breaking news
Supreme Court
-
555 టీఎంసీలు సాధించాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్ –1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పొందేలా జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపించాలని సూచించారు. జల వివాదాలకు సంబంధించిన సుప్రీంకోర్టు కేసులతోపాటు జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం తరఫున వినిపించాల్సిన వాదనలపై శుక్రవారం ఆయన నీటిపారుదలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్తో సమీక్ష నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలిస్తే అందుకు బదులుగా నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఎదుట అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగింది. ఇందులో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలతో పాటు ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు కలిపి మొత్తం 600 టీఎంసీలను 75 శాతం లభ్యత (నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లపాటు ఉండే వరద లభ్యత) ఆధారంగా తెలంగాణకు కేటాయించాలని 2023లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్లో స్టేట్మెంట్ ఆఫ్ కేస్ దాఖలు చేశామని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. ఈ కేసులో ఏపీ కౌంటర్ వాదనలు ముగిశాయని.. తెలంగాణ తరఫున రిజాయిండర్ వాదనలు ప్రారంభించినట్లు చెప్పారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటాలో 555 టీఎంసీలకు 45 టీఎంసీల పోలవరం మళ్లింపు నీళ్లు కలిపి మొత్తం 600 టీఎంసీలు దక్కేలా వాదనలు ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఆ మేరకు నీటి వినియోగానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని గుర్తుచేశారు. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలను పూర్తిగా ఏపీలో వాడుకుంటారని.. గోదావరి జలాల మళ్లింపునకు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలపై పూర్తి అధికారం తెలంగాణదేనని సీఎం స్పష్టం చేశారు. సాగర్ ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక 80 టీఎంసీల్లో ఇప్పటికే 35 టీఎంసీల వినియోగానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాయని.. మిగిలిన 45 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సిందేనని తెలిపారు. తీర్పు అన్యాయంగా ఉంటే అంగీకరించొద్దు.. జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2011లో ఇచ్చిన అవార్డుపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై వచ్చే నెలలో వాదనలు వినిపించాల్సి ఉందని న్యాయవాదులు తెలియజేయగా... కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు అమల్లోకి వస్తే తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున సరైన గ్యారంటీలు లభించకుండా ఈ తీర్పునకు అంగీకరించొద్దని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మరో కేసు అప్పర్ భద్ర ప్రాజెక్టుపై ఉందని.. తెలంగాణలో జలవిద్యుత్ ఉత్పాదన కోసం జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో కేసు ఉందని అధికారులు నివేదించారు.ఇక పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులో సమన్ల జారీ ప్రక్రియ జరుగుతోందని న్యాయవాదులు సీఎంకు నివేదించారు. సుప్రీంకోర్టుతోపాటు కృష్ణాలో తెలంగాణ వాదనలు బలంగా ఉండాలని.. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన నీటి వాటాను సాధించేలా పోరాటం చేయాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ అడ్వకేట్ జనరల్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ కుషి్వందర్ వోహ్రా, ప్రముఖ న్యాయవాది సాత్విక్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ కె. ప్రసాద్, ఎస్ఈ ఎస్. విజయకుమార్, ఈఈ వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
90 రోజుల్లో అభియోగాలు నమోదు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: వరకట్న మరణాలు, మహిళలపై వేధింపుల కేసుల విచారణలో ఇకపై ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తరహా కేసుల్లో చార్జిషిటు దాఖలైన 60 నుంచి 90 రోజుల్లోగా నిందితులపై అభియోగాలు ఖరారు చేయాలని విచారణా కోర్టులను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనవసర వాయిదాలు ఇవ్వకుండా సాక్ష్యాల నమోదును వీలైనంత వరకు రోజువారీగా జరపాలని సూచించింది. బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టులు అనుసరించాల్సిన విధానంపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు 10 కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.ఉత్తరప్రదేశ్లో పెళ్లైన ఏడాదికే 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కేసు విచారణ 24 ఏళ్లపాటు సాగిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా పాత కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఈ మార్గదర్శకాలు చేసింది. మార్గదర్శకాల అమలు నివేదికల పరిశీలన కోసం తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. బాధితులకు అండగా నిలిచేందుకు వన్–స్టాప్ సెంటర్లు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, మహిళా హెల్ప్డెస్క్లు, హెల్ప్లైన్లు, ఆన్లైన్ గ్రీవెన్స్ సిస్టమ్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరింత బలోపేతం చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
కస్టోడియల్ డెత్ కేసు: సుప్రీంకోర్టుకు డీజీపీ ఐదుసార్లు సారీ.. అయినా..
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో పోలీసు కస్టడీలో జరిగిన ఓ యువకుడి మరణం కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర పోలీసు వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024లో ఓ యువకుడు కస్టడీలో మృతి చెందగా, ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 2 సంవత్సరాల 7 నెలలు ఆలస్యం కావడంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్దేవ్ గౌతమ్ను కోర్టు తీవ్రంగా ప్రశ్నిస్తూ, ఇలాంటి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇంత సమయం పట్టడం ఏంటని, ఇక పోలీసు అధికారులకు శిక్షణ అవసరమా? అని ప్రశ్నించింది.విచారణ సందర్భంగా.. ఛత్తీస్గఢ్ డీజీపీ పూర్తిగా అసమర్థుడిగా కనిపిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును నిర్వహించే సామర్థ్యం ఛత్తీస్గఢ్ అడ్మినిస్ట్రేషన్కు లేదని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కస్టడీలో మరణం వంటి తీవ్రమైన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో కోర్టు ప్రశ్నించింది.మరో అంశంపై కూడా సుప్రీంకోర్టు డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోస్ట్మార్టం నివేదికను పరిశీలించకుండానే తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారని కోర్టు పేర్కొంది. ఇది సుప్రీంకోర్టును మోసం చేయడమేనని, కేసులోని ప్రతి అంశంపై కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించింది.మృతుడి మరణానికి మద్యం మానేయడం వల్ల వచ్చిన ఉపసంహరణ లక్షణాలు కారణమని పేర్కొన్నప్పటికీ, పోస్ట్మార్టం నివేదికలో తలకు మొద్దుబారిన వస్తువుతో గాయం అయినట్లు నమోదై ఉండటాన్ని కోర్టు ప్రస్తావించింది. నివేదికలో తలకు గాయం స్పష్టంగా ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించింది.న్యాయ విచారణ నివేదిక తమకు అందలేదని డీజీపీ చెప్పినప్పుడు కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ నివేదిక జూలై 2024లోనే సమర్పించారని, అంతేకాకుండా డీజీపీ స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్లోనే ఆ నివేదిక భాగంగా ఉందని కోర్టు గుర్తు చేసింది.ఈ కేసులో కస్టడీ మరణానికి రూ.లక్ష పరిహారం చెల్లించిన విషయంపైనా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒక మనిషి ప్రాణానికి విలువ కేవలం రూ.లక్షేనా అని ప్రశ్నిస్తూ, అది భయంకరమైన విషయం అని వ్యాఖ్యానించింది.తన వాదనలో డీజీపీ.. న్యాయ కస్టడీలో జరిగే ప్రతి మరణంపై న్యాయ విచారణ తప్పనిసరి అని చెప్పారు. న్యాయ విచారణలో అది నేరంగా పరిగణించాల్సిన కేసు అని నిర్ధారణ అయ్యే వరకు పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని వాదించారు. న్యాయ విచారణ నివేదిక రెండేళ్ల పాటు పోలీసు శాఖకు అందలేదని, అది బిలాస్పూర్ కేంద్ర జైలు లేదా జైళ్ల శాఖకు పంపినట్లు తెలిపారు.మరణం హత్యా, ప్రమాదమా, ఆత్మహత్యా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో న్యాయ విచారణ ద్వారా దాన్ని తేల్చాల్సి వచ్చిందని డీజీపీ కోర్టుకు వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పటికే చెల్లించామని చెప్పారు. న్యాయ విచారణకు సంబంధించిన సమాచారం అందిన తర్వాత జూలై 30న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించేందుకు ఓ గెజిటెడ్ అధికారితో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు.5 సార్లు క్షమాపణలువిచారణ సందర్భంగా డీజీపీ అరుణ్దేవ్ గౌతమ్ 5 సార్లు క్షమాపణలు చెప్పారు. న్యాయ విచారణ నివేదికపై జరిగిన చర్చ, నివేదిక తమకు అందకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం, నివేదికల విషయంలో ఏర్పడిన గందరగోళం వంటి అంశాలపై ఆయన క్షమాపణలు కోరారు. చివర్లో కోర్టు తనను పూర్తిగా అసమర్థుడిగా పేర్కొన్న తర్వాత కూడా క్షమాపణలు చెప్పారు.కేసును సీబీఐకి అప్పగింతకేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు కథనం పేర్కొంది. పోస్ట్మార్టం నివేదికలో మృతుడి తలకు మొద్దుబారిన వస్తువుతో గాయం అయినట్లు, కొన్ని చోట్ల రక్తస్రావం జరిగినట్లు నమోదైంది. న్యాయం కోసం మృతుడి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతో పాటు బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మొత్తం మీద, కస్టడీలో జరిగిన మరణంపై ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, పోస్ట్మార్టం నివేదికను సరిగా పరిగణనలోకి తీసుకోకపోవడం, తప్పు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ పోలీసు, పరిపాలనా వ్యవస్థను తీవ్రంగా తప్పుబట్టింది.ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు -
‘మోసం.. అని చెప్పేముందు జాగ్రత్త’
పన్ను చెల్లింపుదారులకు జారీ చేసే సెక్షన్ 74 జీఎస్టీ షోకాజ్ నోటీసులపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. నోటీసులో ‘మోసం, వాస్తవాలను సమర్పించలేకపోవడం లేదా దాగిన సత్యాలు’ అనే చట్టబద్ధమైన పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. పన్ను ఎగవేతకు పన్ను చెల్లింపుదారులు ఎలాంటి కుట్ర పన్నారో ప్రాథమిక సాక్ష్యాధారాలతో నోటీసులోనే స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.జస్టిస్ బె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ‘మోసం లేదా దాగిఉన్న వాస్తవాలు’ అనే సందేహస్పద పదజాలాన్ని ప్రయోగించినంత మాత్రాన గడువు పొడిగింపు నిబంధనలను సవరించే వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. అసెస్సింగ్ ఆఫీసర్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే ఎక్ట్సెండెడ్ లిమిటేషన్ వ్యవధిని వర్తింపజేయాలని పేర్కొంది.మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్పై విచారణ సందర్భంగా.. నోటీసులోని శబ్దజాలం అసెస్సింగ్ ఆఫీసర్ల అనిశ్చితిని స్పష్టం చేస్తోందని, ‘మోసం లేదా కప్పిపుచ్చడం’ అనే పదాల వాడకంలో స్పష్టమైన నిర్ధారణ లేదని కోర్టు పేర్కొంది.ఈ తీర్పుపై స్పందించిన డెలాయిట్ పార్టనర్ హర్ప్రీత్ సింగ్.. ‘ఇది పన్ను చెల్లింపుదారులకు దక్కిన గొప్ప ఉపశమనం. చట్టపరమైన పదాలను కేవలం పునరావృతం చేస్తూ నోటీసులు పంపే ధోరణికి ఈ తీర్పు చెక్ పెడుతుంది’ అని వ్యాఖ్యానించారు. అధికారులు తమ నిర్లక్ష్య వైఖరిని వదిలి ఆధారాలతో సహా వివరమైన సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తీర్పు ద్వారా పన్ను యంత్రాంగంలో బాధ్యత, పారదర్శకత పెరుగుతాయని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. నిజాయతీ కలిగిన పన్ను చెల్లింపుదారులకు ఈ తీర్పు రక్షణ కల్పిస్తుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.లక్షల కోట్ల ఆదా సరే.. మైలేజ్ కోతకు పరిష్కారమేది? -
45 ఏళ్లకు కానీ తేల్లేదు
న్యూఢిల్లీ: ‘‘కేసు ఓడినవాడు కోర్టులో ఏడిస్తే... గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడు’’అంటారు. దేశంలో కోర్టు కేసులు తేలేందుకు ఏళ్లు పూళ్లవుతున్న నేపథ్యంలో పుట్టుకొచ్చిన ఈ నానుడి తాజాగా ఇంకోసారి రుజువైంది. జంట హత్యల కేసులో ఓ వ్యక్తి యాభై ఏళ్లుగా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితిపై దేశ అత్యున్నత న్యాయస్థానమూ చలించిపోయింది. డెబ్ఫై ఏళ్ల ఆ నిందితుడు సైమన్ సోరేన్ శిక్షను తాత్కాలికంగా రద్దు చేయడంతోపాటు ‘‘న్యాయ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం’’ఈ ఉదంతమని జస్టిస్ జేబీ పర్డీవాలా, జస్టిస్ వినోద్ కే చంద్రన్లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఇరవై ఏళ్లుగా ఈ కేసును తేల్చని జార్ఖండ్ హైకోర్టు తీరును కూడా న్యాయమూర్తులు ఆక్షేపించారు. కోర్టులో వినిపించిన వాదనలు, న్యాయమూర్తుల వ్యాఖ్యల ప్రకారం... 1981, అక్టోబర్ 18న బిభూతి, బనార్సీ, క్షీర్సాగర్ మండల్లు, మేనల్లుళ్లు జగదీశ్, సత్యనారాయణ్లతో కలిసి వరి కోతల కోసం దుమ్కా జిల్లాలోని భురుండియా గ్రామానికి వెళ్లారు. అదేరోజు కొంతమంది సంతాల్ గిరిజనులు డప్పులు కొడుతూ విల్లు, బాణాలతో, గొడ్డళ్లతో మండల్ కుటుంబీకులు పనిచేస్తున్న పొలాల వద్దకు వచ్చారు. ఈ గిరిజనులు మండల్ కుటుంబ సభ్యులను చంపాలంటూ పిలుపునిచ్చారు. పారిపోతూండగా వెంటబడ్డ జేథున్ సోరేన్, సైమన్ సొరేన్ పేరున్న గిరిజనులు బిభూతి మండల్, బనార్సీ మండల్లపై బాణాలతో దాడి చేశారు.ఆ తరువాత బిభూతి, బనార్సీ మండల్లు ఇద్దరూ కిందపడిపోగా జెథున్, సైమన్లు వారిని నరికి చంపారని ప్రత్యక్ష సాక్షులు జగదీశ్, సత్యనారాయణలు తెలిపారు. ఈ ఘర్షణ, జంట హత్యలపై పోలీసు కేసు నమోదైంది. ఆరుగురు గిరిజనులను అరెస్ట్ చేశారు కూడా. అయితే అభియోగాలు నమోదు చేయకముందే ఇద్దరు నిందితులు మరణించారు. ఆ తరువాత విచారన పూర్తయ్యేందుకు ఏకంగా పన్నెండేళ్లు పట్టింది. 1991లో ఛార్జ్షిట్ నమోదైతే 2002లో శిక్షలు ఖరారయ్యాయి. ఈ మధ్యకాలంలో ఈ కేసు ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు ఐదుసార్లు బదిలీ అయింది. నిందితులు కొందరు ఆరేళ్లపాటు పరారీలో ఉండటమూ తోడై విచారణలో విపరీతమైన జాప్యం జరిగింది. అయితే ఈ పన్నెండేళ్లను మినహాయిస్తే మిగిలిన సమయంలోనైనా కేసు విచారణ ఎందుకు ఒక కొలిక్కి రాలేదన్న విషయంపై మాత్రం స్పష్టత లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ పూర్తయిన తరువాత ట్రయల్ కోర్టు 2002లో జీవించి ఉన్న నలుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షగా విధించింది. నిందితులు ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేశారు కానీ.. కేసు అక్కడ పెండింగ్లో ఉండగానే ముగ్గురు మరణించారు. దీంతో సైమన్ సోరేన్ ఒక్కడే మిగిలిపోయాడు. సుమారు 22 ఏళ్ల తరువాత జార్ఖండ్ హైకోర్టు 2024 అక్టోబరు 28న సైమన్ సోరేన్ అప్పీల్ను కొట్టివేస్తూ ట్రయల్కోర్టు ఇచ్చిన శిక్షను ఖరారు చేసింది. అప్పటికి సోరేన్ వయసు దాదాపు డెబ్భై ఏళ్లు! అనేక అనారోగ్యాలతో బాధపడుతూ జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కస్టడీలోకి వెళ్లారు.కస్టడీలో రెండేళ్లు మాత్రమేసైమన్ సోరేన్కు శిక్ష ఖరారైన తరువాత కస్టడీలో ఉన్నది కేవలం రెండేళ్ల నాలుగు నెలలు, 12 రోజులు మాత్రమేనని సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టు 19న జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ వినోద్ కే చంద్రన్ల ధర్మాసనం తుది తీర్పునిస్తూ... దాదాపు 45 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు ‘‘న్యాయ వ్యవస్థ వైఫల్యాన్ని’’ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించింది. నేరానికి శిక్ష పడేందుకు విచారణ పేరుతో 22 ఏళ్లు పడితే.. అప్పీళ్లలో ఇంకో 22 ఏళ్లు గడిచిపోయిందని వ్యాఖ్యానించింది. సైమన్ సోరెన్ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. బెయిల్పై ఉన్న సమయంలో ఎలాంటి నేరానికి పాల్పడకూడదనే షరతుతో, వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సెపె్టంబరు 18కి వాయిదా వేసింది. -
20 మంది టీఎంసీ రెబల్స్కు నోటీసులు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తిరుగుబాటు లేవదీసి తర్వాత మరో పార్టీకి మద్దతు ప్రకటించిన 20 మంది ఎంపీలకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యాన్ని సవాల్ చేస్తూ టీఎంపీ ఎంపీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ పిటిషన్లో ప్రతివాదులుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడానికి ధర్మాసనం సిద్ధపడింది. అయితే స్పీకర్ తరఫున తాను కోర్టులో వాదనలు విన్పిస్తానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇవ్వడంతో నోటీసులు ఇవ్వాలన్న తన నిర్ణయాన్ని ధర్మాసనం ఉపసంహరించుకుంది.‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా మేము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదు. కానీ, నిర్ణిత కాలవ్యవధిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి అయ్యేలా చూడటమే మా ప్రధాన ఉద్దేశం’’అని జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ అన్నారు. తిరుగుబావుటా ఎగరేసిన 20 మంది నేతలు టీఎంసీ టికెట్పై గెలుపొందారు. టీఎంసీ అధికారం కోల్పోగానే ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ) పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం తెల్సిందే. -
మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా?
భారతదేశంలో రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేయగల అత్యంత శక్తిమంతులలో ఒకరిగా పేరొందిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థ డిపాజిట్ల సేకరణ కేసులో, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం ఫలించినట్లా? కాదా? ఈ కేసును సుప్రింకోర్టు కొట్టివేయడంతో న్యాయం గెలిచిందని, సత్యం గెలిచిందని ఈనాడు మీడియా ప్రముఖంగా ప్రచారం చేసుకుంది. తప్పులేదు. ఎందుకంటే వారి గ్రూప్ సంస్థ కనుక తమకు అనుకూలంగా ఎట్టకేలకు తీర్పు వచ్చిందన్న భావనతో ప్రజలలో దీనిపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాన్ని తొలగించేందుకు ఆ మీడియా యత్నించింది. కాని అంత మాత్రాన చేసిన తప్పు, తప్పు కాకుండా పోతుందా? అన్నది చర్చనీయాంశం.ఈ తీర్పుపై ఉండవల్లి ఇచ్చిన విశ్లేషణ, ఆయన వేసిన ప్రశ్నలకు మార్గదర్శి సంస్థ తరపున ఈనాడు మీడియా సమాధానం ఇస్తే అప్పుడు ప్రజలు ఇందులో రామోజీరావు తప్పు చేశారా? లేదా? అన్నది ఆలోచించుకుంటారు. కాని అటువైపు నుంచి స్పందన కనిపించలేదు. మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఈ కేసు తీర్పు, ఉండవల్లి పోరాటంపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రామోజీరావుపై ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన అలుపెరగని పోరాటానికి చివరకు తెరపడిందని, ఈ కేసును ఇంత దూరం తీసుకురాగలుగుతారని తాను అసలు అనుకోలేదని, కేసులో ఉన్న పటిష్టత, ఉండవల్లి పడిన శ్రమ మాత్రమే దీన్ని ఇన్నాళ్లు నడిపించాయని ఆయన కొనియాడారు.మంది మార్బలం, అపారమైన శక్తి ఉన్న రామోజీరావు ఎక్కడ? ఒంటరిగా పోరాడిన ఉండవల్లి ఎక్కడ? అని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఈ పోరాటాన్ని బైబిల్లోని 'గోలియత్-డేవిడ్' యుద్ధంతో పోల్చారు. బైబిల్లో డేవిడ్ గెలిచి ఉండవచ్చు కానీ, నిజజీవితంలో ఎప్పుడూ గోలియత్లదే (బలవంతులదే) విజయం అవుతుందని న్యాయపరమైన ముగింపును ఉద్దేశించి ఐవైఆర్ కృష్ణారావు నిగూఢ వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా ఈ కేసు వీగిపోవడానికి లేదా ముగియడానికి అనేక కారణాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలోనే మొత్తం సూక్ష్మం అంతా కనిపిస్తుంది కదా! రామోజీరావు తప్పు చేయలేదన్నట్లుగా ఈనాడు ప్రొజెక్టు చేసుకోవడాన్ని ఉండవల్లి ప్రస్తావించి, తప్పు చేయకపోతే ఈటీవీ షేర్లను విక్రయించి డిపాజిట్ దారులకు డబ్బు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే డిపాజిట్లు తిరిగి చెల్లించివేస్తామని సుప్రింకోర్టును ఎందుకు వేడుకున్నారన్నది ఆయన ప్రశ్న?అంతేకాక ఫైనాన్స్ సంస్థను ఎందుకు మూసివేశారని ఆయన అడుగుతున్నారు. డిపాజిట్ల సేకరణ చేయవచ్చని ఏ కోర్టు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవి నిజమా? కాదా? ఉండవల్లి అడిగిన ప్రశ్నలన్నీ హేతుబద్దంగా ఉన్నాయి కదా! వీటికి రామోజీరావు కుమారుడు కిరణ్ తన మీడియాలో జవాబు ఇస్తే బాగుంటుంది కదా! ఇక్కడ అసలు సమస్య 2600 కోట్ల డిపాజిట్లు తిరిగి చెల్లించారా?లేదా? అన్నది కాదు. చట్టం ప్రకారం డిపాజిట్ల సేకరణ తప్పా? కాదా? అన్నదే. మామూలుగా అయితే రామోజీ ఎంతమాత్రం ఎవరికి లొంగకూడదని అనుకుంటారు. బ్రేక్ ద లా లాఫుల్లీ అన్నది తన విధానం అని ఆయా సందర్భాలలో సన్నిహితులతో రామోజీ అనేవారని చెబుతారు. అంటే ఎక్కడా దొరకకుండా, చట్టంలోని లొసుగులను వాడుకోవాలన్నది ఆయన ధీరీ అన్నమాట.ఆయనకు రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉందన్నది ఎనలేని సత్యం. ఆయన చేసింది సక్రమమా? అక్రమమా? అన్నదానితో నిమిత్తం లేకుండా తెలుగుదేశం మద్దతు ఇస్తుంటుందన్నది చాలామంది భావన. ఒకప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకినని రామోజీ ప్రకటించుకున్నా, ఆ తర్వాత కాలంలో ఆ పార్టీకి చెందినవారు కొందరితో కూడా సత్సంబంధాలు నెరపి, తన వ్యాపార అవసరాలకు వాడుకునేవారని అంటారు. తెలంగాణలో టీఆర్ఎస్తో కూడా చాలావరకు మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యాక రామోజీ గ్రూప్కు పూర్తి సహకారం లభించసాగింది. అందువల్లే రామోజీ మరణించిన తర్వాత ఆ సంస్థకు అనుకూలంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానంలో అఫిడవిట్లు వేశాయన్నది న్యాయనిపుణుల అభిప్రాయంగా ఉంది.ఇక కేంద్రంలోని బీజేపీతో కూడా ఈ గ్రూపు సఖ్యతతో ఉంటుంది. ఇదంతా తనకు ఉన్న మీడియా బలంతోనే అన్నది బహిరంగ రహస్యమే. బహుశా అందువల్లేనేమో కొంతకాలం క్రితం వరకు డిపాజిట్ల సేకరణ కేసులో రిజర్వ్ బ్యాంక్ హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించి సెక్షన్ 45 ఎస్ కింద హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయడం చెల్లదని స్పష్టం చేసేది. కాని అదే రిజర్వుబ్యాంకు ఈ కేసును ఇకపై తాము పట్టించుకోబోమని ఉండవల్లి రాసిన ఒక లేఖకు బదులుగా చెప్పిందంటే ఏమిటి అర్దం?రామోజీ గ్రూప్నకు ఉన్న పరపతి, రాజకీయ పలుకుబడి ముందు తాము నిలబడ లేకపోతున్నామని ఆర్బీఐ అంగీకరించడమే కదా!రామోజీ మరణించినందున ఆయనపై క్రిమినల్ కేసు కొనసాగదన్నది తెలిసిన విషయమే. కాని ఆయన సంస్థ చేసిన తప్పులపై కేసు కొనసాగుతుందని గతంలో కోర్టువారు ఇచ్చిన ఒక తీర్పును ఉండవల్లి ఉదహరించారు. నిజానికి ఉండవల్లి చేస్తున్న పోరాటం ఏమిటి?మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లు వసూలు చేయడం సక్రమమా? అక్రమమా? కేంద్రం తీసుకు వచ్చిన చట్టాన్ని రామోజీ అతిక్రమించారా? లేదా? అన్నది తేల్చాలనే! రామోజీ జీవించి ఉన్నప్పుడు కూడా ఉండవల్లి ఒక మాట చెప్పేవారు. రామోజీని జైలులో పెట్టాలని తాను కోరుకోవడం లేదని, కాని ఈ డిపాజిట్ల కేసును నిగ్గు తేల్చడం ద్వారా ఇకపై అలా ఎవరూ డిపాజిట్లు వసూలు చేయకుండా చూడాలన్నదే తన ఉద్దేశం అని ఆయన అనేవారు. ఎందుకంటే అక్రమ డిపాజిట్లు వసూలు చేసినవారికి రెట్టింపు జరిమానా వేయాలని రిజర్వుబ్యాంక్ చట్టం సెక్షన్ 45 ఎస్ చెబుతోంది. దీనిని ఎవరికైనా ఒకేరకంగా వర్తింప చేయాలన్నది ఉండవల్లి డిమాండ్.సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సెక్షన్ 45 ఎస్ గురించి కాకుండా, ఉండవల్లికి ఈ కేసుతో ఏమి సంబంధం అన్నదానిపైనే ఇచ్చినట్లుగా ఉంది. తాను కేసు ఫిర్యాదుదారుడినని గతంలోనే కోర్టుకు తెలిపానని, దానిని పరిగణనలోకి తీసుకున్నందునే ఇంతకాలం కేసు సాగిందని ఆయన అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే కొన్ని నెలల క్రితం వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసిన ఒక ప్రశ్నకు రిజర్వుబ్యాంక్ సమాధానం ఇస్తూ హెచ్యూఎఫ్లు, అనధికార సంస్థలు డిపాజిట్లు వసూలు చేయరాదని, అది చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసిందని ఆయన వివరించారు. దీని ఆధారంగా తాను పార్లమెంటు ఫైనాన్స్ కమిటీ సభ్యులను అప్రోచ్ అయి, ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ తన వైఖరి ఎందుకు మార్చుకుందో తెలుసుకోవాలని కోరతానని ఉండవల్లి తెలిపారు.రామోజీరావు మరణించేవరకు సెక్షన్ 45 ఎస్ తమకు వర్తించదని వాదించేవారని, తర్వాత వారసులు కొత్త వాదన తీసుకువచ్చి ఆయన చేసిన తప్పులకు తమకు సంబంధం ఏమిటని అన్నారని ఉండవల్లి పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో తప్పు చేసినా జరిమానా కట్టకుండా రామోజీ సంస్థ తప్పించుకుందన్నది విశ్లేషణగా ఉంటుంది. అన్నిటిని పరిశీలిస్తే ఉండవల్లి ఇంతవరకు చేసిన పోరాటానికి.. పూర్తి స్థాయిలో అర్ధవంతమైన ముగింపు వచ్చి ఉండకపోవచ్చు కాని, ఆయన చేసిన పోరాట స్పూర్తి మాత్రం ఎప్పటికి కొనసాగుతుంది. రామోజీ వంటి బలాఢ్యులు సైతం తప్పు చేస్తే, దానిని ఒప్పుకోకతప్పదని కూడా ఈ కేసు సారాంశంగా తీసుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
YSRCP సోషల్ మీడియా పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
ఫ్రిడ్జ్లో మృతదేహం కేసుపై సుప్రీంలో తీర్పు రిజర్వ్
సాక్షి, న్యూఢిల్లీ: సుమారు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడి కిడ్నాప్, హత్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో దాచిన ఈ అమానుష ఘటనలో ప్రధాన నిందితుడు కొండపాక శ్రీధర్ అలియాస్ శేఖర్ (ఏ1) దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. కింది కోర్టు విధించిన జీవిత ఖైదును ఉమ్మడి హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు లోపాలు, సాక్ష్యాధారాల లేమిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తుది తీర్పును వాయిదా వేసింది.సుప్రీంలో సుదీర్ఘ వాదనలు..విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యా యవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితుల్లో ఒకరు విచారణ దశలోనే చనిపోయాడని, మిగిలిన ఐదుగురికి కింది కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసిందన్నారు. కానీ.. పైకోర్టు నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, శ్రీధర్కు మాత్రమే శిక్షను సమర్థించిందని తెలిపారు. అతడు ప్లాట్ను అద్దెకు తీసుకున్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, ఇప్పటికే 16 ఏళ్లుగా జైలుకే పరిమితమయ్యాడని, బెయిల్ వచ్చినా పూచీకత్తు సమర్పించలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ.. ఘట నా స్థలంలోని ఫ్రిడ్జ్పై ఉన్న వేలిముద్రలు శ్రీధర్వేనని ఫొరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిందన్నా రు. ఘటనకు ముందు బాధితుడిని నిందితుడే ప్లాట్కు తీసుకెళ్లడాన్ని వాచ్మన్ చూశాడని, మృతుడికి చెందిన ఆర్టీసీ బస్ పాస్ కూడా నిందితుడి వద్దే లభ్యమైందని కోర్టు దష్టికి తీసుకొచ్చారు.ధర్మాసనం వ్యాఖ్యలు..వాదనలు విన్న జస్టిస్ పార్దివాలా ధర్మాసనం పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. కింది కోర్టు శిక్ష పడిన నలుగురిని హై కోర్టు విడుదల చేస్తే వారిపై ప్రభుత్వం ఎందుకు అప్పీల్కు వెళ్లలేదని నిలదీసింది. సహ నిందితులను వదిలేసి.. ఒకే వ్యక్తిపై హత్యానేరా న్ని ఎలా నిర్ధారిస్తారని వ్యాఖ్యానించింది. ఇంటి ఓనర్కు నిందితుడు ఎవరో తెలియదని, కేవలం వాచ్మన్ మాత్రమే చూశానని చెప్పడాన్ని ‘లాస్ట్ సీన్’ కింద మాత్రమే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. మృతుడికి చెందిన బస్ పా స్ నిందితుడికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలంటూ ప్రాసిక్యూషన్ను ప్రశ్నించింది. సరైన ఆధారాలు నిరూపించకుండా 16 ఏళ్లుగా ఒక వ్యక్తి జైలులో ఉండటంపై స్పంది స్తూ.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.గతంలో ఏం జరిగిందంటే..: 2011 జూన్లో జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్కు వచ్చి అదశ్యమయ్యాడు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో.. బాధితుడి తండ్రి రూ.1.50లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఆ బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉప్పల్లోని ఓ అపార్ట్మెంట్లో గాలింపు చేపట్టారు. అక్కడి 402వ నంబరు ప్లాట్లోని ఫ్రిడ్జ్లో శ్రీనివాస్ మృతదేహం ప్లాస్టిక్ కవర్లు, వైర్లతో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో కరీంనగర్ కోర్టు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. అయితే సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటాలకు సంబంధించి 65–బీ సర్టిఫికెట్ లేకపోవడంతో పాటు పలు సాంకేతిక కారణాలతో హై కోర్టు నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్లాట్ అద్దెకు తీసుకున్నది, బాధితుడిని చివరిసారిగా అక్కడికి తీసుకెళ్లింది శ్రీధర్ కావడంతో సెక్షన్ 106 కింద అతడి శిక్షను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ తీ ర్పుపైనే శ్రీధర్ సుప్రీంను ఆశ్రయించాడు. కొడుకు వరుసైన వ్యక్తితో భార్య అక్రమ సంబంధం -
1,712 కేసుల పరిష్కారం
న్యూఢిల్లీ: ఈ ఏడాదికిగాను సర్వోన్నత న్యాయస్థానంలో నిర్వహించిన సమాధాన్ సమారోహ్ ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో మూడ్రోజుల్లోనే ఏకంగా 1,712 కేసులను పరిష్కరించారు. మొత్తం 1,712 కేసులకు తీర్పులివ్వడం లేదా విచారణార్హమైనవి కావని తేలిన పక్షంలో తిరస్కరించడమూ చేశారు. ఆగస్ట్ 21వ తేదీ నుంచి 23వ తేదీదాకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్గదర్శకంలో ఈ లోక్అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సుప్రీంకోర్టు సోమవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. సత్వరం సెటెల్మెంట్ చేయగల ఆస్కారమున్న కేసులను ఒక జాబితాగా సిద్ధంచేసి కక్షిదారులు, ప్రత్యర్థి పార్టీలను పిలిపించి వేగంగా కేసులను పరిష్కరించారు. ఈ మూడ్రోజుల్లో విచారణ కోసం 3,285 కేసులను సిద్ధంచేయగా కాలావధిలోపు 1,664 కేసులకు తీర్పులు ఇవ్వడం లేదా తిరస్కరించడం చేశారు. మిగతా 48 కేసులన మధ్యవర్తిత్వం మార్గం ద్వారా రాజీ కుదిర్చి కేసులకు ముగింపు పలికారు. దీంతో పరిష్కారభాగ్యం దక్కిన కేసుల సంఖ్య 1,712కు పెరిగింది. ఈ మొత్తం కేసులతో ముడిపడిన రూ.240.94 కోట్ల విలువైన స్థిర,చరాస్థులకు సైతం సుప్రీంకోర్టు పరిష్కారాలు చూపింది. లోక్అదాలత్కు సీజేఐ నేతృత్వం వహించారు. ఈయనతోపాటు సీనియర్ జడ్జీలు, ఇతర జడ్జీలు, సీనియర్ న్యాయవాదులు, అడ్వకేట్స్–ఆన్–రికార్డ్, సీనియర్ రిజి్రస్టార్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ లోక్ అదాలత్లో భాగస్వాములయ్యారు. మధ్యవర్తిత్వం, రాజీ, ఏకాభప్రాయం ద్వారా కొన్ని కేసులు పరిష్కారమయ్యాయి. వివాహ సంబంధ, స్థిరచరాస్థి తగాదాలు, యాక్సిడెంట్లు, భూ వివాదాలు, నష్టపరిహారాలు, పన్నులు, సేవలు, కారి్మకులకు సంబంధించిన కేసులను ఈ లోక్అదాలత్లో పరిష్కరించారు. లోక్అదాలత్లో ఇరు పక్షాల కాలం, డబ్బు, శ్రమ, మానసిక క్షోభ, నిరీక్షణ అన్ని తప్పుతాయని కోర్టు వ్యాఖ్యానించింది. -
CJP లాఠీ ఛార్జ్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
-
తమిళనాడుకు సుప్రీంకోర్టు షాక్
సాక్షి, ఢిల్లీ: కావేరీ నదీ జలాల విడుదల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీటి వాటా విడుదలలో ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) ముందే లేవనెత్తాలని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కర్ణాటక నుంచి తమకు రావాల్సిన అదనపు నిష్పత్తి నీటి వాటాను విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.వివరాల్లోకి వెళితే.. కావేరీ నీటి నియంత్రణ కమిటీ (CWRC) ఆగస్టు 12 నుండి 15 రోజుల పాటు ప్రతిరోజూ తమిళనాడుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కూడా సమర్థించింది. అయితే వాటా న్యాయపరంగా తమకు దక్కడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ, తమకు దక్కాల్సిన సరైన నిష్పత్తిలో నీరు అందడం లేదని ధర్మాసనానికి తెలిపారు. దురదృష్టవశాత్తూ క్షేత్రస్థాయిలో నీటి విడుదల సక్రమంగా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశాన్ని సంబంధిత అథారిటీ (CWMA) సమావేశంలోనే లేవనెత్తాలని సుప్రీంకోర్టు సూచించింది.గత విచారణలో కర్ణాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ సమర్పించిన నీటి విడుదల వివరాల చార్ట్ను ధర్మాసనం ప్రస్తావించింది. ఆ చార్ట్ ప్రకారం CWMA ఆదేశాల మేరకే తమిళనాడుకు నీటిని విడుదల చేసినట్లు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. దీనిపై వైద్యనాథన్ స్పందిస్తూ, నిష్పత్తి ప్రకారం నీటిని విడుదల చేయడానికి CWMA దిశా నిర్దేశం చేయడం లేదని, దీనివల్ల తమిళనాడులోని రైతులకు తాము ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేకపోతున్నామని, కానీ కర్ణాటక మాత్రం తమ రైతులకు నీటిని ఇచ్చుకుంటోందని వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేస్తూ, ఆ రోజు నాటికి తాజా పరిస్థితిపై నివేదిక (అప్డేటెడ్ స్టేటస్) సమర్పించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది.అంతకుముందు ఆగస్టు 17న జరిగిన విచారణలో కూడా CWMA ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, వర్షపాతం తక్కువగా ఉన్న ఈ సంవత్సరంలో తమకు రావలసిన న్యాయమైన వాటా దక్కడం లేదు. CWRC కేటాయించిన పరిమాణం కంటే, పొరుగున ఉన్న కర్ణాటక విడుదల చేసిన నీటి పరిమాణం చాలా తక్కువగా ఉందని తమిళనాడు తన పిటిషన్లో పేర్కొంది.జూలై 28న జరిగిన CWRC సమావేశంలో జూలై 29 నుండి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినప్పటికీ, జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు బిలిగుండ్లు వద్ద కేవలం 158 నుండి 550 క్యూసెక్కుల లోపే నీరు అందిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని, హారంగి, హేమవతి జలాశయాలలో మొత్తం నీటి నిల్వ 77.537 టీఎంసీలుగా ఉంది. కాబట్టి తమిళనాడుకు చెందాల్సిన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయడానికి కర్ణాటకకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని డ్యామ్ల క్యాచ్మెంట్ ఏరియాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, బిలిగుండ్లు వద్ద తమిళనాడుకు అందాల్సిన నిష్పత్తి నీరు 26.954 టీఎంసీలుగా ఉండాలని పేర్కొంది. దీనితో పోలిస్తే కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కేటాయించిన 4.536 టీఎంసీలు చాలా తక్కువని తమిళనాడు ఆరోపించింది. మొత్తంగా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు ఇవ్వాల్సిన 26.954 టీఎంసీల న్యాయమైన వాటాను పంచుకోవడంలో విఫలమైందని తమిళనాడు ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. -
యుమునా నది వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2016లో ఢిల్లీలోని యమునా నది వరద మైదానాల్లో నిర్వహించిన ‘వరల్డ్ కల్చర్ ఫెస్టివల్’ కారణంగా పర్యావరణానికి నష్టం జరిగిందన్న ఆరోపణలపై విధించిన రూ.5 కోట్ల జరిమానాను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం వల్ల యమునా నది సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు నష్టం జరిగినట్లు నిర్ధారించే ప్రత్యక్ష ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలోని రిజిస్టర్డ్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యక్తి వికాస్ కేంద్ర చెల్లించిన రూ.5 కోట్ల మొత్తాన్ని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ రోజు శనివారం ఈకేసును విచారించిన సుప్రీంక్రోర్టు కీలక తీర్పు ఇచ్చింది.2017లో ఎన్జీటీ జరిమానా2016 మార్చి 11 నుంచి 13 వరకు ఢిల్లీలో యమునా నది ఒడ్డున ‘వరల్డ్ కల్చర్ ఫెస్టివల్’ నిర్వహించారు. కార్యక్రమం కోసం యమునా వరద మైదానాలను సిద్ధం చేయడం వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) 2017 డిసెంబర్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ను నష్టానికి బాధ్యులుగా పేర్కొంది. పర్యావరణ నష్టానికి పరిహారంగా రూ.5 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తాజాగా ఆ కేసులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తప్పిదమేమి లేదని తేల్చింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని కార్యక్రమంతో నేరుగా అనుసంధానించే ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.DDAపైనాా సుప్రీంకోర్టు ఆగ్రహంఈ సందర్భంగా యమునా వరద మైదానాలను పరిరక్షించడంలో DDA తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.అదే సమయంలో, యమునా వరద మైదానాల పునరుద్ధరణకు సంబంధించి NGT ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేపట్టిన పనులను DDA కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారం చాలా ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో ఎన్నో ఏళ్లపాటు న్యాయపోరాటంగా కొనసాగగా తాజా సుప్రీం తీర్పుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు ఉపశమనం లభించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ 1981లో స్థాపించారు. -
కేసులను ఎత్తేయాల్సిందే
న్యూఢిల్లీ: చలో సంసద్ ర్యాలీ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత వేళ విద్యార్థులపై పోలీసులు మోపిన కేసులను రద్దుచేసేందుకు సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తంచేసినా అందుకు మోదీ ప్రభుత్వం సముఖంగా లేదని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘జూలై 25న సీజేపీకి మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ దిశలో ఆలోచనచేసిన సుప్రీంకోర్టు ఎదుట ప్రభుత్వం మోకాలడ్డొద్దు. అలా చేస్తే సీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ రెండ్రోజుల్లో సమావేశమై మళ్లీ జాతీయస్థాయి ఉద్యమానికి రంగం సిద్ధంచేస్తుంది’’అని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల జాబితా ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరితే ప్రభుత్వం ఆ జాబితాను ఉద్దేశపూర్వకంగా అందజేయలేదు. జాబితా ఇస్తే ఆ కేసులన్నింటినీ 142వ అధికరణం ద్వారా దఖలుపడిన అధికారం ద్వారా రద్దుచేస్తామని కోర్టు మంగళవారం మూడు సార్లు గుర్తుచేసి, జాబితా అడిగినా ప్రభుత్వం సమర్పించలేదు. ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయాలకు తగ్గట్లే దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులు మాట ఇచ్చి తప్పారు. యావత్ భారత దేశ యువత నమ్మకంతో ఆటలాడతామంటే మేం చూస్తూ ఊరుకోం. ఇకనైనా కోర్టు నియమించిన హైపవర్ కమిటీలో సీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. పోలీసుల దారుణాలను వివరించే అవకాశం ఇవ్వాలి’’అని దాస్ కోరారు. -
పోలీస్ చర్యపై దర్యాప్తుకు హైపవర్ కమిటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో పార్లమెంట్ ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు చలో సంసద్ ర్యాలీగా దూసుకొచ్చిన విద్యార్థులను పోలీసులు బాష్పవాయుగోళాలతో అడ్డుకుని లాఠీచార్జ్ చేసి విచక్షణారహితంగా చితకబాదారన్న ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. పార్లమెంట్ సాక్షిగా ఉద్యమకారులపై ఢిల్లీ పోలీసుల అతి బలప్రయోగం ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు అత్యున్నతస్థాయి(హైపవర్) కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ప్రకటించింది. పోలీసుల అత్యుత్సాహంతో వందలాది మంది గాయాలపాలయ్యారని, ఈ ఘటనలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహనల బెంచ్ విచారించి పై విధంగా ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టులో, హైకోర్టులో పదవీవిరమణ చేసిన న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్లను సభ్యులుగా ఎంపికచేస్తూ హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు బెంచ్ తెలిపింది. ర్యాలీలో బాధితులుగా మారిన ఉద్యమకారులు నేరుగా ఈ కమిటీని సంప్రదించి తమ ఫిర్యాదులు, ఆరోపణలు తెలియజేయవచ్చు. కమిటీ ఇచ్చే సిఫార్సులను కోర్టు పరిశీలిస్తుంది. తగు చట్టబద్ధమైన నిర్ణయాలను మేం తీసుకుంటాం’’అని ధర్మాసనం తెలిపింది. ‘‘ఉద్యమిస్తున్న మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలపైనా కమిటీ దర్యాప్తు చేయనుంది. ఉద్యమకారిణులను ఆన్లైన్లో వేధించిన ఉదంతాలు, సోషల్మీడియా ద్వారా బెదిరించిన ఘటనలనూ, మహిళా కార్యకర్తలు చేసిన ఫిర్యాదులనూ హైపవర్ కమిటీ పరిశీలిస్తుంది. పరీక్షార్థుల ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రతి కోణంలోనూ కమిటీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఉదంతంలో నేరస్తులుగా తేలిన వారిపై కఠిన శిక్షలుంటాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిని గుర్తించేందుకు జూలై 20వ తేదీనాటి ఘటనాస్థలి ఫొటోలు, వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను హైపవర్ కమిటీకి ఢిల్లీపోలీసులు అందజేయాలి’’అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సీజేఐ సూర్యకాంత్ ఆదేశించారు. వాళ్లకెంతో భవిష్యత్ ఉంది.. ఈ సందర్భంగా విద్యార్థులపై మోపిన కేసులను ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. అక్రమ ఎఫ్ఐఆర్లను తొలగించాల్సిన సమయమిది. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం నిరసన తెలిపే హక్కు విద్యార్థులు, పరీక్షార్థులకు ఉంది. అనవసరంగా విద్యార్థులపై మోపిన ఎఫ్ఐఆర్లను తొలగించే హక్కు రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంది’’అని ధర్మాసనం గుర్తుచేసింది.కేసుల మాఫీపై సొలిసిటర్ జనరల్ తుషార్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ఆ రోజు ఆందోళనల్లో 2,800 మంది అసాంఘీక శక్తుల పాత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాళ్లకు నేర చరిత్ర ఉంది. జూలై 20న సంసద్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీయానికి వీళ్లే కారణం. వీళ్లను గుర్తించేందుకు ఫేíషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, నిఘా సాధనాలను ఉపయోగించాల్సి వచ్చింది’’అని తెలిపారు. దీనిపై కోర్టు స్పష్టతనిచ్చింది. ఫేíషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, నిఘా, ప్రైవసీ అనే అంశాలు ఈ కేసులో ఉల్లంఘనకు గురయ్యాయా లేదా అనేవి కమిటీ నిర్ణయించదు. కోర్టు నిర్ణయిస్తుంది’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.సమర్ధించుకున్న ఢిల్లీ పోలీసులు విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ కౌంటర్ అఫిడవిట్ సమరి్పంచారు. ‘‘ఆరోజు జంతర్మంతర్ వద్ద 30,000 మందికిపైగా నిరసనకారులు గుమిగూడారు. సంసద్ ర్యాలీకి అనుమతి లేదు. విద్యార్థులను నియంత్రించేందుకు సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. బారికేడ్లు తోసేసి పార్లమెంట్ దిశగా దూసుకొస్తున్న నిరసనకారులను నిలువరించగా తోపులాట జరిగింది.ఈ ఘటనలో 240 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. 200 మంది పౌరులు, నిరసనకారులు సైతం గాయపడ్డారు. ఉద్యమంలో సంఘవిద్రోహ శక్తులు, నేరచరితులు చొరబడ్డారు. వీరిలో 2,873 మందిపై గతంలోనే క్రిమినల్ కేసులు ఉన్నాయి’’అని పోలీసులు తెలిపారు. నిరసనల సమయంలో సాధారణ దుస్తుల్లో లాఠీలతో కనిపించిన పోలీసు సిబ్బందికి సంబంధించిన వీడియోలపై కూడా ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.ఇలా సాధారణ దుస్తుల్లో పోలీసులను గుంపుల్లో కలిపి విధులు నిర్వహించడం చట్టవిరుద్ధం కాదని, అసాధారణమైన చర్య కూడా కాదని పేర్కొన్నారు. పార్లమెంట్, రాష్ట్రపతిభవన్, సేవా తీర్థ్, కర్తవ్యభవన్, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర మంత్రుల అధికారిక నివాసాలున్న ఆ ప్రాంతంలో అవాంఛనీయ ఘటన జరక్కుండా తాము సరైన నిర్ణయమే తీసుకున్నట్లు పోలీసులు తమ చర్యను సమర్ధించుకున్నారు. -
ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట.. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు..
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(73)ను వైద్య పరీక్షల కోసం ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ను ఆసుపత్రిలో చేర్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. జైలు అధికారులు ఆయన కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి సమావేశం అయ్యేలా చూడాలని కూడా ఆదేశించింది. 2023 నుంచి ఖాన్ అదియాలా జైలులో ఉన్నారు. అల్-ఖాదిర్ ట్రస్ట్, ప్రభుత్వ బహుమతుల కేసుల్లో అవినీతి, అధికారిక ప్రభుత్వ రహస్యాల లీక్, చట్టవిరుద్ధ వివాహం సహా పలు నేరారోపణలు, పెండింగ్ కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు.మంగళవారం కోర్టు వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ బోర్డులో ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడు, ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించింది. కంటి సమస్యకు చికిత్స కోసం ఇంతకుముందు కూడా ఆయనను ఇస్లామాబాద్లోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి పలుసార్లు తరలించారు. ఆయనకు కుడి కంటిలోని కేంద్ర రెటీనా సిరలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడిన సమస్య ఉంది. ఈ సమస్య తొలిసారిగా జనవరి చివర్లో వెలుగులోకి వచ్చింది. అదియాలా జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడుతోందని గతంలో తెలిపారు. ఆయన కంటిలో స్పష్టమైన మెరుగుదల కనిపించిందని, చూపు దాదాపు సాధారణ స్థితికి తిరిగి వచ్చిందని చెప్పారు. -
సీజేపీ నిరసనలపై స్వతంత్ర దర్యాప్తు.. సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తి, డీజీపీ నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరగనుంది. మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలపై సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ ఆందోళనలో 240 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని అఫిడవిట్లో పేర్కొన్నారు. 5 వేల మంది భద్రత సిబ్బంది విధుల్లో ఉన్నారని వెల్లడించారు. నిరసనకారులపై అత్యంత నియంత్రణతో అవసరమైన బలగాలను మాత్రమే ఏర్పాటు చేసినట్టు అఫిడవిట్లో ఢిల్లీ పోలీసులు చెప్పారు. NEET-UG CBSE పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనలు తెలిపారని అఫిడవిట్ లో పేర్కొన్నారు పోలీసులు.జూన్ 20న సాయంత్రం 5 గంటల వరకు ధర్నాకు అనుమతి ఇచ్చినప్పటికీ నిరసనకారులు ఖాళీ చేయలేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. జులై 20న 'చలో సంసద్' మార్చ్ పిలుపుతో ఉద్రిక్తత పెరిగిందని, ఈ మార్చ్కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఒక ప్రభుత్వ భవనాన్ని ధ్వంసం చేసి అక్కడి ఇటుకలతో దాడి చేశారని అఫిడవిట్లో తెలిపారు. 30,000 మందికి పైగా నిరసనకారులు ఆందోళలో పాల్గొన్నారన్నారు. నిరసనకారులపై అధిక బల ప్రయోగం చేయలేదని, పార్లమెంట్ మార్చ్ చట్ట విరుద్ధమని తెలిపారు. -
తమిళనాడుకు కావేరి నీళ్లివ్వండి
సాక్షి బెంగళూరు: అసలే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న కర్ణాటకకు మరో షాక్ తగిలింది. తమిళనాడుకు నీటిని వదలాలని, ఈ మేరకు కావేరి నీటి నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఆర్సీ) ఆదేశాలను పాటించాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి రోజూ 12 వేల క్యూసెక్కులు తమిళనాడుకు వదలాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను పాటించాలని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా ప్రస్తుత స్థితిగతులపై నివేదిక సమర్పించాలని కూడా సూచన చేసింది. కొంత సమయం పడుతుంది : కర్ణాటక కర్ణాటక నుంచి ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్సీ సూచించినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తమిళనాడు తీసుకొచి్చంది. సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను కర్ణాటక పూర్తిగా పాటించడం లేదని ఆరోపించింది. దీనిపై బిళిగుండ్లు వద్ద నీటి పరిమాణం బాగా తగ్గిపోయిందని, తమిళనాడు కోరుతున్నట్లు 12 వేల క్యూసెక్కులు విడుదల చేసేందుకు కొంత సమయం పడుతుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కావేరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేక, రిజర్వాయర్లలో ఆశించిన మేర నీటి నిల్వలు లేవని పేర్కొంది. అయినా సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను పాటించేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీడబ్ల్యూఆర్సీ ఆదేశాల మేరకు ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కులు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టులో రాహుల్గాంధీకి భారీ ఊరట
సాక్షి, ఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు హైకోర్టు విచారణను కొనసాగించవద్దని అలహాబాద్ కోర్టుకు.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. సీబీఐ, ఈడీలు హైకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పించరాదని తెలిపింది. ఈ కేసును విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రాహుల్ గాంధీపై నమోదైన పిటిషన్ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం, ఈ ఆరోపణలపై సీబీఐ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించి నివేదికలు సమర్పించాలని, ఈడీ కూడా తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు అంత తీవ్రమైనవి అయితే మీ ఏజెన్సీలు ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నాయని ధర్మాసనం నిలదీసింది. "కోర్టు నుంచి ఆదేశాలు రావాల్సిందేనా? మీ అంతట మీరుగా సుమోటోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదా?" అని జస్టిస్ బాగ్చి దర్యాప్తు అధికారులను ప్రశ్నించారు.కోర్టులో ఇరు పక్షాల వాదనలు.. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ విఘ్నేష్ శిశిర్కు ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని ప్రశ్నించారు. ఇది చట్టబద్ధత లేని, పూర్తిగా కక్షసాధింపు చర్య అని, పిటిషనర్ పదేపదే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సీబీఐ కేవలం ఫిర్యాదును ధృవీకరించడం మించి ఏమీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి. రాజు వాదిస్తూ.. ఇప్పటివరకు ఈ కేసులో తమ పాత్రేమీ లేదని, ఒకవేళ ఫిర్యాదులో గమనించదగ్గ నేరాలు ఉన్నట్లు తేలితే అది చాలా తీవ్రమైన విషయమవుతుందని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీపై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలను ధృవీకరించాలని సీబీఐ, ఈడీలను ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ జూలై 20న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. సీబీఐ సమర్పించిన అఫిడవిట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, దీనిపై వ్యక్తిగతంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది. -
కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్.. విజయ్కు గుడ్న్యూస్
ఢిల్లీ: కావేరి జలాల విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు 12 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున కావేరి నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినట్లు సమాచారం.కావేరి నీటి విడుదలపై కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నీటి లభ్యత, రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై కర్ణాటక అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. కావేరి అథారిటీ నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.అసలు కథ ఇదే.. కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం ముదిరింది. సుప్రీంకోర్టు తాజాగా కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను కర్ణాటక అమలు చేయాలని స్పష్టం చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అసలు కావేరి నీటి విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంతటి వివాదం ఎందుకు? ఈ నీటి పంచాయితీ ఎక్కడ మొదలైంది?..బ్రిటిష్ కాలం నుంచే వివాదం.. కావేరి నది కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో పుట్టి.. కర్ణాటక, తమిళనాడు మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిపై ఆధారపడి రెండు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దీంతో కావేరి నీటి పంపకం రెండు రాష్ట్రాలకూ అత్యంత కీలకంగా మారింది. కావేరి నీటి పంపకంపై కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. బ్రిటిష్ కాలం నాటి 1892, 1924 ఒప్పందాల నుంచే నీటి వినియోగంపై విభేదాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న కర్ణాటకలో కొత్త ప్రాజెక్టులు, సాగు విస్తరణతో దిగువన ఉన్న తమిళనాడుకు నీటి లభ్యత తగ్గుతోందని ఆ రాష్ట్రం చాలాకాలంగా వాదిస్తోంది.1986లో తమిళనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో వివాదం అధికారికంగా అంతర్రాష్ట్ర జల వివాదంగా ముందుకు వచ్చింది. 1990లో కావేరి జల వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటైంది. 2007లో ట్రైబ్యునల్ తుది తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కూడా నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి మధ్య నీటి పంపకంపై న్యాయపోరాటం కొనసాగింది. 2018లో సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ అవార్డులో కొన్ని మార్పులు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. అనంతరం కేంద్రం కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, సంబంధిత వ్యవస్థలను ఏర్పాటు చేసింది. కావేరి నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సంస్థలు కీలకంగా మారాయి.కర్ణాటక అభ్యంతరం.. అయితే కావేరి నీటి పంపకం వర్షపాతంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో వర్షాలు తక్కువగా ఉండి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గినప్పుడు తమిళనాడుకు నీటిని విడుదల చేయడం తమ రైతులకు ఇబ్బందిగా మారుతుందని కర్ణాటక చెబుతోంది. మరోవైపు కావేరి డెల్టాలో పంటలకు నీరు అవసరమని, తమకు కేటాయించిన వాటాను కర్ణాటక విడుదల చేయాల్సిందేనని తమిళనాడు వాదిస్తోంది. తాజా వివాదంలో కర్ణాటక నుంచి తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ఆదేశాలపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను కర్ణాటక పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.కావేరి వివాదం కేవలం నీటి పంపకానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. రెండు రాష్ట్రాల రైతుల జీవనాధారం, ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయాలు ఈ అంశంతో ముడిపడి ఉన్నాయి. కర్ణాటకలో నీరు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగితే.. తమిళనాడులో తమకు రావాల్సిన నీటిని కర్ణాటక అడ్డుకుంటోందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందుకే ప్రతి ఏడాది వర్షాలు, జలాశయాల్లో నీటి నిల్వలు, పంటల అవసరాలు మారినప్పుడల్లా కావేరి వివాదం మళ్లీ తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి నీటి పంచాయితీ మరోసారి హాట్టాపిక్గా మారింది. -
సినిమాలో పాట లేదని కోర్టు మెట్లు ఎక్కిన మహిళ
ట్రైలర్లో ఉన్న పాట సినిమాలో లేకపోతే ఏం చేస్తారు? తిట్టుకుంటూ బయటకు వస్తారా? డబ్బులు వృథా అయ్యాయని బాధపడతారా? అయితే ఓ మహిళా ప్రేక్షకురాలు ఇలా చేయలేదు. కోర్టుకెక్కింది... వినియోగదారుగా తన హక్కుల కోసం పోరాడింది. ఆ పాట కోసం ఔరంగాబాద్ నుంచి ఢిల్లీ వరకు న్యాయ పోరాటం సాగించింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకు శుభం కార్డు పడింది.బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా యశ్రాజ్ ఫిలిమ్స్(వైఆర్ఎఫ్) 2016లో ‘ఫ్యాన్’ సినిమాను నిర్మించింది. సినిమా విడుదలకు ముందు టెలివిజన్, సోషల్ మీడియాలో ప్రమోషనల్ ట్రైలర్ విడుదల చేసింది. ట్రైలర్లోని ‘జబ్రా’ ఫ్యాన్ పాట సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఔరంగాబాద్కు చెందిన ఓ స్కూల్ టీచర్ ఈ ట్రైలర్ చూసి కుటుంబంతో సినిమాకు వెళ్లారు. సినిమా పూర్తయినా ఆ పాట మాత్రం రాలేదు. దీంతో ఆమె నిరుత్సాహానికి గురై జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.ట్రైలర్లోని పాటను తొలగించి చిత్ర నిర్మాణ సంస్థ మోసం చే సిందని , దీనివల్ల తాను మానసిక వేదనకు గురయ్యానని జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. రూ. 60,500 నష్టపరిహారం కోరారు. టికెట్ కొనుగోలు చేసినంత మాత్రాన నిర్మాత నేరుగా సేవలందించే సంస్థగా మారడని ఫోరం పేర్కొంది. వినియోగదారుడికి..సంస్థకు మధ్య ఎలాంటి చట్టబద్ధమైన హామీ లేదని.. కేసు చెల్లదని కేసు తిరస్కరించింది.ఫిర్యాదుదారుకు అనుకూలంగా..ఆ తీర్పుపై ఫిర్యాదుదారు రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. .సినిమా ప్రదర్శన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలోని ‘సేవ’ నిర్వచనం పరిధిలోకి వస్తుందని, వైఆర్ఎఫ్ ఆ సేవను అందించే సంస్థగా కమిషన్ పేర్కొంది. జబ్రాఫ్యాన్ పాటను తొలగించి సంస్థ ప్రేక్షకులను పక్కదోవ పట్టించింది. ఇది అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని అభిప్రాయపడింది. . పరిహారంగా రూ. 10,000, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 పిర్యాదుదారుకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)ను సంస్థ ఆశ్రయించింది. రాష్ట్ర కమిషన్ అభిప్రాయాన్నే ఎన్సీడీఆర్సీ కూడా సమర్థించింది.ఆఫర్.. అంగీకారం ఉండాలి..ఈ తీర్పుపై వైఆర్ఎఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైలర్ సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద రక్షణ ఉంటుందని పేర్కొంది. అయితే మోసపూరితమైన, అన్యాయమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు రాజ్యాంగ రక్షణ ఉండదని స్పష్టం చేసింది. ట్రైలర్ చూసి ప్రేక్షకుడు ప్రభావితం కావొచ్చు..కానీ చట్టబద్ధమైన హామీగా దీన్ని భావించలేమని కోర్టు వివరించింది. టికెట్ కొని సినిమా చూసే ప్రతీ వ్యక్తి వినియోగదారుడే అనడంలో సందేహం లేదని పేర్కొంది. సేవల్లో లోపం జరిగిందా? లేదా? అనేదే ఈ కేసులో కీలకాంశమని చెప్పింది.అసంపూర్ణత, నాణ్యతలో నాసిరకం, పనితీరు సక్రమంగా లేకపోవడం, తయారీలో తగిన ప్రమాణాలు పాటించకపోవడాన్నే సేవల్లో లోపంగా గుర్తించాలని పేర్కొంది. సినిమాలో ఆ పాట తప్పనిసరిగా ఉంటుందనేది ఫిర్యాదుదారు వ్యక్తిగత అంచనా మాత్రమే అని తెలిపింది. దీన్ని చట్టపరంగా సేవల్లో లోపంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.చట్టబద్ధమైన ఒప్పందం ఏర్పడాలంటే ‘ఆఫర్’ ఉండాలి..ఆ ఆఫర్ను మరో పక్షం అంగీకరించాలని చెప్పింది. ట్రైలర్ను ‘ఆఫర్’గా భావించలేమని అందువల్ల కాంట్రాక్టు చట్టం ప్రకారం ఈ వాదన సరైంది కాదని తేల్చింది. ప్రతి చిన్న తేడా లేదా ప్రతి నిరాశ ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ నిర్వచనం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రచారం, ప్రకటన, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పుడే అది ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ కిందకు వస్తుందని పేర్కొంది. ఈ కేసులో ఇవేవీ రుజువు కాలేదని వివరించింది.యశ్రాజ్ ఫిల్మ్స్ ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకులను మోసం చేసిందని, తప్పుదోవ పట్టించిందని నిరూపించే బలమైన ఆధారాలను ఫిర్యాదుదారు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. సినిమా నిర్మాణ ప్రక్రియలో ఉన్న పలు అంశాలు చివరి దశలో మారడం సహజమేనని కళాత్మక సేవలను సాధారణ సేవలతో పోల్చలేమని వివరించింది. అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్సీడీఆర్సీ ఉత్తర్వును రద్దు చేసింది. ప్రచార ట్రైలర్లో కనిపించిన పాట సినిమాలో లేకపోవడం సేవల్లో లోపం, అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు రాదని తీర్పు ఇచ్చింది.- దిలీప్ మాదిరెడ్డి -
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
సీఎం విజయ్ కు బిగ్ రిలీఫ్
-
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తామని తెలిపింది. రైతులకు అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొంది. భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పక్షానే అత్యున్నత ధర్మాసనం ఉంటుందని స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్ చట్టాలపై అభ్యంతరాలుంటే రైతులు కోర్టులను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. -
విజయ్ సర్కార్కు బిగ్ విక్టరీ
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు బిగ్ రిలీఫ్ లభించింది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు తమిళనాడు సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయంలో ఈ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కరూర్ బాధిత కుటుంబాలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సరైంది కాదని ఈ ఉద్యోగాలు చెల్లవని ఈ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.కాగా గతేడాది సెప్టెంబర్లో కరూర్లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు. ఆ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కరూర్ బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. బాధితులకు ఆర్ధిక సాయం అందించవచ్చు. కానీ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో మరణించినవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత, నిర్దేశిత నియామక ప్రక్రియ (TNPSC వంటి పరీక్షలు) ద్వారా రావాలే తప్ప, ఇలా ఉచితంగా పంచేది కాదని స్పష్టం చేసింది.ఇది సాధారణ అభ్యర్థుల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంతైనా ఆర్థిక సాయం అందించుకోవచ్చని, కానీ రాజ్యాంగ నిబంధనలు, పరిమితులను దాటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పెట్టేది కాదని వ్యాఖ్యానిస్తూ కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టేవిధించింది. దీంతో కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట లభించింది. -
డేరా బాబా విడుదలపై సుప్రీంకోర్టు సీరియస్!
న్యూఢిల్లీ: జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం స్పందన కోరింది. ఈ కేసుకు సంబంధించి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్తో పాటు సీబీఐ కూడా ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 2026 నవంబర్ 16వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.2002 అక్టోబర్లో జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ నవంబర్ 21న మృతి చెందారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయగా, 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్ రహీంతో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ రామ్ రహీమ్ హైకోర్టును ఆశ్రయించగా, తగినన్ని సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 2026 మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.దిగువ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసింది. కాగా, ఈ కేసులోని మరో ముగ్గురు దోషుల శిక్షలను మాత్రం హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రామచంద్ర ఛత్రపతి కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై అప్పీల్ చేయలేదని ప్రస్తావిస్తూ రామ్ రహీమ్, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పుపై నవంబర్లో జరిగే విచారణలో సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: కొరియా కార్యాలయాల్లో.. బయటకు చెప్పుకోలేని ఐదు నిజాలు! -
ప్రధాన న్యాయమూర్తులుగా నలుగురు జడ్జీలు
న్యూఢిల్లీ: నలుగురు న్యాయమూర్తులను వేర్వేరు రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలిజీయం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొలీజియం ఈ నెల 6న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న వి.కామేశ్వర్రావును పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టులో జడ్జీగా పని చేస్తున్న జస్టిస్ రవీంద్ర వి.ఘూగేను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠిని బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్గా, పంజాబ్–హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశ్వనీకుమార్ మిశ్రాను అదే కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. -
ఎయిర్టెల్, విఐలకు సుప్రీంకోర్టు నోటీసులు!
బాంబే హైకోర్టు వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం, సుప్రీంకోర్టు టెలికాం ఆపరేటర్లైన భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు నోటీసులు జారీ చేసింది.2008 నుంచి 2012 మధ్య 6.2 MHz కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ కలిగి ఉన్న కంపెనీల నుంచి ప్రభుత్వం వన్టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలంటూ బాంబే హైకోర్టు జూన్లో తీర్పు ఇచ్చింది. దీంతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించింది.అయితే.. హైకోర్టు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. స్పెక్ట్రమ్ అనేది పరిమితమైన వనరు కాబట్టి, కంపెనీలు 6.2 MHz కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ ఉపయోగించినందుకు ఛార్జీలు చెల్లించాల్సిందేనని కేంద్రం వాదిస్తోంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు టెలికాం కంపెనీల వివరణ కూడా తీసుకోవాలని నిర్ణయించింది. అందుకే రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.ప్రస్తుతం.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. దీంతో హైకోర్టు తీర్పు ప్రస్తుతానికి కొనసాగుతోంది. అయితే.. కేసు తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తే.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలపై భారీగా ఛార్జీల భారం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న టెలికాం కంపెనీలకు ఇది మరింత కష్టమవుతుంది. -
బయోమెడికల్ వ్యర్థాల ఫీజులపై సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆసుపత్రుల నుంచి బయోమెడికల్ వ్యర్థాల సేకరణ, నిర్వహణకు సంబంధించి యాజమాన్యాల నుంచి బెడ్ల (పడకల) సంఖ్య ఆధారంగా ఫీజులు వసూలు చేస్తున్న విధానంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆసుపత్రుల్లోని బెడ్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఫీజులు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది.అసలేం జరిగిందంటే..ఆసుపత్రుల బయోమెడికల్ వ్యర్థాల పారబోతకు సంబంధించి 2016లో రూపొందించిన నిబంధనల ప్రకారం.. ప్రతి 75 కిలోమీటర్ల పరిధిలోని ఆసుపత్రులన్నీ తమ వ్యర్థాల నిర్వహణను ప్రభుత్వం నిర్దేశించిన ఒక ఉమ్మడి ప్రైవేటు సంస్థకు (సీబీడబ్లూటీఎఫ్) అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆసుపత్రులు తమ వ్యర్థాలను పసుపు, ఎరుపు, నీలం తదితర రంగుల సంచుల్లో వేరుచేసి సదరు సంస్థకు ఇవ్వాలి. అయితే, ఆ వ్యర్థాల పరిమాణం, బ్యాగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా.. ఆసుపత్రిలోని మొత్తం బెడ్ల సంఖ్య ఆధారంగా ఫీజులను వసూలు చేస్తుండటాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. -
మీరు కోడిగుడ్లకే భయపడుతున్నారా?: సుప్రీంకోర్టు
ఢిల్లీ: 'స్వాతంత్య్ర సమరయోధులు తుపాకీ గుళ్లను ఎదుర్కొన్నారు.. మీరు కోడిగుడ్లకే భయపడుతున్నారా?' అంటూ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మతపరమైన భావాలను దెబ్బతీశారనే ఆరోపణల కేసులో పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాలని ఎంపీకి కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహువా మోయిత్రా.. విచారణకు వెళ్తే తనపై కోడిగుడ్లపై దాడి చేస్తారని పిటిషన్లో పేర్కొన్నారు.ఇవాళ(శుక్రవారం) జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టింది. ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. విచారణకు హాజరయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతించాలని మోయిత్రా తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కోరారు. దీనిపై జస్టిస్ దత్తా స్పందిస్తూ.. "మీరు ఎంపీ అయినంత మాత్రాన ప్రత్యేక మినహాయింపు ఇస్తారా?" అంటూ వ్యాఖ్యానించారు. గతంలో మోయిత్రాపై గుడ్లు విసిరిన ఘటనలను శంకరనారాయణన్ ప్రస్తావిస్తూ.. ఆమె స్వయంగా హాజరైతే మళ్లీ అలాంటి ఘటన జరిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.దీనిపై జస్టిస్ దత్తా స్పందిస్తూ.. ఎంపీగా ఉన్నవారు గుడ్లకు భయపడకూడదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీపై గుడ్లు విసురుతారని ఎందుకు భయపడుతున్నారు? మన స్వాతంత్య్ర సమరయోధులు తమ ఛాతీపై తుపాకీ గుళ్లను ఎదుర్కొన్నారు" అని వ్యాఖ్యానించారు. దీంతో తన పిటిషన్ను ఉపసంహరించుకుంటానని శంకరనారాయణన్ కోరగా.. దానికి ధర్మాసనం అనుమతించింది. -
ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్గా ఘనత
Justice Abha Nayar Patel ఢిల్లీలో పుట్టి పెరిగిన అభా నాయర్ జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. అభాకు ఏడేళ్ల వయసులో ఆమె కుటుంబం ఉపాధి కోసం 1973లో జాంబియాకు వెళ్లింది.అంతేకాదు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ ఆహ్వానం మేరకు భారత సుప్రీంకోర్టు ధర్మాసనం (Judicial Dais)పై ఆసీనులైన తొలి జాంబియా న్యాయమూర్తిగా కూడా ఆమె నిలిచారు.ఆమె భారతదేశ పర్యటలో భాగంగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (SCAORA) నిర్వహించిన "న్యాయం అందించే భవిష్యత్తు: ఆవిష్కరణ, సమ్మిళితం మరియు సమగ్రత" అనే అంశంపై జస్టిస్ పటేల్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి. మోహన కూడా ప్రసంగించారు. జస్టిస్ సూర్య కాంత్ ఆహ్వానం మేరకు జస్టిస్ అభా నాయర్ భారత సుప్రీంకోర్టు న్యాయపీఠాన్ని అలంకరించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించడం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అల్గారిథమ్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల గతంలో ఉన్న పక్షపాతాలు (historical bias) మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. న్యాయ వితరణలో ఆవిష్కరణ (Innovation), నిబద్ధత (Integrity), సమ్మిళితత్వం (Inclusivity) అనే మూడు అంశాలు కీలకమని తెలిపారు. “సమగ్రత లేని ఆవిష్కరణ ప్రమాదకరం. సమ్మిళితత్వం లేని సమగ్రత అసంపూర్ణం, అలాగే ఆవిష్కరణ లేని సమ్మిళితత్వం తరచుగా ప్రభావం చూపలేనంత నెమ్మదిగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. న్యాయస్థానాలలో సాంకేతిక సాధనాలను ఉపయోగించేటప్పుడు, అవి తీర్పు ఫలితాల నిష్పక్షపాతాన్ని, అలాగే న్యాయం పొందే అవకాశాన్ని రెండింటినీ మెరుగుపరిస్తే తప్ప వాటిని ఉపయోగించకూడదని జస్టిస్ అభా నాయర్ పటేల్ అన్నారు. అనియంత్రిత ఆవిష్కరణలు ఇప్పటికే ఉన్న అసమానతలను కేవలం "డిజిటలైజ్" చేయగలవని ఆమె హెచ్చరించారు.జాంబియా కోర్టు రికార్డుల డిజిటలైజేషన్ అండ్ వర్చువల్ సాక్ష్యం దిశగా నెమ్మదిగానే అయినప్పటికీ, అర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సందర్బంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ సాంకేతికత వల్ల భారతదేశంలో సామాన్యులకు న్యాయం చేరువైందని, సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించే అవసరం లేకుండా కేసుల విచారణను ట్రాక్ చేసే వెసులుబాటు కలిగిందన్నారు. అయితే ఏఐ న్యాయ నిర్వహణకు సాయపడగలదే తప్ప, న్యాయమూర్తి సానుభూతిని, మానవీయ విచక్షణను ఎంతమాత్రమూ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.కాగా చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి జాంబియాకు వెళ్లిపోయిన అభానాయర్ అర్కడి విశ్వవిద్యాలయంనుండి లా పూర్తి చేశారు. యుకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనంతరం 1989లో జాంబియా బార్లో చేరారు. పర్వతారోహకురాలు కూడా అయిన ఆమె 'కిలిమంజారో' పర్వతాన్నిఅధిరోహించడం మరో విశేషం. 2019లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2023 ఏప్రిల్లో కోర్ట్ ఆఫ్ అప్పీల్కు, ఈ ఏడాది మే 27న జాంబియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి సాధించారు. -
పౌరసత్వంపై ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్పై ట్రంప్ మరోసారి బాంబు పేల్చారు. ఆ దేశంలోకి వచ్చే శత్రుదేశాల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలో జన్మించడంతో వచ్చే ఆటోమెటిక్ పౌరసత్వ నిబంధనపై సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. బర్త్ టూరిజంపై ఇటీవలే అక్కడి సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొద్ది వారాల్లోనే మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.ట్రంప్ మాట్లాడుతూ.. శత్రుదేశాల పౌరులు, విదేశీ ఉగ్రవాద సంస్థల సభ్యుల పిల్లలు మోసపూరిత మార్గాల్లో వీసాలు పొందిన వారి పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ బానిసల పిల్లల కోసమని ప్రస్తుతం దీనిని కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారని ట్రంప్ విమర్శించారు.ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ నేపథ్యంలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా రాజ్యాంగ హక్కులను మార్చలేరని ఈ ఆదేశాలను కూడా కోర్టులో సవాలు చేస్తామని పేర్కొంది.ట్రంప్ తెచ్చిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్1. మొదటి ఆర్డర్ : ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిక్గా లభించే పౌరసత్వం విషయంలో కొన్ని నిర్దిష్ట వర్గాలను అనర్హులుగా చేర్చారు. శత్రు దేశాల వ్యక్తులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు విదేశీ ప్రభుత్వాల తరఫున లాబీయింగ్ చేసేవారు లేదా ఆ దేశాల కోసం పనిచేసే వ్యక్తులు 2. రెండవ ఆర్డర్ (బర్త్ టూరిజంపై పూర్తి నిషేదం: అమెరికా పౌరసత్వాన్ని (పాస్పోర్ట్ను) సంపాదించడం కోసమే టూరిస్ట్ వీసాలపై అమెరికాకు వచ్చి పిల్లలను కనే అక్రమ పద్ధతిని అరికట్టడానికి ఈ ఆర్డర్ తెచ్చారు. విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు/కాన్సులేట్లలోని వీసా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా గర్భిణీలు కేవలం అమెరికాలో ప్రసవించి పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో (మోసపూరితంగా లేదా తప్పుడు సమాచారంతో) వీసా కోరితే, అటువంటి వారి వీసాలను తిరస్కరించాలని ఈ ఆర్డర్ నిర్దేశిస్తుంది.సుప్రీంకోర్టు తీర్పు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించే ప్రతి ఒక్కరికీ (అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్నవారి పిల్లలతో సహా) ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత (జనవరి 2025లో) బర్త్రైట్ సిటిజెన్షిప్ను నిరోధిస్తూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను 6-3 మెజారిటీతో సుప్రీంకోర్టు కొట్టివేసింది. పౌరసత్వ నిబంధనలను మార్చాలంటే అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సరిపోవని, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కోర్టు తేల్చిచెప్పింది. ఆ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. -
యావజ్జీవ శిక్ష నిలిపివేత.. బెయిల్..
సాక్షి, న్యూఢిల్లీ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో సంచలనం సృష్టించిన బట్ట లింగయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అప్పటి గ్రామ సర్పంచ్ పోలెబోయిన లింగయ్యకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టు విధించిన జీవితకాల శిక్షను సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టులో అప్పీల్ పెండింగ్లో ఉన్నందున ఆయన్ను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది. ప్రత్యక్ష దాడికి పాల్పడలేదు ఈ పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన సమయంలో లింగయ్య సర్పంచ్గా ఉన్నారని, మృతుడి భార్య వాంగ్మూలంలో ఆయన ప్రత్యక్షంగా దాడి చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ నేరుగా దాడి చేయకపోయినా నిందితులను రెచ్చగొట్టి హత్యకు పురికొల్పారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దాడిలో పిటిషనర్ ప్రత్యక్ష పాత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. ఇదీ నేపథ్యం...: 2017 సెపె్టంబర్ 30 దసరా పండుగ రోజున అజీంపేటలోని జమ్మిచెట్టు వద్ద ఎస్సీ వర్గానికి చెందిన బట్ట లింగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో నాటి సర్పంచ్ పోలెబోయిన లింగయ్య ప్రోద్బలంతో ఆయన అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సర్పంచ్తో సహా మొత్తం 18 మందికి జీవితఖైదు విధించింది. కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించినా, ఉపశమనం లభించకపోవడంతో మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రహదారి భద్రతలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు ఒకవైపు కాగా, ప్రమాద బాధితులకు చట్టబద్ధంగా దక్కాల్సిన నష్టపరిహారం అందకుండా పోతుండటం తీవ్ర ఆందోళనకరమైన అంశం. దీనికి ప్రధాన కారణం దేశంలోని రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపు 56 శాతం వాహనాలకు చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ బీమా (ఇన్సూరెన్స్) లేకపోవడమే. పార్లమెంటరీ కమిటీ, అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో నమోదైన 30.48 కోట్ల వాహనాల్లో ఏకంగా 16.54 కోట్ల వాహనాలు (ప్రధానంగా ద్విచక్ర వాహనాలు) ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండానే యథేచ్ఛగా రోడ్డెక్కుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.‘నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్’ పైలట్ ప్రాజెక్ట్జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 146 అమలుపై కీలక తీర్పు ఇచ్చింది. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం (పెట్రోల్/డీజిల్) విక్రయించకుండా నిరోధించేలా ఒక పైలట్ ప్రాజెక్ట్ను రూపొందించాలని బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ), కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.సాంకేతికతతో ఆటోమేటిక్ ఈ-చలాన్లుఇంధన విక్రయాల నిలిపివేతకే పరిమితం కాకుండా సాంకేతికతను జోడించాలని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ఉన్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను 'వాహన్' పోర్టల్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్తో అనుసంధానించాలని ఆదేశించింది. దీనిద్వారా బీమా లేని వాహనాలు రహదారిపైకి రాగానే ఆటోమేటిక్గా గుర్తించి వాహనదారుల మొబైల్ ఫోన్లకు ఈ-చలాన్లు వెళ్తాయి. తనిఖీల కోసం ట్రాఫిక్ పోలీసులకు డిజిటల్ హ్యాండ్హెల్డ్ పరికరాలు/యాప్లు అందుబాటులోకి తేనున్నారు.ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు -
హైదరాబాద్లో సుప్రీంకోర్టు అదనపు బెంచ్?..ఎంపీ
సాక్షి, ఢిల్లీ:హైదరాబాద్లో సుప్రీంకోర్టు అదనపు బెంచ్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ రోజు (బుధవారం) రాజ్యసభలో జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి 2,218 కేసులు విచారణ చేయాల్సి వస్తుందన్నారు. హైకోర్టులో అప్పిలేట్ కోర్టులు ఏర్పాటు చేయాలని సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జితో అప్పిలేట్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టులో క్రిమినల్ కేసులు సింగిల్ బెంచ్ తర్వాత డివిజన్ బెంచ్ విచారించేలా సీఆర్పీసీలో సవరణ తీసుకురావాలని దీనివల్ల 15శాతం భారం సుప్రీంకోర్టుపై తగ్గుతుందని తెలిపారు. తప్పుడు కేసులు విచారిస్తే భారీగా జరిమానాలు విధించాలని రాబోయే పదేళ్ళను దృష్టిలో ఉంచుకొని వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిరంజన్ రెడ్డి రాజ్యసభలో మాట్లాడారు. -
నో ఇన్సూరెన్స్.. ఫ్యూయెల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాహనాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ లేకుండానే రోడ్లపై సంచరిస్తుండటం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. సరైన బీమా పత్రాలు లేని వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని నిరాకరించేలా ఓ పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. టోల్ ప్లాజాల మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు బీమా ఉందో లేదో ఆటోమేటిక్గా తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది.ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికర్నిషన్ కెమెరాల వినియోగం ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. బీమా లేని వాహనాలకు ఆటోమేటిక్ ఈ–చలాన్లు జారీ చేసేందుకు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వాహన్ పోర్టల్ సమాచారంతో అనుసంధానించిన ఏఎన్పీఆర్ కెమెరాలను కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. పోలీసులకూ ఆ అధికారమివ్వాలి సరైన బీమా పత్రాలు లేని వాహనాలకు ఏ పెట్రోల్ పంపులోనూ ఇంధనం నింపరాదని, సరైన ఇన్సూరెన్స్ పత్రాలను చూపే వరకు ఇదే నిబంధన అమలు కావాలని స్పష్టం చేసింది. దీనివల్ల ఇన్సూరెన్స్ లేని, రిజిస్టర్ కాని వాహనాలను గుర్తించడంతోపాటు, యజమానులు సరైన విధంగా బీమా చేయించుకునేలా ప్రోత్సహించినట్లవుతుందని ధర్మాసనం తెలిపింది. మోటారు వాహన చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ఇటువంటి ప్రాజెక్టులు ఉపయోగపడతాయని తెలిపింది. వాహనాల బీమా స్థితిని పరిశీలించే అధికారాన్ని రాష్ట్రాల పోలీసులకు కూడా ఇవ్వాలని, ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కోరింది. దీనివల్ల అప్పటికప్పుడే బీమా లేని వాహనాలకు జరిమానా విధించడం, బీమా చేయించుకునేలా చేయడానికి వీలవుతుందని తెలిపింది. ఇకపై నాలుగేళ్లు.. ఆరేళ్లు..! కొత్త కార్లకు మూడేళ్లు, సెకండ్ హ్యాండ్ కార్లకైతే ఐదేళ్ల థర్డ్పార్టీ ఇన్సూరెన్స్ను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు 2018లో ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు కాకపోవడం ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని మొత్తం 30.48 కోట్ల వాహనాలకు గాను 16.54 కోట్ల వాహనాలకు, 56 శాతం వరకు ఇన్సూరెన్స్ లేకపోవడం దిగ్భ్రాంతికరమంది. ఇకపై, కొత్త కార్లకు నాలుగేళ్లు, సెకండ్హ్యాండ్ కార్లకైతే ఆరేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను కొనుగోలు సమయంలోనే చేయించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయాలని ఐఆర్డీఏను ఆదేశించింది. బీమా ఆప్షన్లు ఇవ్వాలి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్–146 కింద బీమా తప్పనిసరి నియమం కేవలం రోడ్డు ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందడమే కాదని, వారు సుదీర్ఘమైన కోర్టు కేసుల్లో చిక్కుకోకుండా చూడటం కూడా అని పేర్కొంది. వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ప్రమాద బాధితులు, వారి కుటుంబాలు తగిన సమయంలో సరైన నష్టపరిహారాన్ని పొందే వీలు లేకుండా పోతోందని ఆందోళన వెలిబుచి్చంది. మోటారు వాహనాల చట్టం కింద అవసరమైన కనీస బీమా రక్షణతో ఉండే బేస్ పాలసీతో పాటు, ప్రైవేట్ వాహన యజమానులకు యాడ్–ఆన్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ సహా పలు పాలసీ ఎంపికలను అందించాలని ఐఆర్డీఏను కోరింది. ఈ మేరకు ఒక మోటారు ప్రమాద పరిహార కేసులో విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
సహజీవనంపై సుప్రీం సంచలన తీర్పు
సాక్షి,ఢిల్లీ: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సహాజీవనంలోనూ గృహాహింస కేసు వర్తిస్తుందని తెలిపింది. పెళ్లయిన మహిళలకు రక్షణ కల్పించే సెక్షన్ 498ఏ.. సహజీవనంలో ఉన్న స్త్రీలకు అప్లై అవుతుందని పేర్కొంది. అయితే ఆ సదరు మహిళ తాము వివాహానికి సిద్ధంగా ఉన్నామని నిరూపించాల్సి ఉంటుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.సహజీవనంలో (లివ్-ఇన్ రిలేషన్షిప్) ఉండే మహిళలకు సైతం వివాహితల మాదిరిగానే భర్త లేదా భాగస్వామి వేధింపులపై రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహహింస చట్టం కేవలం గృహహింస నిరోధాకానికి మాత్రమే కాకుండా, క్రిమినల్ చట్టాలు ఇటువంటి బాధితులకు రక్షణ కల్పిస్తాయని కోర్టు తెలిపింది. అయితే దీనికి తప్పనిసరిగా ఇద్దరు పరస్పర వివాహ అంగీకారంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఈ రక్షణ వర్తిస్తుందని స్పష్టం చేసింది.జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్మీకాపమ్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం తమతీర్పులో "భర్త లేదా అత్తమామలు ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించి, మానసిక లేదా శారీరక గాయం కలిగించడం లేదా మహిళను ఆత్మహత్యకు పురికొల్పడం వంటి వేధింపులకు పాల్పడే కేసులకు రక్షణ కల్పించడమే సెక్షన్ 498A యొక్క ఉద్దేశ్యం అయినప్పుడు, అటువంటి వేధింపులు కేవలం వివాహం తర్వాత మాత్రమే జరుగుతాయని, అంతకు ముందు కాదని చెప్పడం, మా సునిశ్చిత అభిప్రాయంలో, విషయాన్ని అతి సరళీకరించడమే అవుతుంది... సెక్షన్ 498A ద్వారా ఉద్దేశించిన రక్షణకు సంబంధించినంత వరకు, 'వివాహం' 'వివాహ స్వభావం గల సహజీవనం' మధ్య ఉన్న ఈ వ్యత్యాసానికి, గృహ హింసను నివారించే లక్ష్యంతో ఎటువంటి హేతుబద్ధమైన సంబంధం లేదు అందువల్ల ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధం." అని తెలిపింది. -
కారుణ్య నియామకాల్లో కూతుళ్లకూ సమాన హక్కు!
సాక్షి, న్యూఢిల్లీ: కారుణ్య నియామకాల విషయంలో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే, ఆ కుటుంబ సభ్యులకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కల్పించే క్రమంలో కుమారులు, కుమార్తెల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కారుణ్య నియామక నిబంధనలు పురుషులతో పాటు మహిళలకూ సమానంగా వర్తించేలా ఉండాలని స్పష్టంచేసింది. కారుణ్య నియామకాల నిబంధనల్లో కేవలం కుమారులను, పెళ్లికాని కుమార్తెలను మాత్రమే చేర్చి వివాహిత లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 15 (లింగ, కుల, మత వివక్షల నిషేధం)లను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. వివాహమైనంత మాత్రాన కుమార్తెలు తల్లిదండ్రుల కుటుంబంలో భాగం కారని భావించడం సరికాదని కోర్టు తప్పుబట్టింది. కారుణ్య నియామకాల పథకంలో లింగ వివక్షకు తావులేదని స్పష్టంచేసింది. నిబంధనల సవరణకు ఆదేశం పలు రాష్ట్రాల సరీ్వస్ రూల్స్, కారుణ్య నియామక మార్గదర్శకాల్లో ఇప్పటికీ కాలం చెల్లిన నిబంధనలున్నాయని న్యాయస్థానం గుర్తుచేసింది. విడాకులు పొందిన, వితంతువులైన కుమార్తెలు తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నట్లయితే వారికి ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టంచేసింది. ఈ మేరకు నిబంధనల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఉద్యోగి హఠాన్మరణంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలు కాకుండా చూసేందుకే కారుణ్య నియామకాలు చేపట్టాలని కోర్టు సూచించింది. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన వారసుల్లో అర్హత, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. -
భోజ్శాల పొరుగున ప్రార్థనలకు సుప్రీంకోర్టు అనుమతి!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్ పక్కన ఉన్న దర్గాలో ప్రార్థనలు జరుపుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం ముస్లింలకు అనుమతిచ్చింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల మధ్యలో ముస్లింలు దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఇరు పక్షాల సమ్మతితో ఇంకోచోట ప్రార్థనలు జరుపుకునేందుకు ఉన్న అవకాశానికి తమ ఆదేశాలు అడ్డుకావని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ నెల 14న సుప్రీంకోర్టు భోజ్శాల కాంప్లెక్స్ పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో ముస్లింలు శుక్రవారపు నమాజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ వర్తించే ఈ ఆదేశం అమలు కాలేదని ఆరోపిస్తూ ముస్లింల తరఫున హాజీ మునీర్ అహ్మద్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారులు భోజ్శాల కాంప్లెక్స్కు 1.3 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపారని ఇది తమకు సమ్మతం కాదని పిటిషన్ ద్వారా వాదించారు. భోజ్శాల మసీదును చూడగలిగే అవకాశం ఉండాలని కోరారు. ముస్లింల తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ, ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్లు తమ వాదనలు వినిపించగా జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ గురువారం తానిచ్చిన మునుపటి తీర్పును సవరించింది. ‘‘గత తీర్పులో దర్గా భూమిగా చెబుతున్న ఖస్రా నెం 596లోని ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి మూడు గంటల మధ్యలో ప్రార్థనలు మస్లిం సముదాయానికి అనుమతిచ్చాం. మాకందిన ప్లాన్ కాపీ ప్రకారం ఈ చోటికి వేరే రహదారి కూడా ఉంది. కాబట్టి ఈ స్థలం వారికి అనువుగా ఉంటుంది.’’అని స్పష్టం చేసింది. -
ఇష్టారీతిగా ఉద్యోగం వదిలేస్తానంటే కుదరదు
న్యూఢిల్లీ: అనుక్షణం సర్వసన్నద్ధంగా ఉండాల్సిన భారత వాయుసేనలో పనిచేసే ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగం మానేసి ఇతర సివిల్ పోస్టుల్లోకి చేరిపోతామంటే కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఏడేళ్లపాటు భారతవాయుసేనలో కార్పోరల్గా ఉద్యోగం చేసిన నఖత్సింగ్ అనే వ్యక్తి ఎయిర్ఫోర్స్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరతానంటే ఒప్పుకునేది లేదు అని జస్టిస్ ఉజ్జల్భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. దేశభద్రత దృష్ట్యా వాయుసేనలో అన్ని స్థాయిల్లో ఉద్యోగులు అనుక్షణం అందుబాటులో ఉండటం అత్యావశ్యకం. వేరే ఉద్యోగం, వృత్తిలో చేరాలనుకుంటే వాయుసేన నుంచి తొలి దశలోనే ముందస్తు అనుమతిపొందాలి. ఆర్పీఎస్సీకి 2020లో దరఖాస్తు చేసి, పరీక్ష రాసి, ఉద్యోగం పొందాక తీరిగ్గా నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ), డిశ్చార్జ్ ఆర్డర్ కావాలని వస్తే కుదరదు అని కోర్టు తేల్చిచెప్పింది. గతంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యూనల్ తర్వాత ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యాక సుప్రీంకోర్టు తలుపుతట్టినా నఖత్ సింగ్కు నిరాశ ఎదురైంది. -
ఆ ప్రాజెక్టులకు లైన్ క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతుల (ఈసీ) విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు తెలంగాణ రాష్ట్రానికి భారీ ఊరటనిచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించిన భారీ ప్రాజెక్టులకు వెనుకటి తేదీతో (ఎక్స్–పోస్ట్ ఫ్యాక్టో) అనుమతులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం (ఓఎం)ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం రద్దు చేసింది. అయితే గతంలో ఉన్న అనిశ్చితి, ప్రాజెక్టుల్లో ఇమిడి ఉన్న ప్రజాధనాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే (ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్) వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో పాత అనుమతులకు రక్షణ లభించి, తెలంగాణలో నిలిచిపోయిన పలు కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రాజెక్టులకు తొలగిన అడ్డంకులు గతంలో పర్యావరణ అనుమతుల విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కుల వల్ల పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్, దిండి ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ ప్రాజెక్టులకు మార్గం సుగమమైంది. పాత అనుమతులు రద్దు కాకపోవడం, భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చట్టబద్ధమైన నోటిఫికేషన్ ద్వారా మినహాయింపులు పొందే అవకాశం ఉండటం రాష్ట్ర సాగునీటి రంగానికి వరంగా మారింది. వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.భారీ ప్రాజెక్టుల నిర్మాణాలకు ముందస్తుగా అనుమతులు తీసుకోవడం ప్రాథమిక నిబంధన అని తేల్చిచెప్పింది. ముందస్తు అనుమతులు లేని ప్రాజెక్టులను క్రమబద్ధికరించేందుకు కేంద్రం 2021లో జారీ చేసిన ఓఎం ఒక శాశ్వత మార్గాన్ని ఏర్పాటు చేసిందని ధర్మాసనం తప్పుబట్టింది. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986, ఈఐఏ నోటిఫికేషన్–2006 నిబంధనలను పరిపాలనా ఉత్తర్వు ద్వారా తొలగించడం చట్టసమ్మతం కాదని చెప్పింది. ఏ ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వాలనే దానిపై స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం రాజ్యాంగంలోని ఆర్టీకల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు, స్వచ్ఛమైన పర్యావరణం)ల ఉల్లంఘనే అని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ద్వారానే మినహాయింపులు ముందస్తు అనుమతి నిబంధన ప్రాథమికమైనప్పటికీ, అత్యంత అరుదైన, భారీ ప్రజాప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టుల విషయంలో చట్టంలోని సెక్షన్ 3 కింద పరిమిత కాలానికి ప్రత్యేక మినహాయింపు నోటిఫికేషన్లు జారీ చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని ధర్మాసనం చెప్పింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అత్యవసర ప్రాజెక్టులను క్రమబద్ధికరించడానికి చట్టబద్ధమైన నోటిఫికేషన్ తీసుకురావాలి తప్ప, దొడ్డిదారిన ఆఫీస్ మెమోల ద్వారా అనుమతులు మంజూరు చేయడం చెల్లదని చెప్పింది. గత తీర్పులపై స్పష్టత వివిధ కేసుల్లో గతంలో ఇచ్చిన తీర్పుల వర్తింపుపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. కామన్ కాజ్ (2017), అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ (2020) కేసుల్లో ముందస్తు పర్యావరణ అనుమతి ఆవశ్యకతను సమరి్థంచిన విషయాన్ని గుర్తుచేసింది. పహ్వా ప్లాస్టిక్స్ (2022), డి.స్వామి (2022) కేసులు నిర్దిష్ట పరిస్థితుల్లో ఇచ్చినవని, వాటిని సాధారణ సూత్రాలుగా పరిగణించలేమని తెలిపింది. పర్యావరణ చట్టాలు పోస్ట్ ఫ్యాక్టో అనుమతులకు వీలు కలి్పస్తాయంటూ ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ (2021) కేసులో చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా తప్పుడు వ్యాఖ్యానమంటూ వాటిని తప్పుబట్టింది. అయితే 2017లో ఇచ్చిన వన్–టైమ్ మినహాయింపు నోటిఫికేషన్ చెల్లుబాటును మాత్రం అంగీకరించింది.కీలక ఆదేశాలివీ.. ⇒ పాత అనుమతులకు రక్షణ: 2017 నోటిఫికేషన్ లేదా 2021 ఓఎం కింద ఇప్పటికే పొందిన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయి. వాటిపై చట్ట ప్రకారం విడిగా సవాళ్లు వస్తే తప్ప రద్దు కావు. ⇒ కొత్త దరఖాస్తులపై నిషేధం: ఈ విధానాల కింద ఇకపై ఎలాంటి కొత్త దరఖాస్తులను స్వీకరించరాదు. భవిష్యత్తులో కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఎక్స్–పోస్ట్ ఫ్యాక్టో అనుమతులు ఇవ్వకూడదు. ⇒ పెండింగ్ దరఖాస్తుల పరిశీలన: పాత ఉత్తర్వుల వల్ల పెండింగ్లో ఉన్న లేదా తిరస్కరించిన దరఖాస్తులను తీర్పులోని పేరా 79లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అధికారులు పరిశీలించాలి. ⇒ ఆర్టికల్ 142 అధికారాలు: సంపూర్ణ న్యాయం అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న విశేషాధికారాలకు ఈ తీర్పు అడ్డంకి కాదు. ⇒ అప్పీళ్ల పరిష్కారం: మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన సివిల్ అప్పీళ్లను కోర్టు కొట్టివేసింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను తాజా తీర్పుకు అనుగుణంగా పరిష్కరించింది. ఒక షాపింగ్ మాల్ మూసివేతకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వచ్చిన అప్పీల్ను ప్రత్యేకంగా విడదీసి సంబంధిత బెంచ్ ముందుకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
పర్యావరణ అనుమతులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ : పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు, పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం ఒక సాధారణ మెమోరాండమ్ (OM) ద్వారా పోస్ట్-ఫాక్టో (ముందు పని తరువాత అనుమతి) కుదరదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం జారీ చేసిన 2021 ఆఫీస్ మెమోరాండమ్ను రద్దు చేసింది.ఫాస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతుల కోసం ఆఫీస్ మెమోరాండం మాత్రమే సరిపోదని తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. చట్టబద్ధ నోటిఫికేషన్ ద్వారా అవసరమైతే పోస్ట్-ఫాక్టో (తర్వాతి దశలో) పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన నోటిఫికేషన్ జారీ చేసి పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతుల వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉంది.ఈ కేసు వివరాలు2006 నాటి పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల ప్రకారం ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా ముందస్తు పర్యావరణ అనుమతి తప్పనిసరిగా ఉండేది. అయితే, ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా పనులు ప్రారంభించిన కంపెనీలు/ప్రాజెక్టులకు, తదనంతరం (పోస్ట్-ఫాక్టో) అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో ఒక నోటిఫికేషన్, 2021లో ఒక ఆఫీస్ మెమోరాండమ్ (OM) జారీ చేసింది."వనశక్తి" అనే పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం — చట్టబద్ధమైన పర్యావరణ నిబంధనలను కేవలం కార్యాలయ ఉత్తర్వుల (OM) ద్వారా సవరించడం చెల్లదని, ఇది పర్యావరణ చట్టాల ఆశయానికి విరుద్ధమని పేర్కొంటూ 2021 OMను కొట్టివేసింది. అయితే, ఇప్పటికే గత అనుమతుల ఆధారంగా మొదలైన ప్రాజెక్టులు దెబ్బతినకుండా పాత అనుమతులను సమర్థించింది. -
జంతర్ మంతర్ లో లాఠీ ఛార్జ్.. పోలీసులకు సుప్రీం నోటీసులు
-
కోర్టు గేట్లకు ఏముండాలో మేం చూసుకుంటాం!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు భవనం ప్రధాన గుమ్మటం, గేటు, అధికార పత్రాలపై జాతీయ చిహ్ననికి బదులుగా న్యాయస్థానం తన సొంత చిహ్నాన్ని వినియోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు గేట్లపై ఏముండాలో నిర్ణయించే విషయాన్ని తమకు వదిలేయాలని, ఇతర సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాలని పిటిషనర్కు హితవు పలికింది. ఈ అంశంపై బదరవాడ వేణుగోపాల్ అలియాస్ బాబా ఖతర్నాక్ అనే వ్యక్తి స్వయంగా పిటిషన్ వేశారు. కేంద్ర హోంశాఖ–2007 నిబంధనల ప్రకారం రాజ్యాంగ సంస్థలు జాతీయ చిహ్నాన్ని మాత్రమే ప్రదర్శించాలని, కానీ 1958లో ప్రారంభమైన సుప్రీంకోర్టు భవనంపై జాతీయ చిహ్నం ఇప్పటి వరకు లేదని ఆయన పేర్కొన్నారు.రిజిస్ట్రీ సైతం కోర్టు సొంత చిహ్నన్నే వాడుతోందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. ‘సుప్రీంకోర్టు గేట్లు, తలుపులపై ఏముండాలనే విషయాన్ని మాకే వదిలేయండి. మీ ఆహార్యం చూస్తుంటే సన్యాసిలా ఉన్నారు, ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటిపై దృష్టిపెట్టి సమాజ సేవ చేసుకోండి. కోర్టు గేట్ల విషయం మేం చూసుకుంటాం‘అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ నిబంధనలను పిటిషనర్ ప్రస్తావించినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. పిటిషన్లో విచారణార్హమైన అంశాలు లేవంటూ కొట్టివేసింది.గతంలో వేసిన పిటిషన్కు కొనసాగింపుకోర్టులకు రాజ్యాంగపరమైన గుర్తింపు వంటి అశోక చిహ్నం సుప్రీంకోర్టుకు ఏర్పాటు చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేయాలంటూ వేణుగోపాల్ రాజ్యాంగంలోని ఆర్టీకల్ 32 ప్రకారం గతంలో ఒక రిట్ వేశారు. మార్చి 23న సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ అంశం పరిపాలనాపరమైనదని పేర్కొంటూ దీనిపై తగిన నోట్ను సంబంధిత అధికారికి పంపించాలని సెక్రటరీ జనరల్ను ఆదేశించింది. ఈ ఆదేశాల పురోగతిని తెలపాలంటూ వేణుగోపాల్ జూలై 3న రిజిస్ట్రార్ ద్వారా మరో పిటిషన్ వేశారు. ఆ తర్వాత, రిజిస్ట్రార్ ఉత్తర్వును సవాల్ చేస్తూ చేసిన అప్పీలును మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏం ప్రదర్శించాలనేది తమ సొంత విషయమంటూ అప్పీల్ను కొట్టివేసింది. -
నిరసన చేస్తే కొట్టడం ఏంటి? లాఠీ ఛార్జ్ పై సుప్రీంకోర్టు సీరియస్
-
కేబీఆర్ చుట్టూ ఏం జరుగుతోంది?
హైదరాబాద్: బంజారాహిల్స్లోని కాసు బ్రహ్మనందరెడ్డి (కేబీఆర్) జాతీయ ఉద్యానవనం చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు ఈ నెల 27న విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం శుక్రవారం నగరానికి వచ్చింది. కేబీఆర్ పార్కులో అటవీ, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైంది. అలాగే ఈ బృందం స్వయంగా పార్కు పరిసరాల్లో పర్యటించి వివరాలు తెలుసుకుంది. కేబీఆర్ పార్కు చుట్టూ చెట్ల తొలగింపును నిలిపివేయాలని, పార్కు పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా..ఎకో సెన్సిటివ్ జోన్లో 25 మీటర్ల మేర ఎలాంటి చెట్లు కొట్టవద్దంటూ ఈ ప్రక్రియపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ఈ నెల 27న మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలుసమర్పించనున్నారు. ఎకో సెన్సిటివ్ జోన్లో 25–30 మీటర్ల దూరంలో చెట్లు ఎన్ని ఉన్నాయి, కొట్టివేశారా..? తదితర అంశాలను కేంద్రబృందం పరిశీలించింది. ఎంపవర్డ్ కమిటీ మెంబర్ అంజన్ మొహంతితో పాటు మరో అధికారి ఢిల్లీ నుంచి వచ్చి కేబీఆర్ పార్కులో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, అటవీ శాఖ అధికారిణి ప్రియాంక వర్గీస్, హెచ్–సిటీ ఖైరతాబాద్ జోన్ సీఈ రత్నాకర్, ఈఈ సంపద, డీఈ హరీష్, ఏఈ ప్రశాంత్లతో సమావేశమయ్యారు. సమీక్షలో చర్చించిన అంశాలు, పరిశీలించిన అంశాలతో ఓ నివేదికను ఈ బృందం సుప్రీంకోర్టులో తమ వాదనల్లో వినిపించనుంది. -
విచారణకు ఫైవ్ స్టార్ సౌకర్యాలు కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ: విచారణ పేరుతో వేరే దేశాల్లోలాగా ఫైవ్ స్టార్ హోటళ్లు కావాలా అని విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. సీఐ నాగరాజు పోలీసు కస్టడీకి హైకోర్టు విధించిన నిబంధనలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. కింది కోర్టులు విధించిన నిబంధనల వల్ల పోలీసు కస్టడీ లక్ష్యం నెరవేరడం లేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. నిందితుడిని విచారణకు రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చేందుకు రానుపోను ఆరు గంటల సమయం పడుతోందని, విచారణకు సమయం ఎక్కడ ఉంటుందని అన్నారు. సీఐ నాగరాజు తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.నరసింహారెడ్డి వాదనలు వినిపిస్తూ.. విజయవాడ జైలులో ఉన్న పలువురి అరెస్టుకు ఆ పోలీస్ అధికారి కారణమైనందున, అక్కడ ఉంచితే ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతోనే హైకోర్టు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చిందని తెలిపారు. ఈ వాదనపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘విచారణ పేరుతో వేరే దేశాల్లో లాగా ఫైవ్ స్టార్ హోటళ్లు, ఏసీ రూమ్లు, ప్రత్యేక సదుపాయాలు కావాలా ఏంటి?’ అని నాగరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇక్కడ సమస్య కేవలం జైలు మార్పిడి గురించి కాదని, రిమాండ్ విచారణ పద్ధతి గురించి అని స్పష్టం చేసింది. పోలీస్ విచారణ చట్టబద్ధమైన పద్ధతుల్లో, కోర్టు మార్గదర్శకాలకు లోబడి మాత్రమే జరగాలని స్పష్టం చేసింది. జూన్ 23న అరెస్ట్ జరిగినందున చట్టప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని తేల్చిచెబుతూ «తీర్పును రిజర్వ్ చేసింది. -
నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అక్రమాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయవాదులు ముందుకొచ్చారు. గురువారం లంచ్ విరామంలో 'సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్' బ్యానర్ కింద నిరసనకారులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ ప్రవేశికను (Preamble) పఠించారు. ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఎస్. మురళీధర్ (ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి) Supreme Court Bar Association (SCBA) అధ్యక్షుడు డాక్టర్ వికాస్ సింగ్ లీడ్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులపై పోలీసుల దారుణ హింసాకాండను, బలప్రయోగాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా నిలవడం న్యాయవాదుల రాజ్యాంగ బాధ్యత అని ప్రముఖ న్యాయవాదిఇందిరా జైసింగ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: స్టీల్ సిటీ అందాలకు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ ఫిదా, వైరల్ వీడియో Supreme Court Lawyers Fraternity in Delhi, stands up in solidarity with the Students Protest.They read the Preamble in unison and vow to stand by the youth of our Nation. This gets us all new found respect and support for all the Lawyers in the SC of India. So what if the… pic.twitter.com/kRPXYPeylJ— Pragnya Gupta (@GuptaPragnya) July 23, 2026 నీట్ పేపర్లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేస్తున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం డిమాండ్స్తో సీజేపీ ఆధ్వర్యంలో జూన్ 20 నుండి కొనసాగుతున్న ఈ నిరసనకు వాతావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్, AISA విద్యార్థులు కూడా మద్దతు తెరిపిస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులు ఆందోళన కారులపై పోలీసుల దమనకాండపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనాయి. మరోవైపు ఈ డిమాండ్లతో నిరసన కారులపై పెట్టిన FIRల ఉపసంహరణ వరకు ఆందోళన విరమించేది లేదని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.ఇదీచదవండి: సీజేపీపై వివాదాస్పద పోస్ట్ : ఎవరీ ఇన్స్టా స్టార్ సోనియాప్రధాని మోదీ స్పందనపరీక్షా పత్రాల లీకేజీ కేసులలో నిందితులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. -
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్కు షాక్..!
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్కు షాక్ తగిలింది. నిర్మాత వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని పిటిషన్ కొట్టేసింది. దీంతో బండ్ల గణేశ్కు సుప్రీంలో చుక్కెదురైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న రుణ వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్ఫేసీ, ఐబీసీ చట్టాలకు సంబంధించిన కీలక అంశాలపై అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.అసలేం జరిగిందంటే..హైదరాబాద్లోని శ్రీ పరమేశ్వర పౌల్ట్రీఫామ్ ప్రైవేట్ లిమిటెడ్కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆస్తులను పూచీకత్తుగా పెట్టిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ సమయంలో, బ్యాంక్ సర్ఫేసీ చట్టం కింద చర్యలు చేపట్టి తనఖా పెట్టిన ఆస్తుల్లో ఒకదానిని వేలం వేసింది. అయితే, ఈ వేలం ప్రక్రియను, సేల్ సర్టిఫికెట్ను హైదరాబాద్లోని రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ) తప్పుబట్టింది. కొనుగోలుదారుడికి వడ్డీతోసహా డబ్బును వాపసు చేయాలని, పిటిషనర్లకు ఆస్తిని తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అయితే, డీఆర్టీ ఇచ్చిన ఈ తీర్పును హైకోర్టు కొట్టివేసింది.వన్ టైమ్ సెటిల్మెంట్ కింద బ్యాంక్ రూ.71.44 కోట్లతో సహా సుమారు రూ.129.02 కోట్లను రికవరీ చేసిందని, బకాయిలు పూర్తిగా తీరిపోయినట్లు సెటిల్మెంట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని బండ్ల గణేష్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆస్తిని వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. -
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇదంతా..!: సుప్రీం కోర్టు
మేఘాలయా హనీమూన్ కేసు యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాంకేతికత ముసుగులో ఎటుపోతున్నాం, మానవతా విలువలు ఏమవుతున్నాయనే ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ రద్దు చేస్తూ గట్టి షాకివ్వడమే కాదు కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది. అంతేగాదు ధర్మాసనం ఈ కేసు విచారణ నేపథ్యంలో మారుతున్న కుటుంబ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పైగా యావత్తు సమాజాన్ని ఆలోచింప చేసేలా చక్కటి సందేశాన్ని ఇచ్చింది జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం. ఇంతకీ సుప్రీంకోర్టు కుటుంబ వ్యవస్థ గురించి ఏం చెప్పిందంటే..ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, దంపతుల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు పెద్దలు వాటిని పరిష్కరించేవారు. చిన్న కుటుంబాల విషయానికొస్తే, వాళ్లు ఒంటరిగా మిగిలిపోతున్నారు, అందువల్ల విడిపోవడం పెరుగుతోందని పేర్కొంది. పైగా వారిలో డిప్రెషన్ కూడా పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల ప్రతిది ఇట్టే తెలిసిపోతున్నా..యువత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని ధర్మాసనం వెల్లడించింది. అది కాస్తా తరుచుగా వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు జస్టిస్ ఎం ఎం సుందరేష్ మాట్లాడుతూ..మారుతున్న కుటుంబ వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరగడం సహజం. వైవాహిక వివాదాలు పెరగడంతో వ్యక్తిగత చట్టాలతో సంఘర్షణలు కూడా పెరుగుతాయని అన్నారు. ప్రస్తుత తరం మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండొచ్చు, కానీ ఒత్తిడిలో మనకంటే బలహీనంగా ఉన్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలకు భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..యువతకు "సమాచారం ఎక్కువగా ఉంది కానీ జ్ఞానం ఎక్కువగా లేదని అన్నారు. వాట్సాప్లలో పంచుకున్న ప్రతిదాన్ని జ్ఞానంగా పరిగణిస్తున్నారని, ఈ డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వల్లే పెను ప్రమాదాలు వాటిల్లుతున్నయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేగాదు తాను ఇటీవల ఏడుస్తున్న ఒక చిన్నారిని చూశానని, ఆమెకు పేరెంట్స్ మొబైల్ ఇచ్చారని అన్నారు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల స్థానాన్ని మొబైల్ భర్తీ చేస్తోందన్నమాట. ఇది రాను రాను ఒక విపత్తుగా మారుతుందని ఆ క్షణం ఏ తల్లిదండ్రులకు దీనిగురించి అంతగా తెలియదని అన్నారు జస్టిస్ ఎం ఎం సుందరేష్. ఇలాంటివి నిజానికి చాలా ప్రమాదకరమైనవని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతోనే ఇలాంటి ఘోరాలు జరగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అంతేగాదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే గాక, ఐక్యతకు ప్రతీకగా నిలిచేవని పేర్కొంది. ప్రస్తతం న్యూక్లియర్ (చిన్న) కుటుంబాల సంఖ్య ఎక్కువై బంధాల మధ్య మాధుర్యం లోపిస్తోందని అభిప్రాయపడింది. నవ సమాజానికి పునాది అయినా కుటుంబాలే గతితప్పడంతోనే..ఇలాంటి నేరాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయని స్పష్టం చేసింది. కాగా, సోనమ్కు షిల్లాంగ్ ట్రయల్ కోర్టు ఏప్రిల్లో బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో నిబంధనల ప్రకారం కారణాలు సరిగ్గా తెలియజేయలేదన్న సాంకేతిక అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం మేఘాలయ హైకోర్టు కూడా ఆ బెయిల్ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, బెయిల్ మంజూరును సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్టు మెమోలోని తప్పు కేవలం టైపింగ్ లేదా క్లరికల్ పొరపాటు మాత్రమేనని, దాని ఆధారంగా బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం వాదించింది.(చదవండి: కార్పెంటర్ కుమార్తె ఘనత..! శక్తిశాట్లో మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని..) -
భర్తపై దాడి చేస్తుంటే నువ్వేం చేశావ్?
న్యూఢిల్లీ: గతేడాది మేఘాలయలో హనీమూన్ సమయంలో భర్తను చంపించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. జైలు అధికారుల ఎదుట లొంగిపోయి, ఈ కేసు విచారణను ఎదుర్కోవాలని సూచించింది. వ్యాపారవేత్త రాజా రఘువంశీని చంపినట్లు ఆరోపణలున్న మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన సోనమ్ను గతేడాది జూన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆమెకు బెయిలిస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం వేసిన పిటిషన్పై మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది.‘మీ ప్రవర్తనను మీరు ఎలా సమరి్థంచుకుంటారు? మీరు భర్తతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడే అతడిపై దాడి జరిగింది. అతడు మరణించాడు. అప్పుడు, ఆ తర్వాత మీరేం చేశారు? ఇది ప్రాథమికంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న. అరెస్ట్కు కారణాలేంటని మీరు మొదట్లోనే పోలీసులను అడిగారా?..ఇది రెండో ప్రశ్న’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘పిటిషన్లో పేర్కొన్న ఆధారాలను బట్టి తగు ఆదేశాలు జారీ చేయడం లేదా నిందితురాలు సోనమ్ను లొంగిపోయి విచారణను ఎదుర్కోవాలని ఆదేశించడం గానీ చేస్తాం. వీటికి సిద్ధపడి రండి..’అంటూ సోనమ్ తరఫు లాయర్తో వ్యాఖ్యానించిన ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
మల్లారెడ్డి యూనివర్సిటీ లో ఆకస్మిక తనిఖీలు
-
విధులు నిర్వహించలేనప్పుడు డాక్టర్ అని రాసుకోవద్దు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో మార్చిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో సకాలంలో చికిత్స అందించేందుకు నిరాకరించిన రెండు ప్రైవేట్ ఆస్పత్రులు, వాటి వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మీరు బాధ్యతలను సక్రమంగా నిర్వహించనప్పుడు, పేరు ముందు డాక్టర్ అని రాసుకునే అర్హత మీకు లేదు. మీకు గనుక మానవత్వం, స్పందించే గుణం ఉండి ఉంటే, మీ దగ్గర తగిన వసతులు లేనప్పుడు ఆ బిడ్డతో పాటు మీరే స్వయంగా మరో ఆస్పత్రికి వెళ్లి ఉండేవారు. ఆమె పేదరాలు అనో, ఫీజు చెల్లించలేదనో మీరు నిర్లక్ష్యం చేశారా?’అని వైద్యులను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. చిన్నారి కుటుంబానికి సహేతుకమైన మొత్తంలో పరిహారం చెల్లించాలని సంబంధిత రెండు ఆస్పత్రుల నిర్వాహకులను ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. మార్చి 16వ తేదీన బాధిత చిన్నారిని పొరుగింట్లో ఉండే వ్యక్తి చాక్లెట్లు ఆశచూపి తీసుకెళ్లాడు. ఆ చిన్నారి తిరిగి సాయంత్రమైనా ఇంటికి చేరుకోకపోవడంతో రోజుకూలీగా పనిచేసే ఆమె తండ్రి చుట్టుపక్కల వెదికారు. నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో, అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమార్తెను గుర్తించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు ఆస్పత్రుల్లోనూ ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో, చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఏప్రిల్ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చిన్నారికి వైద్యం అందించేందుకు నిరాకరించిన ఖాజన్ సింగ్మాన్వి హెల్త్ కేర్, సెయింట్ జోసెఫ్(మరియం)ఆస్పత్రులకు తగు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టేందుకు ఘజియాబాద్ పోలీసులు తాత్సారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ప్రభుత్వానికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్వో)కు, సంబంధిత ఆస్పత్రులకు, జిల్లా మేజి్రస్టేట్కు నోటీసులు జారీ చేసింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల గుర్తింపుపై గోప్యత పాటించాలని పోలీసులు, ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాన్ని వేధించరాదంటూ పోలీసులకు స్పష్టం చేసింది. -
బకాయిలకు వడ్డీ చెల్లించండి!
‘పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు– అది ఉద్యోగుల హక్కు’ అని సుప్రీంకోర్టు 1982 డిసెంబర్ 17న డి.ఎస్. నకారా కేసులో తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం 2024 మార్చి నుండి ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు హక్కుగా చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కొంతమంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రారంభంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చెల్లింపులు చేసింది కానీ తర్వాత ఆపింది. దీంతో కోర్టు ధిక్కారం కింద హైకోర్టులో కేసులు నమోదయ్యాయి.రిటైర్మెంట్ బకాయిలు 10% వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ కొంతమందికి మాత్రమే పూర్తి స్థాయిలో చెల్లించి, మరికొంత మందికి కొన్ని బిల్లులు మాత్రమే పాక్షికంగా చెల్లించి, పూర్తిగా చెల్లించామని కోర్టు ధిక్కరణకు మళ్లీ ప్రభుత్వం పాల్పడు తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీసులో ఉన్నప్పుడు కొంత మంది హోమ్ లోన్, పర్సనల్ లోన్, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొన్న వారు ఇప్పటికీ వడ్డీలు భారీగా కడుతున్నారు. కాబట్టి గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి లపై10 శాతం వడ్డీ చెల్లించాలి.2024 మార్చి నుండి 2026 జూన్ వరకు దాదాపు 26,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. ఎనిమిది నెలలుగా వివిధ పెన్షనర్ సంఘాలు ఉద్యమాలు చేస్తే వంద రోజులలో ఆరువేల కోట్లు చెల్లిస్తామని – వాటిలో మే నెలలో 2,000 కోట్లు, జూన్లో 2,000 కోట్లు, సెప్టెంబర్ 2025 వరకు కమ్యుటేషన్, జీపీఎఫ్ 100 శాతం చెల్లించామని ప్రకటించుకొంది ప్రభుత్వం. కానీ సెప్టెంబర్ 2025 వరకు ఎస్టీఓలో కమ్యుటేషన్ బిల్లు సబ్మిట్ చేసినప్పటికీ కొంతమందికి రాలేదు.కొంతమందికి జీపీఎఫ్ కూడా రాలేదు. కొంతమంది బిడ్డల పెళ్లిళ్లు ఉన్నాయని పెండ్లి కార్డులు పెట్టినప్పటికీ వారికి జీపీఎఫ్ డబ్బులు అందకపోవడం దారుణం. కాబట్టి వారి టోకెన్ నంబర్లు పరిశీలించి, వారికి ఈ జూలై నెలలో చెల్లించాలి. రిటైర్ అయిన ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ దశలవారీగా కాకుండా ఏక మొత్తంగా ఈ జూలై నెలలోనే చెల్లించాలి.– కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (తెలంగాణ) అసోసియేట్ అధ్యక్షుడు -
ఇటలీలో పాక్ యువతి పరువు హత్య.. ఐదుగురికి యావజ్జీవం
రోమ్: ఇటలీ సుప్రీంకోర్టు ఒక పరువు హత్య కేసులో సంచలన తీర్పును వెలువరించింది. పాకిస్తాన్ సంతతికి చెందిన 18 ఏళ్ల సమన్ అబ్బాస్ హత్యోదంతంలో దోషులుగా తేలిన ఆమె తల్లిదండ్రులు, మరో ఇద్దరు బంధువులకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు సమర్థించింది. మరో నిందితుడైన ఆమె బాబాయికి విధించిన 22 ఏళ్ల జైలు శిక్షను కూడా ఖరారు చేసింది. ఇటలీని కుదిపేసిన ఈ పరువు హత్య కేసులో అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పుతో విచారణ ప్రక్రియ ముగిసింది.2021 ఏప్రిల్లో ఉత్తర ఇటలీలోని నోవెల్లారా నగరంలో సమన్ అబ్బాస్ దారుణ హత్యకు గురయ్యింది. పాకిస్తాన్లో తన బంధువుతో బలవంతంగా జరిపించాలనుకున్న వివాహాన్ని ఆమె వ్యతిరేకించడమే ఈ దారుణానికి కారణమైంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన సమన్, గతంలో అధికారుల సహాయంతో షెల్టర్ హోమ్లో తలదాచుకుంది.అయితే ఏప్రిల్ 2021లో తిరిగి కుటుంబంతో కలిసి వెళ్లిన ఆమె అదృశ్యమయ్యింది. ఆ తర్వాత నిందితులు తమ చేతిలో పనిముట్లతో వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ కీలక ఆధారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, పాకిస్తాన్ నుంచి నిందితులను ఇటలీకి రప్పించారు. ఈ తీర్పుపై స్పందించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.. ఒక మహిళ స్వేచ్ఛా జీవితాన్ని హరించే సంస్కృతి, సంప్రదాయాలకు ఇటలీలో తావులేదని అన్నారు. బాధ్యులకు సరైన శిక్ష పడటం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: విదేశీ యువతికి చీర సింగారించిన కానిస్టేబుల్ -
సుప్రీంకోర్టులో మరోసారి అలజడి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న మరో దూషణల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10వ తేదీన 13వ నంబర్ కోర్టు హాల్లో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సమక్షంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి యూపీలోని ఇటావాకు చెందిన లక్నో యూనివర్సిటీలో మూడో సంవత్సరం లా చదువుతున్న ప్రబల్ ప్రతాప్ సింగ్(24), రాయ్బరేలీకి చెందిన సెకండియర్ లా విద్యార్థి చందర్ భాన్(23)లను అరెస్ట్ చేశారు. పిటిషనర్గా ఉన్న ప్రబల్ సింగ్ ఓ కేసును స్వయంగా వాదించేందుకు కోర్టు హాలుకు వచ్చాడు. ఈ సందర్భంగా చేతిలోని పేపర్లను గాలిలోకి విసిరివేస్తూ, సీజేఐ నుద్దేశించి దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. ఇతడికి చందర్ భాన్ తోడయ్యాడు. అడ్డుకోబోయిన భద్రతా సిబ్బందితో వీరు ఘర్షణ పడ్డారు. దీంతో, కోర్టు కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. భద్రతా సిబ్బందిని ఇద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకుని మానసిక వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే, ఇద్దరికీ ఎలాంటి మానసిక చికిత్స అవసరం లేదని వైద్యులు నిర్ధారించారు. వీరి వద్ద అభ్యంతరకర రాతలున్న కరపత్రాలు లభించాయి. సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాలతో పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ గడువు బుధవారం పూర్తయింది. పోలీసుల వినతి మేరకు తదుపరి విచారణ నిమిత్తం వీరిద్దరినీ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ రవి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్కు అనుమతించారు. వారం క్రితం సుప్రీంకోర్టు హాల్లో విచారణ సమయంలో ఓ లాయర్ అనుచితంగా వ్యవహరించడం, దూషణలకు దిగడం తెల్సిందే. అయితే, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీజేఐ ప్రకటించారు. -
టీచర్లపై చర్యలు తీసుకుంటే ఊరుకోం
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రవేశపెట్టిన త్రిభాషా విధానాన్ని అమలుచేయని ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తగినన్ని పాఠ్యపుస్తకాలు, తగు సంఖ్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకుండా హఠాత్తుగా ఈ విధానాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.కొత్తగా ప్రవేశపెట్టిన భాషలను బోధించని ఉపాధ్యాయులపై యాజమాన్యాలు ఏవైనా చర్యలు తీసుకుంటే బాధితులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఒక వేళ విధుల్లోంచి తొలగిస్తే అందుకు సంబంధించిన ఆదేశాలపై స్టే విధిస్తామని సీజేఐ తెలిపారు. త్రిభాషా విధానం ఆకస్మిక అమలు, వనరుల లేమిపై వివరణ ఇవ్వాలని సీబీఎస్ఈని ఆదేశించారు. విద్యార్థులపై అదనపు భారం.. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్–2023కి అనుగుణంగా సీబీఎస్ఈ మే 15న ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం 2026 జూలై నుంచి ఆరు, తొమ్మిదో తరగతి విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు అయి ఉండాలి. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో ఆకస్మికంగా దీనిని అమలు చేయడం విద్యార్థులపై అదనపు భారం మోపడమేనంటూ కొందరు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని పిటిషన్లలో పేర్కొన్నారు.పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆనంద్ గ్రోవర్, గోపాల్ శంకర్ నారాయణన్, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్ చదివే 14 ఏళ్ల తొమ్మిదో తరగతి విద్యారి్థకి అకస్మాత్తుగా తమిళం నేర్చుకోమని చెబితే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, మౌలిక వసతులు ఎక్కడి నుంచి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం సీబీఎస్ఈకి నోటీస్ జారీచేసి కేసును 29వ తేదీకి వాయిదావేసింది. -
భోజ్శాల వద్ద ముస్లింల ప్రార్థనలకు ప్రత్యేక ప్రదేశం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజ్శాలకు సమీపంలో ముస్లింల ప్రార్థనల కోసం వేరుగా బహిరంగ ప్రదేశాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఇందులో నమాజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ముస్లిం వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై తుది తీర్పు వచ్చే వరకు దీనిని కేవలం తాత్కాలిక ఏర్పాటుగా మాత్రమే భావించాలని పేర్కొంది. భోజ్శాల ప్రాంతంలో నిర్మాణ సంబంధమైన ఎలాంటి మార్పులు చేపట్టరాదంటూ భారత పురాతత్వ విభాగం(ఏఎస్ఐ)ను ఆదేశించింది.అత్యంత సున్నితమైన భోజ్శాల విషయంలో హిందువులు, ముస్లింలు సహనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై రోజువారీ విచారణ చేపట్టి, ఒక పరిష్కారం కనుగొంటామని తెలిపింది. ధార్ జిల్లాలో ఉన్న భోజ్శాల–కమాల్ మౌలా మసీదు సముదాయాన్ని సరస్వతీ మాత ఆలయ ప్రాంగణంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచి్చన ఆదేశాల అంతరార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.‘ఇవి చాలా సున్నితమైన విషయాలు. కోర్టులో మాట్లాడే అంశాలు అనవసరంగా వివాదాలను సృష్టించవచ్చు. తప్పుడు అభిప్రాయాన్ని కలిగించవచ్చు. అందుకు మనం ఉపయోగించే ప్రతి పదం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో మధ్యంతర వెసులుబాటు కోరుతూ మా ముందుకు రావడం ఇదే మొదటిసారి. హైకోర్టు ఆదేశాలను, అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ నిస్సహాయతను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఈ విషయాన్ని 10 నుంచి 15 రోజుల్లోగా తగిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చేలా చూడాలన్నదే మా ఉద్దేశం’అని సీజేఐ మౌఖికంగా వ్యాఖ్యానించారు. -
‘భోజశాల’పై సుప్రీం తీర్పు.. నమాజ్కు నిరాకరణ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని వివాదాస్పద ధార్ భోజశాల ప్రాంగణంలో శుక్రవారం నమాజ్ నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి భోజశాల ప్రాంగణం లోపల నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా దానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ముస్లిం పక్షానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల మధ్య నమాజ్ చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు, భద్రత పర్యవేక్షించాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్లకు నోటీసులు జారీ చేసింది.హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, భోజశాల అత్యంత సున్నితమైన అంశమని, రెండు వర్గాలు సంయమనం పాటించాలని సూచించింది. అవసరమైతే ఈ కేసును రోజువారీ ప్రాతిపదికన విచారించేందుకు సిద్ధమని పేర్కొంది. గతంలో ఈ కాంప్లెక్స్ సరస్వతి ఆలయమేనని స్పష్టం చేస్తూ, అక్కడ నమాజ్ చేసుకోవచ్చన్న దశాబ్దాల నాటి ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.ఇది కూడా చదవండి: సీబీఎస్ఈ: మూడో భాష ఫెయిలైతే టెన్త్ సర్టిఫికెట్ రాదు! -
15 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాం.. మా గోడు వినండి..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ మహిళా పిటిషనర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. 15 ఏళ్లుగా తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోందని, ఒక్కసారి తమ గోడు వినాలని హైదరాబాద్కు చెందిన ఓ మహిళ... ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ను వేడుకున్నారు. అవసరమైతే ఆన్లైన్లో విచారణకు హాజరుకావాలని, అనవసరంగా ప్రయాణ ఖర్చులు భరించవద్దని సీజేఐ సూచించారు. తన కేసుకు సంబంధించి స్వయంగా వాదనలు వినిపించేందుకు హైదరాబా ద్ నుంచి వచ్చిన సదరు మహిళ సోమవారం ఉదయం మెన్షన్ సమయంలో మాట్లాడుతూ... ‘పదిహేనేళ్లుగా మేం జీవచ్ఛవాల్లా బతుకుతున్నాం. మా కుటుంబాలు పూర్తిగా నాశనమయ్యాయి. పిల్లలకు కనీసం తిండిపెట్టలేని, చదువు చెప్పించలేని దీనస్థితిలో ఉన్నాం. నా బాధ మీ మనసుకు చేరాలనే ఇక్కడికి వచ్చాను. ఒక మహిళకు మంగళసూత్రం కంటే మరేదీ ఎక్కువ కాదు.. ఇప్పుడు నా మెడలో ఏముందో చూడండి’ అంటూ తన మంగళసూత్రం తీస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆన్లైన్లో హాజరుకండి: సహారా ఆస్తుల విక్రయ వ్యవహారాలకు సంబంధించిన ఈ కేసులో మహిళ ఆవేదనకు స్పందించిన జస్టిస్ సూర్యకాంత్ ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘మీరు సుప్రీంకోర్టుకు రావడానికి ప్రయాణ ఖర్చులు వృథా చేసుకోవద్దు. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో హాజరుకండి. మీ వాదనలు ఎంతసేపైనా వింటాం. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం ఉంటుంది’ అని సీజేఐ చెప్పారు. సీజేఐ సూచనను మహిళ సున్నితంగా తిరస్కరించారు. తన జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదని, తదుపరి విచారణకు కూడా తాను స్వయంగా వస్తానని పట్టుబట్టారు. దీంతో వచ్చే వారం ఈ కేసు కోసం ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. ఆ రోజు బోర్డు జాబితాలో ఈ కేసును మొదటి వరసలో ఉంచుతామని, ప్రత్యేక ధర్మాసనమే కేసును విచారిస్తుందని చెప్పారు. -
ఒక సెమిస్టర్ చదివితే.. ఏడాది కింద లెక్కించలేం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్ఓ) నియామకాల వ్యవహారంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిగ్రీలో కనీసం ఏడాదిపాటు స్టాటిస్టిక్స్ చదివి ఉండాలన్న నిబంధన ఉన్నప్పుడు, కేవలం ఒక సెమిస్టర్ (ఆరు నెలలు) మాత్రమే ఆ సబ్జెక్టును చదివిన అభ్యర్థులను అర్హు లుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అభ్యర్థుల అర్హత వివా దంపై వై.జగదీష్ తదితరులు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. బీటెక్ అభ్యర్థులు తమ కోర్సులో భాగంగా ఒక సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ చదివారని చెప్పారు. రాతపరీక్షలో వీరు 7వ ర్యాంకు లాంటి అత్యుత్తమ మెరిట్ సాధించినప్పటికీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో టీజీపీఎస్సీ వీరిని అనర్హులుగా ప్రకటించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. సెమిస్టర్ విధానంలో ఏడాది సిలబస్ను ఆరు నెలలకే కుదించి బోధిస్తారని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ అకడమిక్ నిపుణుల కమిటీ సైతం దీనికి ఆమోదం తెలిపిందని వాదించారు.నిపుణుల కమిటీ నివేదికే కీలకంనిబంధనల్లో స్పష్టంగా ’ఒక ఏడాది’ అని పేర్కొన్నప్పుడు, కేవలం ఒక సెమిస్టర్ మాత్రమే చదివితే ఆ నిబంధనను ఎలా సంతృప్తి పరుస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ అంశంపై తెలంగాణ అకడమిక్ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ధర్మాసనం ప్రస్తావించింది. ఒక విద్యా సంవత్సరం అనగా 12 నెలలు లేదా రెండు సెమిస్టర్లు అని, ఫౌండేషన్ కోసం కేవలం ఆరు నెలలు చదివిన సబ్జెక్టును పూర్తి అకడమిక్ ఇయర్లో చదివినట్లుగా పరిగణించలేమని కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. అకడమిక్ అంశాలకు సంబంధించి నిపుణుల కమిటీలదే తుది నిర్ణయమని, వారి అభిప్రాయాన్ని కాదని న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను రుద్దలేవని జస్టిస్ మనోజ్ మిశ్రా స్పష్టం చేశారు. -
కొడుకుపై కేసును తండ్రిపై ఎలా నమోదు చేస్తారు?
బెంగళూరు: కుమారుడిపై ఉన్న కేసునే తండ్రిపైనా ఎలా నమోదు చేస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివరాలు.. మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ కుమారుడైన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో రేవణ్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి నిందితునిగా చేర్చారు. దీనిని రేవణ్ణ హైకోర్టులో సవాల్ చేయగా.. ఆయన పిటిషన్ను కొట్టివేసింది. అలాగే ఒక సెక్షన్ను తొలగించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ‘ఇద్దరిపై భిన్నమైన ఆరోపణలున్నాయి. కానీ ఒకే కేసుగా భావించి.. కొడుకుపై ఉన్న కేసునే తండ్రిపై ఎలా నమోదు చేస్తారు. చట్టంలో ఈ అవకాశం ఉందా? దౌర్జన్యం కేసును రద్దు చేసి.. లైంగిక దాడి కేసుగా విచారించాలని ఆదేశించడం ఔచిత్యమేనా?’ అని కర్ణాటక హైకోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయడంలో చేసిన జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి.. విచారణను వాయిదా వేసింది. -
టికెట్ ధరల బాదుడుపై కోర్టు సీరియస్!
విమాన చార్జీల నియంత్రణ, ప్రయాణికుల హక్కుల పరిరక్షణ దిశగా అత్యున్నత న్యాయస్థానం కీలక అడుగు వేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు విధిస్తున్న ఏకపక్ష చార్జీల పెంపునకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన కొత్త విమానయాన నిబంధనలను రెండు వారాల్లోగా తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రెండు వారాల్లోగా నివేదికజస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌర విమానయాన నియంత్రణ, ప్రయాణికులపై విధిస్తున్న అదనపు భారాలను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నిబంధనల ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ‘సీల్డ్ కవర్’ (రహస్య పత్రం) రూపంలో కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ.. ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ కింద నిబంధనల రూపకల్పన ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం వాటి అధికారిక అనువాద ప్రక్రియ జరుగుతోందని అది ముగియగానే పార్లమెంటు ముందు ఉంచుతామని ధర్మాసనానికి వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ పార్లమెంటు ఆమోదం కంటే ముందే కోర్టు పరిశీలన కోసం వాటిని అందజేయాలని ఆదేశించింది.చార్జీల దోపిడీపై కోర్టు ఆందోళనపండుగలు, ప్రత్యేక సెలవులు, కుంభమేళా వంటి భారీ ఈవెంట్ల సమయంలో ప్రైవేట్ ఎయిర్లైన్స్ విమాన చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయని (డైనమిక్ ప్రైసింగ్), ఇది ప్రయాణికులను తీవ్రంగా దోపిడీ చేయడమేనని గత విచారణల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఉదాహరణకు, మహాకుంభ్ సమయంలో భోపాల్-ప్రయాగ్రాజ్ మార్గంలో వన్-వే విమాన చార్జీలు ఏకంగా 498 శాతం పెరిగి రూ.2,977 నుంచి రూ.17,796కి చేరిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు.పారదర్శకతలేని విధానాలుపిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ విమాన చార్జీలు, లగేజీ రుసుములు, ఇతర అనుబంధ చార్జీలను నియంత్రించడానికి స్పష్టమైన చట్టబద్ధమైన అధికార సంస్థ లేకపోవడం వల్లే ఎయిర్లైన్స్ పారదర్శకత లేని విధానాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు ఉచిత చెక్ఇన్ బ్యాగేజీ పరిమితిని 25 కిలోల నుంచి 15 కిలోలకు తగ్గించి, అదనపు లగేజీపై భారీగా వసూలు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా కేవలం అదనపు ఆదాయ వనరుగా మార్చుకున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.కొత్త చట్టం - నిబంధనల అవశ్యకతబ్రిటిష్ కాలం నాటి ‘ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్, 1934’ స్థానంలో సివిల్ ఏవియేషన్ రంగాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ జనవరి 2025 నుంచి అమలులోకి వచ్చింది. అయితే, దీని పరిధిలో ప్రయాణికుల రక్షణ, ధరల నియంత్రణకు సంబంధించిన పూర్తి స్థాయి నిబంధనలు ఇంకా నోటిఫై కాలేదు. ప్రస్తుత చట్టాల ప్రకారం విమాన చార్జీలు పూర్తిగా మార్కెట్ శక్తుల ఆధారంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల హక్కులను రక్షించేందుకు కఠినమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు భావిస్తోంది.ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది? -
పౌరసత్వ నిర్ధారణ హేతుబద్ధంగా ఉండాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఒక వ్యక్తికి చెందిన పౌరసత్వ నిర్ధారణ అనేది రాజ్యాంగపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని, అందువల్ల ఈ ప్రక్రియ తప్పనిసరిగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, హేతుబద్ధంగా సాగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలోని వివిధ ‘ఫారినర్స్ ట్రిబ్యునళ్లు’ 27 మందిని విదేశీయులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పులను గతంలో గౌహతి హైకోర్టు సమర్థించింది. అయితే ఆ హైకోర్టు ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది.బాధితులు దాఖలు చేసిన 27 అప్పీళ్లను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం వీటిపై నిష్పక్షపాతంగా సరికొత్త విచారణ జరపాలని సదరు ట్రిబ్యునళ్లకు కేసులను రిమాండ్ చేసింది. పౌరసత్వాన్ని తిరస్కరించే ప్రక్రియలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని కోర్టు పేర్కొంది. అదే సమయంలో చట్ట విరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వం పొందకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం గుర్తుచేసింది.దేశ భద్రత, సరిహద్దుల అంశాల నెపంతో ప్రాథమిక న్యాయ ప్రక్రియను విస్మరించలేమని స్పష్టం చేసింది. అయితే, ఈ 27 కేసులలోని ఆధారాలు, పత్రాల యోగ్యతలపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని, ట్రిబ్యునళ్లే వీటిని స్వతంత్రంగా పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: 14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్! -
గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు!
న్యూఢిల్లీ: తమిళనాడు వ్యాప్తంగా గోవధను సంపూర్ణంగా నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన ఈ వివాదాస్పద తీర్పును సవాలు చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.బక్రీద్ లేదా మరే ఇతర రోజుల్లోనైనా ఆవులు, దూడల వధను పూర్తిగా నిషేధించాలని మే 27న మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో గోవధను అరికట్టాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి ప్రధాన కార్యదర్శి కె. సూర్య ప్రశాంత్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. హైకోర్టు ఒక పరిధిని మించి పూర్తి నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. లైసెన్స్ పొందిన వధశాలల్లో కూడా ఆవుల వధను నిషేధించడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం పేర్కొంది.తమిళనాడు జంతు సంరక్షణ చట్టం 1958, పట్టణ స్థానిక సంస్థల చట్టం 1998, 2023 నిబంధనలు జంతువుల వధను క్రమబద్ధీకరించడానికే ఉద్దేశించినవని, పూర్తిగా నిషేధించడానికి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల అమలుపై మధ్యంతర స్టే మంజూరు చేసింది.ఇది కూడా చదవండి: బద్రీనాథ్ విరాళాల చోరీ: సస్పెండైన ఉద్యోగి అరెస్ట్ -
లోక్ అదాలత్కు జ్ఞానవాపి, మథుర.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: దేశంలో వివాదాస్పదంగా మారిన జ్ఞానవాపి మసీదు, మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు, సంభాల్ హరిహర మందిరం-మసీదు కేసులను సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్కు బదిలీ చేసింది. సుదీర్ఘ కోర్టు వ్యాజ్యాల కంటే చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనేందుకు ఆగస్టు 21 నుంచి 23 వరకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘సమాధాన్ సమారోహ్’ పేరిట ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరుపక్షాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.గత ఏప్రిల్ 21 నుంచే కింది కోర్టుల్లో ముందస్తు రాజీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జూలై 14న వారణాసిలో జ్ఞానవాపి కేసుపై ముందస్తు విచారణ జరగనుంది. కాగా మథుర వివాదంలో జూలై 5న జరిగిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలం కావడంతో, సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ప్రత్యేక లోక్ అదాలత్ పరిధిలోకి తెచ్చింది.మొఘల్ కాలంలో ఆలయాలను కూల్చివేసి ఈ మసీదులను నిర్మించారంటూ హిందూ పక్షాలు కోర్టులను ఆశ్రయించగా, 1991 నాటి ఆరాధనా స్థలాల చట్టం ప్రకారం ఈ పిటిషన్లు చెల్లవని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి. గత ఏడాది సంభాల్ మసీదు సర్వే ఉద్రిక్తతలకు దారితీసి, పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూడు వివాదాల్లోని చట్టపరమైన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. -
సుప్రీంకోర్టులో హైడ్రామా.. జడ్జీలపై పేపర్లు విసిరి!
-
సుప్రీంలో పిటిషనర్ వీరంగం
సాక్షి, న్యూఢిల్లీ: సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం ఓ పిటిషనర్ తీవ్రస్థాయిలో వీరంగం సృష్టించాడు. విచారణ సమయంలో న్యాయమూర్తులపైకి పేపర్లు విసిరేయడంతోపాటు తీవ్ర పదజాలంతో దూషణలకు దిగాడు. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని కోర్టు హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే సదరు పిటిషనర్ ప్రవర్తనపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టబోమని, అతడిపై తమకు సానుభూతి మాత్రమే ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మెరిట్స్ ఆధారంగా అతడి పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రబల్ ప్రతాప్ దాఖలు చేసిన దరఖాస్తును భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 173(4) కింద ప్రైవేట్ ఫిర్యాదుగా పరిగణించాలని కింది కోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. దాంతో ప్రబల్ ప్రతాప్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేశాడు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. నల్లకోటుతో వచ్చిన పిటిషనర్ ప్రబల్ ప్రతాప్ న్యాయవాదులు మెడలో ధరించే టై ఏదీ కట్టుకోలేదు. స్వయంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాడు. న్యాయమూర్తులు అతడి పేరు, వివరాలను తెలుసుకుని ‘స్వయంగా వాదనలు వినిపిస్తారా’అని ప్రశ్నించారు. అవునని సమాధానం ఇచ్చాడు. అనంతరం వాదనలు వినిపిస్తూ ఆరంభం నుంచే తీవ్ర అసహనంతో, దూకుడుగా వ్యవహరించాడు. న్యాయపరమైన అంశాలు కాకుండా ధర్మాసనాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లక్నో ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని డిమాండ్ చేశాడు. ‘మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్.. లక్నోలోని వికాస్ నగర్ ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. ఎందుకంటే నేను సార్వ¿ౌముడిని’అని బిగ్గరగా అరుస్తూ చెప్పాడు. నన్ను ఆదేశిస్తున్నావా? మమ్మల్ని ఆదేశిస్తున్నావా? పిటిషనర్ వాదనలు, ప్రవర్తన పట్ల ధర్మాసనం తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ.. ‘నువ్వు నన్ను ఆదేశిస్తున్నావా? మమ్మల్ని ఆదేశిస్తున్నావా?’అని ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ బదులిస్తూ.. ‘నా వైపు నుంచి చెప్పాల్సింది అంతే.. అంతా రికార్డుల్లో ఉంది’అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అతడి ప్రవర్తన మరింత శృతి మించింది. తన చేతిలో ఉన్న కేసుకు సంబంధించిన పేపర్ల కట్టను న్యాయమూర్తులపైకి విసిరేశాడు. కోర్టు హాల్లో ఆ పేపర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ‘వీటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వండి’అంటూ ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషించాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ సంఘటన పట్ల ధర్మాసనం ఎంతో సంయమనంతో వ్యవహరించింది. పిటిషనర్పై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడం లేదని జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. ‘మేము రికార్డులను పరిశీలించాం. కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి సరైన కారణాలు కనిపించడం లేదు. కాబట్టి ప్రబల్ ప్రతాప్ పిటిషన్ను కొట్టివేస్తున్నాం’అని ధర్మాసనం తమ తీర్పులో తేల్చిచెప్పింది. పిటిషనర్ తీవ్ర ఆందోళన, నిరాశలో ఉన్నాడని, అతడి పట్ల తమకు కేవలం సానుభూతి మాత్రమే ఉందని జస్టిస్ విశ్వనాథన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గతంలో సీజేఐపైకి బూటు సుప్రీంకోర్టులో వ్యక్తుల అనుచిత ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. 2025లో ఓ న్యాయవాది అప్పటి ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్పై బూటు విసిరాడు. కోర్టు సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆ తరువాత ఆ న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. బార్ కౌన్సిల్ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే చర్యలు ప్రారంభించింది. ఈ ఘటన కంటే ముందు 2009లో జస్టిస్ అరిజిత్ పసాయత్పై ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. 1968లో మరో వ్యక్తి చేతిలో కత్తితో న్యాయమూర్తుల వైపు దూసుకెళ్లాడు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అతడిని అడ్డుకున్నారు. -
భార్యను కాదని ఇతరులకు ఆస్తి.. ఆ వీలునామా చెల్లదు!
సాక్షి, న్యూఢిల్లీ: చట్టబద్ధమైన వారసురాలైన భార్యను కాదని, ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తులకు ఆస్తిని రాసిస్తూ చేసే వీలునామాలను అసహజమైనవిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అనుమానాస్పద పరిస్థితుల మధ్య రాసిన వీలునామాలను కేవలం రిజి్రస్టేషన్ జరిగిందనో, సాక్షుల సంతకాలు ఉన్నాయనో ఆమోదించలేమని తేల్చిచెప్పింది. వీలునామా అసలైనదేనని నిరూపించి, కోర్టు అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఆస్తి లబ్ధిదారులపైనే ఉంటుందని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సర్దారీ లాల్ వర్సెస్ బిషన్ దాస్ కేసులో అసలు ఆస్తి యజమాని చజ్జు రామ్ మరణానంతరం, ఆస్తికి తానే ఏకైక వారసురాలినని పేర్కొంటూ ఆయన భార్య భాంబో దేవి సివిల్ దావా వేశారు. అయితే, చజ్జు రామ్కు తాము సేవలు చేసినందుకు ప్రతిఫలంగా 1974లో ఆస్తి రాసిస్తూ రిజిస్టర్డ్ వీలునామా చేశారని ప్రతివాదులైన బిషన్ దాస్ తదితరులు కోర్టులో వాదించారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. వీలునామా వెనుక భాగంలో సబ్– రిజిస్టర్ ధ్రువీకరణ వద్ద పేర్ల కొట్టివేతలు ఉన్నాయని, లబి్ధదారుల్లో ఒకరు అప్పటికి చిన్న పిల్లవాడని, భార్యను కాదని ఆస్తిని ఇతరులకు ఇవ్వడం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం వీలునామా చెల్లుబాటుపై కీలక వ్యాఖ్యలు చేసింది. క్లాస్–1 వారసురాలైన భార్యను పూర్తిగా పక్కనబెట్టి, ఎలాంటి రక్తసంబంధం లేని వ్యక్తులకు ఆస్తిని కట్టబెట్టడం సహజ విరుద్ధమని పేర్కొంది. ఇది వీలునామా విశ్వసనీయతపై తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తోందని తెలిపింది. చదువుకోని వ్యక్తి రాసిన వీలునామా కావడంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొట్టివేతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. వీలునామాపై అనుమానాలు ఉన్నప్పుడు, కేవలం దానికి సాక్షుల బలముందన్న ఒకే ఒక్క కారణంతో గుడ్డిగా ఆమోదించరాదంది. ఆ అనుమానాలను నివృత్తి చేసి స్వేచ్ఛాయుత వాతావరణంలోనే దానిని రాశారని న్యాయస్థానాన్ని సంతృప్తి పరచాల్సిన బాధ్యత లబి్ధదారులదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు, మొదటి అప్పీలేట్ కోర్టులు దానిని కొట్టివేయగా.. సాక్షుల వాంగ్మూలం ఉన్నందున వీలునామాను సమరి్థస్తూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పు నిచి్చంది. దీనిపై దాఖలైన అప్పీల్ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తన పరిధిని మించి వ్యవహరించిందని తప్పుబట్టింది. -
సీఎం విజయ్ పర్యటనను నియంత్రించజాలం
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట కేసులో నిందితుడిగా లేరని, ఆయన పర్యటనను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం విజయ్ పర్యటనను ప్రశ్నిస్తూ, అలాగే ఈ వ్యవహారంలో మంత్రులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే వేసిన పిటిషన్పై మంగళవారం జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరా«ధేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ముఖ్యమంత్రి పర్యటనను నియంత్రించాలని, ఆయన పర్యటన షెడ్యూల్ను కూడా మేమే ఖరారు చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఇదెలా సాధ్యం?’అని ప్రశ్నించింది.న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దని వ్యాఖ్యానించింది. పిటిషనర్గా ఉన్న డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే ప్రభుత్వంలోని మంత్రులు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అలాంటప్పుడు, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలపై ధిక్కార పిటిషన్ వేయాలని కూడా డీఎంకే ఆలోచిస్తోందన్నారు.ఈ కేసు గురించి సీఎం, మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం..‘అంటే వాక్ స్వాతంత్య్రంపై మేం నిషేధాజ్ఞలు విధించాలని కోరుకుంటున్నారా? వారి మాటలకు మీరు కూడా మాటలతోనే సమాధానం చెప్పండి. ఈ కేసును సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేసింది. అలాంటప్పుడు, ఒక రాజకీయ ప్రత్యర్థి ఈ కేసులో ఒక పక్షంగా చేరాలని ఎలా కోరగలరు?’అని ప్రశ్నించింది. అయితే, సీబీఐ దర్యాప్తు ముగిసే వరకు కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, విచారణను ప్రభావితం చేయరాదన్నది మాత్రమే తమ ఉద్దేశమని రంజిత్ కుమార్ వివరించారు.వాక్ స్వాతంత్య్రాన్ని మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలన్నది డీఎంకే పార్టీ అభిమతమన్నారు. మరలాంటప్పుడు, ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచి్చన విధంగా తొక్కిసలాట బాధితులకు రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి చొప్పున ఉద్యోగం ఇవ్వడం దర్యాప్తును ఎలా ప్రభావితం చేయగలదని ధర్మాసనం లాయర్ రంజిత్ కుమార్ను అడిగింది. పిటిషన్ను ఉపసంహరించుకునే అవకా>శం డీఎంకేకు కల్పిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డు జస్టిస్ అజయ్ రస్తోగి సారథ్యంలోని కమిటీని ఆశ్రయించవచ్చని సూచించింది. -
తప్పు చేసి ప్రైవసీ అంటే కుదరదు
న్యూఢిల్లీ: భర్త తప్పు చేసి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని చెప్పజాలరని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విడాకుల కోసం వ్యభిచారం ఆరోపణలు రుజువు చేసే కాల్డేటా, హోటల్ బుకింగ్ వంటి ఆధారాలు సేకరించేందుకు భార్య న్యాయస్థానం సాయం తీసుకోవడంలోనూ తప్పులేదని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యభిచారాన్ని వ్యక్తిగత ప్రైవసీ పేరుతో రక్షణ కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. 2023 మే 10వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.వ్యక్తిగత గోప్యతకు రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ దానిపై కొన్ని పరిమితులున్నాయని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాహమైనప్పటికీ ఇతర మహిళతో అక్రమ సంబంధం నెరపిన వ్యక్తి తాలూకూ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాల కిందకు రావు అని కోర్టు స్పష్టం చేసింది. తన భర్త ఇంకో స్త్రీతో కూతురిని కన్నాడని, మరో మహిళతోనూ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ ఒక మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఒక హోటల్లో భర్త, ఒక మహిళ కలిసి ఉన్నారని ఇందుకు సంబంధించిన వివరాలు, హోటల్ రిజర్వేషన్, పేమెంట్ రికార్డులను కాపాడాలని అభ్యర్ధించింది.విచారణ జరిపిన న్యాయస్థానం వివరాలను జాగ్రత్త చేయాలని, సీల్డ్ కవర్లో తమకు అందజేయాలని 2022లో∙ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆధారాలు ఆ వ్యక్తి అక్రమ సంబంధాన్ని రుజువు చేసేందుకు సరిపోతాయా? అని ఫ్యామిలీకోర్టు స్పష్టం చేయలేదు. ఇదే విషయమై భర్త ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లాడు. వివరాలు సేకరించడంతో తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు వ్యక్తిగత గోప్యత కంటే సాక్ష్యాల కోసం భార్య అభ్యర్థన ముఖ్యమని స్పష్టం చేసింది.అక్రమ సంబంధాన్ని రుజువు చేసే ఇలాంటి ఆధారాలు చాలా అరుదుగా లభిస్తాయని తెలిపింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనుమతించని సాక్ష్యాలను పరిగణలోకి తీసుకునేందుకు ఫ్యామిలీ కోర్టు నిబంధనలు సెక్షన్ 14 అనుమతిస్తుందని తెలిపింది. హోటల్ రిజర్వేషన్, గుర్తుంప కార్డులతో ఉంటే భర్త మరో మహిళతో ఉన్నట్లు తెలుపుతుందని, కాల్ రికార్డులు ఎన్నిసార్లు ఆ మహిళకు కాల్ చేశారు? అసాధారణంగా ఎంతసేపు మాట్లాడారు అన్నది స్పష్టం చేస్తుందని కోర్టు వివరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం అక్రమ సంబంధం కలిగి ఉండటం విడాకుల మంజూరుకు ప్రాతిపదిక అని, వ్యక్తిగత గోప్యత పేరుతో భర్తను కాపాడటంలో ప్రజా ప్రయోజనమేమీ లేదని స్పష్టం చేస్తూ భర్త పిటిషన్ను కొట్టివేసింది. -
ఇది సైనేడ్తో సమానం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ సందర్భంగా కృత్రిమ మేధ(ఏఐ) సృష్టించిన కల్పిత తీర్పు కాపీలను ఆధారంగాచేసుకుని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ) ఇటీవల ఒక తీర్పు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తంచేసింది. న్యాయస్థానాల్లో ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏఐ సష్టించిన తప్పుడు తీర్పులను న్యాయవాదులు కోర్టుల ముందుంచడం వృత్తిపరమైన దు్రష్పవర్తన కిందకే వస్తుందని తేల్చిచెప్పమంది.అలాగే, వాటిపై ఆధారపడి న్యాయమూర్తులు నిర్ణయాలు తీసుకోవడం తీవ్రమైన తప్పిదమని, అటువంటి తీర్పులు చట్టం దృష్టిలో ఏమాత్రం చెల్లవని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కృత్రిమమేధ సృష్టించిన తీర్పు కాపీని ఎన్సీఎల్టీ వాస్తవమైన తీర్పుగా భావించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటివి చేయడమంటే చట్టానికి మిౖథెల్ ఐసోసైనేట్(సైనేడ్)ను ఇచ్చినట్లు అవుతుంది. ఇవి చట్టం, న్యాయవ్యవస్థలోకి చొరబడితే ఇవి చొరబడినట్లుకూడా ఎవరూ కనిపెట్టలేరు.గుర్తించడానికి వీల్లేకుండా అదృశ్యంగా, అంతర్గతంగా ఉంటూ అత్యంత దారుణాలకు కారణమవుతాయి. ఇవి న్యాయవ్యవస్థను కలుషితం చేయడమేకాదు యావత్ న్యాయవ్యవస్థ అంకితభావంలోని ఆత్మను చంపేస్తాయి’’అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ‘‘అసలు ఇలాంటి తీర్పు నిజంగా ఉందో లేదో సరిచూసుకోకుండా న్యాయవాదులు తమ కేసుల పత్రాలకు వీటిని జతచేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. ఇలాంటి వాటిని కోర్టులు ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఇలాంటి కల్పిత, ఊహాత్మక, ఊహాజనిత తీర్పు కాపీలను వాస్తవమైనవిగా భావించి న్యాయమూర్తి సైతం తీర్పు చెబితే అక్కడ సైతం న్యాయవితరణ లోపించినట్లే భావించాలి. కోర్టుల దృష్టిలో ఇలాంటి తీర్పులు అసలు తీర్పులే కావు. ఇలాంటి కల్పిత తీర్పు కాపీలు న్యాయవ్యవస్థలో చొరబడితే న్యాయవ్యవస్థ పవిత్రతకు భంగం వాటిల్లుతుంది’’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మార్గదర్శకాలు రూపొందించండి న్యాయ నిర్ణయ ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు, తప్పుల తడకగా ఉన్న కల్పిత తీర్పుల ఆధారంగా ముంబైలోని ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉనికిలో లేని ఏఐ కల్పిత తీర్పులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే న్యాయవాదులపై తీసుకునే క్రమశిక్షణా చర్యలతో సహా కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఒక దారి మూసుకుపోయింది.. ఇప్పుడు ప్లాన్-బీ రెడీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'బర్త్రైట్ సిటిజన్షిప్' నిర్ణయంపై అత్యున్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. అయితే ట్రంప్ వెంటనే ప్లాన్-బీ అమల్లోకి తెచ్చారు. "కోర్టు అడ్డుకున్నా.. నేను ఆగను" అన్నట్లుగా కొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఇంతకీ దాన్ని అధిగమించేందుకు ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు?అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం కల్పించే 'బర్త్రైట్ సిటిజన్షిప్' (Birthright Citizenship) విధానాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రయత్నాలకు అమెరికా సుప్రీంకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీయుల పిల్లలకు కూడా పుట్టుకతోనే పౌరసత్వ హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆయన పెద్ద షాకే తలిగిందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడితో ఆగే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు."కోర్టు తీర్పు నిరాశ కలిగించినా.. నా దారి నాకుంది" అంటూ కొత్త వ్యూహాన్ని ప్రకటించారు. దీంతో ట్రంప్ తదుపరి అడుగు ఏంటన్న దానిపై అమెరికా రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship)పై కీలక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు, హక్కుల సంఘాలు కోర్టులో సవాల్ చేశాయి. దిగువ కోర్టులు ఇప్పటికే ఆ ఉత్తర్వును నిలిపివేయగా.. తాజాగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని సమర్థించింది.సుప్రీంకోర్టు ఏమంది?..ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో కీలక తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (Fourteenth Amendment) ప్రకారం అమెరికా భూభాగంలో జన్మించిన దాదాపు ప్రతి వ్యక్తికీ పౌరసత్వ హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అక్రమంగా లేదంటే తాత్కాలికంగా అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా అమెరికా చట్టాల పరిధిలోనే ఉంటారని, అందువల్ల వారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని కోర్టు పేర్కొంది. ఈ హక్కును తొలగించాలంటే కేవలం అధ్యక్ష ఉత్తర్వు సరిపోదని, రాజ్యాంగ పరమైన మార్పులు అవసరమనే విషయాన్ని కూడా తీర్పు స్పష్టం చేసింది.ట్రంప్ స్పందన ఏంటి?సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఈ తీర్పు అమెరికాకు మంచిది కాదు. కానీ దీనిని కాంగ్రెస్లో చట్టం ద్వారా సులభంగా సరిచేయవచ్చు. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కాంగ్రెస్ ఈ రోజే పని ప్రారంభించాలి. వారికి నా పూర్తి మద్దతు ఉంటుంది" అని పేర్కొన్నారు. జన్మహక్కు పౌరసత్వం వల్ల అమెరికాపై భారీ ఆర్థిక భారం పడుతోందని, ప్రస్తుత విధానం దేశానికి అన్యాయమని ఆయన మరోసారి వాదించారు.అంతేకాదు.. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. "చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు అభినందనలు" అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభించే ప్రస్తుత విధానం అక్రమ వలసలను, 'బర్త్ టూరిజం'ను ప్రోత్సహిస్తోందని ట్రంప్ మరోసారి ఆరోపించారు. ఈ తీర్పుతో చైనా సహా ఇతర దేశాల పౌరులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జస్టిస్ డిపార్ట్మెంట్ ఏమందంటే..సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ అక్రమంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు జరుగుతున్న 'బర్త్ టూరిజం' (ప్రసవం కోసం అమెరికాకు వెళ్లడం)పై చర్యలు కొనసాగుతాయని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. చట్టంలోని లోపాలను ఉపయోగించుకుని పౌరసత్వం పొందేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఇక ముందు ఏం జరగొచ్చు?సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు అమలు దాదాపు నిలిచిపోయినట్లే. అయితే జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేసేలా కాంగ్రెస్లో కొత్త చట్టం తీసుకురావాలని ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. అయితే రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధంగా అలాంటి చట్టం నిలబడుతుందా? లేదంటే మళ్లీ కోర్టుల్లోనే నిలిచిపోతుందా? అన్నది ఇప్పుడు అమెరికా రాజకీయాలు, న్యాయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. -
‘పుట్టుకతో పౌరసత్వం’ సబబే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసల విధానానికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు భారీ ఊరట లభించింది. అమెరికా గడ్డపై జన్మించినవారికి పౌరసత్వం ఇవ్వడం సమంజసమేనని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ‘జన్మతః పౌరసత్వం’వెసులుబాటుకు కళ్లెం వేస్తూ డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న వారికి పుట్టిన పిల్లలు అమెరికా పౌరులు కారని తేల్చిచెబుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది.జన్మతః పౌరసత్వం విస్తృత భావనను సమర్థించింది. తల్లిదండ్రులు అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా ఉన్నప్పటికీ.. వారికి పుట్టిన పిల్లలకు 14వ రాజ్యాంగ సవరణ అమెరికా పౌరసత్వాన్ని కల్పిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రంప్ ఆర్డర్ను నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు 6–3 తీర్పుతో సమర్థించింది. ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఇక్కడి పౌరులేనని(చాలా పరిమితమైన మినహాయింపులతో) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చరిత్రాత్మక తీర్పునిచ్చారు.అంతర్యుద్ధం తర్వాత ఆమోదించిన 14వ సవరణపై సుదీర్ఘకాలంగా ఉన్న అవగాహనపై, ఇటీవలి ఫెడరల్ చట్టాలపైనా ఆధారపడి ఈ తీర్పును వెలువరించారు. ‘‘అçప్పుడైనా, ఇప్పుడైనా పౌరసత్వం అంటే హక్కులను కలిగి ఉండే హక్కు. అంటే రాజకీయ సమాజంలో స్వేచ్ఛగా పాలుపంచుకునే హక్కు. 14వ రాజ్యాంగ సవరణను రూపొందించినవారు.. ఈ దేశంలో స్వేచ్ఛగా జన్మించిన ప్రతి వ్యక్తికీ పౌరసత్వం హామీని వర్తింపజేశారు. ఆ వాగ్దానాన్ని ఈ రోజు మనం నిలబెట్టుకుంటున్నాం’’అని న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ తమ తీర్పులో వెల్లడించారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ఆరుగురు జడ్జీలు వ్యతిరేకించగా, ముగ్గురు సమర్థించారు. ‘బర్త్ టూరిజం’ఆందోళనకరం: డి.జాన్ సౌర్ అమెరికాలో జన్మించిన విదేశీయుల పిల్లలకు పౌరసత్వం విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ట్రంప్ నిర్ణయాన్ని యూఎస్ సొలిసిటర్ జనరల్ డి.జాన్ సౌర్ సమర్థించారు. జన్మతః పౌరసత్వ నిబంధనను ప్రధానంగా పూర్వకాలంలో బానిసలుగా ఉన్నవారికి, వారి పిల్లలకు పౌరసత్వం మంజూరు చేయడానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. అమెరికాలో ‘బర్త్ టూరిజం’విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసమే విదేశీయులు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారని విమర్శించారు.అయితే, ఇందులో నిజం ఎంతో చెప్పాలని న్యాయమూర్తులు ప్రశ్నించగా, కచ్చితమైన గణాంకాలు లేవని అంగీకరించారు. అమెరికా రాజ్యాంగం, న్యాయపరమైన నిర్ణయాలు, వ్యాఖ్యానాలు జన్మతః పౌరసత్వాన్ని బలంగా సమర్థిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు అమల్లోకి వస్తే తమ పౌరసత్వ హక్కులకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ట్రంప్ ఉత్తర్వులు ప్రతికూల పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరించారు. అమెరికాలో ఏటా జన్మంచే దాదాపు 2,50,000 మంది శిశువులపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని, అలాగే లక్షలాది కుటుంబాలు తమ శిశువుల పౌరసత్వ హోదాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు వెల్లడించారు. ట్రంప్కు ఈ ఏడాది రెండో పరాభవం సుప్రీంకోర్టులో ఈ కేసు మౌఖిక వాదనల సందర్భంగా ఒకసారి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఎదుట హాజరైన తొలి సిట్టింగ్ అమెరికా అధ్యక్షుడిగా రికార్డుకెక్కారు. కానీ, కేసులో విచారణ ముగియక ముందే అక్కడినుంచి వెళ్లిపోయారు. అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది ట్రంప్ కీలక విధానపరమైన నిర్ణయాన్ని రద్దు చేయడం ఇది రెండోసారి. ప్రపంచవ్యాప్తంగా విధించిన విస్తృతమైన సుంకాలను కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కొట్టివేసింది. తాజాగా ట్రంప్ పరిపాలనా యంత్రాంగానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.జన్మతః పౌరసత్వం అనేది వలస వ్యవస్థ దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆయన విధించిన ఆంక్షలను పలు దిగువ న్యాయస్థానాలు నిలిపివేశాయి. దాంతో అవి అమెరికాలో ఎక్కడా అమల్లోకి రాలేదు. జన్మతః పౌరసత్వం విషయంలో కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని ట్రంప్ ముందే గ్రహించారు. ‘బుద్ధిలేని న్యాయమూర్తులు’అని ఆక్షేపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పుట్టబోయే శిశువులకు అమెరికా పౌరసత్వం దక్కడం కోసం ప్రసవించడానికి అమెరికాకు ఇతరదేశాల ధనిక గర్భిణి స్త్రీలపైనా విమర్శలు ఎక్కుపెట్టారు.విభేదించిన ముగ్గురు జడ్జీలు ట్రంప్ ఉత్తర్వును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. జస్టిస్ క్లారెన్స్ థామస్, జస్టిస్ నీల్ గోర్సచ్, జస్టిస్ శామ్యూల్ అలిటో ఈ తీర్పును ఆక్షేపించారు. 14వ రాజ్యాంగ సవరణను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీవ్రమైన పొరపాటు చేసిందని అన్నారు. కేవలం బిడ్డకు జన్మనిచ్చు, వెంటనే స్వదేశాలకు తిరిగి వెళ్లే ‘బర్త్ టూరిస్టుల’ను ప్రోత్సహిస్తారా? అని నిలదీశారు. కోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుందని, ఇది విచారకరమని పేర్కొన్నారు. ఈ మేరకు వారు 91 పేజీల అసమ్మతి లేఖ రాశారు. -
అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ట్రంప్కు భారీ బూస్ట్
అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వతంత్ర ఫెడరల్ ఏజెన్సీల అధిపతులను ఎలాంటి కారణం చెప్పుకుండానే తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. 91 ఏళ్ల నాటి కీలక న్యాయసూత్రాన్ని పక్కనబెట్టింది. తద్వారా అమెరికా అధ్యక్షుడి అధికారాలను గణనీయంగా విస్తరించేందుకు మార్గం సుగమం చేసింది. అదే సమయంలో.. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతకు మాత్రం రక్షణ కల్పించింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు వేసింది. ఈ రెండు తీర్పులు కలిసి అమెరికాలో అధ్యక్షుడి అధికారాలు, కేంద్ర బ్యాంకు స్వతంత్రతపై కొత్త చర్చకు తెరలేపాయి.స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం ఈ తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష అధికారాలకు సంబంధించిన అత్యంత కీలక తీర్పుల్లో ఇదొకటని పేర్కొన్నారు. అయితే లీసా కుక్ కేసులో సాంకేతిక కారణాలతో మాత్రమే తీర్పు వచ్చిందని, ఆమెపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని సోషల్ మీడియాలో వెల్లడించారు.దశాబ్దాల.. న్యాయసూత్రానికి ముగింపుఫెడరల్ ఏజెన్సీల అధిపతుల్ని తొలగించే కేసులో.. 6-3 మెజారిటీతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 1935లో వచ్చిన హంపేరీస్ ఎగ్జిక్యూటర్ Humphrey's Executor తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పు ప్రకారం ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) వంటి స్వతంత్ర సంస్థల సభ్యులను అధ్యక్షుడు విధానపరమైన విభేదాల కారణంగా తొలగించలేడు. ఇప్పుడు ఆ పరిమితిని తొలగిస్తూ.. అలాంటి రక్షణలు రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షుడికి స్వతంత్ర ఫెడరల్ సంస్థలపై మరింత నియంత్రణ లభించినట్టైంది. ఏయే సంస్థలపై ప్రభావం?ఈ తీర్పు ప్రభావం కేవలం ఫెడరల్ ట్రేడ్ కమిషన్కే పరిమితం కాదు. నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ (NLRB), మెరిట్ సిస్టమ్స్ ప్రొటెక్షన్ బోర్డ్, కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ వంటి అనేక స్వతంత్ర సంస్థల బోర్డు సభ్యులను కూడా అధ్యక్షుడు అవసరమైతే పదవి నుంచి తొలగించే అవకాశం ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో వైట్హౌస్ ప్రభావం ఈ సంస్థలపై మరింత పెరిగే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఫెడరల్ రిజర్వ్కు మాత్రం.. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా భావించే ఫెడరల్ రిజర్వ్ విషయంలో సుప్రీంకోర్టు భిన్నమైన వైఖరి తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించాలన్న అభ్యర్థనను 5-4 మెజారిటీతో తిరస్కరించింది. చట్టం కల్పించిన విధివిధానాలు పాటించకుండా ఆమెను తొలగించలేరని స్పష్టం చేసింది. కేసు పూర్తయ్యే వరకు లీసా కుక్ పదవిలో కొనసాగవచ్చని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ తన తీర్పులో ఫెడరల్ రిజర్వ్ చరిత్రను ప్రస్తావిస్తూ.. ఈ సంస్థ రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రత్యేక రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. అధ్యక్షుడి ఇష్టానుసారంగా గవర్నర్లను తొలగించే అవకాశం ఉంటే, వడ్డీ రేట్లపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. లీసా కుక్పై ఆరోపణలు ఏమిటి?2025 ఆగస్టులో ట్రంప్, లీసా కుక్పై మార్ట్గేజ్ మోసం ఆరోపణలు చేస్తూ ఆమెను తొలగించే ఉత్తర్వులు జారీ చేశారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లోని రెండు ఇళ్లను ఒకేసారి ప్రధాన నివాసంగా చూపించి గృహ రుణాల్లో అక్రమ ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. అయితే ఇవి నిరూపితం కాని ఆరోపణలేనని, అసలు ఉద్దేశం తనను వడ్డీ విధానంపై రాజకీయ ఒత్తిడికి లోను చేయడమేనని లీసా కుక్ ఆరోపించారు. తనపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని కూడా స్పష్టం చేశారు.ట్రంప్ లక్ష్యం వేరే.. తన రెండో అధ్యక్ష పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ వడ్డీ రేట్లు వేగంగా తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లతో ప్రభుత్వ రుణభారం తగ్గడమే కాకుండా, గృహ, వాహన రుణాలు కూడా చౌకవుతాయని ఆయన వాదిస్తున్నారు. కానీ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ విభేదాల నేపథ్యంలోనే కుక్, అలాగే మాజీ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి పెంచిందని విమర్శలు వచ్చాయి. పావెల్పై దర్యాప్తు కూడా..ఫెడరల్ రిజర్వ్ మాజీ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై కూడా ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఫెడ్ ప్రధాన కార్యాలయ భవనాల పునరుద్ధరణ వ్యయాల పేరుతో విచారణ చేపట్టినా, అది వడ్డీ రేట్లపై ప్రభావం చూపేందుకు చేసిన ప్రయత్నమేనని పావెల్ ఆరోపించారు. అనంతరం కోర్టు జోక్యంతో ఆ విచారణ నిలిచిపోయి, చివరకు అమెరికా న్యాయశాఖ దానిని ఉపసంహరించుకుంది.ఒకవైపు అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలను మరింత బలోపేతం చేస్తూనే, మరోవైపు ఫెడరల్ రిజర్వ్ వంటి అత్యంత కీలక ఆర్థిక సంస్థ రాజకీయ జోక్యానికి గురికాకుండా రక్షణ కల్పించింది. అమెరికా సుప్రీం కోర్టు వెల్లడించిన ఈ రెండు తీర్పులు.. అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. అధ్యక్ష అధికారాలు ఎంతవరకు ఉండాలి? స్వతంత్ర సంస్థల స్వేచ్ఛ ఎంతవరకు కాపాడాలి? అనే చర్చలకు ఈ తీర్పు కొత్త దిశ చూపిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
రామాలయ విరాళాల కేసు: తక్షణ విచారణకు ‘సుప్రీం’ నిరాకరణ
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల చోరీకి గురయ్యాయంటూ దాఖలైన పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఈ విరాళాల మాయం వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో తదుపరి ఏం జరగబోతోన్నదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.రామాలయ కానుకల దొంగతనంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం ఉదయం న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ పిటిషన్పై తక్షణమే విచారణ జరపాల్సినంత అత్యవసర పరిస్థితి లేదా ప్రాధాన్యత ప్రస్తుతం కనిపించడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఈ కేసును త్వరితగతిన లిస్ట్ చేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయోధ్య రామాలయానికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు భారీగా కానుకలు, విరాళాలు సమర్పిస్తున్నారు. అయితే, ఈ విధంగా వచ్చిన విరాళాలలో కొంత భాగం చోరీకి గురైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.దీనిపై ఒక ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఈ కేసుపై అందరి దృష్టి పడింది. అత్యవసర విచారణ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును సాధారణ న్యాయ నిబంధనల ప్రకారమే విచారిస్తామని పేర్కొంది. కోర్టు సాధారణ విచారణల జాబితా ద్వారానే ఈ పిటిషన్ మున్ముందు బెంచ్ ముందుకు రానుంది. ఈ కేసులో న్యాయస్థానం చేసిన మరిన్ని పరిశీలనలు, అలాగే తదుపరి విచారణ ఎప్పుడు జరగనుందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ట్రంప్కు భారీ ఊరట.. టీపీఎస్ రద్దుకు గ్రీన్సిగ్నల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ విజయం దక్కింది. వలస విధానాల విషయంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయాన్ని సమర్థించేలా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో లక్షలాది మందిని వెనక్కి పంపించేందుకు(Deport) కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకు మార్గం సుగమమైంది. ట్రంప్ సర్కార్కు అనుకూలంగా అమెరికా సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. హైతీ, సిరియా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు ఇప్పటివరకు లభిస్తున్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) రక్షణను రద్దు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ, ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది ఒక్కసారిగా డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్రంప్ ప్రభుత్వం "చట్టానికి దక్కిన విజయం"గా అభివర్ణిస్తుండగా.. మానవ హక్కుల సంఘాలు మాత్రం "వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయం" అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఏళ్లుగా.. లక్ష్యంగా.. డొనాల్డ్ ట్రంప్ తన తొలి అధ్యక్ష పదవీకాలం (2017-2021) నుంచే వలస విధానాలను కఠినతరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ పేరుతో అనేక మంది అమెరికాలో శాశ్వతంగా ఉండిపోతున్నారని అప్పటినుంచే ఆయన విమర్శిస్తున్నారు. తన మొదటి టర్మ్లోనే హైతీ, ఎల్సాల్వడోర్, నికరాగువా, సూడాన్ తదితర దేశాలకు ఇచ్చిన టీపీఎస్ను రద్దు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఫెడరల్ కోర్టులు పలుమార్లు ట్రంప్ నిర్ణయాలను నిలిపివేశాయి. 2021లో ఆయన పదవి వీడటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.తిరిగి.. 2025 జనవరిలో రెండోసారి వైట్హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అదే అజెండాను వేగవంతం చేసింది. ఇప్పటికే వెనెజువెలా వలసదారుల టీపీఎస్పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు హైతీ, సిరియాపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వచ్చిన తాజా సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్కు అత్యంత కీలక విజయంగా భావిస్తున్నారు.TPS అంటే ఏంటంటే.. 1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, తీవ్ర రాజకీయ అస్థిరత లేదంటే మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల పౌరులకు అమెరికా తాత్కాలిక రక్షణ(Temporary Protected Status.. TPS) కల్పిస్తుంది. ఈ హోదా పొందిన వ్యక్తులను వారి స్వదేశాలకు బలవంతంగా పంపించరు. అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది గ్రీన్కార్డు లేదంటే పౌరసత్వానికి మార్గం కాదు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ప్రభుత్వం ఈ హోదాను రద్దు చేయవచ్చు.అయితే 2010లో సంభవించిన భారీ భూకంపం తర్వాత హైతీ పౌరులకు టీపీఎస్ ఇచ్చారు. 2012లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి ప్రజలకు కూడా ఈ రక్షణ కల్పించారు. అనంతరం ఆయా దేశాల్లో పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకపోవడంతో వరుస ప్రభుత్వాలు ఈ గడువును పొడిగిస్తూ వచ్చాయి.అసలు వివాదం ఎలా మొదలైంది?2025లో తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. వలసవాదుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది చూస్తున్నదే. ఈ క్రమంలో ఈ హక్కును "తాత్కాలిక రక్షణ"గా కాకుండా "శాశ్వత వలస మార్గం"గా మార్చేశారని ఆరోపిస్తూ వస్తున్నారాయన. ఈ క్రమంలోనే హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ హైతీ, సిరియా దేశాలకు ఇచ్చిన TPSను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై వలసదారుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం.. హైతీలో గ్యాంగ్ హింస, కిడ్నాప్లు, రాజకీయ అరాచకాలు కొనసాగుతున్నాయని, సిరియాలో అంతర్యుద్ధం ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని వాదించాయి. ఈ పరిస్థితుల్లో వారిని తిరిగి పంపడం ప్రాణాంతకమని పేర్కొన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్లోని ఫెడరల్ కోర్టులు కూడా ఇదే అభిప్రాయంతో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.సుప్రీంకోర్టు సంచలన తీర్పు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా.. 6-3 మెజార్టీతో ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జస్టిస్ శామ్యూల్ అలిటో తీర్పు ఇస్తూ.. టీపీఎస్ ఇవ్వాలా? రద్దు చేయాలా? అనేది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలను కోర్టులు సమీక్షించే అధికారం చట్టం ఇవ్వలేదని పేర్కొన్నారు. అందువల్ల దిగువ కోర్టులు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయడం సరైనది కాదని తేల్చిచెప్పారు.భిన్నాభిప్రాయంలో.. ఈ తీర్పుతో లిబరల్ న్యాయమూర్తులు ఎలీనా కేగన్, సోనియా సోటోమేయర్, కేతంజీ బ్రౌన్ జాక్సన్ తీవ్ర విభేదించారు. జస్టిస్ కేగన్ తన భిన్నాభిప్రాయంలో ట్రంప్ గతంలో హైతీ ప్రజలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. హైతీ వలసదారులపై జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియను పాటించిందా లేదా అన్నది కోర్టులు పరిశీలించే హక్కు ఉందని అభిప్రాయపడ్డారు.ఎంతమందిపై ప్రభావమంటే.. ఈ తీర్పు తక్షణ ప్రభావం.. సుమారు 3.5 లక్షల మంది హైతీ పౌరులు, 6,100 మంది సిరియా పౌరులపై పడనుంది. వీరంతా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఇంతటితో ఆగే అవకాశం లేదు. ప్రస్తుతం 17 దేశాలకు చెందిన సుమారు 13 లక్షల మంది టీపీఎస్ కింద అమెరికాలో నివసిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఆధారంగా.. భవిష్యత్తులో ఇతర దేశాల TPSలను కూడా రద్దు చేసే అవకాశాలు పెరిగాయని వలస నిపుణులు చెబుతున్నారు.మానవ హక్కుల సంఘాల తీవ్ర ఆందోళనఈ తీర్పుపై పలు మానవ హక్కుల సంస్థలు, వలసదారుల హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. హైతీ, సిరియాలో పరిస్థితులు బాగోలేవని అంటున్నాయి. హైతీ వలసదారుల తరఫు న్యాయవాదులు.. "ఈ తీర్పు వేలాది మంది అమాయకుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది" అని హెచ్చరించారు. అమెరికాలోని ప్రముఖ పౌరహక్కుల సంస్థ NAACP కూడా ఈ తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం గమనార్హం. అమెరికా అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న హైతీ కుటుంబాలను ఒక్కసారిగా అనిశ్చితిలోకి నెట్టివేయడం మానవతా దృక్పథానికి విరుద్ధమని పేర్కొంది. ఒహాయోలోని హైతీ సపోర్ట్ సెంటర్ ప్రతినిధులు కూడా "ఇప్పటికే వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలా? ఉద్యోగాలకు వెళ్లాలా? లేక ఎప్పుడు డిపోర్ట్ చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.ట్రంప్ ప్రభుత్వం స్పందన ఇదే..అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఈ తీర్పును స్వాగతించింది. TPS అసలు ఉద్దేశాన్ని దుర్వినియోగం చేసి శాశ్వత వలస మార్గంగా మార్చేశారని పేర్కొంది. వైట్హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ తీర్పును "పదేళ్లుగా ఎదురుచూస్తున్న విజయం" గా అభివర్ణించారు. ఇప్పుడు హైతీ వలసదారులను స్వదేశాలకు పంపే ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పారు.'బిగ్ రిలీఫ్' ఎందుకంటే..రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానాలకు కోర్టుల్లో వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఇటీవల వెనిజులా టీపీఎస్ కేసుతో పాటు, ఆశ్రయం కోరే వలసదారులపై పరిమితుల విషయంలోనూ సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు హైతీ, సిరియా టీపీఎస్ కేసులో కూడా ట్రంప్కు మద్దతుగా తీర్పు రావడంతో ఆయన వలస విధానాలకు అత్యున్నత న్యాయస్థానం నుంచి మరోసారి బలమైన మద్దతు లభించినట్టైంది. అందుకే ఈ తీర్పును అమెరికా రాజకీయ వర్గాలు ట్రంప్కు బిగ్ రిలీఫ్ గా అభివర్ణిస్తున్నాయి. ఇక ఈ నిర్ణయం అమెరికా వలస విధానాల భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసే అవకాశముందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం!
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే నిర్ణయాల్లో న్యాయపరంగా జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన జడ్జిగా పదోన్నతి పొందడం హక్కుగా మారదని తేల్చిచెప్పింది. తనకంటే జూనియర్లకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అసలేం జరిగిందంటే... హైకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు సుప్రీంకోర్టు కొలీజియం జూన్ 2వ తేదీన న్యాయాధికారులు చిరాగ్భాను సింగ్, భూపేశ్ శర్మ, యోగేశ్ జస్వాల్లను హిమాచల్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక చేసింది. అయితే, వీరు ముగ్గురూ తన కంటే జూనియర్లని ధర్మశాల ఫ్యామిలీ కోర్టులో ప్రిన్సిపల్ జడ్జిగా పనిచేస్తున్న అరవింద్ మల్హోత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురినీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ వాదన ఇదీ.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అరవింద్ మల్హోత్రా పదోన్నతి అంశాన్ని పునఃసమీక్షించాలని గతంలో సుప్రీంకోర్టు, హిమాచల్ హైకోర్టు కొలీజియంను కోరిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే, ఆ పునఃసమీక్ష జరగలేదని, పైగా ఆయన కంటే జూనియర్లను హైకోర్టు జడ్జిలుగా సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఇది ఆయన హక్కులను హరించడమేనని కోర్టుకు విన్నవించారు.తుది తీర్పు.. పిటిషన్ కొట్టివేత సుప్రీంకోర్టు కొలీజియం ఇప్పటికే హైకోర్టు సిఫార్సులను ఆమోదించినందున, దాన్ని ఇప్పుడు న్యాయసమీక్షకు గురిచేయలేమని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఈ వ్యవహారంలో ఎలాంటి విధానపరమైన లోపం తమకు కనిపించలేదని స్పష్టం చేసింది. అయితే పిటిషన్ను ఉపసంహరించుకుని, హైకోర్టులోని సంబంధిత అధికారులకు పరిపాలనా పరంగా వినతిపత్రం సమరి్పంచుకోవచ్చని పిటిషనర్కు సూచించింది. ధర్మాసనం సూచన మేరకు పిటిషనర్ తన పిటిషన్ను వెనక్కి తీసుకోవడంతో, కేసును కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ధర్మాసనం ఏమన్నదంటే.. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన పదోన్నతికి అర్హత లభించదని స్పష్టం చేసింది. కొలీజియం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సిఫార్సులు చేసిన తర్వాత, కోర్టులు ఆ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేవని పేర్కొంది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో కొంత గోప్యత కూడా ఉంటుందని గుర్తు చేసింది. కొలీజియం నిర్ణయాలపై విచారణ జరిపి కొత్త వివాదాలకు తాము తెరతీయదలచుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్కు ఇంకా పదేళ్ల సరీ్వసు ఉన్నందున ఓపిక పట్టాలని, భవిష్యత్తులో అవకాశం రావొచ్చని సూచించింది. -
నీట్ రీ-ఎగ్జామ్ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్
-
నీట్ ‘రీ–ఎగ్జామ్’ విచారణ జూలైకి వాయిదా!
సాక్షి , న్యూఢిల్లీ: నీట్ యూజీ–2026 పరీక్షను రద్దు చేసి దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష (రీ–ఎగ్జామ్) నిర్వహించాలన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై నెలకు వాయిదా వేసింది. జూన్ 21న జరగాల్సిన రీ–ఎగ్జామ్ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్ను విచారణకు చేపట్టింది.అయితే, ఈ వ్యవహారంపై ధర్మా సనం ఎలాంటి లోతైన వ్యాఖ్యలు చేయకుండా, కేసును బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నీట్ వివాదానికి సంబంధించిన ఇతర కేసులను ఇప్పటికే విచారిస్తున్న జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాస నానికే ఈ పిటిషన్ను బదిలీచేస్తున్నట్లు సీజేఐ సారథ్యంలోని ధర్మా సనం వివరించింది. వేసవి సెలవుల అనంతరం జూలై 13 నుంచి సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో జస్టిస్ నరసింహ ధర్మాసనం అప్పుడు ఈ కేసును విచారించనుందని స్పష్టం చేసింది.ఏ తప్పూ చేయని విద్యార్థులను బలిచేస్తారా?ఈ కేసులో పిటిషనర్ తన వాదనలు విన్పించారు. మే 3న జరిగిన నీట్–2026 పరీక్షలో పేపర్ లీకేజీ, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఏకంగా 22 లక్షల మంది విద్యార్థుల కు మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న ఎన్టీఏ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆరోగ్య సేవల విభాగం మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగళా కోహ్లీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.కొందరు వ్యక్తులు, నిర్దిష్ట పరీక్షా కేంద్రాల్లో జరిగిన అవకతవకలకు ఏ తప్పూ చేయని లక్షలాది మంది విద్యార్థులను బలిచేయడం అన్యాయమని పిటిషనర్ వాదించారు. ‘‘పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలే కానీ, సంస్థాగత వైఫల్యాలకు విద్యార్థుల రాజ్యాంగ హక్కులను కాలరాయడం సరికాదు. మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(జీ), 21లకు విరుద్ధం, ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయం’’ అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తమ వాదనలు వినిపించారు.ఎన్టీఏ ప్రక్షాళనకు నిపుణుల కమిటీ వేయాలిజాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణలో సమూల ప్రక్షాళన, సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని పిటి షనర్ కోర్టును కోరారు. ‘ఎన్క్రిప్టెడ్ డిజిటల్ క్వశ్చన్ డెలివరీ’, బయోమెట్రిక్ అథెంటికేషన్, ఏఐ మాని టరింగ్ లాంటి పటిష్టమైన సాంకేతికతతో కూడిన కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఎన్టీఏలో ఉన్న లోపాలను అధ్యయనం చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. -
సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్కు ఊరట
అమీన్పూర్ (సంగారెడ్డి జిల్లా)లోని ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) డీ-నోటిఫికేషన్కు సంబంధించిన వివాదంలో ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్కు సుప్రీంకోర్టులో కీలక ఉపశమనం లభించింది. తెలంగాణ హైకోర్టు గతంలో మంజూరు చేసిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు కొనసాగిస్తూ, కేంద్ర ప్రభుత్వం సహా ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.న్యాయమూర్తులు జస్టిస్ జే.కే. మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం, ఓమిక్స్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)పై విచారణ జరిపి, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లో కొనసాగాలని ఆదేశించింది.ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు, 2025 జూలై 18న జరిగిన స్పెషల్ ఎకనామిక్ జోన్ల బోర్డ్ ఆఫ్ అప్రూవల్ 130వ సమావేశపు నిమిషాల్లోని అజెండా అంశం నం. 130.13 అమలును నిలిపివేసింది. ఈ అజెండా అంశం ప్రకారం.. అమీన్పూర్ గ్రామం, పటాన్చెరు మండలం, సంగారెడ్డి జిల్లాలో ఉన్న 4.05 హెక్టార్ల ఎస్ఈజెడ్ ప్రాంతాన్ని పూర్తిగా డీ-నోటిఫై చేయాలని ప్రతిపాదించబడింది.ఈ నిర్ణయాన్ని ఓమిక్స్ ఇంటర్నేషనల్ సవాలు చేస్తూ, తమకు ఇప్పటికే మంజూరైన అనుమతులకు విరుద్ధంగా ఈ చర్య ఉందని, అలాగే ఎస్ఈజెడ్ అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాదించింది. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతుల మేరకు తాము ఎస్ఈజెడ్ డెవలపర్గా గుర్తింపు పొందే హక్కు కలిగి ఉన్నామని కంపెనీ పేర్కొంది.హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు కొనసాగించడం ద్వారా, వివాదంపై తుది నిర్ణయం వెలువడే వరకు ఎస్ఈజెడ్కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి యథాతథంగా కొనసాగుతుందని స్పష్టమైంది.సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతించిన ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, ఎస్ఈజెడ్ విధానాల లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. తమ వాదనలను సుప్రీంకోర్టు ముందు సమగ్రంగా వినిపించే అవకాశాన్ని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతివాదులు తమ కౌంటర్లు దాఖలు చేసిన అనంతరం ఈ కేసు తదుపరి విచారణకు రానుంది. -
‘వాళ్లంతా పరాన్నజీవులు..’
ఢిల్లీ: సైబర్ మోసాలపై కఠినంగా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరగాళ్లు అమాయక ఇన్వెస్టర్లను మోసగించి.. కోట్లు దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. సైబర్ నేరగాళ్లను పరాన్నజీవులుగా అభివర్ణించింది. వాళ్లు పరాన్నజీవులు.. కఠినమైన చట్టం తెవాలంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.సైబర్ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. ఇవాళ (బుధవారం) సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు.. వారు అమాయక పౌరుల నుండి భారీ మొత్తంలో డబ్బును మోసం చేస్తున్నారు. అలాంటి నిందితులను జైల్లో ఉంచడం వల్లే సమాజానికి మేలు జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది.భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పుపై సీజేఐ వ్యాఖ్యానిస్తూ.. ‘‘మీరంతా పరాన్నజీవులు. ప్రజల నుండి డబ్బు తీసుకుని వారిని ముంచుతున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల మనం కఠినంగా ఉండాలి. మిమ్మల్ని జైల్లో ఉంచడమే సమాజ హితం. గుజరాత్లో ఒకరి దగ్గర, ముంబైలో మరొకరి దగ్గర.. ఇలా డబ్బులు వసూలు చేస్తారు. గత ఏడాది చివరి నాటికి భారతీయులు డిజిటల్ మోసాల వల్ల రూ.3వేల కోట్లకు పైగా నష్టపోయారని.. దీన్నిబట్టి దేశంలో సైబర్ నేరాల తీవ్రత ఏంటో తెలుస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు. -
ఆర్టీఐ ముసుగులో వ్యాపారం!
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొందరు యాక్టివిస్టులు దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్లో ప్రభుత్వ రోడ్డు నిర్మాణ పనులకు ఆటంకం కలిగించడంతో పాటు, కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆర్టీఐ కార్యకర్తకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు మీరేమైనా ఉన్నతాధికారా? అని ఈ సందర్భంగా పిటిషనర్ను నిలదీసింది. పంజాబ్లో రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడమే కాకుండా, పర్యవేక్షిస్తున్న అధికారిని, కార్మికులను బెదిరించి, కులం పేరుతో దూషణలకు దిగారన్న ఆరోపణలపై రమేశ్ కుమార్ బెహ్ల్ అనే ఆర్టీఐ కార్యకర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలివ్వాలంటూ అతడు తొలుత పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. ధర్మాసనం పిటిషనర్ తీరును తప్పుబట్టింది. ‘ఆర్టీఐ కార్యకర్తలుగా చలామణి అవ్వడం ఇప్పుడు ఓ కొత్త వ్యాపారంగా మారిపోయింది. కేంద్రం నిధులు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుంది. అసలు మీరెవరు? మీరొక ఆర్టీఐ కార్యకర్తా? ఇదొక ఎల్లో జర్నలిజం‘అని జస్టిస్ సందీప్ మెహతా వ్యాఖ్యానించారు. అనంతరం జస్టిస్ బిష్ణోయ్ కలుగజేసుకుంటూ.. పనుల పురోగతిని పర్యవేక్షించడానికి మీరేమైనా ఉన్నతాధికారా? అని పిటిషనర్ను ప్రశ్నించారు. -
సహారా కేసులో సుప్రీం కోర్టుకు సెబీ
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ సంస్థ రూ.14,106 కోట్ల అక్రమ నిధుల సేకరణ కేసులో ‘సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కంపెనీ అక్రమాలకు డైరెక్టర్లు మాత్రమే బాధ్యులని, అక్కడ పనిచేసే కంపెనీ సెక్రటరీ, నలుగురు మేనేజర్లు కేవలం ‘ఉద్యోగులు’ మాత్రమేనని పేర్కొంటూ వారికి ‘శాట్’ మినహాయింపునిచ్చింది.అయితే, సంస్థ అక్రమ పత్రాలపై సంతకాలు చేసినందుకు ఉద్యోగులనూ బాధ్యులను చేయాలని సెబీ వాదిస్తోంది. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల జవాబుదారీతనంపై కీలకమైన ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు జూన్ 18న విచారించనుంది. -
గృహిణులు బానిసలు కాదు , 30,000లతో నష్టపరిహారం
-
ఆమె.. దేశ నిర్మాత
‘ఆడవాళ్లు ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలి’.. ‘భార్య అంటే పనిమనిషి’ ‘ఇంట్లో గృహిణులు చేసే పనికి విలువ కట్టాల్సిన పనిలేదు’... ఇలాంటి పురుషాధిపత్య భావజాలానికి చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. వేతనం లేని ఇంటి చాకిరీకి ఇటీవలి కాలంలో లభించిన అత్యంత బలమైన, న్యాయపరమైన గుర్తింపులలో ఈ తీర్పు ఒకటని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గృహశ్రమ అనేది కొలవదగిన, ఆర్థిక, సామాజిక విలువ కలిగిన ఉత్పాదకశ్రమ అనే భావనను సుప్రీం తీర్పు మరింత బలపరుస్తోంది.‘గృహాలను నడిపే వ్యక్తులను కేవలం గృహిణులుగా అభివర్ణించడం వారి సహకారాన్ని తక్కువ చేసి చూడడమే అవుతుంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. గృహిణుల ప్రమాద మరణాలకు సంబంధించిన ఒక నష్టపరిహార కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతూ...మహిళల పాత్ర కేవలం ఇంటి పనులకే పరిమితం కాలేదు. కుటుంబాలు, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడం, దేశనిర్మాణానికి తోడ్పడం వంటి అనేక అంశాలకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. గృహిణులు చేసే ఇంటి పనులు, సంరక్షణ సేవలకు ఆర్థిక విలువ ఉందని, మానవ అభివృద్ధికి దోహద పడడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోందని జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘ఆమెను కేవలం గృహిణి అని పిలవడానికి బదులుగా దేశనిర్మాత అని పిలవాలి’ అని కోర్టు పేర్కొంది.అదేకాదు...అంతకు మించి!ఇంటి పట్టున మహిళ చేసే పని ప్రభావం కేవలం ఆ ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాదని, అంతకు మించి ఉంటుందని కోర్టు నొక్కి చెప్పింది. పెళ్లి అంటే పనిమనిషిని నియమించుకోవడం కాదంటూ, వివాహవ్యవస్థలోని లోటుపాట్లపై కూడా వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఇంటి పనుల పూర్తి బాధ్యతను మహిళ ఒక్కరే తీసుకునే ఏర్పాటుగా వివాహాన్ని చూడకూడదని స్పష్టం చేసింది. గృహ బాధ్యతలనేవి భార్యాభర్తల ఉమ్మడి బాధ్యతలని నొక్కి చెప్పింది.పెళ్లయిందనే ఒకే ఒక్క కారణంతో వృత్తిపరమైన లక్ష్యాలు, ఆశయాలను మహిళలు త్యాగం చేయనవసరం లేదని పేర్కొంది.అది క్రూరత్వం కాదు...ఒక మహిళ తన పిల్లలకు స్థిరమైన వాతావరణాన్ని కల్పిస్తూనే డాక్టర్గా, వృత్తినిపుణురాలిగా, మరే ఇతర రంగాలలోనైనా తన వృత్తిని కొనసాగించాలని కోరుకుంటే అది భర్త, అత్తమామల పట్ల క్రూరత్వంగా పరిగణించరాదని కోర్టు పేర్కొంది.పెళ్లి తరువాత మహిళ గుర్తింపు ముగిసి పోదుగృహిణులు చేసే వ్యక్తిగత త్యాగాలు పెద్దగా గుర్తింపు పొందవని కోర్టు తెలియజేసింది. ఇంటి పనుల కోసం తమ సమయాన్ని, శక్తిని వెచ్చించే మహిళలు కుటుంబం నిలబడడానికి, కుటుంబ సంపదకు గణనీయంగా దోహదపడతారని, వారి కృషిని సామాజికంగా, ఆర్థికంగా తగిన విధంగా గుర్తించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంవత్సరాల తరబడి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే ఇంటిపనులు, పిల్లల సంరక్షణ ద్వారా వారు అందించే అమూల్యమైన సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడిగా సంపాదించిన కుటుంబ ఆస్తులలో గృహిణులు సమాన వాటాకు అర్హులని పేర్కొంది.గృహిణుల శ్రమకు ఆర్థిక విలువ ఉంది...కుటుంబం, సమాజం సజావుగా నడవడానికి గృహ కార్మికుల శ్రమ అత్యవసరం అయినప్పటికీ, సంప్రదాయ ఆర్థిక లెక్కల్లో ఇది చాలాకాలంగా కనిపించకుండా పోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక గృహిణి చేసే సేవ కేవలం వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇంటిపనులు చూసుకోవడానికి పరిమితం కాదని ధర్మాసనం తెలిపింది. పిల్లలను పెంచడంలో, వారిలో విలువలను పెంపొందించడంలో, కుటుంబ సభ్యులకు అండగా నిలవడంలో, తర్వాత తరాన్ని తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. మానవ వనరుల అభివృద్ధికి, తద్వారా జాతీయ అభివృద్ధికి ఆమె కృషి నేరుగా దోహదపడుతుందని కోర్టు అభిప్రాయపడింది.స్పష్టమైన సందేశంపరిహారం అనేది కేవలం ఆర్థిక నష్టాన్ని అంచనా వేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని, కుటుంబం కోల్పోయిన గృహసంరక్షణ సేవల విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తెలిపింది. పరిహార దావాలను అంచనా వేసేటప్పుడు కోర్టులు ఉపయోగించే ప్రస్తుత ప్రమాణాలతోపాటు ఈ సూత్రం ఒక అదనపు మార్గదర్శకంగా పనిచేస్తుందని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ సంక్షేమం, సామాజిక అభివృద్ధిలో గృహిణుల పాత్ర కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుందని గుర్తిస్తూ, వారి భవిష్యత్ సహకారానికి సంబంధించిన లెక్కలను కూడా పరిహార మంజూరులో పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. తమ శ్రమకు ఎలాంటి ప్రతిఫలం లేదా గుర్తింపు దొరకని లక్షలాది మంది మహిళలకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన సందేశం ఇచ్చింది...‘ఇంటి బాధ్యతలు నిర్వహించే వ్యక్తి కేవలం గృహిణి మాత్రమే కాదు ఆమె దేశ నిర్మాత’. -
గృహిణి సేవలకు ‘సుప్రీం’ విలువ!
ఇంటికి దీపం అని భావించే ఇల్లాలి సేవల విలువ ఎంత? భార్య రోడ్డు ప్రమాదంలో మరణిస్తే భర్తకు జరిగే లోటును ఎంత మొత్తంతో భర్తీ చేయవచ్చు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం సమాధానమిచ్చింది. మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద చెల్లించే నష్ట పరిహారంలో భార్య అందించే కుటుంబ సేవలకు వేరుగా విలువకట్టి చెల్లించాలని చెప్పింది. ఈ మొత్తం నెలకు రూ.30,000గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాద కేసుల్లో ఏడాది లోగా నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కే సింగ్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు పూర్వాపరాలు...రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో 2017 నాటి సుప్రీంకోర్టు తీర్పు (ప్రణయ్ సేథీ తీర్పుగా పిలుస్తారు) మార్గదర్శకాలకు ఇది అదనం అని తెలిపింది. ‘‘ప్రణయ్ సేథీ కేసు విషయంలో చెప్పిన వాటికి భార్య మరణం వల్ల కుటుంబ సేవలకు కలిగే నష్టాన్ని అదనంగా చేరుస్తున్నాం. గృహిణికి ఇప్పుడైనా నేషన్ బిల్డర్ హోదా లభిస్తుందని నమ్ముతున్నాం’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్ర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా మోటార్ వెహికల్ యాక్ట్ కేసుల ప్రగతిని పర్యవేక్షించాలని సత్వర న్యాయం దక్కేలా చేయాలని కోరింది.సెక్షన్ 169 కింద ఇచ్చిన సమ్మరీ ప్రోసీజర్ను కచ్చితంగా అనుసరించడం ద్వారా బాధిత కుటుంబాలు సుదీర్ఘ న్యాయ పోరాటం నుంచి ఉపశమనం పొందవచ్చునని తెలిపింది. నష్ట పరిహారానికి సంబంధించిన మార్గదర్శకాలను అక్షర, భావ స్ఫూర్తితో అనుసరించాలని కోరింది. హోం మేకర్ అనగానే అందరికీ ఓ మహిళ రూపం కళ్ల ముందు మెదులుతుందని అయితే ఇది అన్ని సందర్భాలకూ వర్తించక పోవచ్చునని సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో పేర్కొంది. కొన్ని అసాధారణ పరిస్థితుల్లోనో, దురదృష్టవశాత్తో పురుషుడు కూడా హోం మేకర్ పాత్ర పోషించే అవకాశాలు లేక పోలేదని తెలిపింది. వీరికి దక్కాల్సిన గౌరవం ఇస్తూనే ప్రస్తుత కేసులో మాత్రం భార్య అందించే కుటుంబ సేవలకు మాత్రమే విలువ కట్టామని వివరించింది.ప్రణయ్ సేథీ తీర్పు ప్రకారం...రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నష్ట పరిహారం చెల్లింపు విషయంలో 2017 నాటి ప్రణయ్ సేథీ కేసు తీర్పు నిర్ణయాత్మకమైంది. ఈ కేసులో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడం బీమా కంపెనీలకు తప్పనిసరిగా మారింది ఈ తీర్పుతోనే. చని పోయిన వారు భవిష్యత్తులో ఎంత ఆదాయం సంపాదించగలరు అన్నదాన్ని ఎలా లెక్కించాలో ఈ తీర్పులో స్పష్టంగా వివరించారు. ఏ ఏ విషయాల్లో నష్టపరిహారం చెల్లించాలి, వేటిని మినహాయించాలి అన్నది కూడా ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ.కే.సేక్రీ, జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ డాక్టర్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ప్రకారం...⇒ నలభై ఏళ్ల లోపు వయసుండి శాశ్వత ఉద్యోగం కలిగి ఉన్న వారైతే...నష్టపరిహారంలో వారి వేతనంలో సగాన్ని ఆదాయంగా పరిగణించాలి (వేతనమంటే అన్ని రకాల పన్నులు మినహాయించిన తరువాతి మొత్తం)⇒ నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కులైతే వేతనంలో 30 శాతాన్ని, యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు వారైతే 15 శాతాన్ని ఆదాయంగా పరిగణించాలి. ⇒ స్థిరమైన వేతనంతో సొంతంగా ఉద్యోగం కలిగి ఉండి నలభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటే వేతనంలో 40 శాతాన్ని ఆదాయానికి జోడించాలి. ⇒ 2009 నాటి సరళ వర్మ, డీటీసీ కేసు మార్గదర్శకాల ప్రకారం నష్ట పరిహారం నుంచి వ్యక్తిగత ఖర్చులను మినహాయిస్తారు. ⇒ లాస్ ఆఫ్ ఎసెట్స్ (బతికి ఉంటే సంపాదించే అవకాశమున్న ఆస్తులు, ఆదాయం) కింద రూ.15,000, అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కింద రూ.15,000, భార్య/భర్త సాంగత్యాన్ని కోల్పోయినందుకు రూ.40,000 కూడా చెల్లించాల్సిన నష్టపరిహారాల జాబితాలోకి చేరుతుంది.⇒ ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రతి మూడేళ్ల కాలానికి పది శాతం చొప్పున పరిహారం పెరగాలి.శిశుపాల్ వర్సెస్ సుర్జీత్మోటారు వాహన ప్రమాద పరిహారానికి సంబంధించిన ‘శిశుపాల్ వర్సెస్ సుర్జీత్’ కేసులో దాఖలైన అప్పీలును సుప్రీంకోర్టు విచారించింది. ప్రమాదాల్లో గృహిణులు మృతి చెందినప్పుడు లేదా వికలాంగులుగా మారినప్పుడు వారి సేవలకు తగిన ఆర్థిక విలువ కట్టడం లేదన్న వాదనలు న్యాయస్థానం ముందుకొచ్చాయి. గృహిణులకు ఎలాంటి ప్రత్యక్ష ఆదాయం లేనందున కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు పరిహారం చెల్లింపుల్లో తక్కువ మొత్తాలను ఖరారు చేస్తున్న తీరును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై స్పందించిన న్యాయస్థానం... గృహిణుల సేవలకు కచ్చితమైన, గౌరవప్రదమైన విలువను ఆపాదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.పరిహారం లెక్కింపుపై స్పష్టమైన తీర్పు బాధిత కుటుంబం కోల్పోయే ‘గృహ సంరక్షణ’ను ఇకపై ఒక స్వతంత్ర ప్రాతిపదికగా పరిగణించి పరిహారం లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతంలో ప్రణయ్ సేథీ కేసులో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన పరిహారాలకు అదనంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రమాద పరిహార క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 169 ప్రకారం సత్వర చర్యలు తీసుకోవాలని, దీనిని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించింది. పరిహార కేసుల విచారణలు సకాలంలో పూర్తయ్యేలా, తీర్పులోని సూత్రాలు అమలయ్యేలా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పర్యవేక్షించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. – సాక్షి, న్యూఢిల్లీపాతికేళ్ల క్రితం నాటి కేసు...2001లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఈ కేసులో చివరకు 2026 జూన్ నెలలో తీర్పు వెలువడింది. జీపులు రెండు ఢీకొన్న ప్రమాదంలో కక్షిదారు భార్య మరణించింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 2024లో తీర్పునిస్తూ... బాధితుడికి, ముగ్గురు పిల్లలకు ఎనిమిది లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే బాధితుడు ఈ తీర్పును సవాలు చేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఎత్తయిన ఏనుగుపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు!
న్యూఢిల్లీ: కేరళలోనే అత్యంత ఎత్తయిన ఏనుగుగా పేరొందిన ‘రామన్’ సంరక్షణపై దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కీలక నిర్ణయం తీసుకుంది. నోరులేని మూగజీవాల సంక్షేమమే పరమావధి అని స్పష్టం చేస్తూ, రామన్ను తక్షణమే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపి, రామన్ను ఒక సరైన పునరావాస కేంద్రానికి తరలించాలని స్పష్టం చేసింది.కోర్టు ధిక్కరణ..వాణిజ్య దోపిడీ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ రామన్ ఏనుగును వాణిజ్య అవసరాలకు, ఉత్సవాలు, వివిధ ఆచారాల ఊరేగింపుల కోసం విపరీతంగా ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ, ఏనుగును నిర్బంధంలో ఉంచిన కృష్ణన్కుట్టి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ క్రమంలోనే అతనికి రూ. 2,000 జరిమానా కూడా విధించింది. నోరులేని మూగజీవాల పట్ల జరుగుతున్న ఇటువంటి ఉల్లంఘనలపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేమని, మూగ ప్రాణుల సంక్షేమం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.మాతా అమృతానందమయి మఠంతో.. జయకృష్ణ మీనన్ అనే వ్యక్తి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ఆధారంగా ఈ విచారణ జరిగింది. పిటిషనర్ వాదనల ప్రకారం.. ఈ రామన్ ఏనుగు వాస్తవానికి 'మాతా అమృతానందమయి మఠం'నకు చెందినది. దాని సంరక్షణ, నిర్వహణ బాధ్యతల కోసం మాత్రమే తాత్కాలికంగా కృష్ణన్కుట్టి అనే వ్యక్తికి అప్పగించడం జరిగింది. అయితే, కృష్ణన్కుట్టి ఒక వివాదాస్పద విలునామా (ఉయిల్), గిఫ్ట్ డీడ్స్ ఆధారంగా ఈ ఏనుగు చట్టబద్ధంగా తనకే దక్కిందని, గత 10-12 ఏళ్లుగా తానే దాన్ని నిరంతరాయంగా పోషిస్తున్నానని కోర్టుకు తెలిపాడు.కేరళ ప్రభుత్వానికి తాత్కాలిక బాధ్యతలుప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్వాధీన ఆదేశాలు కేవలం తాత్కాలికమైనవని, కోర్టు వెలువరించే తుది తీర్పునకు ఇవి లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 లోని చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఈ ఏనుగును తాత్కాలికంగా సంరక్షించాలని, ఇందుకు అవసరమైన పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేయవచ్చని పేర్కొంది. మరోవైపు, ఏనుగుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నించిన కేరళ రాష్ట్ర అధికారులను కోర్టు ధిక్కరణ ఆరోపణల నుండి న్యాయస్థానం విముక్తి కల్పించింది.ఇది కూడా చదవండి: ‘దీదీ’కి భారీ షాక్: ఢిల్లీలో టీఎంసీ ఆఫీస్ ఖాళీ -
ప్రతి బంధం పెళ్లి పీటలెక్కాలని లేదు
సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లికి ముందే శారీరక సంబంధం కలిగి ఉండటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది. ఉద్యోగ నియామకాల విషయంలో అధికారులు మారుతున్న సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది. ఇద్దరు మేజర్ల మధ్య శారీరక సంబంధం ఉండటం ఒక్కటే వారి వ్యక్తిత్వాలపై వ్యతిరేక అభిప్రాయాలు ఏర్పరచుకునేందుకు ప్రాతిపదిక కారాదని స్పష్టం చేసింది. అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును పునరుద్ధరిస్తూ, తక్షణమే సదరు అభ్యరి్థకి కానిస్టేబుల్గా పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. గాజుల తిరుపతి, రమాదేవి (పేరు మార్చాం) ఇరుగు పొరుగు. నాలుగేళ్లపాటు ఇద్దరూ శారీరక సంబంధమూ నెరిపారు. తర్వాత తిరుపతి ఇంకో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే రమాదేవి క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసు లోక్ అదాలత్లో విచారణకు రాగా ఇద్దరూ రాజీ పడ్డారు. ఈ మధ్యలో తిరుపతి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దరఖాస్తు సమయంలో తిరుపతి తనపై కేసు వివరాలు వివరించారు. అయినా సరే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతడి నియామకాన్ని రద్దు చేసింది. వ్యక్తిత్వాన్ని సంబంధం ఆధారంగా నిర్ణయించొద్దు ‘ఇద్దరూ మేజర్లు. పెళ్లికి ముందు సంబంధం ఉంది. వారి వ్యక్తిత్వాన్ని, నైతిక విలువలను ఈ సంబంధం ఆధారంగా నిర్ణయించడం సరికాదు’అని చెప్పింది. ప్రతి సంబంధం పెళ్లిదాకా వెళ్లకపోవచ్చు కాబట్టి.. ఒకరు ఇంకొకరిని మోసం చేశారని అనుకునేందుకు ఆస్కారం ఏర్పడదని, పెళ్లి కానంత మాత్రాన మోసం చేసినట్లు కాదని వివరించింది. కాబట్టి పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి మోసం చేశాడని తిరుపతిపై లోక్ అదాలత్లో దాఖలైన కేసు అతడు తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నట్లు కాదని ఆ కేసు ఆధారంగా అతడికి ఉద్యోగం ఇవ్వకుండా నిలపడమూ సరికాదని తెలిపింది. వక్రబుద్ధితో తీసుకున్న నిర్ణయం ఈ కేసులో వాస్తవాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ... ఇద్దరి మధ్య సంబంధం ఉన్నమాట వాస్తవం. అయితే అత్యాచారం జరిగినట్లు కానీ.. ఎవరి బలవంతంతోనో.. ఒత్తిడితోనో లోక్ అదాలత్లో రాజీ కుదిరిందనేందుకు కానీ ఎలాంటి ఆధారాలూ లేవని గుర్తించింది. అలాంటప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు కేవలం లోక్ అదాలత్తో రాజీ పడ్డాడు కాబట్టి తిరుపతి నేరానికి పాల్పడినట్లు అంచనా వేయడాన్ని తప్పు పట్టింది. ఇది నిరాధారమైందని, అతడి సెలెక్షన్ను రద్దు చేయడం వక్ర బుద్ధితో తీసుకున్న నిర్ణయమని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. నైతిక దుర్మార్గానికి పాల్పడ్డాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉండాలని, నిర్దోషిగా విడుదలైనా, కేసు నుంచి విముక్తి పొందినా నేరంలో అభ్యర్థి ప్రమేయం ఉన్నట్లు తేలాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ ఉదంతంలో కేసును మరింత ముందుకు నడిపేందుకు రమాదేవి విముఖత చూపడమే కాకుండా లోక్ అదాలత్ వద్ద రాజీ పడిన విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేసింది. -
జ్యోతి మల్హోత్రాను జైల్లోనే ఉంచాలని సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలకు భారతదేశ వ్యూహాత్మక, రక్షణ సంస్థల అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేమని, ఆమెపై ఉన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని న్యాయస్థానం స్పష్టం చేసింది.జాతీయ భద్రతే ముఖ్యం: సుప్రీంకోర్టు స్పష్టీకరణసుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్.సి. శర్మలతో కూడిన ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది. గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టు మార్చి 7న ఆమె బెయిల్ను నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను జ్యోతి మల్హోత్రా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. గతేడాది మే 16 నుంచి ఆమె కస్టడీలో ఉన్నారని, అంతకుముందు ఎలాంటి నేర చరిత్ర లేదని ఆమె తరపు న్యాయవాది వాదించినప్పటికీ, అవన్నీ విచారణ సమయంలో తేలాల్సిన అంశాలని కోర్టు కొట్టిపారేసింది. ఆమె పాకిస్తాన్ పర్యటనలు, అక్కడి ప్రభుత్వ అధికారులతో జరిపిన భేటీలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.‘ట్రావెల్-విత్-జో’ వెనుక పాక్ నిఘా నీడహర్యానాలోని హిసార్కు చెందిన జ్యోతి మల్హోత్రా యూట్యూబ్లో ‘ట్రావెల్-విత్-జో’ అనే పాపులర్ ఛానల్ను నడుపుతున్నారు. ప్రయాణాల పేరుతో ఆమె పాకిస్తాన్ నిఘా విభాగం ప్రతినిధులతో నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. నవంబర్ 2023 నుండి పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బంది ఎహసాన్-ఉర్-రహీమ్ (అలియాస్ డానిష్) అనే వ్యక్తితో ఆమె నిరంతరం టచ్లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. సదరు డానిష్ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 14, 2025నే ‘పర్సనా నాన్ గ్రాటా’ (అవాంఛనీయ వ్యక్తి)గా ప్రకటించి భారత్ నుండి బహిష్కరించడం గమనార్హం. జ్యోతిని తమ దేశానికి అనుకూలమైన వ్యక్తిగా మార్చుకోవడానికి పాక్ నిఘా వర్గాలు ప్రయత్నించాయని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.రక్షణ రహస్యాల చేరవేత.. డిలీట్ చేసిన చాట్లుజ్యోతి మల్హోత్రాపై హర్యానా పోలీసులు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152 కింద దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. ఆమె వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా పాకిస్థాన్ ఆపరేటివ్లతో మాట్లాడి, ఆ చాటింగ్లను క్రమం తప్పకుండా డిలీట్ చేసేవారని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన వ్యూహాత్మక రక్షణ స్థావరాలు, భద్రతా వ్యవస్థల వీడియో ఫుటేజీలను సైతం ఆమె అవతలి వైపుకు చేరవేసినట్లు బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: మన దేశంలోనూ ‘అద్దె ప్రియుళ్లు’.. జాబితాలో హైదరాబాద్! -
పెళ్లయిన కుమార్తె కూడా కుటుంబంలో భాగమే
సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లియిందనే కారణంతో కుమార్తెకు కారుణ్య నియామకం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుటుంబం నిర్వచనంలో పెళ్లి అయిన కుమార్తె కూడా భాగమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సోమవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి అనేది ఒక మహిళ అర్హతకు అడ్డంకి కాదని, అర్హత కలిగిన కుమార్తెకు కేవలం వైవాహిక హోదా కారణంగా సంక్షేమ పథకాన్ని నిరాకరించలేమని తెలిపింది. ఈ విషయంలో బాంబే, కర్ణాటక హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులతో ఏకీభవిస్తున్నట్లు వెల్లడించింది. కేసు వివరాలివీ..ఉత్తరప్రదేశ్కు చెందిన కుల్సుమ్ నిషా తల్లి చౌక ధరల దుకాణం డీలర్గా ఉండేవారు. కుల్సుమ్ నిషా పెళ్లయినప్పటికీ, భర్తతో కలిసి తల్లి ఇంట్లోనే ఉండేవారు. దివ్యాంగురాలైన తన సోదరి బాగోగులు చూసుకుంటూ, తల్లికి దుకాణం నిర్వహణలో సాయం చేసేవారు. తల్లి మరణించిన తర్వాత, కారుణ్య ప్రాతిపదికన ఆ దుకాణం లైసెన్స్ తనకు ఇవ్వాలని ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2019లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ‘కుటుంబం’నిర్వచనం నుంచి పెళ్లయిన కూతుళ్లను తొలగించింది. ఈ జీవోను సాకుగా చూపి ఆమె దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. భిన్న తీర్పుల నేపథ్యంలో సుప్రీంకు బదిలీ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి, గత తీర్పులను పరిశీలించారు. వాటిలో ప్రధానంగా..⇒ విమల్ శ్రీవాస్తవ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. (2015) కేసులో.. ఉద్యోగాల్లో కారుణ్య నియామకాలకు సంబంధించిన ‘ఉత్తరప్ర దేశ్ రిక్రూట్మెంట్ ఆఫ్ డిపెండెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ డైయింగ్–ఇన్– హార్నెస్ రూల్స్, 1974’ లోని ‘‘కుటుంబం’’నిర్వచనాన్ని విశ్లేషించింది. వివాహం అయిన కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగంలోని ఆర్టి కల్ 14, 15లకు విరుద్ధమని, అది వివక్ష తో కూడుకున్నదని తేల్చింది. కుటుంబం నిర్వచనంలో ఉన్న ‘అవివాహిత’అనే పదాన్ని కొట్టివేసింది. ⇒ కుసుమ్లత వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు (2021)లో అయితే.. 2019 జీవోను సవాల్ చేస్తూ దాఖలైన మరో కేసులో సింగిల్ జడ్జి, విమల్ తీర్పులో వచ్చినది ఇక్కడ వర్తించదని పేర్కొన్నారు. 2019 జీవోలో ‘అవివాహిత కుమార్తె’అని ఉండటం వివక్ష కాదని తేల్చారు. ‘హార్నెస్ రూల్స్’ను అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించినట్లుగా 2019 జీవోను వ్యాఖ్యానించలేమని చెప్పారు.⇒ సైదా బేగం వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు (2023)లో.. డివిజన్ బెంచ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇలా ఒకే హైకోర్టులో భిన్న తీర్పులు రావడంతో పాటు, ఇతర హైకోర్టుల అభిప్రాయాలు కూడా వేరుగా ఉన్నాయి. బాంబే హైకోర్టు ‘రంజనా మురళీధర్ అనే రావ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2014)’కేసులో, లైసెన్సింగ్ ఆర్డర్, 1979 కింద మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తీర్మానంలో ‘కుటుంబం’నిర్వచనం నుంచి వివాహం అయిన కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19(1)(జీ)లకు విరుద్ధమని తీర్పు ఇచ్చింది. గుజరాత్ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ భిన్నమైన తీర్పుల నేపథ్యంలో, స్పష్టత కోసం అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించారు.4 వారాల్లో లైసెన్స్ ఇవ్వాలని ఆదేశంతీర్పు సందర్భంగా.. బాంబే హైకోర్టు రంజనా కేసులో ఇచ్చిన అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అలహాబాద్ హైకోర్టు సైదా బేగం కేసులో ఇచ్చిన తీర్పు సరైంది కాదని తేల్చి చెప్పింది. ‘ఈ కేసులో రికార్డుల ప్రకారం, అప్పీలుదారు పెళ్లి తర్వాత కూడా అదే గ్రామంలో నివాసం ఉంటూ, తన తల్లికి చౌక ధరల దుకాణం నడపడంలో సాయం చేసేవారు. తల్లి మరణం తర్వాత, ఆమె తన సోదరి, శారీరక వైకల్యం ఉన్న మరో సోదరి బాధ్యతలను తీసుకుంది. ఆమె వివాహిత అనే కారణంతో దరఖాస్తును తిరస్కరించడం రాజ్యాంగపరంగా చెల్లదు’అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్కు లైసెన్స్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన ధర్మాసనం, నాలుగు వారాల్లోగా కుల్సుమ్ నిషాకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ జారీ చేయాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా ఆదేశించింది. -
ఐదుగురు జడ్జీల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. శీల్ నాగ్, శ్రీచంద్రశేఖర్, సంజీవ్ సచ్దేవా, అరుణ్ పల్లి, వి.మోహనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరుకుంది. మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 38 కాగా, ప్రస్తుతం కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాది వి.మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని మే 27న సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం మే 31న ఆమోదం తెలిపింది. సిట్టింగ్ జడ్జీలు జస్టిస్ పంకజ్ మిథాల్ ఈ ఏడాది జూన్ 16న, జస్టిస్ జె.కె.మహేశ్వరి జూన్ 28న పదవీ విరమణ చేయబోతున్నారు. జస్టిస్ శీల్ నాగ్: 1965 జనవరి 1న జన్మించారు. 1987 అక్టోబర్లో అడ్వొకేట్గా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మే 23న అదే కోర్టులో పర్మినెంట్ జడ్జిగా పదోన్నతి పొందారు. 2024 మే 25న మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2024 జూలై 9న పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ శ్రీచంద్రశేఖర్: 1965 మే 25న జన్మించారు. 1993లో ఢిల్లీ యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పూర్తిచేశారు. 2013 జనవరి 17న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2014 జూన్ 27న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 డిసెంబర్ 29 నుంచి 2023 జూలై 4 వరకు జార్ఖండ్ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2024 జూలై 5న రాజస్తాన్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2025సెప్టెంబర్ 5న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ సంజీవ్ సచ్దేవా: 1964 డిసెంబర్ 26న జన్మించిన జస్టిస్ సంజీవ్ సచ్దేవా 1988లో ఢిల్లీ యూనివర్సిటీ న్యాయ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీని పొందారు. 1988 ఆగస్టు 1న ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2011 జూలైలో ఢిల్లీ హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 2013 ఏప్రిల్ 17న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2015 మార్చి 18న అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 మే 30న మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ సచ్దేవా 2025 జూలై 17న మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అరుణ్ పల్లి: 1964 సెప్టెంబర్ 18న జన్మించారు. 1988లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తిచేశారు. 2004 నుంచి 2007 దాకా పంజాబ్ అదనపు అడ్వొకేట్ జనరల్గా సేవలందించారు. 2007 ఏప్రిల్ 16న సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 28న పంజాబ్, హరియాణా హైకోర్టు బెంచ్కు పదోన్నతి పొందారు. 2025 ఏప్రిల్ 16న జమ్మూ కశ్మీర్ అండ్ లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అరుణ్ పల్లి తండ్రి, తాత పటియాలాలో న్యాయవాదులుగా పనిచేశారు. జస్టిస్ వి.మోహన: 1966 జూన్ 27న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి పట్టభద్రులయ్యారు. అప్పటి నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె కుటుంబంలో గతంలో న్యాయవాద వృత్తిలో ఎవరూ లేరు. 1992 తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ ఇందూ మల్హోత్రా ఛాంబర్లో చేరారు. సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్ ఛాంబర్లో కూడా ఆమె పనిచేశారు. 1996లో అడ్వకేట్–ఆన్–రికార్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. జస్టిస్ వి.మోహనను 2015లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్గా నియమించింది. ఐదేళ్ల తర్వాత మహిళా జడ్జి సుప్రీంకోర్టులో ఐదేళ్ల విరామం తర్వాత మహిళా న్యాయమూర్తి నియామకం కావడం విశేషం. దీంతో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరుకుంది. సుప్రీంకోర్టుకు మహిళా జడ్జి నేరుగా ఎంపిక కావడం ఇది రెండోసారి. 2018లో జస్టిస్ ఇందూ మల్హోత్రా తర్వాత బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన రెండో మహిళా న్యాయవాదిగా జస్టిస్ వి.మోహన రికార్డులకెక్కారు. హైకోర్టు జడ్జిగా పని చేయకుండా న్యాయవాద వృత్తి నుంచే నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపిక కావడం గమనార్హం. -
సుప్రీంకోర్టులో కొలువుదీరిన కొత్త న్యాయమూర్తులు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు కొత్త న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 32 నుండి 37కి పెరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో, ఈ నియామకాలు జరిగాయి. కొత్త న్యాయమూర్తులు వీరే..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఈ ఐదుగురు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లి ఉన్నారు. వీరంతా ఇప్పటికే వివిధ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులుగా సేవలు అందించిన అనుభవం కలిగి ఉన్నారు. అదేవిధంగా సీనియర్ న్యాయవాది వి. మోహన నేరుగా బార్ నుండి సుప్రీంకోర్టు బెంచ్కు పదోన్నతి పొందడం గమనార్హం. Swearing-in Ceremony of the five newly appointed Supreme Court judges to commence at 10:30 am#SupremeCourt pic.twitter.com/sJHvOZyqAo— Bar and Bench (@barandbench) June 2, 2026వేగంగా సాగిన ప్రక్రియఈ నియామకాలకు సంబంధించి సిఫార్సులను గత వారమే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సిద్ధం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జూన్ 1న అధికారికంగా ఆమోదముద్ర వేసింది. సాధారణంగా సుప్రీంకోర్టులో నియామక ప్రక్రియకు కాస్త సమయం పడుతుంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం.పెరిగిన న్యాయస్థానం సామర్థ్యంసుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి, న్యాయమూర్తుల కొరతను అధిగమించడానికి ఈ నియామకాలు ఎంతో కీలకం. కాగా రాబోయే రోజుల్లో మరో ఖాళీ కూడా భర్తీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా చేరిన న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టు తీర్పులలో వేగం, పరిపాలనా సామర్థ్యం మరింత పుంజుకోనుందని నిపుణులు భావిస్తున్నారు.సరికొత్త చరిత్ర సృష్టించిన సీనియర్ న్యాయవాది వి. మోహనసాక్షి, చెన్నై: దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులై తమిళనాడుకు చెందిన సీనియర్ న్యాయవాది వి. మోహన సరికొత్త చరిత్ర సృష్టించారు. సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టనున్న తమిళనాడుకు చెందిన మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక నియామకంపై తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇక తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ అడ్వకేట్ వి. మోహన నియామకంతో సుప్రీంకోర్టు చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. కాగా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ, ఏకంగా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవుతున్న భారతదేశపు రెండవ మహిళా న్యాయమూర్తిగా ఆమె మరో రికార్డు సృష్టించారు. మహిళా సాధికారతకు నిదర్శనం ఆమెకు దక్కిన గుర్తింపుపై సీఎం విజయ్ ఎక్స్ పేజీ వేదికగా అభినందనలు తెలియజేశారు. సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది వెంకిడ సుబ్రమణి మోహన గారు నియమితులవ్వడం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే నేరుగా న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన రెండో మహిళగా, తమిళనాడు నుండి ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి మహిళగా ఆమె నిలిచారన్నారు. జస్టిస్ మోహన ఈ నియామకం దేశంలో, రాష్ట్రంలో మహిళా విద్యాభివృద్ధికి, వారి ఆర్థిక సాధికారతకు , సామాజిక పురోగతికి ఒక గొప్ప ఉత్తేజకర శక్తిగా నిలుస్తుందన్నారు. అత్యున్నత బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ మోహనకు తన తరపున, తమిళనాడు ప్రభుత్వం , రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర అనంతరం జస్టిస్ వి. మోహన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళనాడుకు చెందిన ఒక మహిళా న్యాయవాది దేశ అత్యున్నత న్యాయస్థానంలో అడుగుపెట్టనుండటం పై తమిళనాడు న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
‘పోక్సో’ దుర్వినియోగం.. స్వార్థం కోసం తప్పుడు కేసులు!
సాక్షి, న్యూఢిల్లీ: దంపతుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేవలం ఆర్థిక లబ్ధి, భారీ సెటిల్మెంట్లు ఆశించి భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారికి తెచ్చుకునేందుకు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా ‘పోక్సో’ వంటి చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.మూకుమ్మడి కేసులు సరికాదుఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వైవాహిక వివాదంలో దాఖలైన 10 క్రిమినల్ కేసుల రద్దు పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ‘దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, భర్తపై కక్ష తీర్చుకునేందుకు క్రిమినల్ చట్టాలను వాడుకుంటున్నారు. ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండానే క్రూరత్వం, గృహహింస పేరిట అత్తమామలు, వృద్ధులైన కుటుంబ సభ్యులందరిపైనా మూకుమ్మడిగా కేసులు పెడుతు న్నారు’అని ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాకుండా, న్యాయం కోసం నిరీక్షించే అసలైన బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేలా న్యాయవాదులు తమ క్లయింట్లను ప్రోత్సహించ రాదని కూడా ధర్మాసనం హితవు పలికింది.పావులుగా పిల్లలువైవాహిక వివాదాల్లో సంతానాన్ని కూడా పావులుగా వాడుకుంటున్న ‘అతి దారుణమైన ధోరణి’గురించి కోర్టు ప్రస్తావించింది. తండ్రి తన మైనర్ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ తల్లులు పోక్సో చట్టం కింద తప్పుడు కేసులు పెట్టిస్తున్న వైనాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎక్కువ భరణం డిమాండ్ చేయడానికి లేదా రాజీకి రావాలని ఒత్తిడి చేయడానికి, పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా వారితోనే కన్నతండ్రిపై అబద్ధపు ఆరోపణలు చేయిస్తున్నారని ధర్మాసనం ఆవేదన చెందింది. కేవలం భార్యాభర్తల గొడవల్లోనే కాకుండా.. ఆస్తి వివాదాలు, వ్యాపార తగాదాలు, అప్పుల వ్యవహారాల్లో సైతం ఎదుటివారిని బెదిరించేందుకు పోక్సోను ఆయుధంగా వా డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టివేతభర్త, అతడి సోదరుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఇతర కుటుంబ సభ్యులు భౌతికంగా దాడి చేశారని ఓ మహిళ నమోదు చేసిన క్రిమినల్ కేసులను ధర్మాసనం కొట్టివేసింది. తల్లి ఒత్తిడి, ఆమె నేర్పించిన మాటల మేరకే బాలిక ఈ ఆరోపణలు చేసినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. ఫిర్యాదులో తల్లీకూ తుళ్ల వాంగ్మూలాలు అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయని, ఆరోపణలకు ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇలాంటి సాధారణ, అస్పష్టమైన ఆరోపణలతో క్రిమినల్ విచారణను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ.. భర్త, అతని కుటుంబ సభ్యులపై నమోదైన పది కేసులను రద్దు చేస్తూ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. -
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ
-
సర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమే.. ఈసీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్
-
SIRలో మీ పేరు లేదా?మీ ఓటు పోయినా డోంట్ వర్రీ సుప్రీంకోర్టు గుడ్ న్యూస్
-
సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం
ఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఒక సీనియర్ మహిళా అడ్వకేట్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మే 22, మే 27 తేదీలలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని సమావేశమైన కొలీజియం బృందం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు కోలిజియం సిపార్సు చేసిన న్యాయమూర్తులు జస్టిస్ శీల్ నాగు, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ శ్రీ చంద్రశేఖర్. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ సంజీవ్ సచ్దేవా ,మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ అరుణ్ పల్లి , జమ్మూ కాశ్మీర్ ,లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. వి. మోహన (సీనియర్ అడ్వకేట్): సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక సీనియర్ మహిళా న్యాయవాది.సీనియర్ అడ్వకేట్ వి. మోహనను నేరుగా బార్ (న్యాయవాది వృత్తి) నుండి సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపిక చేయడం విశేషం. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేవలం ఒకే ఒక మహిళా జడ్జి (జస్టిస్ బి.వి. నాగరత్న) ఉన్నారు. మోహన నియామకం జరిగితే కోర్టులో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది. రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రా తర్వాత బార్ నుండి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందుతున్న రెండో మహిళా న్యాయవాదిగా ఆమె గుర్తింపు పొందుతారు.దేశంలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను (CJI తో కలిపి) 38 కి పెంచింది. ప్రస్తుతం కోర్టులో 32 మంది జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. కొలీజియం సిఫార్సు చేసిన ఈ ఐదుగురి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37 కి చేరుకుంటుంది. -
సీబీఎస్ఈ త్రిభాషా విధానం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఢిల్లీ: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో 9,10 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు.. కేంద్రం, ఎన్సీఈఆర్టీ( NCERT)కి నోటీసులు ఇచ్చింది.ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మల్య బాగ్చీ, విపుల్ ఎమ్ పంచోలిలతో కూడిన ధర్మాసనం.. రెండు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా, చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్ఈ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ 9, 10 తరగతుల సిలబస్ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.అయితే, 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్ఈ ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీబీఎస్ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్ పరీక్ష కూడా నిర్వహించారు.ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల సన్నద్ధత, పాఠ్యపుస్తకాల లభ్యతను ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్ఈ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం, విద్యార్థులపై అనవసరంగా ఒత్తిడి పెంచడం సరైంది కాదని అంటున్నారు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్ఈ వెల్లడించింది. -
‘సర్’పై ‘సుప్రీం’ తుది తీర్పు.. ఈసీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: భారత ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల లక్ష్యంతో ఈసీ తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్ధమేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగానే..ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘సర్’ ప్రక్రియ చట్టవిరుద్ధమని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఈసీ నిర్వహించిన ఈ ప్రక్రియ రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగానే ఉందని కోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాను నిరంతరం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. పిటిషన్ల కొట్టివేతఈసీకి ‘సర్’ నిర్వహించే అధికారం లేదని, ఇది ప్రాతినిధ్య చట్టం, 1960 నాటి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు వాదించారు. అయితే, కోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది. ఓటర్ల జాబితా తయారీలో ఈసీకి ఉన్న విస్తృత అధికారాలను, ముఖ్యంగా ఎన్నికల సమగ్రతను కాపాడే క్రమంలో ఈ ప్రక్రియ ఎంత ముఖ్యమో కోర్టు తన తీర్పులో వివరించింది.దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రక్రియకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే, దేశంలోని బీహార్, కేరళ, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ‘సర్’ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తీర్పుతో ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్వేలకు చట్టపరమైన భద్రత లభించడంతో, పెండింగ్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. -
గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పండుగకు కేవలం రెండు రోజుల ముందు ఈ అభ్యర్థన రావడంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.చివరి నిమిషంలో పిటిషన్ ఎందుకు?అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. గోవధను నిషేధించే చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని, అలాగే వధశాలల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. బుధవారమే ఈ అంశంపై విచారణ చేపట్టాలని న్యాయవాది బారున్ కుమార్ సిన్హా కోర్టును కోరారు.సుప్రీంకోర్టు ఘాటు స్పందనఈ అభ్యర్థనను విన్న వెంటనే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘పండుగకు ఒక్కరోజు ముందు మీకు ఇది గుర్తుకొచ్చిందా? ఇందులో ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదు. ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానిస్తూ, విచారణను చేపట్టేందుకు స్పష్టంగా నిరాకరించింది. సమయానుకూలంగా కాకుండా, పండుగ వేళ ఇలాంటి అంశాలను కోర్టు ముందుకు తేవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.న్యాయపరమైన పరిణామాలుప్రస్తుతానికి ఈ పిటిషన్పై ఎలాంటి అత్యవసర ఉత్తర్వులు జారీ కాకపోవడంతో, పాత చట్టాలు, మార్గదర్శకాల ప్రకారమే పండుగ ఏర్పాట్లు కొనసాగనున్నాయి. చట్టాల అమలు, వధశాలల నియంత్రణకు సంబంధించి పిటిషనర్ లేవనెత్తిన అంశాలను తదుపరి సాధారణ విచారణలో పరిశీలించాల్సి ఉంటుంది. అత్యవసర విచారణ కోరిన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించడంతో, ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. -
టాయిలెట్లు, నాప్కిన్ల కొరత సాకుతో బాలికలను బడికి దూరం చేయరాదు
న్యూఢిల్లీ: స్కూళ్లలో శానిటరీ నాప్కిన్లు, వేరుగా టాయిలెట్లు లేవనే ఒకే ఒక్క కారణంతో బాలికలు చదవుకు దూరమయ్యే పరిస్థితి రాకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి 30వ తేదీన తాము వెలువరించిన ఆదేశాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో తుచ తప్పక అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని మరోసారి కోరింది. విద్యార్థినులకు ఉచిత శానిటరీ నాప్కిన్లు అందించడం, పాఠశాలల్లో బాలికలకు వేరుగా నీటి వసతి కలిగిన పనిచేసే మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటించేలా చర్యలు వేగవంతం చేశామని సోమవారం జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనానికి కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అర్చనా పాఠక్ దవే విన్నవించారు. స్పందించిన ధర్మాసనం..‘ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోండి. అవి మన దేశంలోని మహిళలు, బాలికల మేలు కోసమే. కేవలం టాయిలెట్లు, నాప్కిన్లు లేవని బాలికలు చదువు మానేసి ఇంటి పనులకు పరిమితం కారాదు’అని పేర్కొంది. అదేవిధంగా, తమ ఆదేశాల అమలు తీరుపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వివరాలను సేకరించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్ష కొనసాగిస్తూనే ఉండాలని తెలిపింది. ఆదేశాల అమలుపై ప్రతి మూడు నెలలకోసారి తమకు నివేదిక అందజేయాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించింది. తాము వాటిపై సమీక్ష చేపడతామంది. ఈ అంశంపై సెప్టెంబర్ ఒకటో తేదీన తదుపరి విచారణ జరుపుతామని, ఇందుకుగాను ఆగస్ట్ 15కల్లా నివేదిక అందజేయాలని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సహకారం అందించాలని స్పష్టం చేసింది. ఎలాంటి జాప్యానికి తావివ్వరాదని పేర్కొంది. ఈ సందర్భంగా ఒక మధ్యంతర పిటిషనర్ తరఫు న్యాయవాది జనవరి 30వ తేదీ నాటి ఆదేశాల్లో ఉన్న ఆక్సో–బయోడీగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ల గురించి ప్రస్తావించారు. అవి పర్యావరణ హితమైనవి కావని తెలిపారు. స్పందించిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది.ఆ కీలక తీర్పులో ఏముంది? జనవరి 30వ తేదీన అత్యున్నత న్యాయస్థానం..‘రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కులో రుతుక్రమ ఆరోగ్య హక్కు కూడా భాగమే. రుతుక్రమ పరిశుభ్రతకు తగు సదుపాయాలు లేకుంటే బాలికలు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది. అంతిమంగా వారు వెనుకబాటుకు గురవుతారు. వీటిని నివారించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పర్యావరణ హిత శానిటరీ నాప్కిన్లను బాలికలకు పూర్తిగా ఉచితంగా అందించాలి. అదేవిధంగా, సక్రమంగా పనిచేసే, నీటి వసతి కలిగిన టాయిలెట్లను బాలికల కోసం వేరుగా నిర్మించాలి’అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. -
ట్విషా శర్మ మృతి కేసు.. సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును శనివారం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే 25) ఈ కేసుపై విచారించే అవకాశం ఉంది. 33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన అత్తవారింట్లో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. ప్రాథమిక పోస్ట్మార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలినప్పటికీ, ఆమె కుటుంబం ఈ నిర్ధారణలను తిరస్కరిస్తూ, ఇందులో కుట్ర ఉందని ఆరోపిస్తోంది. కాగా ఈ కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్.. శుక్రవారం జబల్పూర్ జిల్లా కోర్టులో లొంగిపోవడానికి వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి భోపాల్ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో అతడిని భోపాల్ కోర్టు శనివారం 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్ వృత్తిరీత్యా న్యాయవాది కాగా, ఆమె అత్తగారు గిరిబాల సింగ్ పదవీ విరమణ చేసిన రిటైర్డ్ న్యాయమూర్తి. -
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు పిటిషన్ కొట్టివేత
-
వీధికుక్కలకు ‘కారుణ్య మరణం’
సాక్షి, న్యూఢిల్లీ: ‘గౌరవంగా జీవించే హక్కు అంటే కుక్కకాటు భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా’అని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన వీధి కుక్కల దాడుల నియంత్రణపై కీలకమైన తీర్పు వెలువరించింది. ముప్పుగా పరిణమించిన, క్రూరమైన, పిచ్చిపట్టిన, కోలుకోలేని జబ్బుబారిన పడిన, అత్యంత ప్రమాదకరమైన వీధి కుక్కలకు కారుణ్య మరణం(యూథనేషియా) ప్రసాదించవచ్చని స్పష్టం చేసింది. వీధికుక్కల జనాభా ప్రమాదకర స్థాయికి చేరిన ప్రాంతాల్లో, తరచుగా కుక్క కాట్లు ప్రజల భద్రతకు నిరంతర ముప్పుగా మారిన చోట కారుణ్య మరణం ద్వారా వాటి సంఖ్యను తగ్గించవచ్చని సూచించింది.జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం–1960, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్–2023, ఇతర చట్టబద్ధమైన ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా, పశువైద్య నిపుణుల అంచనా తర్వాత కారుణ్యమరణంతోపాటు ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఆసుపత్రులు, పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి పబ్లిక్ ప్రదేశాల్లో పట్టుకున్న శునకాలను తిరిగి అక్కడే వదలరాదని గత నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆ కుక్కలను తప్పనిసరిగా షెల్టర్లలోనే ఉంచాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. వీధి కుక్కల తొలగింపును, భారత జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యూబీఐ) నిబంధనలను సవాల్ చేస్తూ జంతు హక్కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. అసలేం జరిగిందంటే... గతేడాది ఓ చిన్నారి వీధి కుక్కల దాడిలో మరణించిన ఘటనపై జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. దేశ రాజధాని ప్రాంతంలోని వీధి కుక్కలన్నింటినీ పట్టుకుని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలపై జంతు ప్రేమికులు, జంతు హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఈ వ్యవహారం త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ అయ్యింది. విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం.. తొలుత జంతు జనన నియంత్రణ(ఏబీసీ) నిబంధనల ప్రకారం కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి వదిలేయాలని పేర్కొంది. ఆ తర్వాత సమస్య తీవ్రత దష్ట్యా దేశవ్యాప్తంగా విచారణ పరిధిని విస్తరించింది.ఈ క్రమంలోనే గత నవంబర్ 7న కీలక ఆదేశాలు ఇస్తూ.. ఆసుపత్రులు, విద్యాసంస్థలు తదితర పబ్లిక్ ప్రదేశాల నుంచి కుక్కలను పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, నిర్ణిత ప్రదేశాల్లో మినహా వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, కేవలం ఏబీసీ నిబంధనలు మాత్రమే అమలు చేయాలని కోరుతూ జంతు హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), ఏడబ్ల్యూబీఐ తదితర పక్షాల వాదనలు విన్న కోర్టు.. జనవరిలో తీర్పును రిజర్వ్ చేసి, మంగళవారం వెలువరించింది. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ ధర్మాసనం తమ తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గౌరవప్రదంగా జీవించే హక్కు అంటే, కుక్కల దాడుల భయం లేకుండా స్వేచ్ఛగా బతకడం కూడా. వీధి కుక్కల దాడుల్లో చిన్నారులు, వృద్ధులు, విదేశీ ప్రయాణికులు బలవుతున్నారు. ఈ కఠోర వాస్తవాలను కోర్టు విస్మరించలేదు. పిల్లలు, వృద్ధులు కేవలం తమ కండబలంతో కుక్కల బారినుంచి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితిని రాజ్యాంగం కల్పించలేదు.ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు మౌనంగా చూస్తూ ప్రేక్షకపాత్ర వహించడానికి వీల్లేదు’’అని జస్టిస్ సందీప్ మెహతా తమ తీర్పును చదువుతూ వ్యాఖ్యానించారు. జంతు జనన నియంత్రణ(ఏబీసీ) నిబంధనల అమలులో ప్రభుత్వాల వైఫల్యం, నిధుల కొరత వల్లే ఈ సమస్య తీవ్రరూపం దాల్చిందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలకూ ఈ ముప్పు విస్తరించిందని ఆక్షేపించింది. స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు తమ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన ప్రమాదకరమైన, పిచ్చిపట్టిన కుక్కలకు చట్టబద్ధమైన నిబంధనల మేరకు కారుణ్య మరణం ప్రసాదించేందుకు అధికారులకు అనుమతినిచ్చింది. వీధి కుక్కల నియంత్రణకు ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక పూర్తిస్థాయి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జనాభా సాంద్రతను బట్టి వీటిని మరింత విస్తరించాలని స్పష్టం చేసింది. అలాగే, ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు, ఇమ్యునోగ్లోబులిన్స్ తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.కోర్టు ఆదేశాల అమలులో భాగంగా, వీధి కుక్కల నియంత్రణకు చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అధికారులకు పూర్తి రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. సదుద్దేశంతో విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సాధారణంగా ఎలాంటి క్రిమినల్ కేసులు, ఎఫ్ఐఆర్లు నమోదు చేయరాదని పోలీసులను ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణా చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలును, జంతు సంక్షేమ బోర్డు నిబంధనలను పర్యవేక్షించేందుకు రాష్ట్రాల హైకోర్టులు సుమోటోగా కేసులు నమోదు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా, జాతీయ రహదారులపై పశువుల బెడదను నివారించేందుకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఏఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధ్యత నుంచి సుప్రీంకోర్టు తప్పుకుంది: మేనకా గాంధీ వీధి కుక్కుల విషయంలో సుప్రీంకోర్టు తన బాధ్యత నుంచి తప్పుకుందని కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై ఆమె స్పందించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా అమలు చేయలేదని ఆక్షేపించారు. ఈ ఆరు నెలల్లో జరిగిందేమీ లేదన్నారు. -
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
రఘురామకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ జడ శ్రవణ్ సంచలన కామెంట్స్
-
‘బెయిల్ మీ ఇష్టమా?’.. కింది బెంచ్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో సంచలనం రేకెత్తించేలా భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) అంటే ‘ఉపా’ (UAPA) చట్టం కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ పొందడం ఒక నియమం’ అని, విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ముఖ్యంగా ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో ఉమర్ ఖాలిద్కు బెయిల్ దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. గతంలో ‘కేఏ నజీబ్’ కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును కింది బెంచ్లు పట్టించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పులను న్యాయవ్యవస్థలో కీలక మార్గదర్శకాలుగా భావిస్తారు. అలాంటి తీర్పులు చట్టపరమైన స్పష్టతను తీసుకురావడమే కాదు, దిగువ బెంచ్లకు దిశానిర్దేశం చేస్తాయి. ఇద్దరు జడ్జిల బెంచ్ ఏదైనా అంశాన్ని విచారించే సమయంలో పెద్ద బెంచ్ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవడం న్యాయసూత్రాల్లో భాగం. పెద్ద ధర్మాసనం అభిప్రాయాన్ని పక్కన పెట్టి భిన్నంగా వ్యవహరించొద్దు. చిన్న బెంచ్లు పెద్ద ధర్మాసనం నిర్దేశించిన సూత్రాలను అనుసరించడం న్యాయపరమైన బాధ్యతగా భావిస్తారు. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు కాస్త ఘాటుగా చెప్పింది.విస్తృత ధర్మాసనం తీర్పులను ధిక్కరిస్తారా?జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 2024లో వెలువడిన ‘గుర్విందర్ సింగ్’, ఉమర్ ఖాలిద్ కు సంబంధించిన ‘గుల్ఫిషా ఫాతిమా’ కేసుల్లో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పులపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘కేఏ నజీబ్’ కేసులో ఇచ్చిన తీర్పుకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చిన్న బెంచ్లు వాటిని తక్కువ చేయడం న్యాయ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఘాటుగా మందలించింది.‘ఉపా’ కేసుల్లోనూ బెయిల్ ప్రాథమిక హక్కేఉపా చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, ‘బెయిల్ ఇవ్వడమే నియమం.. జైలులో ఉంచడం మినహాయింపు’ అనే సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును ఉపా చట్టంలోని కఠినమైన సెక్షన్ 43D(5) కూడా అడ్డుకోలేదని పేర్కొంది. కేవలం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే సాకుతో, నిందితులను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైలులో ఉంచడం అనేది వారికి శిక్ష విధించినట్లే అవుతుందని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు ఎంత తీవ్రమైనవో, విచారణ కూడా అంతే వేగంగా జరగాలని సూచించింది.ఆరేళ్ల జైలు జీవితం: సయ్యద్ ఇఫ్తిఖర్ కు విముక్తిమాదకద్రవ్యాల సరఫరా ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణలపై ఉపా చట్టం కింద అరెస్టై, ఆరేళ్లుగా జైలులో ఉన్న జమ్ముకశ్మీర్కు చెందిన సయ్యద్ ఇఫ్తిఖర్ అంద్రాబీ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కింది కోర్టులు, హైకోర్టు ఇతనికి బెయిల్ నిరాకరించగా, సుప్రీంకోర్టు మాత్రం అతని సుదీర్ఘ జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఉపా కేసుల్లో నేరం రుజువయ్యే శాతం చాలా తక్కువగా ఉందని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: మణిపూర్లో టెన్షన్.. బందీల కోసం బలగాలు -
‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ కామెంట్లపై సీజేఐ సూర్యకాంత్ వివరణ
ఢిల్లీ: ‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. శుక్రవారం (మే 15న) జరిగిన విచారణలో సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చి బెంచ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కేసు విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ‘‘మీడియా నా వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసింది. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియాలోకి వచ్చిన వారిని తప్పుబట్టాను. అలాంటి వారు పరాన్నజీవులని చెప్పాను. యువతను విమర్శించలేదు, భారత యువత గర్వకారణం. భారత యువతే అభివృద్ధికి మూల స్తంభం’’ అని తెలిపారు.ఓ పనికిమాలిన కేసు విచారణ సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని సీజేఐ సూర్యకాంత్ చెప్పారు. “నిన్న కేసు విచారణ సమయంలో నేను చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా కొంత భాగం తప్పుగా చూపించిన తీరు చూసి బాధపడ్డాను. బార్ వంటి వృత్తుల్లోకి నకిలీ, బోగస్ డిగ్రీల సాయంతో వచ్చిన వారినే నేను ప్రత్యేకంగా విమర్శించాను. అలాంటి వారు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవనీయ వృత్తుల్లోకి చొరబడ్డారు. అందుకే వారిని పరాన్నజీవులతో పోల్చాను” అని సూర్యకాంత్ చెప్పారు.కాగా, నిరుద్యోగ యువ న్యాయవాదులను బొద్దింకలుగా పేర్కొన్నారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. సీనియర్ హోదా కల్పించే ప్రక్రియపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కాలేదని ఆరోపిస్తూ న్యాయవాది సంజయ్ దూబే ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్పై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి.విచారణ సమయంలో సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం దూబేను ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది హోదా ప్రతిష్ఠకు గుర్తా లేదంటే న్యాయ వ్యవస్థలో భాగస్వామ్యం సాధనమా? అని జోయ్మాల్యా బాగ్చి ప్రశ్నించారు.ఆ సమయంలో “వృత్తిలో.. ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారు” అని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. వారు సోషల్ మీడియా, ఆర్టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని చెప్పారు. నల్ల కోట్లు వేసుకున్న వేలాది మందిపై వారి డిగ్రీల విషయంలో అనుమానాలు ఉన్నాయని అన్నారు.దీంతో, తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని శనివారం సూర్యకాంత్ స్పష్టం చేశారు. “దేశ యువతను నేను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారం. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మానవ వనరులపై నాకు గర్వంగా ఉంది. భారత యువత నాకు ఎంతో గౌరవం ఇస్తారు. నేనూ వారిని అభివృద్ధి చెందే భారతానికి స్తంభాలుగా చూస్తాను” అని తెలిపారు. -
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు.. ఇంతలోనే పాముకాటుతో కాంగ్రెస్ నేత మృతి
డాక్టర్ కేతన్ భాటికర్ మృతి గోవా రాజకీయాల్లో విషాదాన్ని నింపింది. గోవా కాంగ్రెస్ యువ నాయకుడు, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కేతన్ భాటికర్ పాముకాటుతో మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి గోవా-కర్ణాటక సరిహద్దులోని కర్మాల్ ఘాట్ ప్రాంతంలో జరిగింది. 38 ఏళ్ల కేతన్ భాటికర్ కర్ణాటకలోని దాండేలి గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కారు దిగిన సమయంలో పాము కాటేసినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆయనను గోవాలోని ధర్బందోర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా..గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన డాక్టర్ కేతన్ భాటికర్.. ఇటీవల రద్దైన పోండా అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. హైకోర్టు తీర్పుతో ఆ ఉపఎన్నిక రద్దు కావడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ విషాద ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేతన్ భాటికర్ మరణం వైద్య రంగానికి తీరని లోటని పేర్కొంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ప్రతిపక్ష నేత యూరి అలెమావో కూడా సంతాపం తెలిపారు. ప్రజాసేవ పట్ల కేతన్ భాటికర్కు ఉన్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.ఉప ఎన్నిక అసలు ఎందుకు రద్దయిందంటే..పోండా అసెంబ్లీ ఉపఎన్నిక అసలు ఎందుకు రద్దయిందంటే.. ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రవి నాయక్ 2025 అక్టోబర్లో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక అవసరమైంది. దీంతో ఎన్నికల సంఘం 2026 ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున డాక్టర్ కేతన్ పోటీ చేశారు. అయితే, పోలింగ్కు కేవలం 16 గంటల ముందు బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆ ఉపఎన్నికను రద్దు చేసింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను డాక్టర్ కేతన్.. సుప్రీంకోర్టులో సవాలు చేశారు. గోవాలో ప్రస్తుత శాసనసభ గడువు ఏడాది లోపే ఉందని.. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ ఇద్దరు ఓటర్లు బాంబే హైకోర్టు గోవా బెంచ్లో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అసెంబ్లీ పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఉప ఎన్నిక నిర్వహించడం తప్పనిసరి కాదని పిటిషనర్లు వాదించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఏడాది కంటే తక్కువ సమయమే పదవిలో ఉంటాడని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పోండా ఉప ఎన్నిక నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.సుప్రీంకోర్టుకు డాక్టర్ కేతన్..దీనిపై డాక్టర్ కేతన్ భాటికర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయ్యాక రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రచారం పూర్తైంది.. పోస్టల్ బ్యాలెట్లు కూడా పడిపోయాయి. ప్రజలకు తమ ఎమ్మెల్యేను ఎన్నుకునే హక్కు దూరమైంది. చట్టం ఎన్నికలు నిర్వహించకూడదని కాదు.. తప్పనిసరి కాదని మాత్రమే చెబుతోంది. పోండా ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడం సరికాదంటూ ఆయన వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా ఎన్నికల చట్టంలోని Section 151A వ్యాఖ్యానం కీలకమని పేర్కొంటూ ఎన్నికల సంఘం సమాధానం కోరింది. ఈ క్రమంలో కేసు పెండింగ్లో ఉండగానే ఆయన చనిపోయారు. డాక్టర్ కేతన్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా విచారణలో ఉండగా.. ఇంతలోనే పాముకాటుతో ఆయన మరణించడం రాజకీయంగా, న్యాయపరంగా కూడా చర్చనీయాంశమైంది.సుప్రీంకోర్టు నిర్ణయంపై..అయితే, డాక్టర్ కేతన్ మరణంతో ఆయన దాఖలు చేసిన సుప్రీంకోర్టు పిటిషన్పై ప్రభావం పడే అవకాశం ఉంది. సాధారణంగా వ్యక్తిగత హక్కులు లేదా ఎన్నికల అర్హతలకు సంబంధించిన కేసుల్లో పిటిషనర్ మరణిస్తే, ఆ పిటిషన్ “అబేట్” (చెల్లుబాటు కోల్పోవడం) అయ్యే అవకాశముంటుంది. అయితే ఇది పూర్తిగా కేసు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. పోండా ఉపఎన్నిక రద్దు అంశం ప్రజాప్రయోజనం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదిగా కోర్టు భావిస్తే, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ తరఫున మరో వ్యక్తి కేసును కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
బిడ్డ కోసం కెరీర్ను కొనసాగించాలనుకోవడం క్రూరత్వం కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: విద్యావంతురాలైన మహిళ తన కెరీర్ను కొనసాగించాలని నిర్ణయించుకోవడం, తన బిడ్డకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని భావించడం క్రూరత్వం లేదా భర్తను నిర్లక్ష్యం చేయడంగా భావించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక మహిళ డెంటిస్ట్గా తన వృత్తిని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడాన్ని క్రూరత్వంగా పేర్కొంటూ కుటుంబ న్యాయస్థానం తీర్పింవ్వగా గుజరాత్ హైకోర్టు సమర్ధించింది. ఈ తీర్పులను తిరోగమనవాదం, అతి సంప్రదాయవాద ధోరణిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. రెండు కోర్టుల తీర్పులను కొట్టివేసింది.భార్య వృత్తిపరమైన గుర్తింపు కేవలం భర్త ఇష్టాయిష్టాలకు లోబడి ఉండదని స్పష్టం చేసింది. వేరుగా ఉంటున్న భార్యాభర్తల పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మంగళవారం పైవ్యాఖ్యలు చేసింది. వివాహ బంధంతో రాజీపడే అవకాశం ఎంతమాత్రం లేదని మహిళ చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. వివాహ బంధం పునరుద్ధరించలేనంతగా దెబ్బతిన్నదనే కారణంతో కింది కోర్టులు మంజూరు చేసిన విడాకుల ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ఈ విడాకులు మహిళ క్రూరత్వం లేదా పరిత్యాగం ఆధారంగా కాదని స్పష్టం చేసింది.కేసు వివరాలివీ.. పిటిషనర్లయిన భర్త భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ కాగా, భార్య దంత వైద్యురాలు. పుణెలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్ట్కు 2009లో కల్నల్తో వివాహమైంది. పెళ్లయిన వెంటనే భర్త వెంట ఆమె సరిహద్దుల్లోని కార్గిల్కు వెళ్లారు. వారికి ఒక కుమార్తె పుట్టింది. బిడ్డకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తడంతో ప్రత్యేక వైద్యం కోసం అహ్మదాబాద్ వెళ్లారు. కుమార్తె వెంట ఉండిపోవాల్సి రావడంతో అహ్మదాబాద్లోనే డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నారు. భర్తకు ఇది నచ్చలేదు. విషయం ఫ్యామిలీ కోర్టుకు, ఆపై హైకోర్టుకు వెళ్లింది. రెండు కోర్టులూ దీనిని భార్య కూరత్వంగానే పేర్కొన్నాయి. భర్త ఎక్కడ ఉద్యోగం చేస్తే భార్య కూడా అక్కడే నివసించడం తప్పనిసరి విధి అని ఫ్యామిలీ కోర్టు పేర్కొంది. -
సుప్రీం ఆదేశంతో ఎన్నికల ఫలితం రివర్స్!
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై పశ్చిమ బెంగాల్లో రభస కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో మే 11 అంటే సోమవారం సుప్రీంకోర్టులోనూ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ దక్కించుకుంది. తీర్పు ఇస్తున్న సందర్భంగా ‘‘ప్రజాస్వామ్యం హైజాక్ అయ్యేందుకు అనుమతించం’’ అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది కూడా.. వివరాలు ఇలా ఉన్నాయి..2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో శృంగేరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున టీటీ రాజేగౌడ, బీజేపీ తరఫున జీవరాజ్లు పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల కౌంటింగ్ తరువాత 201 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి టీటీ రాజేగౌడ గెలుపొందినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే.. జీవరాజ్ ఈ ఫలితాన్ని సవాలు చేశారు. విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు రీకౌంటింగ్కు ఆదేశించింది.రిటర్నింగ్ అధికారి 562 ఓట్లను పునః పరిశీలించి బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలుపొందినట్టుగా ప్రకటించారు. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. విషయం కాస్తా సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు తీరును తప్పుపట్టింది. ఫలితాలను మార్చేసి కాంగ్రెస్ అభ్యర్థే శృంగేరి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే అని స్పష్టం చేసింది.క్రిమినల్ కేసును విస్మరించారు...హైకోర్టు తీర్పు ఒకలా.. సుప్రీంకోర్టు తీర్పు ఇంకోలా ఉండేందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే.. రీకౌంటింగ్ సందర్భంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హైకోర్టు ఆదేశాలను మించి 562 ఓట్లను రీకౌంట్ చేయడం సమస్యకు కారణంగా మారింది. ఈ నెల రెండు మూడు తేదీల్లో రీకౌంటింగ్ జరగ్గా 279 ఓట్లకు బదులు 562 ఓట్లు రీకౌంట్ చేశారు. ఫలితంగా టీటీ రాజేగౌడకు పడ్డ ఓట్లు 248- 255 వరకూ తగ్గిపోయి జీవరాజ్ ఓట్లు స్వల్పంగా పెరిగాయి. సుమారు 52 - 66 ఓట్ల తేడాతో జీవరాజ్ గెలిచినట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.అంతకు ముందు అంటే 2023 ఎన్నికల కౌంటింగ్ సందర్భంలోనూ తమకు పడ్డ బ్యాలెట్లను ఉద్దేశపూర్వకంగా చెల్లనివిగా చేశారని టీటీ రాజేగౌడ ఆరోపిస్తున్నారు. బ్యాలెట్ కాగితాలపై గీతలు పెట్టి, ఇంకు గుర్తులు పెట్టి చెల్లకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ తలుపుల తాళాలు, సీళ్లు చెదిరిపోయి ఉన్నాయని కూడా గుర్తించారు. కౌంటింగ్కు ముందే బ్యాలెట్ బాక్సులు తెరిచి ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాలపై అప్పట్లోనే కలెక్టర్ కె.ఎన్.రమేశ్, రిటర్నింగ్ అధికారి వేదమూర్తి, బీజేపీ అభ్యర్థి జీవరాజ్లపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నింటిపై హైకోర్టు స్టే విధించడం గమనార్హం. చివరకు సుప్రీంకోర్టు చొరవతో శృంగేరి అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ వశమైంది.పెద్ద ఎత్తున జరిగి ఉంటే...శృంగేరి అసెంబ్లీ స్థానంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ జర్నలిస్ట్ రవీశ్ కుమార్ స్పందించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడుతూ కెమెరాకు చిక్కడం, హర్యానా పంచాయితీ ఎన్నికల్లోనూ సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన ఈవీఎం రీకౌంటింగ్తో ఫలితాలు తారుమారైన విషయాన్ని, బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపే ప్రస్తావిస్తూ.... కర్ణాటక మాదిరిగానే దేశంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ రిటర్నింగ్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 2024 సాధారణ ఎన్నికల విషయంలోనూ సుప్రీంకోర్టు సమీక్ష జరపాలని కోరారు. రిటర్నింగ్ అధికారులు తప్పు చేసి ఉంటే న్యాయస్థానం ఎలాంటి శిక్ష విధిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాల విషయంలో హెచ్చరించడం, లేదా ఖండించడం శిక్ష కిందకు రాదని వ్యాఖ్యానించారు.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) నిధుల మళ్లింపునకు సంబంధించి రూ.27,300 కోట్ల భారీ బ్యాంకు మోసం కేసులో సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. వివాదాస్పద లావాదేవీల్లో అనిల్ అంబానీ ఎవరినీ మోసం చేయలేదని, బహుశా అతనే మోసపోయి ఉండవచ్చునని న్యాయస్థానం ముందు పేర్కొన్నారు.దర్యాప్తు సంస్థల నివేదికఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించాయి. రూ.27,300 కోట్ల నిధుల మళ్లింపుపై విచారణ సరైన దిశలోనే సాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, తదుపరి విచారణలో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఏజెన్సీ వెల్లడించింది. అయితే, నిధుల మళ్లింపులో అంబానీ పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపిస్తున్న పిటిషనర్, ఇప్పటివరకు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపిటిషనర్ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు, దర్యాప్తు ప్రక్రియను సంచలనాత్మకం చేయవద్దని హెచ్చరించింది. ‘అరెస్టు చేయాలని ఆదేశించడానికి కోర్టు సంకోచిస్తోంది. కస్టోడియల్ విచారణ అవసరమా లేదా అనేది దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలే నిర్ణయించాలి. ఆ బాధ్యత వారిదే’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.ఆస్తుల అటాచ్మెంట్పై అభ్యంతరంఢిల్లీలో విద్యుత్ సరఫరా చేసే బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్లలోని రూ.1,575 కోట్ల విలువైన షేర్లను దర్యాప్తు సంస్థలు అటాచ్ చేయడంపై అంబానీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే గ్రూపునకు చెందిన కంపెనీలు కావడమే ఈ చర్యకు కారణమని, ఇది ఉద్దేశపూర్వకమని వాదించారు. అటాచ్మెంట్ వల్ల వర్కింగ్ క్యాపిటల్ స్తంభించిపోతుందని, తద్వారా దేశ రాజధానిలోని కోట్లాది మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కేసు నేపథ్యంరిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలకు చెందిన బ్యాంకు నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని, తద్వారా బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ భారీ ఆర్థిక కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణలో దర్యాప్తు సంస్థలు సమర్పించే నివేదికలు అనిల్ అంబానీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
స్పెషల్ డీఎస్సీపై సర్కారు మౌనం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆటిజం, బుద్ధిమాంద్యం వంటి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం స్పెషల్ టీచర్లను నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఏడాది గడిచినా కార్యరూపం దాల్చలేదు. అత్యున్నత న్యాయస్థా నం ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పోస్టులు సృష్టించాల్సింది పోయి, ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలోని రెగ్యులర్ టీచర్ పోస్టు ల్లో 2,260 పోస్టులను సర్ప్లస్(మిగులు)గా చూపి వాటిని స్పెషల్ టీచర్ పోస్టులుగా (1,136 స్పెష ల్ ఎస్జీటీలు, 1,124 స్పెషల్ స్కూల్ అసిస్టెంట్) మార్పు చేసింది. ఈ మేరకు గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వం జీఓనెం.13ను విడుదల చేసింది. అనంతరం ఆర్థిక ఆమోదం తెలపడంతోపాటు గత మేలో ఈ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ప్రక టన సమయంలో సహా పలు సందర్భాల్లో ప్రభు త్వం స్పెషల్ టీచర్ పోస్టుల (డీఎస్సీ) భర్తీకి చర్య లు చేపడుతున్నట్టు ప్రకటించి అభ్యర్థుల్లో ఆశలు పెంచింది. వాస్తవంలో మాత్రం ఏడాది కాలంగా నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో స్పెషల్ బీఈడీ, డీఎడ్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. 5 వేల వరకూ ఖాళీలు.. స్పెషల్ టీచర్ల నియామకానికి సంబంధించి విద్యాశాఖ 13 ఉమ్మడి జిల్లాల్లోనూ గుర్తించిన ఖాళీలు ఒక్క పాఠశాల విద్యాశాఖలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూళ్లకు సంబంధించినవి మాత్రమే కావడం మరో విశేషం. మిగిలిన ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మహాత్మ జ్యోతిబాపూలే, జువైనల్, మోడల్ స్కూల్స్ తదితర శాఖలు ఇప్పటికీ ఆయా స్కూళ్లల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించలేదు. పైగా ఈ ఖాళీలపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద స్పష్టత కూడా లేదు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఖాళీలు కలిపి మొత్తం 5 వేల వరకు ఉంటాయని అంచనా. దివ్యాంగ విద్యార్థుల వికాసమే లక్ష్యంగా... ⇒ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 10 మంది విద్యార్థులకు ఒకరు, ఉన్నత పాఠశాలల్లో ప్రతి 15 మందికి ఒక స్పెషల్ టీచర్ ఉండాలని ఆర్టీఈ–2009 చట్టంలో 2022 సవరణ చెబుతోంది. ⇒ దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్యావకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ⇒ స్పెషల్ టీచర్లను నియమించాలని ప్రభుత్వాలకు గతేడాది మార్చిలో విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. విద్యకు దూరమవుతున్న స్పెషల్ విద్యార్థులు రాష్ట్రంలో సమగ్ర శిక్ష కింద 679 భవిత కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 9 వేల మంది ఆటిజం, బుద్ధిమాంద్యం పిల్లలు చదువుకుంటున్నారు. ఇక భవిత కేంద్రాల పరిధిలో దాదాపు 80 వేల మంది స్పెషల్ విద్యార్థులున్నారు. వీరిలో 1–5 తరగతుల వయసు వారు 17 వేల మంది భవిత కేంద్రాల్లో ఉన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యాబుద్ధులు నేరి్పంచేందుకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్టీ) 1,286 మంది కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. వీరంతా స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినవారే. మిగిలిన 63 వేల మంది విద్యార్థులు స్థానిక ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలల్లో చేరినా స్పెషల్ టీచర్లు లేక విద్యకు దూరమవుతున్నారు. ప్రస్తుతమున్న 6 స్పెషల్ స్కూళ్లల్లోనూ ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ‘భవిత’ స్పెషల్ టీచర్ల ఆందోళన భవిత సెంటర్లలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని లేదా రెగ్యులర్ టీచర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం హడావుడిగా వీరి అర్హతలను నిర్ధారించేందుకు కమిటీని నియమించింది. కానీ ఇంత వరకు దీనిపై ఎటూ తేల్చలేదు. సుప్రీం తీర్పు నేపథ్యంలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారంతా తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మభ్యపెట్టే ధోరణి అవలంభించడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. -
బాబు గారి కళ్లలో తృప్తి కోసం...
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లింది? మొదట చేసిన ఆరోపణ ఏమిటి? ఆ తర్వాత వేసిన కుప్పిగంతులు ఎన్ని? సీబీఐ విచారణలో నిందితులుగా గుర్తించని వారిపై సైతం కేసులు పెట్టాలని ఎల్లో మీడియా ఎందుకు గొడవ చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం క్రితం తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతుకొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏదో జరిగిపోయినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నానా హడావుడి చేశారు. దుర్గగుడి మెట్లు కడిగారు. తిరుపతిలో సభ పెట్టి సనాతన హిందువునని ప్రకటించుకున్నారు కూడా. ఆ తరువాతేమైంది? తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులతో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో నానా ప్రయత్నాలూ చేసింది. అయితే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో తన ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు ఉండేలా మాత్రం చేసుకోగలిగారు. అయినప్పటికీ జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసింది. ఫలితంగా కూటమి ప్రభుత్వ పరువు పోయింది. రాజకీయం కోసం నీచమైన ఆరోపణలు చేశారన్న భావన ప్రజలలో ఏర్పడింది. అయితే నెయ్యిలో పామాయిల్ వంటివి కల్తీ అయి ఉండవచ్చని సీబీఐ అభిప్రాయపడి కొందరు డెయిరీ యజమానులపై, టీటీడీ అధికారులపై కేసులు పెట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం శాంతించలేకపోయింది. ఎలాగైనా నెపం వైఎస్సార్సీపీ వారిపై నెట్టాలని మరో కమిషన్ ఏర్పాటు చేసింది. సీబీఐ నివేదికలోని అంశాల ఆధారంగా తదుపరి చర్యలపై నివేదిక కోరింది. మొత్తమ్మీద అందులో ఏదో రకంగా అప్పటి ఈఓ ధర్మారెడ్డి పేరు ప్రస్తావించడం ఎల్లో మీడియాకు సంతోషం కలిగించింది. చంద్రబాబు సంతృప్తి చెందారో లేదో తెలియాల్సి ఉంది. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. అధికారులు తన మనసులోని మాటను కనిపెట్టి నిర్ణయాలు చేసేవరకు మీటింగుల పేరుతో తిప్పుతుంటారని చెబుతుండేవారు. పూర్వం ఆయా ఆరోపణలపై తాము కోరుకున్న నివేదికలు ఇచ్చే విధంగా కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులకు బాధ్యత అప్పగిస్తుంటారన్న ప్రచారం ఉంది. ఇప్పటికీ అదే తరహాలో వ్యవహరిస్తున్నారేమో తెలియదు.అదే మాదిరి తాను ఆశించిన రీతిలో నివేదిక కోసం మరో రిటైర్డ్ ఐఎఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ నియమించారన్న భావన అధికారవర్గాలలో ఉంది. ఆ కమిషన్ పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలోని అంశాలు ఎల్లో మీడియాకే లీక్ చేసినట్లుగా ఉంది. వారు టీడీపీకి ఉపయోగపడే అంశాలనే ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో కీలకమైన పలు అంశాలు మిస్ అయినట్లు అనిపిస్తుంది. 2019-2024 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి మీద మాత్రమే ఎందుకు రిపోర్టు ఇచ్చారు? అంతకుముందు 2014-2019 మధ్య టీడీపీ పాలనలో సరఫరా అయిన నెయ్యి గురించి ఎందుకు నివేదికలో ప్రస్తావించలేదు? టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన సంస్థలే వైఎస్సార్సీపీ హయాంలోనూ నెయ్యి ఇచ్చాయి కదా! తప్పు జరిగితే అప్పుడు కూడా జరిగి ఉండాలి కదా?తక్కువ రేటుకు ఇస్తే కల్తీ జరిగినట్లు అన్న నిర్ధారణకు వస్తే, 2014 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా జరిగినట్లే అవుతుంది కదా?అప్పుడు కూడా కిలో నెయ్యి ధర రూ.400 లోపే ఉంది కదా! నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది, లడ్డూ తయారీలో వాడింది చంద్రబాబు హయాంలోనే అని సీబీఐ నివేదికను ఉటుంకిస్తూ కొద్దికాలం క్రితం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యకు ఇంతవరకు చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేకపోయారు? మరో విశేషం ఏమిటంటే దినేష్ కుమార్ కమిషన్ చాలా విచిత్రమైన ప్రతిపాదన చేసింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తక్కువ ధర ఆధారంగా నిర్ణయం చేసే టెండర్ విధానం వద్దని ఈ కమిషన్ సిఫారస్ చేసిందని ఎల్లో మీడియా రాసింది. ఇలా ఎందుకు చేశారు? అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం తక్కువ రేట్లకే నెయ్యి కొనుగోలు చేసినా, ఆ తర్వాత తమకు కావల్సిన ఒక సంస్థ ద్వారా అధిక రేటుకు కిలో సుమారు రూ.650లకు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకోవడానికి జరిగిన ప్రయత్నం కాదా? పైగా ఇదే పద్దతి అన్ని చోట్ల అమలు చేస్తే, ఎవరు ఎక్కువ రేటు వేస్తే వారికి టెండర్ వస్తుంది కదా! ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా?అమరావతి నిర్మాణ పనుల్లో జరుగుతున్న దోపిడీకి రాజముద్ర వేయడానికి ఏమైనా ఈ సిఫారస్ ఉపయోగపడుతుందా అన్న చర్చ కూడా ఉంది. కూటమి ప్రభుత్వ హయాంలో టీటీడీ వారు ఇందాపూర్ డెయిరీకి అధిక ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్న ఆరోపణపై, దానికి హెరిటేజ్ సంస్థకు మధ్య ఉన్న సంబంధం మొదలైన అంశాలపై కూడా దినేష్ కుమార్ కమిషన్ పరిశీలన చేసి, వాస్తవాలు నిగ్గు తేల్చాలి కదా! మరో చిత్రమేమిటంటే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి నెయ్యి నాణ్యతపై పరిశీలన చేయాలని ఆదేశాలు ఇచ్చారు కాని, ఆ తర్వాత పట్టించుకోలేదట. అందువల్ల ఆయనను బాధ్యుడిని చేయాలని ఈనాడు మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. అదే ధీరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర ప్రభుత్వ పెద్దలకు వర్తింప చేయాలని ఈ మీడియా చెబుతుందా? అధికారిక హోదాలో చంద్రబాబు పలు ఆదేశాలు ఇస్తుంటారు. వాటి ఆయనే చూడాలని, లేకుంటే బాధ్యత వహించాలని ఈ మీడియా ఒప్పుకుంటుందా? అప్పుడేమో అధికారులది తప్పని వీరు చెబుతారు. టీటీడీ విషయానికి వస్తే ఛైర్మన్ ది తప్పంటారన్నమాట. అర్థంపర్థం లేకుండా ఎల్లో మీడియా వార్తలు ఇస్తున్నదనడానికి ఇదే నిదర్శనం. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్లో వందల కోట్ల స్కామ్ జరిగిందని, సంబంధిత ఫైల్ పై చంద్రబాబే అప్పట్లో సంతకాలు చేశారని, ఆయన ఆదేశాల మేరకే నిధుల విడుదల జరిగిందని, టీడీపీ ఆఫీస్ ఖాతాలోకి కూడా నిధులు వెళ్లాయని గతంలో సీఐడీ ఆరోపణ చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఏమి రాసింది? అబ్బే చంద్రబాబుకు దీనిని ఎలా రుద్దుతారని ప్రచారం చేసిందా?లేదా? అమ్మో చంద్రబాబుపై ఆరోపణ చేస్తారా? అని గగ్గోలు పెట్టిందా? లేదా? వైవి సుబ్బారెడ్డిపై మాత్రం అర్జెంట్ గా చర్య తీసుకోవాలని ఈ ఎల్లో మీడియా ఎందుకు ఏడుపు లంకించుకుందో తెలియదా! అలాగే మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలకు కూడా నెయ్యి టెండర్ల నిబంధనల మార్పుతో సంబంధం ఉందని ఈ కమిషన్ అభిప్రాయపడిందట. అయినా వారిపై చర్యకు సిఫారస్ చేయకపోవడం ఏమిటని ఎల్లో మీడియా బాధట. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవాలని కోరవచ్చు. నెయ్యిలో ఎప్పుడు కల్తీ జరిగినా అరికట్టవలసిందే. కూటమి హయాంలో కల్తీ జరిగితే సమర్ధించడం, అప్పుడు తక్కువ ధరకు నెయ్యి సరఫరా అయినా కల్తీ లేనట్లు, ఆ తర్వాత అయితే ఉన్నట్లు సూత్రికరించడం, అలాగే చంద్రబాబు టైమ్ లో వచ్చిన కంపెనీ అయితే దానిని వదలివేయడం, అదే కంపెనీ జగన్ టైమ్లో కొనసాగితే అందుకు ఏకంగా సి.ఎమ్.నే బాద్యుడిని చేయడం..ఇలా ఉంది దిక్కుమాలిన లాజిక్కుల ప్రచారం.దీనివ్లలే వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది.కొందరు అధికారుల మీద చర్య తీసుకోవాలని దినేష్ కుమార్ కమిషన్ సిఫారస్ చేసినా ఎల్లో మీడియా సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు.మరి చంద్రబాబు ఏలా స్పందిస్తారో తెలియదు.ఏది ఏమైనా న్యాయం, ధర్మం అందరికి ఓకే మాదిరి కాకుండా టిడిపి హయాంలో స్కామ్ లు జరిగితే వాటిని సమర్ధించడం, వైరిపక్షం పాలనలో స్కామ్ జరిగినా, జరగకపోయినా, అబాంఢాలు వేసి రాజకీయ లబ్ది కోసం ప్రచారం చేయడం వల్ల ఏపీ ప్రతిష్ట,అందులోను తిరుమల ,తిరుపతి దేవస్థానం పరువును కూటమి నేతలు, ఎల్లోమీడియా దెబ్బతీస్తున్నారని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు!
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం ఈమేరకు తీర్మానం చేసింది. ఈ ముగ్గురి పేర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది.తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసింది. గంధం సునీత ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు. ఆలపాటి గిరిధర్ విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. పురుషోత్తంకుమార్ ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు. సుప్రీంకోర్టు సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత సంబంధిత ఫైలు ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది.గంధం సునీత...గంధం సునీత 1977 జూలై 14న కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లిలో గంధం వీరయ్య, శివనాగేంద్రమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్థానిక ఎస్డీఎన్ఎస్డీఎస్ పాఠశాలలో 10వ తరగతి, మచిలీపట్నం లేడీయాంప్తిల్ కాలేజీలో ఇంటర్, విజయవాడ గాంధీ మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాంటిస్సోరి కాలేజీలో ఎల్ఎల్బీ చేసి టాపర్గా బంగారు పతకం సాధించారు. 1999 జూలై 1న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. విజయవాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008 నుంచి 2010 వరకు గుడివాడలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేశారు. 2010లో సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం జిల్లా జడ్జిగా పలు చోట్ల పని చేశారు. 2019–23 వరకు హైకోర్టు రిజిస్ట్రార్గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2023 నుంచి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు.ఆలపాటి గిరిధర్...ప్రకాశం జిల్లా కొండేపి మండలం గోగినేనివారిపాలెంలో జన్మించారు. తండ్రి బాపయ్య చౌదరి స్వాతంత్ర సమరయోధుడు, విశాంత్ర ప్రధానోపాధ్యాయుడు. ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో లా డిగ్రీ పొందారు. 1998 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గిరిధర్ ఒంగోలు జిల్లా కోర్టుతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తరువాత న్యాయాధికారిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో న్యాయాధికారిగా పనిచేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా వ్యవహరించారు. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నంలో ప్రధాన జిల్లా జడ్జిగా పని చేశారు. హైకోర్టులో రిజిస్ట్రార్గా వ్యవహరించారు. ప్రస్తుతం విశాఖపట్నం ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.చింతలపూడి పురుషోత్తం కుమార్విశాఖపట్నంలో చింతలపూడి రాంబాబు, రామరత్నం దంపతులకు జన్మించారు. రాంబాబు విశ్రాంత జిల్లా జడ్జి కాగా ఆ కుటుంబంలో మూడు తరాలుగా న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్నారు. పురుషోత్తం కుమార్ ఆంధ్ర వర్సిటీలో మెరైన్ బయాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా నుంచి లా డిగ్రీ పొందారు. 2002 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అటు తరువాత వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టులో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రిజిస్ట్రార్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2025 జనవరి నుంచి ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. -
టీఎస్పీఎస్సీ నియామకాలు తుది తీర్పునకు లోబడే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చేపట్టే నియామకాలు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీల చెల్లుబాటు, తెలంగాణ వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాల స్టడీ సెంటర్ల గుర్తింపునకు సంబంధించిన వివాదంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి)పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 29కి వాయిదా వేసింది. ఈలోగా జరిగే నియామకాలు కేసు తుది తీర్పునకు లోబడే ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2017 నోటిఫికేషన్లో ఆమోదం.. 2022లో తిరస్కరణ రాష్ట్రానికి చెందిన ఎ. విజయచంద్రారెడ్డి తదితరులు టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ 2014 రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల స్టడీ సెంటర్ల ద్వారా విద్యార్థులు దూరవిద్యలో డిగ్రీలు పొందారని తెలిపారు. 2017లో టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో ఆ సర్టీఫికెట్లను ఆమోదించారని.. కానీ 2022 నోటిఫికేషన్లో యూజీసీ నిబంధనల ప్రకారం తెలంగాణ వెలుపల ఉన్న వర్సిటీల పరిధిలోకి వస్తాయనే కారణంతో వాటిని తిరస్కరిస్తున్నారన్నారు.రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని.. ఈ డిగ్రీల ఆధారంగా అభ్యర్థులకు అవకాశం కల్పించాలని వాదించారు. ఈ వాదనలపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పాటైన విశ్వవిద్యాలయం కేవలం ఆ రాష్ట్ర భౌగోళిక పరిధి లోపలే పనిచేయాలి. ఆ రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను నిర్వహించడానికి వీల్లేదు’అని యూజీసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీలకు యూజీసీ లాంటి చట్టబద్ధమైన సంస్థల గుర్తింపు లేకుంటే ఆయా డిగ్రీలను విద్యాపరమైన అర్హతలుగా పరిగణించలేమని పేర్కొంది.అలాగే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని.. అలాంటప్పుడు 2017 నుంచి 2020 మధ్య విద్యార్థులు తెలంగాణలో ఉంటూ వేరే రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లలో ఎలా ప్రవేశాలు పొందారని, వాటికి గుర్తింపు ఎలా ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ప్రస్తుతానికి నియామక ప్రక్రియను నిలిపివేయబోమని.. కానీ నియామకాలన్నీ తమ తుది తీర్పునకు లోబడే జరుగుతాయని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్
-
సుప్రీంకోర్టుకు టీఎంసీ.. ఓట్ల కౌంటింగ్ టెన్షన్ షురూ..
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మే 4న ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ సూపర్ వైజర్లు, సహాయకులుగా కేవలం కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేసి.. అత్యవసర విచారణ కోరింది. న్యాయమూర్తులు పీఎస్ నరసింహా, జోయ్మాల్య బాగ్చీతో కూడిన ప్రత్యేక ద్విసభ్య బెంచ్ శనివారం కేసును విచారించనుంది.రెండో దశ పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో టీఎంసీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. బయటి నుంచి వచ్చిన పరిశీలకులు, బెంగాల్కు పరిచయంలేని పోలీసు సిబ్బంది అంతా టీఎంసీ కార్యకర్తలను లక్ష్యంగా పెట్టుకుని నియమితులైనవారేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. రెండో దశ పోలింగ్ సమయంలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఆ ఉద్యోగిఇటీవల పశ్చిమ బెంగాల్ అదనపు ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ఒక ప్రకటన జారీ చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్ లేదా సహాయకుల్లో కనీసం ఒకరు కేంద్ర ప్రభుత్వం లేదా పీఎస్యూ ఉద్యోగి ఉండాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాన్ని టీఎంసీ సవాలు చేసింది. ఇలాంటి ఆదేశం ఎన్నికల కమిషన్ మాత్రమే జారీ చేయగలదని, అదనపు సీఈఓకు ఆ అధికారం లేదని ‘లైవ్ లా’ వెబ్సైట్ నివేదించింది.ఎన్నికల కమిషన్ హ్యాండ్బుక్లో కౌంటింగ్ సూపర్వైజర్, సహాయకులుగా కేంద్ర సిబ్బంది తప్పనిసరి అని చెప్పలేదని పార్టీ వాదించింది. మైక్రో పరిశీలకులను సాధారణంగా కేంద్ర సేవల నుంచి తీసుకున్నప్పటికీ, అదే నిబంధనను కౌంటింగ్ సిబ్బందికి కూడా తీసుకురావడం పశ్చిమ బెంగాల్కు మాత్రమే ప్రత్యేకమా? అని టీఎంసీ అడిగింది.పక్షపాత ధోరణి కనబర్చే అవకాశం ఉందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ అధీనంలో ఉండటం వల్ల కేంద్ర ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, దాంతో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని పేర్కొంది.ముందు టీఎంసీ కలకత్తా హైకోర్టుకు వెళ్లగా ఆ పార్టీ చేసిన ఈ వాదనలను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఎన్నికల కమిషన్ హ్యాండ్బుక్ ప్రకారం కౌంటింగ్ సిబ్బందిని కేంద్ర లేదా రాష్ట్ర సేవల నుంచి నియమించవచ్చని పేర్కొంది. సిబ్బంది ఎంపిక ఎన్నికల అధికారుల స్వేచ్ఛాధికార పరిధిలోకి వస్తుందని ‘లైవ్ లా’ తెలిపింది.‘పక్షపాతం’ అంటూ చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ, కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటికే అనేక రక్షణ చర్యలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. మైక్రో పరిశీలకులు, అభ్యర్థులు నియమించిన కౌంటింగ్ ఏజెంట్లు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది. టీఎంసీ వ్యక్తం చేసిన అనుమానాలకు ఆధారాలు లేవని చెప్పింది.ఇలాంటి ఎన్నికల సంబంధిత సవాళ్లపై గత విచారణలను హైకోర్టు ప్రస్తావించింది. కేవలం అనుమానం ఆధారంగా న్యాయ జోక్యం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొని పిటిషన్ను కొట్టివేసింది. దీంతో టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.రెండో దశ పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు పెరిగాయి. టీఎంసీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పలు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అనుచరుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల పెంపుపై అధికార పార్టీ విమర్శలు చేసింది. -
ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీసీ ఘోష్ నివేదికపై సుప్రీంలో ఛాలెంజ్
సాక్షి, హైదరాబాద్: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. కేబినేట్ భేటీ కొనసాగుతుంది ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ సమ్మోతో అదేవిధంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామాకం జరిపే అంశం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైన మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ కుటుంబ భీమా విధానాలు, మెట్రో స్వాధీన పరుచుకోవడంతో పాటు దాని నిర్వహణపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. -
ట్రంప్ అధిక పన్నులు.. రీఫండ్ ప్రారంభం
ఇటీవల యుఎస్ సుప్రీంకోర్టు ట్రంప్కు భారీ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విదేశీ వస్తువులపై ట్రంప్ వేసిన అధిక పన్నులు చెల్లవని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రీఫండ్ పాసెస్ మెుదలుపెట్టింది. దీంతో భారత్కు 10 నుంచి 12 బిలియన్ డాలర్లు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధిక పన్నుల పేరుతో ప్రపంచ దేశాలని హడలెత్తించిన ట్రంప్నకు.. అక్కడి సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. దిగుమతులపై పన్నులు వేసే అధికారం అమెరికా అధ్యక్షుడికి గానీ వైట్హౌస్కు గానీ లేవని తేల్చిచెప్పింది. అంతేకాకుండా అంతవరకూ వేసిన సుంకాలు దిగుమతిదారులకు చెల్లించాల్సి కూడా రావచ్చని పేర్కొంది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో అమెరికా ఆ అధిక పన్నులను తిరిగి చెల్లించడం ప్రారంభించింది..అమెరికా కస్టమ్స్ విభాగం టారిఫ్ల ద్వారా వసూలైన మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది. మెుత్తంగా అమెరికా 166 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సూమారుగా ₹13,86,100 కోట్లు తిరిగి చెల్లించడానికి అంగీకరించింది. అయితే ఈ మెుత్తంలో భారత్కు 10 నుంచి 12 బిలియన్ డాలర్ల వరకు భారత్కు సంబంధించిన దిగుమతులపై వసూలైనవిగా గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక వెల్లడించింది. దీంతో ఆ మెుత్తం భారత్కు తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. ప్రధానంగా టెక్స్ టైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్, కెమికల్స్ రంగాల్లో ఈ రిఫండ్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తాన్ని నేరుగా భారత కంపెనీలు పొందలేవు. అమెరికాలో వస్తువులు దిగుమతి చేసిన కంపెనీలకే రిఫండ్ దరఖాస్తు చేసే హక్కు ఉంటుంది. దీంతో భారత ఎగుమతిదారులు తమ అమెరికా భాగస్వాములతో చర్చలు జరిపి రిఫండ్లో వాటా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వేలాది కంపెనీలు రిఫండ్ కోసం నమోదు చేసుకున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా 60 నుంచి 90 రోజుల్లో చెల్లింపులు పూర్తయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. -
బైక్ ట్యాక్సీలకు భారీ షాక్..?
బెంగళూరు: బైక్ ట్యాక్సీల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ నిర్ణయించాయి. రాష్ట్రంలో బైక్ ట్యాక్సీల విధానానికి నియమావళి రూపొందించే ఉద్దేశం లేదని చెబుతున్న ప్రభుత్వం, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయనుంది. గతేడాది హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం బైక్ ట్యాక్సీలను అనధికారికమని ప్రకటించి నిషేధించింది. అయితే ఈ జనవరి 23న ద్విసభ్య ధర్మాసనం బైక్ ట్యాక్సీలకు అనుమతిస్తూ ఆయా సంస్థలకు లైసెన్సులు ఇవ్వాలని సర్కారును ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బైక్ ట్యాక్సీలకు అవకాశం లేదని సర్కారు వాదించింది. మూడు నాలుగు రోజుల్లో బైక్ ట్యాక్సీల నిషేధం కోసం సుప్రీంలో పిటిషన్ సమర్పించనుంది. దీంతో వేలాదిమంది రైడర్లు అయోమయంలో పడిపోయారు. -
అటువంటి న్యాయవాదులను తొలగించాలి: జస్టిస్ బీ.వీ నాగరత్న
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.వీ నాగరత్న న్యాయమూర్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వేతనాలకు అనుగుణంగా జీవించలేక ప్రలోభాలకు గురయ్యే న్యాయమూర్తులను తమ పదవులను తొలిగించాల్సిన అవసరం ఉందన్నారు. బెంగళూరులో జరిగిన 22వ వార్షిక రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల సదస్సులో ప్రసంగిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ నైతికత, స్వతంత్రత, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. ఇటీవల వచ్చిన 2వ పేకమిషన్ సిపారసులను అమలు చేయడం ద్వారా న్యాయమూర్తుల భద్రత మరింతగా మెరుగుపడిందన్నారు. అయితే చట్టబద్దంగా తమకు వచ్చిన ఆదాయానికి అనుగుణంగా జీవించలేక దురాశకు లోనయ్యే న్యాయమూర్తులను న్యాయ వ్యవస్థ నుండి తీసివేయాల్సిన అవసరం ఉందన్నారు.ఒక న్యాయమూర్తి చేసే తప్పు కేవలం అతనికి మాత్రమే కాదని పూర్తి న్యాయవ్యవస్థపైనా ప్రభావం చూపుతుందన్నారు. అదే విధంగా న్యాయమూర్తులు కేవలం బయటి వ్యక్తుల నుండే కాకుండా, సహచర న్యాయమూర్తుల నుండి వచ్చే ఒత్తిళ్లకు కూడా లొంగకూడదన్నారు.తీర్పులు ఇచ్చే విషయంలో ఎటువంటి కో ఆర్డినేషన్ ఉండకూడదని ప్రభావితమై న్యాయమూర్తి ఇచ్చే తీర్పు అతని వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాధనంలా ఉండాలి కాని అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాకూడదన్నారు. అదే విధంగా న్యాయవాదులు తాము సమర్పించే తీర్పుల యథార్థతను ధృవీకరించాలని అల్గారిథమ్ల ప్రభావం నుండి న్యాయవ్యవస్థకు విముక్తి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.కోర్టులలో మహిళా న్యాయమూర్తులకు భద్రత, గౌరవం మరియు అనుకూలమైన వాతావరణం కల్పించడం న్యాయవ్యవస్థకు అత్యంత అవసరమన్నారు. హైకోర్టులు మరియు జిల్లా న్యాయవ్యవస్థ మధ్య సంబంధాలు పారదర్శకంగా ఉండాలి. జిల్లా న్యాయమూర్తుల పదోన్నతులు, బదిలీలు మరియు సెలవుల విషయంలో హైకోర్టు రిజిస్ట్రీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.మెుత్తంగా న్యాయం అనేది కేవలం యాంత్రికంగా కాకుండా, మానవత్వంతో కూడిన విచక్షణతో జరగాలని ఆమె తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. కాగా జస్టిస్ నాగరత్న ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 2027 సెప్టెంబరులో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడానికి అవకాశాలున్నాయి. ఇదే జరిగితే స్వాతంత్ర్య భారత చరిత్రలో మెుట్ట మెదటి సారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన మహిళగా ఆమె రికార్డు సాధిస్తారు. -
మతాచారాలపైనా న్యాయ సమీక్ష
న్యూఢిల్లీ: మతాచారాలపై కూడా న్యాయ స్థానాలు సమీక్ష చేపట్టవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు తమ వ్యక్తిగత నమ్మకాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు అంతరాత్మ సాక్షిగా, విస్తృత రాజ్యాంగ చట్రాన్ని మాత్రమే మార్గదర్శకంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంతోపాటు వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్, ప్రస్తుత అంశం కేవలం హిందూ ఆచారాలకు లేదా శబరిమలకు సంబంధించింది కాదన్నారు. అన్ని మతాలు, విశ్వాసాలు, మనస్సాక్షికి సంబంధించిన అంశాలను నియంత్రించే రాజ్యాంగ చట్రానికి సంబంధించిందని ధావన్ అన్నారు. సమాజంలో విభేదాలు ఉన్నప్పుడు వాటి మధ్య సామరస్యం సాధించడమే న్యాయస్థానం లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా ఒక మతాన్ని ప్రశ్నించవచ్చు కానీ, అది గౌరవప్రదమైనది, నిజాయతీతో కూడినదై ఉండాలన్నారు. మతాచారాలను సమీక్షకు గురిచేయడం చాలా అయోమయానికి తావిచ్చే అంశమని ధావన్ అభిప్రాయపడ్డారు. శబరిమల ఆచార సంరక్షణ సమితి తరఫున సీనియర్ లాయర్ వి.గిరి వాదనలు వినిపిస్తూ..శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మహిళలను మినహాయించాలన్న ఉమ్మడి వివేకం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రతి ఆలయానికి కొన్ని విశిష్ట ఆచారాలుంటాయని ఆరాధనలో అవి కూడా భాగంగా కొనసాగుతుంటాయని గిరి తెలిపారు. ఇటువంటి వాటన్నిటినీ ఒకే గాటనకట్టి ఆర్టికల్ 25(1) హక్కును ఇవి ఉల్లంఘిస్తున్నాయా, బలపరుస్తున్నాయనా అని చూడటం సరికాదని తెలిపారు. ‘ఆర్టికల్ 25(1) ప్రకారం, నేను అనుసరించే మతాన్ని, అంటే విగ్రహారాధనతో సహా హిందూ మతాన్ని ఆచరించడమే నా ప్రాథమిక హక్కు అని’ పేర్కొన్నారు. అంతకుమునుపు, ఆత్మన్ ట్రస్ట్ తరఫున లాయర్ ఎంఆర్ వెంకటేశన్..‘రుతుస్రావం సమయంలో మహిళలు స్వచ్ఛందంగా దేవాలయాల్లోకి, పూజా మందిరాల్లోకి ప్రవేశించరు. అది క్రమశిక్షణ, విశ్వాసంతో పెనవేసుకుపోయిన ఆచారం. ఇందులో వివక్షకు తావులేదు. దీనికి శాస్త్రీయ వివరణ ఇవ్వలేను. శాస్త్రం ముగిసినప్పుడు నమ్మకం మొదలవుతుంది’అని తెలిపారు. కాగా, ఈ అంశంపై ఐదు రోజులపాటు జరిగిన విచారణ వచ్చే వారం కూడా కొనసాగనుంది. -
అది మాకు కష్టమైన పనే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సామాజిక సంక్షేమం, సంస్కరణల పేరిట ఏ మతంలోని సారాన్నీ తీసివేయలేమని సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. శబరిమల ఆలయంలో తరుణ వయస్సు మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశంపై పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. సామాజిక సంస్కరణ పేరిట మతానికి సంబంధించిన ఆచారాలను తొలగించలేమని తొమ్మిది న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. లక్షలాది మంది నమ్మకాల్ని తప్పు అని ప్రకటించడం అత్యంత కష్టమైన పనుల్లో ఒకటని పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ప్రస్తుతం శబరిమల కేసుకు సంబంధించిన కీలక రాజ్యాంగ ప్రశ్నలపై వాదనలు వింటోంది.ముఖ్యంగా మత స్వేచ్ఛ, సామాజిక సంస్కరణ మధ్య సమతుల్యతపై చర్చ జరుగుతోంది. 2018లో సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. పరిమితులను అత్యవసర మత ఆచారంగా పరిగణించలేమని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య మహిళలు, బాలికలు ఆలయంలోకి రాకూడదనే ఆచారాన్ని దాదాపు అంటరానితనంతో సమానమని పేర్కొంది.తాజాగా జరిగిన విచారణ సమయంలో మత సంబంధిత విషయాల్లో ప్రజాహిత వ్యాజ్యాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వాదనలకు స్పందిస్తూ.. లక్షలాది మంది నమ్మకాల్ని తప్పు అని కోర్టు ఎలా ప్రకటించాలన్నదే అత్యంత కఠినమైన సమస్యగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని అనుచితమని ప్రకటించడం న్యాయస్థానాలకు కష్టమైన పనేనని తెలిపారు. ట్రావెన్కోర్ దేవస్థాన మండలి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మతంపై నమ్మకం లేని వారు వాటిని ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లను విచారణకు స్వీకరించడం సరైనదేనా? అని అన్నారు. అయ్యప్ప ఆలయాలు ఎన్ని ఉన్నా శబరిమలలోని ఆలయం చాలా విశిష్టమైనదని తెలిపారు. ఆచారాలను మహిళలపై వివక్షగా భావించొద్దని అన్నారు. 10-50 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, మహిళల ప్రవేశంపై మాత్రమే ఆంక్షలున్నాయని చెప్పారు. -
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో అక్రమంగా వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించేందుకు ఏప్రిల్ 20 (వచ్చే సోమవారం) నుంచి సరికొత్త వ్యవస్థను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సుమారు 166 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని దిగుమతిదారులకు వాపసు ఇచ్చే ప్రక్రియ వేగవంతం కానుంది.‘కేప్’ వ్యవస్థతో వేగంగా చెల్లింపులుయూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఈ రీఫండ్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ‘కేప్’ అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన కోర్టు ఫైలింగ్లో ఏజెన్సీ అధికారి బ్రాండన్ లార్డ్ వివరాలను వెల్లడించారు. గతంలోలాగే ప్రతి ఎంట్రీకి విడివిడిగా కాకుండా, దిగుమతిదారులందరికీ వర్తించే వడ్డీతో కలిపి ఒకేసారి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధులు జమ చేస్తారు. ఈ వ్యవస్థను తొలుత దిగుమతి చేసుకున్న వస్తువులు, ఎటువంటి సాంకేతిక చిక్కులు లేని ఎంట్రీల కోసం వినియోగిస్తారు. సుమారు 2.9 బిలియన్ డాలర్ల విలువైన కొన్ని క్లిష్టమైన ఎంట్రీలకు మాన్యువల్ ప్రాసెసింగ్ అవసరమని, దీనివల్ల సిబ్బందిపై పనిభారం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం1977 నాటి ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ను అడ్డుపెట్టుకుని ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితుల పేరుతో అధ్యక్షుడు తన పరిధిని మించి వ్యవహరించారని కోర్టు తప్పుబట్టింది. చట్టబద్ధమైన పరిధిని దాటి విధించిన సుంకాలను తక్షణమే తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.కోర్టు పత్రాల ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం దిగుమతిదారులు 3.30 లక్షల మందికి పైగా ఉన్నారు. 53 మిలియన్ల దిగుమతి షిప్మెంట్లపై సుంకాలు వసూలు చేశారు. ఏప్రిల్ 9 నాటికి సుమారు 56,497 మంది దిగుమతిదారులు ఎలక్ట్రానిక్ వాపసు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. వీరి వాటా విలువ దాదాపు 127 బిలియన్ డాలర్లు.ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల! -
‘సుప్రీం’లో కొనసాగుతున్న ‘శబరిమల’ విచారణ
న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో బుధవారం కూడా విచారణ కొనసాగుతోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సున్నితమైన వివాదంపై తాజాగా ‘మహిళలను నెలలో మూడు రోజులు అంటరానివారిగా చూడలేము’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ సుదీర్ఘ వివాదంపై తుది విచారణను చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కల్పించే మత స్వేచ్ఛ పరిధిని న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కేవలం శబరిమల కేసుకే పరిమితం కాకుండా, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, మతాంతర వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులు, పలు మతపరమైన వివక్షతలకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ కలిపి ధర్మాసనం విచారిస్తోంది.మంగళవారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడాన్ని ‘వివక్ష’గా పరిగణించలేమని, అది వారి మత విశ్వాసాల పరిధిలోని అంశమని ఆయన వాదించారు. ప్రాథమిక హక్కుల కింద రక్షణ పొందాలంటే ఒక ఆచారం కేవలం మూఢనమ్మకం కాకుండా, ఆ మతంలో ‘అత్యవసర ఆచారం’ అని నిరూపించుకోవాలని గత కోర్టు తీర్పులను ఉదహరించారు.ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘సామాజిక రుగ్మతలను మతాచారాలుగా ముద్రవేయలేం’ అని తేల్చిచెప్పింది. ధర్మాసనంలోని జస్టిస్ బి.వి నాగరత్న స్పందిస్తూ, రుతుక్రమం ఆధారంగా మహిళలను పవిత్ర స్థలాల్లో అంటరానివారిగా చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. 2018లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమలలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ, చారిత్రాత్మక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ శతాబ్దాల నాటి ఆచారం రాజ్యాంగ విరుద్ధమని అప్పట్లో కోర్టు పేర్కొంది. ఆ తర్వాత 2019లో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ మతపరమైన అంశాలన్నింటినీ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన! -
శబరిమలలో మహిళలపై నిషేధం సబబే
న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం సబబేనని కేంద్రం పేర్కొంది. ‘‘మతపరమైన విశ్వాసానికి సంబంధించిన విషయమిది. కనుక న్యాయపరమైన సమీక్షకు అతీతమైనది’’అని స్పష్టం చేసింది. మతపరమైన ప్రార్థన స్థలాల్లోకి మహిళల ప్రవేశంపై వివక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కీలక విచారణ ప్రారంభించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. శబరిమలలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఒకరకమైన అంటరానితనమేనంటూ 2018లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.‘‘అది తప్పుడు తీర్పు. కనుక దాన్ని పునఃపరిశీలించాల్సిందే’’అని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 25 ప్రసాదించిన మతపరమైన స్వేచ్ఛను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. మతపరమైన విశ్వాసం ముసుగులో కొనసాగే సామాజిక రుగ్మతలను పరిశీలించే అధికార పరిధి కోర్టులకు ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దానితో ఏకీభవిస్తున్నట్టు మెహతా చెప్పారు. మతపరమైన ఆచారాలు శాంతిభద్రతలకు, ఆరోగ్యానికి, నైతికతకు విఘాతం కలిగిస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్నారు. మహిళలను నెలలో మూడు రోజుల పాటు అంటరానివారిగా చూడటం సరికాదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఈ విషయమై తానొక మహిళగా మాట్లాడుతున్నట్టు చెప్పారు.శబరిమల ఆలయంలోకి మహిళలపై నిషేధం వయసుకు సంబంధించిందే తప్ప రుతుస్రావానికి సంబంధించిన అంశం కాదని మెహతా బదులిచ్చారు. ‘‘దీనిపై స్పష్టత అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప ఆలయాల్లోకీ మహిళలకు ప్రవేశముంది. ఒక్క శబరిమల ఆలయంలో మాత్రమే దానిపై ఆంక్షలున్నాయి’’అని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘భారత్లో మహిళలు ఎప్పుడూ పురుషులతో సమానంగా హోదా, మన్నన అందుకున్నారు. కొన్నిసార్లు వారికే ప్రాధాన్యం దక్కింది. మహిళలను పూజించే ఏకైక సమాజం మనదే. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా అందరమూ దేవీ విగ్రహాలకు మొక్కుతాం.కనుక పురుషాధిక్యత, లింగ సమానత్వం వంటి అంశాలను ఈ కేసులో చొప్పించరాదు’’అని వాదించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని 2018లో ఐదుగరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనడం తెలిసిందే. అంతేగాక నిషేధాన్ని తొలగిస్తూ 4:1 మెజారిటీతో తీర్పు కూడా వెలువరించింది. ‘‘మేమిప్పుడు ఆ తీర్పు తాలూకు మంచిచెడుల్లోకి పోదలచుకోలేదు. ఈ అంశానికి సంబంధించి రూపొందించిన ఏడు ప్రశ్నలకు మాత్రమే విచారణ పరిధిని పరిమితం చేస్తున్నాం’’అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఆచి తూచి అడుగు వేయండి
మనిషి తన జీవన విధానాలను మెరుగు చేసుకునే పద్ధతులను ప్రయత్నిస్తూనే ఉంటాడు. భారతీయ వివాహ వ్యవస్థ తిరుగులేనిదే అయినా ఇటీవల లివ్ ఇన్ రిలేషన్– సహజీవన విధానంలో స్త్రీ, పురుషులు జీవించడం పరిపాటి అయ్యింది. అయితే ఇందులో స్త్రీలకు ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయవాది మోనిక అరోర ఫేస్బుక్ వేదికగా కొన్ని సూచనలు చేశారు.ఇటీవల నా దగ్గరకు వచ్చిన ఒక కేసు నన్ను తీవ్రంగా కలవరపరిచింది. అది సహజీవనం కేసు. ఒక మహిళ దాదాపు 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమె ఆ బంధాన్ని ఎంతో నమ్మింది. ఈ పదేళ్ల కాలంలో అతని కోసం సమయాన్ని, యవ్వనాన్ని, భావోద్వేగాలను, శరీరాన్ని అర్పించింది. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి ఏమీ చెప్పకుండా ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆమెతో చె΄్పాడు. దాంతో ఆమె పూర్తిగా కుంగిపోయింది. ఆమె పోలీసుల వద్దకు వెళ్లాలనుకుంది. క్రిమినల్ కేసు పెట్టాలనుకుంది. అతడు చేసిన ఘోరమైన ద్రోహానికి చట్టం అతడిని శిక్షించాలని కోరుకుంది. కాని భావోద్వేగాలు వేరు... చట్టం పని తీరు వేరు. అందుకే లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్న, వెళ్లాలనుకున్న స్త్రీలకు, యువతులకు కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను.మీరు ఇది అర్థం చేసుకోండి‘సహజీవనం’ స్త్రీలకు సాధికారత ఇచ్చే సంబంధం అని అనుకుంటారు. ఈ భావన కేవలం అంచనా మాత్రమే అంటాను నేను. ఇది చూడటానికి, పైకి చెప్పుకోవడానికి ఎంపికకూ, స్వేచ్ఛకూ, ఆధునికతకూ తార్కాణం కావచ్చు. కాని ఒకసారి ఏదైనా తేడా జరిగితే నిజమైన కోర్టు గదులలో పరిస్థితి చాలా భిన్నంగా ఎదురవుతుంటుంది. లివ్ ఇన్ రిలేషన్ ఒక్కసారి విచ్ఛిన్నమైనదంటే ఆ సంబంధంలో ఉన్న మహిళకే అధిక నష్టం ఎదురవుతుంది. ఒంటరితనం, బాధ ఆమెను చుట్టుముడతాయి. చట్టపరంగా ఆమెకు దొరికే మద్దతు ఆశించినంతగా ఏమీ ఉండదు. అందుకే లివ్ ఇన్లో ఉన్న... లేదా వెళ్లాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన చట్టపరమైన అంశాలుసమ్మతికి ప్రాధాన్యంఇద్దరు వయోజనులు ఒక సంబంధంలో ఉండాలని నిశ్చయించుకుని, స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధంలోకి ప్రవేశిస్తే, అప్పుడు విడిపోవడం నేరంగా పరిగణించబడదు.అది లైంగిక నేరంగా మారదులిన్ ఇన్ రిలేషన్ నుంచి పురుషుడు తప్పుకుంటే, ఆ సంబంధాన్ని విడిచిపెట్టినంత మాత్రాన, అప్పటివరకూ పరస్పర అంగీకారంతో సాగిన శారీరక సంబంధం అత్యాచారంగా మారిపోదు.మోసం, వంచనలకు శిక్షఅయితే లివ్ ఇన్ కోసం మొదటినుంచి మోసం, కుయుక్తి లేదా కేవలం సమ్మతి కోసమే పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసినట్లయితే ఈ అంశం చుట్టూ చట్టపరమైన సహాయం భిన్నంగా ఉండవచ్చు. అయితే ఈ విషయం కూడా స్పష్టంగా నిరూపించబడాలి.రక్షణ గురించిసహజీవన సంబంధం తనంతట తాను వివాహానికి ఉండే చట్టపరమైన రక్షణను కల్పించదు. వివాహం స్త్రీకి సామాజిక మద్దతు, చట్టపరమైన హోదాను ఇస్తుంది. నిలదీయదగ్గ, అమలు చేయదగ్గ హక్కులను స్త్రీకి ఇస్తుంది. భర్త విడిపోవాలంటే భార్య ఉమ్మడి ఇంటి నుంచి రక్షణ, భరణం, చట్టపరమైన పరిహారాలు, సామాజికం గా అవసరమైన మద్దతు, పెద్ద మనుషులను కూచోబెట్టి డిమాండ్స్ చేయడం.. ఇవన్నీ సాధ్యమవుతాయి.మరి లివ్ ఇన్లో?లివ్ ఇన్లో కొన్ని సందర్భాల్లో స్త్రీకి చట్టం నుంచి పరిమిత రక్షణ లభించవచ్చు. కానీ అది వివాహం ద్వారా స్త్రీకు వచ్చే రక్షణతో సమానం కాదు. వివాహ స్వభావం కలిగిన కొన్ని జీవన సంబంధాలను చట్టం రక్షించవచ్చు, కానీ ఆ రక్షణ పరిమితమైనది. పెళ్లి నుంచి విడిపోవాలంటే ఎదురయ్యే సహజమైన పరిణామాలు లివ్ ఇన్ వంటి వ్యవస్థలో మనిషి మనిషికి మారిపోతుంటాయి. అందుకే నేను ఏమంటానంటే⇒ అమ్మాయిలకు ‘నీ శరీరం, నీ ఇష్టం’ అని మనం చెప్పినప్పుడు, ‘విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకో’ అని కూడా వారికి చె΄్పాలి ∙చట్టం నినాదాలను కాపాడదు. చట్టం హక్కులను కాపాడుతుంది. హక్కులు కేవలం భావోద్వేగాల వల్ల రావు ⇒ ఇది నీతిసూత్రాల బోధ అనుకోవడం లేదు. నా కేసులలో నేను పదేపదే చూస్తున్న చట్టపరమైన వాస్తవం గురించి చెబుతున్నాను ⇒ ఒక అమ్మాయి సహజీవనం స్వేచ్ఛ అని నమ్మి అందులోకి ప్రవేశించవచ్చు. కానీ ఆ సంబంధం ముగిసినప్పుడు తనకు వివాహంలోలాగా వచ్చే హక్కు, భరణానికి హామీ, స్పష్టమైన సామాజిక భద్రత, నివాస హక్కులు, భావోద్వేగ ద్రోహానికి సులభమైన చట్టపరమైన పరిష్కారం లేదని ఆమె తెలుసుకోవాలి.అందుకే, అనేక సందర్భాల్లో ‘సహజీవనాలు’ స్త్రీయే అధిక ప్రమాదాన్ని భరించాల్సిన ఒక వ్యవస్థగా పరిణమిస్తాయి. ఇటువంటి బంధంలోకి అడుగుపెట్టే ముందు, ప్రతి యువతి తనను తాను ఈ ప్రశ్నలు తప్పక వేసుకోవాలి.⇒ నా చట్టపరమైన హక్కులు ఏమిటి?⇒ ఒకవేళ అతను నన్ను వదిలి వెళ్లిపోతే నాకు లభించే రక్షణ ఏమిటి?⇒ ఆ బంధానికి సంబంధించిన వాగ్దానాలు నెరవేరకపోతే,నాకు లభించే పరిష్కారం ఏమిటి?⇒ ఇంతటి గాఢమైన మానసిక,శారీరక అంకితభావానికి ప్రతి ఫలంగా నేను కచ్చితంగా ఏమి పొందుతున్నాను? -
తగ్గిన సిబిల్ స్కోర్.. సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యక్తి
లోన్ తీసుకుని చెల్లించకపోవడం, క్రెడిట్ కార్డు బిల్స్ సరైన సమయంలో క్లియర్ చేసుకోక పోవడం వంటివి జరిగితే సిబిల్ స్కోర్ / క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం లేదా నెగటివ్లోకి వెళ్లడం జరిగే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి ఎలాంటి లోన్ తీసుకోకపోయినా.. తన సిబిల్ స్కోర్ నెగటివ్గా చూపిస్తోందని కోర్టు మెట్లెక్కాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఉత్తరాఖండ్కు చెందిన రాజేంద్ర సింగ్ పన్వార్ అనే వ్యక్తి.. తాను 2020 నుంచి ఎలాంటి లోన్స్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ నెగటివ్గా చూపిస్తోందని, దీనివల్ల లోన్స్, క్రెడిట్ కార్డులు తీసుకోలేక పోతున్నాననే కారణంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. సంబంధిత బ్యాంకుల నుంచి వివరాలు కోరింది.కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత బ్యాంకులు రాజేంద్ర సింగ్ పన్వార్ లావాదేవీలు పరిశీలించి, తాను ఎలాంటి లోన్స్ తీసుకోలేదని నిర్దారించాయి. అయితే అతని సిబిల్ స్కోర్ నెగటివ్లోకి వెళ్లడానికి కారణం.. ఒకే పేరుతో ఉన్న ఇతర వ్యక్తులకు అదే పాన్ నంబర్ జారీ కావడం అని తెలిసింది. దీనివల్లనే స్కోర్ నెగటివ్గా చూపించిందని వివరణలో తెలుసుకున్నారు. బ్యాంకుల వివరణల తరువాత పన్వార్ సిబిల్ జారీచేసినట్లు సంబంధిత సంస్థలు స్పష్టం చేశాయి.సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్నే సిబిల్ స్కోర్ అంటారు.సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది.సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గాలు➤ క్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.➤ లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్ను తగ్గిస్తుంది.➤ మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.➤ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.➤ సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు.ఇదీ చదవండి: డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా? -
గ్రూప్–1 నియామకాలకు సుప్రీం గ్రీన్సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టిన 563 గ్రూప్–1 పోస్టుల నియామకాలకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఈ నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్–1 నియామకాలకు ఆమోదం తెలుపుతూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు గురువారం తుది తీర్పును వెలువరించింది.గ్రూప్–1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ పి. ఆదిత్య తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. నియామక ప్రక్రియలో కమిషన్ అనుసరించిన విధానాలను తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియామకాలను సమరి్థంచిందని.. ఆ తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ పిటిషన్లను కొట్టేసింది. పారదర్శకంగా ’ట్రిపుల్ ఎవాల్యుయేషన్’ విచారణ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. నియామక ప్రక్రియలో కమిషన్ అత్యంత పారదర్శకత పాటించిందని కోర్టుకు వివరించారు. మెయిన్స్ మూల్యాంకనంలో అత్యంత శాస్త్రీయమైన ‘ట్రిపుల్ ఎవాల్యుయేషన్’(మూడంచెల మూల్యాంకనం) విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు.మూల్యాంకనకర్తలు మా ర్కులు వేసేటప్పుడు ఉండే వ్యత్యాసాలను (కొందరు కఠినంగా, మరికొందరు ఉదారంగా వేయడం) తగ్గించి, అభ్యర్థులకు న్యా యం చేసేందుకే ఈ పద్ధతిని అమలు చేశామన్నారు. మొదటి రెండు విడతల్లో బార్కోడ్విధానం పాటించామని.. మూడో విడ తలో మూల్యాంకనకర్తకు అభ్యర్థి వివరాలు తెలియకుండా ఉండేందుకు, గోప్యతను కాపాడేందుకు మాత్రమే బార్కోడ్ వినియోగించలేదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వెబ్నోట్ల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. నిలబడని పిటిషనర్ల వాదనలు మూడో విడత మూల్యాంకనంలో బార్కోడింగ్ లేకపోవడం వల్లే అక్రమాలకు ఆస్కా రం ఏర్పడిందని.. సుమారు 924 మంది అభ్యర్థుల ఎంపికలో వ్యత్యాసాలు ఉన్నాయ ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. జవాబుల ‘కీ’లోనూ లోపాలు ఉన్నా యని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనల సందర్భంగా మూల్యాంకన విధానం, బార్కోడింగ్ మినహాయింపు తదితర సాంకేతిక అంశాలపై కమిషన్ను ప్రశ్నించిన ధర్మాసనం.. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అఫిడవిట్లను, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. కమిషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయ స్థానం.. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నిర్ధారించుకున్న అనంతరం పిటిషన్లను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. -
మతం మారితే.. రిజర్వేషన్లు రద్దు!
-
ఇంకానా... ఇకపై చెల్లదు!
లింగ వివక్ష అనేది ప్రత్యక్షంగా, కనిపించే రూపంలోనే కాదు... చాపకింద నీరులా కూడా తిష్టవేసి ఉంటుంది. అయితే కాలమే ఆ వివక్షను తొలగిస్తూ వెళుతుంది అనే ఆశాభావానికి సుప్రీం కోర్టు తాజా తీర్పు బలాన్ని ఇస్తోంది. భారత సాయుధ దళాలలో మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులు పురుషులతో సమానంగా శాశ్వత కమిషన్కు అర్హులు అని చారిత్రక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు...‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ అనుకునే సందర్భం ఇది!సాయుధ దళాల్లో లింగసమానత్వాన్ని బలోపేతం చేసే చారిత్రక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. మహిళా షార్ట్ సర్వీస్ కమీషన్ (ఎస్ఎస్సీ) అధికారులకు పురుషులతో సమానంగా శాశ్వత కమిషన్కు అర్హత ఉందని స్పష్టం చేసింది. వ్యవస్థాగత పక్షపాతాన్ని ప్రస్తావించింది. మహిళా ఎస్ఎస్సీ అధికారులకు శాశ్వత కమిషన్ను నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుపుతూ ఉన్నత న్యాయస్థానం ఈ చారిత్రాత్మక సంచలన తీర్పును ఇచ్చింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. శాశ్వత కమిషన్కు సంవత్సరానికి 250 మంది మహిళా అధికారులకే అవకాశం ఇవ్వాలనే నిబం«ధన సరికాదు అని చెప్పింది. గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుకొని ముందుకు సాగేలా, మహిళలకు సమాన అవకాశాలు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది.శాశ్వత కమిషన్ ప్రకారం...షార్ట్ సర్వీస్ కమిషన్లో పది నుంచి పద్నాలుగేళ్లు పనిచేస్తారు. పై స్థాయికి వెళ్లే అవకాశాలు తక్కువ. ఉద్యోగ విరమణ తరువాత పూర్తిగా పెన్షన్ రాదు. ఇక శాశ్వత కమిషన్ విషయానికి వస్తే పదవీ విరమణ చేసే వరకు సేవ చేసే పూర్తి కెరీర్ను అందిస్తుంది. ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేయవచ్చు. సీనియర్ నాయకత్వ స్థానాలలో పలు హోదాలలో చేరవచ్చు. పింఛన్తో సహా అన్ని పదవీ విరమణ ప్రయోజనాలకు అర్హులు అవుతారు.లోపాలు ఉన్నాయి...మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ నిరాకరించడం వివక్షపూరితమని పేర్కొంటూ సైన్యం, నావికాదళం రెండింటిలోనూ మహిళా అధికారుల పనితీరును అంచనా వేసే విధానం సక్రమంగా లేదని వ్యాఖ్యానించింది అత్యున్నత న్యాయస్థానం. మహిళా అధికారుల పనితీరును అంచనా వేసే విధానంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కూడా కోర్టు ఎత్తి చూపింది. మహిళా అధికారులు శాశ్వత కమిషన్కు ఎప్పటికీ అర్హులు కారంటూ ముందుగా ఏర్పర్చుకున్న అంచనా ఆధారంగా సరైన ఆలోచన లేకుండా, అజాగ్రత్తగా వార్షిక గోప్య నివేదికలను(యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్–ఎసీఆర్) రూపొందించారని కోర్టు పేర్కొంది. మహిళల శాశ్వత కమిషన్కు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో జాప్యం జరిగిందని, దీని ప్రభావం మహిళా అధికారులపై పడింది అని చెప్పింది.అలా చేయలేదు...‘తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే కోర్సులు చేయడానికి మహిళా అధికారులను పంపలేదు, అర్హతా ప్రమాణాల ఆధారంగా నియామకాలు (క్రైటీరియా అపాయింట్మెంట్స్) చేయలేదు. వృత్తిలో వారి పురోగతిపై ఇది ప్రభావం చూపింది’ అని లింగవివక్షతను ఎత్తిచూపింది. శాశ్వత కమిషన్కు అర్హులైన మహిళా అధికారులు 20 సంవత్సరాల అర్హత సర్వీస్ను పూర్తి చేసినట్లుగా పరిగణించబడతారని, వారు పింఛన్తోపాటు తత్సంబంధితమైన అన్ని ప్రయోజనాలకు అర్హులు అవుతారని కోర్టు తెలియజేసింది.ఇక ముందు అలా జరగకూడదునిర్మాణాత్మక పక్షపాతాలను తొలగించడానికి, మహిళా అధికారులు నష్టపోకుండా చూసేందుకు సాయుధ దళాలన్నింటిలోనూ అధికారుల పనితీరును అంచనా వేసే విధానాలపై సమగ్ర సమీక్ష జరపాలని కూడా కోర్టు ఆదేశించింది. మహిళా అభ్యర్థులను ఎన్డిఎ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) ప్రవేశ పరీక్ష రాయడానికి అనుమతించాలని 2021లో సుప్రీం కోర్టు తన మధ్యంతర ఉత్తర్వులో పేర్కొంది. విధాన నిర్ణయం ‘లింగ వివక్షత’పై ఆధారపడి ఉందని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటిస్తూ, సైన్యం వైఖరిని ఖండించింది. అత్యున్నత స్థాయి సైనికాధికారులను తయారుచేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రతిష్ఠాత్మక ఎన్డీఏ 2022లో తొలి విడతగా 10 మంది మహిళా క్యాడెట్లకు స్వాగతం పలికింది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. -
మత మార్పిడిపై సుప్రీం సంచలనతీర్పు
-
పోలీసుల FIR నమోదుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
సామాజిక భద్రతగా పితృత్వ సెలవులు
న్యూఢిల్లీ: శిశువుల సంరక్షణకు తల్లితోపాటు తండ్రి పాత్ర కూడా కీలకమేనని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. బిడ్డల బాధ్యత అనేది కేవలం ఒక్కరి విధి కాదని పేర్కొంది. బిడ్డ అభివృద్ధిలో తల్లి కీలక పాత్ర పోషించినప్పటికీ, అదే సమయంలో తండ్రి పాత్రను విస్మరించడం అన్యాయం అవుతుందని స్పష్టంచేసింది. పితృత్వ సెలవులను సామాజిక భద్రతా ప్రయోజనంగా గుర్తించాలని, ఈ మేరకు చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఓ కేసు విచారణ సందర్భంగా పితృత్వ సెలవులు ప్రాధాన్యతను నొక్కిచెప్పింది.తండ్రులకు కూడా సెలవు ఇవ్వడం సమాజంలో లింగపరమైన అంతరాలను తొలగించడానికి దోహదపడుతుందని వెల్లడించింది. అలాగే పిల్లల పెంపకం(పేరెంటింగ్)పై సమతుల్య అవగాహనను పెంపొందిస్తుందని అభిప్రాయపడింది. పిల్లల భావోద్వేగ, శారీరక, మానసిక వికాసంలో తల్లి పాత్ర నిస్సందేహంగా కీలకమైనప్పటికీ, తండ్రికి కూడా అంతే ముఖ్యమైన పాత్ర ఉందని, దాన్ని విస్మరించడం అసంపూర్ణం, అన్యాయమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. -
36 ఏళ్ల నాటి రూ. 500 లంచం కేసులో శిక్ష తగ్గింపు
న్యూఢిల్లీ: దాదాపు 36 సంవత్సరాల క్రితం 500 రూపాయల లంచం తీసుకున్న నేరానికి గతంలో హైకోర్టు న్యాయస్థానం ఆనాటి కానిస్టేబుల్కు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సగానికి తగ్గించింది. దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు వేసిన శిక్షను 14 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చి న తీర్పును జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ పీబీ వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.అయితే 75 ఏళ్ల వయసులో మాజీ ఉత్తరాఖండ్ ఎక్సయిజ్ కానిస్టేబుల్ రెండేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించలేడని పేర్కొంటూ ఆ శిక్షను ఏడాదికి కుదించింది. అవినీతి నిరోధక చట్ట నిబంధనలను అనుసరిస్తూ మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
‘బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీ తప్పనిసరి’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో న్యూక్లియిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్టింగ్(ఎన్ఏటీ)ని తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. వైద్య శాస్త్రం తెలియకున్నా తెలిసినట్లుగా ఎందుకు తాము నటించాలని ప్రశ్నించింది. ఢిల్లీకి చెందిన ‘సర్వేశం మంగళం ఫౌండేషన్’వేసిన పిల్పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఏటీ వల్ల గ్రహీతలకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేని రక్తాన్ని అందించేందుకు వీలవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం పిల్లకు విదేశీ నిధులు అందవని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించింది. ‘ఈ అంశంపై మాకు ఎటువంటి పరిజ్ఞానం లేదు, వైద్య శాస్త్రంతో ఎటువంటి పరిచయం లేకున్నా తెలిసినట్లుగా మేమెందుకు నటించాలి?అని ప్రశ్నించింది. బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీకి అవసరమైన ఏర్పాట్లు చేసే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్ను కోరింది. రాష్ట్రాల కార్యదర్శులు సంబంధిత అంశాల్లో నిపుణుల సలహాలతో సరైన నిర్ణయం తీసుకుంటారంది. బ్లడ్ బ్యాంకుల్లో ఎటువంటి పరీక్షలు చేయాలన్నది నిపుణుల పరిధిలోనే ఉంటుందని తెలిపింది. ఈ అంశంలో ప్రత్యేకంగా తమకు ఎటువంటి పరిచయం లేనందున, పిటిషనర్ కోరిన విధంగా ఆదేశాలివ్వజాలమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకుల్లో ఖరీదైన ఎన్ఏటీకి ఏర్పాటు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.పిటిషన్లో ఏముంది? రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21లోని జీవించే హక్కులో భాగమే సురక్షితమైన రక్తాన్ని పొందే హక్కని పిటిషన్ తెలిపింది. బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీకి వెసులుబాటు కలి్పస్తే దాతల నుంచి సేకరించిన రక్తంలో హెచ్ఐవీ, హెపటైటిస్ సీ, బీ, మలేరియా, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలవుతుందని వివరించింది. రక్త దాతల నుంచి సేకరించిన రక్తం పూర్తి సురక్షితంగా గ్రహీతలకు అందేలా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. అయితే, ప్రభుత్వాల వైఫల్యాల వల్ల అత్యంత సున్నితమైన ఆరోగ్య పరిస్థితి కలిగిన, ముఖ్యంగా తలసీమియా రోగులను ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో విఫలమవుతున్నామని తెలిపింది. ఇన్ఫెక్షన్ కలిగిన రక్తాన్ని అందించడం వల్ల మధ్యప్రదేశ్లోని సత్నా ఆస్పత్రిలో ఆరుగురు తలసీమియా బాధిత చిన్నారులు హెచ్ఐవీ బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా, జార్ఖండ్లోని చైబాసా ఆస్పత్రిలో 2025లో ఐదుగురు బాలలు, యూపీలోని ఓ మెడికల్ కాలేజీలో 2023లో 14 మంది బాలలకు హెపటైటిస్, హెచ్ఐవీ సోకిందని తెలిపింది. -
మేమే దేశాన్ని నడిపించాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: ‘యావత్ దేశాన్ని మేమే నడపాలని మీరు కోరుకుంటున్నారా?’అంటూ సుప్రీంకోర్టు ఓ పిటిషనర్ను ప్రశ్నించింది. రహదారులు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ తదితరాలు సక్రమంగా ఉండేలా ప్రజల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తించే సమగ్ర ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్పై ఈమేరకు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం శుక్రవారం ఇందుకు సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టింది. షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నట్లే అన్ని అంశాలకు ఒకే చోట పరిష్కా రం కోరుతున్న ఈ పిటిషన్ చాలా బాగుందని పేర్కొంది. ‘సమస్యలను నిర్దిష్టంగా ప్రస్తావించలేప్పుడు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలను జారీ చేయలేం. అందుకే ఈ రిట్ పిటిషన్పై విచారణకు నిరాకరిస్తున్నాం. పిటిషనర్ కావాలనుకుంటే సరైన రీతిలో పిటిషన్ను రూపొందించి, సంబంధిత పరిధిలోని హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కలి్పస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లోని సానుకూల అంశాలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని పేర్కొంది. ‘పిటిషన్ కోరిన విధంగా చేసేందుకు ఆర్థిక వనరులు అవసరమవుతాయి. సంబంధిత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ను అర్థం చేసుకోవడానికి ఆయా రాష్ట్రాల హైకోర్టులే సరైనవి’అని ధర్మాసనం అభిప్రాయపడింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషనర్ తరఫు లాయర్ తెలిపారు. అయితే, యావత్తు దేశాన్ని మేమే పాలించాలని భావిస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘షోరూం, షాపింగ్ మాల్ మాదిరిగానే మీ పిటిషన్ కూడా చాలా బాగుంది. రోడ్లపై గుంతలు, రహదారులు, అసంపూర్తి వంతెనలు తదితర నిర్మాణాలు..ఇలా ప్రతి ఒక్కటీ ఇందులో ఉంది. భూమిపై ఉన్న ప్రతి ఒక్క సమస్యకూ మీరు పరిష్కారం చూపారు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.పిటిషన్లో ఇంకా ఏముంది? రోడ్లు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ వంటి బహిరంగ మౌలిక సదుపాయాల నిర్వహణ, సాధారణ తనిఖీలు, క్రమబద్ధమైన ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా ప్రజా భద్రతను నిర్ధారించాలని కోరింది. నగర, శివారు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల భద్రతను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి స్వతంత్ర భద్రతా ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో సివిల్ ఇంజనీర్లు, మౌలిక సదుపాయాల నిపుణులు, పౌర సమాజం, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఉండాలి. 2020 నుంచి మౌలిక సదుపాయాల లోపాల వల్ల జరిగిన మరణాల డేటాను సేకరించి, డిజిటలైజ్ చేసి బహిరంగ పరచాలి. మూడు నెలలకోసారి జిల్లాల వారీ నివేదికలను సుప్రీంకోర్టుకు సమరి్పంచేలా ఆదేశాలు ఇవ్వాలి. -
అప్పుడు మహిళలకు ఉద్యోగాలివ్వరు
న్యూఢిల్లీ: మహిళలకు రుతుక్రమ సమయంలో తప్పనిసరి సెలవుల పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ సెలవులను తప్పనిసరి చేస్తే మహిళలను ఎవ్వరూ ఉద్యోగాల్లోకి తీసుకోరని, ఇది వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. ఋతుక్రమ సమయంలో విద్యారి్థనులు, మహిళా ఉద్యోగులకు సెలవు నియమాలను రూపొందించాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారించింది. ఈ చట్టం శ్రామిక మహిళల్లో భయాన్ని లేదా వారు పురుషుల కంటే తక్కువనే అభిప్రాయాన్ని సృష్టిస్తుందని అభిప్రాయపడింది. ‘ఒక విషయం పట్ల అవగాహన, సున్నితత్వాన్ని సృష్టించడం భిన్నంగా ఉంటుంది.రుతుక్రమ సెలవులను తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చిన క్షణం నుంచే యాజమాన్యాలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు. యజమానుల మనస్తత్వం మీకు తెలియదు. వారు మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు. ఋతుస్రావం వారికి జరుగుతున్న ‘చెడు’గా పరిగణిస్తారు’అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులు 2013లో కేరళ ప్రభుత్వం మంజూరు చేసిందని సీనియర్ న్యాయవాది ఎమ్.ఆర్.శంషాద్ గుర్తు చేశారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి సడలింపులు ఇచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే, ‘అవి స్వచ్ఛందంగా తీసుకున్న చర్యలు. మీరు తప్పనిసరి చట్టం అని చెప్పిన వెంటనే, ఎవరూ వారికి ఉద్యోగాలు ఇవ్వరు. న్యాయవ్యవస్థలో లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో వారిని తీసుకోరు. ఇక ఇంట్లో కూర్చోవాలని చెబుతారు. వారి కెరీర్ ముగిసిపోతుంది.’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. -
జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా? సుప్రీం కోర్టు ఆగ్రహం
-
అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు
ఢిల్లీ: మహిళల పీరియడ్ లీవ్కు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు రుతుస్రావం సమయంలో సెలవులు తప్పనిసరి చేస్తే ఏ కంపెనీలు వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి మెుగ్గు చూపవని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రుతుస్రావం సమయంలో మహిళలకు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు శుక్రవారం విచారించింది. మహిళల సహజ రుతుస్రావం సమయంలో విద్యార్థినిలకు, ఉద్యోగస్థులకు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని లాయర్ శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ‘పీరియడ్ సమస్యపై, దాని సున్నితత్వంపై అవగాహన కల్పించడం వేరు. రుతుక్రమం సమయంలో సెలవులు తప్పనిసరి అనిచట్టం చేస్తే మహిళలకే నష్టకరంగా మారవచ్చు. వారిని ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోరు. గవర్నమెంట్ ఉద్యోగాలు, జ్యూడీషియరీ జాబ్స్ ఎందులోనూ వారికి చోటు ఉండదు. కంపెనీల మనస్థత్వం మీకు తెలియదు’ అని అన్నారు. అయితే దీనిపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇదే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 21 ప్రకారం ఆడపిల్లలకు గౌరవంగా జీవించే హక్కు ఉందని ఆరోగ్యం, విద్య, గౌరవం వారికి ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత అని తెలిపింది.ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వారికి ఉచితంగా నాప్కీన్స్, ప్రత్యేకమైన టాయిలెట్స్, మెంటల్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. -
కారుణ్య మరణానికి ఒకే.. కంటతడితో సుప్రీంకోర్టు తీర్పు
-
వైఎస్ వివేకా కేసులో సునీతకి సుప్రీం కోర్ట్ బిగ్ షాక్
-
హెయిర్కట్ తప్పిదానికి..రూ. 5 కోట్ల పరిహారం!
హెయిర్కట్ తప్పిదానికి ఓ మహిళ ఏకంగా కోట్లలో నష్టపరిహారం కోరింది. సరిగ్గా హెయిర్ కటింగ్ చేయకపోవడం వల్ల ఉద్యోగంలో ఉన్నతి పదవిని కోల్పోయానని, అధిక వేతనం పొందలేకపోయానంటూ కోర్టుని ఆశ్రయించింది. చిన్నపాటి తప్పిదాన్ని పెద్దగా చేసి చూపించి వినియోగదారుల కేసులో కోట్లలో నష్టపరిహారం పొందింది. పాపం సదరు సెలూన్ సెంటర్ ఇంత చిన్నతప్పిదానికి అంత భారీ పరిహారమా అని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే..మళ్లీ అమాంతం పరిహారం పెంచేసింది. చివరికి ఆమెకు ధర్మాసనం ఊహించని దిమ్మతిరిగిపోయే ఝలక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 12, 2018న, ఆమె హెయిర్ కట్ కోసం ఒక ఫైవ్ స్టార్ హోటల్ బ్యూటీ సెలూన్కి వెళ్లింది. కానీ వాళ్లు పొరపాటున తప్పుగా కట్చేశారు. దాంతో వాళ్ల సేవకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జూలై 2018లో వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 21, 2021న, వినియోగదారుల కమిషన్ బ్యూటీ సెలూన్ను తప్పుపడుతూ బాధిత మహిళకు ఏకంగా రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించమని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ ఆదేశంతో అసంతృప్తి చెందిన బ్యూటీ సెలూన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే పరిహారం మొత్తం అంచనా వేసేందుకు ఆ కేసుని తిరిగి వినియోగదారుల కమిషన్కు పంపింది ధర్మాసనం. దాంతో ఆ మహిళ తన క్లైయిమ్ను అమాంతం రూ.2 కోట్లు నుంచి రూ. 5.2 కోట్లుకు పెంచేసింది. పైగా అందుకోసం కమిషన్ ముందు పలు పత్రాలను కూడా సమర్పించింది. వినియోగదారుల కమిషన్ ఆ పత్రాలను పరిశీలించి ఆమె ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి చెల్లింపు జరిగే రోజుకి రూ. 9 వడ్డీతో కలిపి మళ్లీ రూ. 2 కోట్లు పరిహారంగా మంజూరు చేసింది. దాంతో మనస్తాపం చెంది బ్యూటీ సెలూన్ మళ్లీ సుప్రీంకోర్టులో మరో అప్పీల్ దాఖలు చేసింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టు ముందు, ఆమె తాను ఉన్నత విద్యావంతురాలైన మహిళనని, కలకత్తాలోని ఐ.ఐ.ఎం. నుంచి మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా కూడా చేశానని పేర్కొంది. ఆ సెలూన్లో హెయిర్ కటింగ్ చేసుకోకముందు తనకు మంచి కెరీర్ ఉందని చెప్పింది. కానీ బ్యూటీ సెలూన్ దానిని ఖండించింది. హెయిర్ అనేది ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉన్న అంశంగా వాదించింది. పైగా ఎగ్జిక్యూటివ్ పదవుల్లో ఉన్నవాళ్లు సినీ సెలబ్రిటీలు లేదా మోడలింగ్ వాళ్ల మాదిరిగా జుట్టు కత్తిరించుకోకూడదని వాదించింది. అందువల్ల జాబ్ కెరీర్ పాడైందని, ఉన్నతి పదవులు కోల్పోయానని, భారీ వేతనం అదుకోవాల్సిన తాను తక్కువ మొత్తంలో జీతం పొందుతున్నానని తన గోడును వినిపించింది. అంతేగాదు హెయిర్ కట్ కోసం వెళ్ళినప్పుడు, మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్నానని, కానీ జూన్ 2018లో తన ఉద్యోగాన్ని ఈ కారణంగా కోల్పోయానని పేర్కొంది. అయితే ఈ సంఘటనకు ముందు, తర్వాత ఆదాయ పన్ను రిటర్న్లను సమర్పించడంలో విఫలమైందని సెలూన్ తరుపు న్యాయవాది వాదించారు. అలాగే అంత భారీ మొత్తంలో నష్ట పరిహారం పొందేలా సరైన ప్రామాణిక పత్రాలు ఏమి సమర్పించ లేదని కోర్టు గుర్తించింది. దాంతో కోర్టు కేవలం బాధతురాలి అంచనాలు, ఆమె ఇష్టాఇష్టాలను అనుసరించి పరిహారం ఇవ్వరని స్పష్టం చేసింది. అలాగే ఈ న్యాయపోరాటంలో గతంలో సదరు సెలూన్ 25 లక్షలు కోర్టులో డిపాజిట్ చేసిందని గుర్తుచేస్తూ..అంతమొత్తం మీరు సమర్పించిన పత్రాలకు అనుగుణంగా సరిపోతుందని స్పష్టం చేసింది. అంతేగాదు ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో పరిహారం పొందాలంటే..అతనికి జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేస్తారు. అందుకు తగిన డాక్యుమెంట్స్, సాక్షాధారాలు కూడా ఉండాలంటూ సదరు మహిళకు చురకలు అంటించింది.(చదవండి: అర్జున్-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్ లుక్..!) -
ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!
భారత టెలికాం రంగంలో మార్పులు చోటుచేసుకునేలా ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెలికాం స్పెక్ట్రం అనేది ప్రజా ఆస్తి అని, ఇది ప్రభుత్వ సార్వభౌమత్వ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 13, 2026న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాంతో దివాలా తీసిన సంస్థల బకాయిల వసూలు ప్రక్రియ చిక్కుల్లో పడినట్టయిందని కొందరు భావిస్తున్నారు.ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), ఎయిర్ సెల్ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల ఏజీఆర్ బకాయిలను(స్పెక్ట్రం వినియోగానికి బదులుగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు) ఎలా రాబట్టాలనే అంశంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఇప్పుడు అటార్నీ జనరల్ నుంచి అత్యవసర న్యాయ సలహాను కోరింది.స్పెక్ట్రం ప్రభుత్వ ఆస్తి.. ఐబీసీ పరిధిలోకి రాదుసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. టెలికాం స్పెక్ట్రం అనేది ఒక పరిమిత సహజ వనరు. దీనిపై పూర్తి హక్కులు భారత ప్రభుత్వానికే ఉంటాయి. టెలికాం ఆపరేటర్లకు కేవలం షరతులతో కూడిన వినియోగ హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, అది వారి సొంత ఆస్తి కాదు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద స్పెక్ట్రంను విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ఆర్కామ్, ఎయిర్ సెల్ వంటి సంస్థల ఆస్తులను విక్రయించి తమ అప్పులు తీర్చుకోవాలని భావించిన బ్యాంకులు (రుణదాతలు) ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.రుణదాతల ఆందోళనఈ తీర్పుతో సుమారు రూ.37,588 కోట్ల ఏజీఆర్ బకాయిల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆర్కామ్ బకాయిలు సుమారు రూ.25,199.3 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ సెల్ బకాయిలు సుమారు రూ.12,389 కోట్లుగా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీ దివాలా తీస్తే దాని ఆస్తులను అమ్మి ‘వాటర్ఫాల్ మెకానిజం’(ఒక కంపెనీ దివాలా తీసినప్పుడు దాని ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి అని నిర్ణయించే క్రమం) ద్వారా రుణదాతలకు పంచుతారు. కానీ, ఇప్పుడు స్పెక్ట్రం ఐబీసీ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వ బకాయిలు అలాగే ఉండిపోవడమే కాకుండా, ఇతర ఆర్థిక సంస్థల అప్పు రికవరీ కూడా నామమాత్రంగానే మిగిలే ప్రమాదం ఉంది.టెలికాం రంగంపై ఒత్తిడిభారత టెలికాం రంగం ఇప్పటికే భారీ అప్పులతో సతమతమవుతోంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి ప్రధాన ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4.09 లక్షల కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ బలోపేతం కోసం నిధులు సేకరించినప్పటికీ స్పెక్ట్రం ఫీజులు, అప్పుల నిర్వహణ సవాలుగా మారింది. భారతీ ఎయిర్ టెల్ 75.6% డెట్-టు-ఈక్విటీ నిష్పత్తితో బ్యాలెన్స్ షీట్ను నెట్టుకొస్తోంది. టెలికాం కంపెనీలు 5జీ సేవలకు మారుతున్న తరుణంలో భారీ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నియంత్రణ సంస్థల స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.బ్యాంకులు టెలికాం రంగానికి రుణాలు ఇచ్చేటప్పుడు ఇకపై చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటార్నీ జనరల్ ఇచ్చే వివరణ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి అడుగు వేయనుంది. ఒకవేళ స్పెక్ట్రంను వేలం వేయడానికి వీలు లేకపోతే ప్రభుత్వం ఈ బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుందనేది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర! -
హైకోర్టు సీజేలుగా బాధ్యతలు చేపట్టే జడ్జీలను ముందుగానే బదిలీ చేయాలి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలకమైన విధానపర నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు అప్పగించే జడ్జీలను ఆ పోస్ట్ ఖాళీ అయ్యేందుకు కనీసం రెండు నెలలు ముందుగానే ఆయా కోర్టులకు బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ హైకోర్టు కార్యకలాపాలపై ఆ జడ్జికి మంచి అవగాహన వస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో గురువారం సమావేశమైన కొలీజియం అభిప్రాయపడింది. కోర్టు నిర్వహణలో సమర్థంగా, మెరుగ్గా వ్యవహరించగలుగుతారని కొలీజియం సమావేశం పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు వెబ్సైట్ శుక్రవారం తెలిపింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేయాలని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైరైన వెంటనే ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నియామకం అమల్లోకి వస్తుందని వివరించింది. అదేవిధంగా, కేరళ హైకోరు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారిని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని తీర్మానించింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్చి 5న రిటైరవనున్నారు. -
నియమబద్ధ వాణిజ్యమే శరణ్యం
చీకటిని చూస్తేనే వెలుగు విలువ మరింత తెలుస్తుందంటారు. అదే ప్రకారం, అంత ర్జాతీయ వాణిజ్య సంబంధాల విషయమై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు ఏప్రిల్లో సృష్టించిన చీకటిని పది నెలల పాటు చూసిన ప్రపంచానికి, నియ మబద్ధమైన వాణిజ్యపు విలువ ఏమిటో గతం కన్నా ఎక్కువగా అర్థమైంది. కానీ ఇప్పటికీ అర్థం కానిది అమెరికా అధ్య క్షునికే! లేని అధికారాలను ఉపయోగించి ఇష్టారీతిన దిగుమతి సుంకాలు విధించటం చెల్లుబాటు కాదని అక్కడి సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పును ఈ నెల 20వ తేదీన చెప్పిన తర్వాత కూడా ఆయన తమ విధానాలు మారబోవని ప్రకటించారు. మరొక రూపంలో అదనపు సుంకాలను అమలుకు తేవటంలోని అవివేకం ప్రపంచానికంతా అర్థమవుతున్నది ఆయనకు తప్ప!అయినా మారడా?ఇక్కడ గమనించదగ్గది మరొకటి ఉంది. అమెరికాను తిరిగి గొప్పదిగా చేసే ప్రణాళికలో సుంకాల హెచ్చింపు ఒక భాగం. దాని కోసం ఈ పది నెలలుగా సాధించిన ఫలితాలలో, సుమారు 120 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని మినహాయించితే, ఇతర లక్ష్యాలు ఒక్కటైనా సిద్ధిస్తున్న సూచనలు లేవు. నికర బడ్జెట్ లోటు అంతకుమించి పెరుగుతున్నది. ఒక డజను దేశాలపై సైనిక దాడులు జరిపి, మరిన్ని దాడులకు సన్నాహాలు చేస్తున్నందున సైనిక ఖర్చుల రూపంలో జీడీపీ పెరుగుదల 1.4 శాతానికి తగ్గగా, ద్రవ్యోల్బణం మళ్లీ 3 శాతానికి చేరింది. ఉద్యోగాల పెరుగుదల ఇంత తక్కువగా ఉండటం 2013 తర్వాత ఎప్పుడూ లేదని గణాంకాలు చెప్తున్నాయి. డాలర్ విలువ, స్టాక్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లు గందరగోళానికి గురవుతున్నాయి. వీటన్నింటి ఫలితాలను అనుభవిస్తున్న అమెరికన్ ప్రజలలో ట్రంప్ ప్రజాదరణ వరుసగా పడిపోతున్నట్లు ప్రజాభిప్రాయ సేకర ణలు చెప్తున్నాయి. అంతకుమించి, స్వయంగా తనకు బలమైన మద్ద తుగా నిలిచి అధికారంలోకి తెచ్చిన ‘మాగా కానిస్టిట్యుయెన్సీ’ అని పిలిచే సామాజిక తరగతులలోనూ బలం తగ్గుతుండగా, ఈ కాలంలోనే జరిగిన మూడు గవర్నర్ ఎన్నికలను రిపబ్లికన్ కంచుకోట లుగా భావించే రాష్ట్రాలలో ఓడిపోయారు. రానున్న నవంబర్ నాటి మధ్యంతర ఎన్నికలలోనూ ఇదే జరిగితే పరిస్థితి ఏమిటన్న భయాలు ట్రంప్ పార్టీలో మొదలయ్యాయి. ‘అయినా ఆయన మార లేదు’ అన్న ఒక తెలుగు కథలోని వాక్యం వలె, ‘అయినా ట్రంప్ మారటం లేదు’.అందరితోనూ అదే ధోరణిఇవి, ఇంకా ఇటువంటివి అమెరికాలో అంతర్గతంగా కనిపి స్తున్న పరిస్థితులు. బయటి మాట చెప్పనక్కర లేదు. ట్రంప్ గత ఏప్రిల్లో ‘విమోచనా దినం’ అంటూ ప్రపంచంలోని సమస్త దేశా లపై సమాంతరమైన ఎదురు సుంకాలు అంటూ ఒక పిడుగును విసిరినప్పటి నుంచి వాణిజ్య ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారటం తెలిసిందే. ఆ పరిస్థితి ఇప్పటికీ కుదుట పడలేదు సరికదా సమీప భవిష్యత్తులో కుదుటపడే సూచనలు కూడా లేవు. అందుకు కారణం తిరిగి ఆయన చర్యలే! ఏ దేశంపై సుంకాలను ఎపుడు ఇంకా పెంచుతారో, తగ్గిస్తారో తెలియదు. ఒక దేశానికి తమతో వాణిజ్యం కావాలంటే వారు మరేదో మూడవ దేశంపై సుంకాలు పెంచాలని ఒత్తిడి చేస్తారో తెలి యదు. వాణిజ్యంతో నిమిత్తం లేకుండా రాజకీయాల కోసం చేసేదీ తెలియదు. ఇతర దేశాలలో నడుస్తున్న అమెరికన్ కంపెనీలను వాపస్ రానట్లయితే వంద శాతం సుంకాలంటారో తెలియదు. తమ ఆయుధాలు, బోయింగ్లు, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు, పారి శ్రామిక ఉత్పత్తులను చచ్చినట్లు ఖరీదు చేసే వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయనట్లయితే సుంకాలు వంద శాతమనేదీ, 500 శాతమ నేదీ తెలియదు. ‘మీరు మీకు కావలసిన చమురు వగైరాలను మాకు నచ్చని దేశాల నుంచి ఖరీదు చేయటం ఆపివేసి మేము చెప్పిన చోటు నుంచే కొనుగోలు చేయా’లని ట్యారిఫ్ల కొరడా ఝళిపించేదీ తెలియదు. దీనంతటికి తమ కూటమి దేశాలు సైతం మినహాయింపు కాకపోవటమే కాదు, వారికి చెందిన భూభాగాలను తమకు స్వాధీనం చేయకున్నా ట్యారిఫ్ల ఖడ్గ చాలనం చేస్తారు. కెనడావంటి అతి సన్నిహిత దేశంపై పెంచిన సుంకాలను స్వయంగా తన రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించి ఓడించినా లెక్క చేయరు.అదే శరణ్యంఇన్నిన్ని వివరాలు ఇంత సుదీర్ఘంగా చెప్పుకోవటం ఎందుకంటే, ఏప్రిల్లో ‘విమోచనా దినం’ నాడు అమెరికా అధ్యక్షుడు అడ్వాన్స్ విజయ దరహాసంతో ప్రకటించినట్లు, ట్యారిఫ్లన్నవి ‘మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ’ ఏమీ కాదు. తనవి పూర్తిగా తప్పుడు అంచనాలతో కూడిన లెక్కలని ఈ పది మాసాలలో ఇంటా బయటా కూడా రుజువైంది. అసమర్థుని జీవయాత్ర వలె ఇది ఒక అవివేకపు అధ్యక్షుని ఆర్థిక యాత్ర. ఆ యాత్రలో రెండవ అంకాన్ని ఆయన ఈనెల 20న సుప్రీం కోర్టు తీర్పు కలిగించిన భయం నుంచి మొదలు పెట్టారు. న్యాయమూర్తులను మనం ఊహించలేని భాషలో దూషించి, తమ విధానాలు మారబోవని ప్రకటించారు. తనకు ఇతర మార్గాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించి దేశాలను ‘సర్వ నాశనం’ చేయగలనన్నారు. 150 రోజుల కాల పరిమితి గల సెక్ష న్లను, అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడూ ఉపయోగించని వాటిని బయటకు తీసి, ఆ ప్రకారం అన్ని దేశాలపై 10 శాతం అదనపుసుంకమని, అంతలోనే 15 శాతానికి పెంచారు. ఇప్పటికే జరిగిన వాణిజ్య ఒప్పందాల నుంచి ఏ దేశమూ తప్పించుకోరాదని హెచ్చ రించారు. ఈ అదనపు సుంకాలను తాము చెల్లించబోమని యూరో పియన్ యూనియన్ స్పష్టం చేయగా, అసలు తన ఒప్పందంపై తుది చర్చలను ఇండియా వాయిదా వేసింది. ఈ విధమైన రెండవ అంకపు నాటకంలో ఇంకేమి పరిణామాలుండగలవో చూడాలి.మొత్తం మీద తేలుతున్న పాఠం ఏమిటంటే, తనకు ఏ అంత ర్జాతీయ నియమాలు లేవంటూ ట్రంప్ విచ్ఛిన్నం చేయబూనిన నియమాల ప్రకారం వాణిజ్యం, ఆర్థిక, రాజకీయ సంబంధాలే బలో న్మత్త మదపుటేనుగులకైనా అనుసరించదగిన విధానాలవుతాయి. ఈ నియమాలను అమెరికాయే నాయకత్వం వహించి రెండవ ప్రపంచ యుద్ధం దరిమిలా రూపొందించటం గాని, ఇన్ని దశాబ్దాలుగా పాటించటంగాని ఎంతో దూరదృష్టితో జరిగినటువంటిదే! ఆ నియ మాలు పూర్తి న్యాయబద్ధమైనవేమీ కాదు. అవి ధనిక దేశాలకు అను కూలం, వర్తమాన దేశాలకు ప్రతికూలం అయినా కనీసం ఒక పద్ధతిలో సాగుతూ వచ్చాయి. ట్రంప్కు అదే శరణ్యం కావాలి.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
సుప్రీంకోర్టును కూడా లెక్క చెయ్యకుండా సిగ్గులేకుండా వికృత చేష్టలు చేస్తున్నారు
-
న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పాఠంపై సుప్రీంకోర్టు సీరియస్


