ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీసీ ఘోష్ నివేదికపై సుప్రీంలో ఛాలెంజ్‌ | Telangana government moves Supreme Court on PC Ghosh report | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీసీ ఘోష్ నివేదికపై సుప్రీంలో ఛాలెంజ్‌

Apr 23 2026 5:29 PM | Updated on Apr 23 2026 6:56 PM

Telangana government moves Supreme Court on PC Ghosh report

సాక్షి, హైదరాబాద్: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేబినెట్‌ భేటీలో ప్రభుత్వం  నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది.   కేబినేట్ భేటీ కొనసాగుతుంది ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ సమ్మోతో అదేవిధంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామాకం జరిపే అంశం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైన మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ కుటుంబ భీమా విధానాలు, మెట్రో స్వాధీన పరుచుకోవడంతో పాటు దాని నిర్వహణపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement