున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇటీవల కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో మోదీ, జిన్పింగ్ కలుసుకుని కరచాలనం చేసినప్పటికీ, అధికారిక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించలేదు.జిన్పింగ్ పర్యటనకు ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం కూడా జరిగింది. అనంతరం సరిహద్దు అంశంపై ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు చర్చించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పలు ఘర్షణ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణతో సంబంధాల్లో క్రమంగా స్థిరత్వం కనిపిస్తోంది.2020 జూన్లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. చైనా తన నలుగురు సైనికులు మరణించినట్లు తర్వాత వెల్లడించింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్ఠంభన, రాజకీయ, ఆర్థిక, దౌత్య సంబంధాల్లో తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. సైనిక, దౌత్య చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ విస్తృత సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.అరుణాచల్ప్రదేశ్ అంశం కూడా ఇరు దేశాల మధ్య కీలక వివాదంగా కొనసాగుతోంది. మొత్తం అరుణాచల్ను చైనా ‘జాంగ్నాన్’ లేదా దక్షిణ టిబెట్గా పేర్కొంటూ హక్కు కోరుతోంది. భారత్ ఆ వాదనను తిరస్కరిస్తూ అరుణాచల్ప్రదేశ్ దేశంలో అంతర్భాగమని స్పష్టం చేస్తోంది. ఇటీవల అప్పర్ సుబన్సిరి ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు, దూకుడు వైఖరిపై వచ్చిన నివేదికలు ఆందోళన పెంచాయి.మోదీ-జిన్పింగ్ భేటీలో సరిహద్దు సమస్య, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు, ఎల్ఏసీ వెంబడి మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు చర్చకు వచ్చే అవకాశముంది. బ్రిక్స్ సహా బహుపాక్షిక వేదికల్లో సహకారం పెంపుపైనా ఇరువురు నేతలు దృష్టి సారించే అవకాశం ఉంది. -
Gujarat: అర్థరాత్రి కూలిన భవనం.. శిథిలాల్లో కార్మికులు
గాంధీనగర్: గుజరాత్లోని గాంధీనగర్ కుడాసన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వాణిజ్య భవనంలో కొంత భాగం కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం రాత్రి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలాన్ని, గాంధీనగర్ సివిల్ ఆసుపత్రిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి.. తొలుత సుమారు 15 మంది కార్మికులు గాయపడినట్లు తెలిపారు. వారిలో ఇద్దరిని వైద్యులు పరీక్షించి, సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మిగిలిన గాయపడిన కార్మికులకు సివిల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం కుడాసన్లోని ‘బోస్కీ ది ఎంపైర్’ వాణిజ్య భవన నిర్మాణ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్లో కొంత భాగం ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ బ్రిగేడ్, విపత్తు నిర్వహణ బృందాలు క్రేన్లు, ఆధునిక పరికరాల సాయంతో శిథిలాలను తొలగించి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్సుల్లో గాంధీనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. Gandhinagar, Gujarat: Rescue operations are underway at the site of a building collapse in the Kudasan area of Gandhinagar. Deputy Chief Minister Harsh Sanghavi visited the site to assess the situation and oversee the ongoing rescue efforts https://t.co/6Wz6fPJXLu— IANS (@ians_india) September 9, 2026సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో ప్రాణనష్టం తప్పిందని ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్, డీజీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సీనియర్ పోలీసు అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 10 నుంచి 15 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని తొలుత సమాచారం అందింది. అత్యవసర బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో నిర్దేశిత భద్రతా ప్రమాణాలు పాటించారా? సెంటరింగ్, స్లాబ్ పనుల్లో నాణ్యతా లోపాలు లేదా ఇతర సమస్యలు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించనున్నారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.ఇది కూడా చదవండి: 1980ల ట్రెండ్ వెనుక ఏముంది? ఎందుకు వైరల్ అవుతోంది? -
‘కాక్రోచ్గా మారిపోవాలేమో!’.. మాల్యా సంచలన వ్యాఖ్యలు
బ్యాంకు రుణాల ఎగవేత, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యవహారం, మనీలాండరింగ్ ఆరోపణలతో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం బ్రిటన్లో ఉంటున్న ఆయన.. తనపై భారత ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ తాజాగా మరోసారి ఆరోపణలు చేశారు. తన ఆస్తులు, నిధుల నుంచి బ్యాంకులకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్లో వరుస పోస్టులు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మాల్యా చేసిన ఓ వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. తనపై జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘‘నేను ఎదుర్కొంటున్న, ఇప్పటికీ ఎదుర్కొంటున్న అన్యాయాలన్నింటినీ చూస్తుంటే.. నేను కాక్రోచ్గా మారిపోవాలేమో అనిపిస్తోంది. బహుశా కాక్రోచ్ వైపు జీవితం మెరుగ్గా ఉండొచ్చు’’ అని ఆయన ఎక్స్లో రాసుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) పేరు ప్రస్తావనకు వచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత చేసిన బొద్దింకల వ్యాఖ్యల నేపథ్యంలో సెటైరిక్ క్యాంపెయిన్గా పుట్టుకొచ్చింది సీజేపీ, అభిజిత్ దీప్కే నేతృత్వంలో పుట్టిన ఈ పార్టీ.. ఆ తర్వాత జంతర్ మంతర్ నీట్ నిరసనలతో దేశం చూపును ఒక్కసారిగా తమ వైపు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ మాల్యా చేసిన కామెంట్ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.With all the injustices I have faced and continue to face, I wonder if I should become a cockroach. Maybe a better life on the cockroach side.— Vijay Mallya (@TheVijayMallya) September 9, 2026రూ.14 వేల కోట్లపై మాల్యా వాదనతనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ మాల్యా ఈడీ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. బాంబే హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్లో.. తన నుంచి రూ.14 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులు, నిధులను స్వాధీనం చేసుకుని, వాటిని తాను బకాయిపడిన బ్యాంకులకు చెల్లించినట్లు పేర్కొందని ఆయన అన్నారు. 2021లోనే ఈ మొత్తాన్ని బ్యాంకులకు అందించినట్లు తెలిపారు.‘‘నా మాటలను నమ్మకపోతే పర్వాలేదు. కోర్టులో ఈడీ ఏం చెప్పిందో చూడండి’’ అంటూ తన వాదనకు మద్దతుగా మాల్యా పేర్కొన్నారు. తనపై భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఇప్పటికే తన ఆస్తులు, నిధుల నుంచి పెద్ద మొత్తంలో బ్యాంకులకు చెల్లింపులు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.కింగ్ఫిషర్ ఉద్యోగులకూ చెల్లింపులుకింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయాన్ని కూడా మాల్యా ప్రస్తావించారు. ఈడీ అటాచ్ చేసిన తన నిధుల నుంచి రూ.350 కోట్లకు పైగా విడుదల చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. తన వద్ద నిధులు ఉన్నప్పటికీ.. అవి ఈడీ అటాచ్ చేయడంతో తాను నేరుగా చెల్లింపులు చేయలేకపోయానని వివరించారు.ఇదే సందర్భంగా తన నివాసం, పౌరసత్వం, భారత్కు తిరిగి రావడం వంటి అంశాలపై వస్తున్న విమర్శలకు మాల్యా వివరణ ఇచ్చారు. బ్రిటన్లో శాశ్వత నివాస హోదా ఉండటం, అక్కడి పౌరసత్వం కలిగి ఉండటం రెండూ ఒకటి కాదని చెప్పారు. అలాగే బ్యాంకులకు బకాయిలు చెల్లించడానికి తాను తప్పనిసరిగా భారత్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.‘భగోడా’ వ్యాఖ్యలపైనా స్పందనభారత్కు తిరిగి రావడం లేదంటూ తనను ‘భగోడా’(పరారీలో ఉన్న వ్యక్తి) అని విమర్శిస్తున్న వారిపైనా మాల్యా ఇటీవల స్పందించారు. తాను 1992 నుంచే బ్రిటన్లో శాశ్వత నివాస హోదాలో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం బ్రిటన్ నుంచి బయటకు వెళ్లకుండా తనపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం తనపై తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. 2026 ఫిబ్రవరిలోనూ మాల్యా ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బ్రిటన్ కోర్టుల ఆంక్షల కారణంగా ఇంగ్లండ్, వేల్స్ నుంచి బయటకు వెళ్లలేనని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా దాన్ని కలిగి ఉండటం కూడా తనకు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు.కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల ఎగవేత, మోసం, మనీలాండరింగ్, ఆర్థిక అవకతవకలకు సంబంధించి మాల్యా భారత్లో పలు కేసులు ఎదుర్కొంటున్నారు. 2015లో ఐడీబీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తీసుకున్న రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత మాల్యాపై పలు కేసులు నమోదయ్యాయి. న్యాయపరమైన ఒత్తిడి పెరుగుతున్న సమయంలో 2016 మార్చిలో ఆయన భారత్ విడిచి బ్రిటన్ వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఆయనను భారత్కు తీసుకురావడం, బ్యాంకుల బకాయిలు వసూలు చేయడం వంటి అంశాలపై భారత్, బ్రిటన్లలో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.అయితే తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను మాల్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ‘కాక్రోచ్’ వ్యాఖ్యతో మరోసారి తనపై జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్నదంతా అన్యాయమేనన్న భావనతోనే ఈ వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఆమె రీ ఎంట్రీకి ఇదే మాంచి ఛాన్స్! -
ఆధార్ ఫేస్ అథెంటికేషన్కు కొత్త ఎస్డీకే ఆవిష్కరణ
బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, బీమా కంపెనీలు తమ మొబైల్ యాప్లలోనే ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ను నేరుగా అనుసంధానించుకునేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (ఎస్డీకే)తో పాటు ప్రత్యేక శాండ్బాక్స్ను ఆవిష్కరించింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026లో ఈ ప్రకటన వెలువడింది.ఈ కొత్త ఎస్డీకే వల్ల యూజర్లు వేర్వేరు యాప్లకు మారాల్సిన అవసరం లేకుండా ఒకే బ్యాంకింగ్, బీమా లేదా బ్రోకింగ్ యాప్లోనే ఆధార్ ఫేస్ ధ్రువీకరణను పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా ఫేస్ఆర్డీ(FaceRD) యాప్ అవసరమయ్యేది. ఇది వినియోగదారుల అనుభవాన్ని క్లిష్టతరం చేసేది.యూఐడీఏఐ ఛైర్మన్ నీల్కంఠ్ మిశ్రా మాట్లాడుతూ.. కొత్త ఎస్డీకే ద్వారా భాగస్వామ్య బ్యాంకులు తమ సొంత సర్వర్లపైనే ప్రామాణీకరణ(అథెంటికేషన్)ను నిర్వహించుకోగలవని చెప్పారు. తద్వారా యూఐడీఏఐ కేంద్రాలపై భారం తగ్గడంతో పాటు భద్రత మెరుగవుతుందని తెలిపారు. ప్రతిరోజూ వందలాది సైబర్ దాడులు జరుగుతున్నా తగిన భద్రతా చర్యలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 10 కోట్ల ఆధార్ ప్రామాణీకరణ లావాదేవీలు జరుగుతుండగా, భవిష్యత్తులో 25-30 కోట్లకు చేరుకునేలా మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్టు మిశ్రా చెప్పారు.కొత్త ఎస్డీకేలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్నెస్ డిటెక్షన్, స్పూఫింగ్ నిరోధక సామర్థ్యాలు ఉన్నాయి. దీంతోపాటు ఆవిష్కరించిన శాండ్బాక్స్ ద్వారా బాహ్య బయోమెట్రిక్ హార్డ్వేర్ అవసరం లేకుండానే డెవలపర్లు యూజర్ ప్రొవిజనింగ్, ఫేస్ క్యాప్చర్, లైవ్నెస్ చెక్లు, ఎర్రర్ హ్యాండ్లింగ్ వంటి దశలను పరీక్షించవచ్చు.2021లో ప్రారంభమైన ఈ ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థ ఇప్పటివరకు 500 కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది. జీవన్ ప్రమాణ్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాల్లో వినియోగిస్తున్నారు. అదనంగా, బీఎఫ్ఎస్ఐ రంగానికి మార్గదర్శకంగా ఈజ్ ఆఫ్ ఆన్బోర్డింగ్ ప్లేబుక్ను కూడా యూఐడీఏఐ విడుదల చేసింది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్పై వీసా మోసం ఆరోపణలు -
1980ల ట్రెండ్ వెనుక ఏముంది? ఎందుకు వైరల్ అవుతోంది?
న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం 1980ల నాటి ఫొటోల ట్రెండ్ వైరల్గా మారింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సాధారణ సెల్ఫీలను.. పెద్ద హెయిర్స్టైల్, పాతకాలపు దుస్తులు, ఫిల్మ్ గ్రెయిన్తో కూడిన రెట్రో ఫొటోలుగా మార్చుకుంటున్నారు. దశాబ్దాల క్రితం తాము ఎలా కనిపించి ఉండేవారమో ఊహించుకుంటూ, రూపొందించిన ఈ చిత్రాలను పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.చూడటానికి ఇది సరదా సోషల్ మీడియా ఛాలెంజ్లా కనిపిస్తోంది. ఇప్పటి యువత నాటి సాంకేతికత, భౌతిక మాధ్యమాలు, రెట్రో రూపకల్పన వైపు మొగ్గుచూపుతున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఇటీవల పేర్కొంది. పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో మరింత స్పష్టంగా, స్పృశించగలిగే అనుభూతిని కోరుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. మనస్తత్వవేత్త క్లే రౌట్లెడ్జ్ యువత తాము చూడని కాలాలపైనా ఎందుకు ఆకర్షితులవుతారో అధ్యయనం చేస్తున్నారు. ‘బిగ్ థింక్’లో ఇటీవల ప్రచురితమైన కథనంలో ఆయన దీనిని ‘హిస్టారికల్ నాస్టాల్జియా’గా పేర్కొన్నారు. నాస్టాల్జియా మన జీవితానికి అర్థం, సామాజిక అనుబంధం, సృజనాత్మకత, ఆశావాదాన్ని పెంపొందించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయని అన్నారు. ఆయన బృందం నిర్వహించిన సర్వేల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది తాము పుట్టకముందు కాలంపై ఆసక్తి కలిగి ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.అయితే 1980ల ట్రెండ్ నిజంగా ఆ కాలంలో జీవించాలనే కోరికను సూచించకపోవచ్చు. అప్పటి జీవనశైలి, ఫొటోలు, పాత సంగీతం, కుటుంబ ఆల్బమ్లు లేదా ఫోన్ లేకుండా కలిసి గడిపిన సమయం వంటి అనుభూతులనే కొందరు కోరుకుంటుండవచ్చు. ఈ ట్రెండ్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్మార్ట్ఫోన్లు, జనరేటివ్ ఏఐకి ముందున్న కాలాన్ని పునఃసృష్టించేందుకు నేటి అత్యాధునిక సాంకేతికతనే ఉపయోగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ‘యాడ్ యువర్స్’ లాంటి ఫీచర్ల ద్వారా వినియోగదారులు తమ రెట్రో చిత్రాలను రూపొందించుకుని, ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది కూడా చదవండి: రూ.14 కోట్లతో 33 ఏళ్లలో 233 దేశాలు చుట్టొచ్చాడు! -
బెంగాల్ రాజకీయాల్లో కొత్త సస్పెన్స్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో దారుణ ఓటమి.. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం.. టీఎంసీలో చీలిక.. ఇలా వరుస ఎదురుదెబ్బలతో మమతా బెనర్జీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని అంతా భావిస్తున్న వేళ.. ఆమెకు అనూహ్యంగా మరో అవకాశం తలుపుతట్టింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు ఇప్పుడు బెంగాల్లో కొత్త సస్పెన్స్కు తెరతీశాయి. రెండు స్థానాల్లో ఏదైనా ఒకదాని నుంచి దీదీ బరిలోకి దిగి.. మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మమతా బెనర్జీ అసెంబ్లీలో ఉంటే బీజేపీ, ఇతర ప్రతిపక్షాలను నేరుగా ఎదుర్కోవడంతోపాటు ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెను నందిగ్రామ్ లేదంటే రిజినగర్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్రంలో బలపడటం, టీఎంసీలో చీలికలు–ఫిరాయింపులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మమత స్వయంగా అసెంబ్లీలోకి రావడం పార్టీకి రాజకీయంగా కీలకమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే..2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన సువేందు అధికారి, హుమాయున్ కబీర్ చెరో స్థానానికి రాజీనామా చేయడంతో నందిగ్రామ్, రిజినగర్ అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాల్లో నందిగ్రామ్ మమతకు కొంత అనుకూలమైన ఎంపికగా కనిపిస్తోంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ సువేందు అధికారి చేతిలో మమత 1,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ సువేందు అధికారి టీఎంసీ అభ్యర్థిపై 9,665 ఓట్ల మెజారిటీ సాధించారు. అయినప్పటికీ మమత స్వయంగా బరిలోకి దిగితే పోటీ స్వరూపం మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ముర్షిదాబాద్ జిల్లాలోని రిజినగర్లో ముస్లిం ఓటర్లు సుమారు 65 శాతం ఉన్నారు. ఈ సామాజిక సమీకరణం మమతకు అనుకూలంగా మారొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో కాంగ్రెస్కు ఉన్న పాత రాజకీయ బలం దృష్ట్యా రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని టీఎంసీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు.ఈసీ షెడ్యూల్ ప్రకారం బుధవారం (సెప్టెంబర్ 9) ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ కాగా.. సెప్టెంబర్ 17న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుగుతుంది. సెప్టెంబర్ 19 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 6న నందిగ్రామ్, రిజినగర్ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.మరో సస్పెన్స్!ఇదిలా ఉండగా, ఉప ఎన్నికల్లో టీఎంసీకి అసలైన గుర్తు(గడ్డి కాడపై రెండు పూలు) దక్కుతుందా? అన్నది మరో కీలక ప్రశ్నగా మారింది. పార్టీ నుంచి విడిపోయిన రితబ్రత బెనర్జీ వర్గం తామే అసలైన టీఎంసీ అని ఇప్పటికే కోర్టుకెక్కింది. అటు ఎన్నికల సంఘంలోనూ అభ్యర్థన దాఖలు చేసుకుంది. అంతేకాదు ఆ రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని, పార్టీ గుర్తు తమకే వస్తుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. అయితే మమతా బెనర్జీ ప్రజల్లోనే ఉన్నారని, ఆమె తరఫున అభ్యర్థి తప్పకుండా పోటీ చేస్తారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ కూడా రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. మమత రెండు చోట్ల పోటీ చేసినా మరోసారి ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత సజల్ ఘోష్ వ్యాఖ్యానించారు. దీంతో ఉప ఎన్నికలు కేవలం రెండు స్థానాల పోరుగా కాకుండా.. మమతా బెనర్జీ రాజకీయంగా మళ్లీ అసెంబ్లీలోకి వస్తారా? టీఎంసీపై ఆమె పట్టు ఎంతవరకు ఉంది? పార్టీ గుర్తు ఎవరికి దక్కుతుంది? అనే మూడు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పే ఎన్నికలుగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: పేరుతోనే అసలు విషయం చెప్పేసిన విజయ్ -
నేడు లండన్ పర్యటనకు సీఎం విజయ్
సాక్షి, చెన్నై: సీఎం జోసెఫ్ విజయ్ పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా వారం రోజుల పాటు లండన్లో పర్యటించనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రి ఆయన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. సీఎం విజయ్ రాత్రి 10 గంటలకు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానంలో దుబాయ్ మీదుగా లండన్ వెళ్లనున్నారు. పర్యటన ముగించుకుని సెపె్టంబర్ 16న రాత్రి 8.30 గంటలకు తిరిగి చెన్నై చేరుకుంటారు. లండన్ పర్యటనలో భాగంగా ఆయన యూరోపియన్ వ్యాపారవేత్తలతో ప్రతినిధి స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. తమిళనాడులో కొత్త పరిశ్రమల స్థాపన, కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం Výæమనార్హం. -
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
అసెంబ్లీ వేదికగా స్టాలిన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి విజయ్ చేసిన ‘అవినీతి’ ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. అలాగే స్టాలిన్పైనా విజయ్ బాడీ షేమింగ్ చేయడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో స్టాలిన్ వాటిపై స్పందించారు. తన తండ్రి, డీఎంకే మాజీ సీఎం కరుణానిధి హయాంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ.. ‘‘తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది నిజమే. అబద్ధం కాదు’’ అంటూ ఈ ఉదయం ఓ వీడియోను రిలీజ్ చేశారాయన. తన తండ్రి కరుణానిధి, తనను విజయ్ టార్గెట్గా చేసుకోవడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో తన దవడ వెనుక కథ ఇదేనంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారాయన. ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి మెరీనా బీచ్లో భారీ సభ నిర్వహించి మీసా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని స్టాలిన్ గుర్తుచేశారు. అనంతరం 1976 జనవరి 31న కేంద్ర ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిందన్నారు. ఆ వెంటనే గోపాలపురం ఇంటికి పోలీసులు వచ్చి తనను మీసా కింద అరెస్టు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.‘‘ఆ రోజు నేను ఇంట్లో లేను. నా కొడుకు ప్రచారానికి వెళ్లాడు.. రేపు వస్తాడు. వచ్చిన వెంటనే నేనే ఫోన్ చేస్తా.. వచ్చి అరెస్టు చేసుకోండి’’ అంటూ కరుణానిధి పోలీసులను వెనక్కి పంపారని తెలిపారు. మరుసటి రోజు తాను ఇంటికి వచ్చిన తర్వాత కరుణానిధే పోలీసులకు ఫోన్ చేసి తనను అరెస్టు చేయించారని చెప్పారు. జైల్లో తనను తీవ్రంగా హింసించారని స్టాలిన్ పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులను ఉంచే ప్రదేశంలో చిన్న గదిలో పది మందిని బంధించారని, అదే గదిలో ఒకే కుండను మూత్ర విసర్జనకు ఉపయోగించాల్సి వచ్చేదని వివరించారు. రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా పోలీసులు లాఠీలతో కొట్టేవారని, బూట్లతో తన్నేవారని చెప్పారు. ఖైదీల దాడిలో ఎంపీ చిట్టిబాబు మరణించారని, తన దవడ ఎముక విరిగిందని తెలిపారు. నాటి దాడుల గాయాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు.‘‘మా సిద్ధాంత నాయకుడినని చెబుతున్నావు. పెరరింజర్ అన్నా(సి.ఎన్. అన్నాదురై) కాలం నుంచి ఇదే డీఎంకే చరిత్ర. అందులో నేనూ భాగం కావడం గర్వంగా ఉంది. ఎవరెంత తక్కువ చేసి చూపించాలని చూసినా చరిత్రను మార్చలేరు’’ అని స్టాలిన్ అన్నారు.సర్కారియా కమిషన్.. విజయ్కు మరో కౌంటర్అదే సమయంలో సర్కారియా కమిషన్, అవినీతి ఆరోపణలపైనా విజయ్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సర్కారియా కమిషన్ ఏర్పడిన తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అనేక ప్రభుత్వాలు మారాయని గుర్తుచేశారు. ఆ ఆరోపణల్లో నిజం ఉంటే ఇన్నేళ్లలో తప్పకుండా చర్యలు జరిగేవని అన్నారు. ఈడీ కేసులను ప్రస్తావిస్తూ కూడా విజయ్పై స్టాలిన్ విమర్శలు చేశారు. ఈడీ నమోదు చేసిన అనేక కేసుల్లో ఆరోపణలు నిరూపితం కాలేదని, నిందితులు నిర్దోషులుగా బయటపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈడీని ఉపయోగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కాంగ్రెస్ నేతలపైనా ఈడీ కేసులు పెట్టిన విషయాన్ని విజయ్ ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు.అసెంబ్లీని వివాదాలకు వేదిక చేయొద్దుతమిళనాడు అసెంబ్లీకి ఎంతో గౌరవం, చరిత్ర ఉందని.. అక్కడ ప్రజా సమస్యలపై చర్చ జరగాలని స్టాలిన్ సూచించారు. శాంతిభద్రతలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, తమిళనాడు హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చించాలని కోరారు. అనవసర వివాదాలను అసెంబ్లీలోకి తీసుకురావద్దని విజయ్కు హితవు పలికారు.విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటికి వచ్చి కలిసిన విషయాన్ని కూడా స్టాలిన్ గుర్తుచేశారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో తనపై విజయ్ తీవ్ర విమర్శలు చేశానని ఆయన చెప్పగా.. ‘‘పర్లేదు తమ్ముడూ.. వాటిని మనసులో పెట్టుకోను’’ అని తాను చెప్పినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఆ పదవికి తగ్గ హుందాతనం కనిపించాలని సూచించారు.‘సినిమా షూటింగ్లా పాలన’విజయ్ ప్రభుత్వ పనితీరుపైనా స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. తాము నిర్మించిన వంతెనపై నిలబడి ఫొటోషూట్లు చేయడం, అసెంబ్లీని రీల్స్కు వేదికగా మార్చడం సరికాదన్నారు. సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో హత్యలు, దొంగతనాలు, మహిళలపై నేరాలు పెరిగాయని, శాంతిభద్రతలు దిగజారిపోయాయని విమర్శించారు. పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేసి తమిళనాడు అభివృద్ధిని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. రైతులకు పూర్తి రుణమాఫీ, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు రూ.2,500 సాయం వంటి హామీల విషయంలోనూ విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విమర్శించారు.‘‘అప్పుడు చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నది మరొకటి. మార్పు కావాలని ఓటేసిన యువత ఇప్పుడు నిజంగా ఎలాంటి మార్పు వచ్చిందో గమనిస్తోంది’’ అని స్టాలిన్ అన్నారు.అధికారం లేకున్నా ప్రజల కోసం పోరాటమేచివరగా డీఎంకే కార్యకర్తలకు స్టాలిన్ కీలక సందేశం ఇచ్చారు. ప్రజలు పూర్తిగా తమకు మద్దతు ఇవ్వకపోవడంతో అధికారంలోకి రాలేకపోయామని, కానీ ప్రభుత్వం చేసే తప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ‘‘మనకేం సంబంధం’’ అనే ధోరణి ఉండకూడదన్నారు. అధికారంలో ఉండటం, లేకపోవడం రెండూ ప్రజాసేవలో భాగమేనని పేర్కొన్నారు. తమిళనాడు హక్కులు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం డీఎంకే ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘‘వాళ్ల(ప్రజలను ఉద్దేశించి..) తాతల కోసం పోరాడాం. వాళ్ల తండ్రుల కోసం పోరాడాం. ఇప్పుడు వాళ్ల కోసం పోరాడతాం. ఇదే డీఎంకే చరిత్ర. ఆ చరిత్ర ఎప్పటికీ మారదు.. మారకూడదు’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు.வீட்ல என்னை meet பண்ணப்ப சொன்னதை மறந்துட்டீங்களா தம்பி விஜய்? pic.twitter.com/kzpwXi14L8— M.K.Stalin (@mkstalin) September 10, 2026సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీలో పోలీస్ శాఖపై చర్చకు సీఎం విజయ్ సమాధానం ఇస్తూ.. ఎమర్జెన్సీ–MISA అంశాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో దవడ దగ్గర చేతితో హావభావం చేశారు. ఈ సైగపై డీఎంకే నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాలిన్ ఎమర్జెన్సీ సమయంలో పోలీసుల దాడిలో దవడ విరిగిన విషయాన్ని విజయ్ ఎగతాళి చేశారని ఆరోపించారు. వామపక్షాలు కూడా విజయ్ తీరును తప్పుబట్టాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం.. స్టాలిన్ గాయాన్ని హేళన చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అయితే దీనిపై సెప్టెంబర్ 8న విజయ్ వివరణ ఇచ్చారు. తన బాడీ లాంగ్వేజ్ అనుకోకుండా వచ్చిందని, ఎవరినీ వ్యక్తిగతంగా బాధపెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీజేపీకి చెక్ పెట్టేందుకే విజయ్కు తోడుగా.. -
ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
సాక్షి, చెన్నై : తమిళనాడు ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకే జిల్లాలో భార్యాభర్తలిద్దరూ కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా సిప్కాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి కేథరీన్ శరణ్యను వేలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించారు. ఈమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, కేథరీన్ శరణ్య భర్త శివరామన్ ఇప్పటికే వెలూరు జిల్లా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో ఆయన వెల్లూరు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయన భార్య కూడా అదే జిల్లాకు కార్పొరేషన్ కమిషనర్గా రావడం విశేషం. తొలి మహిళా కమిషనర్ రికార్డు 2008లో వెల్లూరు మున్సిపాలిటీని కార్పొరేషన్గా హోదా పెంచిన తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న తొలి మహిళా అధికారిగా కేథరీన్ శరణ్య రికార్డు సృష్టించారు. చదవండి: ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు -
బీజేపీ ‘మిషన్ 115’.. స్పెషల్ ఆపరేషన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన స్థానాలతోపాటు తాము బలహీనంగా ఉన్న స్థానాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో కచ్చితంగా గెలుపు బావుట ఎగురవేయాలని నిశ్చయించుకుంది.ఇందుకోసం నేరుగా కేంద్ర నాయకత్వమే రంగంలోకి దిగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇన్చార్జి వినోద్ తావ్డేలు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సంస్థాగత పరిస్థితి, సామాజిక సమీకరణాలు, ఓడిన సీట్లలో గెలుపు వ్యూహాలపై గురువారం నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నారు.ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన వ్యూహరచన 2022 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీలు బలంగా నిలిచిన 115 అసెంబ్లీ నియోజక వర్గాలపై బీజేపీ గురిపెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ప్రజల్లో పార్టీ ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. పార్టీ అగ్రనాయకత్వం ఆయా స్థానాల్లో పర్యటించబోతోంది. ఇందులో భాగంగానే నితిన్ నబిన్ సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మీరట్ నుంచి పశ్చిమ యూపీ పర్యటనను ప్రారంభిస్తారు.రాష్ట్రంలోని ఆరు కీలక ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 71 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. తమ కూటమిలోని పార్టీల బలాబలాలను సైతం అంచనా వేయడం, జాట్ వర్గాన్ని కలుపుకునేలా వారితో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన వ్యూహరచన సాగించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. బలం పెంచుకోవడానికి ప్రత్యేక బృందాలు బీఎల్ సంతోష్ ఈ నెల 10, 11 తేదీల్లో లక్నోలో అవధ్, కాన్పూర్ ప్రాంతాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అవధ్లో 82, కాన్పూర్లో 52 అసెంబ్లీ స్థానాల పరిధిలో పార్టీ పరిస్థితిని ఆయన సమీక్షిస్తారు. ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. వినోద్ తావ్డే ఇప్పటికే యూపీలో ఒక పర్యాయం పర్యటించారు. పార్టీ స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించారు. ప్రాంతీయంగా బ లం పెంచుకోవడానికి నేతలు, కార్యకర్తలతో కొన్ని బృందాలు ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆయన మరోసారి రాష్ట్రంలో పర్యటించి సంస్థాగత ఏర్పాట్లను పరిశీలించనున్నారు.2022లో ఓడిన అసెంబ్లీ స్థానాలు, 2024లో బీజేపీ వెనుకబడిన లోక్సభ స్థానాల్లో పార్టీని తిరు గులేని శక్తిగా మార్చడం, బలహీనతలను సరిదిద్దడం, సామాజిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకోవడం బీజేపీ ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. 2027లో జరిగే ఎన్నికలకు ముందే పార్టీని పూర్తిస్థాయిలో ఎన్నికల వాతావరణంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర నాయకత్వం వరుసగా యూపీ పర్యటనలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: విజయ్ కూటమికి కొత్త పేరు.. తమిళనాట కొత్త లెక్కలు -
‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి?
ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాల షూటింగ్లకు స్వర్గధామంగా నిలిచిన కశ్మీర్.. ఉగ్రవాదం కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఒకనాడు పదికి పైగా థియేటర్లతో సందడిగా కనిపించిన లోయలో చివరకు ఒక్క సినిమా హాలు కూడా లేకుండా పోయింది. థియేటర్లపై ఉగ్రవాదుల బెదిరింపులు, దాడులు, భద్రతా పరిస్థితులు, ప్రభుత్వ ప్రయత్నాలు.. ఇలా ఎన్నో పరిణామాల మధ్య కశ్మీర్లో సినిమా ప్రస్థానం ఎలా ఆగిపోయింది? మళ్లీ ఎలా పునరుద్ధరణకు నోచుకుంది?బాలీవుడ్కు కశ్మీర్ అంటే ఇష్టంకశ్మీర్ అందమైన లోయలు, ప్రకృతి దృశ్యాల కారణంగా 1989 వరకు హిందీ చిత్రాల నిర్మాతలకు అత్యంత ఇష్టమైన షూటింగ్ ప్రాంతంగా ఉండేది. షమ్మీ కపూర్, సైరా బాను నటించిన ‘జంగ్లీ’ (1961) నుంచి సన్నీ డియోల్, అమృతా సింగ్ నటించిన ‘బేతాబ్’ (1983) వరకు అనేక చిత్రాల షూటింగ్లు కశ్మీర్లోనే జరిగాయి. ఆ సమయంలో లోయలో పదికిపైగా సినిమా థియేటర్లు ఉండేవి. ఒక్క శ్రీనగర్లోనే తొమ్మిది థియేటర్లు నడిచేవి.1989.. ఉగ్రవాదం మొదలై..1989లో కశ్మీర్లో ఉగ్రవాదం మొదలైన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలు, ఉగ్రవాదుల లక్ష్యాలుగా మారాయి. 1989 ఆగస్టు 18న ‘అల్లా టైగర్స్’ అనే ఉగ్రవాద సంస్థ కశ్మీర్లో సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తనను తాను ‘ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్’గా చెప్పుకునే ఆ సంస్థ అధినేత ఓ విలేకరుల సమావేశంలో థియేటర్లు, మద్యం దుకాణాలను ‘ఇస్లామిక్ వ్యతిరేకమైనవి’గా పేర్కొంటూ యజమానులను వాటిని మూసివేయాలని హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే లోయలోని అన్ని సినిమా థియేటర్లు మూతపడ్డాయి.థియేటర్లకు కొత్త రూపాలుఉగ్రవాదం తీవ్రం కావడంతో భద్రతా బలగాలు కొన్ని థియేటర్లను తమ ఆధీనంలోకి తీసుకుని తాత్కాలిక శిబిరాలు, విచారణ కేంద్రాలుగా ఉపయోగించుకున్నాయి. మరికొన్ని థియేటర్లు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయి. సినిమా థియేటర్లు మూతపడిన తర్వాత భారత సైన్యం కొన్ని ప్రాంతాల్లో ప్రజల కోసం వాటిని తిరిగి తెరిచేందుకు ప్రయత్నించింది. బారాముల్లాలోని థిమయ్యా హాల్, పట్టన్లోని జోరావర్ హాల్ వంటి చోట్ల బ్యారక్లను తొలగించి ప్రజలకు సినిమాలు చూసే అవకాశం కల్పించారు. అయితే ఉగ్రవాదం మరింత పెరగడం, ఆత్మాహుతి దాడులు భద్రతా శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడంతో భద్రతా కారణాలతో వాటిని కూడా మూసివేశారు.1998లో తెరిచారు.. 1999లో భారీ దాడి1990ల మధ్యకాలంలో థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రయత్నాలు జరిగాయి. వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి థియేటర్ల పునఃప్రారంభాన్ని ప్రోత్సహించింది. 1998-99లో కశ్మీర్లో మూడు థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. శ్రీనగర్లోని అత్యంత భద్రత కలిగిన బదామీబాగ్ కంటోన్మెంట్లో బ్రాడ్వే, సివిల్ సెక్రటేరియట్ సమీపంలోని నీలం, నగరం మధ్యలోని రీగల్ థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే 1999 సెప్టెంబర్ 24న రీగల్ థియేటర్ పునఃప్రారంభమైన రోజే విషాదం చోటుచేసుకుంది. ‘ప్యార్ కోయీ ఖేల్ నహీ’ సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక పౌరుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. అనంతరం రీగల్ థియేటర్ శాశ్వతంగా మూతపడింది. ప్రస్తుతం అక్కడ భారీ షాపింగ్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది.మళ్లీ కశ్మీర్లో సినిమా సందడిబ్రాడ్వే, నీలం థియేటర్లు మాత్రం కొనసాగాయి. అయితే ప్రేక్షకుల కొరతతో ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. బ్రాడ్వే 2005లో మూతపడగా, నీలం థియేటర్ 2010 వరకు కొనసాగింది. 2005లో నీలం థియేటర్పై కూడా ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో మరోసారి కశ్మీర్ లోయలో ఒక్క సినిమా థియేటర్ కూడా లేకుండా పోయింది. అయితే 2022లో బ్రాడ్వే థియేటర్ యజమాని ధర్ కుటుంబం మరోసారి ప్రయత్నించింది. శ్రీనగర్లోని కట్టుదిట్టమైన భద్రత ఉన్న శివపోరా ప్రాంతంలో లోయలో తొలి మల్టీప్లెక్స్ ‘ఐనాక్స్’ను ప్రారంభించింది. మూడు స్క్రీన్లు, 520 సీట్ల సామర్థ్యంతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ ప్రస్తుతం ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్’ కోసం ఎంపికైన చిత్రాల ప్రదర్శనకు కేంద్రంగా మారింది. సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు జరుగుతున్న ఈ తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్ సహా ఇతర దేశాల కంటే ముందే బాలీవుడ్ చిత్రాల షూటింగ్ కశ్మీర్లో జరిగేదని చిత్ర పరిశ్రమకు గుర్తుచేయడమే ఫెస్టివల్ ఉద్దేశమని అన్నారు.ఇది కూడా చదవండి: ‘టచ్ చెయ్ చూద్దాం’.. ఇంజినీర్లకు హనుమంతుని సవాల్! -
విజయ్ కూటమికి కొత్త పేరు.. వాళ్లు దూరం.. తమిళనాట కొత్త లెక్కలు!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటమి ఆవిర్భవించింది. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతృత్వంలోని కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’గా పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ అధ్యక్షతన బుధవారం చెన్నైలోని పనైయూర్లో జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ కూటమిలో టీవీకేతో పాటు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉన్నాయి. కూటమి పేరులోనే మత సామరస్యం, సామాజిక న్యాయం, విజయ్ రాజకీయ గుర్తింపు కనిపించేలా రూపొందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి నాయకత్వం విజయ్దే అని నేతలు స్పష్టం చేశారు.వీసీకే నేత ఎస్ఎస్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ పేరు విజయ్ ఆలోచన నుంచి వచ్చిందని తెలిపారు. బీజేపీ, ‘ఫాసిస్టు శక్తులకు’ వ్యతిరేకంగా కూటమి పనిచేస్తుందనే విషయాన్ని పేరు స్పష్టం చేస్తుందని చెప్పారు. టీవీకే బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలకు కూడా దీనితో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్తో విభేదాల్లేవ్..ఇటీవల ‘విజయ్ ఫర్ పీఎం’ అంటూ టీవీకే వర్గాల్లో వినిపిస్తున్న నినాదాలపై కాంగ్రెస్లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే టీఎన్సీసీ అధ్యక్షుడు బి.మాణిక్కం ఠాగూర్ మాత్రం టీవీకే, కాంగ్రెస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. సరైన సమయంలో కూటమి ప్రధానమంత్రి అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్లు పెరగడం కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కూటమి జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్లో చేరుతుందా? అనే ప్రశ్నకు వీసీకే నేత బాలాజీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. టీవీకేకు ప్రస్తుతం ఎంపీలు లేరని, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వచ్చిన తర్వాత ఇండియా కూటమిలో చేరే అంశం ఉంటుందని చెప్పారు. దీంతో రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో జాతీయ రాజకీయాల వైపు కూడా విజయ్ అడుగులు వేయనున్నారా? అన్న చర్చ మొదలైంది.వామపక్షాలు మాత్రం దూరం..కూటమి ఏర్పాటులో మరో కీలక అంశం వామపక్ష పార్టీల గైర్హాజరు. సీపీఐ, సీపీఎం నేతలు సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో టీవీకేకు వామపక్షాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. తాజా కూటమి సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నాయి. అయితే టీవీకే నేత ఆధవ్ అర్జునా కమ్యూనిస్టు పార్టీలు త్వరలోనే కూటమిలో చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే, కూటమి తన రాజకీయ ప్రయాణాన్ని రాబోయే ఉప ఎన్నికలతో ప్రారంభించనుంది. అభ్యర్థుల ప్రకటన త్వరలో ఉంటుందని నాయకులు తెలిపారు. కూటమి భవిష్యత్ నిర్మాణం, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, స్టీరింగ్ కమిటీ వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు.టీవీకే 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్తో కలిసి అధికార కూటమికి అధికారిక రూపం ఇచ్చింది. మరోవైపు డీఎంకే నేతృత్వంలోని కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటములకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త ఫ్రంట్ నిలవనుంది. రాబోయే ఉప ఎన్నికల్లో ఈ మూడు శక్తుల మధ్య పోటీకి ఇది వేదిక కానుంది. అయితే విజయ్ నేతృత్వంలోని ఈ కూటమి ఎన్నికల కూటమిగానే కొనసాగుతుందా? లేదంటే తమిళనాడు రాజకీయాల్లో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: గెట్ రెడీ ఫర్ సీబీఐ రైడ్స్! -
రహదారులు ఇలాగేనా ఉండేది?
రాయ్బరేలీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఉత్తరప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గం రాయ్బరేలీలో పర్యటించారు. అమేథీ ఎంపీ కిషోరీ లాల్ శర్మతో కలిసి కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించేందుకు జరిగిన ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి మనోజ్ కుమార్ పాండే, ఉద్యానవన శాఖ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయ్బరేలీలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్వై) కింద నిర్మించిన రహదారుల దుస్థితిని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంతలమయమైన రోడ్ల ఫోటోలను ప్రదర్శించారు. వాటి నిర్మాణానికి బాధ్యత వహించిన ఏజెన్సీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏ రోడ్డుకు ఏ సంస్థ బాధ్యత వహిస్తుందో తెలిపే రికార్డులను నిర్వహించాలని పేర్కొన్నారు. దెబ్బన్న రోడ్లను మరమ్మతు చేస్తామని చేపడతామని పీఎంజీఎస్వై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హామీ ఇచి్చనట్లు దిశా కమిటీ నామినేటెడ్ సభ్యుడు ఉమేష్ బహదూర్ సింగ్ చెప్పారు. జిల్లాలోని రోడ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, ఫోటోల రూపంలో సాక్ష్యాలను సమరి్పంచిన తర్వాతే ఈ సమస్యను రాహుల్ గాంధీ లేవనెత్తారని వెల్లడించారు. దిశా సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. రాహుల్పై మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించడం కంటే వాటిలో లోపాలను వెతకడానికే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తప్పుపట్టారు. -
తల్లి కాళ్లు పట్టుకుని సారీ చెప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్తి తన పేరిట రాయాలంటూ తల్లిదండ్రులను వేధించిన ఒక కుమారుడికి సుప్రీంకోర్టు హితవు పలికింది. తక్షణం ఆమె పాదాలపై పడి క్షమాపణ వేడుకో అని ఆ కుమారుడిని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. చేసిన పాపానికి క్షమాపణ కోరాల్సిందేనని కోర్టు ఆదేశించింది. తల్లిదండ్రులకు చెందిన భవనంలోని మొదటి అంతస్తు నుంచి ఖాళీ చేయాల్సిందేనంటూ ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక వ్యక్తి వేసిన పిటిషన్ను కొట్టేస్తూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్కె సింగ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలుచేసింది. కేసు పూర్వాపరాల ప్రకారం.. తల్లిదండ్రుల పేరిట ఉన్న భవనంలో కుమారుడు, కోడలు మొదటి అంతస్తులో ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఆస్తిని తమ పేరున బదలాయించాలని కుమారుడు, కోడలు ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. నకిలీ పత్రాల ఆధారంగా ఆస్తిపై యాజమాన్య హక్కులు తమకే దక్కుతాయని దబాయిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో విసిగిపోయిన కన్నవాళ్లు ఇక కుమారుడితో అన్ని రకాల బాంధవ్యాలు తెంచుకుంటున్నట్లు పత్రికలో బహిరంగ ప్రకటన సైతం ఇచ్చారు. ఆస్తి కావాలంటూ తీవ్రంగా వేధిస్తున్న కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటి అంతస్తులో ఉండేందుకు గతంలో తాము ఇచి్చన అనుమతిని రద్దు చేస్తూ నోటీసు జారీ చేశారు. ఆస్తిని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆస్తిని స్వా«దీనం చేయాలని, ఇతరులు నివసించడంపై శాశ్వత నిషేధాజ్ఞలు విధిస్తున్నామని, ఇన్నాళ్లూ ఇంటిని ఉపయోగించుకున్నందుకు నష్టపరిహారం కోరుతూ తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆస్తి తల్లిదండ్రులకే దక్కుతుందని, దానికి పూర్తి యజమానులు వారేనని విచారణ అనంతరం ట్రయల్ కోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే ఇన్నాళ్లూ కుమారుడు, కోడలు ఆ భవంతిలో నివసించగలిగారని కోర్టు అభిప్రాయపడింది. నివాస అనుమతిని చట్టబద్ధంగా రద్దు చేసినందున మొదటి అంతస్తును ఖాళీ చేయాల్సిందేనని తీర్పునిచి్చంది. ఈ తీర్పును కుమారుడు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా ఏప్రిల్ 17వ తేదీన అక్కడా చుక్కెదురైంది. కింది కోర్టు తీర్పునే హైకోర్టు సమరి్థంచింది. దీంతో కుమారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కుమారుడిని ఉద్దేశించి మౌఖిక ఆదేశాలిచ్చారు. ‘‘తల్లి కాళ్లకు నమస్కరించి క్షమాపణ కోరాల్సిందే. మీరు చేసిన తప్పులు, పాపాలకు ప్రాయశి్చత్తం చేసుకోవాల్సిందే. అమ్మకు సారీ చెప్పి క్షమాపణ కోరు. క్షమిస్తే ఆశీర్వాదం తీసుకో’’అని ధర్మాసనం సూచించింది. కుమారుడి తరఫున వాదించిన లాయర్లనుద్దేశిస్తూ ‘‘తల్లి విషయంలో కుమారుడు చేసింది తప్పు కాదంటారా?’’అని జడ్జి సూటి ప్రశ్న వేశారు. -
ఆత్మాహుతి దాడే
న్యూఢిల్లీ: భారత దేశ చారిత్రక కట్టడాల్లో ఎర్రకోటకు ప్రత్యేక స్థానముండటంతో ఉద్దేశపూర్వకంగానే అక్కడ పేలుళ్లకు పథక రచన చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. గత ఏడాది నవంబర్ పదో తేదీన ఎర్రకోట సమీపంలో పేలుడు ముమ్మాటికీ ఆత్మాహుతి దాడి అని ఎన్ఐఏ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్ఐఏ తాజాగా కోర్టుకు సమర్పించిన చార్జ్షిట్లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. తొమ్మిది సంవత్సరాల క్రితం మాజీ హిజ్బుల్ మొజాహిదీన్ కమాండర్ జకీర్ రషీద్ భట్ స్థాపించిన అన్సార్ ఘజ్వత్–ఉల్–హింద్ ఉగ్రసంస్థను మళ్లీ క్రియాశీలకంగా మార్చేందుకు ఎర్రకోట ఆత్మాహుతి బాంబర్, వైద్యుడు ఉమర్ ఉన్ నబీ తీవ్రస్థాయిలో ప్రయత్నించాడు. ఆ సంస్థ(మాడ్యూల్)కు ఆపరేషనల్ ఇన్చార్జ్గా, మాస్టర్మైండ్గా మారాడు. చార్జ్షిట్లోని వివరాల ప్రకారం ఉమర్ ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్లో తన ఐ20 కారు ఆగిపోయినప్పుడు అత్యంత శక్తివంత పేలుడు పదార్థం(ఐఈడీ) డిటోనేటర్ను ఉపయోగించి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. దీంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి హఠాత్తుగా జరిగిందికాదని, దాదాపు మూడేళ్లపాటు పక్కా ప్రణాళికతో దాడికి యత్నించారని ఎన్ఐఏ తెలిపింది. ఎర్రకోటను భారత గణతంత్ర రాజ్యాంగానికి ప్రతిబింబంగా భావిస్తుండటంతో అక్కడే పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టించాలని ఉమర్ గతంలోనే నిర్ణయించుకున్నాడు. 2023లోనే పలుమార్లు ఉమర్, అతని మాడ్యూల్ సభ్యులు పలుమార్లు ఎర్రకోట పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. అయితే 2025 నవంబర్ నెలలోనే పేలుడు మాత్రం ముందే అనుకున్నది కాదని, శ్రీనగర్ తదితర నగరాల్లో మాడ్యూల్ సభ్యుల వరసబెట్టి అరెస్టులతో కంగారుపడిన ఉమర్ ఒంటరిగానైనా పేలుడు జరపాలని ఆఖరి నిమిషంలో నిర్ణయించుకుని కారుబాంబుతో పేల్చేసుకున్నాడని చార్జ్షిట్లో ఎన్ఐఏ పేర్కొంది. ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్(టీఏటీపీ), అమ్మోనియం నైట్రేట్ల మిశ్రమంగా పేలుడుపదార్థాలతో నింపి కారును వెహికల్–బోర్న్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్(వీబీఐఈడీ)గా మార్చి కమాండ్ మెకానిజంతో పేల్చేశారు. అరేబియా ద్వీపకల్పంలోని అల్–ఖైదా ఉగ్రసంస్థ భారత్లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా యువతను ఉగ్రవాదభావజాలంతో టెర్రరిజంలోకి దింపేందుకు, దాడులు చేసేందుకు ‘ఒంటరి మొజాహిదీన్ ఆత్మాహుతి బాంబర్గా మారడం ఎలా?’అనే మాన్యువల్ను తయారుచేసింది. దీనికి మతఛాందసవాద యువతలో విస్తృత ప్రచార కల్పించేందుకు దుస్సాహసంచేసిందని ఎన్ఐఏ పేర్కొంది. పేలుడు పదార్థాల తయారీ, ఆయుధాలను ఉపయోగించే తీరు, కోవర్ట్ ఆపరేషన్లు చేయడం, జట్టుగా ఉండకుండా ఒంటరిగా ఉంటూ దాడులుచేయడం, ఆత్మాహుతి దాడులకు పాల్పడటం వంటి అంశాలు ఈ డాక్యుమెంట్లో ఉన్నాయి. ‘జిహాద్ అంటే ఏమిటి?, జిహాద్కు ఉండాల్సిన అర్హతలు, జిహాద్లోని 21 లక్ష్యాలు, జిహాద్ ద్వారా చేయగల 39 రకాల సేవలు, జిహాద్లో ఎలా పాల్గొనాలి? జిహాద్కు మద్దతిచ్చేందుకు 44 మార్గాలు ఇలా పలు రకాల అంశాలు అందులో ఉన్నాయి. సాయుధ హింసను ప్రోత్సహించి తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను పడగొట్టి జిహాద్ను మతపరమైన విధిగా ఎలా పాటించాలో అందులో పేర్కొన్నారు. అన్సార్ ఘజ్వత్–ఉల్–హింద్ మాడ్యూల్ సభ్యుల మధ్య సమావేశాలు ఏర్పాటుచేయడం, సిగ్నల్ వంటి ఎన్క్రిపె్టడ్ యాప్ల ద్వారా రహస్య మంతనాలు జరపడం, పేలుడు పదార్థాల తయారీకి ప్రమాదకర రసాయనాలను గంపగుత్తగా కొనుగోలుచేయడం, బాంబుల తయారీ, నిధుల సమీకరణ, యువతను ఉగ్రవాదంలోకి రావాలని ప్రోత్సహించడం వంటి నేరాలకు ఉమర్ పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. -
బీసీల ఉద్ధారకుడు వైఎస్ జగనే
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘ఉత్తరాంధ్రలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో 60 నుంచి 70 శాతం మంది బీసీలే. వారి సంఖ్యను కలిపేసి రాష్ట్రంలో బీసీల నిష్పత్తిని చూపిస్తున్నారు. అసలు అన్ని కులాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కప్పిపుచ్చి, ఒక్క బీసీలకే 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే కల్పించినట్లు మసిపూసి మారేడుకాయ చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 20 ఏళ్ల పాలనలో బీసీలకు ఎన్నికలకు ముందు తాయిలాలు తప్ప వారి అభివృద్ధికి చేసింది శూన్యం. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా బీసీల సర్వతోముఖాభివృద్ధి ఎలా చేయాలో చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. బీసీల ఉద్ధారకుడు ఆయన మాత్రమే. బీసీల కోసం చంద్రబాబు చేసింది శూన్యం. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకొనే నైతికహక్కు చంద్రబాబుకు లేనేలేదు’ అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన బుధవారం న్యూఢిల్లీలో ‘సాక్షి’తో మాట్లాడారు. బీసీల కృతజ్ఞత సభ అంటూ నర్సీపట్నంలో పుష్పాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేయించుకున్నంత మాత్రాన బీసీల ఉద్ధారకులు అయిపోరని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో, రాజకీయ సభల్లో ఇచ్చే హామీల కన్నా, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించారనేదే ఒక పార్టీ తమది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి ప్రామాణికం అవుతుందని చెప్పారు. అలా చెప్పుకోదగిన ప్రయోజనమేదైనా చంద్రబాబు చేశారేమో చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో బీసీలకు ఏయే ప్రయోజనాలు కల్పించారో చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయన్నారు.చట్టసభల్లో బీసీలకు జగన్ పెద్దపీటవిభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో బీసీలకు చట్టసభల్లో పెద్దపీట వేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పారు. ఒకేదఫా నలుగురు బీసీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారని గుర్తుచేశారు. అది చాలా గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఆ స్థాయిలో బీసీలను రాజ్యసభకు పంపారా? అని ప్రశ్నించారు. ‘శాసనమండలిలో 2023లో 18 స్థానాలు ఖాళీ అయితే, 11 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు.మొత్తం 44 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల్లో 19 మంది బీసీ నాయకులే. గతంలో ఎప్పుడూ బీసీలకు అంత పెద్దసంఖ్యలో ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్రెడ్డి 25 లోక్సభ స్థానాలకుగాను 11 చోట్ల బీసీలకే టికెట్ ఇచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 48 చోట్ల బీసీ అభ్యర్థులనే నిలబెట్టారు. మొత్తం బీసీలకు 59 సీట్లు అంటే దాదాపు చట్టసభల్లో 30 శాతం రిజర్వేషన్లు ఆయన చెప్పకుండానే ఇచ్చారు’ అని వివరించారు. ఇలా బీసీలకు చట్టసభల్లో అగ్రస్థానం కల్పించి, తమ అభిప్రాయాలను, నిర్ణయాలను గళమెత్తి చెప్పడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కేబినెట్లో బీసీ మంత్రులెందరు? తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే పూర్వం ఎన్.టి.రామారావు బీసీ పట్ల కాస్త ఉదారంగా ఉండేవారని చెప్పారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఎన్నికల్లో భారీ హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనబెట్టేసే చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులిచ్చారో చూస్తే అసలు విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 11 మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారని గుర్తుచేశారు. బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఏది? రాష్ట్రంలోని బీసీలకు ఏంకావాలో చూడాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏనాడూ లేదని విమర్శించారు. ఉదాహరణకు బీసీల్లో ఒకరైన లక్షలాదిమంది మత్స్యకారులు సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్న ఈ రాష్ట్రాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారంటే చంద్రబాబు తన 20 ఏళ్ల పాలనలో వారి అభివృద్ధికి ఏం చేసినట్లని ప్రశ్నించారు. వారికోసం ఒక్క ఫిషింగ్ హార్బర్ను కూడా నిర్మించలేదన్నారు. జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తలపెట్టారని గుర్తుచేశారు. వాటిలో కొన్ని నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కొన్నింటిని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆపేశారని విమర్శించారు. బీసీల విద్యకు జగన్ ప్రాధాన్యం తరతరాలుగా వ్యవసాయం, చేతివృత్తుల్లోనే ఉన్న బీసీలు పారిశ్రామికీకరణ తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో వారిని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య మాత్రమేనన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ, పేద కుటుంబాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసే పాలసీలనే అమలుచేస్తున్నారని విమర్శించారు. అందుకు భిన్నంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మాత్రమే పేద కుటుంబాల్లోని విద్యార్థులకు విద్యను చేరువచేసే ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి వంటి సంక్షేమ పథకాలను చేపట్టారని గుర్తుచేశారు. వారి పేదరికం ఏరోజూ వారి చదువుకు అడ్డుకాకుండా చేయగలిగిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కుతుందన్నారు. చంద్రబాబు ఆ పథకాలను నీరుగారుస్తూ తిరోగమన విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. బీసీల అభివృద్ధి జగన్ పాలనతోనే తెలిసిందిఅంతవరకు బీసీలకు చిన్నచిన్న తాయిలాలతోనే చంద్రబాబు పాలన సాగిందని, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి ఇంత చేయవచ్చా అని తెలిసిందని చెప్పారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేదల్లో ఎక్కువమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలేనన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 వేల ఎకరాలను సేకరించి, దాదాపు 30 లక్షలమంది మహిళలకు ఇచ్చిన ఇళ్లపట్టాల్లో ఎక్కువ లబ్దిపొందింది బీసీ సామాజికవర్గాలేనని చెప్పారు. మరి చంద్రబాబు గత రెండేళ్ల పాలనలో పేదవారి కోసం ఒక్క సెంటు భూమి అయినా సేకరించారా? అని ప్రశ్నించారు. ధనవంతులైన పారిశ్రామికవేత్తలకు మాత్రం రూపాయికి, పావలాకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. తాము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని, కానీ భూపంపిణీ విధానమే సరైంది కాదని చెబుతున్నామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలను కూడా వ్యాపార, వాణిజ్య, ఐటీ, పారిశ్రామికరంగాల్లో ప్రోత్సహించే చర్యలనే ఏ ప్రభుత్వమైనా చేపట్టాలన్నారు. ఆ పనిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని చెప్పారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో బీసీలే కాదు అన్ని సామాజికవర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనే మాట వినిపిస్తోందని తెలిపారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారుమళ్లీ ఇప్పుడు స్థానికసంస్థల ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ఇంకా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాయమాటలను మళ్లీ నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. చంద్రబాబు గారడీ మాటలపై బీసీలను చైతన్యం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలుత ఐదు రీజియన్ల వారీగా, తర్వాత దఫాలో 25 జిల్లా కేంద్రాల్లో, 175 నియోజవర్గాల వారీగా ఈ సభలు నిర్వహిస్తామని వివరించారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందీ, చంద్రబాబు పాలనలో ఏం మోసం జరిగిందీ వివరిస్తామన్నారు. ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలో, బీసీల నుంచి ఎలాంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాలో నిర్ణయిస్తామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో రెండు రైల్వే ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) దేశవ్యాప్తంగా రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 17 జిల్లాల మీదుగా ఐదు ప్రాజెక్టులు నిర్మించనున్నారు.ఇందులో భాగంగా ఏపీ పరిధిలో రేణిగుంట–అరక్కోణం మార్గంలో 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైను పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పనులను 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద రూపొందించారు. తద్వారా ప్రజల రాకపోకలతో పాటు సరుకు రవాణా అత్యంత సులభతరం కానుంది. పనులు పూర్తయితే రైల్వే నెట్వర్క్ సామర్థ్యం పెరిగి రైళ్ల రద్దీ తగ్గుతుంది. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు మహర్దశ ఈ రైల్వే లైన్ల విస్తరణ పనులతో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడనుంది. ఏపీలోని తిరుపతి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాలకు, తెలంగాణలోని యాదగిరి గుట్ట ఆలయానికి ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మొత్తంగా ఐదు ప్రాజెక్టుల వల్ల సరుకు రవాణా సామర్థ్యం పెరగడంతోపాటు, ఇంధన ఆదాతో పాటు పర్యావరణానికి భారీ ప్రయోజనం కలగనుంది. వాతావరణంలోకి 42 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది సుమారు 2 కోట్ల చెట్లను నాటడంతో సమానమని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
కొద్దిగా తాగినా మద్యం మద్యమే
మద్యం సేవించడం పట్ల ‘ప్రతిరోజూ అత్యంత పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు’ అనే అపోహ ఉండేది. కానీ అది మౌత్, బుక్కల్ మ్యూకోసా (బుగ్గ లోపల) క్యాన్సర్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతుంది. మద్యం సేవనం లాలాజల ప్రవాహాన్ని తగ్గిస్తుంది, మైక్రోబయోమ్ అసమతుల్యతకు దారితీస్తుందని హార్వర్డ్ హెల్త్ ప్రచురించింది. » మద్యం సేవించడంలో సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వంటి ప్రముఖ సంస్థలు స్పష్టం చేశాయి. ఉదాహరణకు రోజుకు ఒక గ్లాసు వైన్, బీర్ లేదా ఒక షాట్ స్పిరిట్స్ తీసుకునే అలవాటు వల్ల ‘నోరు, గొంతు, అన్నవాహిక, రొమ్ము, పేగు, కాలేయం క్యాన్సర్లను దరికి చేరుస్తుందని ఆ సంస్థలు హెచ్చరించాయి.» తక్కువ మోతాదు కూడా ఇంత హాని కలిగిస్తుందా అనే సందేహానికి వారి వివరణ ఒక్కటే. మద్యం (ఇథనాల్) ఎంత పరిమాణంలో ఉన్నా అది కణాలకు నష్టం కలిగిస్తుంది. ప్రాథమికంగా అది జీవసంబంధమైన యంత్రాంగం మీద ప్రభావం చూపిస్తుంది. » శరీరం ఆల్కహాల్ని విచ్ఛిన్నం చేసే క్రమంలో దానిని అసిటాల్డిహైడ్ అనే విషపూరిత రసాయనంగా మారుతుంది. ఇది క్యాన్సర్ కారకం. కణాల మరమ్మతు ప్రక్రియను అడ్డుకుంటుంది. డీఎన్ఏ దెబ్బతింటుంది.» మద్యం ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల స్థాయులను పెంచుతుంది. అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రోజుకు ఒక్క పెగ్ తీసుకున్నా సరే బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 14 శాతం పెరిగినట్లే.» నోరు, గొంతు నుంచి కడుపులోకి చేరే క్రమంలో ఆల్కహాల్ ఒక ద్రావకంలా పనిచేస్తుంది. పర్యావరణ విషపదార్థాలు కణాల్లోకి సులభంగా చొచ్చుకుని పోయి ఉత్పరివర్తనాలను కలిగిస్తాయి. కణజాలం మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి. » మద్యాన్ని అధిక మోతాదులో సేవించడం వల్ల కలిగే ప్రమాదాలు అత్యధికంగా ఉంటాయి. తక్కువ మోతాదు కలిగించే ముప్పు కూడా చిన్నదేమీ కాదు, కాబట్టి క్యాన్సర్ నివారణకు మద్యం సేవించకపోవడమే ఉత్తమమని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మార్గదర్శకాలను విడుదల చేసింది.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
పిల్లలు ఏఐ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు!
ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్నది స్కూల్ పిల్లలే. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, పిల్లలు పెద్దల కంటే మూడు రెట్లు వేగంగా కృత్రిమ మేధ సాంకేతికతలను స్వీకరిస్తున్నారు. లక్షలాది మంది పిల్లలు హోంవర్క్ చేయడానికి చాట్బాట్ల సహాయం తీసుకుంటున్నారు. కౌమారదశలో ఉన్న వారు స్కూల్ ప్రాజెక్టులు చేయడానికి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ఏఐని అనుసంధానం చేస్తున్నారని ఇటీవలి ప్రపంచ స్థాయి గణాంకాలు చూపిస్తున్నాయి. » లక్షలాదిమంది పిల్లలు తమ సందేహాలు తీర్చుకోవడానికి ఏఐ మీద ఆధారపడుతున్నారు. బాల్యంలో కలిగే సందేహాలు ఒక ఎత్తయితే, కౌమారంలోకి అడుగుపెట్టినప్పుడు అనేక సందేహాలు వేధిస్తుంటాయి. పెద్ద వాళ్ల దగ్గర వ్యక్తం చేయడానికి సంకోచించే సందేహాల నివృత్తి కోసం ఏఐని ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత ఆందోళనల నుంచి బయటపడడానికి మార్గాలను చూపించమని కోరుతున్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కడానికి కూడా చాట్బాట్లనే ఎంచుకుంటున్నారు.» యూనిసెఫ్ కొన్ని దేశాల్లో ఏఐ వినియోగం మీద సర్వే నిర్వహించింది. ఈ ఏడాది జూన్లో విడుదల చేసిన ఆ నివేదిక ప్రకారం ‘పిల్లలు పెద్దవాళ్ల కంటే మూడురెట్లు ఎక్కువ వేగంతో కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటున్నారు. 20 మిలియన్లకు పైగా పిల్లలు ఏఐని ఉపయోగిస్తుండగా, వారిలో 13 మిలియన్ల మంది పాఠశాల పని కోసం, 2 మిలియన్ల మంది జీవిత సలహాల కోసం వాడుతున్నారు.» కెనడా 2026 అధ్యయనం ప్రకారం పిల్లల్లో ఐదుగురిలో ఒకరు ఏఐ నుంచి ఎమోషనల్ సపోర్టు తీసుకుంటున్నారు. ముఖ్యంగా న్యూక్లియర్ కుటుంబాల్లో సింగిల్ చైల్డ్ ఒంటరితనం కారణంగా ఏఐని ఫ్రెండ్గా మార్చుకుంటున్నారు.» కామన్సెన్స్ మీడియా, ప్యూ రీసెర్చ్ సెంటర్ల సర్వేల నివేదిక ప్రకారం 64 నుంచి 70 శాతం టీనేజర్లు సమాచారం వెతకడానికి, మేధోమథనం చేయడానికి, హోమ్వర్క్ చేయడానికి ఏఐ చాట్బాట్లను వాడుతున్నారు.ప్రమాదాలూ ఉన్నాయి!» కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్: ఏఐ షార్ట్కట్లపై ఎక్కువగా ఆధారపడటం వలన జ్ఞానం మెదడు పొరల్లో దీర్ఘకాలం నిక్షిప్తం కాలేదు. ఏకాగ్రతతో అభ్యసించడం ద్వారా మెదడు అభివృద్ధి చెందుతుంది. ఏఐ ఈ ప్రక్రియకు ఆటంకం.» ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) వంటి విద్యా నివేదికలు మితిమీరిన ఏఐ వాడకం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రోజువారీ పాఠ్యాంశాల అభ్యాసంలో ఏఐని వాడడం వల్ల పరీక్షల్లో మార్కులు తగ్గడం, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు క్షీణించడం వంటి ప్రమాదాలను హెచ్చరిస్తున్నాయి. » ఏఐ గొప్ప ట్యూటర్గా పని చేస్తోంది, తక్షణం ఫలితాలనిస్తుంది. కానీ ఆ సాధనం లేకుండా సొంతంగా మెదడుతో ఆలోచించి పనిచేసే సామర్థ్యాన్ని పెంచడం లేదని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ స్పష్టం చేసింది.» అత్యంత ఆందోళన కలిగించే అంశం తప్పుడు సమాచారం. స్కామ్, సామాజిక అంశాల విషయంలో పక్షపాత ధోరణితో, అర్ధవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా కూర్చిన సమాచారాన్ని నూరుశాతం నిజమని నమ్మే ప్రమాదం లేకపోలేదు.» బహిర్గతమైన భయాలు: మూడింట ఒక వంతు మంది పిల్లలు ఆన్లైన్ మోసాలు, తప్పుడు సమాచారం గురించి ఆందోళన చెందుతుండగా, నాలుగింట ఒక వంతు మంది లైంగికంగా అసభ్యకరమైన డీప్ఫేక్లకు భయపడుతున్నారు.వాస్తవాన్ని గుర్తించడం...ఏఐ రూపొందించిన కంటెంట్ను, మనిషి సృష్టించిన కంటెంట్ నుంచి వేరు చేసి చెప్పడంలో పిల్లలు ఇబ్బంది పడతారు. పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ తేడాను గుర్తించే కచ్చితత్వం తగ్గుతుందని ‘నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్’ చెబుతోంది.» తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అభ్యాసం కొనసాగితే అర్ధవాస్తవాలను, పక్షపాత ధోరణి సమాచారాన్ని వడపోసి పిల్లలను కచ్చితమైన సమాచారం వైపు నడిపించడం జరుగుతుంది. ఏఐ విషయంలో అలాంటి భద్రత లేకపోవడం ఆలోచించాల్సిన అంశం అని విద్యావేత్తల సూచన. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
మామిడి పండు చూడ మేలిమై యుండును.. పొట్ట విప్పి చూడ..
(సాక్షి, స్పెషల్ డెస్క్) : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా ఉంది మన మామిడి సంగతి. ప్రపంచంలోనే రుచికరమైన మామిడి పండ్లను భారత్ ఉత్పత్తి చేస్తోంది. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రీమియం ఎగుమతి మార్కెట్లలో మన మామిడి తీవ్ర ఆంక్షలు, తిరస్కరణలను ఎదుర్కొంటోంది. విదేశీ వినియోగదారులు మంచి ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా, నాణ్యత లోపాల వల్ల భారతీయ రైతులు, ఎగుమతిదారులు ఏటా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈ సంక్షోభానికి బహుళ కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టు సాగుతో కష్టాలు దేశంలో సుమారు వెయ్యి మామిడి రకాలున్నప్పటికీ, మార్కెట్లో గిరాకీ కలిగినవి 24 ప్రధాన రకాలు మాత్రమే. వీటిల్లో మన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగయ్యే బంగినపల్లి, చిన్నరసం, పెద్దరసం అగ్రస్థానంలో నిలిచాయి. మామిడి తోటల యజమానుల్లో అత్యధికులు నగరాల్లో నివసిస్తూ తోటలను కాలానికి కాంట్రాక్టర్లకు లీజుకిస్తున్నారు. కేవలం మూడు నెలల సీజన్ లో వచ్చే తాత్కాలిక లాభాలపై తప్ప, తోట దీర్ఘకాలిక ఆరోగ్యంపై కాంట్రాక్టర్లకు శ్రద్ధ ఉండదు. తక్కువ సమయంలో పంటను కాపాడుకోవటానికి విచక్షణారహితంగా సింథటిక్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు వాడుతున్నారు. నాసిరకం పురుగు మందులను అవసరానికి మించి పిచికారీ చేస్తున్నారు. ఫలితంగా పురుగు మందులను తట్టుకునే శక్తిని చెట్లు పెంచుకుంటున్నాయి. వీటివల్ల కాయ పైకి నిగనిగలాడేలా కనిపించినా, నాణ్యత ఉండటం లేదు. కాయల్లో పండు ఈగ వంటి పురుగులతో పాటు ప్రమాదకర రసాయనాల అవశేషాలు నిండిపోతున్నాయి. ఆంక్షలు.. తిరస్కరణలు పండ్లలో పురుగుల బెడద, అధిక రసాయన అవశేషాల కారణంగా విదేశీ తనిఖీ సంస్థలు భారతీయ మామిడి కన్సైన్మెంట్లను వెనక్కి పంపుతున్నాయి. వేపర్ హీట్ ట్రీట్మెంట్ కేంద్రాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు లోపించటంతో జపాన్ దిగుమతులను నిలిపివేయగా, అధిక పురుగుమందుల అవశేషాలున్నాయనే ఆరోపణలతో నేపాల్ ఇటీవల సరిహద్దుల్లో కఠిన నిబంధనలు తెచ్చింది. గతంలో యూరోపియన్ యూనియన్ కూడా భారతీయ మామిడిపై నిషేధం విధించింది. అమెరికాకు ఎగుమతి చేయడానికి నిర్దేశించిన నాన్–టారిఫ్ ఆంక్షలు దాటటం సాధారణ రైతులు, ఎగుమతిదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుతం మన ఎగుమతుల్లో మూడోవంతు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితమవుతోంది. సాగు పద్ధతి మార్చాలి.. మామిడి రైతులు రసాయన రహిత ఆధునిక సాగు పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి. నిరంతర వ్యక్తిగత పర్యవేక్షణ అత్యవసరం. బాధ్యతారహితంగా తోటలను నిర్వహించే కాంట్రాక్టర్ల చేతులకు తోటలను వదిలేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో క్రిమిసంహారకాల వాడకం తగ్గించి, ఫైటోశానిటరీ ప్రమాణాలు పాటిస్తేనే ప్రపంచ మార్కెట్లో భారతీయ మామిడికి అసలైన గిట్టుబాటు ధర లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించాలి భూయజమానుల నిర్లక్ష్యం, నాణ్యత లేని రసాయన వ్యవసాయం మన మామిడి ఎగుమతులను దెబ్బ తీస్తున్నాయి. బంగినపల్లికి మంచి నిల్వ సామర్థ్యం ఉన్నా ఏపీ, తెలంగాణల్లో ఇర్రేడియేషన్, ప్యాక్హౌస్ వసతులు లేవు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పదేళ్లకు పైగా మామిడి సాగు చేస్తూ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాను. అమెరికాలో, గల్ఫ్ దేశాల్లో డోర్ డెలివరీ చేస్తున్నాం. ఈ ఏడాది యూరప్కూ విస్తరిస్తున్నాం. మామిడి ఎగుమతి సీజన్ కేవలం 45–60 రోజులే. పేపర్వర్క్, ఎయిర్ ఫ్లైట్పై జీఎస్టీ పెనుభారంగా మారాయి. ప్రభు త్వం రసాయనాలకు సబ్సిడీలు ఆపి, సహజ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఎగుమతులు పెంచేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించటంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. – గుమ్మడపురం రఫీ, మేనేజింగ్ డైరెక్టర్, ఏఆర్4 ఫ్రెష్ ఇంటర్నేషనల్ -
ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే కేసులో ఇరికించారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఒక కేసులో అరెస్టు చేసి, అందులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాని మరో కేసులో ముద్దాయిగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ పోలీసుల దర్యాప్తు తీరును తప్పుబడుతూ దీనిని పూర్తిగా ’రివర్స్ ఇంజనీరింగ్’ కేసుగా అభివర్ణించింది. ఈ కేసులో 11 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన పులి ఓబులేసుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పులి ఓబులేసు దాఖలు చేసిన ఎస్ఎల్పీ (క్రిమినల్)పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పోలీసుల దర్యాప్తు తీరుపై ధర్మా సనం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘మీరు అతడిని ఒక కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు నేరం అంగీకరించాడని చెప్పి ఈ కేసులో ఇరికించారు. ఆ తర్వాతే ఫిర్యాదుదారుడిని సృష్టించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదొక రివర్స్ ఇంజనీరింగ్ కేసు‘ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి పిటిషనర్ను బెయిల్పై విడుదల చేయాలని పేర్కొంది.అసలేం జరిగిందంటే...: 2014 నవంబర్ 19న హైదరాబాద్లో కేబీఆర్ పార్కు వద్ద ఆడి కారులో కూర్చున్న ఓ వ్యక్తి వద్దకు పులి ఓబులేసు తుపాకీతో వెళ్లి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడు ప్రతిఘటించడంతో కారు అద్దంపై కాల్పులు జరిపాడు. బాధితుడి సోదరుడు అడ్డు కోగా, అతడిని కొరికి తుపాకీ వదిలేసి పరారయ్యాడు. విచారణ జరిపిన కింది కోర్టు.. కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నేరాలు రుజు వైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు, కఠిన కారాగార శిక్షలు విధించింది. అయితే, బాధితుడిని కారు నుంచి మరో ప్రాంతానికి తరలించనందున కిడ్నాప్ సెక్షన్ వర్తించదంటూ జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసింది. అయితే, హత్యా యత్నం, ఆయుధ చట్టం కింద కింది కోర్టు విధించిన శిక్షలను మాత్రం సమర్థించింది. -
శబరిమలలో ఇకపై రోజుకు 5 సార్లు పడిపూజ..!
కేరళ: శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అరవణ, అప్పం ప్రసాదాల పంపిణీలో విజిలెన్స్ అధికారులు భారీ ఆర్థిక వ్యత్యాసాలను గుర్తించారు. ప్రసాదం కొరతగా ఉండటం, అలాగే పాడైన ప్రసాదం పేరుతో నమోదు చేసిన లెక్కలకు వాస్తవ పరిస్థితులకు మధ్య తేడాలు ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో తేలిన విషయాలను అధికారులు దేవస్థానం ప్రత్యేక కమిషనర్కు చేరవేయగా వాటిని కేరళ హైకోర్టుకు నివేదిక రూపంలో సమర్పించారు.విజిలెన్స్ అధికారుల వివరాల ప్రకారం.. ప్రసాదం కొరతను చూపించేందుకు పెద్ద మొత్తంలో అరవణ, అప్పం పాడైపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే, అధికారులు ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేసిన సమయంలో రికార్డుల్లో పేర్కొన్న స్థాయిలో ప్రసాదం ధ్వంసమైనట్లు నిర్ధారించే భౌతిక ఆధారాలు కనిపించలేదని తెలిపారు. దీంతో రికార్డుల్లోని వివరాలపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అరవణకు సంబంధించి మొత్తం 7,594 టిన్లు పాడైపోయినట్లు రికార్డుల్లో నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వాటి విలువ సుమారు ₹7,59,400గా లెక్కించారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో అరవణ ధ్వంసమై ఉంటే అందుకు సంబంధించిన ఇతర భౌతిక ఆధారాలు ఉత్పత్తి కేంద్రంలో కనిపించాల్సి ఉంటుందని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.అదే విధంగా అప్పం పంపిణీలోనూ లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య తేడా ఉన్నట్లు విచారణలో తేలింది. సుమారు ₹1,21,365 విలువైన 2,697 అప్పం కవర్లు పాడైపోయినట్లు లేదా ధ్వంసమైనట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ, ఉత్పత్తి కేంద్రంలో పరిశీలించిన పరిస్థితులు మాత్రం ఈ గణాంకాలకు భిన్నంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.ఈ వ్యవహారం 2025 మండల-మకరవిళక్కు యాత్రా సీజన్కు సంబంధించినవిగా తెలుస్తోందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఆ సమయంలో శబరిమలలో అరవణకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో భక్తులకు ఒక్కొక్కరికి గరిష్టంగా ఐదు అరవణ టిన్లు మాత్రమే విక్రయించేలా పరిమితి విధించగా, అదే సమయంలో పెద్ద సంఖ్యలో అరవణ పాడైపోయినట్లు రికార్డుల్లో నమోదు కావడం పలు ప్రశ్నలకు దారితీసిందని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.ఆటోమేటెడ్ విధానంలో అరవణ, అప్పం తయారవుతున్నందున సాధారణంగా ఉత్పత్తి సమయంలో పాడయ్యే ప్రసాదం పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని అధికారుల పరిశీలనలో తేలింది, అయితే, ఇంత పెద్ద మొత్తంలో అరవణ టిన్లు, అప్పం కవర్లు పాడైనట్లు రికార్డుల్లో నమోదు కావడం సాధారణ పరిస్థితులకు భిన్నంగా ఉందని విజిలెన్స్ అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో ప్రసాదం లెక్కలు, నిల్వ, పంపిణీ విధానాలను అధికారులు మరింతగా పరిశీలించినట్లు సమాచారం.అయితే, విజిలెన్స్ విచారణలో గుర్తించిన లెక్కల ప్రకారం అరవణ, అప్పం విషయంలో మొత్తం ఆర్థిక వ్యత్యాసం సుమారు ₹8.8 లక్షలుగా అంచనా వేయగా, రికార్డుల్లో చూపించిన ప్రసాదం నిజంగా ధ్వంసమైందా, లేదా ఇష్టానుసారంగా పంపిణీ జరిగిందా అనే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో శబరిమల ప్రసాదం తయారీ నుంచి భక్తులకు పంపిణీ చేసే వరకు ప్రతి దశలో లెక్కలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని విజిలెన్స్ అధికారులు సూచించారు. ప్రసాదం నిల్వ, లెక్కలు, పంపిణీపై అంతర్గత నియంత్రణలను పటిష్టం చేయడంతో పాటు, విచారణలో గుర్తించిన అంశాలపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. -
తమిళనాడులో భగ్గుమన్న ‘దవడ’ రాజకీయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన ప్రజారంజక పరిపాలనతో దూసుకుపోతున్నారు. ప్రజాభిష్టమైన నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒకవైపు తన ధారాళమైన వాగ్ధాటితో టీవీకే శ్రేణుల్లో జోష్ నింపుతుండగా.. మరోవైపు తన హావభావాలతో ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుచేస్తూ ప్రత్యర్థులను ఇరుకున పెడుతున్నారు. తాజాగా సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష డీఎంకే అవినీతిపై ఆయన విమర్శలు గుప్పిస్తూ ఇచ్చిన ఓ ‘ఫోజు’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారి తీసింది.అసెంబ్లీ సమావేశంలో డీఎంకే అధినేత, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ గతంలో ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, నిర్బంధం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో విజయ్ తన దవడను తాకుతూ ఒక రకమైన సైగ చేశారు. విజయ్ చేసిన ఈ బాడీ లాంగ్వేజ్ సైగ.. ఎమర్జెన్సీ (1975-77) కాలంలో ‘మీసా’ చట్టం కింద అరెస్టై, పోలీస్ కస్టడీలో దాడికి గురై దవడ గాయపడిన ఎంకే స్టాలిన్ను అపహాస్యం చేసేలా ఉందని డీఎంకే పార్టీ తీవ్రంగా మండిపడింది. స్టాలిన్ ముఖంపై ఉన్న ఆ మచ్చ కేవలం ఒక గాయం కాదని, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన ఒక యోధుడి త్యాగానికి ప్రతీక అని డీఎంకే నేతలు అభివర్ణించారు.1976 జనవరి 31న నాటి సీఎం కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. ఆ సమయంలో యువ డీఎంకే నేతగా ఉన్న ఎంకే స్టాలిన్ను అరెస్ట్ చేసి చెన్నై సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో ఆయన అధికారుల దాడికి గురయ్యారని, ఆ దెబ్బల వల్లే ఆయన దవడ గాయపడిందని డీఎంకే వర్గాలు చెబుతుంటాయి. అప్పటి నుంచి ఆ సంఘటన స్టాలిన్ రాజకీయ జీవితంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది.ఈ వివాదం పెద్దది కావడంతో సీఎం విజయ్ స్పందించారు. అసెంబ్లీలో తాను చేసిన ఆ సైగ ఎవరినీ కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ప్రసంగంలో భాగంగా సాధారణంగా వచ్చిందే తప్ప అందులో ఎలాంటి దుర్బుద్ధి లేదని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ అంశంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం, డీఎంకే సభ్యులు నిరసన తెలపడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.మీసా చట్టం అంటేమీసా (MISA - Maintenance of Internal Security Act) దేశంలో అత్యంత వివాదాస్పదమైన చట్టం. దీన్ని భారత పార్లమెంటు 1971లో ఆమోదించింది. దేశంలో అంతర్గత భద్రతను కాపాడటం, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని కట్టడి చేయడం ఈ చట్టం ఉద్దేశం అని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. 1975 నుండి 1977 వరకు దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి కాలంలో ఈ చట్టాన్ని అత్యంత దారుణంగా దుర్వినియోగం చేశారు.ఈ చట్టం కింద ఎవరినైనా సరే, ఎలాంటి వారెంట్ లేకుండా, విచారణ లేకుండా, కోర్టులో ప్రవేశపెట్టకుండా నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధించవచ్చు. అరెస్టుకు అసలు కారణం కూడా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. దీనిపై కోర్టులను ఆశ్రయించే హక్కు కూడా అప్పట్లో ఉండేది కాదు.ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో భాగంగా అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి జాతీయ స్థాయి నాయకులతో పాటు, తమిళనాడులో ఎంకే స్టాలిన్ వంటి యువ రాజకీయ నాయకులు కూడా ఈ మీసా చట్టం కిందనే అరెస్టయి జైలు శిక్ష అనుభవించారు -
‘‘సీబీఐ దాడులు చేయబోతుంది.. సిద్ధంగా ఉండండి’’
బెంగళూరు: కేంద్ర దర్యాప్తు సంస్థల (సీబీఐ, ఈడీ వంటివి) దాడులకు సిద్ధంగా ఉండాలని తమ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెచ్చరించారు. ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులను డీకే శివకుమార్ ‘‘లక్ష్యంగా చేసుకున్నవి’’, ‘‘రాజకీయ ప్రేరేపితమైనవి’’గా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం ఆయనకు 100 శాతం అండగా ఉంటాయని చెప్పారు.సతీశ్ జార్కిహోళిపై దాడులు జరుగుతాయని ముందే ఊహించినట్లు డీకే శివకుమార్ తెలిపారు. ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయవచ్చని నా మంత్రులు, ఎమ్మెల్యేలను సిద్ధంగా ఉండాలని హెచ్చరించాను. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై దాడులు జరుగుతాయని నేను భావిస్తున్నాను? దర్యాప్తునకు మేము భయపడము. అయితే తప్పుడు ఆరోపణలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.బీజేపీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దాడులు చేయడం లేదని శివకుమార్ ప్రశ్నించారు. ‘‘భోవి డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం లేదా బీజేపీ నేతలు ప్రమేయం ఉన్న ఇతర కుంభకోణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.దృష్టి మళ్లించేందుకేసెప్టెంబర్ 10న తమ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకోబోతున్న సమయంలో ఈ దాడులు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించే ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించేందుకే దాడులను స్పష్టంగా రాజకీయ ఉద్దేశంతో నిర్వహించారు అని ఆయన అన్నారు.‘‘మా పార్టీ, ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి లక్ష్యంగా చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం సాధించిన విజయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు జరిగాయి’’ అని ఆయన అన్నారు. సతీశ్ జార్కిహోళి కుటుంబ సభ్యులు, సహచరుల విషయంలో తాను హామీ ఇవ్వలేనని శివకుమార్ తెలిపారు. అయితే జార్కిహోళి నిజాయితీగల వ్యక్తి అని తనకు నమ్మకం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు ఆయన తనను తాను సమర్థించుకుంటారని చెప్పారు.‘‘ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. అవి విదేశాల్లో ఉన్నా కూడా అది చట్టవిరుద్ధం కాదు. ఆయన తగిన పత్రాలను సమర్పించి తనను తాను సమర్థించుకుంటారు’’ అని శివకుమార్ అన్నారు. -
మేనల్లుడికి మాయావతి పెట్టిన కండీషన్ ఇదే..
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను మళ్లీ పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే, ఆకాశ్ రాజకీయ భవిష్యత్పై కఠిన షరతు విధించారు. ఆకాశ్కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలంటే.. ఆయన మామ, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలంటూ కండీషన్ పెట్టారు.ఆయన రిటైర్మెంట్ తర్వాతే ఆకాష్ ఆనంద్కు బాధ్యతలు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామంటూ మాయావతి తేల్చి చెప్పారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను ఇటీవల కీలక పదవుల నుంచి తప్పించిన బీఎస్పీ అధినేత్రి.. ఆకాశ్ ఆనంద్ ఇంకా పరిణతి సాధించాల్సి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి పూర్తిగా సన్యాసం తీసుకోవాలి. అంటే కేవలం పదవీ విరమణ చేయడం కాదు.. రాజకీయాలకు పూర్తిగా దూరం కావాలంటూ మాయావతి ఎక్స్లో పోస్ట్ చేశారు.అశోక్ సిద్ధార్థ్ పార్టీ లక్యాల కంటే తన వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని.. దాని పరిణామాలను ఆయనతో పాటు ఆకాశ్ ఆనంద్ కూడా అనుభవించాల్సి వచ్చిందని మాయావతి అన్నారు. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ కుమారుడైన ఆకాశ్ ఆనంద్ను గతంలో ఆమె రాజకీయ వారసుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2024 నుంచి ఆయనను పలుమార్లు పార్టీ బాధ్యతల నుంచి తొలగించడం, మళ్లీ నియమించడం జరుగుతోంది. ఆయన మామ అశోక్ సిద్ధార్థ పరిస్థితి కూడా ఇంతే.. సిద్ధార్థ్ను 2025లో పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించారు. ఆ తర్వాత మళ్లీ చేర్చుకున్నారు. ఇటీవల మాయావతి మాట్లాడుతూ.. ఆకాశ్ ఆనంద్ పార్టీ నాయకుడిగా కాకుండా సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగవచ్చని తెలిపారు.అల్లుడు ఆకాశ్ ఆనంద్ భవిష్యత్తును కాపాడేందుకు అశోక్ సిద్ధార్థ్కు ఇంకా ఒక అవకాశం ఉంది. ఆయన తన రాజకీయ ఆకాంక్షలను వదులుకుని, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా నిలిచి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలి. అప్పుడే ఆకాశ్ ఆనంద్ పార్టీలో స్వేచ్ఛగా పనిచేయగలరు. ఆ తర్వాతే పార్టీ ఆయనకు తిరిగి బాధ్యతలు అప్పగించే విషయాన్ని పార్టీ పరిశీలిస్తుంది. దీనివల్ల ఆయన పార్టీలో చురుకైన పాత్ర పోషించగలుగుతారు. పార్టీలో అందరి అభిప్రాయం కూడా ఇదే" అని మాయావతి తన పోస్టులో రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ‘‘మీరంతా సల్లబడేటట్టు చేస్తా.. జాగ్రత్త’’ -
‘‘మీరంతా సల్లబడేటట్టు చేస్తా.. జాగ్రత్త’’
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 2 వారాలుగా పలు సమస్యలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అందులో ఓ పోలీసు అధికారి నిరసన చేస్తున్న విద్యార్థులను తీవ్రంగా హెచ్చరిస్తూ కనిపించారు. క్యాంపస్లో అదనపు పోలీసు బలగాలను మోహరిస్తానని ఆయన హెచ్చరించారు.“ఇంకా బలగాన్ని రప్పిస్తాను.. మీరంతా సల్లబడేటట్టు చేస్తా. మేము గోరఖ్పూర్ పోలీసులమని గుర్తుంచుకోండి” అని పోలీసు అధికారి హెచ్చరించినట్లు వీడియోలో వినిపిస్తోంది. వీడియోలో పోలీసు అధికారి చేయి పైకెత్తి పిడికిలి బిగిస్తూ ఆగ్రహంగా మాట్లాడటం కనిపించింది. విద్యార్థులతో ఆయన వాగ్వాదానికి దిగిన సమయంలో కొన్ని అసభ్య పదాలు కూడా వినిపించాయి.ఈ ఘటనపై గోరఖ్పూర్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. బహిష్కరణకు గురైన కొందరు విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రాక్టర్తో సమావేశమైన సమయంలో పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు తెలిపారు. కొంతమంది విద్యార్థులు ఆగ్రహానికి గురై ప్రాక్టర్పై దాడి చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు.అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని ప్రాక్టర్ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని గోరఖ్పూర్ పోలీసులు తెలిపారు.పోలీసు అధికారి వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. నిరసన చేస్తున్న వారు విద్యార్థులని, నేరస్థులు కాదని గుర్తుంచుకుని సంయమనం పాటించాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.విద్యార్థుల నిరసనలు ఎందుకు?విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలతో విద్యార్థుల ఆందోళన తీవ్రతరమైంది. ఆగస్టు 25 నుంచి విద్యార్థులు క్యాంపస్లో నిరసన చేస్తున్నారు. 4 రోజుల క్రితం వారు నిరాహార దీక్ష కూడా ప్రారంభించారు. విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ సంస్థకు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీలు, మార్కుల పట్టాలు తీసుకునేందుకు కూడా విద్యార్థుల నుంచి రుసుములు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించకపోయినా విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘం రుసుము వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో మెరుగైన భోజనం, ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రధానమంత్రి ఉషా పథకం కింద విశ్వవిద్యాలయంలో చేపడుతున్న పనుల కేటాయింపులో పారదర్శకత ఉండాలని వారు డిమాండ్ చేశారు. బహిష్కరించిన విద్యార్థులను తిరిగి చేర్చుకోవాలని కూడా కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.Chaos at Gorakhpur University as students on hunger strike erupt in protest.A Sub-Inspector arrives on the spot and threatens students: I’ll call so much force that I’ll cool you down. This is Gorakhpur Police.@myogiadityanath It’s 2026, and students are still being threatened… pic.twitter.com/pcL3h3LqUx— Voice of Hindus (@Voiceofhindus) September 9, 2026 -
సీఎం విజయ్ నేతృత్వంలోని కూటమి పేరు ఖరారు
సాక్షి,చెన్నై: సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూటమి ప్రభుత్వానికి అధికారిక పేరు ఖరారైంది. ఈ కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ అనే పేరును నిర్ణయించారు. ఈ విషయాన్ని టీవీకే చీఫ్ విజయ్, వీసీకే చీఫ్ తోల్ తిరుమావళన్, ఎండీఎంకే చీఫ్ వైకో, ఐయూఎంఎల్ నాయకులు మీడియా ముఖంగా వెల్లడించారు. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్, వీసీకే,ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలోనే తమిళనాడు కూటమి ప్రభుత్వానికి ఈ పేరును ఖరారు చేశారు.అయితే,అనూహ్యంగా ఈ సమావేశానికి విజయ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన వామపక్ష (లెఫ్ట్) పార్టీల నేతలు గైర్హాజరయ్యారు.ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రెండవ కీలక సమావేశం ఇది. కూటమి నిర్మాణాన్ని అధికారికంగా ఖరారు చేయడంపై ఈ భేటీ ప్రధానంగా దృష్టి సారించింది. ఉమ్మడి కార్యక్రమంలో రూపకల్పన, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, కన్వీనర్ నియామకం,కూటమికి అధికారిక పేరును ఖరారు చేయడం వంటి ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం.వామపక్ష పార్టీలు గైర్హాజరకు కారణం ఇదేతమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి సమావేశానికి సీపీఐ,సీపీఎం వంటి వామపక్ష పార్టీలు గైర్హాజరు కావడానికి ప్రధానంగా కొన్ని రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో అధికారికంగా భాగస్వాములు కాకుండా, కేవలం బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని లెఫ్ట్ పార్టీలు మొదటినుంచీ స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వంలో కేబినెట్ హోదా లేనప్పుడు, కూటమికి సంబంధించిన అధికారిక కమిటీలు లేదా నిర్మాణాత్మక ఒప్పందాలలో లాంఛనంగా పాల్గొనడం ఇష్టం లేక వీరు దూరంగా ఉంటున్నారు.కార్మికులు, రైతులు, ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్ణయాలను స్వతంత్రంగా ప్రశ్నించే వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో లెఫ్ట్ పార్టీలు కూటమి పార్టీల సమావేశాలకు దూరంగా ఉంటున్నాయి. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు లేదా ఇతర పొత్తుల విషయంలో తమకంటూ ఒక స్వతంత్ర రాజకీయ వైఖరి ఉండాలని అవి కోరుకుంటున్నాయి. జూలై 1న జరిగిన తొలి సమావేశానికి కూడా లెఫ్ట్ పార్టీలు గైర్హాజరయ్యాయి. ఇప్పుడు జరిగిన రెండవ కీలక సమావేశానికి కూడా వారు దూరంగా ఉండటం ద్వారా తమ వైఖరిని మరింత స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వానికి అసెంబ్లీలో ఉన్న మెజారిటీ దృష్ట్యా లెఫ్ట్ పార్టీల మద్దతు చాలా కీలకం. కేవలం విధానపరమైన అంశాలు, కూటమి అధికారిక నిర్మాణాల విషయంలోనే వారు ఈ దూరం పాటిస్తున్నారు👉ఇదీ చదవండి : తమిళ రాజకీయంలో ‘ధనుష్’ వేడి -
1980s ఫొటో ట్రెండ్లో హీరోయిన్లు అందరినీ చూస్తారా? ఇదిగో..
సోషల్ మీడియాను ‘1980 ఫొటో’ ట్రెండ్ ఊపేస్తోంది. యూజర్లు ఏఐ (కృత్రిమ మేధస్సు) సాయంతో తమను తాము గత కాలానికి చెందిన రూపాల్లో మళ్లీ ఊహించుకుంటున్నారు. చాట్జీపీటీని ఉపయోగించి నెటిజన్లు తమ కొత్త సెల్ఫీలను 1980 దశాబ్దం నాటి నిజమైన ఫొటోలలా కనిపించే విధంగా మార్చుకుంటున్నారు. ఈ వైరల్ ట్రెండ్ ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటుల నుంచి సామాన్యుడి వరకు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఈ ట్రెండ్లో.. చాట్జీపీటీలో ఒక ఫొటోను అప్లోడ్ చేసి, అదే చిత్రాన్ని 80ల నాటి నిజమైన శైలిలో రూపొందించాలని కోరుతారు. దుస్తులు, జుట్టు తీరు, వెలుతురు, నేపథ్యం, ఫొటోగ్రఫీ శైలి వంటి అంశాలను యూజర్లు తమకు నచ్చిన విధంగా ఎంచుకోవచ్చు. 1980 దశాబ్దం నాటి ప్రముఖ సినిమాలు, బాలీవుడ్ చిత్రాలు, కుటుంబ ఆల్బమ్ల ఆధారంగా రూపొందించిన చిత్రాలు ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. పూర్తయిన చిత్రాల్లో సాధారణంగా ఒత్తుగా కనిపించే జుట్టు, రంగురంగుల చీరలు, ఆకర్షణీయమైన ఆభరణాలు, పాత తరహా స్టూడియో నేపథ్యాలు, పాత ఫొటోలను గుర్తుచేసే స్వల్ప ఫిల్మ్ గ్రెయిన్ కనిపిస్తాయి. ఫిల్మ్ గ్రెయిన్ అంటే పాత ఫిల్మ్ కెమెరాలతో తీసిన ఫొటోల్లో కనిపించే సూక్ష్మమైన గింజల్లాంటి మసక ఆకృతి.కేంద్ర మంత్రి కూడా ఈ ట్రెండ్లోకి.. View this post on Instagram A post shared by Piyush Goyal (@piyushgoyalofficial)కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇన్స్టాగ్రామ్లో తన 1980ల నాటి శైలిలో రూపొందించిన కృత్రిమ మేధస్సు ఇమేజ్ను షేర్ చేయడంతో ఈ రెట్రో ఏఐ ట్రెండ్కు మరింత ఆదరణ లభించింది. ఆ చిత్రంలో గోయల్ చక్కగా కుట్టించిన సూట్, ఏవియేటర్ సన్గ్లాసెస్ ధరించి కనిపించారు. పాత ఫొటో ఆల్బమ్లను గుర్తుచేసేలా చిత్రానికి సెపియా ఛాయ, మసకబారిన పాత ఫొటో తరహా ఆకృతి ఇచ్చారు. ఈ ఇమేజ్ను షేర్ చేస్తూ “80ల ట్రెండ్ను ఆస్వాదిస్తున్నా” అని రాశారు.సౌతిండియా నటీమణులను ఫ్యాన్స్ ఎలా రూపొందించారంటే?ఈ వైరల్ ఏఐ ట్రెండ్ సినిమా అభిమానులకు పెద్ద పండుగగా మారింది. ‘ప్రాంప్ట్గ్యాలరీ.ఐజీ’ వంటి ప్రముఖ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఈ ట్రెండ్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. నెటిజన్లు వివరమైన చాట్జీపీటీ టెక్స్ట్ ప్రాంప్ట్లను ఉపయోగించి ప్రస్తుత సౌతిండియా గత కాలానికి చెందిన రూపాల్లోకి మార్చుతున్నారు. పాతకాలపు కళాశాల కథాంశాల్లో కనిపించే కల్పిత కథానాయికల శైలిని అందిస్తున్నారు. ఈ కింది ఇన్స్టాపోస్టులో 17 మంది హీరోయిన్ల 80ల ఫొటోలు చూడొచ్చు. View this post on Instagram A post shared by Trending AI Image Prompts (@promptgallery.ig)సమంత రూత్ ప్రభుఏఐతో రూపొందించిన పాతకాలపు రూపంలో హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఆధునిక రెడ్ కార్పెట్ ఫ్యాషన్కు బదులుగా 1980ల నాటి కళాశాల విద్యార్థిని శైలిలో కనిపిస్తున్నారు. ఆమెకు సాధారణంగా కనిపించే చక్కటి రూపానికి బదులుగా ఒత్తుగా కనిపించే జుట్టు, ప్రత్యేకమైన పక్క పాపిడి, కొద్దిగా అస్తవ్యస్తంగా కనిపించే జుట్టు తీరు ఇచ్చారు. దీంతో ఆ చిత్రం నిజమైన పాతకాలపు ఫొటోలా కనిపిస్తోంది. చిన్న బొట్టు, మృదువైన పెదాలు, స్పష్టంగా కనిపించే కళ్లు, సహజంగా కనిపించే చర్మంతో దశాబ్దాల క్రితం వచ్చిన సినిమాలోని యువ కళాశాల విద్యార్థినిని తలపించేలా రూపొందించారు.సాయి పల్లవిసహజమైన తెరపై కనిపించే తీరుకు పేరున్న సాయి పల్లవి 1980ల నాటి అనలాగ్ రూపానికి సరిగ్గా సరిపోయేలా కనిపిస్తున్నారు. ఏఐ ప్రాంప్ట్లలో ఆమెను పాతకాలపు కళాశాల భవనాలు, సూర్యకాంతితో నిండిన వరండాలు, స్థానిక భాషలో సైన్బోర్డులు, సైకిళ్లతో ఉన్న వీధులు వంటి నేపథ్యాల్లో చూపిస్తున్నారు.త్రిష త్రిష కృష్ణన్ ఏఐతో రూపొందించిన పాతకాలపు రూపం ఆ కాలానికి ప్రత్యేకమైన రెట్రో ఫ్యాషన్పై ఎక్కువగా దృష్టి పెడుతోంది. అభిమానులు ఆమెను నడుము పైభాగంలో బిగుతుగా ఉండే యాసిడ్-వాష్ జీన్స్, వెడల్పాటి బెల్టులు, లోపలికి మడిచిన షర్టులతో చూపించేలా ఏఐ చిత్రాలను రూపొందించారు. ఈ తుది రూపం 1980ల నాటి క్లాసిక్ ప్రేమకథా చిత్రంలో త్రిష హీరోయిన్గా ఎలా కనిపించి ఉండేవారో అభిమానులు ఊహించుకునేలా చేస్తోంది. ఈ హీరోయిన్ల ఇమేజ్లు అన్నీ ఫ్యాన్స్ చేసిన ఫొటోలు మాత్రమే.చాట్జీపీటీతో 80ల ఫొటోను ఎలా రూపొందించాలి? చాట్జీపీటీను తెరిచి న్యూ చాట్ ప్రారంభించండి.+ బటన్ను నొక్కి మంచి ఫొటోను అప్లోడ్ చేయండి.మీకు కావాల్సిన 1980ల శైలిని వివరించండి. ఇందులో దుస్తులు, జుట్టు తీరు, నేపథ్యం, వెలుతురు వంటి వివరాలను పేర్కొనండి.వ్యక్తిని గుర్తుపట్టగలిగే ముఖం, సహజమైన చర్మ రంగును అలాగే ఉంచాలని చాట్జీపీటీని కోరండి.మొదటి చిత్రం సరిగ్గా కనిపించకపోతే ప్రాంప్ట్ను మార్చండి. -
భారత ఓటర్ల లిస్ట్లోకి అఫ్గాన్లు ?
రాంచీ: స్పెషల్ ఇంటెన్సివ్ (SIR) ప్రక్రియలో దుమారం చెలరేగింది. భారత్ ఓటర్ల జాబితాలో అఫ్ఘనిస్థాన్ దేశస్థుల పేర్లు నమోదవ్వడంపై రాజకీయంగా వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ అంశం జార్ఘండ్లో చర్చాంశనీయంగా మారింది. జార్ఖండ్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ వివాదాలకు దారి తీసింది. జంషెడ్పూర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని 286వ పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితాలో అసిల్ ఖాన్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ ఇబ్రహీం అనే ముగ్గురు అఫ్గానిస్థానీయుల పేర్లు వరుసగా 30, 31, 33 నంబర్లతో ఓటర్ల లిస్టులో కనిపించాయి. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విదేశీయుల పేర్ల ఎస్ఐఆర్ జాబితాలో ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు.ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సందీప్ వర్మ జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విదేశీ చొరబాటుదారుల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమ పార్టీ మొదటి నుంచీ చెబుతూనే ఉందన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి కె. రవికుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ " ఓటర్ల జాబితాలో విదేశీయులను చేర్చడం ఒక తీవ్రమైన విషయం. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాం. ఆ వ్యక్తులకు ఎవరు సహాయం చేశారు, ఏ ప్రక్రియ ద్వారా వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చారు అనే దానిపై దృష్టి సారిస్తాం. ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం," అని ఆయన స్పష్టం చేశారు.అదే విధంగా ఓటర్ల జాబితాలో ఆ మూడు పేర్లు ఎలా చేర్చబడ్డాయి, ఈ ప్రక్రియలో ఏదైనా వ్యక్తి లేదా నెట్వర్క్ పాత్ర ఉందా అనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. -
పూనావాలా ‘అంకుల్’ నా జోలికి రావొద్దు.. రియా కౌంటర్
న్యూఢిల్లీ: నీట్ లీకేజీ ఆందోళనల్లో వర్షంలో పోలీస్ వ్యాన్ను అరచేతితో అడ్డుకుని రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన రియా అహిర్, ఇటీవల ‘బిగ్ బాస్ 20’షోలోకి అడుగుపెట్టలేకపోవడం చర్చాంశనీయంగా మారింది. షో నిర్వాహకులు రియా అహిర్, పంజాబీ నటి లవ్ గిల్ మధ్య నిర్వహించిన ఆడియన్స్ పోలింగ్లో లవ్ గిల్ విజయం సాధించడంతో రియా అవకాశాన్ని కోల్పోయారు.హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్ను చంపేసినట్లు.. ఒకవైపు పూనావాలా, రాహుల్ గాంధీల మధ్య రాజకీయం నడుస్తుంటే, ఈ గొడవలో బిగ్ బాస్ ఛాన్స్ మిస్సయ్యి రియా అహిర్ బలైపోయారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోందిఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆందోళనల ద్వారా రియా వైరల్ కావడం యాదృచ్ఛికం కాదని, దాని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ, రాజ్ థాకరే వంటి నేతల మద్దతుతో మోదీ వ్యతిరేక ఎజెండాను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్లాలని ఆమె ప్లాన్ చేశారు. అయితే, 99 ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్కు విజయం అందించలేని రాహుల్ గాంధీ మీకు ఆన్లైన్ మద్దతు ఎలా ఇవ్వగలరు?’ అని పూనావాలా ఎద్దేవా చేశారు.పూనావాలా విమర్శలపై రియా అహిర్ రెండు వీడియోల ద్వారా ఘాటుగా స్పందించారు. పూనావాలాను ‘అంకుల్’ అని సంబోధిస్తూ, తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. చిన్న వయసున్న అమ్మాయిలను టార్గెట్ చేయడం మాని, తన ఈడువారితో రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు వాడే పాత, డొల్ల స్క్రిప్ట్ లాంటివేనని ఎద్దేవా చేశారు.తాను భారత సైన్యాన్ని కానీ, ఏ ఇతర వ్యవస్థను కానీ ఎప్పుడూ అవమానించలేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ లాంటి ఎంటర్టైన్మెంట్ షోలలోకి రాజకీయాలు, మతాలను లాగడం సరైనది కాదని హితవు పలికారు. ప్రస్తుతం ఈ పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ వార్ నెట్టింట వైరల్ అవుతోంది.👉ఇదీ చదవండి : మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా? -
రూ.1051 కోట్లు : రమణీయంగా మధుర..అయోధ్యలాంటి మేకోవర్!
అయోధ్య తరహాలో మథుర-బృందావన్ రూపురేఖలను మార్చి అత్యంత రమణీయంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 1,051 కోట్ల ప్రణాళికను రూపొందిం. ఇందులో రూ. 540 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులను ఇప్పటికే ప్రారంభించారు. మరో 167 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 1,051 కోట్ల విలువైన 229 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కృష్ణాష్టమి పర్వదినాన శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.అయోధ్య, కాశీ తరహాలోనే మధుర-బృందావన్లో కూడా అత్యంత ఘనంగా ఆలయ సముదాయాలను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.మధుర 2.0:మొత్తం రూ. 1,051 కోట్లలో ఇప్పటికే రూ. 540 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులను ప్రారంభించగా, మరో రూ. 437 కోట్ల విలువైన 167 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 72 కోట్లు నేరుగా బదిలీ చేశారు.ప్రాజెక్టుకేటాయించిన నిధులుప్రయోజనంబృందావన్కు 4-లేన్ల హైవేరూ. 251 కోట్లుయమునా ఎక్స్ప్రెస్ వే నుండి నేరుగా బృందావన్కు అనుసంధానం చేస్తారు. దీని వల్ల ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయని భావిస్తున్నారు.యమునా నదిపై కొత్త వంతెన : 2-లేన్ల క్రాసింగ్ ద్వారా పాత వంతెనలపై భారం తగ్గింపు, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా. 12 అంతస్తుల పర్యాటక హాస్టల్స్. 47 కోట్లు పండుగల సమయంలో (జన్మాష్టమి, హోలీ, రాధాష్టమి) వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యం.ఛాతా మాస్టర్ ప్లాన్ రోడ్డు : రూ. 86 కోట్లు30 మీటర్ల వెడల్పుగల రోడ్డు ద్వారా భారీ వాహనాల మళ్లింపు, వాణిజ్య కార్యకలాపాల విస్తరణ.ఫ్లైఓవర్ & సౌందర్యీకరణరూ. 79 కోట్లుజాతీయ రహదారి (NH-19) నుండి బృందావన్ ప్రవేశ మార్గం ఆధునీకరణ (ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లు, అండర్గ్రౌండ్ వైరింగ్).12 అంతస్తుల పర్యాటక వసతి గృహం: నయారా పోలీస్ లైన్స్ క్యాంపస్లో రూ. 47 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇది, జన్మాష్టమి, హోలీ, రాధాష్టమి వంటి పండుగల సమయంలో నగరం యాత్రికులతో నిండిపోయే రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మాణం.బృందావన్లో ఒక పౌర శిక్షణా కేంద్రం: పరిశుభ్రత, స్మార్ట్ సేవలు , యాత్రికుల నిర్వహణపై మున్సిపల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఈ కేంద్రం కోసం రూ. 31 కోట్లు కేటాయించారు.ఇదీ చదవండి: సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహందీంతో పాటు బృందావన్లో కొత్త రోప్వే , భారీ పార్కింగ్ ప్రాజెక్టులు.సూర్దాస్ బ్రజ్భాషా అకాడమీ , 400 ఎకరాల్లో విస్తరించే ఆసియాలోనే అతిపెద్ద సిటీ ఫారెస్ట్ సిద్ధం కానుంది. ఇంకా కొత్త హైవేలు, ఫ్లైఓవర్లు నిర్మానంకానున్నాయి. ఫలితంగా ఢిల్లీ, నోయిడా నుండి మధుర-బృందావన్లకు ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గనుంది. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కోరుకునే వారికి, వారాంతపు పర్యాటకులకు బృందావన్ అత్యంత అనుకూలమైన కేంద్రంగా మారుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రిటైర్మెంట్ హోమ్స్ నిర్మించనున్నారు.ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసుఅయెధ్యలోరామమందిరి నిర్మాణంతో రామమందిరం సమీపంలో భూముల ధరలు భారీగా పెరిగాయి, పెట్టుబడిదారులు స్థలాలను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు.ఇప్పుడిక శ్రీకృష్ణుని జన్మభూమి అయిన ఈ ప్రాంతంలో కూడా అటువంటి మార్పునే తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం, హోటళ్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు, గెస్ట్ హౌస్లకు డిమాండ్ పెరుగుతుంది.ఇదీ చదవండి: ఆ ఒరంగుటాన్లు ఎక్కడివి? అనుమానాస్పదంగా మహీంద్ర బ్లాక్ థార్ -
4 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన జడ్జి.. ఇప్పుడేమంటున్నారంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ గత 4 నెలల్లో 23 మందికి మరణశిక్ష విధించారు. తాజా తీర్పులో వరకట్నం డిమాండ్ కారణంగా భార్యను సజీవ దహనం చేసిన నదీమ్కు మరణశిక్ష విధించారు. ఈ కేసులో నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302, 504 కింద దోషిగా నిర్ధారించి రూ.లక్ష జరిమానా విధించారు.షాజహాన్పూర్ పట్టణంలో 2018 జూలై 23న నదీమ్ తన భార్య షెహజాదీని వరకట్నం డిమాండ్ కారణంగా నిప్పంటించి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలతో ఆమెను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో నదీమ్ తనకు నిప్పంటించినట్లు షెహజాదీ చెప్పినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.విచారణ సమయంలో అభియోగపక్షానికి చెందిన మొత్తం 11 మంది సాక్షులు తమ వాంగ్మూలాలను మార్చుకున్నారు. అయినప్పటికీ షెహజాదీ మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టు నదీమ్ను దోషిగా తేల్చింది. ఈ హత్య అత్యంత క్రూరమైనదిగా, అనాగరికమైనదిగా పేర్కొన్న కోర్టు దీనిని అత్యంత అరుదైన కేసుల్లో అరుదైనదిగా పరిగణించి మరణశిక్ష విధించింది.ఈ తీర్పుతో దివాకర్ కోర్టు గత 4 నెలల్లో 11 కేసుల్లో 23 మందికి మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షకు సంబంధించిన కేసుల్లో తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. నిందితులకు పైకోర్టుల్లో అప్పీల్ చేసుకునే హక్కు ఉంటుంది.చనిపోవడానికే సిద్ధం: జడ్జి‘‘నన్ను పిరికి న్యాయమూర్తి అని పిలిపించుకోవడం కంటే చనిపోవడానికే సిద్ధం’’ అని దివాకర్ అన్నారు. తన సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించగలిగినంతకాలం పదవిలో కొనసాగుతానని, అలా చేయలేని పరిస్థితి వస్తే రాజీనామా చేస్తానని తెలిపారు. తాను న్యాయమూర్తి స్థానంలో ఉన్నంతకాలం నిర్ణయాలు తీసుకునే అధికారం తనదేనని ఆయన తీర్పులో పేర్కొన్నారు. న్యాయమూర్తి తనపై మాఫియా, నేరస్థుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. మాఫియా, నేరస్థులకు ప్రయోజనం చేకూర్చేలా తన కోర్టు నుంచి సుమారు 100 తీవ్రమైన కేసులను తొలగించారని ఆరోపించారు.ఆగస్టులో దివాకర్ ముందు పెండింగ్లో ఉన్న సుమారు 100 హత్య కేసులను పరిపాలనా ఉత్తర్వుల ద్వారా జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేశారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు మరణశిక్షలు విధించే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ కేసుల బదిలీ జరిగిందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి తెలిపారు. -
ఆ ఒరంగుటాన్లు ఎక్కడివి? అనుమానాస్పదంగా మహీంద్ర బ్లాక్ థార్
5 Baby Orangutans అంతరించిపోతున్న అరుదైన ఐదు ఒరంగుటాన్లు (Orangutans) ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అడవుల్లో దర్శనమివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్కు చెందని వీటిని బిచిత్రపూర్ అటవీ ప్రాంతంలో అంతర్జాతీయ స్మగ్లర్లు వదిలి వెళ్లినట్టుగా భావిస్తున్నారు. సాధారణంగా ఇవి ప్రధానంగా ఆగ్నేయాసియా, ఇండోనేషియా, మలేసియా అడవుల్లో కనిపిస్తాయి. దీంతో అసలివి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు స్మగ్లింగ్ చేశారు అనే కోణంలో అధికారులు ముమ్మర విచారణ ప్రారంభించారు. ఈ కేసు విచారణలోని కీలక అంశాలు వెలుగు చూశాయి.ఒరంగుటాన్లు లభించిన రాత్రి అడవి సమీపంలో తిరిగిన ఒక నల్లటి మహీంద్రా థార్ (Mahindra Thar) వాహనం సీసీటీవీ దృశ్యాలలో కనిపించింది. రాత్రి 11:25 గంటలకు వెళ్లి, తిరిగి 15 నిమిషాల తర్వాత ఆ వాహనం రావడంపై అధికారులు దృష్టి సారించారు.ఈ కేసు విచారణకు నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) రంగంలోకి దిగింది.#WATCH | Five rescued Orangutans brought to Nandankanan Zoo in Bhubaneswar, kept in quarantine.(Video source: Nandankanan Zoo) https://t.co/Yl7TEJx0cm pic.twitter.com/THuhiLpugJ— ANI (@ANI) September 9, 2026ఇదీ చదవండి: సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం మరోవైపు రక్షించిన ఒరంగుటాన్లను భువనేశ్వర్లోని నందన్కానన్ జూకి తరలించి క్వారంటైన్లో ఉంచారు. వీటి ఆరోగ్య పరిస్థితిని అటవీ శాఖ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే జాతీయ వన్యప్రాణి నిపుణులను కూడా పిలిపించనున్నారు.ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసుఅంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో ఒరంగుటాన్ విలువ సుమారు రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు ఉంటుందని ఒడిశా అటవీ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ఖుంటియా తెలిపారు. ఇవి విమాన, జల లేదా రైలు మార్గాల ద్వారా వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ఓడరేవుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని వన్యప్రాణి నేరాల నిరోధక బ్యూరో (WCCB)ని మంత్రి కోరారు. <Five young orangutans rescued from Odisha’s Bichitrapur casuarina forest.Forest officials reportedly found the animals apparently abandoned in the coastal forest of Balasore district, raising serious questions about how a species not native to Odisha reached the area.… pic.twitter.com/8Wwo7BfyzB— Megh Updates 🚨™ (@MeghUpdates) September 9, 2026ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది! -
అర్థాంతరంగా నిలిచిపోయిన క్లీన్ కేరళ కార్యకలాపాలు
పంబ , సన్నిధానంలో పనులు ప్రారంభించిన ఒక్క రోజే క్లీన్ కేరళ కంపెనీ తన వ్యర్థాల తొలగింపు కార్యకలాపాలను అర్థాంతరంగా నిలిపేసింది. దాంతో శబరిమల వ్యర్థాల నిర్వహణ కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదం ఎదురైంది. దాదాపు ఒక ఏడాది పాటు జరిగిన చర్చల అనంతరం, శబరిమల నుంచి వెలువడే వ్యర్థాలన్నింటినీ వేరు చేసి తొలగించాలని ఒక అవగాహనకు వచ్చారు. ఈ ప్రణాళికలో భాగంగా, వేరు చేసిన వ్యర్థాల మొదటి విడతను సిద్ధం చేశారు. జీవవిచ్ఛిన్నం కానీ వ్యర్థాల సేకరణ అధికారిక ప్రారంభోత్సవాన్ని సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే , ఆ కార్యక్రమం సజావుగా జరగలేదు. కొంతమంది అధికారులు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా , జీవవిచ్ఛిన్నం కాని వ్యర్థాల సేకరణ మరియు విభజన నుండి క్లీన్ కేరళ కంపెనీని మినహాయించారు.టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో , ప్రస్తుతానికి సన్నిధానం నుండి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రమే సంచులలో ప్యాక్ చేసి పంబకు తరలించాలని నిర్ణయించారు. సన్నిధానం, పంబలోని వివిధ ప్రాంతాల నుండి చెత్త , ప్లాస్టిక్ బాటిల్స్ , గాజు సీసాలు , స్క్రాప్ సామాగ్రి మరియు నిర్మాణ శిధిలాలతో సహా పేరుకుపోయిన వ్యర్థాలను వేరు చేసి తొలగించాలన్నది అసలు ప్రణాళిక. ప్రతిపాదిత ఏర్పాటు ప్రకారం , పునర్వినియోగించదగిన పదార్థాల కోసం దేవస్థానం బోర్డు ఒక స్థిరమైన మొత్తాన్ని అందుకుంటుంది, అయితే మిగిలిన వ్యర్థాలను శుద్ధి చేసి, పారవేసినందుకు రుసుములు వసూలు చేస్తారు కూడా. ఈ విషయమై ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదరలేదు. అయితే శబరిమల యాత్రా కాలం సమీపిస్తుండటంతో , ఒప్పందం ఇంకా కుదరకపోయినప్పటికీ పనులు ప్రారంభించాలని క్లీన్ కేరళ కంపెనీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నేపథ్యంలోనే కంపెనీకి చెందిన సుమారు 15 మంది ఉద్యోగులు ఒక వాహనంతో శబరిమలకు చేరుకుని వ్యర్థాల తొలగింపు పనులను ప్రారంభించారు. తీరా ప్రారంభించాక ప్రతిపాదిత వ్యర్థాల నిర్వహణ ఏర్పాటుపై అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆ పనులను తక్షణమే నిలిపివేశారు. కాగా, క్లీన్ కేరళ కంపెనీ లిమిటెడ్ (CKCL) కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోలేదని చెబుతున్నారు అధికారులు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో కార్మిక వివాదాలు, అలాగే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లతో ఏర్పడిన సమన్వయ లోపాల వల్ల తాత్కాలికంగా కొన్ని చోట్ల పనులు నిలిచిపోయినట్లు సమాచారం. అలాగే కొన్ని కార్మిక సంఘాలు నోక్కుకూలి' (పని చేయకుండానే డిమాండ్ చేసే అక్రమ కూలి) కోసం పట్టుబట్టడం కూడా ఒక కారణమనేది అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: -
సీజేపీ నేతలు దీప్కే, ఆశుతోష్, సౌరవ్పై రూ.2 కోట్లకు దావా
కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీ నేతలు అభిజీత్ దీప్కే, ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్పై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని చెప్పారు.భాటియా నష్టపరిహారంగా రూ.2 కోట్లు చెల్లించాలని, తనకు సంబంధించిన పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, తిరిగి పోస్టు చేయడం, ప్రసారం చేయకుండా ప్రతివాదులను ఆదేశించాలని కోర్టును కోరారు. సామాజిక మాధ్యమాల నుంచి వివాదాస్పద సమాచారాన్ని తొలగించాలని కూడా ఆయన కోరారు.స్వతంత్ర భరద్వాజ్కు సంబంధించి భాటియా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటూ కృత్రిమ మేధస్సుతో రూపొందించిన గ్రాఫిక్ను సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రచారం చేయడంతో వివాదం మొదలైందని దావాలో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని భాటియా ఖండించి, పోస్టును తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సౌరవ్ దాస్ను కోరారు.సౌరవ్ దాస్ ఆ పోస్టును తొలగించి, అది కృత్రిమ మేధస్సుతో రూపొందించిన గ్రాఫిక్ అని తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసినట్లు దావాలో పేర్కొన్నారు. అయితే ఆ సమాచారం ఇతరులు కూడా ప్రచారం చేశారని భాటియా ఆరోపించారు. ఆశుతోష్ రాంకా కూడా దాస్ ఖాతా నుంచి ఆ గ్రాఫిక్ను తిరిగి పోస్టు చేసి, భారతీయ జనతా పార్టీ నేతలను ఎగతాళి చేసే కామెంట్ను జత చేసినట్లు దావాలో ఆరోపించారు.ఉద్దేశపూర్వకంగా ప్రచారం!తనపై తప్పుడు, కల్పిత, తప్పుదోవ పట్టించే, పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురించి ప్రసారం చేశారని భాటియా ఆరోపించారు. ఆ పోస్టుల్లో ఒకదాన్ని ప్రచురించిన కొద్దిసేపటికే 1.32 లక్షలకు పైగా మంది చూశారని దావాలో పేర్కొన్నారు. ఈ ప్రచారం తన ప్రతిష్ఠ, వృత్తిపరమైన స్థాయిపై ప్రతికూల ప్రభావం చూపిందని భాటియా తెలిపారు.సౌరవ్ దాస్ గతంలో ఉమర్ ఖలీద్, న్యాయవ్యవస్థపై చేసినట్లు ఆరోపించిన కొన్ని పోస్టులను కూడా దావాలో ప్రస్తావించారు. నిర్దిష్ట న్యాయ వ్యవహారంపై న్యాయమైన విమర్శల పరిధిని ఆ పోస్టులు దాటి న్యాయవ్యవస్థపై విస్తృత దాడిగా మారాయని భాటియా ఆరోపించారు.రిజిస్టర్కాని సంఘం పేరుతో ప్రతివాదులు న్యాయవ్యవస్థ సహా రాజ్యాంగ సంస్థలకు వ్యతిరేకంగా సమాచారాన్ని ప్రచురిస్తూ, ప్రసారం చేస్తున్నారని దావాలో ఆరోపించారు. అయితే ఇవన్నీ పౌర దావాలో చేసిన ఆరోపణలే. వాటిపై ఢిల్లీ హైకోర్టు ఇంకా విచారణ జరిపి నిర్ణయం తీసుకోలేదు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హౌరా- చెన్నై కారిడార్లో భాగంగా విశాఖ, విజయవాడ మీదుగా నాలుగు లేన్ల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ముంబై- చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది. అదే విధంగా దేశంలో 7 హై డెన్సిటీ రైల్వే కారిడార్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు భారతీయ రైల్వేల భారీ ప్రణాళికలో భాగంగా ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ముంబై కారిడార్లకు ప్రాధాన్యం ప్రకటించింది. ఢిల్లీ–చెన్నై మార్గంలో విజయవాడ కీలక స్టేషన్గా అదేవిధంగా హౌరా–చెన్నై కారిడార్లో విశాఖపట్నం స్టేషన్కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ముంబై–చెన్నై మార్గంలో రేణిగుంట, గుంతకల్ అభివృద్ధి కి ఊతం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ అంశమై రైల్వేశాఖ మంత్రి మాట్లాడుతూ పలు మార్గాల్లో నాలుగో లైన్ పనులు చేపట్టడంతో పాటు మరికొన్ని కారిడార్లు డీపీఆర్, ఆమోద దశలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర నిర్ణయాలతో సరుకు రవాణా, ప్రయాణికుల సేవల సామర్థ్యం పెరగనుందని రైళ్ల సమయపాలన మెరుగుపడుతుందని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


