36 ఏళ్ల నాటి రూ. 500 లంచం కేసులో శిక్ష తగ్గింపు | 36 years after Rs 500 bribe: Supreme Court reduces 75-yr-old ex-constable jail term | Sakshi
Sakshi News home page

36 ఏళ్ల నాటి రూ. 500 లంచం కేసులో శిక్ష తగ్గింపు

Mar 17 2026 5:59 AM | Updated on Mar 17 2026 5:59 AM

36 years after Rs 500 bribe: Supreme Court reduces 75-yr-old ex-constable jail term

కానిస్టేబుల్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు 

న్యూఢిల్లీ: దాదాపు 36 సంవత్సరాల క్రితం 500 రూపాయల లంచం తీసుకున్న నేరానికి గతంలో హైకోర్టు న్యాయస్థానం ఆనాటి కానిస్టేబుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సగానికి తగ్గించింది. దోషిగా తేలుస్తూ ట్రయల్‌ కోర్టు వేసిన శిక్షను 14 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇచ్చి న తీర్పును జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, జస్టిస్‌ పీబీ వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.

అయితే 75 ఏళ్ల వయసులో మాజీ ఉత్తరాఖండ్‌ ఎక్సయిజ్‌ కానిస్టేబుల్‌ రెండేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించలేడని పేర్కొంటూ ఆ శిక్షను ఏడాదికి కుదించింది. అవినీతి నిరోధక చట్ట నిబంధనలను అనుసరిస్తూ మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement