ట్విషా శర్మ మృతి కేసు.. సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు | Twisha Sharma death case goes to Supreme Court | Sakshi
Sakshi News home page

ట్విషా శర్మ మృతి కేసు.. సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు

May 23 2026 11:10 PM | Updated on May 23 2026 11:10 PM

Twisha Sharma death case goes to Supreme Court

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును శనివారం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే 25) ఈ కేసుపై విచారించే అవకాశం ఉంది. 

33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన అత్తవారింట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలినప్పటికీ, ఆమె కుటుంబం ఈ నిర్ధారణలను తిరస్కరిస్తూ, ఇందులో కుట్ర ఉందని ఆరోపిస్తోంది. 

కాగా ఈ కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమె భర్త  సమర్థ్ సింగ్.. శుక్రవారం జబల్‌పూర్ జిల్లా కోర్టులో లొంగిపోవడానికి వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి భోపాల్ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో అతడిని భోపాల్ కోర్టు శనివారం 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్ వృత్తిరీత్యా న్యాయవాది కాగా, ఆమె అత్తగారు గిరిబాల సింగ్ పదవీ విరమణ చేసిన రిటైర్డ్ న్యాయమూర్తి.

Advertisement
 
Advertisement
Advertisement