కఠ్మాండు: భారతీయ తీర్థయాత్రికులతో కూడిన మినీ ఎలక్ట్రిక్ బస్సు నేపాల్లో ప్రమాదానికి గురైంది. ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గండకి ప్రావిన్స్లోని గూర్ఖా జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.
మనకామన ఆలయం నుంచి వస్తున్న ఈ అదుపుతప్పి రోడ్డు పక్క ఏటవాలుగా ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఏడుగురు మృత్యువాతపడగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.


