ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలో ఎల్పీజీ (LPG) సరఫరా,నిల్వలపై ప్రభావం పడింది. విదేశాల నుంచి ఎల్పీజీ సరఫరా నిలిపివేతతో భారతదేశంలో సంక్షోభం తలెత్తింది. ఫలితంగా వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది.
భయపడుతున్నట్టుగానే ఇరాన్యుద్ధం ప్రభావం వంటగదిలోకి వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ముందస్తుగా వంట సిలిండర్లను బుక్ చేసేసుకున్నారు. దీంతో సిలిండర్ బుక్ చేస్తో వస్తుందో రాదో తెలియని గందరగోళ పరిస్థితి మరికొంతమందిది. దేశవ్యాప్తంగా వినియోగ దారులు ఎల్పీజీ ఏజెన్సీల భారీగా క్యూ కట్టారు ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ నిల్వల ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు సరిపడా నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం వంటగ్యాస్ను ఎక్కడ తెస్తుంది లాంటి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.

భారతదేశానికి సంవత్సరానికి 33 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పిజి అవసరం. దేశీయ గ్యాస్ సిలిండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం 235 కోట్ల సిలిండర్లు. అంటే రోజుకు 64 లక్షల సిలిండర్లు అవసరం.
వీటిలో 88శాతం గృహాలలో ఉపయోగిస్తారు. మిగిలిన 12శాతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లే. అంటే అంటే హోటళ్ళు, రెస్టారెంట్లు, పరిశ్రమలు మొదలై వాణిజ్య అవసరాలకు వినియోగించేవి.
భారతదేశం తన వినియోగ ఎల్పిజిలో 60 శాతం విదేశాల నుండి కొనుగోలు చేస్తుంది. మిగిలినవి భారతీయ రిఫైనరీలలో తయారవుతాయి.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం దేశంలో పరిస్థితి
మధ్యప్రదేశ్: వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల హోటల్-రెస్టారెంట్ సమస్యలను ఎదుర్కొంటోంది. వంట గ్యాస్ సిలిండర్ల కోసం పెద్ద ఎత్తున క్యూలు, ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది అత్యవసర పరిస్థితి అని క్యాటరర్లు అంటున్నారు.
రాజస్థాన్: వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. జైపూర్లో 1911 రూపాయలకు అందుబాటులో ఉన్న సిలిండర్ను 2500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్: 4-5 రోజుల బుకింగ్ తర్వాత కూడా సిలిండర్లు అందుబాటులో లేవు. గ్యాస్ ఏజెన్సీల వెలుపల వినియోగదారులు బారులుతీరారు. గోరఖ్ పూర్-సిద్ధార్థ్ నగర్ లో పోలీసు రక్షణ కింద సిలిండర్లను పంపిణీ చేస్తున్నారంటేనే పరిస్థితితీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
బిహార్: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల బుకింగ్ 3 రోజులు పాటు నిలిపివేశారు. దీంతో హోటల్, హోటల్స్ పై దాడి చేశారు. దేశీయ గ్యాస్ ఏజెన్సీలు మూసివేయబడతాయి లేదా పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి.
పంజాబ్: లుధియానా, ఫరీద్కోట్ లలో సర్వర్ కారణంగా దేశీయ సిలిండర్లు కూడా బుక్ కావడం లేదు. అనేక జిల్లాల్లో గత 3 రోజులుగా వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది.
ముంబై-పుణెః గ్యాస్ కొరత కారణంగా సుమారు 20శాతం హోటళ్ళు , రెస్టారెంట్లు మూసివేశారు. లేదా పాక్షికంగా నడుస్తున్నాయి. కేవలం టీ, కాఫీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
బెంగళూరు-హైదరాబాద్ః 2-3 రోజులు వాణిజ్య సిలిండర్ల డెలివరీని తమకు అందలేదని రెస్టారెంట్లు ఫిర్యాదు చేశాయి. కొన్ని చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా ప్రారంభమైంది.
దేశీయ ఉత్పత్తి పెంపు: దిగుమతులకు అంతరాయం కలగడంతో, ప్రభుత్వం ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించి రిఫైనరీలలో ఎల్పీజీ ఉత్పత్తిని 25శాతం వరకు పెంచాలని ఆదేశించింది. దీనికోసం ఇతర అవసరాలకు వాడే ప్రోపేన్, బ్యూటేన్ వాయువులను ఎల్పీజీ తయారీకి మళ్లిస్తున్నారు.

ఎందుకీ సంక్షోభం
హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగాభారతదేశానికి వచ్చే ఎల్పీజీ దిగుమతుల్లో దాదాపు 60శాతం గల్ఫ్ దేశాల నుండే వస్తాయి. అందులోనూ 90శాతం దిగుమతులు ఇరాన్ పక్కనే ఉండే 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) ద్వారానే రావాలి. యుద్ధం వల్ల ఈ మార్గం మూతపడటం సరఫరాకు ప్రధాన అడ్డంకిగా మారింది.
భారత్ మొత్తం అవసరంలో దాదాపు 60శాతం ఎల్పీజీని దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈల నుండే ఉంటుంది.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు యుద్ధం వల్ల గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా, అల్జీరియా, కెనడా వంటి దేశాల నుండి గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు చర్చలు జరుగు తున్నాయి.
ప్రాధాన్యత కేటాయింపు: వంట గ్యాస్ (Domestic LPG), సీఎన్జీ (CNG), పైపుల ద్వారా వచ్చే గ్యాస్ (PNG) సరఫరాకు 100శాతం ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆందోళన అవసరం లేదని ప్రకటించింది. అంటే కమర్షియల్ సిలిండర్లపై పరిమితులతో, ముందుగా ఇళ్లకు సరఫరా చేశాకే, మిగిలిన గ్యాస్ను పరిశ్రమలకు ఇస్తారు. ఆ తరువాతే హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య విభాగాలకు సరఫరా ఉంటుంది. దీనివల్ల బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో హోటళ్లు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది.
బుకింగ్ నియమాలు: గ్యాస్ హోర్డింగ్ (నిల్వ చేయడం) అరికట్టడానికి, సిలిండర్ బుకింగ్ గ్యాప్ను 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారు.
ప్యానిక్ కావద్దు, ప్యానిక్ బుకింగ్లు నివారించండి!
ఎల్పీజీ డీలర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పీవీ రావు సాక్షి వెబ్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. భారతదేశంలో సాధారణంగా ప్రతీసారి నెలకు సరిపడా నిల్వ ఉంటుంది. ఆందోళన అవసరం లేదన్నారు. యుద్ధ వాతావరణానికి ఆధారంగా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందిని చెప్పారు. అలాగే ఈ సంక్షోభాన్ని నివారించే చర్యల్లో భాగంగా వినియోగదారులకు 25 రోజుల తర్వాత మాత్రమే రెండో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తద్వారా సరఫరా సరళీకరణ చేయాలనేది తమ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఈ విషయంలో వినియోగదారులు సహకరించాలని కోరారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు. అలాగే వాణిజ్య సిలిండర్ల విషయంలో కూడా కొన్ని మార్గ నిర్దేశకాలను కూడా ఆయన సూచించారు.
పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఎల్పీజీ ధరలపై భారం పడింది
డొమెస్టిక్ సిలిండర్ ధర సుమారు రూ.60 పెరిగింది
కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 వరకు పెరిగింది.


