breaking news
Supreme Court
-
హైకోర్టు సీజేలుగా బాధ్యతలు చేపట్టే జడ్జీలను ముందుగానే బదిలీ చేయాలి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలకమైన విధానపర నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు అప్పగించే జడ్జీలను ఆ పోస్ట్ ఖాళీ అయ్యేందుకు కనీసం రెండు నెలలు ముందుగానే ఆయా కోర్టులకు బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ హైకోర్టు కార్యకలాపాలపై ఆ జడ్జికి మంచి అవగాహన వస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో గురువారం సమావేశమైన కొలీజియం అభిప్రాయపడింది. కోర్టు నిర్వహణలో సమర్థంగా, మెరుగ్గా వ్యవహరించగలుగుతారని కొలీజియం సమావేశం పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు వెబ్సైట్ శుక్రవారం తెలిపింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేయాలని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైరైన వెంటనే ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నియామకం అమల్లోకి వస్తుందని వివరించింది. అదేవిధంగా, కేరళ హైకోరు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారిని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని తీర్మానించింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్చి 5న రిటైరవనున్నారు. -
నియమబద్ధ వాణిజ్యమే శరణ్యం
చీకటిని చూస్తేనే వెలుగు విలువ మరింత తెలుస్తుందంటారు. అదే ప్రకారం, అంత ర్జాతీయ వాణిజ్య సంబంధాల విషయమై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు ఏప్రిల్లో సృష్టించిన చీకటిని పది నెలల పాటు చూసిన ప్రపంచానికి, నియ మబద్ధమైన వాణిజ్యపు విలువ ఏమిటో గతం కన్నా ఎక్కువగా అర్థమైంది. కానీ ఇప్పటికీ అర్థం కానిది అమెరికా అధ్య క్షునికే! లేని అధికారాలను ఉపయోగించి ఇష్టారీతిన దిగుమతి సుంకాలు విధించటం చెల్లుబాటు కాదని అక్కడి సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పును ఈ నెల 20వ తేదీన చెప్పిన తర్వాత కూడా ఆయన తమ విధానాలు మారబోవని ప్రకటించారు. మరొక రూపంలో అదనపు సుంకాలను అమలుకు తేవటంలోని అవివేకం ప్రపంచానికంతా అర్థమవుతున్నది ఆయనకు తప్ప!అయినా మారడా?ఇక్కడ గమనించదగ్గది మరొకటి ఉంది. అమెరికాను తిరిగి గొప్పదిగా చేసే ప్రణాళికలో సుంకాల హెచ్చింపు ఒక భాగం. దాని కోసం ఈ పది నెలలుగా సాధించిన ఫలితాలలో, సుమారు 120 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని మినహాయించితే, ఇతర లక్ష్యాలు ఒక్కటైనా సిద్ధిస్తున్న సూచనలు లేవు. నికర బడ్జెట్ లోటు అంతకుమించి పెరుగుతున్నది. ఒక డజను దేశాలపై సైనిక దాడులు జరిపి, మరిన్ని దాడులకు సన్నాహాలు చేస్తున్నందున సైనిక ఖర్చుల రూపంలో జీడీపీ పెరుగుదల 1.4 శాతానికి తగ్గగా, ద్రవ్యోల్బణం మళ్లీ 3 శాతానికి చేరింది. ఉద్యోగాల పెరుగుదల ఇంత తక్కువగా ఉండటం 2013 తర్వాత ఎప్పుడూ లేదని గణాంకాలు చెప్తున్నాయి. డాలర్ విలువ, స్టాక్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లు గందరగోళానికి గురవుతున్నాయి. వీటన్నింటి ఫలితాలను అనుభవిస్తున్న అమెరికన్ ప్రజలలో ట్రంప్ ప్రజాదరణ వరుసగా పడిపోతున్నట్లు ప్రజాభిప్రాయ సేకర ణలు చెప్తున్నాయి. అంతకుమించి, స్వయంగా తనకు బలమైన మద్ద తుగా నిలిచి అధికారంలోకి తెచ్చిన ‘మాగా కానిస్టిట్యుయెన్సీ’ అని పిలిచే సామాజిక తరగతులలోనూ బలం తగ్గుతుండగా, ఈ కాలంలోనే జరిగిన మూడు గవర్నర్ ఎన్నికలను రిపబ్లికన్ కంచుకోట లుగా భావించే రాష్ట్రాలలో ఓడిపోయారు. రానున్న నవంబర్ నాటి మధ్యంతర ఎన్నికలలోనూ ఇదే జరిగితే పరిస్థితి ఏమిటన్న భయాలు ట్రంప్ పార్టీలో మొదలయ్యాయి. ‘అయినా ఆయన మార లేదు’ అన్న ఒక తెలుగు కథలోని వాక్యం వలె, ‘అయినా ట్రంప్ మారటం లేదు’.అందరితోనూ అదే ధోరణిఇవి, ఇంకా ఇటువంటివి అమెరికాలో అంతర్గతంగా కనిపి స్తున్న పరిస్థితులు. బయటి మాట చెప్పనక్కర లేదు. ట్రంప్ గత ఏప్రిల్లో ‘విమోచనా దినం’ అంటూ ప్రపంచంలోని సమస్త దేశా లపై సమాంతరమైన ఎదురు సుంకాలు అంటూ ఒక పిడుగును విసిరినప్పటి నుంచి వాణిజ్య ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారటం తెలిసిందే. ఆ పరిస్థితి ఇప్పటికీ కుదుట పడలేదు సరికదా సమీప భవిష్యత్తులో కుదుటపడే సూచనలు కూడా లేవు. అందుకు కారణం తిరిగి ఆయన చర్యలే! ఏ దేశంపై సుంకాలను ఎపుడు ఇంకా పెంచుతారో, తగ్గిస్తారో తెలియదు. ఒక దేశానికి తమతో వాణిజ్యం కావాలంటే వారు మరేదో మూడవ దేశంపై సుంకాలు పెంచాలని ఒత్తిడి చేస్తారో తెలి యదు. వాణిజ్యంతో నిమిత్తం లేకుండా రాజకీయాల కోసం చేసేదీ తెలియదు. ఇతర దేశాలలో నడుస్తున్న అమెరికన్ కంపెనీలను వాపస్ రానట్లయితే వంద శాతం సుంకాలంటారో తెలియదు. తమ ఆయుధాలు, బోయింగ్లు, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు, పారి శ్రామిక ఉత్పత్తులను చచ్చినట్లు ఖరీదు చేసే వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయనట్లయితే సుంకాలు వంద శాతమనేదీ, 500 శాతమ నేదీ తెలియదు. ‘మీరు మీకు కావలసిన చమురు వగైరాలను మాకు నచ్చని దేశాల నుంచి ఖరీదు చేయటం ఆపివేసి మేము చెప్పిన చోటు నుంచే కొనుగోలు చేయా’లని ట్యారిఫ్ల కొరడా ఝళిపించేదీ తెలియదు. దీనంతటికి తమ కూటమి దేశాలు సైతం మినహాయింపు కాకపోవటమే కాదు, వారికి చెందిన భూభాగాలను తమకు స్వాధీనం చేయకున్నా ట్యారిఫ్ల ఖడ్గ చాలనం చేస్తారు. కెనడావంటి అతి సన్నిహిత దేశంపై పెంచిన సుంకాలను స్వయంగా తన రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించి ఓడించినా లెక్క చేయరు.అదే శరణ్యంఇన్నిన్ని వివరాలు ఇంత సుదీర్ఘంగా చెప్పుకోవటం ఎందుకంటే, ఏప్రిల్లో ‘విమోచనా దినం’ నాడు అమెరికా అధ్యక్షుడు అడ్వాన్స్ విజయ దరహాసంతో ప్రకటించినట్లు, ట్యారిఫ్లన్నవి ‘మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ’ ఏమీ కాదు. తనవి పూర్తిగా తప్పుడు అంచనాలతో కూడిన లెక్కలని ఈ పది మాసాలలో ఇంటా బయటా కూడా రుజువైంది. అసమర్థుని జీవయాత్ర వలె ఇది ఒక అవివేకపు అధ్యక్షుని ఆర్థిక యాత్ర. ఆ యాత్రలో రెండవ అంకాన్ని ఆయన ఈనెల 20న సుప్రీం కోర్టు తీర్పు కలిగించిన భయం నుంచి మొదలు పెట్టారు. న్యాయమూర్తులను మనం ఊహించలేని భాషలో దూషించి, తమ విధానాలు మారబోవని ప్రకటించారు. తనకు ఇతర మార్గాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించి దేశాలను ‘సర్వ నాశనం’ చేయగలనన్నారు. 150 రోజుల కాల పరిమితి గల సెక్ష న్లను, అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడూ ఉపయోగించని వాటిని బయటకు తీసి, ఆ ప్రకారం అన్ని దేశాలపై 10 శాతం అదనపుసుంకమని, అంతలోనే 15 శాతానికి పెంచారు. ఇప్పటికే జరిగిన వాణిజ్య ఒప్పందాల నుంచి ఏ దేశమూ తప్పించుకోరాదని హెచ్చ రించారు. ఈ అదనపు సుంకాలను తాము చెల్లించబోమని యూరో పియన్ యూనియన్ స్పష్టం చేయగా, అసలు తన ఒప్పందంపై తుది చర్చలను ఇండియా వాయిదా వేసింది. ఈ విధమైన రెండవ అంకపు నాటకంలో ఇంకేమి పరిణామాలుండగలవో చూడాలి.మొత్తం మీద తేలుతున్న పాఠం ఏమిటంటే, తనకు ఏ అంత ర్జాతీయ నియమాలు లేవంటూ ట్రంప్ విచ్ఛిన్నం చేయబూనిన నియమాల ప్రకారం వాణిజ్యం, ఆర్థిక, రాజకీయ సంబంధాలే బలో న్మత్త మదపుటేనుగులకైనా అనుసరించదగిన విధానాలవుతాయి. ఈ నియమాలను అమెరికాయే నాయకత్వం వహించి రెండవ ప్రపంచ యుద్ధం దరిమిలా రూపొందించటం గాని, ఇన్ని దశాబ్దాలుగా పాటించటంగాని ఎంతో దూరదృష్టితో జరిగినటువంటిదే! ఆ నియ మాలు పూర్తి న్యాయబద్ధమైనవేమీ కాదు. అవి ధనిక దేశాలకు అను కూలం, వర్తమాన దేశాలకు ప్రతికూలం అయినా కనీసం ఒక పద్ధతిలో సాగుతూ వచ్చాయి. ట్రంప్కు అదే శరణ్యం కావాలి.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
సుప్రీంకోర్టును కూడా లెక్క చెయ్యకుండా సిగ్గులేకుండా వికృత చేష్టలు చేస్తున్నారు
-
న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పాఠంపై సుప్రీంకోర్టు సీరియస్
-
న్యాయవ్యవస్థపై అవినీతి పాఠం.. ‘సుప్రీం’ సీరియస్
ఢిల్లీ: ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో న్యాయవ్యవస్థపై అవినీతి పాఠం ఉండటంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సుమోటోగా కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోందని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ అవినీతిమయమని బోధిస్తున్నారా ? అని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.పుస్తకంలోని ఆ చాప్టర్ ను ఉపసంహరించినా పుస్తకాలు ఆన్లైన్, మార్కెట్లోనే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ విచారణ నేపధ్యంలో ఎన్సీఈఆర్టీ క్షమాపణలు తెలిపింది. కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ, ఎన్సీఈఆర్టీ చైర్మన్లకు ధర్మాసనం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దానిలో కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. ఈ చాప్టర్కి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర , రాష్ట్ర విద్యాశాఖలు సమన్వయంతో వ్యవహరించి సర్క్యులేషన్ లో ఉన్న పుస్తకాలను సీజ్ చేయాలని తెలిపింది.ఫిజికల్, డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఈ పాఠాన్ని తొలగించాలని, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దీనికి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ ఆదేశాలను అమలు చేయాలి, అఫిడవిట్ దాఖలు చేయాలి. ఈ వివాదాస్పద కంటెంట్ ను తయారు చేసిన రచయితల పేర్లను, వివరాలు ఇవ్వాలని ధర్మాసనం కోరింది. న్యాయవ్యవస్థ పై దాడి జరుగుతోందని వ్యాఖ్యానించింది. -
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంపై కేంద్రం సీరియస్
ఢిల్లీ: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం చర్యలకు సిద్ధమైంది. సిలబస్ రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఇలాంటి సిలబస్తో పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని కేంద్రం పేర్కొంది.కాగా, సుప్రీం వార్నింగ్తో ఎన్సీఈఆర్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. "న్యాయవ్యవస్థలో అవినీతి" అనే సెక్షన్ను ఎనిమిదో తరగతి పాఠ్యాంశం నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించనుంది. న్యాయవ్యవస్థపై ప్రతికూల అంశాల కంటే, స్ఫూర్తిదాయక అంశాలు రాయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థను కించపరిచే ప్రయత్నాలను సహించమంటూ ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై తగ్గిన చర్యలు తీసుకుంటామని సీజేఐ వెల్లడించారు. న్యాయవ్యవస్థకు ఉన్న అతిపెద్ద సవాళ్లు అవినీతి, న్యాయమూర్తుల ఖాళీలంటూ ఎన్సీఈఆర్టీ ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకం పేర్కొంది.న్యాయ వ్యవస్థను అవినీతి మయమని పేర్కొనడం ఆందోళనకరమంటూ సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింగ్వి.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని సుమోటో కేసుగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా చేశారని, తీవ్రంగా పరిగణిస్తున్నానని.. తగిన చర్యలు తీసుకుంటామని సీజేఐ తెలిపారు. -
ట్రంప్ అరాచకానికి బ్రేక్
‘అరాచకం సద్దుమణిగింది... దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు కళ్లెం పడింది’ అని అమెరికా ప్రజలంతా ఊపిరి పీల్చుకుని 24 గంటలు గడవకముందే మళ్లీ సమస్య మొదటికొచ్చింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) కింద నిరుడు ఏప్రిల్ నుంచి సుంకాలు విధిస్తున్న ఆయన చర్యలు చెల్లబోవని అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం 6–3 మెజారిటీతో తీర్పునివ్వగా, దాన్ని వమ్ము చేస్తూ ట్రంప్ కొత్తగా అన్ని దేశాలపైనా 15 శాతం అదనపు సుంకాలు విధించారు. తీర్పునిచ్చిన న్యాయమూర్తుల్ని మూర్ఖులుగా, దేశభక్తి లోపించిన వారిగా నిందించారు. పలు వ్యాపార సంస్థలతోపాటు 12 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై వెలువడిన ఈ తీర్పువల్ల ధరలు తగ్గి జనం లబ్ధి పొందుతారు. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ట్రంప్కు అనుకూలంగా తీర్పులిస్తూ వచ్చింది. ఏడాది కాలంలో అది మొత్తం 26 తీర్పులు వెలువరించగా, అందులో 21 ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించేవే. ఇందులో అత్యధికం అప్పీళ్ల రూపంలో వచ్చినవి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు ప్రజల తీర్పును వమ్ముచేయటానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో నమోదైన కేసు నుంచి ట్రంప్కు తొలి ఉపశమనం దొరికింది. నిరుడు మార్చిలో వలసదారులను బలవంతంగా వెనక్కి పంపే నిర్ణయాన్ని కింది కోర్టులు కొట్టివేయగా, సుప్రీంకోర్టు సమర్థించింది. మొన్న డిసెంబర్లో మాత్రం ఇల్లినాయీస్ నేషనల్ గార్డును స్వాధీనంలోకి తీసుకోవటం, షికాగో అభీష్టానికి భిన్నంగా అక్కడికి పంపటాన్ని తప్పుబట్టింది. నిజానికి గత వారం ట్రంప్కు ‘అన్నీ మంచి శకునములే...’ అన్నట్టు మొదలైంది. అమెరికాలో 3,600 కోట్ల డాలర్ల పెట్టుబడులకు అనుమతిస్తూ జపాన్ గత మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అధిక సుంకాలను 35 శాతానికి పరిమితం చేయటానికి అమెరికా అంగీకరించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అధిక సుంకాలను 32 శాతం వద్దే ఆపుతామన్న ట్రంప్ హామీకి కృతజ్ఞతగా గురువారం ఇండొనేసియా అధ్యక్షుడు దేశంలోని కీలక రంగాల్లో అమెరికా సంస్థల ప్రవేశానికి మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వు నిచ్చారు. వెంటనే ‘అమెరికా మళ్లీ గెలుస్తోంది’ అంటూ ట్రంప్ ట్రూత్ మాధ్యమం ద్వారా తెగ సంబరపడ్డారు. తీరా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సుంకాలు కాస్తా రద్దయ్యాయి. ఆ తీర్పు అనంతరం ట్రంప్ పెంచిన సుంకాలు కేవలం 15 శాతం కావటంతో ఆ రెండు దేశాలూ తమ నిర్ణయాలకు సహజంగానే పశ్చాత్తాప పడుతున్నాయి. మన దేశం సైతం పునరాలోచనలో పడిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. సోమవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు మన ప్రతినిధి బృందం అమెరికా అధికారులతో జరపవలసిన చర్చలు వాయిదా పడ్డాయి. వియత్నాం 20 శాతం అదనపు సుంకా లకు అంగీకరించగా, ఇప్పుడది 15 శాతానికి తగ్గింది. ఇంకా దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా వంటి దేశాలతోపాటు అమెరికా మిత్రదేశాలు కూడా తలపట్టుకుంటున్నాయి. కాకపోతే ఒప్పందాల్ని రద్దుచేసే సాహసానికి దిగలేదు. నిరుడు 27 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) 15 శాతం సుంకాలకు అంగీకరిస్తూ ఒప్పందం కుదుర్చుకోగా, ట్రంప్ వాటిపై సైతం కొత్తగా 15 శాతం అదనపు సుంకాల భారం మోపారు. తన అరాచక నిర్ణయాలను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని ట్రంప్ గట్టిగా నమ్మారు. అందుకే వీలుచిక్కినప్పుడల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పొగుడుతూ వచ్చారు. అమెరికాలో న్యాయమూర్తుల నియామకాల్లో అధికార పక్షం ముద్ర బహిరంగ రహస్యం. ఆ రకంగా చూస్తే మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో ప్రధాన న్యాయమూర్తి, మరో అయిదుగురు రిపబ్లికన్ అనుకూలురు. ముగ్గురు మాత్రమే డెమాక్రాటిక్ పార్టీకి చెందినవారు. ఏదేమైనా ట్రంప్ తాజా సుంకాలు 150 రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి. ఈలోగా ప్రతినిధుల సభ ద్వారా తన పంతం నెగ్గించుకోవటం ఆయనకు కష్టమే. ట్రంప్ రేటింగ్ పడిపోయి, వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో పార్టీ ఊడ్చిపెట్టుకుపోవటం ఖాయం అన్న సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ఏం చేస్తారన్నది చూడాలి. మొత్తానికి సుప్రీంకోర్టు చెప్పినా సరే... దేశాన్ని అనిశ్చితిలో పడేసే తన ధోరణి మారబోదని ట్రంప్ తేల్చిచెప్పారు. -
సుబ్రమణ్యస్వామి పిటిషన్.. నేడు విచారణ జరపనున్న సుప్రీం కోర్టు ధర్మాసనం
-
దేవుడితో రాజకీయం చేస్తావా.. లడ్డూపై కుట్రలో బాబుకు బీజేపీ నేత షాక్
-
‘లడ్డూ’పై బాబు సర్కారు ఏకసభ్య కమిటీ.. నేడు ‘సుప్రీం’లో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలో చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేయడం... దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి, సొంత విచారణకు చంద్రబాబు ఏకసభ్య కమిటీని నియమించటాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది.సీఎం అబద్ధాలు ప్రచారం చేశారురాజకీయ దురుద్దేశాలతో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని తన పిటిషన్లో సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. దీనిపై రాజకీయ కుట్రలు, వాస్తవాలను వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు.స్వయంగా ‘సుప్రీం’ పర్యవేక్షిస్తున్నా ఏకసభ్య కమిటీనా..? లడ్డూ ప్రసాదం విషయంలో నిగ్గు తేల్చేందుకు స్వయంగా సుప్రీంకోర్టు ఇప్పటికే జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ విచారణ కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్తో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం పట్ల సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, న్యాయ ప్రక్రియను పక్కదోవ పట్టించే యత్నమని పిటిషన్లో నివేదించారు.కుట్ర బెడిసికొట్టడంతో కమిటీ పన్నాగం!శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ లాబ్లు స్పష్టం చేయగా సీబీఐ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమైంది. దీనిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ ఒక్క వైఎస్సార్సీపీ నేత పేరును ప్రస్తావించలేదు. దీంతో చంద్రబాబు దుష్ప్రచారం బెడిసికొట్టడంతో మరో కొత్త కుత్రంత్రానికి తెర తీశారు. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలనే రాజకీయ కుట్రతో దినేష్ కుమార్ కమిటీని నియమించారు.బాబు సర్కారుపై ‘సుప్రీం’ ఘాటు వ్యాఖ్యలు..చంద్రబాబు సర్కారు దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘కనీసం దేవుడినైనా మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి..’ అంటూ చంద్రబాబునుద్దేశించి గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం, ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు తాజాగా ఏకసభ్య కమిటీని నియమించడంపై దాఖలైన పిటిషన్ నేడు విచారణకు రానుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.స్వామి పిటిషన్లో ఆరుగురు ప్రతివాదులు వీరే..⇒ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం⇒ కేంద్ర ప్రభుత్వం ⇒ చంద్రబాబు (ఏపీ సీఎం)⇒ సిట్ (రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బందం)⇒ సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)⇒ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) -
ట్రంప్ కు బిగ్ షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
ట్రంప్ టారిఫ్లు చెల్లవ్!
న్యూయార్క్/వాషింగ్టన్: రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ఎడాపెడా టారిఫ్లతో ప్రపంచ దేశాలన్నింటికీ వణుకు పుట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన అధిక టారిఫ్లను, ప్రతీకార సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ అదనపు టారిఫ్ల వడ్డనకు 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) చట్టాన్ని ట్రంప్ ఉపయోగించుకున్నారు.అది చెల్లబోదంటూ సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. చట్టసభ అయిన కాంగ్రెస్ను కాదని అత్యవసర చట్టాన్ని అడ్డుపెట్టుకుని అధ్యక్షుడే ఇలా స్వయంగా ఏకపక్షంగా టారిఫ్లు విధించడం, వాటిలో మార్పుచేర్పులు చేయడం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేసింది. ‘ఇలా అడ్డగోలు టారిఫ్లు విధించేందుకు ప్రపంచంలోని ప్రతి దేశంతోనూ అమెరికా యుద్ధమేమీ చేయడం లేదు!’అంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ మేరకు 9 మంది జడ్జీలతో కూడిన బెంచ్ 6:3 మెజారిటీతో సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది.ఈ తీర్పుతో గత ఏడాది కాలంగా పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లలో చాలావరకు చెల్లకుండా పోయాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’నినాదంతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్, తన ఆర్థిక ఎజెండాకు టారిఫ్లనే ప్రధానాంశంగా మార్చుకోవడం తెలిసిందే. టారిఫ్లతో పలు దేశాలను బెదిరించి మరీ దార్లోకి తెచ్చుకుంటూ వచ్చారు. ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకుని 2025 ఏప్రిల్ నుంచి కెనడా, చైనా, మెక్సికోలతో మొదలుపెట్టి పలు దేశాలపై వరుసగా టారిఫ్లు విధిస్తూ వచ్చారు.దీన్ని సవాలు చేస్తూ డెమొక్రటిక్ పార్టీ ఆధిపత్యంలోని పలు రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. ఐఏఏపీఏలో టారిఫ్ల గురించిన ప్రస్తావనే లేదని, కనుక ట్రంప్ చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని వాదించాయి. పలు వ్యాపార సంస్థలు కూడా వ్యక్తిగత హోదాల్లో సవాలు చేశాయి. వాటివల్ల ధరలు పెరిగి సామాన్యునిపైనే భారం పడుతుందని పేర్కొన్నాయి. వాటన్నింటినీ గత సెపె్టంబర్లో విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.ట్రంప్ అధిక టారిఫ్ల కారణంగా గత డిసెంబర్ నాటికే సుంకాల రూపంలో అమెరికాకు 133 బిలియన్ డాలర్ల మేరకు అధిక ఆదాయం లభించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి! తీర్పు నేపథ్యంలో దేశాలన్నీ ఈ అధిక టారిఫ్ మొత్తాలను తిరిగివ్వాల్సిందిగా అమెరికాను డిమాండ్ చేయవచ్చు. అందుకోసం అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కే అవకాశం కూడా ఉంది. ఈ విషయమై పలు కంపెనీలు తీర్పుకు ముందే వ్యక్తిగత హోదాలో దావాలు వేశాయి కూడా. అవన్నీ తాజా తీర్పు పట్ల హర్షం వెలిబుచ్చాయి. వసూలు చేసిన అధిక మొత్తాలను తిరిగివ్వకపోతే కోర్టు తీర్పుకు అర్థమే ఉండదని సదరు కంపెనీలు అభిప్రాయపడ్డాయి.అయితే అధిక టారిఫ్ వసూళ్లను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాలా, లేదా అన్న అంశంపై మాత్రం సుప్రీంకోర్టు తీర్పులో ఏమీ పేర్కొనలేదు. ఇది ట్రంప్కు కాస్త ఉపశమనం కలిగించే అంశమేనని భావిస్తున్నారు. కోర్టు తీర్పుపై వైట్హౌస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఐఏఏపీఏ కాకుండా ఇతర చట్టాల కింద సుంకాలు విధించకుండా ట్రంప్ను తాజా తీర్పు నిరోధించబోదు. ఈ నేపథ్యంలో టారిఫ్ల విధివిధానాలను ఇతర చట్టాల కిందకు బదలాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ట్రంప్ యంత్రాంగం శుక్రవారం సంకేతాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు అమెరికా స్టాక్మార్కెట్లో జోష్ నింపింది. తీర్పు నేపథ్యంలో పలు కీలక సూచీలు శుక్రవారం సానుకూలంగా స్పందించాయి. అమెరికాకు చెందిన పలు చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు కూడా తీర్పు పట్ల హర్షం వెలిబుచ్చాయి. వాదోపవాదాలు టారిఫ్లపై సుప్రీంకోర్టులో దాఖలైన ఈ కేసు విచారణకు ట్రంప్ చాలా ప్రాధాన్యమిస్తూ వచ్చారు. దీనిపై వెలువరించే తీర్పు అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైనదని కానుందని ఆయన పలుమార్లు చెప్పుకొచ్చారు. ‘‘సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దేశానికి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బే! దేశ ఆర్థిక వ్యవస్థే పూర్తిగా పట్టాలు తప్పుతుంది’’అని హెచ్చరించారు కూడా. కానీ అమెరికాలో ప్రజాభిప్రాయం కూడా ట్రంప్ టారిఫ్లకు అంత సానుకూలంగా లేదని పలు సర్వేల్లో వెల్లడవుతూ వచ్చింది. 1977 నాటి చట్టం ప్రకారం అత్యవసర సమయాల్లో దిగుమతులపై అదనపు పన్నులు విధించే అధికారం అధ్యక్షునికి ఉందన్నది ట్రంప్ యంత్రాంగం వాదన.దాన్ని పలువురు అధ్యక్షులు చాలాసార్లు ఉపయోగించుకున్నారని అధికారులు చెబుతూ వచ్చారు. సుప్రీంకోర్టులో న్యాయ శాఖ కూడా తాజాగా ఇదే వాదన వినిపించింది. దానితో కోర్టు ఏకీభవించలేదు. సుంకాల విధింపుకు ఆ చట్టాన్ని ఉపయోగించుకున్న తొలి అధ్యక్షుడు ట్రంపే కావడాన్ని ప్రధాన న్యాయమూర్తి రాబర్ట్స్ తన మెజారిటీ తీర్పులో ఉటంకించారు. ‘‘గతంలో ఏ అధ్యక్షుడూ ఐఈఈపీఏ కింద సుంకాలను విధించలేదు. ఆ చట్టం ప్రకారం అధ్యక్షునికి అలాంటి అధికారం లేదనేందుకు ఇదే నిదర్శనం’’అని ఆయన పేర్కొన్నారు. పన్నుల విధింపు అధికారాన్ని అమెరికా రాజ్యంగం కాంగ్రెస్కు దఖలు పరిచిందని రాబర్ట్స్ పేర్కొన్నారు. అంతే తప్ప అధ్యక్షుని సారథ్యంలోని కార్యనిర్వాహక విభాగానికి ఆ అధికారాన్ని రాజ్యాంగ రూపకర్తలు ఎప్పుడూ అప్పగించలేదని స్పష్టం చేశారు.టారిఫ్లు పన్ను విధింపు కిందకే వస్తాయని గుర్తు చేశారు. ఏకపక్షంగా టారిఫ్ల విధింపు ద్వారా అమెరికా ఫెడరల్ చట్టాలను ట్రంప్ ఉల్లంఘించారని ఆయన తేల్చారు. ఈ మేరకు బెంచ్ తరఫున రాబర్ట్స్ మెజారిటీ తీర్పు రాశారు. ముగ్గురు న్యాయమూర్తులు శామ్యూల్అలిటో, క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనా మాత్రం మెజారిటీ తీర్పుతో విభేదించారు. టారిఫ్ల విధింపు సబబేనని పేర్కొన్నారు. వారి తరఫున కవనా తీర్పు వెలువరించారు. ‘‘టారిఫ్లు తెలివైన విధానం కావచ్చు, కాకపోవచ్చు.కానీ చరిత్రను చూసినా, గత ఉదంతాలను బట్టి చూసుకున్నా వాటి విధింపు పూర్తిగా చట్టబద్ధమే’’అని ఆయన స్పష్టం చేశారు. ఆయా దేశాలు, కంపెనీల నుంచి వసూలు చేసిన అధిక టారిఫ్లను వాటికి తిరిగి చెల్లించాలా అన్నది చాలా సంక్లిష్టమైన అంశమని జడ్జి కవనా అభిప్రాయపడ్డారు. మెజారిటీ తీర్పులో దాని గురించి ఏమీ పేర్కొనకపోవడాన్ని తన తీర్పులో ఎత్తిచూపారు. అది అతి పెద్ద గందరగోళానికి దారితీయవచ్చని కూడా అభిప్రాయపడ్డారు. వారిని నియమించింది ట్రంపే తనకు వ్యతిరేకంగా మెజారిటీ తీర్పు వెలువరించిన ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఇద్దరిని నియమించింది ట్రంపే కావడం విశేషం. నీల్ గోర్సెచ్, అమీ కొనీ బారెట్లను ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉండగా నియమించారు. వీరితో పాటు, టారిఫ్ల విధింపు చట్టబద్ధమేనంటూ మైనారిటీ తీర్పు రాసిన జస్టిస్ బ్రెట్ కవనాను నియమించింది కూడా ట్రంపే. సిగ్గుచేటైన తీర్పు: ట్రంప్ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సుంకాల విధింపు కొట్టివేతను ‘సిగ్గుచేటు’గా అభివరి్ణంచారు. శుక్రవారం ఉదయం పలువురు గవర్నర్లు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. అదే సమయంలో తీర్పు వెలువడింది. ఆ విషయాన్ని అధికారులు ట్రంప్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ టారిఫ్లు కొనసాగుతాయి 1962 నాటి వర్తక విస్తరణ చట్టంలోని 232 సెక్షన్ ప్రకారం పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లకు సుప్రీంకోర్టు తాజా తీర్పు వర్తించదు. అవి యథాతథంగా కొనసాగుతాయి. ఈ చట్టం ప్రకారం పలు దేశాలపై స్టీలు, అల్యుమినియం, కలప, ఆటోమోటివ్ రంగం తదితరాలపై విధించిన టారిఫ్లపై తీర్పు ప్రభావం ఉండబోదు. ట్రంప్ ముందు మరిన్ని... టారిఫ్ మార్గాలు! సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినా, దేశాలపై టారిఫ్ల విధింపుకు అధ్యక్షుడు ట్రంప్ ముందు ఇతర మార్గాలు లేకపోలేదు. ఇంటర్నేషనల్ ఎమర్జెనీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఏఏపీఏ) చట్టం ప్రకారం టారిఫ్ల విధింపుకు ట్రంప్ ఉపయోగించుకున్నారు. దీనిప్రకారం టారిఫ్లు విధించేందుకు తనకు అపరిమితమైన అధికారముందని ఆయన వాదించారు. దాన్ని కోర్టు తోసిపుచ్చినా, ఇతర దేశాలపై టారిఫ్ల విధింపుకు ట్రంప్కు మరిన్ని మార్గాలు లేకపోలేదు. ⇒ అసమంజసమైన, వివక్షాపూరిత వ్యాపార విధానాలు అవలంబించే దేశాలపై 1974 నాటి వరక్త చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం అమెరికా ఎప్పటినుంచో అదనపు టారిఫ్లు విధిస్తూ వస్తోంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉండగా ఈ సెక్షన్ కింద చైనా దిగుమతులపై భారీ టారిఫ్లు విధిస్తానంటూ బెదిరించారు కూడా. ⇒ అదే చట్టంలోని సెక్షన్ 122 తదితరాల ప్రకారం ఇతర దేశాలపై 150 రోజుల పాటు 15 శాతం దాకా టారిఫ్లు విధించవచ్చు. ⇒ జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించే పక్షంలో 1962 నాటి వర్తక విస్తరణ చట్టంలోని సెక్షన్ 232 కూడా టారిఫ్ల విధింపుకు వీలు కల్పిస్తోంది. ట్రంప్ తన తొలి హయాంతో పాటు ఇప్పుడు కూడా ఈ అధికారాలను విస్తారంగా ఉపయోగించారు. ⇒ 1930 నాటి టారిఫ్ చట్టం ప్రకారం అమెరికా దిగుమతులపై వివక్ష చూపే దేశాలపై ఏకంగా 50 శాతం దాకా సుంకాలు విధించే అవకాశం ట్రంప్కు ఉంది. వీటని స్మూత్–హావ్లే టారిఫ్లుగా పిలుస్తారు. 1930 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని మరింత తీవ్రతరం చేశాయంటూ ఈ టారిఫ్లు చెడ్డపేరు మూటగట్టుకున్నాయి. -
నిజంగా ఇది సిగ్గు చేటు.. సుప్రీం కోర్టు తీర్పుపై ట్రంప్ ఫైర్
తన గ్లోబల్ టారిఫ్ (ప్రపంచ సుంకాల) విధానాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తనను తీవ్ర నిరాశపరిచిందని ఆయన అన్నారు. అదేవిధంగా కొంతమంది న్యాయమూర్తులు విదేశీ శక్తుల ప్రభావానికి లోనయ్యారని ట్రంప్ ఆరోపించారు. కాగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ట్రంప్ తన ఇష్టారీతిన ప్రపంచ దేశాలపై టారిఫ్లను విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరలేపాడు.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక చైనా, మెక్సికో, కెనడాతో పాటు భారత్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% నుంచి 50% వరకు సుంకాలు విధించారు. దీంతో వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని చిన్న వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలవరించింది. ధర్మాసనంలో మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్ సుంకాలను వ్యతిరేకించగా.. ముగ్గురు మాత్రమే సమర్ధించారు. ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. "ప్రెసిండెంట్ అత్యవసర అధికారాలను అడ్డుకుని, సుంకాల విధింపును నిలిపివేసిన కొందరు కోర్టు సభ్యులను చూసి సిగ్గుపడుతున్నాను. కొందరు న్యాయమూర్తులు దేశీయ ప్రయోజనాల కంటే విదేశీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అటువంటి వారి ప్రభావంతోనే ఈ నిర్ణయం వెలువడింది. ఈ తీర్పుతో విదేశీ దేశాలు చాలా సంతోషంగా ఉంటాయి. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం ఉండదు. నా వద్ద ప్లాన్ బి కూడా ఉందని పేర్కొన్నారు. కాగా సెక్షన్ 232 లేదా సెక్షన్ 301 వంటి ఇతర వాణిజ్య చట్టాల ద్వారా మళ్ళీ సుంకాలను అమలు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఏపీ డీజీపీ ఏం చేస్తున్నారు?.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
ఢిల్లీ: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం , పోలీసులు కుమ్మక్కై దర్యాప్తును సాగదీస్తున్నారన్న సుప్రీంకోర్టు.. కేసును సాగదీస్తున్న పోలీసులను సస్పెండ్ చేశారా ? మీ డీజీపీ ఏం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీకు చేతకాకుంటే చెప్పండి కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ కోర్టు మండిపడిందినవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీ అనంత బాబును లోపల ఉంచడమే మీ ఉద్దేశంగా కనిపిస్తోంది?. దర్యాప్తులో పోలీసులు చాలా నిర్లక్ష్యం వహించాన్న ధర్మాసనం.. కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు బెయిల్ పొడిగించింది. -
ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు
దేశంలో ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు గుప్పిస్తున్న ‘ఉచితాల’ సంస్కృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అసలైన లబ్ధిదారులకు, సంపన్నులకు మధ్య తేడా చూడకుండా ప్రజా ధనాన్ని ఇష్టానుసారంగా పంపిణీ చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఇలాంటి విధానాలు పాటిస్తారా అని ప్రశ్నించింది.ఖజానా ఖాళీ అవుతున్నా ఆగని కానుకలుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం (జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలి) ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలైనా, లోటు బడ్జెట్తో నడుస్తున్న రాష్ట్రాలైనా.. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు సైతం ఎన్నికల ముందు స్కూటీలు, బట్టలు, ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేయడానికి వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నాయి?’ అని ధర్మాసనం నిలదీసింది.ఈ ప్రస్తావనకు సందర్భం ఏమిటి?తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎన్పీడీసీఎల్) దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ చర్చ మొదలైంది. విద్యుత్ (సవరణ) చట్టం-2024లోని రూల్ 23 రాజ్యాంగ బద్ధతను తమిళనాడు ప్రభుత్వం సవాలు చేసింది. ఈ క్రమంలో సీజేఐ స్పందిస్తూ.. ‘విద్యుత్ రంగంలో సంపన్నుల నుంచి వసూలు చేసి లాభాలు గడించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రాలు ఎందుకు ఆ పని చేయడం లేదు? హరియాణా, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్ లేదా ఈశాన్య రాష్ట్రాలు ఏదైనా కావచ్చు.. ఎన్నికలు రాగానే పథకాల వెల్లువ ఎందుకు వస్తోంది?’ అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు, సిద్ధాంతకర్తలు ఈ సంస్కృతిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.కోర్టు పరిమితులుఒక దశలో సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు భావించింది. అయితే న్యాయవ్యవస్థ పరిమితులను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని ధర్మాసనం నిర్ణయించుకుంది. కానీ, సంక్షేమానికి, విచ్చలవిడి ఖర్చుకు మధ్య సమతుల్యత లేకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.టీఎన్పీడీసీఎల్ వాదన ఏమిటి?తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ప్రధానంగా విద్యుత్ (సవరణ) నియమావళి, 2024లోని రూల్ 23 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైంది.రూల్ 23 అంటే..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) తాము సరఫరా చేసే విద్యుత్తుకు అయ్యే ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేయాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వర్గానికి (ఉదాహరణకు రైతులకు లేదా గృహ వినియోగదారులకు) ఉచిత విద్యుత్ లేదా సబ్సిడీ ఇవ్వాలనుకుంటే ఆ సబ్సిడీ మొత్తాన్ని ముందుగానే డిస్కమ్ సంస్థలకు చెల్లించాలి.తమిళనాడు ప్రభుత్వం ఏమంటుంది?తమిళనాడు ప్రభుత్వం ఈ నిబంధనను కొన్ని కారణాలతో వ్యతిరేకిస్తోంది. విద్యుత్ అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజల అవసరాలకు అనుగుణంగా సబ్సిడీలు ఇచ్చే స్వతంత్ర అధికారం ఉంటుంది. కేంద్రం ఇలాంటి కఠిన నిబంధనలు పెట్టడం రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమేనని వారి వాదన. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యయాలు పెరిగినప్పుడు ఆ భారాన్ని తక్షణమే వినియోగదారులపై వేయడం సాధ్యం కాదని, అది సామాన్యులపై భారం చూపుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేది దశాబ్దాలుగా వస్తున్న విధానం. రూల్ 23 వల్ల ఈ సంక్షేమ పథకాల అమలు కష్టతరమవుతుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారించినప్పుడు ఉచితాల అంశాన్ని లేవనెత్తింది. ఒకవైపు డిస్కమ్లు భారీ నష్టాల్లో ఉన్నాయని చెప్తూ, మరోవైపు సంపన్నులకు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కోర్టు ప్రశ్నించింది. సంపన్నుల నుంచి సరైన ధర వసూలు చేస్తే ఆ ఆదాయాన్ని పేదలకు మెరుగైన విద్యుత్ అందించడానికి లేదా మౌలిక సదుపాయాల కల్పనకు వాడవచ్చు కదా అని సీజేఐ సూచించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
పార్టీలకు బిగ్ షాక్ సుప్రీంకోర్టు సీరియస్
-
Prathyusha case: 24 ఏళ్ల తర్వాత సుప్రీం సంచలన తీర్పు.. అసలేం జరిగిందంటే?
-
అంతా.. ఫిబ్రవరిలోనే
సాక్షి,సిటీబ్యూరో/మణికొండ: అప్పట్లో తెలుగునాట కలకలం సృష్టించిన సినీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. 24 ఏళ్ల ఈ ఎపిసోడ్లో కీలక ఘట్టాలన్నీ ఫిబ్రవరిలోనే జరగడం యాదృచ్ఛికం. 2002లో.. నగరంలోని తార్నాకలో ఉండే ప్రత్యూషకు సహా విద్యార్థి, సిద్ధార్థరెడ్డితో పరిచయం ప్రేమకు దారి తీసింది. 1998లో ‘రాయుడు’ చిత్రంతో ప్రత్యూష సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2002 నాటికి ఆమె సుమారు 10 సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డిల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. సిద్ధార్థ కుటుంబం వీరి వివాహానికి అంగీకరించలేదు. ఈ వివాదం నేపథ్యంలో 2002 ఫిబ్రవరి 23న పంజగుట్టలోని బ్యూటీపార్లర్లో ఉన్న ప్రత్యూషను సిద్ధార్థ తన కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే హైదర్గూడలో ‘ఆర్గానోఫాస్ఫేట్’ పురుగుల మందు ఖరీదు చేసి కూల్డ్రింక్లో కలిపి తెచ్చాడు. దీన్ని ఇద్దరూ కారులోనే తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష మరణించింది. 2004లో.. ఈ ఉదంతంపై పంజగుట్ట పోలీసులు సిద్ధార్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యూష పోస్టుమార్టం నివేదికలోని అంశాలు, ఇతర పరిణామాల ఆధారంగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, సిద్ధార్థతో పాటు అందులో ప్రమేయం ఉన్న వాళ్లు హత్య చేసి కేసును తారుమారు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. చివరకు ప్రత్యూషది ఆత్మహత్యగా తేలి్చన సీబీఐ.. అందుకు ప్రేరేపించిన సిద్ధార్థపై అభియోగపత్రం దాఖలు చేసింది. కేసును విచారించిన సెషన్స్ కోర్టు 2004 ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష విధించింది. 2026లో.. ఈ తీర్పును సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో అప్పట్లో సవాల్ చేయడంతో సెషన్స్ కోర్టు విధించిన శిక్షను తగ్గిస్తూ, జరిమానాను పెంచుతూ 2011 డిసెంబర్లో తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తగ్గించడాన్ని సరోజినీ దేవి, శిక్ష విధించడాన్ని సిద్ధార్థ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అతడి పిటిషన్ను తోసిపుచి్చంది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థను ఆదేశించింది. ఇలా ఈ కేసులో 2002 ఫిబ్రవరి– 2026 ఫిబ్రవరి మధ్య 24 ఏళ్లలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
నిజమైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన
నటి ప్రత్యూష కేసులో ఎట్టకేలకు తుదితీర్పు వెలువడింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని పేర్కొంది. అలానే అతడి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలుశిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు అనంతరం స్పందించిన ప్రత్యూష తల్లి సరోజిని దేవి.. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: రిలీజ్కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత)'హైకోర్డు తీర్పునే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎక్కడున్నా సరే సిద్ధార్థ్ రెడ్డి వచ్చి లొంగిపోవాలని తీర్పులో పేర్కొన్నారు. రెండున్నరేళ్లని ఖరారు చేశారని అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే నా కూతురిపై అత్యాచారం జరిగిందని నేను నమ్ముతున్నా. చంపేశారని కూడా నమ్ముతున్నా. నా కూతురు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఎవరేం చెప్పినా ఈ రెండింటి గురించి వేరేది నమ్మే పరిస్థితిలో లేను''నా బిడ్డకు నిజమైన న్యాయం మాత్రం దక్కలేదు. సిద్ధార్థ్ రెడ్డికి జీవిత ఖైదు పడాలని నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నాను. నాది సుప్రీంకోర్టులో 14 ఏళ్ల పోరాటం. 2011 నుంచి పోరాడుతూనే ఉన్నాను. హైకోర్టులో ఇచ్చిన రెండున్నరేళ్ల శిక్షని.. ఇక్కడ రెట్టింపు చేస్తారని భావించాను. కానీ సుప్రీం ఇచ్చిన తీర్పు తర్వాత నా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు. నా బిడ్డ ఆత్మకు శాంతి కలగదలేదని అనుకుంటున్నాను' అని సరోజిని దేవి చెప్పుకొచ్చారు.ప్రత్యూష ఎవరనేది ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు గానీ 90స్ ప్రేక్షకులని అడిగితే చెప్తారు. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు తన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడింది. సిద్ధార్థ్ కుటుంబం.. ఈ ప్రేమని అంగీకరించకపోవడంతో వీళ్లిద్దరూ 2002 ఫిబ్రవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రత్యూషని ఆత్మహత్యకు ప్రేరేపించాడని చెప్పి సిద్ధార్థ్ రెడ్డికి తొలుత ఐదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే 2011లో ఈ శిక్షని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచల తీర్పు.. లొంగిపోవాల్సిందే..!
-
శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం కీలక తీర్పు
-
మణిపూర్ హింసపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: మణిపూర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. అదేవిధంగా, సుప్రీంకోర్టుకు బదులుగా మణిపూర్ హైకోర్టు లేదా గౌహతి హైకోర్టు లేదా రెండు కోర్టులు కలిపి అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ఇతర పరిణామాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మణిపూర్ హింసాత్మక ఘటనల బాధితుల పునరావాసం, సంక్షేమంపై ఏర్పాటైన జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ సిఫారసులను తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. జాతుల మధ్య వైరంతో 2023లో మణిపూర్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి దాఖలైన 11 ఎఫ్ఐఆర్లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘బాధితులకు న్యాయం చేకూర్చేందుకు, పునరావాసం కల్పించేందుకు ఏర్పాటు చేసిన రెండు కమిటీలు 27 నివేదికలను కోర్టుకు అందజేశాయి. మా చేతికి ఒక్కటీ అందలేదు. అయితే, ఆ నివేదికల్లోని అత్యంత సున్నితమైన అంశాలు లీకవుతాయేమోనని ఆందోళన చెందుతున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. బాధితుల తరఫు లాయర్ గొన్జాల్వెస్ స్పందిస్తూ సున్నితమైన అంశాలను తొలగించడం లేదా నల్లటి గీతతో మూసివేయవచ్చని సూచించారు. అదేవిధంగా, గ్యాంగ్ రేప్నకు గురైన కుకీ వర్గానికి చెందిన బాధితురాలు ఇటీవలే చనిపోయారని సీనియర్ లాయర్ వృందా గ్రోవర్ తెలిపారు. ఈ కేసులో చార్జిషీట్ వేసిన సీబీఐ అధికారులు బాధితురాలి కుమార్తెకు అందుకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘దిగువ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా సీబీఐ ప్రతినిధి రాలేదు. ప్రధాన నిందితుడిని హాజరుపర్చలేదు. అధికారుల నిర్లక్ష్యం చూసి షాకవుతున్నాం’అని వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. -
మీడియేషన్ సరైన సొల్యూషన్!
తండ్రి వీలునామా ద్వారా సంక్రమించిన 4,461 చదరపు గజాల స్థలంలో భవన నిర్మాణం కోసం కె.రవీంద్రనాథ్, ఆయన సోదరి మధ్య వివాదం నెలకొంది. సుప్రీంకోర్టు వరకు కేసులు వేస్తూ వెళ్లారు. ‘ఇది అన్నాచెల్లెలి మధ్య జరుగుతున్న న్యాయపోరాటం. వివాదం ప్రారంభమై ఇప్పటికే 12 ఏళ్లయింది. ఇద్దరూ చర్చించుకుని ఓ న్యాయబద్ధమైన పరిష్కారానికి రావాలన్నది మా ఆకాంక్ష. దీని కోసం మధ్యవర్తిగా జస్టిస్ సుధాంశు ధులియాను నియమిస్తున్నాం.’ –హైదరాబాద్కు చెందిన కేసులో సుప్రీంకోర్టు సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వెళ్లాలంటే భయం.. కేసు ఎప్పటికి పరిష్కారమవుతుందోనని.., న్యాయవాదులు ఫీజు ఎంత అడుగుతారోనన్న ఆందోళన. కేసు తేలేదాక పార్టీల మధ్య వివాదాలూ తప్పవు. అదే బంధువులు, స్నేహితులైతే ఇక ఆ బంధం నిలబడే అవకాశమే ఉండదు. పలు క్రిమినల్ కేసులకు సివిల్ కేసు మూలంగా మారుతోంది. అలా కాకుండా.. సమయం, డబ్బుతోపాటు బంధాలు కలిపి ఉంచే ఒకే ఒక వేదికే ‘మధ్యవర్తిత్వం’. ఇరుపక్షాలు రాజీ కుదర్చుకుని ఆనందాన్ని పొందవచ్చు. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనాలైన సుప్రీంకోర్టు, హైకోర్టు మధ్యవర్తిత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. న్యాయస్థానాలపై కేసులు భారం తగ్గించడం, సత్వర న్యాయం అందించడమే ధ్యేయంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది కూడా ‘దేశం కోసం మధ్యవర్తిత్వం’కార్యక్రమాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభించింది. ఈ సందర్భంగా ‘మధ్యవర్తిత్వం’పై ప్రత్యేక కథనం.. పరిష్కరించుకునే కేసులు: సివిల్, వాణిజ్య, దాంపత్య వివాదాలు, చెక్బౌన్స్ కేసులు, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, భూసేకరణ, వినియోగదారుల సంబంధ, కాంట్రాక్ట్ యాక్ట్ కేసులు, ఆర్థిక, ఆస్తి విభజన తగాదాలు, లేబర్కోర్టు కేసులుఇరుపార్టీలకు విజయం: పంచాక్షరీ, సభ్యకార్యదర్శి, టీజీఎల్ఎస్ఏ ఢిల్లీలోని మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ ఆదేశాల మేరకు ‘దేశం కోసం మధ్యవర్తిత్వం–2.0’ను గత నెల 2 నుంచి ప్రారంభించాం. హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, టీజీ ఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శామ్కోషి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. కక్షిదారులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని విలువైన సమయం, డబ్బును ఆదా చేసుకోవాలి. ఇరుపార్టీల అంగీకారం మేరకే వివాదం పరిష్కారం అవుతుంది. మధ్యవర్తిత్వంలో ఆయా పార్టీలదే అంతిమ విజయం. మధ్యవర్తిత్వం బంధాలను నిలబెడుతుంది. మధ్యవర్తిత్వం కోసం ఎక్కడ సంప్రదించాలి... » ప్రతీ జిల్లాలోని న్యాయసేవాధికార సంస్థ ఆవరణలో మధ్యవర్తిత్వ కేంద్రం ఉంటుంది. » కో–ఆర్డినేటర్, మధ్యవర్తిత్వ కేంద్రం, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, హైకోర్టు ప్రాంగణం. నల్సా టోల్ ఫ్రీ నంబర్ 15100 దేశం కోసం మధ్యవర్తిత్వం పురాతన, ఇతిహాసాల కాలం నుంచి మన దేశంలో అమల్లో ఉన్న మధ్యవర్తిత్వాన్ని న్యాయపరంగా, చట్టబద్ధంగా ప్రోత్సహించాలని సుప్రీంకోర్టు నిర్ణయించి ఏటా ‘దేశం కోసం మధ్యవర్తిత్వం’కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ ఏడాది మధ్యవర్తిత్వానికి అనుకూలంగా ఉన్న కేసులను సిద్ధం చేయాలని హైకోర్టులకు సమాచారమిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఆదేశాల మేరకు జనవరి 2 నుంచే దీని కోసం తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ(టీజీఎల్ఎస్ఏ) చర్యలు ప్రారంభించింది. మధ్యవర్తిత్వ నిర్వహణకు శిక్షణ పొందిన వారు : 587 వీరిలో న్యాయవాదులు : 581 పదవీ విరమణపొందిన హైకోర్టు జడ్జిలు : 6 న్యాయవాదుల్లో హెచ్సీఎల్ఎస్సీ సభ్యులు : 67 40 గంటల ప్రత్యేక శిక్షణ పొందిన జ్యుడీషియల్ అధికారులు: 137 -
రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) పనితీరుపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెరా సంస్థలు కేవలం బిల్డర్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నాయని, కొనుగోలుదారుల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నాయని ధర్మాసనం ఘాటుగా విమర్శించింది.ఏమిటీ వివాదం?హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర రెరా కార్యాలయాన్ని సిమ్లా నుంచి ధర్మశాలకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ నోటిఫికేషన్పై స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయిమాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది.ధర్మాసనం ప్రధాన వ్యాఖ్యలువిచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ రెరా పనితీరును తప్పుబడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘రెరాను ఏర్పాటు చేసిన అసలు ఉద్దేశాన్ని రాష్ట్రాలు విస్మరిస్తున్నాయి. డిఫాల్ట్ అయిన బిల్డర్లకు సహకరించడం తప్ప, ఈ సంస్థల వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. ఇలాంటి సంస్థలను కొనసాగించడం కంటే రద్దు చేయడమే మేలు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్డర్ల పట్ల ఈ సంస్థలు చూపిస్తున్న సానుకూల ధోరణిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల మార్పు అనేది పరిపాలనాపరమైన నిర్ణయమని పేర్కొంటూ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది.కోర్టు ఆదేశాలురెరా కార్యాలయాన్ని, అప్పీలేట్ ట్రిబ్యునల్ను సిమ్లా నుంచి ధర్మశాలకు మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ప్రజలకు, బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రిన్సిపల్ అప్పీలేట్ బాడీని కూడా ధర్మశాలకే తరలించాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయం తరలింపుపై ఉన్న స్టేను కూడా కోర్టు తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపించారు. కాగా, గతేడాది జూన్ 13న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న రెరా సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు! -
నిందితుల హక్కుల పరిరక్షణపై ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: నిందితుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ నిమిత్తం క్రిమినల్ కేసులను విచారించే దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సొంతగా న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని నిందితులకు లీగల్ ఎయిడ్ కింద ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నిందితులకు తప్పనిసరిగా తెలియజేయాలని దిగువ కోర్టులను ఆదేశించింది. సాక్షుల విచారణ ప్రారంభం కావడానికి ముందే నిందితులకు న్యాయ సహాయం గురించి చెప్పాలంది. ఇందుకు నిందితులు ఏం చెప్పారు? న్యాయ సహాయానికి అంగీకరించారా?, న్యాయ సహాయం పొందేందుకు అంగీకరిస్తే అందుకు తీసుకున్న చర్యలు ఏమిటనే విషయాలను రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. అలా రికార్డ్ చేసిన వివరాలను సాక్షుల విచారణ మొదలు కావడానికి ముందే కోర్టు ఉత్తర్వుల్లో పొందుపరచాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అన్ని కింది కోర్టులు కచ్చితంగా పాటించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల నేపథ్యం ఇదీ.. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో నిందితురాలిగా ఉన్న రెజీనామేరీ చెల్లమణికి మద్రాస్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. తన తరఫున వాదించేందుకు న్యాయవాది లేకపోవడంతో విచారణ ప్రారంభ దశలో సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేకపోయిన విషయాన్ని నిందితురాలు గుర్తించింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాక్షులను తిరిగి విచారించాలని పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాతే.. ఆమెకు సాక్షులను ప్రశ్నించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సొంతగా న్యాయవాదులను నియమించుకునే స్థోమత లేని నిందితులకు, తమ తరఫున వాదించుకోవడానికి న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉందన్న విషయాన్ని వారికి కింది కోర్టులు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించింది. -
వాళ్లూ.. ఉపాధ్యాయులే.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..
-
3 వారాల్లో తేల్చాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మె ల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు మరో సారి డెడ్ లైన్ విధించింది. అనర్హతలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న కాలయాపనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం వెలువడకపోతే తామే నేరుగా జోక్యం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీద్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించింది. మున్సిపల్ ఎన్నికలతో ఆలస్యం: సింఘ్వీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ‘అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. పెండింగ్లో ఉన్న మొత్తం పిటిషన్లలో ఒకదానిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. మిగిలిన రెండు పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ఉండటం వల్ల స్పీకర్ కొంత సమయం కోరాల్సి వచ్చింది. మార్చి మధ్యలోగా లేదా అంతకంటే ముందే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది..’ అని చెప్పారు. 16 నెలలుగా ఏం చేస్తున్నారు?: మోహిత్ రావ్ సింఘ్వీ వాదనలను పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది మోహిత్రావ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ’గత 16 నెలలుగా ఈ వ్యవహారాన్ని స్పీకర్ కార్యాలయం తొక్కిపెడుతోంది. స్పీకర్ స్వయంగా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని గతంలో కోర్టుకు హామీ ఇచ్చి, ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే విచారణ జరిపారు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?..’ అని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కోర్టులను రీల్స్ కోసం వాడుకోవద్దు విచారణ సందర్భంగాన్యాయవాద వృత్తిలోని నైతికతపై జస్టిస్ సంజయ్ కరోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు గదుల్లో జరిగే వాదనలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ’రీల్స్’ రూపంలో పోస్ట్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ’న్యాయస్థానాలను రీల్స్ కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పుడు ఒక కొత్త పరిశ్రమగా మారింది. బాధ్యతాయుతమైన ఆఫీసర్లుగా ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు..’ అని హితవు పలికారు. -
వాళ్లూ.. పూర్తి స్థాయి ఉపాధ్యాయులే
‘‘యువత ఈ దేశ భవిష్యత్తు. వారికి సరైన దిశానిర్దేశం చేసి నిర్మాణాత్మక శక్తిగా మార్చేది ఉపాధ్యాయులే. ఒక బలమైన దేశానికి పునాది ఆ దేశ పౌరుల వ్యక్తిత్వం, విలువలలో ఉంటుంది. పునాదే బలహీనంగా ఉంటే దేశం కూలిపోక తప్పదు. మన భారత భాగ్య విధాతలను గొప్పవారిగా మలచడంలో ఉపాధ్యాయులది అత్యంత కీలక పాత్ర. భారతీయ సంస్కృతిలో ‘గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః’ అని అంటారు. ఉపాధ్యాయుడిని దైవంతో సమానంగా చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయుడు దైవం కంటే కూడా గొప్పవాడు. దేశ పునాదిని నిర్మించే ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ఇవ్వాలి. వారి సేవలకు తగిన విధంగా గౌరవ వేతనం, ప్రతిఫలాన్ని అందించాలి. నిజానికి వారు చేసే సేవలకు ఏ గౌరవ వేతనమూ సరితూగదు’’ – సుప్రీంకోర్టు ధర్మాసనంసాక్షి, అమరావతి: ‘సర్వ శిక్షా అభియాన్’ పథకం కింద నియమితులైన పార్ట్టైం టీచర్లు / కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్టర్లు / కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. నియామక కాలం పూర్తయిన తరువాత కూడా కొనసాగుతున్న ఉపాధ్యాయులను ఇకపై ’కాంట్రాక్ట్’ ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. వారు ఇతర పనులు చేయకుండా ప్రభుత్వం నిషేధించినందున పూర్తిస్థాయి ఉపాధ్యాయులే అవుతారని స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఉపాధ్యాయులకు వేతనం చెల్లించాల్సిన బాధ్యత ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపింది. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉపాధ్యాయులకు ముందుగా చెల్లించి, ఆ తర్వాత కేంద్రం నుండి ఆ మొత్తాలను వసూలు చేసుకోవాలని పేర్కొంది. పార్ట్టైం టీచర్లు / కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్టర్లు / కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు చెల్లించే గౌరవ వేతనం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని, కనీసం ప్రతి మూడేళ్లకు ఒకసారి సవరించాలని పేర్కొంది. 2013లో ఖరారు చేసిన రూ.7 వేలనే ఇప్పటికీ గౌరవ వేతనంగా చెల్లిస్తుండటం ‘వెట్టిచాకిరి’ కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదంది. 10 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వీరి పోస్టులు శాశ్వతమైనవిగా పరిగణించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. సర్వ శిక్షా అభియాన్ పథకం కింద ఉత్తరప్రదేశ్లో నియమితులైన ఉపాధ్యాయులకు గౌరవ వేతనాన్ని రూ.7 వేలుగా మాత్రమే చెల్లిస్తుండటంపై దాఖలైన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈమేరకు కీలక తీర్పు వెలువరించింది. 2017–18 సంవత్సరానికి మాత్రమే రూ.17 వేలను కనీస వేతనంగా చెల్లించాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పార్ట్టైం ఉపాధ్యాయులు, ఇన్స్ట్రక్టర్ల సంఘం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసింది. మరోవైపు రూ.17 వేలను కనీస వేతనంగా నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. టీచర్ల సంఘం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తూ, ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది.వారి ఆర్థిక భద్రత బాధ్యత రాష్ట్రాలదే...‘ఈ ఉపాధ్యాయుల సేవలు విద్యా వ్యవస్థకు నిరంతరం అవసరం కాబట్టి సర్వ శిక్షా అభియాన్ పథకం కొనసాగినంత కాలం వారికి తగిన ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. వేతనం విషయంలో జాప్యం, కోతలు, అస్పష్టత ఉపాధ్యాయులను ఆర్థికంగా బలహీనులను చేస్తుంది. ఇది విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయులకు గౌరవ వేతనాన్ని సమయానికి, నిరంతరాయంగా చెల్లించాలి. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు (వేతనం తగ్గించడం, ఆలస్యం చేయడం) అన్యాయమైనవే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఉపాధ్యాయుల సేవలను దృష్టిలో ఉంచుకొని వారికి గౌరవప్రదమైన జీవనానికి సరిపడే వేతనం ఇవ్వాల్సిందే. ప్రస్తుత కేసులో.. సర్వశిక్షా అభియాన్ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.7 వేలు మాత్రమే ఇస్తోంది. ఇది మామూలు కార్మికులకు ఇచ్చే కనీస వేతనం కంటే తక్కువ. ఈ ఉపాధ్యాయులకు నెలకు రూ.17 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. కనీసం ప్రతి మూడేళ్లకొకసారి వేతనాన్ని సవరించాలి’ అని ధర్మాసనం తన తీర్పులో తేల్చి చెప్పింది.పార్ట్టైం టీచర్లని పిలవడం మోసపూరితం..‘ప్రాథమిక పాఠశాలల్లో నియమితులైన పార్ట్టైం, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) నిర్దేశించిన ప్రాథమిక విద్యార్హతలు కలిగి ఉంటారు. అందువల్ల వీరు రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదు. వీరిని ’పార్ట్ టైం టీచర్లు’ అని పిలవడం మోసపూరితం. వారు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానమైన అర్హతలు కలిగి ఉండి, సమాన విధులను నిర్వర్తిస్తున్నారు. వారి విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం వేరే ఏ ఇతర ఉద్యోగం చేయకూడదు. ప్రభుత్వం వారిని ఇతర పనులు చేయకుండా నిరోధించినప్పుడు, వారిని వాస్తవానికి పూర్తి స్థాయి ఉపాధ్యాయులుగానే పరిగణించాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.తాత్కాలికం మానేసి.. రెగ్యులర్ నియామకాలు చేపట్టాలి‘పార్ట్టైం టీచర్లు, ఇన్స్ట్రక్టర్లు 10 ఏళ్లకు పైగా నిరంతరాయంగా పనిచేస్తున్నారు. దీంతో వీరికి ఒక రకమైన శాశ్వతత్వం ఏర్పడింది. వారు రోజుకు ఎనిమిది పీరియడ్ల వరకు బోధిస్తూ రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగానే పని భారాన్ని మోస్తున్నారు. వారి పని శాశ్వత స్వభావం కలిగినది. అనుభవం ఉన్న ఈ ఉపాధ్యాయులను తీసేసి కొత్త వారిని నియమించడం కుదరదు. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని.. మరో కాంట్రాక్ట్ ఉద్యోగితో భర్తీ చేయకూడదు. ప్రభుత్వం ఇలాంటి తాత్కాలిక నియామక పద్ధతులను మానేసి సరైన పద్ధతిలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేపట్టాలి. వీరంతా సరైన ప్రక్రియ, ప్రకటన ద్వారా ఎంపికయ్యారు కాబట్టి వీరి నియామకాలను పూర్తిస్థాయి నియామకాలుగానే పరిగణించాలి. వీరిని అడ్హాక్ సిబ్బందిగా పిలవడం అసంబద్ధం. ప్రభుత్వ సంస్థలలో తాత్కాలిక ఉద్యోగులు ఎదుర్కొంటున్న దోపిడీని ఈ కోర్టు గుర్తించింది. సమానమైన పనులు చేస్తున్నప్పటికీ వారిని ’తాత్కాలికం’ అని ముద్ర వేసి పెన్షన్, పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ప్రాథమిక హక్కులను నిరాకరించడం వారి గౌరవానికి భంగం కలిగించడమే’ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.తక్కువ వేతనానికి పని చేయించుకోవడం వెట్టి చాకిరియే..‘ఉపాధ్యాయుల గౌరవ వేతనాన్ని నిర్ణయించడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అయినప్పటికీ అది ఏకపక్షంగా ఉండకూడదు. ధరల పెరుగుదల, జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని కాలానుగుణంగా వేతనాన్ని సవరిస్తూ ఉండాలి. అతి తక్కువ వేతనానికి పని చేయించుకోవడం రాజ్యాంగంలోని 23వ అధికరణం ప్రకారం ‘వెట్టిచాకిరి’ కిందకు వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తక్కువ వేతనానికి అంగీకరించడం స్వచ్ఛందమైన పని కాదు. అది బలవంతపు శ్రమ అవుతుంది. వేరే పని చేయనివ్వకుండా కట్టడి చేసి ఇచ్చే వేతనాన్ని కూడా తగ్గించడం ఆర్థికంగా వారిని అణచివేయడమే. ఇది రాజ్యాంగ విరుద్ధం’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘బడ్జెట్ ఆమోదించడం, గౌరవ వేతనాన్ని నిర్ణయించే అధికారం కేవలం పీఏబీ (ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్)కు మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇతర కమిటీలు వేతనాలను తగ్గించడం లేదా మార్చడం చేయలేవు. గౌరవ వేతనం ఖరారుతో సహా బడ్జెట్ కేటాయింపుల అధికారాలన్నీ పీఏబీకే ఉన్నాయి. ఒకసారి పీఏబీ ఆమోదించిన గౌరవ వేతనం అమలులో ఉన్నపుడు దాన్ని రాష్ట్రం ఏకపక్షంగా తగ్గించడం చట్టవిరుద్ధం. విద్యా హక్కు చట్టంలోని రూల్ 20 ప్రకారం ఈ ఉపాధ్యాయుల జీతభత్యాలు, పెన్షన్, ఇతర సౌకర్యాలు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఉండాలి’ అని తేల్చి చెప్పింది.రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని ప్రయోజనాలు..‘నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం, ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించకూడదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జనగణన, విపత్తు నివారణ విధులు, స్థానిక సంస్థలు లేదా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల విధులకు మాత్రమే వారిని కేటాయించవచ్చు. సర్వ శిక్షా అభియాన్ పథకం కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఇటువంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద నియమితులైన ఉపాధ్యాయుల జీతభత్యాలు, వైద్య సదుపాయాలు, పెన్షన్, గ్రాట్యుటీ, పీఎఫ్ వంటివన్నీ కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఉండాలి. దీని అర్థం.. వీరు కూడా అన్ని రకాల ప్రయోజనాలకు అర్హులు. ఈ ఉపాధ్యాయులు అకడమిక్ పనులతో పాటు ఇతర విధులను కూడా నిర్వహిస్తున్నందున వారికి ఇతర ఉపాధ్యాయులతో సమానంగా గౌరవ వేతనం అందాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. -
ప్రతి పిటిషన్పై మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రతి అంశంపై మళ్లీ మళ్లీ ‘మినీ ట్రయల్స్’నిర్వహించడం సాధ్యం కాదని, దర్యాప్తును వేగంగా ముగించాలని జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్తో కూడిన ధర్మాసనం సీబీఐని గురువారం ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్నా విచారణ కొలిక్కి రాకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటే అది అంతులేకుండా పోతుందని, న్యాయం జరగడంలో జాప్యం అవుతుందని హెచ్చరించింది. ఇలాగే సాగదీస్తే మూడు నాలుగేళ్లు పడుతుంది.. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సునీతారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ ట్రయల్ కోర్టు కేవలం ఒక నిర్దిష్ట అంశంపైనే దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించినట్లు చెప్పారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు సాగదీతపై ఘాటుగా స్పందించింది. ‘ప్రతి పిటిషన్పై మేం మినీ ట్రయల్ నిర్వహించలేం. ఇలాంటి విజ్ఞప్తులను అనుమతిస్తూ పోతే ఈ కేసు అంతులేకుండా ముందుకు వెళుతుంది. ఇలాగే విచారణను సాగదీస్తే దర్యాప్తు పూర్తి కావడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. ఇది న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించడమే అవుతుంది’అని జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు. సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘ఈ కేసులో ప్రధాన దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అదనపు విచారణ కొనసాగిస్తున్నాం. కేసును ఒక ముగింపు దిశగా తెచ్చే క్రమంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం’అని నివేదించారు. నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు పేరుతో విచారణను సాగదీస్తున్నారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున అన్ని కోణాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. పిటిషనర్లు తమ వద్ద ఉన్న అదనపు సమాచారాన్ని సీబీఐకి అందజేయవచ్చని సూచించింది. ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబోం... దర్యాప్తును ఒక నెల కాలపరిమితిలోగా ముగించాలన్న అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘ఎవరిని విచారించాలి? ఎవరిని అదుపులోకి తీసుకోవాలి? అనే అంశాలపై మేం ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబోం. అది పూర్తిగా దర్యాప్తు సంస్థ విచక్షణకు సంబంధించిన విషయం. ట్రయల్ కోర్టు పర్యవేక్షణలో విచారణ వేగంగా జరగడమే ముఖ్యం. దర్యాప్తు అనేది నిరంతర ప్రక్రియ. కొత్త నిజాలు తెలిసినప్పుడు వాటిని విస్మరించలేం. దర్యాప్తు సంస్థపై కాలపరిమితి పేరుతో అనవసరమైన ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి’అని పేర్కొంది. ట్రయల్ కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ, సీబీఐ తన విధి నిర్వహణలో స్వతంత్రంగా వ్యవహరించవచ్చని పేర్కొంది. సుమారు 13,16,964 ఫైళ్లతో కూడిన సమాచారాన్ని, హార్డ్ డిస్క్లను విశ్లేషించాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టు దృష్టికి తెచ్చింది. ఇంత భారీ స్థాయిలో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి సమయం పడుతుందని, అందుకే గడువు విషయంలో వెసులుబాటు కల్పించాలని సీబీఐ కోరింది. సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై స్పష్టతనిస్తూ, కాలయాపన చేయకుండా కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. -
వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
రుణ మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్), దాని గ్రూప్ కంపెనీలతో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసాలపై దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణను వేగవంతం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోర్టు ఆదేశించింది.ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కోర్టు ఆదేశించింది. నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ దర్యాప్తును ముగించాలని ఈడీ, సీబీఐలకు స్పష్టం చేసింది.కోర్టు కీలక వ్యాఖ్యలు, ఆదేశాలుఒకే ఎఫ్ఐఆర్పై ప్రశ్నలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిర్యాదు మేరకు సీబీఐ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. అయితే బహుళ బ్యాంకుల నుంచి ఫిర్యాదులు ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతి ఫిర్యాదు వెనుక విభిన్న లావాదేవీలు ఉన్నాయని గుర్తు చేసింది.బ్యాంకు అధికారుల పాత్ర.. నిధుల మళ్లింపులో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ అధికారులు, సంస్థల మధ్య ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.నాలుగు వారాల గడువు.. దర్యాప్తు పురోగతిపై తదుపరి నాలుగు వారాల్లోగా సమగ్రమైన స్టేటస్ రిపోర్టులను సమర్పించాలని రెండు ఏజెన్సీలను కోర్టు ఆదేశించింది.వాదోపవాదాలుప్రశాంత్ భూషణ్ (పిటిషనర్ తరఫు): రూ.పదివేల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురైందని ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రధాన నిందితులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ముకుల్ రోహత్గీ (అనిల్ అంబానీ తరఫు): రిలయన్స్ గ్రూప్ బకాయిలను చెల్లించడానికి ప్రయత్నిస్తోందని, వ్యాపారంలో వచ్చే సాధారణ డిఫాల్ట్లను నేరపూరిత చర్యలుగా చూడకూడదని వాదించారు. నిందితులు విదేశాలకు పారిపోతారనే భయాల్లో నిజం లేదని ఆయన హామీ ఇచ్చారు.తుషార్ మెహతా (సొలిసిటర్ జనరల్): నకిలీ బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ గుర్తించిందని, యెస్ బ్యాంక్ పెట్టుబడులపై కూడా విచారణ జరుగుతోందని కోర్టుకు వివరించారు.ఇప్పటివరకు చేపట్టిన చర్యలుఇటీవలే ఈడీ సుమారు రూ.1,885 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తాత్కాలికంగా జప్తు చేసింది. నిధుల మళ్లింపు ఆరోపణలపై ఆర్సీఓఎం మాజీ డైరెక్టర్ పునీత్ గార్గ్ను కూడా అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిన తీరును బట్టి చూస్తే తక్షణమే కాలపరిమితితో కూడిన దర్యాప్తు అవసరమని భావించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: నాలుగు వారాల్లో తెలంగాణ డీజీపీ నియామకంపై తేల్చాలని యూపీఎస్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇవాళ (ఫిబ్రవరి 5, గురువారం) విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో డీజీపీ నియామకంపై యూపీఎస్సీ తగిన సిఫార్సులు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారుల యోగ్యత ఆధారంగా సిఫారసులు చేయాలన్న ధర్మాసనం.. సకాలంలో యూపీఎస్సీకి ప్రతిపాదిత డీజీపీ పేర్లను పంపడంలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆలస్యం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది.ఈ ఆలస్యం వల్ల మెరిట్ ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతుందన్న సుప్రీంకోర్టు.. యాక్టింగ్ డీజీపీ పేరుతో రెగ్యులర్ డీజీపీని నియమించడం లేదని పేర్కొంది. ‘‘రాష్ట్రాలు ప్రతిపాదనలు ఆలస్యం చేస్తే.. త్వరగా ప్రతిపాదనలు పంపాలని అన్ని రాష్ట్రాలకు యూపీఎస్సీ లేఖలు రాయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సకాలంలో పంపకపోతే కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోతే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదు’’ అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. -
వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై విచారణ జరిగింది. ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సునీత రెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని సీబీఐ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీబీఐ పేర్కొంది.విచారణలో భాగంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేమని.. ఇలా అయితే మూడు, నాలుగేళ్లు పడుతుందన్నారు. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చు. ఎవరిని విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వం అని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు.గత విచారణలో(జనవరి 20) కూడా.. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించగా.. ‘ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలి?. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా?. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు పదేళ్లు పడుతుంది’’ అంటూ జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా.. సునీత పిటిషన్పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను నేటికి (ఫిబ్రవరి 5) వాయిదా వేసింది. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చని ఎవరిని.. విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వమని పేర్కొంది. -
‘సుప్రీం’లో మమత..‘ఇది వ్యక్తిగత పోరాటం కాదు’
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా ధర్మాసనం అనుమతితో ఆమె నేరుగా తన వాదనలను వినిపించారు. తాను బెంగాల్ మట్టి నుంచే వచ్చానని, అక్కడ నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె కోర్టుకు విన్నవించారు. ‘నేను బెంగాల్ ముఖ్యమంత్రిగా అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాను. గౌరవనీయ న్యాయమూర్తులపై నాకు అత్యంత గౌరవం ఉంది. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, బెంగాల్ ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటం’ అని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై తాను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అనేక లేఖలు రాశానని, అయితే ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఆమె ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.ఈ ప్రక్రియ సాకుతో ప్రజల పేర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగిస్తున్నారని, ముఖ్యంగా వివాహమై అత్తవారింటికి వెళ్లిన మహిళల పేర్లను ‘నేమ్ మిస్ మ్యాచ్’ పేరుతో తొలగించడం దారుణమని ఆమె మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని, ఈ సవరణలు చేపడుతున్నారని మమతా ఆరోపించారు. ఈ ప్రక్రియ వల్ల ఏర్పడిన పని ఒత్తిడితో ఇప్పటికే పలువురు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ప్రాణాలు కోల్పోయారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమె సుప్రీంకోర్టును వేడుకున్నారు.ఎల్ఎల్బీ డిగ్రీ కలిగిన మమతా, ఈ కేసులో తన వాదనలను స్వయంగా వినిపించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ, మధ్యంతర దరఖాస్తును సమర్పించారు. కోర్టు నిబంధనలు, గౌరవ మర్యాదలపై తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యాంగ రక్షణ కోసం తానే నేరుగా వాదనలు వినిపిస్తానని ఆమె కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన మమతా బెనర్జీ ముందుగా తన బృందం సభ్యులతో మాట్లాడారు. VIDEO | Delhi: West Bengal CM Mamata Banerjee reaches Supreme Court for hearing of a plea filed by her challenging the ongoing Special Intensive Revision (SIR) of electoral rolls in the state.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/bffRWFgBYY— Press Trust of India (@PTI_News) February 4, 2026దీనికి ముందు మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ఘాటు విమర్శలు చేశారు. చిన్నపాటి వ్యత్యాసాల సాకుతో వేలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే ప్రమాదం ఉందని ఆమె ఆరోపించారు. 2022 ఓటర్ల జాబితాలో ఉన్న ఎవరి పేరునూ తొలగించవద్దని, ఆధార్ కార్డ్, పంచాయతీ ధృవీకరణ పత్రాలను సరైన గుర్తింపు కార్డులుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఈ ప్రక్రియ సాగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు అని ఆమె ఆరోపించారు.బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ అంశంపై శివసేన (యుబిటి) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలను ఉపయోగించి, బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. మమతా బెనర్జీ నేరుగా దీనిపై కోర్టులో పోరాటం చేయడాన్ని ఆమె స్వాగతిస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే పార్లమెంటులో అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాక నేపథ్యంలో ఢిల్లీలోని సుప్రీం కోర్టు వెలుపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భగవాన్ దాస్ రోడ్, పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇదిలా ఉండగా ఇటీవల తాను రాసిన ‘SIR: 26 in 26’ అనే కవితా సంపుటి ద్వారా కూడా మమతా బెనర్జీ నిరసనను వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ప్రజా కోర్టులోనూ, న్యాయస్థానంలోనూ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. -
సుప్రీంను లెక్కచేయకుండా బాబు సొంత కమిషన్ ఏర్పాటు..!
-
‘లడ్డూ’పై విచారణకు కమిషన్!
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ సిట్ దర్యాప్తులో వెల్లడికావడం.. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ న్యాయస్థానంలో దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. చార్జిషీట్లో అప్పటి టీటీడీ పాలకమండలి చైర్మన్ సహా కమిటీ సభ్యులందరినీ చేర్చడంపై సుదీర్ఘంగా మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. సీబీఐ ఇప్పటికే అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసినందున ఇక ‘సిట్’ పరిధి ముగిసిందనే నిర్ణయానికి వచ్చిన మంత్రివర్గం దీనిపై తదుపరి విచారణకు ఓ కమిషన్ను నియమించాలని నిర్ణయించింది.అయితే స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ సిట్ దర్యాప్తు నివేదిక వచ్చాక కూడా మళ్లీ విచారణ కమిషన్ ఎందుకని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసినందున విచారణ పరిధి ముగిసిందని భావిస్తున్నట్లు మంత్రి కేశవ్ చెప్పారు. ‘అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సహా కమిటీ సభ్యులందరినీ నేరస్తులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సీబీఐ సిట్ తన లేఖలో చర్యలు తీసుకోవాలని ప్రస్తావించిన అధికారుల నుంచి వివరణ తీసుకునేందుకు స్వల్పకాలిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భోలే బాబా 2019 ఏప్రిల్లోనే టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ అది ఎన్నికల సమయం’ అని మంత్రి కేశవ్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పార్ధసారధితో కలసి పయ్యావుల మీడియాతో మాట్లాడారు.చార్జిషీట్లో లోపాలపై చర్చించాం: మంత్రి పయ్యావులటీటీడీ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మాట్లాడారు. ఎన్డీడీబీ అనుమానిత రిపోర్టు ఆధారంగానే సీఎం మాట్లాడారు. అయితే ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్టు ఉందని సీఎం చెప్పలేదు. ఎన్డీడీబీ తన రిపోర్టులో ‘ఎస్’ విలువలో హెచ్చుతగ్గులున్నందున జంతు కొవ్వు అవశేషాలు ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేసింది. దాని ఆధారంగానే సీఎం మాట్లాడారు. నెయ్యి కొనుగోలు నిబంధనలను సడలించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ సిట్ ప్రభుత్వానికి సూచించింది. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో లోపాలపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం.2022లోనే నెయ్యి కల్తీ జరిగినట్లు నివేదిక ఉన్నప్పటికీ అప్పటి టీడీటీ చైర్మన్ సహా కమిటీ సభ్యులెవరూ చర్యలు తీసుకోకుండా నివేదికను తొక్కిపెట్టారు. అంతకు ముందే నెయ్యి కొనుగోలు టెండర్ల నిబంధనలను సడలించారు. దీన్నిబట్టి మొత్తం కమిటీ సభ్యులకు తెలిసే దురుద్దేశపూర్వకంగా నెయ్యి కల్తీకి పాల్పడ్డారని ప్రభుత్వం భావిస్తోంది. సీబీఐ చార్జిషీట్ను కోర్టు ఇంకా అధికారికంగా స్వీకరించలేదు. అధికారికంగా స్వీకరిస్తే గానీ అందులో ఎవరున్నారు? ఎవరిని చేర్చలేదనేది తెలియదు. చార్జిషీట్లో లోపాలుంటే కోర్టు వెనక్కు పంపించే అవకాశం ఉంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో వైవీ సుబ్బారెడ్డితో పాటు కమిటీ సభ్యుల పేర్లు లేకపోతే వారిని చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అడ్వకేట్ జనరల్ను మంత్రివర్గ భేటీకి పిలిచి సలహా కోరాం. కల్తీ నెయ్యి గురించి ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకువెళ్లాలని డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో సూచించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా నిజాయతీగా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారన్నారు. కల్తీ నెయ్యి గురించి 2022లోనే నివేదిక వచ్చినా జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగానే సీఎం చంద్రబాబు చెప్పారని, బోలే బాబాను తెచ్చిన ఆలీ బాబా ఎవరో తెలియాలని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. టీటీడీ కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పటికీ తనను కాకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా కరుణాకర్రెడ్డి, భాస్కరరెడ్డిని పిలిచేవారని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు. -
సీఈసీని అభిశంసించాలి
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను అభిశంసించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. ఆయనపై అభిశంసనకు తీర్మానం ప్రవేశపెడితే తాము కచి్చతంగా మద్దతిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఇతర విపక్ష పారీ్టలు సైతం ముందుకు రావాలని కోరారు. ఆమె మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బెంగాల్లో తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ముసుగులో తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు సీఈసీని జబాబుదారీ చేస్తూ చట్టం తీసుకురావాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన సూచనను మమతా బెనర్జీ గట్టిగా సమర్థించారు. ఇప్పుడు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను అభిశంసించాలని తేల్చిచెప్పారు. ఈ దిశగా కాంగ్రెస్ ముందడుగు వేస్తే మద్దతిస్తామని అన్నారు. ఓట్లు తొలగిస్తే బాధితులు ఎక్కడికెళ్లాలి? బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. ఎన్నికల సంఘాన్ని వాడుకోకుండా తమతో ముఖాముఖి తలపడాలని బీజేపీకి సవాలు విసిరారు. బెంగాల్లో ఎస్ఐఆర్ వల్ల దళితులు, గిరిజనులు, మైనారీ్టలు, అణగారినవర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని, వారి ఓట్లు రద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్ఐఆర్తో తొలగింపునకు గురైన ఓట్లు వందశాతం తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులవేనని చెప్పారు. బీజేపీపై అనుమానం రాకుండా ఒకటి రెండు ఓట్లు ఇతర పారీ్టల మద్దతుదారులవి కూడా తొలగించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఓట్లు తొలగిస్తే వారంతా ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు. నేడు సుప్రీంకోర్టులో విచారణకు మమత హాజరు! బెంగాల్లో ఎస్ఐఆర్ చేపట్టడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. -
దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్
-
పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోండి: సుప్రీంకోర్టు
సాంకేతికత లేదా వ్యాపార పద్ధతుల పేరుతో భారత పౌరుల గోప్యతా హక్కును హరించలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. డేటా షేరింగ్ నెపంతో ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఆటలాడటం సరికాదని మెటా, వాట్సాప్ సంస్థలను అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. దీనిలో పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు.సమాచారాన్ని దొంగిలించడానికి ఇదో మార్గంవాట్సాప్ తీసుకొచ్చిన వివాదాస్పద గోప్యతా విధానంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల ‘సమ్మతి’(Consent), ‘ఆప్ట్-అవుట్’(వైదొలగడం) మెకానిజంపై కంపెనీల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘టెక్ కంపెనీల నిబంధనలు సామాన్యులకు అర్థం కానంత తెలివిగా రూపొందించారు. అసలు ‘వైదొలగడం’(ఆప్ట్-అవుట్) అనే విధానం ఎక్కడ ఉంది? ఇది ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించడానికి ఒక తెలివైన మార్గం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.కేసు నేపథ్యం ఏమిటి?2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన గోప్యతా విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.213.14 కోట్ల భారీ జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా సంస్థ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించగా అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది. వినియోగదారులు వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా డేటా షేరింగ్కు అంగీకరించాలనే నిబంధన వినియోగదారులను బలవంతం చేయడమేనని గతంలో ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. వాట్సాప్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని అన్యాయమైన నిబంధనలను విధిస్తోందని రెగ్యులేటర్లు నిర్ధారించాయి.కేసు పరిధి విస్తరణఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కేసు పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను (మైటీ) ఈ విచారణలో చేర్చింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా గ్రూప్ కంపెనీలతో డేటాను పంచుకోవడాన్ని ఐదేళ్లపాటు నిషేధించిన సీసీఐ ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకుని పౌరుల డేటా రక్షణపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
సైబర్ నేరాల కట్టడికి కిల్ స్విచ్
సాక్షి, అమరావతి: సైబర్ నేర ముఠాలు బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టకుండా చెక్ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ సరికొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. ఆన్లైన్, డిజిటల్, యూపీఐ చెల్లింపుల ప్రక్రియలో ‘కిల్ స్విచ్’ను ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాల బాధితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను తక్షణం నిలుపుదల చేసేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. సైబర్ నేరాల కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర హోంశాఖ గత ఏడాది డిసెంబరులో ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో కేంద్ర న్యాయ, ఐటీ–టెలీ కమ్యూనికేషన్లు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు, ఆర్బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన సిఫార్సులను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచింది. ‘కిల్ స్విచ్’ సాధనాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు సైబర్ క్రైం నేరాలకు బీమా సౌకర్యం కలి్పంచాలని కూడా ప్రతిపాదించారు. నివేదికలోని ప్రధాన అంశాలివీ..బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపుల విధానంలో ఈ ‘కిల్ స్విచ్’ అనే బటన్ను ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ కమిటీ ప్రతిపాదించింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తంచేసింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలోని బ్యాంకింగ్ యాప్లు, యూపీఐ యాప్లలో ఈ ‘కిల్ స్విచ్’ బటన్ను ఏర్పాటుచేస్తారు. డిజిటల్ అరెస్టు, ఇతర సైబర్ నేరాల బారిన పడ్డామని గుర్తించగానే ఆ ‘కిల్ స్విచ్’ బటన్ను నొక్కితే చాలు.. వారి అన్ని బ్యాంకు ఖాతాలు వెంటనే స్తంభించిపోతాయి.ఆ ఖాతాల నుంచి ఇతర ఖాతాలకు నగదు బదిలీగానీ ఇతర లావాదేవీలుగానీ సాధ్యంకాదు. దీంతో.. సైబర్ నేర ముఠాలు బెదిరింపులకు పాల్పడి సామాన్యుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ చేయించుకోవడానికి అడ్డుకట్ట వెయ్యొచ్చని కేంద్ర హోంశాఖ కమిటీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇదే అంశంపై ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించింది. సైబర్ నేరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. బ్యాంకు ఖాతాలు ఉన్నవారు బీమా చేసుకుంటే.. సైబర్ నేరాలకు గురైతే బీమా పరిహారం పొందవచ్చు. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ దేశంలోని జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుప్రీంకోర్టు ఆగ్రహంతో కేంద్ర హోంశాఖ కార్యాచరణదేశంలో సైబర్ నేర ముఠాలు 2024–25లో దేశంలో రూ.34,771 కోట్లు కొల్లగొట్టాయి. డిజిటల్ అరెస్టులని బెదిరించి వీడియో కాల్స్లో గంటల తరబడి బంధించి రూ.3 వేల కోట్లు దోచుకున్నాయి. దీంతో.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడతారో చెప్పాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఫలితంగా.. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ‘కిల్ స్విచ్’ బటన్ ఏర్పాటు, సైబర్ నేరాలకు బీమా భద్రతతోపాటు మరికొన్ని అంశాలను ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు పరిశీలన అనంతరం కేంద్ర హోంశాఖ తదుపరి కార్యాచరణ చేపడుతుంది. -
టీడీ శాట్ లేవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని వెల్లడి
-
నల్లబాలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్
-
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఎం రేవంత్కు వ్యతిరేకంగా పోస్టలు పెట్టారనే ఆరోపణలపై నల్లబాలుపై నమోదు చేసిన మూడు కేసులను హైకోర్టు కొట్టివేయగా, దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టుఅసలు ఏం జరిగిందంటే.. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని బీఆర్ఎస్ కార్యకర్త నల్లబాలుపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. వాటిని తెలంగాణ హైకోర్టు కొట్టివేయడమే కాకుండా పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 2వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆ కేసులో హైకోర్టుఇచ్చిన తీర్పును అభినందించింది. మార్గదర్శకాలను ఇవ్వడంలో తప్పులేదంటూ పేర్కొంది ధర్మాసనం. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. -
రుతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కు
న్యూఢిల్లీ: రుతుక్రమ ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని జీవించే హక్కుతో పాటు విద్యా హక్కులో కూడా రుతుక్రమ ఆరోగ్యం భాగమని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బాలికల కోసం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నింటిలోనూ బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.బాల బాలికలకు, దివ్యాంగులకు విడి టాయ్లెట్లు ఉండాల్సిందేనని కూడా స్పష్టం చేసింది. వీటిని అమలు చేయని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, సర్కారీ స్కూళ్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సదరు సౌకర్యాలన్నీ అమలవుతున్నదీ లేనిదీ జిల్లా విద్యాధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించింది. నిష్పాక్షిక సర్వేల ద్వారా కూడా వాస్తవ స్థితిగతులను ఎప్పటికప్పుడు వారు తెలుసుకుంటూ ఉండాలని పేర్కొంది.విద్యా హక్కు చట్టంలోని సెక్షన్–19 ప్రకారం అన్ని పాఠశాలలూ ఈ నిబంధనలను, ప్రమాణాలను పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. లింగ సమానత్వం, విద్యాపరమైన సమానత్వాన్ని సాధించడమే లక్ష్యం కావాలని ఈ సందర్భంగా ధర్మాసనం ఆకాంక్షించింది. నెలసరి ఆరోగ్యంపై బాలికలకు సరైన శిక్షణ, అవగాహన కల్పించాలని కోరింది. విద్యా ప్రణాళికలో ఆ అంశాలను కూడా భాగం చేయాలని ఎన్సీఈఆర్టీ, రాష్ట్ర విద్యా మండళ్లు, సంబంధిత విద్యా విభాగాలకు సూచించింది. విద్యార్థినుల ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా రుతుక్రమ పరిశుభ్రత విధానం అమలు చేయాలంటూ జయా ఠాకూర్ సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. దాని 2024 డిసెంబర్ 10వ తేదీన వాదనలు ముగించిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.సమస్యల లేమి చేదు వాస్తవం ధర్మాసనం తరఫున 126 పేజీల తీర్పును జస్టిస్ పార్ధివాలా రాశారు. రుతుక్రమం బాలికల విద్యకు ముగింపు కారాదన్న ప్రఖ్యాత అమెరికా విద్యావేత్త, సామాజిక కార్యకర్త మెలీసా మెర్టన్ కొటేషన్తో తీర్పును మొదలుపెట్టారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా బాలికల విద్య విషయంలో ఒకప్పటి సవాళ్లే ఇప్పటికీ పెను సమస్యలుగా నిలిచి ఉన్నాయన్నది ఒప్పుకోక తప్పని చేదు నిజమంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమే రుతుక్రమ ఆరోగ్యం.చదువుకోవడానికి ఆటంకంగా నిలిచే ప్రతి అడ్డంకిని తొలగించడమూ విద్యా హక్కులో భాగమే. సౌకర్యాల లేమితో బాలికలు స్కూలుకు వెళ్లలేకపోతే ఇతర ప్రాథమిక హక్కులకూ దూరమవుతారు. బాలికలకు సురక్షితమైన, గౌరవప్రదమైన విద్యా వాతావరణం కల్పించడం రాజ్యాంగ బాధ్యత’’ అని ధర్మాసనం నొక్కిచెప్పింది. ‘‘రుతుక్రమం వల్ల శరీరం అపవిత్రమైందనే భావనతో ఏ బాలికైనా చదువుకు దూరమైతే మేం చెప్పదలచింది ఒక్కటే. అది నీ తప్పు కాదు. సమాచార లోపం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మౌనమే అందుకు కారణం’’ అని పేర్కొంది.విద్యా హక్కుకు తూట్లు సురక్షితమైన, ప్రభావవంతమైన నెలసరి శుభ్రత చర్యలు విద్యార్థినుల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యానికి దోహదపడతాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన విద్య, సమాచారాన్ని పొందే హక్కు ఆరోగ్యకరమైన పునరుత్పత్తి జీవన హక్కులో విడదీయలేని భాగం. స్కూళ్లలో నెలసరి శుభ్రత నిర్వహణ సదుపాయాలు, సౌకర్యాల లేమి విద్యార్థినుల ఆత్మగౌరవాన్నే దారుణంగా దెబ్బతీస్తుంది. విద్య, సంబంధిత అంశాల్లో ఇతర విద్యార్థులతో సమానంగా పోటీ పడే హక్కుకు భంగం కలిగిస్తుంది’’ అని అభిప్రాయపడింది. ‘‘జీవించే హక్కు, ఆత్మ గౌరవం అనే విస్తృత చట్రంలో విద్యా హక్కు భాగం. విద్య అందుబాటులో లేకుండా అవి అసాధ్యం’’ అని పేర్కొంది.స్కూళ్లలో పరిశుభ్రత విభాగంవిద్యార్థినుల నెలసరి శుభ్రత గురించి వెలువరించిన తీర్పులో ధర్మాసనం జారీ చేసిన ముఖ్య ఆదేశాలు... ⇒ నెలసరి ఆరోగ్యంపై బాలికలకు సరైన శిక్షణ, అవగాహన కల్పించాలి. ⇒ ఎన్సీఈఆర్టీ, రాష్ట్ర విద్యా మండళ్లు, సంబంధిత విద్యా విభాగాలు దీన్ని విద్యా ప్రణాళికలో భాగం చేయాలి. ⇒ ఏఎస్టీఎం డి–6954 నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆక్సో–బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ను గ్రామీణ, పట్టణ అనే తారతమ్యాలకు అతీతంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఉచితంగా అందుబాటులో ఉంచాలి. ⇒ నాప్కిన్లు విద్యార్థినుల టాయిలెట్ల సమీపంలో వెండింగ్ మెషీన్ల ద్వారా లేదా పాఠశాలలోని నిరీ్ణత అధికారి వద్ద అందుబాటులో ఉండేలా చూడాలి. ⇒ నాప్కిన్లను పడేసేందుకు టాయ్లెట్ల పక్కనే మూతతో కూడిన వేస్ట్బిన్ విధిగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచేలా యాజమాన్యాలు శ్రద్ధ వహించాలి. ⇒ బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్లు ఉండాలి. అవి చక్కగా పని చేసే స్థితిలో ఉండాలి. ⇒ టాయ్లెట్లలో నిరంతర నీటి వసతితో పాటు సబ్బు, వాష్బేసిన్, ఇతర కనీస సదుపాయాలు అందుబాటులో ఉండాలి.⇒ ప్రతి స్కూలులోనూ నెలసరి పరిశుభ్రత విభాగం ఏర్పాటు చేయాలి. అందులో శానిటరీ ప్యాడ్లతో పాటు లో దుస్తులు, అదనపు యూనిఫాం, డిస్పోజబుల్ బ్యాగులు ఉంచాలి. ⇒ వాడేసిన శానిటరీ నాప్కిన్లను సురక్షితంగా, పర్యావరణహితంగా పారవేసే ఏర్పాట్లు ప్రతి స్కూల్లోనూ ఉండాలి. ⇒ వ్యర్థాలను పారవేసే విషయంలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలి. ⇒ టాయిలెట్లు విద్యార్థినుల గోప్యతను కాపాడేలా ఉండాలి. ⇒ దివ్యాంగ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విడిగా టాయిలెట్లను నిర్మించాలి ⇒ నెలసరి శుభ్రత, దానికి సంబంధించిన అన్ని అంశాలపైనా ఉపాధ్యాయులందరికీ సమగ్ర శిక్షణ ఇవ్వాలి. నెలసరిలో ఉన్న పిల్లలకు ఎలా సాయపడాలో వారికి పూర్తిగా తెలిసుండాలి. ⇒ జన్ ఔషధీ సువిధా ఆక్సో బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నదీ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాతో పాటు రేడియో, టీవీ, సినిమా హాళ్లలో, బస్సులు, ఆటోలపై, గోడలపై ప్రకటనల రూపంలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ⇒ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్లైన్ గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. -
‘వీధి కుక్కల అంశం’పై సుప్రీం తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: వీధికుక్కల కట్టడిపై గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ అంశంపై గురువారం వాదనలు ముగించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. హైవేలపైకి వచ్చే వీధి పశువుల కోసం, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టు కంపెనీలను సామాజిక బాధ్యతగా గోశాలలను ఏర్పాటు చేయాలని కోరాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ)కి సూచించింది. జాతీయ రహదారులపైకి వచ్చే వీధి పశువుల విషయంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేలా ప్రత్యేక యాప్ను రూపొందించాలని కోరింది.జాతీయ రహదారులపైకి పశువులు ప్రవేశించే ప్రమాదమున్న ప్రాంతాలు దేశవ్యాప్తంగా 1,300కుపైగా ఉన్నాయని ఎన్హెచ్ఏఐ లాయర్ తెలిపారు. చాలా వరకు రాష్ట్రాలు పశువుల సంచారం కట్టడికి చర్యలు తీసుకున్నాయన్న ఆయన..ఈ విషయంలో మహారాష్ట్రం, జార్ఖండ్, రాజస్తాన్లు వెనుకబడ్డాయన్నారు. వీధి కుక్కల పునరావాసం, స్టెరిలైజేషన్కు సంబంధించిన గతేడాది నవంబర్ 7వ తేదీన జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై పంజాబ్, రాజస్తాన్, యూపీ, తమిళనాడు ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.పంజాబ్ ప్రభుత్వం రోజుకు కేవలం వంద శునకాలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేసినట్లు తెలపగా, వీధికుక్కలను పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 45 వ్యాన్లు ఉన్నాయంటూ రాజస్తాన్ ప్రభుత్వం తెలపడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. గడ్డి వాములో సూదిని వెదికినట్టు ఉందంటూ వ్యాఖ్యానించింది. వీధి కుక్కల సమస్యను ఇప్పుడు నియంత్రించకుంటే ఏటికేడు మరింత పెరుగుతూనే ఉంటుందని పేర్కొంది.నవంబర్ 7వ ఉత్తర్వుల తర్వాత జంతువుల షెల్టర్లు, స్టెరిలైజేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ పలు ఎన్జీవోలు, ప్రైవేట్ సంస్థల నుంచి 250కి పైగా దరఖాస్తులు అందాయని ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఏడబ్ల్యూబీఐ)ప్రతినిధి చెప్పారు. వీటిని ఆమోదించడమా లేదా తిరస్కరించడమా వెంటనే తేల్చేయాలని ధర్మాసనం ఆదేశించింది. -
సమాజాన్ని వెనక్కు తీసుకెళ్తున్నామా?
న్యూఢిల్లీ: విద్యాలయ ప్రాంగణాల్లో కులాధారిత వివక్షను నిరోధించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతనంగా రూపొందించిన సమానత్వ నిబంధనలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వాటి అమలుపై స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ ధర్మాసనం గురువారం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ‘‘కుల వివక్ష లేని, కులరహిత సమాజ సాధన కోసం స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల్లో మనం చేసిందేమిటి? ఈ విషయంలో సమాజాన్ని వెనక్కు తీసుకెళ్తున్నామా అన్న భావన కలుగుతోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది.యూజీసీ సమానత్వ నిబంధనల్లో, వాటిలో వాడిన భాషలో చెప్పలేనంత అస్పష్టత ఉందంటూ ధర్మాసనం ఆక్షేపించింది. అంతేగాక, ‘‘ఈ దశలోనే మేం గనక కల్పించుకోకపోతే ఈ నిబంధనలు దారుణ పరిణామాలకు దారి తీసేలా ఉన్నాయి. అంతిమంగా సమాజంపై ప్రమాదకర ప్రభావం చూపడమే గాక దాన్ని విభజించేలా ఉన్నాయి’’ అంటూ దుయ్యబట్టింది. ఈ నిబంధనలపై నిపుణుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సరైన మార్పుచేర్పులు సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు.లేదంటే కొందరు వాటిని దుర్వినియోగం చేసే ఆస్కారం చాలా ఉందని స్పష్టం చేశారు. ‘‘ప్రఖ్యాత న్యాయ కోవిదులు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అవగాహన ఉన్న నిపుణులు... ఇలా ఇద్దరు లేదా ముగ్గురితో కమిటీ ఏర్పాటు కావాలి. సమాజం ఎలా ప్రగతి సాధించాలి, అందుకోసం విద్యా సంస్థల్లో ఏర్పరచే నిబంధనల వల్ల విద్యాభ్యాసం పూర్తయి సమాజంలోకి వెళ్లాక విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు వంటి అంశాలన్నింటినీ వారు లోతుగా అధ్యయనం చేయాలి’’ అని సీజేఐ సూచించారు. తదుపరి విచా రణను మార్చి 19కి వాయిదా వేశారు. సమానత్వ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆలోగా స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, యూజీసీని ఆదేశించారు.ఎటువైపు వెళ్తున్నాం?రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశానుసారం 2012 నాటి నిబంధనల స్థానంలో కొత్తగా సమానత్వ నిబంధనలను జనవరి 13న యూజీసీ అమల్లోకి తేవడం తెలిసిందే. వాటిప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ కమిటీల ఏర్పాటును తప్పనిసరి చేశారు. ఎస్సీ, ఎస్టీతో పాటు ఓబీసీ, దివ్యాంగులు, మహిళలకు వాటిలో స్థానం కల్పించాలని పేర్కొన్నారు. అయితే నూతన నిబంధనల్లో కుల నిర్వచనాన్ని ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా విస్తరించడం, జనరల్ కేటగిరీ తదితరాలను విస్మరించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూజీసీ నూతన సమానత్వ నిబంధనల ఆమోదనీయతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖల య్యాయి.వివక్ష అనే పదాన్ని కులానికి తావివ్వని రీతిలో నిర్వచించాల్సిందిగా యూజీసీని ఆదేశించాలని కోరాయి. వాటిపై విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత సామాజిక స్థితిగతులు తదితరాలపై పలు కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. వివక్షను రూపుమాపేందుకు విద్యా సంస్థల్లో విద్యార్థులకు కులాలవారీగా ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయాలన్న నిబంధనను సీజేఐ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘దేవుడా! కులాంతర వివాహాలే జరుగుతున్న ఈ రోజుల్లో ఇవేం చర్యలు? దయచేసి ఇలాంటి పనులకు దిగకండి. విద్యాలయ హాస్టళ్లలో ఇంతకాలంగా కులాలకు అతీతంగా అంతా కలిసే ఉంటున్నారు.వారి మధ్య కొత్తగా ఇలాంటి విభజనలు తీసుకురావద్దు’’ అని సూచించారు. ప్రాంతీయ వివక్ష విషయంలో నూతన నిబంధనల్లో ఎలాంటి చర్యలున్నాయంటూ ఆయన నిలదీశారు. ‘‘ఉదాహరణకు ఒక దక్షిణాది విద్యార్థి ఉత్తర భారత దేశంలోని విద్యా సంస్థలో చదువుతున్నాడు. అతని కులం వంటివి తెలియకపోయినా కేవలం ప్రాంతం ఆధారంగా వివక్ష, అవమానం ఎదుర్కొన్నా డనుకుందాం. ఇలాంటి వాటికి నూతన నిబంధనల్లో పరిష్కారం ఏముంది?’’ అని ప్రశ్నించారు. అసలు వివక్ష అనే పదానికి పాత నిబంధనల్లో ఇప్పటికే విస్తృతమైన నిర్వచనం ఉండగా మళ్లీ కొత్త నిర్వచనం తేవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ తప్పుబట్టారు.ర్యాగింగ్ ఊసే లేదేం?జనరల్ కేటగిరీకి చెందిన నూతన విద్యార్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ చేతుల్లో ర్యాగింగ్కు గురైతే దానిపై నూతన నిబంధనల్లో ఎలాంటి చర్యలూ లేవని విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ విస్మయం వెలిబుచ్చారు. విద్యాలయాల్లో ప్రధాన సమస్య అయిన ర్యాగింగ్ గురించి ఈ నిబంధనల్లో ప్రస్తావనే లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. దాని గురించి అస్సలే పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.‘‘విద్యాల యాల్లో ర్యాగింగ్ చాలావరకు జూనియర్, సీనియర్ తేడాల ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. ఇంతటి ప్రధాన సమస్యను విస్మరించడం ఏమిటి? విద్యాల యాల్లో వివక్ష అంటే కేవలం కులాధారితంగా మాత్రమే ఉంటుందనే దురభిప్రాయానికి రావడం ఏ మేరకు సబబు?’’ అంటూ నిలదీశారు. భారత ఐక్యత అనే భావన విద్యాలయాల్లో సర్వత్రా ప్రతిఫలించాలని జస్టిస్ బాగ్చీ అభిప్రా యపడ్డారు.విద్యాలయాల్లో స్వేచ్ఛాయుత, సమానత్వ వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. జనరల్ కేటగిరీకి చెందిన వారిపై జరిగే కులాధారిత వివక్షను నిబంధనల్లో విస్మరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఆక్షేపించారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలే ఇలాంటి వివక్షను ఎదుర్కొంటాయనే దురభిప్రాయం కలిగేందుకు ఆస్కారం కల్పించారన్నారు. -
‘జస్టిస్ స్వామినాథన్’ అంశంలో మీ స్పందనేంటి?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మదురైలోని థిరుప్పారాన్కుండ్రం కొండపై కార్తీకదీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్పై మతపర ఆరోపణలు చేసిన నిరసనకారులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ విషయంలో మీ స్పందన తెలపాలని డీఎంకే సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ రాష్ట్ర డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, తదితరులకూ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీఎంకే ప్రభుత్వాన్ని కోరింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి రెండో తేదీకి వాయిదావేసింది. డీఎంకే మిత్రపక్షాలు, కార్యకర్తలు, లాయర్లు మద్రాస్ హైకోర్టు చెన్నై, మదురై ప్రాంగణాల్లో జడ్జికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉల్లంఘనలకు పాల్పడ్డారని న్యాయవాది జీఎస్ మణి ఈ పిటిషన్ వేశారు. -
కర్తవ్యం మరచి కథలు చెబుతున్నారా?: సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ: వీధి శునకాల సంతతి వృద్ధిని కట్టడిచేసే లక్ష్యంతో వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలంటూ తాము గతంలో ఇచ్చిన తీర్పును చాలా రాష్ట్రాలు గాలికొదిలేశాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు సహాయకులుగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రాలు ఏ మేరకు క్షేత్రస్థాయిలో అమలుచేస్తున్నాయో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనానికి నివేదించారు.ఈ సందర్భంగా ‘జంతువుల జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. వీధి శునకాలకు కు.ని. ఆపరేషన్లు చేయాలని సూచించారు. వాటికి షెల్టర్లను నిర్మించాలని ఆదేశించారు. ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోకి వీధికుక్కలు రాకుండా కంచెలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇవేమీ రాష్ట్రాలు సరిగా అమలుచేయట్లేదు’’ అని గౌరవ్ వెల్లడించారు. రాష్ట్రాల నిర్లక్ష్య వైఖరిపై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.మేం ఇచ్చిన తీర్పును అమలుచేసే కర్తవ్యాన్ని రాష్ట్రాలు గాలికొదిలేసి గాల్లో కోటలు కడుతున్నాయి. కథలు చెబుతున్నాయి. అస్సాం మినహా ఏ రాష్ట్రం కూడా కుక్కకాటు ఘటనలు ఎన్ని జరిగాయో నమోదుచేయలేదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను గురువారం కోర్టుకు నివేదిస్తానని గౌరవ్ అగర్వాల్ చెప్పారు. -
ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలకు ఊరట
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సేవలు అందించే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విదేశీ విశ్వవిద్యాలయాలకు అందించే కన్సల్టెన్సీ సేవలను ‘సేవల ఎగుమతి’(Export of Services) గానే పరిగణించాలని, వాటికి జీఎస్టీ రీఫండ్ పొందే హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనితో జీఎస్టీ చట్టంలోని ‘ఇంటర్మీడియరీ’ (మధ్యవర్తిత్వ) సేవలపై చాలా కాలంగా కొనసాగుతున్న న్యాయపరమైన సందిగ్ధతకు తెరపడింది.హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టుజస్టిస్ జేబీ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. గ్లోబల్ అపర్చునిటీస్ అనే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థకు జీఎస్టీ రీఫండ్ మంజూరు చేయాలని గత ఏడాది సెప్టెంబర్లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం తోసిపుచ్చింది.కోర్టు తీర్పులో అంశాలు..‘విదేశీ వర్సిటీలకు అందించే సేవలు స్వతంత్రమైనవి. వీటిని కేవలం మధ్యవర్తిత్వ సేవలుగా చూడలేం. విద్యార్థులు భారత్లో ఉన్నారనో లేదా పారితోషికం విదేశీ కరెన్సీలో వస్తుందనే కారణాలతో ఈ సేవలను 'ఇంటర్మీడియరీ సేవలు'గా పరిగణించడం సాధ్యం కాదు. విద్యార్థులు వర్సిటీల్లో చేరిన తర్వాతే కమిషన్ అందవచ్చు, కానీ అది సంస్థ అందించే సేవల ఎగుమతి స్వభావాన్ని మార్చదు’ అని న్యాయస్థానం పేర్కొంది.ఐజీఎస్టీ చట్టంపై స్పష్టతఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (IGST) చట్టంలోని సెక్షన్ 2(13) ప్రకారం 'ఇంటర్మీడియరీ' నిర్వచనాన్ని ఈ కేసులో లోతుగా విశ్లేషించారు. సదరు కన్సల్టెన్సీ కేవలం విద్యార్థులకు, వర్సిటీలకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరించడం లేదని, అది ఒక స్వతంత్ర సేవగా పరిగణించబడుతుందని దిల్లీ హైకోర్టు ఇదివరకే తేల్చింది. ప్రభుత్వం దీన్ని ఏజెంట్ సేవగా అభివర్ణించినప్పటికీ సుప్రీంకోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఈ తీర్పు ప్రభావం కేవలం ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలకే పరిమితం కాకుండా విదేశాలకు సేవలు ఎగుమతి చేసే ఇతర రంగాలపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది. కొన్ని సంస్థలకు నిలిచిపోయిన కోట్లాది రూపాయల జీఎస్టీ రీఫండ్లు విడుదల కావడానికి ఇది మార్గం సుగమం చేసింది.ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు -
బాబుకు బిగ్ షాక్.. మద్యం అక్రమ కేసులో ఆ ముగ్గురికి ఊరట
-
వీధి కుక్కల దాడులపై సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు
-
మద్యం అక్రమ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అరెస్ట్ పై ఊరట!
-
ఢిల్లీలో వాయు కాలుష్యం అందుకే.. AQMB నివేదిక
ఢిల్లీ వాయుకాలష్యంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాయుకాలుష్యం తీవ్రముప్పు పొంచిఉన్న నేపథ్యంలో కాలుష్య సమస్య పరిష్కారం కోసం దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని, నాలుగు వారాల్లో ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రాజధాని నగరంలో గాలి కాలుష్య నివారణకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బోర్డు కీలక ప్రతిపాదనలు కోర్టుకు సమర్పించింది. ఢిల్లీలో గాలి కాలుష్యానికి వాహనాలే ప్రధాన కారణమని తెలిపింది. కనుక అధిక కాలుష్యాన్ని కలిగింపజేసే వాహనాలను దశలవారిగా తొలిగించాలని AQMB కోర్టుకు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు విధానాలను సవరించాలని పేర్కొంది. పాత వాహనాలను మార్చుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహాకాలు అందించాలని తెలిపింది.అంతేకాకుండా ప్రస్తుతమున్న మెట్రో నెట్వర్క్ను మరింతగా విస్తరించాలని AQMB కోర్టుకు నివేదించింది. అయితే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బోర్డు ప్రతిపాదనలు విన్న కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. -
YS వివేకా కేసులో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో సునీతకు బిగ్ షాక్..
-
సునీత పిటిషన్పై ‘సుప్రీం’ సీరియస్.. ఇలాగైతే మరో పదేళ్లకే!
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ప్రక్రియను మరింత జాప్యం చేసేలా నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే విచారణ పూర్తయిన అంశాలను మళ్లీ తిరగతోడుతూ, కాలయాపన చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.తదుపరి దర్యాప్తునకు సంబంధించి కింది కోర్టు (ట్రయల్ కోర్టు) ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో ‘మినీ ట్రయల్’ (సమాంతర విచారణ) నిర్వహించలేమని, పిటిషనర్ కోరినట్లుగా ప్రతి చిన్న అంశానికీ మళ్లీ విచారణకు ఆదేశిస్తూ పోతే కేసు కొలిక్కి రావడానికి మరో పదేళ్లు పడుతుందని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. మినీ ట్రయల్ నడపాలనుకుంటున్నారా?సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టు (సీబీఐ కోర్టు) తమ అభ్యర్థనలను పక్కన పెట్టిందంటూ ఛార్జిషీటులోని అంశాలను ఒక్కొక్కటిగా చదివే యత్నం చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ కలుగజేసుకుంటూ.. ‘ఇవన్నీ ట్రయల్ కోర్టు చూసుకోవాలి్సన అంశాలు. మీరు ఇక్కడ మినీ ట్రయల్ నడపాలనుకుంటున్నారా? ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ మళ్లీ దర్యాప్తు కోరుకుంటూ పోతే.. మేం హైకోర్టుకు పంపాల్సి వస్తుంది. అక్కడి నుంచి మళ్లీ కింది కోర్టుకు వెళ్లేసరికి మరో పదేళ్లు పడుతుంది. ఈలోపు ట్రయల్ ముగియదు. నిందితులకూ హక్కులు ఉంటాయి కదా?’ అని ఘాటుగా ప్రశ్నించారు.గోడ మీద పిల్లి వాటం వద్దు: సీబీఐకి సుప్రీం చురకలు.. ఇదే సమయంలో సీబీఐ తీరును కూడా ధర్మాసనం తప్పుబట్టింది. పిటిషనర్ అడిగారు కదా అని ప్రతిదానికీ తలొగ్గడం సరికాదని హితవు పలికింది. ’దర్యాప్తు సంస్థగా మీ వైఖరి ఏమిటి? మీకు దర్యాప్తు అవసరమనిపిస్తోందా? లేదా? ఇప్పటికే చేసిన దర్యాప్తుతో సంతృప్తి చెందారా? ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. అంతేగానీ కోర్టు ఆదేశిస్తే చేస్తాం అంటూ గోడ మీద పిల్లి వాటంగా వ్యవహరించవద్దు. ఒకవేళ నిజంగానే దర్యాప్తులో లోపాలున్నాయని భావిస్తే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. పిటిషనర్ కోరిన మేరకు కాకుండా, సాక్ష్యాధారాల మేరకు మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి. అంతేగానీ, కోర్టు భుజంపై తుపాకీ పెట్టి కాల్చొద్దు. విచారణ అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి..’ అని సీబీఐ న్యాయవాదిని ధర్మాసనం గట్టిగా మందలించింది.ఆ ఒక్క అంశంపైనే అనుమతి..కింది కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. హత్య జరిగిన రోజు (మార్చి 15, 2019) అర్ధరాత్రి సమయంలో కిరణ్ యాదవ్ (ఏ–2 సోదరుడు), అరుణ్రెడ్డి (ఏ–1 బంధువు) మధ్య మెసేజ్ల మార్పిడిపై మాత్రమే తదుపరి దర్యాప్తునకు సెషన్స్ కోర్టు అనుమతించిందని గుర్తు చేసింది. ఆ ఒక్క అంశం మినహా మిగిలిన వాటిపై దర్యాప్తు అవసరం లేదని కింది కోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు మళ్లీ అవే అంశాలను సుప్రీంకోర్టులో ప్రస్తావించడంపై అసహనం వ్యక్తం చేసింది.నిందితుల హక్కులను కాలరాస్తారా..? ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. తాము విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు పేరుతో కేసును సాగదీస్తున్నారని కోర్టుకు విన్నవించారు. స్పీడ్ ట్రయల్ తమ హక్కు అని, ఏళ్ల తరబడి కేసును సాగదీయడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కేసును లాజికల్ ఎండ్కు (తార్కిక ముగింపు) తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విచారణను నిరవధికంగా సాగదీస్తూ పోతే నిందితుల హక్కులకు భంగం వాటిల్లుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించింది.ఫిబ్రవరి 5న తేల్చేస్తాం.. ఈ నేపథ్యంలో తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే దానిపై స్పష్టమైన వైఖరితో రావాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఆ రోజుతో ఈ అంశంపై ఒక స్పష్టతనిస్తామని పేర్కొంది. దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో పిటిషనర్లకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. -
మేనకగాంధీపై సుప్రీం ఆగ్రహం
వీధికుక్కల కేసులో మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీపై సుప్రీంకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసింది. దేశ అత్యున్నత ధర్మాసనంపై ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదంది. ఇటీవల మేనకగాంధీ ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ సుప్రీంకోర్టును విమర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.వీధికుక్కల కేసును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. మేనకాగాంధీ తరపు న్యాయవాది రాజు రామచంద్రన్ని కోర్టు ప్రశ్నిస్తూ" కొద్దిరోజుల క్రితం మీరు కోర్టులు ఉదాసీనంగా వ్యవహరించాలన్నారు. మీ క్లైంట్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో మీరు గమనించారా? మీ క్లైంట్ తప్పు చేసింది. అయినా మేము ఏ తనపై ఎటువంచి చర్యలు తీసుకోలేదు. ఇది మా గొప్పతనం కాదా? ఆమె పాడ్కాస్ట్లో మాట్లాడిన మాటలు మీరు చూశారా? ఆమె బాడీలాంగ్వేజ్ ఏంటి? అని ప్రశ్నించింది. " మీరేమో కోర్టులకు ఉదాసీనత ఉండాలంటారు మరోవైపు మీక్లైంట్ ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మీ క్లైంట్( మేనకాగాంధీ) ప్రస్తుతం జంతువుల హక్కుల కార్యకర్తగా ఉంది, ఆమె గతంలో కేంద్రమంత్రిగా పనిచేసింది. అయితే జంతువుల రక్షణకోసం ఇప్పటి వరకూ తను చేసిన పనులు ఏంటి? వాటి కోసం బడ్జెట్లో ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించిందా? లేదా వాటికోసం మూగజీవాల ఏదైనా కొత్త పథకాలు వచ్చేలా చేసిందా అని కోర్టు ప్రశ్నించింది.కుక్కకాటు వేస్తే వాటికి ఆహారం వేసిన వారిని బాధ్యులు చేయాలని గతంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు సరదాకు చేసిన కావని సీరియస్గా మాట్లాడినవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా వీధికుక్కలను నియంత్రించలేకపోతే అవి కరిస్తే పెద్దమెుత్తంలో పరిహారం చెల్లించేలా ప్రభుత్వాల్ని ఆదేశిస్తామని ఇదివరకే కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఇంకెంత టైమ్ కావాలి! వివేకా కేసుపై సుప్రీం ఆగ్రహం
-
కోర్టు ధిక్కరణ కేసు.. స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు
-
ఇదే చివరి అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టి మేటం జారీ చేసింది.ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతోపాటు ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమరి్పంచాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాలు వాడీవేడిగా మిగతా వాదనలు వినిపించాయి. గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాదులు బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్లలో ప్రతివాదులుగా పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిõÙక్ మను సింఘ్వీ, నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘స్పీకర్ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల పిటిషన్ల విచారణలో జాప్యం జరిగింది. ఇప్పటికే కొన్ని అంశాలను పరిష్కరించాం. మరికొన్నింటిపై తీర్పును రిజర్వ్ చేశాం. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మరో 8 వారాల సమయం ఇవ్వండి’అని ముకుల్ రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు. కావాలనే జాప్యం చేస్తున్నారు: బీఆర్ఎస్ తరఫు లాయర్లు ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలను పిటిషనర్లు పాడి కౌశిక్రెడ్డి, కేటీఆర్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణేనని ఆయన వాదించారు. ‘రెండు వారాల్లో తేల్చేస్తామని గతంలోనే కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ మూడు నెలలైనా అతీగతీ లేదు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడేమో ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు.ఇది పచ్చి మోసం. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. దీనికి విచారణ పేరుతో కాలయాపన చేయడం సరికాదు. ట్రిబ్యునల్ (స్పీకర్) ఈ రోజు వరకు కేసును కనీసం తాకలేదు’అని శేషాద్రి నాయుడు కోర్టు దష్టికి తెచ్చారు. స్పీకర్ కార్యాలయం కావాలనే జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. రెండు వారాల్లో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్లకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లపై తీసుకున్న చర్యలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే కనీసం నాలుగు వారాల గడువైనా ఇవ్వాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరగా రెండు వారాల్లో పురోగతి చూపిస్తే నాలుగు వారాల సమయం ఇస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. -
తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు వార్నింగ్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ పూర్తి చేయాలన్న ధర్మాసనం.. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు?కేసులో ఇంకా ఏం మిగిలింది?. అంటూ ప్రశ్నించింది.‘‘ఇప్పటికే రెండు వారాలకు కస్టడీకి అనుమతించాం మే నుంచి ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాము. మీ పర్పస్ పూర్తయిందా లేదా? కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని, ఆర్టికల్ 142 కింద మేము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాం. ప్రభాకర్ రావును మళ్లీ జైలులో పెట్టాలనుకుంటున్నారా? ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన.. ఆయనను పిలవకుండా ఉండలేరు. మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చు. ఆయన దర్యాప్తుకు సహకరిస్తారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ వాదించారు. తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణ పొడిగించిన సుప్రీంకోర్టు.. మార్చి 10కి వాయిదా వేసింది. -
పన్ను మినహాయింపు పిటిషన్ తిరస్కరణ
ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో తన వాటాల విక్రయం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ లావాదేవీపై పన్ను మినహాయింపు కోరుతూ అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థ ‘టైగర్ గ్లోబల్’ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పన్ను ఎగవేత ఉద్దేశంతో చేసే లావాదేవీలకు చట్టపరమైన రక్షణ ఉండదని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది.తీర్పు నేపథ్యంజస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 245ఆర్(2)ను ప్రస్తావిస్తూ.. ఒక లావాదేవీ కేవలం పన్ను ఎగవేత కోసమే రూపొందించబడిందని ప్రాథమికంగా తేలితే ఆ విచారణను అక్కడితోనే నిలిపివేసే అధికారం అధికారులకు ఉంటుందని కోర్టు పేర్కొంది.వివాదం ఏమిటి?ఈ వివాదం 2018 నాటి వాల్మార్ట్-ఫ్లిప్కార్ట్ ఒప్పందంతో ముడిపడి ఉంది. వాల్మార్ట్ సంస్థ ఫ్లిప్కార్ట్ను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సమయంలో టైగర్ గ్లోబల్ తన వాటాను సుమారు రూ.14,440 కోట్లకు (1.6 బిలియన్ డాలర్లు)విక్రయించింది. కంపెనీకి వచ్చిన లాభాలపై భారత్–మారిషస్ మధ్య ఉన్న ‘డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్’ (DTAA) ప్రకారం తమకు పన్ను మినహాయింపు ఉంటుందని టైగర్ గ్లోబల్ వాదించింది. ఈ కంపెనీ పన్ను తప్పించుకోవడానికి సృష్టించిన మధ్యవర్తి సంస్థేనని, దీని అసలు నియంత్రణ అమెరికాలోని మాతృ సంస్థ చేతిలోనే ఉందని భారత పన్ను అధికారులు వాదించారు.ఢిల్లీ హైకోర్టు తీర్పుగతంలో (ఆగస్టు 2024లో) ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు టైగర్ గ్లోబల్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. మారిషస్ జారీ చేసిన ‘ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC)’ ఉంటే పన్ను మినహాయింపునకు అది సరిపోతుందని పేర్కొంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. కేవలం టీఆర్సీ ఉంటే సరిపోదని, సదరు సంస్థలకు స్వతంత్ర వాణిజ్య అస్తిత్వం ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘విక్రయించిన షేర్ల ద్వారా భారతదేశంలోని ఆస్తుల నుంచి లబ్ధి పొందినప్పుడు అవి భారతీయ కంపెనీకి చెందినవి కావు అనే సాకుతో పన్ను నుంచి తప్పించుకోలేరు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఇన్వెస్టర్లపై ప్రభావంఈ తీర్పు విదేశీ పెట్టుబడిదారులకు ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పన్ను ఒప్పందాలపై పెట్టుకున్న నమ్మకం సడలుతుందని అభిప్రాయపడుతున్నారు. దాంతో ఇకపై పెట్టుబడిదారులు తమ లాభాల్లో పన్ను ఖర్చులను కూడా ముందుగానే లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం కాగితాలపై కంపెనీలను చూపడం కాకుండా, క్షేత్రస్థాయిలో ఆ కంపెనీల కార్యకలాపాలు ఎలా ఉన్నాయనేది ఇకపై కీలకం కానుంది.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
స్పీకర్పై సుప్రీం కోర్టు సీరియస్
-
స్పీకర్ వాదనను సుప్రీం అంగీకరిస్తుందా ? లేదా ?
-
మమతకు సుప్రీంలో చుక్కెదురు
సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకీ చుక్కెదురైంది. ఈడీ అధిాకారులపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లపై కోర్టు స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈడీ విచారణలో తన పరిధిని అతిక్రమించిందని రాష్ట్ర పోలీసులు అధికారులపై కేసులు నమోదు చేశారు. కాగా తాజాగా సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది.దానితోపాటు ఐప్యాక్ ఆపీసులో సీసీ కెమెరాల, పుటెజ్ను భద్రపరచాలని , ఫైల్ చోరీ కేసులో సాక్షాలకు రక్షణ కల్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఐప్యాక్ కార్యాలయం, డైరెక్టర్ ప్రాంగణంలో సోదాలు జరిపే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. "అధికారుల ఫోన్లు, కీలక డాక్యమెంట్లను మమతా బెనర్జీతో పాటు ఇతర అధికారులు లాక్కున్నారు. అనంతరం బెంగాల్ పోలీసులు సీసీటీవీ పుటేజ్ను ధ్వంసం చేశారు. మమతా బెనర్జీ ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి" అని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈడీ దర్యాప్తును అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని బెంగాల్ సీఎం మమతతో పాటు పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
విజయ్ కు షాక్.. జన నాయగన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
రిక్షా పుల్లర్ బిడ్డ, జడ్జి బిడ్డ ఒకే స్కూళ్లో చదవాలి: సుప్రీంకోర్టు
దేశంలో విద్యా వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ఆశించిన ‘సౌభ్రాతృత్వం’ (Fraternity) లక్ష్యాన్ని సాధించే దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఒక రిక్షా కార్మికుడి పిల్లలు మల్టీ మిలియనీర్ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిల్లలతో కలిసి ఒకే తరగతి గదిలో చదువుకున్నప్పుడే అసలైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించిన 25% ఉచిత సీట్ల అమలుపై విచారణ చేపట్టింది. ఇందుకు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్లతో కూడిన ధర్మాసనం సారథ్యం వహించింది.‘ఒక ఆటో డ్రైవర్ లేదా వీధి వ్యాపారి బిడ్డ, ధనవంతుల బిడ్డతో కలిసి పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చోవడం అనేది సహజమైన, నిర్మాణాత్మకమైన ప్రక్రియగా మారాలి. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. ఆర్టికల్ 21ఏ, 39(ఎఫ్) కింద దేశం చిన్నారులకు ఇచ్చిన హక్కు’ అని కోర్టు పేర్కొంది. కులం, తరగతి లేదా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉండే ‘అనుమానాస్పద గుర్తింపులను’ పక్కన పెట్టి, విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకంగా ఉండటానికి సెక్షన్ 12 దోహదపడుతుందని ధర్మాసనం వివరించింది.కొఠారి కమిషన్ నివేదిక ప్రస్తావనసమాజంలోని అన్ని వర్గాల పిల్లలు వివక్ష లేకుండా విద్యను అభ్యసించే సాధారణ పాఠశాల వ్యవస్థపై గతంలో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదికను కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. పేద పిల్లలు ధనిక వాతావరణం(Rich Culture)లో ఇమడగలరా? అనే సందేహాలను పక్కన పెట్టాలని, ఉపాధ్యాయులు ఆ పిల్లల నేపథ్యాలను ఒక వనరుగా మార్చుకుని వారి గౌరవాన్ని పెంచాలని సూచించింది.రాష్ట్రాలకు, ఎన్సీపీసీఆర్కు ఆదేశాలువిద్యా హక్కు చట్టం (RTE)లోని సెక్షన్ 12(1)(సీ) కింద ఉన్న ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన నియమ నిబంధనలను రూపొందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 38 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి, వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లల ప్రవేశాలకు సంబంధించి అవసరమైన సబార్డినేట్ చట్టాలను (Subordinate Legislation) సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.‘సమానత్వం, స్వేచ్ఛ అనేవి వ్యక్తిగత హక్కులు కావచ్చు. కానీ, సౌభ్రాతృత్వం అనేది సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సంస్థాగత ఏర్పాట్ల ద్వారానే సాధ్యమవుతుంది’ - సుప్రీంకోర్టుసంప్రదింపులుఈ నిబంధనల రూపకల్పన ప్రక్రియ కేవలం ఏకపక్షంగా సాగకూడదని, సంబంధిత విభాగాల భాగస్వామ్యం ఉండాలని కోర్టు సూచించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు (SCPCR), జాతీయ, రాష్ట్ర స్థాయి సలహా మండలితో సమగ్రంగా సంప్రదించి విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది.రిపోర్టింగ్, పర్యవేక్షణఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే దానిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ గడువును విధించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేసిన లేదా రూపొందించిన నియమ నిబంధనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్సీపీసీఆర్ను ఆదేశించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి మార్చి 31 లోగా ఒక సమగ్ర అఫిడవిట్ను దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం -
టారిఫ్ల ఎఫెక్ట్.. కోర్టు తీర్పుపై ట్రంప్నకు టెన్షన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టెన్షన్ మొదలైంది. ట్రంప్ అమలు చేసిన టారిఫ్ విధానాలపై అక్కడి సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. మరోవైపు.. ఒకవేళ కోర్టు టారిఫ్లను వ్యతిరేకిస్తూ తమ ప్లాన్-బీ ఉందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో, కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.. ట్రంప్ ఏం చేస్తారా? అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టు తీర్పు నేపథ్యంలో స్పందిస్తూ..‘మా ప్రభుత్వం విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు నిలిపివేస్తే ప్రత్యామ్నాయ మార్గాలను తప్పకుండా అన్వేషిస్తాం. ఇతర అవకాశాలను వెతుక్కుంటాం. ప్లాన్-బీ అమలు చేస్తాం. చైనా ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతోనే కొందరు ఈ టారిఫ్లపై కోర్టుల్లో కేసులు వేశారు. నేను అమలు చేసిన టారిఫ్ల వల్ల తక్కువ కాలంలోనే ఫెడరల్ బడ్జెట్ లోటు సుమారు 27 శాతం వరకు తగ్గింది. ఈ సుంకాల కారణంగా అమెరికాలో వినియోగదారుల ఖర్చులు పెరిగాయని విమర్శలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదు. ఈ టారిఫ్లను విదేశీ దేశాలే చెల్లిస్తున్నాయి. అమెరికా వినియోగదారులపై ఎలాంటి భారం పడటం లేదు. ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైనదే’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అనేక దేశాలపై సుంకాలు విధించడం ప్రారంభించారు. తన ఇష్టానుసారం పలు దేశాలను బెదిరింపులకు గురిచేస్తూ సుంకాల పేరుతో బాదడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు పరిధిలోకి చేరింది. టారిఫ్ల అమలులో ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అనే అంశంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, ఒకవేళ సుప్రీంకోర్టు తాను విధించిన సుంకాలను రద్దు చేస్తే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని, ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్లను తిరిగి చెల్లించడం అసాధ్యమని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో, కొంత ఆందోళనకు గురవుతున్నారు. -
రాష్ట్రాలకు సుప్రీం కోర్టు హెచ్చరిక
ఢిల్లీ సాక్షి: దేశవ్యాప్తంగా వీదికుక్కల బెడద తీవ్రమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు వీధి కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే కఠిన చర్యలు విధిస్తామని ప్రకటించింది. శునకాలు కరవడం వల్ల పిల్లలు లేదా పెద్దలు ఎటువంటి ప్రమాదానికి గురైనా దాని సంబంధించి రాష్ట్రాలే పరిహారం చెల్లించేలా ఆదేశిస్తామని హెచ్చరించింది.దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరగడంతో ప్రజలలో రేబీస్తో పాటు ఇతర ప్రమాదకర వ్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, క్రీడా సముదాయాలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాగ్ షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది. అయితే తాజాగా ఈ కుక్కల బెడద కేసును సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్నాధ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు( మంగళవారం) మరోసారి విచారించింది.ఈ నేపథ్యంలో జస్టిస్ విక్రమ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు "వీధి కుక్కల బెడద నివారణకు రాష్ట్రాలు సరైన చర్యలు తీసుకోకుంటే పెద్దలను, పిల్లలను కుక్కలు కరిస్తే అధిక మెుత్తంలో రాష్ట్రాలు పరిహారం చెల్లించేలా ఆదేశిస్తాం. అదేవిధంగా కుక్కలకు పుడ్ పెట్టేవారు వారి ఇంట్లోని వాటిని పెంచుకొని అక్కడే వాటికి తిండిపెట్టండి". అని జస్టిస్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. జంతు ప్రేమికులము అని చెప్పుకునే సంస్థలు తొమ్మిదేళ్ల బాలుడిపై శునకాలు దాడి చేసినప్పుడు ఏందుకు బాధ్యత తీసుకోలేదు అని జస్టిస్ ప్రశ్నించారు.అదే విధంగా కుక్కలకు ఆహారం ఇచ్చేవారిపై వేదింపులకు గురవుతున్నాయి అని వచ్చిన పిటిషన్ను తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అది శాంతిభద్రతల సమస్యని అలా వేధింపులకు గురైన వారు వ్యక్తిగతంగా కేసు నమోదు చేసుకోవాలని సూచించింది. వీధుల్లోని అన్ని కుక్కలను తొలగించాలని తామెప్పుడూ ఆదేశించలేదని యనిమల్ బర్త్ రూల్ ప్రకారం చికిత్స కాని వాటిని షెల్టర్లకు తరలించాలని తెలిపినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. -
ఇదెక్కడి తీర్పు.. అలాంటోడిని విధుల్లోకి తీసుకోవడమా?
న్యూఢిల్లీ: రైలు బోగీలో అసభ్యంగా ప్రవర్తించిన సివిల్ జడ్జిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయాధికారితోపాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్లో 2011లో నియమితులైన కాల్స్–2 సివిల్ జడ్జి ఒకరు 2018లో రైలులో ప్రయాణిస్తూ మద్యం మత్తులో తన బోగీలో ఇతర ప్రయాణికులను వేధించడంతోపాటు ఓ ప్రయాణికురాలిని బెర్త్కు ఎదురుగా మూత్ర విసర్జన చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. దీతో, ప్రయాణికులు చైన్లాగి రైలును ఆపేశారు. ఆయన కారణంగా రైలు ఆలస్యమైంది. ఆ జడ్జిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు, అనంతరం బెయిల్పై విడుదల చేశారు. విచారణ జరిపిన జబల్పూర్లోని స్పెషల్ రైల్వే మేజిస్ట్రేట్.. ఆ జడ్జిపై కేసును 2019లో కొట్టివేశారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో హైకోర్టు ఫుల్ బెంచ్ ఆ జడ్జిని విధుల నుంచి తొలగిస్తూ 2019లో ఉత్తర్వులిచ్చింది. అనంతరం జడ్జి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఫుల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. ఆ జడ్జిని 15 రోజుల్లోగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పును హైకోర్టు పరిపాలనా విభాగం సుప్రీంలో సవాల్ చేసింది. విచారణ చేపట్టిన ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోందని, అసహ్యంగా ప్రవర్తించిన ఆ న్యాయాధికారిని డిస్మిస్ చేయాల్సిందేనని సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని, సంబంధిత న్యాయాధికారితోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. -
మీ అధికారులది వక్రబుద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో భూనిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారుల తీరుపై సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. రైతుల పొట్టకొట్టేలా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే హైకోర్టుకు కూడా విసుగొచ్చినట్లుందని వ్యాఖ్యానించింది. అధికారుల తీరును తప్పుబడుతూనే.. మూడున్నర దశాబ్దాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ‘మీ డిపార్ట్మెంట్లో కొంతమంది నిజాయితీ లేని అధికారులు ఉన్నారు. వారు ఏదో వ్యక్తిగత ప్రయోజనం ఆశించి, ఉద్దేశపూర్వకంగానే నిధులు విడుదల కాకుండా అడ్డుపడుతున్నారు. ఇది కచ్చితంగా దురుద్దేశంతో చేస్తున్న పనే. అధికారుల మోసపూరిత వైఖరి వల్లే పేదలకు అన్యాయం జరుగుతోంది’అంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నేపథ్యం ఇదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో సాగునీటి కాలువ నిర్మాణం కోసం 1989 జనవరి 2న జొన్నలగడ్డ కృపమ్మ, ఇతర రైతుల నుంచి ప్రభుత్వం భూమిని స్వా«దీనం చేసుకుంది. అయితే, ఆ తర్వాత ఏళ్ల తరబడి జాప్యం చేసి 1997లో భూసేకరణ ప్రక్రియను రికార్డుల్లో చూపించారు. ఇవి అసైన్డ్ భూములని, రైతులు సాగు చేయడం లేదని సాకులు చెబుతూ అధికారులు పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. వారికి పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ, పరిహారం చెల్లించకుండా ఉండేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చలతో కూడిన ధర్మాసనం విచారించింది. భూమి లాక్కున్నాక సాకులు చెబితే కుదరదు: సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘మేము 1997లో భూములను వెనక్కి తీసుకున్నాం. అవి అసైన్డ్ భూములు కావడంతోపాటు, అప్పట్లో అవి సాగులో లేవు. అందుకే పరిహారం పెండింగ్లో ఉంది’అని వివరించే ప్రయత్నం చేశారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మీరు 1989లోనే భూమిని భౌతికంగా స్వాధీనం చేసుకున్నారు. భూసేకరణ చట్టం కింద ఒకసారి భూమిని తీసుకున్నాక.. అది సాగులో ఉందా? లేదా? అసైన్డ్ భూమా? అనేది అనవసరం. ‘యాజ్ ఈజ్ వేర్ ఈజ్’పద్ధతిలో పరిహారం చెల్లించాల్సిందే. భూమి తీసుకున్నాక.. ఇప్పుడు సాగులో లేదు కాబట్టి డబ్బులివ్వం అంటే కుదరదు’’అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కోర్టులంటే లెక్కలేదా? ‘ఈ కేసులో హైకోర్టులో ఇప్పటికే రెండు రౌండ్ల విచారణ నడిచింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేసిన ప్రతిసారీ.. డబ్బు డిపాజిట్ చేస్తామని అధికారులు కోర్టులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ చిల్లిగవ్వ విదిల్చలేదు. కోర్టులంటే మీ అధికారులకు గౌరవం లేదు’అని ధర్మాసనం మండిపడింది. భూమిని స్వా«దీనం చేసుకున్న తేదీ (జనవరి 2, 1989) నుంచే పరిహారం లెక్కించాలని ఆదేశించింది. పాత చట్టం ప్రకారం నిర్ణయించిన పరిహారానికి సాంత్వన పరిహారంతోపాటు, ఏటా 15 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని స్పష్టం చేసింది. మొత్తం బకాయిలను 4 వారాల్లోగా సంబంధిత రిఫరెన్స్ కోర్టులో ప్రభుత్వం డిపాజిట్ చేయాలని గడువు విధించింది. డబ్బు డిపాజిట్ చేసిన వెంటనే రైతులు ఆ మొత్తాన్ని ఎలాంటి షరతులు లేకుండా విత్డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ పరిహారం తీసుకున్నంత మాత్రాన రైతులు హక్కులు కోల్పోరని, మరింత పరిహారం కోసం చట్టపరంగా పోరాడే హక్కు వారికి ఉంటుందని తేల్చి చెప్పింది. -
Uttam Kumar: పోలవరంపై సంచలన కామెంట్స్..సుప్రీంలో తెలంగాణ దావా!
-
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్కు షాక్
సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేసింది.అయితే, పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అనంతరం, తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, తమ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని అభిషేక్ సింఘ్వీ తెలిపారు. రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది. అయితే, గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని ధర్మాసనం సూచనలు చేసింది. దీంతో, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది. -
‘సుప్రీం’ ఆదేశాలు బేఖాతరు.. బాబు కోసం బరితెగింపు
ఈ కేసులో చంద్రబాబు కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తారే తప్ప తాను అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదు. సెక్షన్ 17(ఏ)ను ఉటంకిస్తూ ఈ కేసు తనకు వర్తించదన్న చంద్రబాబు వాదన సరికాదు. నిజాయితీపరులైన అధికారులను రక్షించడానికి సెక్షన్ 17(ఏ) ఉద్దేశించిందే తప్ప.. అవినీతి పరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదు. ఈ దృష్ట్యా ఈ కేసును కొట్టివేయలేము. – జస్టిస్ బేలా త్రివేది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిసాక్షి, అమరావతి: చంద్రబాబే నిందితుడిగా, చంద్రబాబే పోలీసుగా సాగుతున్న పచ్చ నాటకం యావత్ దేశాన్ని విభ్రాంతికి గురి చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టిస్తూ సాగుతున్న కుట్ర దేశంలో కొత్త దుస్సంప్రదాయానికి తెరతీస్తోంది. చంద్రబాబు బరితెగించి సాగించిన అవినీతి బాగోతాన్ని అడ్డగోలుగా మూసి వేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వ బరితెగింపు విస్మయ పరుస్తోంది. చంద్రబాబు కుట్రదారు, లబ్ధిదారుగా సాగిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేత కోసం సీఐడీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది.న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరీ అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంపై న్యాయ నిపుణులే విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ స్కామ్ కేసు అడ్డగోలు మూసివేత ప్రతిపాదనను సవాల్ చేస్తూ ఏపీఎస్ఎస్డీసీ అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పిటిషన్పై విచారణ, తదుపరి పరిణామాలపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లను ఏసీబీ న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేశాయన్నది గమనార్హం. ఈ అవినీతి కేసు దర్యాప్తు, విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశాయి. ఆ మేరకు ఆ మూడు న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టం చేసిన అంశాలు ఇలా ఉన్నాయి. స్పష్టంగా ఆధారాలు.. కొట్టేయడం కుదరదు స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతిని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. అందుకే ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత సమరి్పంచిన రిమాండ్ నివేదికతో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సంతృప్తి చెందింది. రిమాండ్ నివేదికను తిరస్కరించాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనను తోసిపుచ్చిది. సిట్ నివేదికతో ఏకీభవిస్తూ చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతోనే ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తర్వాత అనారోగ్య సమస్యల కారణంగానే ఆయనకు బెయిల్ మంజూరైంది.కాగా, ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయిచినా ఆయనకు చుక్కెదురైంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న ఆయన వాదనను హైకోర్టు తిరస్కరించింది. అధికారిక విధుల్లో భాగంగానే స్కిల్ కార్పొరేషన్ నిధుల చెల్లింపునకు అనుమతిచ్చానన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చిది. ప్రజాధనాన్ని స్వీయ అవసరాలకు వాడుకోవడం అధికారిక విధుల కిందకు రాదని స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా సిట్ 140 మంది సాక్షులను విచారించి, నాలుగు వేల డాక్యుమెంట్లను కూడా సేకరించిందని తన తీర్పులో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే దొంగాట చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్ను అర్ధంతరంగా మూసివేతకు కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు, న్యాయ ప్రక్రియ ప్రమాణాలకు విరుద్ధంగా కుట్రకు తెగబడుతోంది. వాస్తవానికి స్కిల్ స్కామ్లో చంద్రబాబుపై కేసు నమోదు, విచారణకు గతంలో ప్రభుత్వం అధికారికంగా సీఐడీకి అనుమతినిచ్చిది. అనంతరమే సీఐడీకి చెందిన సిట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ అధికారిక విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి అధికారిక అనుమతి ఇవ్వలేదు.కానీ సీఐడీ మాత్రం కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ’ ముసుగులో కేసును మూసి వేయడానికి న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం గమనార్హం. ఎందుకంటే అధికారికంగా అనుమతి జారీ చేస్తే తదుపరి పరిణామాలకు సంబంధిత అధికారి బాధ్యుడు అవుతారు. ఆ అధికారిక ఆదేశాలను న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు. అందుకే ప్రభుత్వం అడ్డదారిలో కేసు మూసివేతకు కుట్ర పన్నింది. ప్రభుత్వ అధికారిక అనుమతి లేకుండానే కేసు మూసివేతకు సీఐడీ అధికారులు బరితెగించారు. ఆ అధికారులు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని న్యాయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు ఎండీల పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు ఈ కేసు మూసివేత వ్యవహారంలో ఏపీఎస్ఎస్డీసీ పూర్వ ఎండీ, ప్రస్తుత ఎండీ పరస్పర భిన్న వాంగ్మూలాలు ఇవ్వడం గమనార్హం. గతంలో ఎండీగా వ్యవహరించిన బంగార్రాజును ప్రభుత్వ పెద్దలు తమదైన శైలిలో బెదిరించి లొంగ దీసుకున్నారు. దాంతో ఈ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. కాగా ప్రస్తుత ఎండీ గణేశ్ మాత్రం అందుకు విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న ఆయన తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు.అంతే కాకుండా న్యాయపరంగా నిబంధనలను పాటించడంతోపాటు.. ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అంటే కేసు మూసివేయవచ్చని.. అందుకు తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పలేదు. నిబంధనలు పాటించాలని చెప్పారు. అంటే సీఐడీ నిబంధనలను పాటించడం లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. కేసు మూసివేతకు అభ్యంతరం లేదని చెబితే తాను భవిష్యత్లో న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గుర్తించారు. అందుకే ఈ కేసు మూసివేత ప్రతిపాదనను ఆయన సమర్ధించ లేదు. అడ్డగోలుగా మూసివేత ప్రతిపాదన సవాల్ చేసిన అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి చంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా మూసి వేయాలన్న ఆతృతలో సీఐడీ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఈ కుంభకోణంపై ఫిర్యాదుదారును పక్కన పెట్టేసి, తమ గుప్పిట్లో ఉండే అధికారుల ద్వారా కుట్ర కథ నడుపుతోంది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఏపీఎస్ఎస్డీసీ అప్పటి చైర్మన్ కె.అజయ్రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించి సీఐడీ కేసు నమోదు చేసి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చింది. కాగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసు మూసివేత ప్రక్రియలో అజయ్ రెడ్డిని విస్మరించింది.అప్పటి ఎండీగా ఉన్న బంగార్రాజు ద్వారా పావులు కదుపుతోంది. కేసు మూసివేతపై అభ్యంతరం ఉందా లేదా తెలపాలని సీఐడీ బంగార్రాజుకు నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఎందుకంటే ఆయన్ను ప్రభుత్వ పెద్దలు బెదిరించి తమ దారికి తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడం.. ఆయన సమ్మతించడం జరిగిపోయింది. అంతా పక్కా పన్నాగంతో కేసు క్లోజర్ కథకు పన్నాగం పన్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వ కుట్రను అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి తిప్పి కొట్టారు. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారు తానే అని, ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు స్కిల్ కేసు కొట్టివేతను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ను దాఖలు చేశారు. కమీషన్లు దండుకున్న వారు అరెస్టు.. కొల్లగొట్టిన చంద్రబాబుపై కేసు క్లోజా!? స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి విస్మయ పరుస్తోంది. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా ఉండీ.. కొల్లగొట్టిన నిధుల్లో కమీషన్లు దండుకున్న వారిని ఈడీ అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖని్వల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసి రిమాండ్కు పంపింది.ఈడీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ కుంభకోణం సూత్రధారి, ప్రధాన లబ్ధిదారు చంద్రబాబుపై కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా మూసి వేస్తుందని నిపుణులు ప్ర శ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అధికార దురి్వనియోగానికి పాల్పడి, లేని ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది ఆయనే. ఇక నిబంధనలకు విరుద్ధంగా నిధుల జారీకి ఆదేశాలు జారీ చేసిందీ చంద్రబాబే. కొల్లగొట్టిన నిధుల్లో సింహ భాగం ఏకంగా రూ.271 కోట్లు చంద్రబాబు ప్యాలస్కే చేరాయి. ఈ పరిస్థితిలో చంద్రబాబుపై కేసును తొలగించడం నిబంధనలకు విరుద్ధం.. చట్ట విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఐడీ క్లోజర్ రిపోర్ట్పై నా వాదనలు వినండి ⇒ స్కిల్ స్కామ్ ఫిర్యాదుదారు, ఆ కార్పొరేషన్ నాటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ ⇒ ఈ కుంభకోణంలో ఆధారాలున్నందునే చంద్రబాబుపై కేసు.. రిమాండ్ ⇒ దానిపై హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ఆయనకు చుక్కెదురు ⇒ చంద్రబాబు సీఎం కాగానే కేసు మూసివేతకు కుట్ర ⇒ అసలు ఫిర్యాదుదారుడినైన నాకు నోటీసు ఇవ్వలేదు ⇒ ఇలా నోటీసు ఇవ్వక పోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం ⇒ హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల్లోనూ నేను పార్టీగా ఉన్నాసాక్షి అమరావతి : స్కిల్ డెవలప్మెంట్æ కార్పొరేషన్ కుంభకోణంలో ఫిర్యాదుదారునైన తనకు తెలియకుండానే కేసును మూసి వేయడానికి వీల్లేదని ఆ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ కుంభకోణం కేసుని మూసివేసేందుకు సీఐడీ, ప్రాసిక్యూషన్, నిందితుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని అయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ముగ్గురూ కుమ్మక్కై కేసును మూసి వేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలిపారు. ఈ కుమ్మక్కు కుట్రను అడ్డుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉందన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసిందని, ఇందులో చంద్రబాబు నాయుడు 37వ నిందితుడిగా ఉన్నారని చెప్పారు.ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉండటంతో సీఐడీ ఆయన్ను 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసిందని, ఆ మరుసటి రోజు అంటే 2023 సెపె్టంబర్ 10న ఏసీబీ కోర్టు రిమాండ్కు పంపిందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబుకు హైకోర్టు, సుప్రీంకోర్టులో చుక్కెదురైందన్నారు. అనారోగ్యం కారణంగా చంద్రబాబు బెయిల్ పొంది బయటకు వచ్చారని, ఆ తర్వాత ప్రభుత్వ మార్పుతో ప్రస్తుత దర్యాప్తు అధికారి నిందితులతో కుమ్మక్కై క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారని చెప్పారు. ఫిర్యాదుదారు అయిన తనకు విచారణ పురోగతి గానీ, క్లోజర్ రిపోర్ట్ దాఖలు గురించి గానీ తెలియజేయలేదన్నారు.ఇది మీనూ కుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం అని తెలిపారు. ఫిర్యాదుదారుడికి నోటీసు ఇచ్చి వాదనలు వినడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ‘కేసు మూసివేతకు ఇఐఈ, ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్, నిందితులు కలిసి కుట్ర పన్నారు. ఎఫ్ఐఆర్ లో కాలమ్ 6లో ఫిర్యాదుదారుగా నా పేరు స్పష్టంగా ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల్లో కూడా నేను పార్టీగా ఉన్నా. ఈ నేపథ్యంలో ఈ కేసును మూసి వేసేందుకు సీఐడీ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసినప్పుడు ముందుగా నాకు నోటీసు ఇవ్వాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశించండి. ఆ క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశాను. ఈ సందర్భంగా నా వాదనలు వినాలి’ అని అజయ్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్పై ఏం జరగనుంది.. సర్వత్రా తీవ్ర చర్చస్కిల్ స్కామ్ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసును అడ్డగోలుగా మూసి వేయాలన్న సీఐడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజయ్రెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు సోమవారం చేపట్టనుంది. ఈ కేసు విచారణ కేవలం స్కిల్ స్కామ్ కేసుపైనే కాదు.. భవిష్యత్లో ప్రజా ప్రతినిధుల అవినీతి కేసులపై కూడా ప్రభావం చూపుతుందన్నది సుస్పష్టం. అందుకే ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ బృందం 40 మందికిపైగా సాక్షులను విచారించింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వారు చెప్పిన సాక్ష్యాలు, నమోదు చేసిన వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.ఎఫ్ఐఆర్లు, చార్జ్షీట్లు దాఖలు చేసిన విషయం ప్రస్తావనార్హం. ఏకంగా నాలుగు వేల పేజీల డాక్యుమెంట్లలో పేర్కొన్న విషయాల్లోని ప్రామాణికతను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు కొనసాగాలని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులే తేల్చి చెప్పిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి హోదాలో పాల్పడిన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసి వేయడం ఒక దుస్సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుందని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే జరిగితే మునుముందు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు బరితెగించి అవినీతికి పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే స్కిల్ స్కామ్ కేసులో దర్యాప్తు, విచారణ కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రూ.3,300 కోట్లుగా నిగ్గుతేల్చిన సీఐడీ2014–19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగింది. రూ.370 కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందుకు అనుగుణంగా కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో పాటు పలువురిని నిందితులుగా చేర్చి తదుపరి దర్యాప్తు ప్రారంభించింది. అంతిమంగా ఈ కుంభకోణం విలువను రూ.3,300 కోట్లుగా తేల్చింది. అటు తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. స్కిల్ కుంభకోణం నిధులను నిందితులందరూ కలిసి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు ఈడీ తేల్చింది.స్కిల్ కుంభకోణం కేసులో ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ, చంద్రబాబు నాయుడిని 2023 సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసి 10న విజయవాడ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచింది. ప్రాథమిక దర్యాప్తులో సేకరించిన పలు ఆధారాలను రిమాండ్ రిపోర్ట్ రూపంలో కోర్టుకు సమరి్పంచింది. సాక్షుల వాంగ్మూలాలను సైతం కోర్టుకిచ్చిది. చంద్రబాబును రిమాండ్కు పంపాలని కోరింది. 2015లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్–సీమెన్స్ మధ్య కుదిరిన ఒప్పందం మొదలు నిధుల మళ్లింపు వరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచింది.చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్టు తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు నాయుడు హైకోర్టులో కేవలం మూడు రోజుల లోపే పిటిషన్ దాఖలు చేశారు. అలాగే స్కిల్ కుంభకోణంపై సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కూడా కోరారు. చంద్రబాబు పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆయన పిటిషన్ను కొట్టేస్తూ 2023 సెపె్టంబర్ 22న తీర్పునిచ్చిది. దర్యాప్తులో భాగంగా సీఐడీ 140 మంది సాక్షులను విచారించిందని, అలాగే 4,000 డాక్యుమెంట్లను కూడా సేకరించిందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. దర్యాప్తు విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సీమెన్స్కు నిధుల చెల్లింపుల నిర్ణయాన్ని అధికారిక విధుల్లో భాగంగానే తీసుకున్నానన్న చంద్రబాబు వాదనను సైతం హైకోర్టు తోసి పుచ్చిది. పబ్లిక్ సర్వెంట్ ప్రజాధనాన్ని తన స్వీయ అవసరాలకు వాడుకోవడం అధికారిక విధుల కిందకు రాదని తేల్చి చెప్పింది. కేసు కొట్టివేతకు సుప్రీం నిరాకరణఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను ఆయన సవాలు చేశారు. అలాగే తనపై కేసును సైతం కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా, కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. అవినీతి నిరోధక చట్టం కింద తనపై కేసు నమోదు చేసే ముందు ఆ చట్టంలోని సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోలేదన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు వాదనలు విన్న ఇద్దరు న్యాయమూర్తులు కూడా భిన్న తీర్పులు వెలువరించారు.అయితే ఇరువురు న్యాయమూర్తులు కూడా చంద్రబాబు కుమ్మక్కుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సమరి్థస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పులేదని తేల్చి చెప్పింది. అంతేకాక చంద్రబాబుపై కేసును కొట్టేసేందుకు సైతం ఇరువురు న్యాయమూర్తులు నిరాకరించారు. సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ బోస్ చెప్పగా, అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది చెప్పారు. సెక్షన్ 17(ఏ)ను నిజాయితీపరులైన అధికారులను రక్షించేందుకే తీసుకొచ్చారే తప్ప, అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు.స్కిల్ స్కామ్లో అసలు దోషి బాబే ఆధారాలతో నిగ్గు తేల్చిన ఈడీ, సీఐడీ⇒ దాచాలన్నా చంద్రబాబు అవినీతి బాగోతం దాగేది కాదు. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం సీఐడీ అధికారులు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’అనే పేరుతో కుట్రకు తెరతీశారు. కానీ స్కిల్ స్కామ్ కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనని ఇప్పటికే ఈడీ, సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చాయి. సీమెన్స్ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో సమరి్పంచిన రిమాండ్ నివేదికలో సిట్ వెల్లడించింది. ⇒ జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. రూ.370 కోట్ల ప్రాజెక్టు విలువను అడ్డగోలుగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. లేని ఈ ప్రాజెక్టును కాగితాలపై చూపించి.. సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ⇒ నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపునకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ఆదేశాలు జారీ చేశారు. ఏకంగా 13 నోట్ ఫైళ్లపై ఆయన సంతకాలు చేసి ఈ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారు. అలా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా చేరాల్సిన చోటుకు చేర్చారు. ⇒ 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఈ కుంభకోణం బయట పడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. 2019లో పుణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చిది. ⇒ సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తుతో ఆధారాలతో సహా నిగ్గు తేలింది. ఈ అవినీతి నెట్వర్క్ను సీఐడీ అధికారులు పక్కా ఆధారాలతో ఛేదించారు. కొల్లగొట్టిన అవినీతి సొమ్ములో రూ.77.37 కోట్లను హైదరాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిల్లోని టీడీపీ ఖాతాల్లో డిపాజిట్ చేశారు. కేవైసీ నిబంధనలకు విరుద్ధంగా నిధులను డిపాజిట్ చేసినట్టు సిట్ దర్యాప్తులో బట్టబయలైంది. ⇒ ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్ïÙట్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెపె్టంబరు 9న సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతేగానీ చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎక్కడా ఎవరూ చెప్పక పోవడం గమనార్హం. ⇒ ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించినట్టు గుర్తించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖని్వల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. ⇒ రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. -
కుక్క మూడ్ చెప్పగలమా?
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలు, ఆస్పత్రులు, కోర్టులు మొదలు ఎక్కడ పడితే అక్కడ తిష్టవేస్తున్న వీధి శునకాల కారణంగా జనం కుక్కకాటు బారిన మాత్రమేకాదు రోడ్లపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. వీధి శునకాలను జనసమ్మర్ధ ప్రాంతాల నుంచి తరలించి షెల్టర్లకు తరలించాన్న అంశంపై బుధవారం జస్టిస్ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది. ఈ సందర్భంగా శునకాలు సహా వీధి జంతువుల బెడదను జడ్జీలు ప్రస్తావించారు. ‘‘అసలు రహ దారుల వెంబడి శునకాలు, వీధి జంతువులు లేకుండా చేయాలి. కుక్కకాటు మాత్రమే జనాల సమస్య కాదు.. వీధి జంతువులు రోడ్లపై ఇష్టారీతిగా తిరగడంతో జనం అన్యాయంగా రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నా రు. గత 20 రోజుల్లో రాజస్థాన్ హైకోర్టులో ఇద్దరు జడ్జీలు ఇలాగే రోడ్లపై వీధి జంతువుల కారణంగా ప్రమాదాలకు గురయ్యారు. ఒకరు ఇంకా వెన్నుముక గాయాలతో ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇది నిజంగా ఆందోళకరమైన విషయం’’అని జస్టిస్ మెహతా అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కలి్పంచుకుని వాదించారు. ‘‘వీధి శునకాల తరలింపునకు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించండి. బహిరంగ ప్రదేశాల్లోని శునకాలను బంధించడం సమస్యకు పరిష్కారం అనిపించుకోదు. జంతువులు–మానవుల మధ్య ఘర్షణను రూపుమాపేలా అంతర్జాతీయంగా ఆమోదింపబడిన శాస్త్రీయ పరిష్కారాన్ని చూపండి’’అని ఆయన కోరారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ స్పందించారు. ‘‘చికిత్స కంటే నివారణ అత్యుత్తమం. అయినా ఈ అంశంలో అతిగా వాదించడాని కి ఏమీ లేదు. మేం కేవలం రోడ్ల మీద వీధి శునకాలను తొలగించాలని సూచించాం. సంబంధిత నియమనిబంధనల జోలికి వెళ్లలేదు. ఇప్పటికే ఉన్న చట్టాలు, నియమాలను రాష్ట్రాలు, ప్రభుత్వరంగ సంస్థలు విధిగా అమలుచేస్తే సరిపోతుంది. గతంలో మా తీ ర్పుకు అనుగుణంగా అఫిడవిట్లు సమర్పించాలని కోరాం. కొన్ని రాష్ట్రాలు మౌనంవహించాయి’’అని న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఈ అంశంలో కోర్టు సలహాదారు(అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ మాట్లాడారు. ‘‘జాతీయరహదారుల్లో దాదాపు 1,400 కిలోమీటర్ల రోడ్డు మార్గాలు జంతువులతో ప్ర మాదకరంగా తయారయ్యాయి. ఇక్కడ రహదారి మీద వీధి శునకాలు, పశువుల బెడద ఎక్కువ. ఇవి రహదారి మీదకు రాకుండా కంచె వేయాలని సూచించాం. కోర్టు గత తీర్పును మధ్య ప్రదే శ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్లు పట్టించుకోలేదు. అవి అఫిడ విట్లు సమర్పించలేదు. మిగతా రాష్ట్రాలు సమర్పించినా అవి పేలవంగా ఉన్నాయి’’అని గౌరవ్ అగర్వాల్ వెల్లడించారు. వాటిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది. కుక్కలకు కౌన్సిలింగ్ మిగిలింది ఈ సందర్భంగా న్యాయస్థానం సరదా వ్యాఖ్యచేసింది. ‘‘ఈ లెక్కన తోటి కుక్కలకు రేబిస్ వంటి వ్యాధి సోకినా అంటించుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ కరవొద్దని ఇతర శునకాలకు హితబోధ చేయాలి. ఆ మేరకు వాటికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలా కుక్కలకు కౌన్సిలింగ్ చేయడం ఒక్కటే మిగిలిపోయింది. అయితే అంతగా కౌన్సిలింగ్ ఇచి్చన తర్వాత కూడా ఆ కౌన్సిలింగ్ ఇచి్చన వ్యక్తిని బయటికొచి్చన కుక్క కరవకుండా ఉంటుందనే గ్యారెంటీ అయితే లేదు’’అని సరదా వ్యాఖ్యచేసింది. కుక్క మూడ్ చెప్పగలమా?‘పాఠశాలలు, ఆసుపత్రులు, కోర్టుల వంటి సంస్థాగత ప్రాంగణాల్లో వీధి కుక్కలు ఎందుకు ఉండాలి? ఏ కుక్క ఎప్పుడు ఏ ‘మూడ్’లో ఉంటుందో.. ఎవరిని కరు స్తుందో ఎవరైనా గుర్తించగలరా?’అని సుప్రీంకోర్టు అధికారులను నిలదీసింది. జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనలను అధికారులు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే సమస్య జఠిలమైందని జంతు ప్రేమికుల సంఘం తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ సందీప్ మెహతా.. ’అధికారులు తమ పని చేయడంలో విఫలమయ్యారని చెప్పి ప్రజలు నిరంతరం బాధలు పడాలా?’అని ఘాటుగా ప్రశ్నించారు. -
మనుషుల కేసుల్లోనూ ఇన్ని దరఖాస్తులు రాలేదు
న్యూఢిల్లీ: వీధి శునకాలకు సంబంధించి తమ వద్ద విచారణలో ఉన్న కేసుకు అనుబంధంగా కుప్పలుతెప్పలుగా అనుబంధ పిటిషన్లు, దరఖాస్తులు వచ్చిపడుతున్నాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. వీధి శునకాలకు సంబంధించిన కేసును బుధవారం విచారిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం గుర్తుచేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇప్పటికే పలువురు లాయర్లు ఈ అంశంలో అనుబంధ పిటిషన్లు, దరఖాస్తులు ఇచ్చారు. మళ్లీ ఇద్దరు లాయర్లు ఇదే కేసుపై దరఖాస్తులు సమర్పించి సంబంధిత ధర్మాసనానికి బదిలీచేయాలని విజ్ఞప్తిచేశారు. సాధారణంగా చూస్తే మనుషులకు సంబంధించిన ఏ కేసులో కూడా ఇన్ని అప్లికేషన్లు రాలేదేమో. కుక్కల విషయంలో పిటిషన్లు పోటెత్తుతున్నాయి. ఇలాంటి అప్లికేషన్లు బుధవారం కూడా వస్తాయేమో. అన్నీ కలిపి బుధవారమే కేసును విచారిస్తాం’’అని సుప్రీంకోర్టు వెల్లడించింది. -
తీవ్ర బాధ్యతారాహిత్యం
న్యూఢిల్లీ: వాయుకాలుష్యంలోనూ దేశరాజధానిగా పనికిరాని పేరు తెచ్చుకుని గ్యాస్ఛాంబర్గా తయారైన ఢిల్లీని కాలుష్యం బారి నుంచి తప్పించడడంలో కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం) విభాగం ఘోరంగా విఫలమవుతోందని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఢిల్లీని చుట్టేస్తున్న వాయుకాలుష్యానికి ప్రధాన హేతువులను గుర్తించి, పరిష్కారాలను సూచిస్తూ రెండు వారాల్లోగా తగు నివేదికను సమర్పించాలని సీఏక్యూఎంకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగీ్చల ధర్మాసనం మంగళవారం సూచించింది.పొరుగురాష్ట్రాల గుండా ఢిల్లీలోకి వచ్చే వాహనాలు గంటలతరబడి వేచి ఉండటంతో సరిహద్దుల వెంబడి ఉన్న ప్రధాన టోల్ప్లాజాలు కాలుష్యకేంద్రాలుగా తయారయ్యాయని, వెంటనే వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. దీంతో వాటిని తాత్కాలికంగా మూసేయడం లేదంటే వేరే చోటుకు మార్చడంపై తుది నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలల సమయం కావాలని సీఏక్యూఎం కోరడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రెండు నెలల గడువు ఇవ్వడం కుదరదు. కేవలం రెండు వారాల సమయం ఇస్తున్నాం. ఈలోపు నివేదిక ఇవ్వండి’’అని ధర్మాసనం ఆదేశించింది. సమస్య వదిలేసి ఆదాయంపై యావ? ‘‘పరిష్కారం చూపండయ్యా అంటే అది వదిలేసి ఆయా టోల్ప్లాజాలే మాకు ఆదాయ వనరులు అంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అఫిడవిట్ సమర్పించింది. వీళ్లను చూసి గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సైతం ఇదే పాట పాడుతోంది. గురుగ్రామ్లో పర్యావరణ నష్టపరిహార రుసుముల్లో సగభాగం తమకు ఇప్పించాలని కోరుతోంది. ఇదేం వైఖరి?. దీర్ఘకాలిక పరిష్కారాలతో లేదా నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలతో ముందుకు రావాల్సిన సంస్థలు ఇలా సమస్య తీవ్రత తెలీకుండా వ్యవహరిస్తున్నాయి. గతంలో మేం లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వకుండా మౌనం దాల్చడం కూడా ఏమాత్రం సబబుగా లేదు’’అని కోర్టు వ్యాఖ్యానించింది.కారు ఇప్పుడు స్టేటస్ సింబల్‘‘ఢిల్లీలో కాలుష్యం తగ్గాలంటే కార్ల సంఖ్యను కుదించాలి. కొన్ని కుటుంబాలకు ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. కుటుంబానికి లేదా ఒక వ్యక్తికి ఒక్కటే కారు అనే నిబంధన అమలుచేస్తే వాహన కాలు ష్యం కాస్తం తగ్గొచ్చు’’అని సీనియర్ న్యా యవాది రాకేశ్ ద్వివేది వాదించారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ‘‘ఇప్పుడు జనాల్లో కారు అనేది స్టేటస్ సింబల్గా తయారైంది. జనం సైకిళ్లు ఉపయోగించడం మానేశారు. సరిపడా డబ్బులు కూడబెట్టి నేరుగా కారు కొనేస్తున్నారు’’అని అన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ అత్యంత శక్తివంతంగా తయారైందని లాయర్ వ్యాఖ్యానించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ‘‘ధనవంతులు ఒక రకమైన త్యాగం చేస్తే బాగుంటుంది. అత్యంత ఖరీదైన కార్లు కొనేబదులు విద్యుత్తో నడిచే కార్లు కొంటే ఉత్తమం’’అని అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట
-
శర్జీల్ ఇమామ్, ఉమర్ ఖాలిద్ లకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
-
పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్ట్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్పై మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి అంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సూచించారు. అనంతరం, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా చేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు. ఈ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్కు సంబంధించి మూడు పరిష్కారాలను సుప్రీంకోర్టు సూచించింది.1. సమగ్ర విచారణ కోసం సివిల్ సూట్ ఫైల్ చేయమని సూచన 2. కేంద్ర ప్రభుత్వ కమిటీకి తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారాన్ని ఇస్తాం.3. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుని అవకాశం ఇచ్చారు.జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..అంతకుముందు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉంది కదా?. ప్లానింగ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్కి ఏపీ నిధులే వృధా అవుతాయి కదా?. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్ విచారణ అర్హతను పరిశీలిస్తున్నాం. సివిల్ సూట్ ఫైల్ చేస్తేనే సమగ్రంగా విచారణ జరపవచ్చు. ప్రాజెక్టు ఆపాలన్న మీ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలించేలా చూడమని ఆదేశాలు ఇస్తాం. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అని అన్నారు.ఏకపక్షంగా నిర్మాణం..అనంతరం, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపిస్తూ..‘వరద జలాల పేరుతో మాకు కేటాయించిన నీటి వాటాను తరలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుపై వెంటనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలి. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి వాటా ఉంది. పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్టుతో మా వాటా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేదు. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రాజెక్టును ఆపే అధికారం లేదు. సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు.రాష్ట్ర ప్రాజెక్ట్ మాత్రమే.. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ..‘పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టులో మేము నిబంధనలు ఉల్లంఘించలేదు. కేవలం మేము ప్లాన్ రెడీ చేసుకుంటున్నాం. సముద్ర జలాలు వృథా అవుతున్నాయి. వాటిని రాయలసీమకి అందించాలనుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రాజెక్టు మాత్రమే జాతీయ ప్రాజెక్టు కాదు. మా రాష్ట్ర అవసరాలపైన ప్లానింగ్ చేసుకునే అధికారం ఉంది. మేము పీఎఫ్ఆర్, డీపీఆర్లను తయారు చేస్తున్నాము అని తెలిపారు.ఈ క్రమంలో సుప్రీంకోర్టు సూచించిన పరిష్కారాలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని అభిషేక్ సింఘ్వీ కోరారు. అనంతరం, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా చేశారు. -
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
కరాకస్: వెనెజువెలాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా వైమానిక దాడుల అనంతరం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్లను అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 150 యుద్ధ విమానాలతో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అధ్యక్షుడు నికోలస్ మదురో అందుబాటులో లేని ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో.. వెనెజువెలా సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నార్కో టెర్రరిజం (మాదకద్రవ్యాల ఉగ్రవాదం) ఆరోపణల కింద మదురో దంపతులను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. మదురో దంపతులు తమకు లొంగిపోయారని, ప్రస్తుతం వారు అమెరికా రక్షణ విభాగం అదుపులో ఉన్నారని జనరల్ డాన్ కేన్ వెల్లడించారు.పగ్గాలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్వెనెజువెలా పరిపాలనా కొనసాగింపును, సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించడం తప్పనిసరి అయ్యిందని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 56 ఏళ్ల డెల్సీ రోడ్రిగ్జ్, నికోలస్ మదురోకు అత్యంత సన్నిహితురాలు. 1969లో కారకాస్లో జన్మించిన ఈమె, విప్లవ నేత జార్జ్ ఆంటోనియో రోడ్రిగ్జ్ కుమార్తె. వృత్తిరీత్యా న్యాయవాది అయిన డెల్సీ, గత దశాబ్ద కాలంలో వెనెజువెలా రాజకీయాల్లో కీలక మహిళా నేతగా పేరొందారు.గతంలో సమాచార మంత్రిగా, విదేశాంగ మంత్రిగా సేవలందించిన డెల్సీ రోడ్రిగ్జ్ 2018 నుంచి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన సోదరుడు, నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్జ్తో కలిసి ఆమె మదురో ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. డెల్సీ రోడ్రిగ్జ్ కేవలం రాజకీయాల్లోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపైనా పట్టు సాధించారు. 2024 ఆగస్టులో ఆమెకు చమురు శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. అమెరికా ఆంక్షల నడుమ దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఆమె ఎంతో కృషి చేశారు.ఇది కూడా చదవండి: వెనుజువెలాలో అప్పటి దాకా మా పాలనే.. ట్రంప్ ప్రకటన -
న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాలి
సాక్షి, అమరావతి: న్యాయాధికారులకు జ్యుడీషియల్ అకాడమీ ఉన్నట్లే... న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు. సీనియర్, యువ న్యాయవాదులు కలిసి ఆంధ్రప్రదేశ్ లీగల్ అకాడమీ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాలని, దీనికి మొదట సహకారం అందించే వ్యక్తిని తానే అవుతానని కూడా ఆయన ప్రకటించారు. న్యాయవాదులకు లీగల్ అకాడమీ ఉండటం వల్ల న్యాయ వ్యవస్థలో తాజా పరిణామాలను శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు.మారిన పరిస్థితుల్లో కక్షిదారులు ఎంతో విషయ పరిజ్ఞానంతో ఉంటున్నారని పేర్కొంటూ అందువల్ల ఆయా అంశాల్లో న్యాయవాదులు కక్షిదారుల కంటే ముందుండాలన్నారు. గుంటూరులో శనివారం జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన జస్టిస్ శ్రీనరసింహ శుక్రవారం హైకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మంచి అవకాశమని పేర్కొన్నారు. ఏఐ విప్లవాత్మక పరిస్థితుల నేపథ్యంలో న్యాయవాదుల్లో స్వీయ అవగాహన, నిరంతర అధ్యయనం, సంస్థాగత మార్గదర్శనం అత్యంత అవసరమన్నారు. ఘన సన్మానంఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్, ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్, ఇతర కార్యవర్గం జస్టిస్ శ్రీనరసింహను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు గ్రంథాలయాన్ని, హైకోర్టు నూతన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం రాత్రి జస్టిస్ నరసింహ గౌరవార్థం హైకోర్టు న్యాయమూర్తులందరూ విందు ఏర్పాటు చేశారు. కాగా, హైకోర్టుకు వచ్చిన జస్టిస్ శ్రీనరసింహను ఆయన పూర్వీకుల గ్రామమైన ప్రకాశం జిల్లా, మేదేపల్లి గ్రామానికి చెందిన పలువురు కలిసి, ఆయన తండ్రి దివంగత కోదండరామయ్య చిత్ర పటాన్ని అందచేశారు.పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు: జస్టిస్ శ్రీనరసింహ వన్టౌన్(విజయవాడపశి్చమ): పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులని జస్టిస్ శ్రీనరసింహ పేర్కొన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ శ్రీనరసింహ జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పుస్తక పఠనం గొప్ప సంస్కృతిగా అభివర్ణించారు. పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు. -
పిల్ తేలే వరకు ‘స్కిల్’కేసును మూసేయొద్దు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసును మూసివేసేందుకు సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించవద్దని పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర్ తిలక్ విజయవాడ ఏసీబీ కోర్టును అభ్యర్థిచారు. ఆ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో ఓ మెమో దాఖలు చేశారు. ‘స్కిల్ కుంభకోణం దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో నేనే పిల్ దాఖలు చేశాను.దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఇదిలా ఉంటే, స్కిల్ కుంభకోణంపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు సీఐడీ చర్యలు చేపడతున్నట్లు నాకు తెలిసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పెండింగ్లో ఉన్నప్పటికీ, సీఐడీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేసు మూసివేత దిశగా చర్యలు చేపడుతోంది. హైకోర్టులో పిల్ తేలకుండా కేసును ముగిస్తే, పిల్ దాఖలు చేసిన అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది. అలాగే విచారణ ప్రక్రియకు విఘాతం కలిగించినట్లు కూడా అవుతుంది.అలా చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కూడా. అంతేకాక అలా కేసును మూసేయడం న్యాయ విరుద్ధం కూడా. స్కిల్ కుంభకోణంపై సీఐడీ కేసును కొట్టేయాలని కోరుతూ ఆ కేసులో 37వ నిందితునిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పరిష్కారం అయ్యే వరకు స్కిల్ కుంభకోణం కేసును మూసివేసే దిశగా సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఆ మొత్తం ప్రక్రియను నిలిపేయండి.’ అని తిలక్ తన మెమోలో ఏసీబీ కోర్టును అభ్యర్థిచారు. -
ఇకపై వాదనలకు ‘టైం’ లిమిట్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. కోర్టుల్లో కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు గంటల తరబడి వాదనలు వినిపించే సంప్రదాయానికి స్వస్తి పలకనుంది. కోర్టు విలువైన సమయాన్ని ఆదా చేయడంతో పాటు, సామాన్యుడికి సత్వర న్యాయం అందించే దిశగా సుప్రీంకోర్టు సరికొత్త విధానాన్ని (ఎస్ఓపీ) అమల్లోకి తెచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాల మేరకు కీలక సర్క్యులర్ జారీ అయింది. దీని ప్రకారం.. ఇకపై న్యాయవాదులు తమ వాదనలను నిర్ణీత సమయంలోపే ముగించాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక వల్ల రోజుకు ఎక్కువ కేసులను విచారించే వీలుంటుందని, తద్వారా పెండింగ్ భారం తగ్గి సత్వర న్యాయం సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. కొత్త నిబంధనలు ఇవే.. 1. ముందుగానే టైం చెప్పాలి: కేసు విచారణకు హాజరయ్యే సీనియర్ న్యాయవాదులు తాము వాదనలు వినిపించడానికి ఎంత సమయం తీసుకుంటారో ముందే స్పష్టం చేయాలి. విచారణ తేదీకి కనీసం ఒక రోజు ముందుగా సుప్రీంకోర్టు ఆన్లైన్ అప్పియరెన్స్ పోర్టల్ ద్వారా ఈ వివరాలను నమోదు చేయాలి. 2. ఐదు పేజీల నోట్స్ తప్పనిసరి: కేవలం మౌఖిక వాదనలే కాకుండా.. విచారణకు మూడు రోజుల ముందే న్యాయవాదులు తమ వాదనలకు సంబంధించిన సంక్షిప్త లిఖితపూర్వక నోట్స్ సమర్పించాలి. ఇది ఐదు పేజీలకు మించకూడదు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ ద్వారా గానీ, నోడల్ కౌన్సిల్ ద్వారా గానీ వీటిని ఫైల్ చేయాలి. అలాగే ప్రతివాదులకు కూడా ఈ కాపీని అందజేయాలి. 3. గడువులోపే ముగించాలి: తాము ముందుగా నిర్ణయించుకున్న లేదా కోర్టు కేటాయించిన సమయంలోపే లాయర్లు తమ వాదనలను కచి్చతంగా ముగించాలి. అనవసర సాగదీతకు తావివ్వకుండా చూడాలి. -
నేరం రుజువు కాకముందే ఖాకీల శిక్ష
సాక్షి, అమరావతి: ఇప్పటికే బరితెగించి వ్యవహరిస్తున్న ఏపీ పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం నిర్భీతిగా బేఖాతరు చేసే స్థాయికి చేరారు. రెడ్బుక్ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా రాజ్యాంగ ధర్మాన్ని నిస్సిగ్గుగా పోలీసు శాఖ విస్మరిస్తోంది. నిందితుల అరెస్టు, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్వయంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం విస్మయపరుస్తోంది. ఆయా అంశాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఏమిటీ?.. ఏపీ పోలీసుల బరితెగింపు ఏ స్థాయికి చేరిందన్న అంశాలు పరిశీలిస్తే...నిందితులను పరేడ్ చేయించకూడదుడీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం ఏదైనా కేసుల్లో నిందితులను అరెస్టు విషయంలో పోలీసులు కచ్చితంగా నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. నిందితులను అరెస్టు చేయడం, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం.. ⇒ ఒక కేసులో నిందితులుగా ఉన్నంత మాత్రాన వారు నేరస్తులుగా భావించలేం. నేరం నిరూపితం కానంతవరకు నేరస్తులు కారు.⇒ ఇక నిందితుల సామాజిక గౌరవానికి పోలీసులు భంగం కలిగించ కూడదు. వారి గౌరవాన్ని పోలీసులు కచ్చితంగా పరిరక్షించాలి. అరెస్టు చేసిన నిందితులను బహిరంగంగా నడిపిస్తూ పరేడ్ చేయించకూడదు. వారిని ప్రజలకు కనిపించేలా ప్రదర్శించకూడదు. ⇒ నిందితులను సోదా చేసే ప్రక్రియ గౌరవప్రదంగా ఉండాలి. వారి వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించకూడదు. ⇒ అరెస్టు సమయంలో పోలీసులు బల ప్రయోగం చేయడం సరికాదు. ⇒ నిందితులు తప్పించుకునేందుకు యత్నిస్తే, గాయాలు కాకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించాలి. అంతేగానీ అరెస్టు కోసమని చెప్పి గాయపరచ కూడదు.సుప్రీం కోర్టు చెప్పినా లెక్క చేయం: ఏపీ పోలీసుల నిర్భీతి నిందితుల గౌరవానికి భంగం కలిగించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తాము లెక్కచేయబోమంటూ బాబు సర్కార్ హయాంలో ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కక్ష పూరితంగా అరెస్టు చేసిన పలువురు నిందితులను రోడ్డుపై నడిపించి పరేడ్ చేయించడం పోలీసుల దాషీ్టకానికి నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను సంప్రదాయ జాతర తరహాలో నిర్వహించిన అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. నరికిన పొట్టేళ్ల తలలను దండగా చేసి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీకి వేసి వేడుకలు చేసిన టీడీపీ అభిమానులను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.కానీ సాధారణ జాతర శైలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన వైఎస్సార్సీపీ అభిమానులపై మాత్రం కక్ష గట్టారు. శ్రీసత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి తదితర జిల్లాల్లో ఏకంగా 13 కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న యువకులను అరెస్టు చేశారు. అంతేకాదు...వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించారు. తద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. నిందితుల సామాజిక గౌరవానికి భంగం కలిగించారు. వారి వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్క లేదని తేల్చి చెప్పారు. వాహనాలు లేవు.. అందుకే నడిపించాం: డీజీపీ గుప్తా బాధ్యతా రహిత స్పందన నిందితుల గౌరవానికి భంగం కలిగించ కూడని.. వారిని రోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ‘సుప్రీంకోర్టు చెబితే మాత్రం మేమేందుకు చేస్తాం’ అన్నట్టుగా సాక్షాత్తూ ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా స్పందించడం విభ్రాంతి కలిగిస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నిందితులను రోడ్డుపై పరేడ్ చేయించడంపై మీడియా ప్రతినిధులు ఆయనను సోమవారం ప్రశ్నించారు. దీనిపై డీజీపీ పూర్తి బాధ్యతారహితంగా స్పందించారు. ‘నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు పోలీసుల వద్ద వాహనాలు లేవు. అందుకే నడిపించి తీసుకువెళ్లాం’ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.తద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పోలీసు శాఖకు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పోలీసు శాఖ చీఫ్ స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక ఇతర పోలీసు అధికారుల ఎలా వ్యవహరిస్తారన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సామాన్యుల గురించి ఎందుకు పట్టించుకుంటారని, పౌర హక్కుల మాటేమిటని మేధావులు, ప్రజాస్వామ్య హితైషులు ప్రశి్నస్తున్నారు. డీజీపీ గుప్తా ఒక దుస్సంప్రదాయానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
కారుణ్య నియామకం హక్కు కాదు.. తక్షణ భరోసా: ఉన్నత న్యాయస్థానం
ప్రభుత్వ ఉద్యోగుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు కల్పించే కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కారుణ్య నియామక ప్రాతిపదికన ఒకసారి ఉద్యోగాన్ని అంగీకరించిన తర్వాత, తమకు అర్హత ఉన్నా అంతకంటే ఉన్నత పదవి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.కేసు నేపథ్యంతమిళనాడు పట్టణ పంచాయతీల్లో స్వీపర్లుగా పనిచేస్తూ మరణించిన ఇద్దరు వేర్వేరు ఉద్యోగుల కుమారులకు (ఎం.జయబల్, ఎస్.వీరమణి) వారి తండ్రుల మరణానంతరం 2007, 2012 సంవత్సరాల్లో స్వీపర్లుగానే ఉద్యోగాలు లభించాయి. వారు ఉద్యోగంలో చేరే సమయంలో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆ కొలువుల్లో చేరారు. అయితే, సుమారు 3 నుంచి 9 ఏళ్ల తర్వాత తమకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని, అప్పట్లో అవగాహన లేక తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరామని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వగా, దానిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలుకారుణ్య నియామకం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 (సమానత్వ హక్కు)కు ఒక మినహాయింపు మాత్రమే. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబానికి తక్షణ భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం. ఇది ఒక హక్కు కాదు లేదా కెరీర్ అభివృద్ధి కోసం ఇచ్చే అవకాశం కాదు. అభ్యర్థికి ఉన్నత పదవికి కావాల్సిన విద్యార్హతలు ఉన్నప్పటికీ ఖాళీలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తదుపరి నియామకం జరుగుతుంది. అర్హత ఉంది కదా అని ఉన్నత పదవిని డిమాండ్ చేసే హక్కు అభ్యర్థికి ఉండదు.ఉద్యోగంలో చేరిన చాలా ఏళ్ల తర్వాత (3-9 ఏళ్లు) కోర్టును ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘వేరే ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత పదవి ఇచ్చారు కాబట్టి, మాకూ ఇవ్వాలి’ అనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఒక అధికారి చేసిన తప్పును మరొకరికి వర్తింపజేయమని కోర్టులు ఆదేశించలేవని చెప్పింది. తప్పును పునరావృతం చేయలేమని స్పష్టం చేసింది.న్యాయ నిపుణుల విశ్లేషణఈ తీర్పుపై న్యాయ నిపుణులు స్పందిస్తూ, ఇది ప్రభుత్వ నియామక ప్రక్రియల సమగ్రతను కాపాడుతుందని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు కేవలం మానవతా దృక్పథంతో చేసేవని, వీటిని సీనియారిటీ పెంచుకోవడానికి లేదా ఉన్నత పదవులు అనుభవించడానికి వాడుకోలేమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును కొట్టివేస్తూ, పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కారుణ్య నియామకం పొందిన వారు భవిష్యత్తులో ఉన్నత పదవుల కోసం ఇలాంటి క్లెయిమ్స్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.ఇదీ చదవండి: మీరు బిజినెస్లో కింగ్ అవ్వాలంటే.. -
ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..
-
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
న్యూఢిల్లీ: అరావళి పర్వత శ్రేణుల నిర్వచనాన్ని పరిమితం చేస్తూ, గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. సముద్ర మట్టం నుండి కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న భూభాగాలను మాత్రమే అరావళి పర్వతాలుగా పరిగణించాలంటూ, ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు కోర్టు మొగ్గు చూపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, తన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ, కీలక నిర్ణయం తీసుకుంది.గత నవంబర్ 20న సుప్రీంకోర్టు.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించిన నిర్వచనాన్ని ఆమోదించింది. దీని ప్రకారం స్థానిక భూతలానికి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలనే అరావళి శ్రేణిగా గుర్తించాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఎత్తును ప్రాతిపదికగా తీసుకుంటే, దాదాపు 90 శాతం అరావళి ప్రాంతం రక్షణ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారుతుందని వారు పేర్కొన్నారు.ఈ వివాదాస్పద నిర్వచనంపై పలు విమర్శలు వచ్చిన దరిమిలా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తిరిగి విచారించాలని నిర్ణయించింది. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా అరావళి పర్వతాలు ఒక రక్షణ కవచం మాదిరిగా ఉపకరిస్తున్నాయని, దేశంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణులైన వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. కాగా గతంలో సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే తాజా స్టే ఆర్డర్ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోనుంది. సోమవారం జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘ఆరావళి’పై విచారణ జరిపింది.ఇది కూడా చదవండి: Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం -
28న ఆరావళిపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: దేశంలోని ఆరావళి పర్వత శ్రేణుల నిర్వహణకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదంగా మారిన ఆరావళి పర్వతాల నిర్వచనం, దాని అనుబంధ అంశాలపై సుప్రీంకోర్టు డిసెంబర్ 28న విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా (స్వచ్ఛందంగా) స్వీకరించడం గమనార్హం.చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఎ.జి. మసీహ్లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోర్టు జాబితాలో ఈ అంశాన్ని ‘ఆరావళి కొండలు-పర్వత శ్రేణుల నిర్వచనం, సంబంధిత అంశాలు’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనం చుట్టూ వివాదం నెలకొంది. ఈ కొత్త నిబంధనల కారణంగా ఈ పర్వత పర్యావరణ వ్యవస్థలో భారీగా మైనింగ్కు అవకాశం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని విస్తారమైన ఆరావళి ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.ఎటువంటి శాస్త్రీయ అంచనా లేకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతానికైతే మైనింగ్ కోసం సమగ్ర నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరావళి ప్రాంతంలో కొత్త లీజులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణం, భూగర్భ శాస్త్రం, ప్రకృతి పరిరక్షణ ఆధారంగా మైనింగ్ నిషేధించాల్సిన అదనపు ప్రాంతాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ)ని ఆదేశించింది. కేంద్రం ఇప్పటికే నిషేధించిన ప్రాంతాలకు అదనంగా ఈ జోన్లను గుర్తించాల్సి ఉంటుంది. సోమవారం సుప్రీం కోర్టులో జరగబోయే విచారణలో ఆరావళి భవిష్యత్తుపై ఎటువంటి ఆదేశాలు వెలువడుతాయనే ఆసక్తి నెలకొంది.ఇది కూడా చదవండి: ‘షార్ట్లతో తిరగొద్దు’.. హుకుం జారీ! -
చెక్కేస్తారు రెడీగా ఉండు.. RRRకు బిగ్ షాక్
-
ముగ్గురు ఏఎస్జీల నియామకం
సుప్రీంకోర్టుకు ముగ్గురు అడిషనల్ సొలిసిటర్ జనరల్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది దవీందర్ పాల్ సింగ్, అనిల్ కౌశిక్, రవీంద్ర కనకమేడలలను ఏఎస్జీలుగా నియమిస్తూ కేంద్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ముగ్గురు మూడేళ్ల పాటు ఈ బాధ్యతలో కొనసాగనున్నారు.దవీందర్ పాల్ సింగ్ గతంలో పంజాబ్, హర్యాణాకు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. అనిల్ కౌశిక్, కనకమేడల రవీంద్ర కుమార్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు. అడిషనల్ సొలిసటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు, హైకోర్టులలో సివిల్, క్రిమినల్ కేసులు వాదిస్తారు. రాజ్యాంగం అంశాలతో పాటు ఇతర న్యాయ అంశాలలో ప్రభుత్వానికి వీరు సలహా ఇస్తారు. వీరు అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్కు సహాయకారిగా ఉంటారు. -
ఎందుకు ఇచ్చారు..? ఎవరు ఇమ్మన్నారు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ఏర్పాటైన కొత్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన వ్యూహం మార్చింది. ఓ పక్క సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలోని కార్యాలయంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావును విచారిస్తోంది. మరోపక్క ఆయనకు పదవీ విరమణ అనంతరం ఎక్స్టెన్షన్ లభించడం, సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంది. దీనికి వెనుక బలమైన రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఉంటాయని భావిస్తోంది. ఈ విషయం నిగ్గు తేల్చడానికి అప్పట్లో కీలక బాధ్యతల్లో పని చేసిన అధికారులను ప్రశి్నస్తోంది. ఇప్పటికే మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, నిఘా విభాగం మాజీ చీఫ్ నవీన్ చంద్లకు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరినీ సాక్షులుగా పరిగణిస్తూ విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. త్వరలోనే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శిగా పని చేసిన వారితో పాటు కొందరు సలహాదారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 25 వరకు ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణకు అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈ విచారణ చేపట్టాలని సిట్ భావిస్తోంది. వచ్చే నెల 16న సుప్రీం కోర్టులో కేసు విచారణకు వచ్చే సమయానికి కొత్తగా మరికొన్ని కీలకాంశాలను గుర్తించాలని, న్యాయస్థానానికి నివేదించడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్రావు 2016లో ఎస్ఐబీకి డీఐజీగా వెళ్లారు. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) నియమించింది. హోదా ఏదైనా ఆయన మాత్రం ఎస్ఐబీ చీఫ్గా కొనసాగారు. నిఘా విభాగాధిపతిగా పని చేసిన నవీన్చంద్ పదవీ విరమణ పొందడంతో ప్రభాకర్రావు కొన్నాళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఎస్ఐబీని మాత్రం వదల్లేదు. 2023 డిసెంబర్ వరకు ఎక్స్టెన్ష¯Œన్పై కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఎక్స్టెన్షన్ కోసం నిఘా విభాగాధిపతి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతోనే ప్రధాన కార్యదర్శి దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే 2019 డిసెంబర్ నుంచి 2023 జనవరి వరకు చీఫ్ సెక్రటరీగా పని చేసిన సోమేష్ కుమార్తో పాటు 2016 సెపె్టంబర్ నుంచి 2020 నవంబర్ వరకు నిఘా విభాగాధిపతిగా పని చేసిన నవీన్చంద్ వాంగ్మూలాలూ ఈ కేసులో కీలకంగా మారాయి. ప్రభాకర్రావు కొనసాగింపు వెనుక పెద్దల ప్రమేయం, ఒత్తిడి ఉందని భావిస్తున్న సిట్ ఆ కోణంలోనూ వీరిద్దరినీ విచారించింది. ప్రభాకర్రావుకు ఎక్స్టెన్సన్ ఎందుకు ఇచ్చారు? అలాంటి ప్రతిపాదనలు రూపొందించమని ఎవరు చెప్పారు? ఎవరి ఒత్తిళ్ల మేరకు ఈ ప్రక్రియ జరిగింది? తదితర అంశాలను ప్రశి్నంచారు. త్వరలోనే మరికొందరినీ ప్రశి్నంచడానికి సిట్ సన్నాహాలు చేస్తోంది. సోమేష్కుమార్, నవీన్ చంద్ ఇచి్చన వాంగ్మూలాల్లోని అంశాల ఆధారంగా గత సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అడగాల్సిన ప్రశ్నల్ని సిట్ సిద్ధం చేస్తోంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతి«నిధులకు సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని తెలిసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
ఆ 102 ఎకరాలు సర్కారువే.. సాలార్ జంగ్ వారసులకు సుప్రీంకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. ఆ భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ–మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని తేలి్చచెప్పింది. ఈ మేరకు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అసలు వివాదం ఏమిటంటే? రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం సాహెబ్నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీఖాన్ (సాలార్జంగ్–3 వారసులు) తదితరులు హక్కులు కోరుతూ వచ్చారు. 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వారు వాదించారు. 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమరి్థంచాయి. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు జాగీర్ల రద్దుతోనే సర్కారు పరం: 1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతర్భాగమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని, అప్పటి నుంచి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అ«దీనంలోనే ఉందని పేర్కొంది. ఆ పత్రాలు చెల్లవు: సాలార్జంగ్ వారసులు చూపించిన 1954 నాటి జాగీర్ అడ్మినిస్ట్రేటర్ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం జిరాక్స్ కాపీల ఆధారంగా, అసలు రికార్డులను సరిగా పరిశీలించకుండా కింది కోర్టులు తీర్పునివ్వడం సరికాదని తప్పుబట్టింది. అధికారులు పరిధి దాటారు: టైటిల్ (యాజమాన్య హక్కుల) వివాదాలను తేల్చే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని, సమ్మరీ ఎంక్వైరీ చేసే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్కు ఆ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని మండిపడింది. అటవీ శాఖ నిర్లక్ష్యం: ఈ కేసులో సరైన సమయంలో సరైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అటవీ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శించారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మరో అప్పీల్ కూడా కొట్టివేత ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుస్త్రీ దాఖలు చేసిన మరో పిటిషన్ను (సివిల్ అప్పీల్ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని తేలి్చనందున, ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని తేలి్చచెప్పింది. 8 వారాల్లోగా పూర్తి చేయండి.. నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. ఈ 102 ఎకరాల భూమిని ’రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమరి్పంచాలని స్పష్టం చేసింది. -
‘బార్ కౌన్సిల్’లో మహిళలకు 30% కోటా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మహిళా న్యాయ వాదులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ, ఏపీ బార్ కౌన్సిళ్లలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కచి్చతంగా అమలు చేయాల్సిందేనని తేలి్చచెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగి్చలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్లోనే ఈ రిజర్వేషన్ అంశాన్ని స్పష్టంగా పొందుపరచాలని కోర్టు ఆదేశించింది.దేశవ్యాప్తంగా బార్ కౌన్సిళ్లలో మహిళలకు 1/3 వంతు ప్రాతినిధ్యం కోరుతూ న్యాయవాది యోగమయ, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 8న కోర్టు తీర్పునిచి్చంది. ఎన్నికల ప్రక్రియ మొదలుకాని చోట 30 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని సూచించింది. ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదని, కాబట్టి ఇక్కడ కూడా మహిళా రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరుతూ సునీత, సుభాíÙణి గుడిమల్ల సహా మరికొందరు మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. వారి పిటిషన్లను సీజేఐ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించి, పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ.. విచారణ సందర్భంగా తెలంగాణలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని సీజేఐ ప్రశ్నించగా.. శుక్రవారమే వస్తుందని న్యాయవాదులు బదులిచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. ‘తెలంగాణ ఒక ప్రగతిశీల రాష్ట్రం. అక్కడ మహిళా రిజర్వేషన్ల అమలులో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఇవే ఆదేశాలు ఏపీకి కూడా వర్తిస్తాయని, గతంలో ఇచి్చన ఉత్తర్వులను సవరిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఎన్నికల్లో పోటీకి తగినంత మంది మహిళా న్యాయవాదులు లేకపోతే.. 20 శాతం సీట్లను పోటీకి కేటాయించి, మిగిలిన 10 శాతం సీట్లకు మహిళలను కో–ఆప్ట్ (నామినేట్) చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. -
డీజీపీ నియామకంలో ‘సుప్రీం’ ఆదేశాలు పాటించారా?
సాక్షి, హైదరాబాద్: డీజీపీగా బి.శివధర్రెడ్డి నియామకంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డికి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ పూర్తికాల డీజీపీని నియమించే ప్రక్రియను ప్రారంభించాలని సర్కార్ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. డీజీపీగా శివధర్రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన సామా జిక కార్యకర్త టి.ధన్గోపాల్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై జస్టిస్ పుల్ల కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు. పార్టీ ఇన్ పర్సన్(పిటిషనర్) వాదనలు వినిపిస్తూ.. శాశ్వత నియామకం జరిగేలా చూడటానికి, డీజీపీ పదవీ విరమణకు కనీసం 3 నెలల ముందుగానే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ భర్తీకి ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో సర్కార్ విఫలమైందని, తద్వారా శాశ్వత నియా మక ప్రక్రియను పక్కన పెట్టిందన్నారు. అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. యూపీఎస్సీకి ఒక ప్యానెల్ను సమర్పించినట్లు తెలిపారు.అయితే, కమిషన్ అనేక వివరణలు కోరిందని, ఈలోగా కొందరు అధికారుల పదవీ విరమణతో ఈ ప్రక్రియ మ రింత సంక్లిష్టంగా మారిందన్నారు. ప్రస్తుత కేసు లో కో–వారంటో (ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి అధికారాన్ని సవాల్ చేసే) రిట్ దాఖలు చేయలేరని చెప్పారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషనర్ భావిస్తే.. అక్కడే ధిక్కార కేసు దాఖలు చేయాలని నివేదించారు. న్యాయస్థాన ం ఆదేశాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కావాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
ఢిల్లీ వాయు కాలుష్యం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ట్రాఫిక్ సమస్య కూడా ప్రధాన కారణమని కోర్టు తెలిపింది. ఢిల్లీ వాయుకాలుష్యంపై బుధవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉన్న తొమ్మిది టోల్ప్లాజాలను వేరే చోటుకు మార్చాలని ఎన్హెచ్ఐఏకు నోటీసులు జారీ చేసింది.ఢిల్లీ వాయుకాలుష్యంపై నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. వాయు కాలుష్య నివారణకు సరైన నిర్ణయం త్వరతగతిన తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీనగరంలోని 9టోల్ప్లాజాల తాత్కాలిక సస్పెండ్కు వారంలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ "మాకు టోల్గేట్స్ ద్వారా మీరు సంపాదించే ఆదాయం వద్దు. కానీ మీరు ఖచ్చితంగా ఈ టోల్స్ వల్ల సమస్యలు సృష్టిస్తున్నారు. టోల్ప్లాజా లేకుండా ఖచ్చితమైన ప్లాన్ జనవరి 31లోగా రూపొందించాలి" అని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. కాగా ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్యానికి గత ఆప్ ప్రభుత్వమే కారణమని ఆరాష్ట్ర మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు. రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న వాయుకాలుష్య పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి కాలుష్యం అనే జబ్బు అంటించింది కేజ్రీవాల్ సర్కారేనన్నారు. అయితే వాయు కాలుష్యానికి బాధ్యత వహించాల్సిందిపోయి ఇప్పుడు ఆ అంశంపై కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారన్నారని మంత్రి ఆరోపించారు. -
రఘురామకు భారీ షాక్.. సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
అందర్నీ చంద్రుడిపైకి తరలించమంటారా?
న్యూఢిల్లీ: దేశంలోని 75 శాతం జనాభా భూకంపాలు సంభవించే ప్రమాదకర జోన్లోనే ఉన్నారని, భూకంప నష్టం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకర్టు అసహనం వ్యక్తం చేసింది. అంటే, ఇక్కడున్న అందరిని చంద్రుడిపై తరలించమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పిటిషన్ను కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఎదుట పిటిషనర్ స్వయంగా వాదనలు వినిపించారు. రాజధాని ఢిల్లీ మాత్రమే భూకంప ప్రమాదమున్న చోట ఉందని ఇప్పటి వరకు అంతా భావించేవారని, దేశంలోని 75 శాతం ప్రజలకు భూకంపాల ప్రమాదం ఉందని ఇటీవలి అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు. అయితే, చంద్రమండలంపైకి వీళ్లందర్నీ పంపించాలంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది. నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిటిషనర్ కోరగా ‘విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. అది కోర్టుల పని కాదు’అంటూ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. భూకంప ప్రమాదాలకు సంబంధించిన వార్తా కథనాలను చూపించగా, తాము వాటిని పట్టించుకోమని వ్యాఖ్యానించింది. -
ప్రభాకర్ రావు అరెస్టు రంగం సిద్ధం..!
-
ప్రభాకర్రావు సరెండర్ కావాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది.తక్షణమే ఆయన విచారణాధికారుల ఎదుట లొంగిపోవాలని, కస్టోడియల్ విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. కస్టడీ సమయంలో ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, శారీరక హింసకు గురిచేయకూడదని చెప్పింది. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.ఆధారాలు ధ్వంసం చేశారు..రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ప్రభాకర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, సాక్ష్యాధారాలను పకడ్బందీగా ధ్వంసం చేశారని చెప్పారు. 2023 నవంబర్ 29న ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు ప్రభాకర్ రావు సంతకంతో 50 కొత్త హార్డ్ డిస్క్లను కొనుగోలు చేశారని తెలిపారు. 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, డిసెంబర్ 2న రికార్డులన్నింటినీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని చెప్పారు.డిసెంబర్ 4న ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా చేశారని, వెళ్లేముందు కంప్యూటర్ల నుంచి 50 పాత హార్డ్డిస్క్లను తీయించి, వాటిని కట్టర్లతో కోయించి నదిలో పారేయించారన్నారు. ‘ఆయన చాలా తెలివైన అధికారి.. ఆధారాలు లేకుండా చేశారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు. కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్తామన్నారుప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు) 2021లో చేసిన ప్రసంగాన్ని ఆయన కోర్టులో చదివి వినిపించారు. ‘ప్రభాకర్ రావు.. రిటైర్ అయ్యాక ఇంట్లో ఉన్నా సరే, హోంగార్డును పంపి కాలర్ పట్టుకుని ఈడ్చుకొస్తాం’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారని, ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటున్నారని రంజిత్ కుమార్ వాదించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఇంటి భోజనానికి, మందులకు అనుమతించాలని కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది.‘క్రిమినల్స్ మధ్య 30 ఏళ్లు పనిచేశారు.. జాగ్రత్త!’విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన 30 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేశారు. ఎంతోమంది నేరస్తులను డీల్ చేసి ఉంటారు. కాబట్టి కస్టడీలో ఆయనకు ఎలాంటి శారీరక హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే’ అని పోలీసుల తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే, ఆయనకు ప్రత్యేకంగా వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేమని, చట్టం అందరికీ సమానమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. -
సిద్దరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
శివాజీనగర: కర్ణాటక సీఎం సిద్దరామయ్య 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి ఎన్నికవడం చట్ట విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని సిద్ధరామయ్యకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సిద్దరామయ్య ప్రజాప్రతినిధుల చట్టం–1951ని ఉల్లంఘించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ శంకర్ అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కొట్టివేసింది.దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు పథకం రాజ్యాంగ విరుద్ధం. ఇది పురుషుల పట్ల వివక్ష చూపిట్లే. కాబట్టి సిద్దరామయ్య ఎన్నిక చెల్లదు. ఆయనపై అనర్హత వేటు వేసి ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి’ అని పిటిషన్లో కోరారు. -
ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
‘యాసిడ్’ కేసుల నిర్లక్ష్యంపై ‘సుప్రీం’ కన్నెర్ర
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఒక కేసును ‘జాతీయ అవమానం’గా ధర్మాసనం అభివర్ణించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులలో పెండింగ్లో ఉన్న యాసిడ్ దాడి కేసులను నాలుగు వారాల్లోగా విచారణ జరిపి, వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది.యాసిడ్ దాడి బాధితురాలు షహీన్ మాలిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రోహిణి కోర్టులో 2009 నుండి పెండింగ్లో ఉన్న బాధితురాలి కేసులో పదేపదే జరుగుతున్న ఆలస్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మాలిక్ తన కేసు ఎందుకు ఇంకా ముగియలేదో వివరిస్తూ, ఒక దరఖాస్తును దాఖలు చేయాలని కోర్టు కోరింది. అవసరమైతే కోర్టు స్వయంగా విచారణను కూడా చేపట్టవచ్చని కూడా సూచించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందిస్తూ, ఈ తరహా కేసులను త్వరగా పరిష్కరిస్తామని, నేరస్థులు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.తక్షణ న్యాయం అందించేందుకు, యాసిడ్ దాడి కేసులను ప్రత్యేక కోర్టులు విచారించడం ఉత్తమమని ప్రధాన న్యాయమూర్తి కాంత్ సూచించారు. అంతేకాకుండా యాసిడ్ దాడి బాధితులను వైకల్యం ఉన్న వ్యక్తులుగా వర్గీకరించాలని, వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు వీలు కల్పించాలని మాలిక్ చేసిన విజ్ఞప్తిపై స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. నిరంతర వైద్య సంరక్షణలో ఉంటూ, బాధితులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులను మాలిక్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఇది కూడా చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక.. ఢిల్లీలో హై అలర్ట్.. -
సుప్రీంలో మహిళా న్యాయవాది వీరంగం
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి కొలువుదీరిన సుప్రీంకోర్టులో బుధవారం ఒక మహిళా న్యాయవాది తీవ్ర రసాభాస సృష్టించడంతో, ఆమెను కోర్టు మార్షల్స్ బయటకు తీసుకెళ్లాల్సి వచి్చంది. ధర్మాసనం వారిస్తున్నా.. ఆ న్యాయవాది పదేపదే జాబితాలో లేని ఒక కేసును ప్రస్తావించి, విచారణకు అంతరాయం కలిగించారు. జాబితాలో లేని అంశంపై పట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.కె.సింగ్లతో కూడిన ధర్మాసనం ముందు, ఆ మహిళా న్యాయవాది జాబితాలో లేని ఒక అంశాన్ని నోటిమాటగా ప్రస్తావించినప్పుడు ఈ సంఘటన జరిగింది. తొలుత ఆ మహిళా న్యాయవాది మాట్లాడుతూ, ముంబైలో ఉన్నప్పుడు తన స్నేహితురాలు ఢిల్లీలోని ఒక గెస్ట్ హౌస్లో హత్యకు గురయ్యారని చెప్పారు. మొదట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించిన పోలీసు అధికారిని, ఇప్పుడు అదే కేసులో దర్యాప్తు అధికారిగా నియమించారని ఆరోపించారు. డిప్రెషన్లో ఉన్నాను.. వినాల్సిందే నిరీ్ణత విధానంలో పిటిషన్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి ఆమెకు సూచించగా, ఆమె ‘నేను డిప్రెషన్లో ఉన్నాను, కచి్చతంగా దాఖలు చేస్తాను’.. అన్నారు. కానీ అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించారు. కేసు దాఖలుకు ఆమెకు సహాయం చేయాలని అక్కడే ఉన్న ఒక న్యాయవాదికి ధర్మాసనం సూచించి తదుపరి కేసును పిలిచింది. అయినప్పటికీ, ఆ మహిళా న్యాయవాది తన వాదనతో పట్టుబట్టారు. నన్ను తాకొద్దు.. కోర్టులో ఆమె బిగ్గరగా అరుస్తుండటంతో పరిస్థితి చేయిదాటింది. దీంతో మహిళా కోర్టు మార్షల్స్ ఆమెను బయటకు తీసుకెళ్లడానికి ప్రయతి్నంచగా, ‘గౌరవంగా ప్రవర్తించండి, నన్ను తాకవద్దు’.. అని ఆమె మరింత పెద్దగా అరుస్తూ ప్రతిఘటించారు. జస్టిస్ భూయాన్ సహా తోటి న్యాయవాది ఒకరు.. కోర్టు మర్యాదలు పాటించాలని సలహా ఇచ్చినా, ఆమె మొండిగా వ్యవహరించారు. తన భద్రతకు సంబంధించిన ఈ అంశాన్ని కోర్టుకు చెప్పాల్సిందేనని ఆమె పట్టుబట్టారు. ఆమె పెద్దగా అరుస్తుండటంతో.. కోర్టు కార్యకలాపాల ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసారం ఆడియో వినిపించకుండా చర్యలు తీసుకున్నారు. కాసేపయ్యాక ఎట్టకేలకు ఆమెను కోర్టు గది నుండి బయటకు పంపించారు. -
‘ఫ్రాడ్’ ట్యాగ్.. హైకోర్టు తీర్పుపై సవాల్
రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) ఛైర్మన్ అనిల్ అంబానీ బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వ్యక్తిగత ఖాతాలు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) లోన్ ఖాతాలను ‘ఫ్రాడ్’ వర్గీకరించిన నిర్ణయాన్ని సమర్థించిన బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ అప్పీల్ గత వారం చివరిలో దాఖలు చేయబడినప్పటికీ కేసు ఇంకా అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు రాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అంబానీ గ్రూప్పై బ్యాంకులు, దర్యాప్తు సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా న్యాయపరమైన చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది.కేసు వివరాలుఎస్బీఐ ఈ ఏడాది జూన్లో ఆర్కామ్ లోన్ ఖాతాలను ‘ఫ్రాడ్’ గుర్తించింది. రుణ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది. దీనివల్ల బ్యాంకుకు రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. అయితే దీనిపై అనిల్ అంబానీ స్పందిస్తూ, ఎస్బీఐ సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, విచారణ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పిటిషన్లో తెలిపారు.బాంబే హైకోర్టు తీర్పుఅక్టోబర్ 3, 2025న బాంబే హైకోర్టులోని జస్టిస్ రేవతీ మోహిటే డేరే, నీలా గోఖలేల డివిజన్ బెంచ్ అంబానీ పిటిషన్ను తిరస్కరించింది. ఎస్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాస్టర్ డైరెక్షన్స్ను పాటించిందని, అంబానీ కంపెనీ ప్రమోటర్గా, కంట్రోలింగ్ పర్సన్గా ఫలితాలను ఎదుర్కోవాల్సిందేనని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో అంబానీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఇతర బ్యాంకులుఎస్బీఐతో పాటు ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఇతర బ్యాంకులు కూడా ఆర్కామ్ ఖాతాలను ‘ఫ్రాడ్’గా వర్గీకరించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2025లో రూ.400 కోట్లకు సంబంధించిన ఆరోపణలపై షోకాజ్ నోటీసు జారీ చేసింది.దర్యాప్తు సంస్థల దూకుడుఎస్బీఐ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆగస్టు 21, 2025న కేసు నమోదు చేసి రూ.2,929 కోట్ల మోసానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆర్కామ్, అంబానీ నివాసం సహా పలు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సెప్టెంబర్ 2025లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. నవంబర్ 2025లో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) కూడా నిధుల మళ్లింపు, గవర్నెన్స్ లోపాలపై విచారణ ప్రారంభించింది.ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే! -
‘సుప్రీం’ ఆదేశం.. బంగ్లాదేశ్ గర్భిణికి ఉపశమనం
న్యూఢిల్లీ: భారత్ నుంచి బహిష్కృతురాలై బంగ్లాదేశ్కు చేరిన గర్భిణీ సోనాలి ఖాటూన్, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడికి సుప్రీంకోర్టు ఉత్తర్వుతో ఊరట లభించింది. న్యాయస్థానం ‘మానవతా దృక్పథం'తో తీసుకున్న ఈ నిర్ణయం.. చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న ఒక నిస్సహాయ కుటుంబానికి స్వాంతన కల్పించింది. సోనాలి ఖాటూన్ బంగ్లాదేశీయురాలైనప్పటికీ, ఆమె పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్లో నివసిస్తున్నారనే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.మానవతా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, వారిద్దరినీ తిరిగి తీసుకువస్తామని, వారిని నిఘాలో ఉంచి, ఉచిత వైద్య సహాయం అందిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ప్రత్యేక దృష్టితో విచారించింది. ఒక గర్భిణీ పరిస్థితిని, ఆమె కుమారుడిని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రులు/తల్లి బిడ్డలను వేరు చేయకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కోర్టు నొక్కి చెప్పింది. ఈ ఉత్తర్వుతో సోనాలికి అవసరమైన వైద్య సంరక్షణతో పాటు ఆమె కుమారుడికి రోజువారీ సంరక్షణ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.ఈ న్యాయపోరాటం సోనాలి తండ్రి భోడు సేఖ్తో ప్రారంభమైంది. తన కుమార్తె, అల్లుడు, మనవడిని మే 2025లో గుర్తింపు ధృవీకరణ డ్రైవ్ పేరుతో అక్రమంగా నిర్బంధించి, జూన్లో బంగ్లాదేశ్కు పంపించారని ఆయన ఆరోపించారు. తాను, తన కుటుంబ సభ్యులు పుట్టుకతో భారత పౌరులమని ఆయన వాదించారు. సెప్టెంబర్లో కలకత్తా హైకోర్టు వీరిని తిరిగి తీసుకురావాలని ఆదేశించినా, పౌరసత్వ ధ్రువపత్రాలు లేవనే కారణంతో ఆ తీర్పును సవాలు చేస్తూ, కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరసత్వ రుజువులు చూపడంలో విఫలమైనప్పటికీ, తల్లి, బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. చట్టపరమైన నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, అత్యవసర సందర్భాల్లో మానవతా దృక్పథంపైచేయి సాధిస్తుందని ఈ కేసు నిరూపించింది.ఇది కూడా చదవండి: ‘20 ఏళ్లుగా చావులే లేవు’..‘సర్’ డేటాలో భారీ గోల్మాల్! -
రెడ్కార్పెట్ పరుద్దామా?
న్యూఢిల్లీ: రోహింగ్యాల చొరబాట్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకాలా? అని మండిపడింది. ఇప్పటికే ఇక్కడ తిష్టవేసినవారిని ఎందుకు బయటకు పంపించకూడదు అని ప్రశ్నించింది. దేశంలో ఉండడానికి చట్టపరమైన అనుమతి లేనివారంతా చొరబాటుదారులేనని తేల్చిచెప్పింది. మన సొంత పౌరులు పేదరికంలో మగ్గిపోతున్నారని, పరాయి వ్యక్తులను భరించలేమని పరోక్షంగా స్పష్టంచేసింది. మానవ హక్కుల కార్యకర్త రీటా మన్చందా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలో కొందరు రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తర్వాత వారి జాడ తెలియడం లేదని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఆచూకీ బయటపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఒకవేళ రోహింగ్యాలను వెనక్కి పంపించాలనుకుంటే చట్టప్రకారం నడుచుకోవాలని 2020లో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వును ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. దేశంలో చొరబాటుదార్ల సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తంచేసింది. బయటకు పంపిస్తే సమస్య ఏమిటి? ‘‘చొరబాటుదార్లు సరిహద్దును దాటేసి మన దేశంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారు. సొరంగం తవ్వుకొని లేదా కంచెను ఛేదించి అక్రమంగా అడుగుపెడుతున్నారు. భారతదేశంలోకి వచ్చారు కాబట్టి వారిని ఇక్కడి పౌరులుగా గుర్తించాలని, స్థానిక చట్టాలను వర్తింపజేయాలని కొందరు వాదిస్తున్నారు. ఆహారం, నివాసం, విద్య వంటి వసతులు కల్పించాలని అంటున్నారు. నిజంగా చొరబాటుదార్లకు రెడ్కార్పెట్ స్వాగతం పలకాలా? వారికి అన్ని రకాల వసతులు కల్పించాలా? ఇదెక్కడి చోద్యం? వారిని బయటకు పంపిస్తే వచ్చే సమస్య ఏమిటో చెప్పాలి? చొరబాటుదార్లను పక్కనపెట్టి మన దేశంలో పేదల బతుకులను బాగు చేయడంపై దృష్టి పెడితే బాగుంటుంది.మన పౌరులకు ప్రభుత్వ ప్రయోజనాలు, వసతులు ఎందుకు కల్పించకూడదు? దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారి పట్ల థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించాలని మేము చెప్పడం లేదు’’ అని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ దాఖలు చేసే అర్హత రీటా మన్చందాకు లేదని, పోలీసుల అదుపులో ఉన్న రోహింగ్యాలెవరూ కోర్టును ఆశ్రయించలేదని పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. శరణార్థులా? అక్రమ వలసదారులా? రోహింగ్యాల అంశంపై దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు విచా రణ నిర్వహించింది. వారు శరణార్థులా? లేక అక్రమ వలసదారులా? అనేది మొదట తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో స్పష్టత వస్తే తదుపరి చర్యలు చేపట్టవచ్చని సూచించింది. రోహింగ్యాలను శరణార్థులుగా గుర్తిస్తే వారికి ఎలాంటి రక్షణలు, ప్రయోజనాలు, హక్కులు కల్పించాన్నలది పరిగణనలోకి తీసుకోవచ్చని తెలియజేసింది. ఒకవేళ అక్రమ వలసదారులే అయితే వారిని వెనక్కి పంపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని వివరించింది. -
రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకాలా?
ఢిల్లీ: రోహింగ్యాల అంశంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమంగా దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతించాలా అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఇటీవల కస్టడీలో ఉన్న ఐదుగురు రోహింగ్యాల ఆచూకీ లేదని వారి సమాచారం ఇవ్వాలని పిటిషన్ దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో కోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది.భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు."మీరు అక్రమంగా దేశంలోకి చొరబడతారు. దాని కోసం ఫెన్సింగ్ ను తెంపుతారు, సొరంగం తవ్వుతారు. ఆ తర్వాత మేము మీ దేశంలోకి వచ్చాము. మీ చట్టాలు మాకు వర్తించాలి అంటారు. ఆ తర్వాత మాకు ఆహారం కావాలి, మాకు నివాసం కావాలి, మా పిల్లలకు చదువు కావాలి అంటారు. మేము ఇలా చట్టాలని సాగదీసుకుంటూ పోవాలా "అని రోహింగ్యాలను ఉద్దేశించి పిటిషనర్ ని ప్రశ్నించారు.మన దేశంలోనూ పేదవారు ఉన్నారు. వారు ఈ దేశ ప్రజలు వారికి కొన్ని సౌకర్యాలు, ప్రయోజనాలు లభించడం లేదు? మీరు వాటిపైన ఎందుకు దృష్టి పెట్టరు. అని అడిగారు. కస్టడీలోకి తీసుకున్న వ్యక్తిని హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఖచ్చితంగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కస్టడీ న్యాయబద్ధమైనదా కాదా అనే విషయం న్యాయమూర్తి అప్పుడు నిర్ణయిస్తారు అని తెలిపారు. అయితే అక్రమంగా ప్రవేశించిన వారిపై సైతం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నిషేధమన్నారు.అయితే భారత్ రోహింగ్యాలను శరణార్థులుగా ఇంకా ప్రకటించలేదని వారికి శరణార్థులకుండే చట్టబద్ధత హోదా లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఎవరైనా మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే వారిని ఇక్కడ ఉంచాల్సిన అవసరం మనకు ఉందా అని అని అడిగారు. భారత్ కు ఉత్తర భారతంలో చాలా సున్నితమైన సరిహద్దు ఉందని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యా ముస్లింలకు పౌరసత్వం ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో వారు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు.అయితే భారత్ వీరిని శరణార్థులుగా గుర్తించలేదు. అయినప్పటికీ దేశంలో అక్రమంగా చొరబడి నివసిస్తున్నారు. ఇండియాలో దాదాపు 40 వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నట్లు సమాచారం. -
డిజిటల్ అరెస్టుల కేసుల్లో సీబీఐ దర్యాప్తు
-
ప్రాణాలు పోతుంటే చర్యలు తీసుకోరా?
ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని నొక్కిచెప్పింది. గాలి నాణ్యత కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటే సుప్రీంకోర్టు చూస్తూ ఉండాలా అని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ని ప్రశ్నించింది.ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. గాలి నాణ్యత ఎంత తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుతుంటే ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ తో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ను ప్రశ్నించింది. వాయు కాలుష్యంతో లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే సుప్రీం కోర్టు చూస్తూ ఉండాలా అని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. పంట వ్యర్థాల కాల్చివేత ఒక్కటే ఈ సమస్యకు కారణం కాదని అది కేవలం ఇందులో ఒక భాగమేనని తెలిపింది.జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ "సుప్రీంకోర్టు ఈ సమస్యపై చూస్తూ ఉండలేదు. "పంటవ్యర్థాల కాల్చివేత ఈ సమస్యకు కారణమైతే కోవిడ్-19 సమయంలో మనం ఆకాశంలోని నక్షత్రాలను చూడగలిగేవారిమా? ఈ సమస్యను రాజకీయంగా చూడకూడదు. ఢిల్లీ వాతావరణ కాలుష్యం కేవలం పంట వ్యర్థాల వల్ల ఏర్పడింది కాదు. దీనిని నిర్మూలించడానికి మీరు తీసుకున్న చర్యలేంటో చూపండి". అని చీఫ్ జస్టిస్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ని ప్రశ్నించారు.ఈ సమస్యను పరిష్కరించే అంశం కోర్టుల పరిధిలోనిది కాదని నిపుణులతో కూడిన కమిటీ వాయు కాలుష్య సమస్యకు పరిష్కారం కనుగొనాలని తెలిపారు. కోర్టులు ఈ సమస్యలను రూపుమాపవు కాని దానికి కావాల్సిన వేదికను ఏర్పాటు చేయగలవు. అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గాలి కాలుష్యాన్ని పరిష్కరించడానికి స్పష్టమైన సమయాన్ని నిర్దేశించుకొని తగిన ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. -
‘డిజిటల్ అరెస్ట్’ దర్యాప్తు సీబీఐకి
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను మోసగించి, నిలువు దోపిడీ చేస్తున్న కేసులు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నందున వీటన్నిటిపైనా ఏకీకృత దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ కుంభకోణం విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావించాలని సీబీఐకి స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్రాలు సీబీఐకి సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాధికారులు, పోలీసులు, దర్యాప్తు విభాగాల పేరు చెప్పుకుని సైబర్ నేరగాళ్లు వీడియో, ఆడియో కాల్స్ ద్వారా బాధితులపై ఒత్తిడి తెచ్చి, డబ్బులు వసూలు చేస్తున్న కేసులు పెరిగిపోతుండటంపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసుల దర్యాప్తు విషయంలో బీజేపీయేతర పాలిత తెలంగాణ, తమిళనాడు, బెంగాల్, కర్నాటక సహా అన్ని రాష్ట్రాలు సీబీఐకి సహకారం అందించాలని కోరింది. అదే సమయంలో, కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్ల బ్యాంకు అక్కౌంట్లను ఎందుకు ఫ్రీజ్ చేయలేకపోతోందంటూ ఆర్బీఐని ప్రశ్నించింది. సమాధానమివ్వాలంటూ నోటీసు జారీ చేసింది. హరియాణాకు చెందిన వృద్ధ దంపతులు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం పలు ఆదేశాలను వెలువరించింది. డిజిటల్ అరెస్ట్ కేసులపై సీబీఐ దర్యాప్తునకు అవసరమైన వివరాలను అందించాలని సంబంధింత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలను కోరింది. ఇతర దేశాల్లో ఉంటూ ఈ దందా సాగిస్తున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ఇంటర్పోల్ సాయం కూడా తీసుకోవాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. టెలికం సరీ్వస్ ప్రొవైడర్లు ఒక వ్యక్తి లేదా సంస్థకు లెక్కకు మిక్కిలి సిమ్ కార్డులు జారీ చేయకుండా చూడాలని కేంద్ర టెలికం శాఖను కోరింది. సైబర్ నేరగాళ్లకు ఇటువంటి వాటిని అవకాశంగా తీసుకుంటున్నారని తెలిపింది. ఇటువంటి నేరాలపై సమన్వయంతో వ్యవహరించేందుకు ప్రాంతీయ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. హోం, టెలికం, ఆర్థిక, ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు సైబర్ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలను తమ ముందుంచాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. మోసగాళ్ల బ్యాంకు ఖాతాలను స్తంభింప జేయాలని స్పష్టం చేసింది. నేరగాళ్ల ముఠాలతో చేతులు కలుపుతున్న బ్యాంకు అధికారుల గుట్టును కనిపెట్టాలంది. తదుపరి విచారణ నాటికి టెలికాం శాఖ అధికారులు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇదీ చదవండి: ఆ ఆవు నెయ్యిలో నాణ్యత లేదు.. పతంజలికి షాక్ -
సుప్రీం సీరియస్.. పవన్ పాత పాటలో కొత్త రాగం..
-
సుప్రీంకోర్టు సీరియస్.. బాబుకు బిగ్ షాక్..
-
బాబు సర్కార్ కు బిగ్ షాక్.. మద్యం కేసులో ఆ ముగ్గురికి ఊరట
-
సైన్యంలో ఇది చెల్లదు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రక్షణ విధుల్లో ఉండి.. ‘నా దేవుడు వేరు.. ఆ గుడిలోకి నేను రాను’అంటూ మొండికేసిన ఒక ఆర్మీ ఆఫీసర్కు సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ’తోటి సైనికుల మనోభావాలను గౌరవించలేని మీకు.. మత అహంకారం అంత ఎక్కువగా ఉందా? సైన్యం అంటేనే లౌకికవాదానికి ప్రతీక.. అక్కడ మీ మత చాందసవాదం చూపించడానికి వీల్లేదు. ఇలాంటి వాళ్లను ఒక్క నిమిషం కూడా ఉపేక్షించొద్దు.. సర్వీస్ నుంచి పీకి పారేయండి’అంటూ సీజేఐ ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రెజిమెంట్ నిర్వహించే మతపరమైన పరేడ్లను బహిష్కరించిన క్రైస్తవ అధికారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా సమర్థించింది.’ఇది సాదాసీదా తప్పు కాదు.. ఘోరమైన క్రమశిక్షణా రాహిత్యం. ఇలాంటి ప్రవర్తన సైన్యం పునాదులనే దెబ్బతీస్తుంది’అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తీర్పు సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ’ఇది తప్పుడు సంకేతం ఇస్తుంది’అని అనగా.. ’కాదు.. ఇది గట్టి గుణపాఠం కావాలి.. స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లాల్సిందే’అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కరాఖండిగా తేల్చిచెప్పారు.మన సైన్యం క్రమశిక్షణకు పేరుభారత సైన్యం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. అక్కడ వ్యక్తిగత మత విశ్వాసాల కంటే, దళంలోని సైనికుల మనోభావాలు, ఐకమత్యమే ముఖ్యం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. రెజిమెంట్ నిర్వహించే మతపరమైన పరేడ్లలో పాల్గొనడానికి నిరాకరించిన శామ్యూల్ కమలేషన్ అనే క్రైస్తవ ఆర్మీ అధికారిని సర్వీస్ నుంచి తొలగించడాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ’ఇది తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుంది’అని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సదరు ఆఫీసర్ దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల బాగ్చిలతో కూడిన ధర్మాసనం నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.ఆమోదయోగ్యం కాదంటూ ఆగ్రహంమంగళవారం విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనం పిటిషనర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ’మీరు మీ తోటి సైనికుల మనోభావాలను గౌరవించడంలో విఫలమయ్యారు. ఇతరుల గురించి పట్టించుకోనంతగా మీ మతపరమైన అహంకారం పెరిగిపోయిందా?’అని సీజేఐ సూర్యకాంత్ సూటిగా ప్రశ్నించారు. ఒక అధికారిగా ఉండి, తోటి సైనికుల మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించడం క్రమశిక్షణ ఉన్న ఫోర్స్లో ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు.అసలేం జరిగింది?శామ్యూల్ కమలేషన్ అనే అధికారి భారత ఆర్మీలోని 3వ క్యావలరీ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా చేరారు. ఆ రెజిమెంట్లో సిక్కు, జాట్, రాజ్పుత్ సైనికులు ఉన్నారు. రెజిమెంట్ సంప్రదాయం ప్రకారం వారందరూ అక్కడి మందిరం, గురుద్వారాలో వారంవారం జరిగే మతపరమైన పరేడ్లలో పాల్గొంటారు. అయితే, తాను క్రై స్తవుడినని, ఏకేశ్వ రోపాసకుడినని చెబుతూ, ఆలయ గర్భగుడిలోకి వెళ్లడానికి గానీ, పూజల్లో పాల్గొనడానికి గానీ కమలేషన్ నిరాకరించారు. తన మతం ఇతర దేవుళ్ళను పూజించడానికి అంగీకరించదని తన ఉన్నతాధి కారులతో అనేకసార్లు వాదించారు. దీంతో ’ఆర్మీ నిబంధనలను, లౌకిక స్ఫూర్తిని ఉల్లంఘించారు’అనే కారణంతో శామ్యూల్ కమలేషన్ను సర్వీస్ నుంచి తొలగించారు. -
కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
ఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో స్కూల్స్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ను నిషేధిస్తూ నిర్ణయించింది. పెరిగిపోతున్న వాయుకాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం.. శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, వాయు కాలుష్యంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కారణంగా విద్యార్థులు, ప్రజలకు శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్న విషయం తెలిసిందే. #BREAKINGSupreme Court flags “gas chamber” conditions for kids, orders ban on outdoor sports in schoolsSC directs CAQM to immediately stop outdoor sports in NCR schools due to hazardous air, calls November–December events unsafe for childrenBench to monitor Delhi air… pic.twitter.com/z8qcPvIeOd— Nabila Jamal (@nabilajamal_) November 19, 2025కాగా, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. ఈ నేపథ్యంలో.. పాఠశాలల స్పోర్ట్స్, అథ్లెటిక్స్ కార్యక్రమాలను వాయిదా వేసేలా ఆదేశించడాన్ని పరిశీలించాలని ‘వాయునాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM)’కు సుప్రీం కోర్టు సూచించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యంపై దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.నవంబరు, డిసెంబరు నెలల్లో అండర్-16, అండర్-14 విద్యార్థులకు ఇంటర్ జోనల్ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) దృష్టికి తీసుకెళ్లారు. కాలుష్యం గరిష్ఠ స్థాయిలో ఉండే ఈ నెలల్లో ఇటువంటి ఈవెంట్స్కు అనుమతించడం.. స్కూల్ పిల్లలను గ్యాస్ ఛాంబర్లో ఉంచడంతో సమానమేనని వాదించారు. ఈ సమయంలో బహిరంగ క్రీడా కార్యకలాపాలు నిర్వహించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. వాయు కాలుష్యం తక్కువగా ఉండే నెలల్లో క్రీడాపోటీలు నిర్వహించేలా స్కూళ్లను ఆదేశించాలని ‘సీఏక్యూఎం’కు సూచించింది. -
నిఠారీ కేసులో బాధితులకే శిక్ష!
ఇరవై ఏళ్ల నాటి నిఠారీ వరుస హత్యల కేసులో నిర్దోషి త్వాల తీర్పు భారత నేర దర్యాప్తు వ్యవస్థలోని వైఫల్యాలను బట్టబయలు చేసింది. 16 మంది మహిళలు, పిల్లల హత్య కేసులో నిందితుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 11న చెప్పిన తీర్పుతో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే!యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ నోయిడా(ఉత్తరప్రదేశ్)లోని నిఠారీ గ్రామంలో డ్రైనేజీలో మానవ అవశేషాలు బయటపడి దాదాపు ఇరవై ఏళ్లు గడచిన తర్వాత కూడా, ఏ ఒక్కరూ దోషిగా నిర్ధారణ కాలేదు. 16 మంది మహిళలు, పిల్లల ‘నిఠారీ’ హత్య కేసులో నింది తుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ‘నేర న్యాయ’ వ్యవస్థలోని దారుణ వైఫల్యాలను బట్టబయలు చేసింది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే.కీలక ఆధారాలు లేకపోవడం వల్లే... 2006 చివర్లో నిఠారీ గ్రామ సమీపాన 31వ సెక్టార్లో మురుగు కాల్వల పూడిక తీస్తుంటే దిగ్భ్రాంతికరమైన దారుణాలు వెలుగు చూశాయి. అంతకంటే ముందు, డి–5, డి–6 ఇళ్ల మధ్య ఒక చెయ్యి కనబడింది. క్రికెట్ ఆడుతున్న కుర్రాడు దాన్ని చూశాడు. అదే ఏడాది డిసెంబర్లో ఈ బంగ్లాల వెలుపల ఉన్న డ్రెయిన్లో మట్టి తొలగించడంతో అక్కడ అనేక పుర్రెలు, ఎముకలు, పీలికలైన పిల్లల దుస్తులు, చిన్ని చిన్ని చెప్పులు దొరికాయి.డి–5 ఇంట్లో పనిచేసే సురేంద్ర కోలీ అనే వ్యక్తి, ఇంటి యజమాని, వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పంఢేర్ ఈ మారణకాండకు బాధ్యులని పోలీసులు అనుమానించారు. పోలీసుల కథనం ప్రకారం – పిల్లలను, ఆడవారిని కోలీ ప్రలోభపెట్టి ఇంటికి రప్పించే వాడు. తర్వాత వారిని హత్య చేసేవాడు. కొన్నిసార్లు హతుల శరీర భాగాలను తిన్నాడు కూడా! ఈ అకృత్యాల్లో పంఢేర్ భాగస్వామి. భయానకమైన ఈ హత్యల కేసులో స్థానిక పోలీసుల విచారణ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ దర్యాప్తులో భాగంగా ఇంటి మేడ పై భాగంలో నీళ్ల ట్యాంకు కింద దాచిన ఓ కత్తిని పోలీసులు ‘స్వాధీనం’ చేసుకున్నారు.ఇది, ఇంకా అనేక వస్తువులు వారికి దొరికాయి. ఇవే వారి దర్యాప్తులో ‘కీలక ఆధారాలు’. వీటి ఆధారంగా వారు రూపొందించిన కథనాలను కోర్టులు విశ్వసించలేదు. దీంతో 2007 జనవరిలో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు. సీబీఐ సైతం స్థానిక పోలీసులు చేసిన తప్పిదాలనే పునరా వృతం చేసింది. కొన్ని వారాల తరబడి కస్టడీలో ఉంచి రికార్డు చేసిన కోలీ నేరాంగీకార పత్రం మీదే సీబీఐ అధికారులు ఆధారపడ్డారు. వారు రికవర్ చేసిన ఆధారాలు నమ్మదగినవిగా లేవు. కోలీ, పంఢేర్ ప్రమేయాన్ని నిరూపించగల సరైన ఫోరెన్సిక్ లింకులను కూడా సంపాదించలేక పోయారు.స్థానిక పోలీసుల మీద ఆధారపడకుండా మళ్లీ మొదటి నుంచి సొంత దర్వాప్తు చేయడంలో సీబీఐ విఫలమైంది. నేరాంగీకారాలు, రికవరీలు, ఆధారాలను అటూయిటూ చేసి... మోపిన 13 కేసుల్లోనూ వాటినే కోర్టుల ముందుంచారు. కాబట్టే, పై కోర్టులు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి వాటన్నిటినీ కొట్టేశాయి. నేరాంగీకార పత్రాలు, నేరాలకు సంబంధించిన రికవ రీలు అన్నీ అంతకు ముందు కొట్టేసిన ఇతర కేసుల్లో ఉన్నట్లే ఏ మాత్రం తేడా లేకుండా ఈ కేసులోనూ ఉన్నాయని సుప్రీంకోర్టు తాజాగా నవంబర్ 11 నాటి తీర్పులో గుర్తించింది.మరి నేరస్థులు ఎవరు?తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రుల విషయానికి వస్తే, వారి పాత గాయాలు ఈ తీర్పుతో మళ్లీ రేగాయి. 2005లో తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది ఈ బాధితులే! డి–5 ఇంటి ముందు తొలుతగా నిరసన చేసింది వీరే. న్యాయస్థానంలో చివరి దాకా పోరా డింది కూడా వీరే. చివరకు కోర్టు తీర్పుతో తమ పిల్లలను ఎవరూ చంపలేదన్న ‘న్యాయపరమైన వాస్తవం’ వారిని వెక్కిరిస్తోంది. ఏళ్ల తరబడి సుదీర్ఘంగా దర్యాప్తు జరిగినప్పటికీ, నిజమైన ద్రోహులెవరో నిరూపణ కాకపోవడం పట్ల న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసి వారి బాధను గుర్తించింది. నిర్లక్ష్యం వహించి, అసాధారణ జాప్యం చేసి నిజనిర్ధారణ ప్రక్రియ పట్ల విశ్వాసం సన్న గిల్లేలా చేశాయంటూ దర్యాప్తు సంస్థలను తప్పు పట్టింది. అవయ వాలతో వ్యాపారం చేసే ముఠాల ప్రమేయం వంటి కొత్త కోణాల నుంచి దర్యాప్తు చేపట్టలేక పోయాయని నిందించింది.నిఠారీ కేసు నిర్దోషిత్వాల తీర్పులు భారత నేర దర్యాప్తు వ్యవస్థకు సోకిన రోగం లక్షణాలను కళ్లకు కట్టాయి. ప్రతి స్థాయి లోనూ వ్యవస్థ విఫలమైంది. స్థానిక పోలీసులు క్రైమ్ సీన్ను పరిరక్షించలేకపోయారు. సరైన ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించలేక పోయారు. ఈ లోపాలను చక్కదిద్దడంలో సీబీఐ విఫలమైంది. కొత్త కోణాలను గుర్తించలేక పోయింది. న్యాయ పరీక్షకు నిలబడేలా పకడ్బందీ వాదనలు చేయడంలో ప్రాసిక్యూటర్లు విఫలమయ్యారు. బాధితుల ఘోర విషాదాన్ని వ్యవస్థల ప్రహసనంగా మార్చి, ప్రభుత్వం వారికి తీవ్రమైన నిరాశ కలిగించింది.సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కోలీ జైలు నుంచి బయటకు వచ్చాడు. పంఢేర్ ఇప్పటికే నేర విముక్తుడు. న్యాయస్థానం చట్టాలకు లోబడి వ్యవహరించింది. తిరుగులేని రుజువులు ఉంటే తప్ప కోర్టు శిక్ష విధించలేదు. తమ పిల్లల మసకబారిన పాత ఫొటోలను పట్టు కుని ఆ తల్లిదండ్రులు క్షోభపడుతూ ఉంటే, న్యాయం అమూర్తంగా మారిపోయింది. నిఠారీలో చట్టం తన చివరి మాటను చెప్పేసింది. ఇక మిగిలింది నిశ్శబ్దమే! అది చెవులు పగిలిపోయేంత కఠోరంగా ఉంది.-ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త లీగల్ అంశాల జర్నలిస్ట్(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మళ్లీ మొదటికి!
రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ తలెత్తే వివాదాల విషయంలో చివరకు కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అయింది. శాసనసభలు ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లుల్ని నెలల తరబడి పెండింగ్లో ఉంచుకోవటాన్ని తప్పుబడుతూ మొన్న ఏప్రిల్లో తమ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును గురువారం సర్వోన్నత న్యాయస్థానపు రాజ్యాంగ ధర్మాసనం తప్పుబట్టింది. రాష్ట్రపతికీ, గవర్నర్లకూ గడువు విధించటం చెల్లదని అభిప్రాయపడింది.ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నేరుగా ప్రస్తావించకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నల రూపంలో సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరిన మీదట రాజ్యాంగ ధర్మాసనం తన ఉద్దేశాన్ని తెలియజేసింది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే సందర్భంగా ఆచరణలో తలెత్తే సమస్యల విషయంలో ఏ పక్షానికీ గెలుపోట ములుండవు. మూడు వ్యవస్థల్లో ఏ ఒక్కటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన ఆచరణ కనబరచకపోయినా అంతిమంగా నష్టపోయేది ప్రజలే. అలా చూస్తే రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం కొంత నిరాశ కలిగిస్తుంది.గవర్నర్లకూ, ప్రభుత్వాలకూ తలెత్తే వివాదాలు జటిలమైనవి. ఎన్నికల సమయంలో పలు వాగ్దానాలు చేసి అధికారంలోకొచ్చిన పక్షం తన వాగ్దానాలు నెరవేర్చటం కోసం లేదా ప్రజల ప్రయోజనాల కోసం బిల్లులు తెస్తాయి. చట్టసభల్లో అవి ఆమోదం పొందు తాయి. తీరా గవర్నర్ల దగ్గర నెలల తరబడి పెండింగ్లో ఉండిపోతున్నాయి. మరి ప్రజలిచ్చిన రాజకీయాధికారం ఏమై పోవాలి? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ లేదా కూటమి పాలిస్తుంటే ఇలాంటి సమస్య తలెత్తదు. భిన్నమైన పరిస్థితులున్నప్పుడే ఇబ్బందులేర్పడుతున్నాయి.కేంద్రంలో యూపీఏ ఉన్నా, ఎన్డీయే ఉన్నా ఇదే ధోరణి. రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ సంగతిని గమనించింది. బిల్లుల్ని పరిశీలించటంలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే వ్యవధికి ఒక స్థాయి ‘స్థితిస్థాపకత’ ఉంటుందని అంగీకరి స్తూనే దీర్ఘకాలం బిల్లును పెండింగ్లో పెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పడం కొంతవరకూ రాష్ట్రాలకు ఊరట.రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాం తప్ప ద్విసభ్య ధర్మాసనం లోగడ వెలువరించిన తీర్పుతో దీనికి సంబంధం లేదని రాజ్యాంగ ధర్మాసనం చెప్పడం గమనార్హం. గవర్నర్లు ఏళ్ల తరబడి బిల్లుల్ని పెండింగ్లో పెట్టి ప్రజల ద్వారా ఎన్నికైన చట్టసభల్ని నిరర్థకంగా మార్చడం సరికాదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో గవర్నర్లకు హితవు చెప్పింది. కానీ మారిందేమీ లేదు.అందుకే కావొచ్చు... ద్విసభ్య ధర్మాసనం రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద తనకు దఖలు పడిన అధికారాలను వినియోగించుకుంటూ బిల్లు ఆమోదానికి గవర్నర్లకూ, రాష్ట్రపతికీ మూడు నెలల గడువు విధించి, ఆ తర్వాత ఆమోదం పొందినట్టే భావించాలన్నది. ఇది సరి కాదని, ఇలా చేయటమంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థ అధికారాలను చేతుల్లోకి తీసుకోవటమే అవుతుందని ధర్మాసనం తెలిపింది.అదే సమయంలో గవర్నర్లు బిల్లులపై ఏదో ఒకటి చెప్పటానికి ‘హేతుబద్ధమైన వ్యవధి’కి మించి తీసుకుంటే మాత్రం సమీక్షించే అధికారం ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం చెప్పటం రాష్ట్రాలకు కొంత వరకూ ఉపశమనం. రాష్ట్రపతికిచ్చిన ప్రత్యుత్తరంలో ‘హేతుబద్ధమైన వ్యవధి’ అనడం తప్ప, దాన్ని ఎలా నిర్ధారించాలన్నది చెప్పలేదు. అదే జరిగుంటే గవర్నర్ల పెత్తనానికి కాస్తయినా అడ్డుకట్ట పడేది. రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయంలో మౌనంగా ఉండి పోవటం వల్ల ఎప్పటిలాగే బిల్లు ఆగిపోయినప్పుడల్లా న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదు.రాజ్యాంగ అధికరణం 200 ప్రకారం తన ఆమోదం కోసం వచ్చిన బిల్లుపై గవర్నర్ ముందు మూడు ప్రత్యామ్నాయాలుంటాయి. ఆమోదించటం, రాష్ట్రపతి పరిశీలనకు పంపటం, వెనక్కి తిప్పిపంపటం. ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవాలన్నది గవర్నర్కుండే విచక్షణాధికారం. కానీ ఇదంతా సవ్యంగా సాగకపోవటమే సమస్య. గవర్నర్ల నియామకాలు రాజకీయపరమైనవి అయినప్పుడు వారి నిర్ణయాలపైనా ఆ ప్రభావం పడుతుంది. చట్టం చేయటమే ఇందుకు పరిష్కారమని రాజ్యాంగ ధర్మాసనం అన్నది. కానీ అది జరిగే పనేనా?! -
సుప్రీంకోర్టు కీలక ప్రకటన రాష్ట్రపతి, గవర్నర్లకు ఉపశమనం
-
పర్యావరణ అనుమతులపై సుప్రీం తీర్పు రీకాల్
న్యూఢిల్లీ: పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన ప్రాజెక్టులకు వెనుకటి తేదీ నుంచి పర్యావరణ అనుమతులు మంజూరు చేయకుండా నిషేధిస్తూ మే 16వ తేదీన ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం 2:1 మెజారిటీతో వెనక్కి తీసుకుంది. ఇదే అంశంపై మరో ధర్మాసనం తాజాగా విచారణ చేపడుతుందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనంలో సీజేఐ, జస్టిస్ వినోద్ చంద్రన్లు రీకాల్కు అనుకూలంగా వేర్వేరు తీర్పులివ్వగా జస్టిస్ భుయాన్ మాత్రం విభేదించారు. అప్పటి ‘వన శక్తి తీర్పు’పై దాఖలైన 40 పిటిషన్లపై ఈ ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్టోబర్ 9వ తేదీన వాదనలు ముగియగా, తీర్పును రిజర్వులో ఉంచింది. కపిల్ సిబాల్, ముకుల్ రొహత్గీ వంటి సీనియర్ న్యాయవాదులతోపాటు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు వాదనలను వినిపించారు. వీరంతా అప్పటి తీర్పును సమీక్షించాలనే అభిప్రాయాన్నే దాదాపుగా వెలిబుచ్చడం గమనార్హం. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన ప్రాజెక్టులకు ముందు తేదీలతో అనుమతులు ఇవ్వరాదంటూ కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖను, సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు మే 16న ఆదేశించింది. అప్పటి ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లు ఉన్నారు. అనుకూలం ఎందుకంటే..‘ముందస్తు తేదీలతో అనుమతుల నిరాకరణపై సమీక్ష చేపట్టకుంటే రూ.20 వేల కోట్లతో చేపట్టిన వివిధ ప్రజా ప్రయోజన ప్రాజెక్టులు నిలిచిపోతాయి. భారీగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒడిశాలో ఎయిమ్స్, కర్నాటకలోని విజయనగరలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం వంటివి ఉన్నాయి. అందుకే, అలాంటి అన్ని ప్రాజెక్టులను కూల్చివేయడం, ప్రజా ధనాన్ని వృధాగా పోనివ్వడం ప్రజా ప్రయోజనం కిందకు వస్తుందా అని నేను నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను’అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.వీటికోసం మళ్లీ అనుమతులు కోరాల్సి ఉంటుంది. అందుకే, న్యాయపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా వెలువరించిన ఆ తీర్పును రీకాల్ చేయాలని భావిస్తున్నాను. నా తీర్పుతో సోదరుడు జస్టిస్ భుయాన్ విభేదించారు’అని సీజేఐ తన తీర్పులో పేర్కొన్నారు. 2013 నాటి నోటిఫికేషన్తోపాటు 2021 నాటి ఆఫీసు మెమోరాండం నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలకు భారీ జరిమానాలు విధించేందుకు వీలు కల్పిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ముందు తేదీలతో అనుమతులను ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అప్పటి తీర్పును రీకాల్ చేయడంతోపాటు మరో ధర్మాసనం ఇదే అంశంపై తాజాగా విచారణ చేపడుతుందని పేర్కొన్నారు.కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ అంశాన్ని సీజేఐ ఎదుట ఉంచాలని ఆయన కోర్టు రిజస్ట్రీని ఆయన ఆదేశించారు. జస్టిస్ వినోద్ చంద్రన్ కూడా ఇదే రకమైన తీర్పు వెలువరించారు. ఆ తీర్పుపై సమీక్ష తప్పనిసరని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమలకు సంబంధించి, వాటిని మూసేయాల్సిన అవసరం లేకుండా బ్యాలెన్స్డ్ విధానాన్ని కోర్టు అనుసరించాలని తెలిపారు. అప్పటి తీర్పుతో కేంద్రం చేపట్టిన రూ.8,293 కోట్ల విలువైన 24 ప్రాజెక్టులతోపాటు రాష్ట్రాలు చేపట్టిన రూ.11,168 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఇందులో ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, ఎయిర్పోర్టులు తదితర నిర్మాణాలున్నాయన్నారు.అది తిరోగమనమే: జస్టిస్ భుయాన్పర్యావరణ చట్టంలో ముందస్తు తేదీలతో అనుమతులు ఇవ్వడమనే విధానమే లేదంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తీవ్రంగా విభేదించారు. తీర్పును సమీక్షించడం తిరోగమనమేనని తన 96 పేజీల తీర్పులో తెలిపారు. ‘ఈ ఆలోచనే అనర్థదాయకం. పర్యావరణ చట్టాలకు ఒక శాపం. చెడుకు అనుకూలం’అని ఆయన పేర్కొన్నారు. ముందు జాగ్రత్త సూత్రానికి, సుస్థిర అభివృద్ధికి విరుద్ధమని తెలిపారు. ముందు తేదీలతో అనుమతులిస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, ప్రాణాంతకమైన పొగమంచు పర్యావరణ కాలుష్యంతో కలిగే ప్రమాదాలను నిత్యం మనకు గుర్తు చేస్తోందని పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానానికి ఉందన్నారు. పర్యావరణం, అభివృద్ధి పరస్పర విరుద్ధాలు కావని ఆయన తెలిపారు. ఇవి రెండూ రాజ్యాంగ నిర్మాణం, సుస్థిర అభివృద్ధిలో భాగాలన్నారు. ముఖ్యంగా, చట్టబద్ధత పట్ల కనీస గౌరవం కూడా చూపని వ్యక్తులు దాఖలు చేసిన సమీక్ష పిటిషన్పై స్పందించి తీర్పుపై సమీక్ష చేపట్టాలనడం తగదని ఆయన తెలిపారు. పర్యావరణ న్యాయ మూల సూత్రాలను ఇది విస్మరించిందని అభిప్రాయపడ్డారు. కాలుష్యానికి కారకులైన వారు చెల్లించాల్సిన పరిహారంపై ఆధారపడి, ముందుజాగ్రత్త సూత్రాన్ని సులభంగా తోసిపుచ్చలేమని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. -
KSR: స్పీకర్కు సుప్రీం వార్నింగ్ మళ్లీ ఉప ఎన్నికలు?
-
ఇదే లాస్ట్ స్పీకర్పై సుప్రీం సీరియస్..
-
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు
న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. రిజర్వేషన్ల మొత్తం 50 శాతానికి మించి ఉండరాదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఉల్లంఘన జరిగిందని తేలితే, ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశిస్తామని ప్రకటించింది. ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు రిజర్వేషన్లు 27 శాతం మేర రిజర్వేషన్లు కల్పించాలంటూ 2022లో జేకే బంథియా కమిషన్ సిఫారసు చేసినప్పటి పరిస్థితులకు అనుగుణంగానే మహారాష్ట్రలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీన చేపడతామంది. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ సీలింగ్కు కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. అంతకుమించితే మాత్రం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైందంటూ సాకులు చెప్పినా వినిపించుకోమని, తమ అధికారాలను పరీక్షించవద్దని హెచ్చరించింది. కొన్ని చోట్ల రిజర్వేషన్లు 70 శాతం వరకు ఉన్నాయంటూ సీనియర్ న్యాయవాదులు వికాస్ సింగ్, నరేంద్ర హూడా తెలపడంతో స్పందించిన ధర్మాసనం.. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. డిసెంబర్ 2వ తేదీన మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17 ఆఖరి తేదీ. -
కోర్టు ధిక్కర పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు
-
ఢిల్లీలో అలా చేయడం కుదరదు: జస్టిస్ బీఆర్ గవాయ్
ఢిల్లీ గాలి నాణ్యత కోసం కేంద్రం తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాలుష్య నియంత్రణకోసం నిర్మాణం రంగాన్ని పూర్తిగా నిలిపివేయడం సరైన చర్యకాదని తెలిపింది. ఢిల్లీతో పాటు ఆ నగర పరిసర ప్రాంతాలలో నిర్మాణాలు, ఇతర కట్టడాలపై విధించిన నిషేదాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందితాము పర్యావరణ నిపుణులు కామని, అయితే పర్యావరణ పరిరక్షణ అనేది అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండాలని సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. గాలి కాలుష్యాన్ని అడ్డుకోవడానికి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నిర్మాణ రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని దానిని పూర్తిగా నియంత్రిస్తే అది వారి కుటుంబాలపై ప్రభావం చూపిస్తుందని అది తీవ్రమైన సామాజిక ఆర్థిక పరిస్థితికి దారితీస్తుందని తెలిపారు. పర్యావరణ రక్షించడానికి నవంబర్ 19లోగా ఒక ప్రణాళికతో ముందుకు రావాలని జస్టిస్ బీఆర్ గవాయ్ కేంద్రానికి ఆదేశాలు జారీ చేశారు.ఢిల్లీ పర్యావరణాన్ని రక్షించే బాధ్యత కేంద్రానిదేనని స్థానిక ప్రభుత్వానిది కాదని తెలిపారు. అదే విధంగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, గాలి నిర్వహణ కమిషన్ ఢిల్లీలోని ప్రస్తుత వాయు కాలుష్య పరిస్థితులను వివరించాలని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడంతో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడం, కూల్చివేయడాన్ని నిషేదిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు దానిని తిరస్కరించింది. -
కోర్టు ధిక్కారణపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశం
-
దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
-
‘ఫిరాయింపు’.. కొత్త మలుపు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారం కొత్త మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయగా ఇద్దరు ఎమ్మెల్యేలు నేటికీ స్పందించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులకు స్పందించిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలపై రెండు విడతల్లో సాగిన స్పీకర్ విచారణ శనివారం పూర్తయింది. దీంతో నోటీసులకు స్పందించని ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ కోసం సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఇటీవల మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానున్నది. అయితే విచారణ విస్తృతిని దృష్టిలో పెట్టుకొని విచారణ గడువు పెంచాలని స్పీకర్ కూడా సుప్రీంకోర్టును కోరినట్లు సమాచారం. కాగా, స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్)పై అనర్హత వేటుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే రాష్ట్రంలో మరో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు బీఆర్ఎస్ నుంచి గెలిచి 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య 10 మంది ఎమ్మెల్యేలు (దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, అరికెపూడి గాం«దీ, ఎం.సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్గౌడ్) కాంగ్రెస్లో చేరినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు స్పందించారు. రెండు విడతల్లో స్పీకర్ విచారణ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సారథ్యంలోని ట్రిబ్యునల్ రెండు విడతలుగా విచారణ జరిపింది. తొలి విడత విచారణలో భాగంగా సెపె్టంబర్, అక్టోబర్లలో ఐదు రోజులపాటు ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డిని ట్రిబ్యునల్ విచారించింది. అయితే తాము పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని వారు వాదించారు. మరోవైపు సుప్రీంకోర్టు విధించిన గడువులోగా నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తవగా పిటిషన్ల విస్తృతిని దృష్టిలో పెట్టుకొని మరో 8 వారాల గడువు కోరుతూ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.ఈలోగా రెండో విడతలో మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ను స్పీకర్ ప్రసాద్ కుమార్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 14, 15 తేదీల్లో ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, ఎం.సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్రెడ్డి, అరికెపూడి గాం«దీని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. దీంతో మొత్తం 8 మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో వారిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. -
సురేంద్ర కోలీ నిర్దోషి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో గతంలో దోషిగా తేలిన సురేంద్ర కోలీని మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అతడు జైలు నుంచి విడుదలయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. నిఠారీ హత్యల కేసులో తనను దోషిగా తేల్చడాన్ని సవాలు చేస్తూ సురేంద్ర కోలీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ కోలీని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో అతడికి విధించిన శిక్షను, జరిమానాను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కో లీపై ఇతర కేసులు గానీ, విచారణ గానీ లేకుంటే తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. హంతకులెవరో ఇప్పటికీ తెలియకపోవడం విచారకరం నిఠారీ వరుస హత్యల వెనుక అసలు సూత్రధారులను గుర్తించలేకపోవడం తీవ్ర విచారకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సుదీర్ఘకాలం విచారణ జరిగినప్పటికీ హంతకులెవరో ఇప్పటికీ నిర్ధారణ కాలేదని వెల్లడించింది. పోలీసులు ఇంతకాలం శ్రమించినా నేరస్థులను పట్టుకోలేకపోయారని వ్యాఖ్యానించింది. అభంశుభం తెలియని, చిన్నారులను హత్యచేయడం చాలా ఘోరమని, వారి తల్లిదండ్రుల ఆవేదనను వర్ణించలేమని స్పష్టంచేసింది. కేవ లం ఊహాగానాల ఆధారంగా ఒకరిని దోషిగా తేల్చడాన్ని ‘క్రిమినల్ లా’ అంగీకరించబోదని ధర్మాసనం తన తీర్పులో వివరించింది. అస్థిపంజరాలు దొరికిన ఘటనా స్థలాన్ని సరిగ్గా సంరక్షించలేదని, ఆ తర్వాత హడావుడిగా తవ్వకాలు చేపట్టారని అసంతృప్తి వ్యక్తంచేసింది. కేసు దర్యాప్తులో అధికారులు కీలకమైన విషయాలను విస్మరించారని తప్పుపట్టింది. ఏమిటీ కేసు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని నిఠారీ అనే ప్రాంతంలో 2006 డిసెంబర్ 29న వ్యాపారవేత్త మనీందర్ సింగ్ ఇంటి వెనుక మురికి కాలువలో ఎనిమిది అస్థిపంజరాలు బయటపడ్డాయి. అవన్నీ చిన్నారులకు సంబంధించినవే. మనీందర్ సింగ్ ఇంట్లో సురేంద్ర కోలీ సహాయకుడిగా పని చేస్తుండేవాడు. ఎనిమిది అస్థిపంజరాల ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలికలను లైంగికంగా వేధించి, హత్య చేసి మురికికాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో సురేంద్ర కోలీని కింది కోర్టు దోషిగా గుర్తించింది.మరణశిక్ష విధించింది. దీన్ని 2011 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సైతం సమర్ధించింది. 2015 జనవరిలో అలహాబాద్ హైకోర్టు ఈ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 2023 అక్టోబర్లో నిఠారీకి సంబంధించిన ఇతర హత్యల కేసుల్లో కోలీని, సహ నిందితుడు మనీందర్ సింగ్ను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కోలీకి మొత్తం 12 కేసుల్లో విముక్తి లభించింది. మరో హత్య కేసులో ఆయనకు కింది కోర్టు విధించిన శిక్ష, జరిమానాను సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. వంట గదిలో దొరికిన కత్తి ఆధారంగానే దర్యాప్తు జరిగిందని, కోలీని దోషిగా నిర్ధారించడానికి ఈ సాక్ష్యం సరిపోదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. -
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రానికి సుప్రీం నోటీస్
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లను కేటాయిస్తూ తీసుకువచ్చిన నారీ శక్తి వందన్ చట్టం–2023 అమలుపై స్పందన తెలియజేయాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీస్ జారీ చేసింది. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో సంబంధం లేకుండా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా మహిళలకు పార్లమెంట్తోపాటు రాష్ట్రాల శాసనసభల్లో తగు ప్రాతినిధ్యం లేదని పిటిషనర్ జయా ఠాకూర్ పేర్కొన్నారు. చదవండి: జడ్జీలపై ఆరోపణలు చేయడం ట్రెండ్గా మారింది సుప్రీంకోర్టు ఆందోళనప్రస్తుత జనాభా గణాంకాల ఆధారంగా 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. తాజాగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాక అమలు చేస్తామనడం సరికాదన్నారు. పార్లమెంట్ ఈ మేరకు అవసరమైన చట్ట సవరణ చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం మన దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గం మహిళలేనని వ్యాఖ్యానించింది. జనాభాలో 48 శాతం వరకు ఉన్న మహిళలకు రాజకీయ సమానత్వాన్ని కల్పించడానికి ఉద్దేశించిన అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొంది. ‘చట్టాన్ని అమలు చేసే అధికారం కార్యనిర్వాహక వర్గానికి మాత్రమే ఉంది. ఇలాంటి అంశాలపై ప్రభుత్వానికి మాండమస్ రూపంలో ఆదేశాలను జారీ చేయలేం’అని స్పష్టం చేసింది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరుతామని తెలిపింది. ఇదీ చదవండి : 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం -
జడ్జీలపై ఆరోపణలు చేయడం ట్రెండ్గా మారింది సుప్రీంకోర్టు ఆందోళన
న్యూఢిల్లీ: తమకు అనుకూలంగా తీర్పులు రాని పక్షంలో లాయర్లు, కక్షిదారులు న్యాయమూర్తులపై అవమానకరమైన, అశ్లీలతతో కూడిన ఆరోపణలు చేయడం నేడు ట్రెండ్గా మారిపోయిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిణామాలు న్యాయవ్యవస్థ సమగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వీటిని అడ్డుకోవాలనిప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తెలంగాణకు చెందిన కక్షిదారు పెద్ది రాజు, అతడి తరఫున వాదించిన ఇద్దరు లాయర్లపై ధిక్కార చర్యలను నిలిపివేస్తూ ఈ మేరకు పేర్కొంది. ఈ ముగ్గురూ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెప్పడం, న్యాయస్థానం అంగీకరించడం జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని తెలిపింది. అదేవిధంగా, న్యాయస్థానపు అధికారులుగా ఉన్న లాయర్లు ఈ కోర్టు లేదా ఏ హైకోర్టు న్యాయమూర్తులపై అయినా ఆరోపణలు చేసే పిటిషన్దారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై పెద్ద రాజు, అతడి ఇద్దరు లాయర్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదం రేపింది. ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం న్యాయవ్యవస్థలో ఏఐపై మార్గదర్శకాలు: సుప్రీంన్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత దుర్వినియోగం అవుతుండటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు గదిలో విచారణ జరుగుతున్న సమయంలో తనపై ఓ లాయర్ షూ విసిరేసిన ఘటనను తప్పుగా చూపిస్తున్న ఒక మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ అభినవ్ శ్రీవాస్తవ అనే లాయర్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ పిటిషన్పై రెండు వారాల్లో వాదనలు వింటామన్నారు. వివిధ అంశాలను ఏఐ వ్యవస్థలతో కావాల్సిన విధంగా మల్చుకునే ప్రమాదముందని పిటిషనర్ హెచ్చరించారు. ఏఐ వినియోగంతో అనేక అనూహ్య సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. న్యాయవ్యవస్థ, న్యాయ విధులకు సంబంధించినంత వరకు ఏఐ నిష్పాక్షిక డేటాను కలిగి ఉండాలని, జవాబుదారీతనంతో కూడిన డేటా యాజమాన్యం పారదర్శకంగా ఉండాలని పిటిషన్ పేర్కొంది. లేకుంటే సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించింది. అక్టోబర్ 6వ తేదీన రాకేశ్ కిశోర్ అనే లాయర్ విచారణ జరుగుతున్న సమయంలో సీజేఐ వైపు షూ విసరడం తీవ్ర కలకలం రేపింది. -
స్పీకర్పై ధిక్కార చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని, స్పీకర్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో ఈ ఏడాది జూలై 31న సీజేఐ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ కార్యాలయం అమలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ తదితరులు సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.సుప్రీం ఆదేశాల అమలులో జాప్యం చేసినందుకు స్పీకర్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని ధిక్కార పిటిషన్లో కోరారు. అలాగే, సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ అమలు చేయనందుకు ఆ 10మంది ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టే అనర్హులుగా ప్రకటించాలని మరో రిట్ పిటిషన్లో కోరారు. ఈ రెండు పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని న్యాయవాది మోహిత్ రావు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. స్పీకర్ చర్య తీసుకోలేదు ‘సాధ్యమైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనర్హత పిటిషన్లో పేర్కొన్న ఎమ్మెల్యేలు విచారణను ఆలస్యం చేయడానికి యత్నిస్తే.. అటువంటి చర్యలను అనుమతించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణను ఆలస్యం చేసేందుకు ఎమ్మెల్యేలు యతి్నస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్కు సూచించింది. కానీ.. ఈ వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిరాయింపు అంశంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనూ స్పీకర్ కనీసం స్పందించలేదు. ఇది ఉద్దేశపూర్వంగా చేస్తున్న తాత్సారమే’అని మోహిత్ రావు వివరించారు. సుప్రీంకోర్టేమీ బంద్ కాదు కదా? సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ నెల 24న పదవీ విరమణ చేస్తున్నందున అప్పటి వరకు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం విచారణకు రాకుండా ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని మోహిత్ రావు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘నేను సీజేఐగా రిటైరైతే ఏమిటి? నవంబర్ 24 తర్వాత సుప్రీంకోర్టు ఏమీ బంద్ కాదు కదా?’అని వ్యాఖ్యానిస్తూ అత్యవసర విచారణకు నిరాకరించారు. తదుపరి వచ్చేవారు ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపడతారని స్పష్టం చేశారు. అయితే, తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణ జరిపేందుకు మరో 8 వారాల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం కోరిన విషయం తెలిసిందే. సమయం సరిపోలేదు.. ‘నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో నలుగురికి సంబంధించిన విచారణ చివరి దశకు చేరింది. మరో ఇద్దరి విచారణ ప్రారంభమైంది. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ అధికారాలు, రోజువారీ కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనలు వంటి కార్యక్రమాల్లో స్పీకర్ బిజీగా ఉండటంతో సుప్రీంకోర్టు విధించిన గడువులోగా విచారించడం సాధ్యంకాలేదు.శాసన సభ్యులు సైతం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అకాల వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు తదితర కారణాలతో నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వస్తోంది. అందువల్ల సమయం సరిపోలేదు’అని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో అక్టోబర్ 31న మిస్లీనియస్ అప్లికేషన్ (ఎంఏ) దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 14న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపైనా అదేరోజు విచారణ జరిగే అవకాశం ఉంది. -
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్
ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్ను బీఆర్ఎస్ దాఖలు చేసింది. దీనిని విచారణకు త్వరగా స్వీకరించాలని చీఫ్ జస్టిస్ కోర్టులో న్యాయవాదులు అభ్యర్థించారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని, దీంతో వారు ఇంకా ఎమ్మెల్యేలు గానే కొనసాగుతున్నారని దానిలో పేర్కొన్నారు.ఈ విషయంలో ప్రొసీడింగ్స్ ఆలస్యం చేస్తే, వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ ఇంకా ప్రొసీడింగ్స్ ఎవిడెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయని న్యాయవాదులు పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి రిటైర్ అయ్యేంతవరకు ప్రక్రియను సాగదీయాలని చూస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి..నవంబర్ 24 తో సుప్రీంకోర్టు ముగిసినట్టు కాదని అన్నారు. వచ్చే సోమవారం కేసు విచారణ చేస్తామని తెలిపారు. -
న్యాయ సహాయం నైతిక బాధ్యత
న్యూఢిల్లీ: ప్రజలకు న్యాయ సహాయం అందించడం అనేది కేవలం దాతృత్వ చర్య మాత్రమే కాదని.. అదొక నైతిక బాధ్యత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టంచేశారు. న్యాయ సహాయ ఉద్యమంలో పాల్గొనేవారు చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, కక్షిదారుల పట్ల సేవాదృక్పథంలో మెలగాలని సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘న్యాయ సహాయ యంత్రాంగాల బలోపేతం’అనే అంశంపై జాతీయ సదస్సు ముగింపుతోపాటు ‘లీగల్ సర్విసెస్ డే’కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు.తదుపరి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్తోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్విసెస్ అథారిటీ(నల్సా), స్టేట్ లీగల్ సర్విసెస్ అథారిటీ(ఎస్ఎల్ఎస్ఏ)ల్లో సలహా కమిటీని ఏర్పాటు చేయాలని జస్టిస్ గవాయ్ సూచించారు. విధానపరమైన ప్రణాళికలు సజావుగా కొనసాగేలా చూడడానికి ఈ కమిటీలు అవసరమని చెప్పారు. న్యాయ సహాయం అనేది ప్రభుత్వ పరిపాలనలో ఒక భాగమని వివరించారు. ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.న్యాయ సహాయకులు న్యాయ పాలకులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మనం చేసే ప్రతి ప్రయత్నం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలన్నారు. తాను ‘నల్సా’లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సేవలందించానని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. అప్పట్లో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్తో కలిసి పనిచేశానని చెప్పారు. విధి నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు కలిసి వెళ్లేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. మన రాజ్యాంగ ఆత్మ వ్యక్తీకరణకు న్యాయ సహాయ ఉద్యమం ఒక చక్కటి ఉదాహరణ అని అభివర్ణించారు. ఉత్సాహంగా లాయర్ల వాకథాన్ ఢిల్లీలో ఆదివారం లాయర్ల వాకథాన్ ఉత్సాహంగా జరిగింది. సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చీఫ్ వికాస్ సింగ్ జెండా ఊపి వాకథాన్ను ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రాంగణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని ఇండియా గేట్ దాకా లాయర్ల నడక కొనసాగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ గవాయ్తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్ సహా 2,000 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే వాకథాన్ సందర్భంగా న్యాయమూర్తులు మొక్కలు నాటారు. -
సులభతర న్యాయంతో సామాజిక న్యాయం
న్యూఢిల్లీ: అందరికీ అర్థమయ్యేలా న్యాయశాస్త్రం భాషను సులభతరంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. స్థానిక భాషలోనే న్యాయశాస్త్రం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని చెప్పారు. ప్రజలందరికీ న్యాయం సులభంగా అందే సౌలభ్యం ఉండాలని పేర్కొ న్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా న్యాయం సమానంగా, సులువుగా అందుబాటులోకి రావాలన్నారు.శనివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘న్యాయ సహాయ వ్యవస్థల బలోపేతం’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, తదుపరి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్తోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో సామాజిక న్యాయ సాధనకు సులభతర న్యాయం అత్యంత కీలకమని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. కోర్టు తీర్పులను, న్యాయ సంబంధిత పత్రాలను స్థానిక భాషల్లో తీసుకురావాలని కోరారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇస్తూ సుప్రీంకోర్టు ప్రారంభించిన చర్యలను ఆయన గుర్తుచేశారు. 80 వేలకుపైగా తీర్పులను 18 భారతీయ భాషల్లోకి అనువదిస్తోందని తెలియజేశారు. ఈ గొప్ప ప్రయత్నం హైకోర్టులు, జిల్లా స్థాయి కోర్టుల్లోనూ జరగాలని ఆకాంక్షించారు. మాతృభాషలో చట్టంతో లబ్ధిన్యాయం అనేది సమాజంలో కొందరికే పరిమితం కాకూడదని, అది అందరికీ అందాలని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. పేదలకు, అణగారిన వర్గాలకు సులభంగా న్యాయం దక్కడంలో ప్రభుత్వ న్యాయ సహాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. న్యాయాన్ని ప్రతి పౌరుడికీ చేర్చడమే మన లక్ష్యం కావాలని సూచించారు. సులభతర న్యాయాన్ని మరింత మెరుగుపర్చడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, ఇకపై ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుందని ఉద్ఘాటించారు. కక్షిదారులకు అర్థమయ్యే భాషలో తీర్పులివ్వాలని, న్యాయాన్ని చేకూర్చాలని చెప్పారు.చట్టాలను రూపొందించే సమయంలో ఈ విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ప్రజలకు వారి మాతృభాషలో చట్టం గురించి తెలిస్తే వివాదాలు చాలావరకు తగ్గిపోతాయని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉంటే.. నిర్దిష్ట గడువులోగా న్యాయం సులభంగా అందితే.. సామాజిక న్యాయానికి అదే బలమైన పునాది అవుతుందని తేలి్చచెప్పారు. న్యాయ విభాగంలో టెక్నాలజీ ప్రాధాన్యతను ప్రస్తావించారు. ఈ–కోర్టుల ప్రాజెక్టుతో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. కాలం చెల్లిన చట్టాలను రద్దుచేశాం సులభతర వాణిజ్యం, సులభతర జీవనాన్ని పెంపొందించడంపై తమ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ వివరించారు. అవసరంలేని 40 వేలకుపైగా నియమ నిబంధనలను రద్దు చేశామని తెలిపారు. జన విశ్వాస్ చట్టం ద్వారా 3,400కుపైగా న్యాయ వ్యవహారాలను నేరరహితం(డిక్రిమనలైజ్) చేశామన్నారు. అలాగే కాలం చెల్లిన 1,500 చట్టాలను రద్దు చేశామని గుర్తుచేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న చట్టాల్లో మార్పులు చేసి భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చామని వెల్లడించారు. మధ్యవర్తిత్వంతో వివాదాలు సులువుగా పరిష్కారం అవుతాయని సూచించారు. మూడేళ్లలో 8 లక్షల వివాదాలు పరిష్కారం నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ(నల్సా) ఏర్పాటై 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మధ్యవర్తిత్వంపై ఏర్పాటు చేసిన నూతన శిక్షణా విధానాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. వివాదాలను పరిష్కరించడానికి, లిటిగేషన్లు తగ్గించడానికి, సమాజంలో శాంతి సామరస్యం నెలకొల్పడానికి అవసరమైన వనరులను ఈ శిక్షణ అందిస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్లు, ప్రి–లిటిగేషన్ సెటిల్మెంట్లతో లక్షలాది వివాదాలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్తో కేవలం మూడేళ్లలో 8 లక్షలకుపైగా వివాదాలు పరిష్కారానికి నోచుకున్నాయని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. -
లైంగిక దాడి బాధితులకు పరిహారం ఇప్పించండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అత్యాచారం, లైంగిక దాడి కేసుల్లో అవసరమని భావించిన పక్షంలో బాధితులకు పరిహారం కూడా చెల్లించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం సెషన్స్ కోర్టులు, పోక్సో కోర్టులను ఆదేశించింది. ఈ విషయంలో అభిప్రాయం తెలపాల్సిందిగా శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదే వన్ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా)ను ఆదేశించింది.అధికారుల నిర్లక్ష్యం, చిన్నచూపు కారణంగా అత్యాచార బాధితులకు న్యాయపరంగా దక్కాల్సిన పరిహారం దక్కడం లేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన 25 ఏళ్ల మానసికలోపం కలిగిన బాధితురాలికి సీఆర్పీసీలోని 357ఏ ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని అధికారులు నిరాకరిస్తున్నారని పిటిషన్దారు పేర్కొన్నారు. ఈ విషయంలో సెషన్స్ కోర్టులు లేదా స్పెషల్ కోర్టులు సరైన ఆదేశాలివ్వకపోవడం, అవగాహన లోపమే ఈ పరిస్థితికి కారణమని ధర్మాసనం తెలిపింది. -
షమీకి సుప్రీంకోర్టు నోటీసులు
మాజీ భార్య హసీన్ జహాతో (Hasin Jahan) విభేదాల కారణంగా టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) మరోసారి వార్తల్లోకెక్కాడు. తనకు లభిస్తున్న భరణం సరిపోవట్లేదని హసీన్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని (Supreme Court) ఆశ్రయించింది. హసీన్ పిటీషన్ను విచారించిన సుప్రీంకోర్టు షమీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందన తెలియజేయాలని ఆదేశించింది.కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు షమీ హసీన్కు రూ. 4 లక్షలు భరణంగా చెల్లిస్తున్నాడు. ఇందులో షమీ కూతురికి రూ. 2.5 లక్షలు, హసీన్కు రూ. 1.5 లక్షలు వెళ్తున్నాయి. అయితే ఈ మొత్తం సరిపోవట్లేదని హసీన్ షమీపై మరోసారి కోర్టుకెక్కింది. గతంలోనూ ఇదే విషయంలో ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హసీన్ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు లభించే భరణాన్ని రూ. 1.3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచారు. తాజాగా ఈ మొత్తం కూడా సరిపోవట్లేదని హసీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హసీన్ తరఫున న్యాయవాదులు శోభా గుప్తా, శ్రీరామ్ పరాకట్ వాదిస్తూ.. షమీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. నెలకు రూ. 1.08 కోటి ఖర్చు చేస్తున్నాడు. కానీ భార్య, కుమార్తెను పేదరికంలో వదిలేశాడు. షమీ ఆస్తుల నికర విలువ సుమారు రూ. 500 కోట్లు ఉంటుంది. హసీన్కు స్వతంత్ర ఆదాయ వనరులేదు. ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో కూడా లేదని అన్నారు. షమీ తమ క్లయింట్కు ఇంకా రూ. 2.4 కోట్ల బకాయిలు చెల్లించేది ఉందని తెలిపారు. లాయర్ల వాదన విన్న తర్వాత కోర్టు హసీన్కు పరోక్షంగా చురకలంటించ్చినట్లు తెలుస్తుంది. నెలకు రూ. 4 లక్షల భరణం చాలా పెద్ద మొత్తం కదా అని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, షమీ-హసీన్ల వివాహం 2014లో జరిగింది. నాలుగేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. వీరిద్దరికి ఓ బిడ్డ జన్మించింది.ఆతర్వాత షమీ-జహా మధ్య విభేదాలు తలెత్తాయి. 2018లో హసీన్ షమీపై గృహ హింస, వేధింపుల కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఈ ఏడాది జులైలో కోల్కతా హైకోర్టు రూ. 4 లక్షల భరణం హసీన్కు చెల్లించాలని షమీని ఆదేశించింది. చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్? -
వీధి కుక్కల కేసు: ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
ఢిల్లీ: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలపై పైకి వీధి కుక్కలు, పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపింది.ఈ ఆదేశాల అమలుపై ఎనిమిది వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని సుప్రీంకోర్టు కోరింది. పాఠశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆస్పత్రులలోకి వీధి కుక్కలు రాకుండా ఎనిమిది వారాల్లోగా తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా మున్సిపల్ సిబ్బంది వీధికుక్కలు ఉండే స్థలాలను, భవనాలను గుర్తించాలని, ఈ ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసి, రీ లొకేషన్ చేయాలని కోరింది. వీధి కుక్కలను వాటిని పట్టుకున్న ప్రాంతాలలో తిరిగి వదిలిపెట్టకూడదని, ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలు తిరిగే ప్రాంతాలలో తనిఖీ చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. పబ్లిక్ ఏరియాలలో వీధి కుక్కలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. ఈ నివేదిక అమలుపైన అఫిడవిట్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. -
నీళ్ల బాటిల్ రూ.100.. కాఫీ రూ.700.. సుప్రీంకోర్టు సీరియస్
ఏ సినిమా అయినా సరే.. టికెట్ ధర రూ.200కి దాటకూడదని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. ఇతర భాషా చిత్రాలకు సైతం ఇదే వర్తిస్తుందని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక మల్టీప్లెక్స్ థియేటర్ల ఓనర్లు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సినిమా చూడాలంటే రూ.2000?టికెట్ ధరలతో పాటు థియేటర్లలో విక్రయించే తినుబండారాలపై భారీ మొత్తంలో వసూలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఒక్క నీళ్ల బాటిల్కు రూ.100, కాఫీకి రూ.700 వసూలు చేస్తారా? అని ఆగ్రహించింది. సాధారణ ప్రజలు ఒక సినిమా చూడటానికి మల్టీప్లెక్స్కు వస్తే రూ.1,500 నుంచి రూ.2,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే థియేటర్లకు వచ్చేవారి సంఖ్య తగ్గుతోంది. ఇలాగైతే థియేటర్లు ఖాళీటికెట్, తినుబండారాల ధరలు అందుబాటులో లేకపోతే థియేటర్లు ఖాళీ అవడం ఖాయం అని అభిప్రాయపడింది. టికెట్ ధర రూ.200 ఉండాలనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాన్ని తాము సమర్థిస్తున్నామని జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు. అయితే టికెట్ కౌంటర్లలో డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసే వారి గుర్తింపు కార్డు (ఐడీ) వివరాలు సేకరించాలన్న హైకోర్టు ఉత్తర్వులు తక్షణమే అమలు కాకుండా వాటిపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.చదవండి: బండ్ల గణేశ్ సెటైర్లు.. కౌంటరిచ్చిన అల్లు అరవింద్ -
వొడాఫోన్-ఐడియా బకాయిలపై మదింపు చేయవచ్చు.. సుప్రీంకోర్టు
వొడాఫోన్-ఐడియా (Vi) అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) బకాయిలకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న వొడాఫోన్-ఐడియా అన్ని ఏజీఆర్ బకాయిలను ఫిబ్రవరి 3, 2020 నాటి మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా మదింపు చేసి, సరిదిద్దే(reconcile) అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.కోర్టు స్పష్టతసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు స్పష్టతనిచ్చింది. వొడాఫోన్-ఐడియా తరపు న్యాయవాదులు ముకుల్ రోహత్గి, మహేష్ అగర్వాల్ మౌఖికంగా చేసిన విజ్ఞప్తిపై ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులోని ఆరో పేరాలో అదనపు ఏజీఆర్ డిమాండ్ను మాత్రమే సరిదిద్దాలని టెలికాం సంస్థ కోరినట్లు పొరపాటున పేర్కొనబడిందని కంపెనీ కోర్టు దృష్టికి తెచ్చింది. దీనిపై అగర్వాల్ స్పందిస్తూ.. తాము అన్ని ఏజీఆర్ బకాయిలను సమగ్రంగా మదింపు చేసి, సరిదిద్దేందుకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీంతో కేంద్రం తమ డిమాండ్ను చట్టానికి అనుగుణంగా పునపరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని అక్టోబర్ 27న ఇచ్చిన ఆదేశాన్ని కోర్టు స్పష్టం చేసింది.సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరై వొడాఫోన్ఐడియా విషయంలో గత ఏజీఆర్ వ్యాజ్యానికీ, ప్రస్తుత పరిస్థితికీ మధ్య భారీ మార్పు వచ్చిందని తెలిపారు. కంపెనీలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 49 శాతం వాటాను పెట్టుబడిగా పెట్టింది. ఏజీఆర్ బకాయిల అంశం ప్రభుత్వ(ప్రజా ప్రయోజనం), కంపెనీ ప్రయోజనంతో ముడిపడి ఉందని మెహతా వాదించారు. కంపెనీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా దానికున్న 20 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపుతుందని కూడా కోర్టుకు తెలిపారు.విధాన పరమైన నిర్ణయం అవసరం..ప్రభుత్వానికి చెప్పుకోదగిన వాటా ఉండడం, 20 కోట్ల మంది వినియోగదారుల ఉండడంతో ఈ సమస్యపై విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ఏజీఆర్ బకాయిలపై సమగ్ర మదింపునకు కేంద్రానికి వెసులుబాటు కల్పిస్తూ సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది. ఈ స్పష్టతతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్-ఐడియాకు కొంత ఊరట లభించినట్లయింది.ఇదీ చదవండి: బిగ్రిలీఫ్.. ఈరోజు బంగారం ధరలు ఎంతంటే.. -
తమిళనాట ఎస్ఐఆర్పై సుప్రీంకు డీఎంకే
న్యూఢిల్లీ: తమిళనాడులో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేప ట్టాలంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) తీసుకు న్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అధి కార డీఎంకే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈసీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ప్రజాస్వామ్య హక్కు లకు భంగకరమని పేర్కొంది. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి ఈ పిటిషన్ వేశారు. తమిళ నాడులో ఎస్ఐఆర్ చేపట్టేందుకు అక్టోబర్ 27న ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించడమేనన్నారు. ఎస్ఐఆర్తో అసలైన ఓటర్ల పేర్లను సైతం సరైన పత్రాలు లేవనే సాకుతో తొలగించే ప్రమాదముందన్నారు. పిటిషన్పై ఈ వారంలోనే అత్యు న్నత న్యాయస్థానం విచారణ చేపట్టే అవకా శముంది. -
పోక్సో నేరగాడికి సుప్రీంకోర్టు క్షమాభిక్ష!
దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక అరుదైన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 142వ నిబంధన మేరకు తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించి మరీ పోక్సో కేసులో నేరస్తుడిగా నిరూపితమైన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించింది. జైలుశిక్ష రద్దు చేసింది. ఆ వ్యక్తి నేరం చేసిన మాట వాస్తవమైనప్పటికీ తరువాత బాధితురాలిని పెళ్లి చేసుకోవడం.. పుట్టిన బిడ్డతో కలిసి సంసారం కొనసాగిస్తుండటాన్ని పరిగణలోకి తీసుకుని తామీ నిర్ణయానికి వచ్చినట్లు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మెస్సీలతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాలు..తమిళనాడుకు చెందిన కృపాకరన్ అనే వ్యక్తి 2017లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. న్యాయ విచారణ అనంతరం న్యాయస్థానం అతడికి ఐపీసీ సెక్షన్ 366 (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కింద ఒక నేరానికి ఐదేళ్లు, ఇంకోదానికి పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పును కృపాకరన్ మద్రాస్ హైకోర్టులో సవాలు చేశాడు. బాధితురాలిని తాను పెళ్లి చేసుకున్నానని, బిడ్డతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. కానీ 2021 సెప్టెంబరులో హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కృపాకరన్ చెబుతున్న విషయాలను నిర్ధారించుకునేందుకు సుప్రీంకోర్టు తమిళనాడు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని పురమాయించింది. బాధితురాలు కూడా కోర్టు ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ... తాను కృపాకరన్పై ఆధారపడ్డానని, అతడితోనే సంసారం చేయాలని తీర్మానించుకున్నానని స్పష్టం చేసింది. బాధితురాలి తండ్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు విచారణకు హాజరవడమే కాకుండా... కృపాకరన్ నేరాన్ని, శిక్షను రద్దు చేయడంపై తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు. తమిళనాడు లీగల్ సెల్ అథారిటీ ఉన్నతాధికారి కూడా కృపాకరన్, బాధితురాలు సుఖంగానే ఉన్నారని, సంసారం బాగానే గడుస్తోందన్న నివేదిక అందడంతో భార్యపిల్లలను బాగా చూసుకోవాలని, ఏ రకమైన ఇబ్బంది పెట్టినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సుప్రీంకోర్టు అతడి నేరాన్ని, శిక్ష రెండింటినీ రద్దు చేసింది. సామాజిక సంక్షేమం కోసమే..కృపాకరన్ కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘‘చట్టాలనేవి సామాజిక సంక్షేమం కోసమే’’ అన్న జస్టిస్ బెంజిమన్ కార్డోజో (అమెరికా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి) వ్యాఖ్యతోనే తీర్పును ప్రారంభించడం విశేషం. కృపాకరన్ చేసింది తీవ్రమైన నేరమే అయినప్పటికీ ఆ తరువాత జరిగిన పరిణామాలను, వాటి ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ తీర్పునిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ బాలికలపై లైంగిక దాడులను నిరోధించేందుకే పోక్సో లాంటి చట్టాలను రూపొందించారని, శిక్షలను ఖరారు చేశారని తెలిపింది. అయితే, ఈ శిక్షలను యథాతథంగా అమలు చేసే ముందు వాస్తవిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. అన్నింటికీ ఒకేతీరున కాకుండా.. ఆయ కేసులను బట్టి ఈ న్యాయస్థానం తీర్పులు ఇస్తుందని తెలిపింది. అవసరమైన సందర్భాల్లో కఠినంగానే కాకుండా.. కరుణతోనూ తీర్పులుంటాయని న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మెసీల ధర్మాసనం వివరించింది. కృపాకరన్ కేసులో నేరం జరిగింది కామంతో కాకుండా ప్రేమతో అన్న అంచనాకు రావడం వల్ల తాము రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలతో అతడి నేరాన్ని, శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
మరీ ఇంత అలసత్వమా? 44 ఏళ్ల తర్వాత క్లీన్ చిట్
మన దేశంలో కొన్ని కేసులు ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతూనే ఉంటాయి. కింద కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా..పైకోర్టులో సవాలు వేయడంతో కొన్నేళ్లుగా ఆ కేసులు ఓ కొలిక్కి రాకుండా ఉండిపోతాయి. ఈ క్రమంలో క్లయింట్లు చనిపోతే ఇక ఆ కేసు కోసం సంబంధిత బాధితులు ఏళ్లుగా నిరీక్షించి పోరాడితే గానీ న్యాయం జరగదు. ఈ పెండింగ్ కేసులు దేశం మొత్తంగా చాలానే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే..40 ఏళ్ల నాటి లంచం కేసు.. బాధితుడి చనిపోయిన కొన్నేళ్లకు క్లీన్ చీట్ లభించడం విశేషం. అత్యున్నత న్యాయస్థానం అతడి గౌరవాన్ని పునరుద్ధరించి.. పెన్షన్తో సహా తత్సంబంధిత ద్రవ్యప్రయోజనాలను చట్టపరమైన వారసులకు ఇవ్వాల్సిందిగా అదేశించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..దాదార్ నాగ్పూర ఎక్స్ప్రెస్లో టీటీఈగా పనిచేసిన వీఎం సౌదాగర్ 1988లో ప్రయాణికుల నుంచి రూ. 50ల లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. శాఖపరమైన విచారణ అనంతరం 1996లో సర్వీస్ నుంచి తొలగించారు. ప్రస్తుతం సదరు బాధితుడు బతికి లేకపోయినప్పటికీ..అతడి కుటుంబసభ్యులు న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. నిజానికి ట్రిబ్యూనల్ కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టులో సవాలు వేయండంతో..ఆ తీర్పు నిలిచిపోయింది. అప్పటి నుంచి ఆ కేసు..అలా పెండింగ్లోనే ఉండిపోయింది. గత సోమవారం అత్యున్నత న్యాయస్థానం సదరు బాధితులకు ఊరట లభించేలా చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బాధితుడిపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అతడి గౌరవాన్ని పునరుద్ధరించి పెన్షన్తో సహా అన్ని ద్రవ్య ప్రయోజనాలను మూడు నెలల్లోపు అతని చట్టపరమైన వారసులకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ వివాదం ఎలా వచ్చిందంటే..ఈ వివాదం మే 31, 1988 నాటిది. సౌదాగర్ ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ. 50 డిమాండ్ చేశాడని, వారిలో ఒకరికి ఛార్జీలో బ్యాలెన్స్లో రూ.18 తిరిగి ఇవ్వలేదని రైల్వే విజిలెన్స్ బృందం ఆరోపించింది. దీని ఆధారంగా డిపార్ట్మెంట్ విచారణ ప్రారంభించి..ఎనిమిదేళ్ల తర్వాత 1996లో సౌదాగర్ను సర్వీస్ నుంచి తొలగించారు. అయితే ఈ కేసులో కచ్చితమైన ఆధారాలు లేవని, విజిలెన్స్ బృందం గట్టి సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైంది. ప్రయాణికుల సాక్ష్యాలు లంచం తీసుకున్నారనే ఆరోపణకు మద్దతు ఇవ్వలేదు. అంతేగాదు ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు ఆయన ఎలాంటి డబ్బులు కోరలేదని, మిగతా కోచ్లను కూడా పర్యవేక్షించాక, రసీదు జారీ చేసి, మిగిలిన ఛార్జీని తిరిగి ఇస్తానని స్పష్టంగా చెప్పారు. దీంతో2002లో, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కేసును పరిశీలించి, సౌదాగర్ను తిరిగి నియమించాలని భారత రైల్వేలను ఆదేశించింది. అలాగే అధికారులు సమర్పించిన ఆధారాలేవి అతని తొలగింపుని సమర్థించలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే నాటి ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి బదులు..బాంబే హైకోర్టులో ట్రిబ్యునల్ ఉత్తర్వుని సవాలు చేయండంతో కోర్టు తీర్పుని నిలిపివేసింది. దాంతో అతని నియమకానికి అన్ని విధాలుగా తలుపులు మూసుకుపోయాయి. కానీ అతడి కుటుంబం ఆశ వదులు కోలేదు, ఎప్పటికైన న్యాయం లభిస్తుందని పోరాటం కొనసాగించింది. చివరికి 44 ఏళ్ల తర్వాత ఉపశమనం..దశాబ్దాల నాటి కేసుని సమీక్షించిన ధర్మాసనం సౌదాగర్పై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని తేల్చింది. విచారణ అధికారి విషయాలను వక్రీకరించారని, తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని పేర్కొంది సుప్రీం కోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సర్వీస్ ఇచ్చిన తీర్పు సరైనదేనని, విచారణ అధికారి చెబుతున్న ఆధారాలు సాక్ష్యుల మాటలతో ఏకభవించలేదని, అందువల్ల తొలగింపు శిక్షను రద్దు చేసే హక్కు ట్రిబ్యునల్కి ఉందని హైకోర్టు గుర్తించడంలో విఫలమైందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అదీగాక ఎలాంటి అధారాలు లేకుండా ఒక చనిపోయిన వ్యక్తి పేరు అవినీతి ఆరోపణలతో కళంకితమైందని మండిపడింది. అందువల్ల ఆయన గౌరవాన్ని పునరుద్ధరించేలా ఇలా సుప్రీం కోర్టు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చింది. ఏదీఏమైనా ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఉపశమనం లభించడం బాధకరం. చనిపోయేంత వరకు ఎంత మనోవేదన అనుభవించి ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కేసుల్లోని అలసత్వం..బాధితులు చనిపోయేంత వరకు న్యాయం లభించకపోవడం అనేది గమనార్హం, బాధకరం కూడా.(చదవండి: చెత్త వేశారో.. మీచెంతకే 'రిటర్న్ గిఫ్ట్'! స్ట్రాంగ్ క్లీనింగ్ పాఠం) -
ముందు బీమా చెల్లించండి.. తర్వాతే ఏమైనా!: సుప్రీంకోర్టు
ఈ రోజుల్లో దాదాపు అందరూ బీమా తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరిగినప్పుడు.. కొన్ని కారణాలను చూపిస్తూ బీమా సంస్థలు పరిహారం చెల్లించకుండా తప్పించుకుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 'వాహనం రూట్ ఉల్లంఘన జరిగినా కూడా, ప్రమాద బాధితుడికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిందే' అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ప్రమాదం జరిగిన సమయంలో.. వాహనం రూట్ మారిందని ప్రమాద బాధితులకు బీమా కంపెనీ పరిహారాన్ని తిరస్కరించకూడదు. సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని బీమాను తిరస్కరించలేరు. ప్రమాద బాధితుడికి న్యాయం చేయడమే బీమా ముఖ్య ఉద్దేశం. బీమా చెల్లించిన తరువాత.. ఏవైనా అవకతవకలు ఉంటే.. రూల్స్ ఉల్లంఘించిన వాహన యజమానిపై లేదా డ్రైవర్ నుంచి రికవరీ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. -
53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టబోతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తదుపరి సీజేఐగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సంబంధించిన డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ దాదాపు 15 నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతో రా ష్ట్రపతి ముర్ము జస్టిస్ సూర్యకాంత్ను సుప్రీంకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ సూర్యకాంత్కు అభినందనలు తెలియజేశారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లా పెటా్వర్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జని్మంచారు. 1981లో హిసార్లోని ప్రభుత్వ పీజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ లా అభ్యసించారు. 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ‘మాస్టర్ ఆఫ్ లా’లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 2000 జూలై 7 నుంచి 2004 జనవరి 8 దాకా హరియాణా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్గా సేవలందించారు. 2004 జనవరి 9 నుంచి 2018 అక్టోబర్ 4 దాకా పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2018 అక్టోబర్ 5 నుంచి 2019 మే 23 దాకా హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆరేళ్లుగా సుప్రీంకోర్టులో సేవలందిస్తున్నారు. 2000 సంవత్సరం కంటే ముందే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన జస్టిస్ సూర్యకాంత్ 2011లో మాస్టర్ ఆఫ్ లా పూర్తిచేయడం విశేషం.కీలక తీర్పుల్లో భాగస్వామి సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామ్యం కూడా ఉంది. పలు ధర్మాసనాల్లో ఆయన పనిచేశారు. జమ్మూకశీ్మర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటి కీలక అంశాల్లో ఆయన తీర్పులిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ తీర్పు ఇచి్చన బెంచ్లో జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యుడే. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దని ఆయన ఆదేశించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సహా ఇతర బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆదేశించి చరిత్ర సృష్టించారు. రక్షణ దళాల్లో వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకాన్ని సమరి్థంచారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో సభ్యుడిగా పనిచేశారు. జాతీయ భద్రత పేరిట ప్రముఖుల గోప్యతకు భంగం కలిగించడం సరైంది కాదని తేలి్చచెప్పారు. 2022లో మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా పరమైన లోపాలు బయటపడ్డాయి. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్న ధర్మాసనం విచారించింది. -
SC: వీధి కుక్కల బెడద భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసింది
-
AP టీచర్లకు సుప్రీం బిగ్ షాక్
-
వేరుపడిన భార్య వస్తువుల్ని 24 గంటల్లోగా అప్పగించాలి
న్యూడిల్లీ: వేరుగా ఉంటున్న భార్యను ఆమె దుస్తులు, ఇతర వస్తువుల్ని తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్న ఓ భర్తపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమని పేర్కొంది. ఆమెకు సంబంధించిన అన్ని వస్తువులను 24 గంటల్లోగా అప్పగించాలని అతడిని ఆదేశించింది. దీపావళి పండుగ జరుపుకునేందుకు తన కుమారుడిని తనతో ఇంటికి పంపించేలా భార్యను ఆదేశించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఆమె కుమారుడిని భర్తతో పంపేందుకు నిరాకరించింది.2022 నుంచి అత్తింట్లో ఉన్న తన వస్తువులను అతడు తీసుకెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించింది. స్పందించిన ధర్మాసనం ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించింది. ‘వివాహాలు కొన్ని విఫలమవుతుంటాయి. కానీ, భార్య తన దుస్తులు తీసుకోవడానికి కూడా భర్త అనుమతించనంత స్థాయికి దిగజారకూడదు. కలిసి ఉండలేని పరిస్థితి వేరు. ఆమె వస్తువులను 24 గంటల్లో తిరిగి అప్పగించాలని ఆదేశిస్తున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా, తల్లి, తండ్రి కలిసి తమ కుమారుడిని దగ్గర్లోని గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలని, కావాలనుకుంటే అమ్మమ్మ, తాతయ్యలు కూడా వారితో వెళ్లవచ్చని ధర్మాసనం పేర్కొంది.


