-
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు
కాళోజీ సెంటర్/హన్మకొండ: వరంగల్ కలెక్టర్గా డాక్టర్ సత్య శారదదేవి, హనుమకొండ కలెక్టర్గా పి.ప్రావీణ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో వారిని రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఆర్ఓ అయూబ్అలీ, డీఈఓ డి.వాసంతి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, ఆర్డీఓలు సీతం దత్తు, కృష్ణవేణి, ఎల్డీఎం హవేలీ రాజు, కలెక్టరేట్ ఏఓలు శ్రీకాంత్, అబీద్ అలీ, తహశీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వరరావు, ఫణికుమార్, విజయ్, రవిచంద్రారెడ్డి, పర్యవేక్షకులు మంజుల, చంద్రశేఖర్ ఉన్నారు. హనుమకొండ కలెక్టర్ను కలిసిన వారిలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా(లోకల్ బాడీస్), వెంకట్రెడ్డి (రెవెన్యూ), డీ.ఆర్.ఓ. వై.వి.గణేష్ ఉన్నారు. వరంగల్లో డాక్టర్ సత్య శారదదేవి హనుమకొండలో ప్రావీణ్య.. -
అర్ధరాత్రి మొరం దందా..
హసన్పర్తి: ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా పెద్ద ఎత్తున వెలువడిన మొరాన్ని అక్రమార్కులు అప్పటికే మాయం చేశారు. ఇప్పుడు వారి కన్ను భూములపై పడింది. జేసీబీల సహాయంతో భూముల్లో మొరం అక్రమంగా తవ్వకాలు చేపడు తూ క్వారీగా మారుస్తున్నారు. ముఖ్యంగా అన్నాసాగరం ఏరియాలోనే ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారు. భూముల తవ్వకాలు చేపట్టడం వల్ల ఎస్సారెస్పీ కాల్వ దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి తవ్వకాలు పగలు రైతులతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని భావించిన అక్రమార్కులు అర్ధరాత్రి మొరం దందా కు తెర లేపారు. ఎస్సారెస్పీ భూముల నుంచి యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. హసన్పర్తి మండలంతో పాటు నగరానికి పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మొరం తరలిస్తూ.. అక్కడ ఒక్కో ట్రాక్టర్ మొరాన్ని రూ.1200 నుంచి రూ.1500ల వరకు విక్రయిస్తున్నారని స్థానికులు చెప్పారు. మొరం తవ్వకాలతో విలువైన ఎస్సారెస్పీ ప్రాజెక్టు భూముల్లో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని రైతులు వా పోతున్నారు. ఇదిలా ఉండగా, అధికారుల కనుస న్నల్లోనే మొరం దందా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారులు అక్రమార్కుల నుంచి నెల వారీగా మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని అంటున్నారు. చర్యలు తీసుకుంటాం.. ఎస్సారెీస్పీ భూముల్లో తవ్వకాలు చేపట్టి మొరం దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. రాత్రివేళ గస్తీ ఏర్పాటు చేస్తాం. పోలీసులకు కూడా సమాచారం ఇస్తాం. – సీతారాంనాయక్, ఈఈ, నీటిపారుదలశాఖ వరంగల్ సర్కిల్క్వారీగా ఎస్సారెస్పీ భూములు అధికారుల కనుసన్నల్లో అక్రమాలు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం -
ముగిసిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు
హన్మకొండ: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఆది వారం ఉదయం జరిగిన ఈ పరీక్షకు 55.75 శాతం, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 55.26 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 4,730 మంది అభ్యర్థులకుగాను ఉదయం జరిగిన పరీక్ష 2,637 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్ష 2,614 మంది అభ్యర్థులు రాసినట్లు పేర్కొన్నారు. యూపీఎస్సీ సెంట్రల్ అబ్జర్వర్ హరిహర్ రాథ్, టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి స్పెషల్ అబ్జ ర్వర్తో కలిసి ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తున్న యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, శ్రీ గాయ త్రి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, సీడీసీ డీమ్డ్ యూనివర్సి టీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పింగిళి ప్రభుత్వ జూనియర్ కళాశాల వడ్డేపల్లి, తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ, న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్, మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులకు కల్పించిన వసతులపై అధికారులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఇండోర్ స్టేడియానికి గ్రీన్ సిగ్నల్
హసన్పర్తి: హసన్పర్తిలో ఇండోర్ స్టేయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని వర్ధన్నపే ట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. త్వరలోనే నిధులు విడుదలవుతాయన్నారు. ఎర్రగట్టు గుట్ట ప్రాంతంలో స్టేడియం నిర్మించనున్న ట్లు వెల్లడించారు. హసన్పర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో నెల రోజుల పాటు నిర్వహించిన ఉచిత వేసవి బాక్సింగ్ శిక్షణ శిబిరం ఆదివారం ముగి సింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ అనేది ఓ వ్యసనంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. క్రీడలతోనే క్రమశిక్షణ పెంపొందుతుందని చెప్పా రు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఉచితాలంటే ప్రజలు ఎగబడుతున్నారని, అదే ఉచిత విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించా రు. ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే.. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తమదన్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు డ్రెస్లు, సర్టిఫికెట్లు అందజేశారు. బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పెద్దమ్మ నర్సింహరాములు అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతపాక సునీత, కోచ్ పార్థసారథి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు కిరణ్, ఆరెల్లి వెంకటస్వామి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సురేందర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ పుల్లా రవి, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షు డు శీలం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం -
అగ్రిమెంట్ చేయరు.. అద్దెలు అడగరు!
వరంగల్: వరంగల్ లక్ష్మీపురంలోని మోడల్ కూరగాయల మార్కెట్ పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కవర్షెడ్లో నిర్మించిన 158 ప్లాట్లను 2022 ఫిబ్రవరిలో రిటైల్ వ్యాపారుల కోసం కేటా యించారు. అద్దెల ఖరారుపై నెలకొన్న సందిగ్ధంతో నేటి వరకు అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తి కాలేదు. దీనివల్ల మార్కెట్ కమిటీ ప్రతి నెలా రూ.3,63,400 అంటే ఇప్పటి వరకు రూ.98,11,800 ఆదాయం కోల్పోయింది. అయినప్పటికీ.. అప్పటి మార్కెట్ కమిటీ పాలకవర్గం, మార్కెటింగ్ అధికా రుల పట్టింపులేనితనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడల్ మార్కెట్లో కమీషన్ లైసెన్స్దారులకు మడిగెలు(షట్టర్లు), చిల్లర వ్యాపారులకు కవర్ షెడ్లో 158 ప్లాట్లు, అలాగే మార్కెట్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మినీ హోల్సేల్, చిల్లర వ్యాపారులకు మరో 230 ప్లాట్లను అధికారులు కేటాయించారు. ఇవి కాకుండా అనధికారికంగా మరో 200 మంది మార్కెట్ లోపల, బయట వ్యాపారాలు చేస్తున్నారు. కమీషన్ వ్యాపారులకు అద్దెలు నిర్ధారించిన అధికారులు ఖాళీ స్థలంలోని చిల్లర వ్యాపారుల విషయంలో ఆలస్యం చేయడంపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు స్పందించారు. ఓపెన్ ప్లాట్ల అద్దెలు నిర్ణయించడంతో వ్యాపారులు చెల్లింపులు చేస్తున్నారు. కవర్షెడ్లోని ప్లాట్ల అద్దెలపై స్పష్టత లేకపోవడం, వ్యాపారులు తగ్గించాల ని, అధికారులు తగ్గేదేలేదని భీష్మించడంతో మార్కెట్ కమిటీ లక్షల రూపాయల ఆదాయం కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అద్దెల్లో తకరారు.. మోడల్ కూరగాయల మార్కెట్లోని మడిగెలకు అద్దెలు ఖరారు చేసిన అధికారులు కవర్షెడ్లోని 158 ప్లాట్లకు ఒక్కోదానికి నెలకు రూ.2,300 అద్దెలు కట్టాలని నిర్మాణ స్థలాన్ని బట్టి నిర్ణయించి అగ్రిమెంట్లు చేసుకోవాలని ఆదేశించారు. కాగా.. మార్కెట్లో ఓపెన్ ప్లాట్లు కేటాయించడంతో కవర్షెడ్లోకి కూరగాయలు కొనేందుకు ఎవరూ రావట్లేదని అందువల్ల అధికారులు నిర్ణయించిన అద్దెలు కట్టలేమనీ.. అద్దె తగ్గించాలని వ్యాపారులంతా అఽధికారులు, అప్పటి ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. కవర్ షెడ్లోని ప్లాట్లకు రూ.వేయి నుంచి 1500ల వరకు ఖరారు చేస్తే అద్దెలు చెల్లిస్తామని వ్యాపారులు అధికారులకు తెలిపారు. అయినప్పటికీ ఈవిషయంపై మార్కెట్ అధికారులు దృష్టి సారించలేదు. దీంతో గడిచిన 27 నెలలకు రూ.98,11,800 అద్దెలు పెండింగ్లో పడ్డాయి. అద్దెలతో పాటు అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు కవర్ షెడ్ ప్లాట్లపై దృష్టి సారించి, అద్దెలు తగ్గిస్తే మార్కెట్కు అధిక ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి.పేరుకుపోయిన మడిగెల బకాయిలు పట్టించుకోని అధికారులు సుమారు రూ.కోటి వరకు ఆదాయం కోల్పోతున్న మార్కెట్ కమిటీ ప్రేక్షక పాత్రలో పాలనా యంత్రాంగం నేతలు దృష్టి సారించాలి.. నగర ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి వరంగల్ లక్ష్మీపురంలో మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మించినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం నేరవేరకుండా పోయింది. నిర్వహణ లోపం, వ్యాపారుల ఇష్టారాజ్యంతో లోపలకు వెళ్లేందుకు దారి సైతం వదలడం లేదు. మార్కెట్లో రోజుకు లక్షల రుపాయల వ్యాపారం జరుగుతున్నా.. మార్కెట్ కమిటీకి ఆదాయం లేకుండా పోయింది. రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం వచ్చిందని చెప్పుకుంటున్న నాయకులు మార్కెట్ పరిస్థితిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇక ఐపీఎస్ల వంతు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో ఐఏఎస్ల బదిలీలు దాదాపు పూర్తయినట్లే. తదుపరి వంతు ఐపీఎస్ అధికారులదేనన్న ప్రచారం జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ రావడంతో ప్రభుత్వం బదిలీలపై దృష్టి పెట్టలేదు. ఈనెల 6న ఎన్నికల కోడ్ ముగియగా.. కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముంచుకొస్తున్నది. ఈ నేపథ్యంలో.. పాలనపై తమ మార్కు వేసేందుకు.. ఐఏఎస్లతో బదిలీలకు తెర తీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మొదటిసారిగా శనివారం పెద్ద సంఖ్యలో కలెక్టర్(ఐఏఎస్)లను బదిలీ చేసింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్లోని నాలుగు జిల్లాల్లో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. ఇదే సమయంలో ఐపీఎస్ల బదిలీలు కూడా తప్పవన్న ప్రచారం సాగుతుండగా.. వరంగల్ సీపీ సహా పలువురికి ట్రాన్స్ఫర్లు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ఆతర్వాతే రెవెన్యూ, పోలీసుశాఖల్లో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఐపీఎస్ల బదిలీలపై ఉత్కంఠ.. ఊహించని విధంగా పలువురు ఐఏఎస్లకు స్థాన చలనం కలిగిన నేపథ్యంలో.. ఐపీఎస్ అధికారుల్లోనూ బదిలీల చర్చ జరుగుతోంది. పోలీస్ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో పాటు ఇతర కేడర్లలో ఉన్న పలువురు ఐపీఎస్లకు బదిలీలు తప్పక పోవచ్చంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి వరంగల్ సీపీగా ఉన్న ఏవీ రంగనాథ్పై ‘కోడ్’లో భాగంగా ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఈక్రమంలో 2009 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంబర్ కిషోర్ ఝాను 2023 అక్టోబర్ 13 వరంగల్ కమిషనర్గా నియమించారు. 2012లో ఉమ్మడి వరంగల్ ఓఎస్డీగా, అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన అంబర్ కిషోర్.. ఎస్పీగా పదోన్నతి పొంది 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేశారు. 2023లో మరోసారి సీపీగా నియమితులైన ఆయన కూడా బదిలీ అవుతారన్న చర్చ జరుగుతోంది. ఆయన స్థానంలో సీపీగా వచ్చేందుకు ఏవీ రంగనాథ్, ప్రకాశ్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంబర్ కిషోర్ ఝా రెండు రోజుల క్రితం సెలవులో వెళ్లగా.. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఇన్చార్జ్ సీపీగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా ములుగు ఎస్పీగా ఉన్న గౌస్ ఆలం ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో 2017 బ్యాచ్కు చెందిన డాక్టర్ శబరీష్ను ఈ ఏడాది జనవరి 4న నియమించారు. మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న శరత్చంద్ర పవార్ 2023 ఆగస్టు 29న బదిలీ కాగా.. ఆయన స్థానంలో సుధీర్ రామ్నాథ్కు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న మూకుమ్మడి బదిలీల్లో ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం ఉంటుందా? లేదా? అన్న చర్చ సాగుతోంది. అదే విధంగా వరంగల్ కమిషనరేట్లో డీసీపీగా ఉన్న పుల్ల కరుణాకర్ను 2023 జూలై 23న అప్పటి ప్రభుత్వం జేఎస్ భూపాలపల్లి ఎస్పీగా నియమించింది. ఎన్నికల సంఘం అభ్యంతరంతో 2023 అక్టోబర్ 13న ఆయనను బదిలీ చేసి కిరణ్ ఖరేను ఎస్పీగా నియమించింది. ఈసారి జరిగే బదిలీల్లో భూపాలపల్లి ఎస్పీగా అవకాశం కల్పించాలని కొందరు నాన్ క్యాడర్ ఎస్పీలు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ ఎస్పీల పనితీరు సంతృప్తికరంగానే ఉన్నా.. రాజకీయ సమీకరణల్లో భాగంగా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. ఐఏఎస్ బదిలీలతో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం వీలైనంత తొందరగా ఐపీఎస్ల బదిలీలు పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఆ వెంటనే అదనపు కలెక్టర్, ఆర్డీఓ, డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ల బదిలీల తంతు ముగించే ప్రక్రియలో భాగంగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తున్నది.ఒకేసారి ఐదుగురు ఐఏఎస్ల బదిలీ అదే తరహాలో పోలీసుశాఖలో ట్రాన్స్ఫర్లు.. పోస్టింగ్ల కోసం ఎవరికీ వారుగా ప్రయత్నాలు రెండు, మూడు రోజుల్లో రెవెన్యూ, పోలీసుశాఖల్లో బదిలీలు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ‘పాలన’ చేతికి వచ్చేలా..కలెక్టర్ల బదిలీలతో కలకలం.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేకు ‘కుడా’ వైస్ చైర్పర్సన్గా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఐఏఎస్ల బదిలీలకు శ్రీకారం జరిగింది. ఇదే సమయంలో హనుమకొండలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా ఉన్న రాధికాగుప్తా బదిలీ అవుతున్నారన్న ప్రచారం జరిగింది. మరుసటి రోజు శనివారం హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ను నారాయణపేట్ కలెక్టర్గా బదిలీ చేసి ఆమె స్థానంలో వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్యను నియమించారు. వ్యవసాయ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శి ఎం.సత్య శారదాదేవికి వరంగల్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. జేఎస్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రాను బదిలీ చేసి.. ఆయన స్థానంలో వికారాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్శర్మను కలెక్టర్గా, ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠిని బదిలీ చేసి ఆమె స్థానంలో జగిత్యాల అదనపు కలెక్టర్ దివాకర టీఎస్ను కలెక్టర్గా నియమించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఓసారి బదిలీ అయిన కలెక్టర్లు.. లోక్సభ ఎన్నికలు ముగియగానే మళ్లీ బదిలీ వేటుకు గురి కావడం ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేపింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పని చేసిన పి.ప్రావీణ్య మొదట వరంగల్ కలెక్టర్గా, ఆ తర్వాత హనుమకొండ కలెక్టర్గా ఇక్కడిక్కడే బదిలీ కాగా.. ఉమ్మడి జిల్లాలో పని చేసిన సిక్తా పట్నాయక్ కొద్ది రోజులకే నారాయణపేటకు బదిలీ కావడం.. బదిలీ అయిన ములుగు, భూపాలపల్లి కలెక్టర్లకు పోస్టింగ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశం అవుతోంది. -
వరంగల్ టు హనుమకొండ
సాక్షి, వరంగల్/హన్మకొండ: వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య హనుమకొండకు బదిలీ అయ్యారు. వరంగల్ కలెక్టర్గా 2015 ఐఏఎస్ బ్యాచ్కు ఎం.సత్యశారదాదేవి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యవసాయ, కో–ఆపరేషన్ విభాగ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న శారదాదేవి తొలిసారి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించే అవకాశముందని వరంగల్ కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఆ మెకు రెవెన్యూ విభాగంపై మంచి అవగాహన ఉండడంతో భూసంబంధిత సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యే అవకాశముందని చర్చ జరుగుతోంది. కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూకు సంబంధించిన భూసమస్యలే ఎక్కువగా ఉండడంతో సులభంగా పరిష్కారమయ్యే అవకాశముంది. ధరణి పోర్టల్లో ఇప్పటికే భారీ మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకురానున్న నేపథ్యంలో కలెక్టర్గా సత్యశారదాదేవిని నియమించారని తెలుస్తోంది. ‘ప్రావీణ్య’ం ప్రదర్శించారు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన ప్రావీణ్య 2021 మార్చి 14న వరంగల్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా వరంగల్ నగరంపై ఆమెకు అవగాహన ఉండడంతో కలెక్టర్గా ఈ మూడేళ్ల మూడు నెలల కాలంలో తనదైన మార్క్ చూపించారు. ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. బాధితులకు పరిహారం అందించి పనులు ముందుకెళ్లేలా చొరవ చూపారు. వరంగల్లో కొత్త బస్టాండ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నగరంలో వరదలు వచ్చిన సమయంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. నర్సంపేటలో జిల్లా వైద్యకళాశాల నిర్మాణ పనులపై శ్రద్ధ పెట్టారు. నిర్దేశించిన గడువులోపే ప్రభుత్వ పాఠశాలలకు మహిళల సమాఖ్య చేత స్కూల్ యూనిఫాం కుట్టించి అందజేసి, జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో ఉంచేలా కృషిచేశారు. వరంగల్లో చేపట్టిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేటకు బదిలీ హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేటకు బదిలీ అయ్యారు. వరంగల్ కలెక్టర్గా పనిచేస్తున్న ప్రావీణ్యను హనుమకొండకు నియమించారు. సిక్తా పట్నాయక్ ఫిబ్రవరి 1, 2023న బాధ్యతలు స్వీకరించారు. ఆమె పదవీకాలం అధిక సమయం ఎన్నికల నిర్వహణ పనులకే సరిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికలకు సిబ్బందిని, ఈవీఎంలు సన్నద్ధం చేయడం, ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. జిల్లాలో పర్యటిస్తూ అభివృద్ధి పనులు పర్యవేక్షించారు. సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు. ని త్యం సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులు, ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తూ.. ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలయ్యేలా కృషి చేశారు. కలెక్టర్ ప్రావీణ్య బదిలీ వరంగల్ కలెక్టర్గా ఎం.సత్యశారదాదేవి -
సాటి వారికి ఉపయోగపడాలనేవారు..
● నాన్నే నా హీరో.. ఆయన తీరు ఆదర్శం ● మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ సాక్షి, మహబూబాబాద్ : మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న ఇరిగేషన్ శాఖలో చిన్న ఉద్యోగి. అయినా ఆయ న ఆలోచనలు పెద్దగా ఉండేవి. ఎవరు ఎన్ని చెప్పినా పిల్లలను బాగా చదివించాలన్నదే ఆయ న లక్ష్యం. అదే దిశగా నాతోపాటు ముగ్గురు అన్నలను పెంచారు. ఏ పనిచేసినా.. ఉద్యోగం చేసినా.. సాటివారికి ఉపయోగపడాలి, విలువలతో కూడిన జీవితం గడపాలన్నదే ఆయన ఆలోచన. ఆ విషయాలే ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ యన ఆఫీసుకు వచ్చిన పెద్ద ఆఫీసర్లు, వారు ప్రజలకు, ఉద్యోగులకు చేస్తున్న మేలు వివరించేవారు. ఎక్కువ మందికి ఉపయోగపడాలి. సాయం చేయాలంటే పెద్ద ఉద్యోగాలు సాధించాలనేవారు. అందుకోసం కష్టపడా లి అని చెప్పి చదివించేవారు. ఆయన మాటలే నన్ను ఐపీఎస్ చదివేలా చేశాయి. నాకు ఐపీఎస్ వచ్చిన వార్త వినగానే నాన్న కళ్లల్లో ఆనందబాష్పాలు.. కుటుంబ సభ్యుల సంతోషం.. ఇప్పటికీ గుర్తుకొస్తాయి. కష్టంవిలువ తెలిపిన మా నాన్న రాంనాథ్ కేకన్ నా నిజమైన హీరో.. ఆయనే నాకు స్ఫూర్తి.. ఆదర్శం..ఆచరణ. నాన్న ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నా.. పాలకుర్తి: నా జీవిత ప్రయాణంలో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం. నాన్న హైదరాబాద్లో బీటెక్ వరకు చదివించారు. వివాహం తర్వాత అమెరికాలో మేనేజర్గా పనిచేశా. మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇందులో మా నాన్న మామిడాల తిరుపతిరెడ్డి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాన్న వెన్నంటి ఉండి నడిపించారు. ఆయన ప్రోత్సాహంతో సభలు, సమావేశాల్లో పాల్గొన్నా. ఘన విజయం సాధించా. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. – మామిడాల యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి ● -
ప్రతీక్షణం నా వెనుకాలే..
రాజకీయ అరంగేట్రం చేస్తున్న సమయంలో నాన్న ప్రతీక్షణం నా వెనుకాలే ఉన్నారు. ఎంపీ టికెట్ వచ్చిన మొదలు గెలిచే వరకు ఒకటీ, రెండు మీటింగులు తప్పితే అత్యధిక సమావేశాలు, సభలకు నాన్న నా వెంటే ఉంటూ నా వెన్నెముఖలా నిలిచారు. సభల్లో ఎలా మాట్లాడాలి.. ఏయే అంశాలు ప్రస్తావించాలి.. మొదలు ప్రతిదీ చిన్నపిల్లలకు మాదిరిగా చెప్పేవారు. మడికొండలో సీఎం రేవంత్రెడ్డి సభలో ప్రసంగించే సమయంలో నాన్న ఉన్నాడన్న ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఎన్నికల ప్రచారంలో తండ్రి శ్రీహరితో కూతురు కావ్య (ఫైల్) ప్రజాప్రతినిధి హోదా ఉంటే ప్రజలకు, సామాజిక సేవ మరింత ఎక్కువ చేయొచ్చని అనిపించింది. ఈ విషయాన్ని 2016లో నాన్న డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు నాన్న రాజకీయాలంటే అంత సులువు కాదు.. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా అని సర్దిచెప్పారు. ఎనిమిదేళ్ల తర్వాత రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇందులో సమయస్ఫూర్తి, ఓర్పు ఉండాలని పదే పదే చెబుతుంటారు. సమయం వచ్చినప్పుడు చెబుతా అన్నారు.. -
నేడు 144 సెక్షన్
వరంగల్ క్రైం : సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కమిషనరేట్ ఇన్చార్జ్ సీపీ అభిషేక్ మొహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5గంటల వరకు సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 18న జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంహన్మకొండ: వరంగల్ అర్బన్ జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాన్ని ఈనెల 18న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ విద్యలత తెలిపారు. హనుమకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2, 3, 5, 6వ స్థాయీ సంఘాల సమావేశం ఉదయం 10.30 గంటలకు, 4వ స్థాయీ సంఘం సమావేశంలో 11.30 గంటలకు, 7వ స్థాయీ సంఘం సమావేశంలో మధ్యాహ్నం 12 గంటలకు, 1వ స్థాయి సంఘం సమావేశం మధ్యాహ్నం 1 గంటలకు జరుగుతుందని తెలిపారు. సభ్యులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. జాతీయ నృత్యపోటీల్లో శ్లోకకు ప్రథమ స్థానంకాజీపేట రూరల్: కాజీపేటకు చెందిన చిన్నారి శ్లోక ఇటీవల ఒడిశా పూరి జగన్నాథ ఆలయంలో కథక్ రాకర్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి డాన్స్ అండ్ మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్ తరాంగన్–24 పోటీలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పని చేస్తున్న ఎ.కమలాకర్ కూతురు శ్లోక ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొని భరత నాట్యవిభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా విద్యార్థిని సమీక్ష కూడా పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరు ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు, సర్టిఫికెట్స్ అందుకున్నారు. శ్లోక, సమీక్షను శ్రీ శివసాయి నృత్య అకాడమీ గురువు దేవులపల్లి దివ్య, రైల్వే అధికారులు అభినందించారు. ‘కుడా’ వైస్ చైర్పర్సన్ బాధ్యతల స్వీకరణనయీంనగర్: ‘కుడా’ వైస్ చైర్పర్సన్గా అశ్విని తానాజీ వాకడే శనివారం ‘కుడా’ కార్యాలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఉన్నతాధికారులు సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, సెక్రటరీ మురళీధర్రావు, సత్యనారాయణ వైస్ చైర్పర్సన్కు పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అశ్విని తానాజీ వాకడే జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా విధులు నిర్వహిస్తుండగా.. ‘కుడా’ వైస్ చైర్పర్సన్గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ ఆర్ఎంగా విజయభానుహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా హైదరాబాద్ చార్మినార్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్)గా పనిచేస్తున్న డి.విజయభాను నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆర్ఎంగా ఉన్న జాస్తి శ్రీలతను రంగారెడ్డి రీజినల్ మేనేజర్గా బదిలీ చేస్తూ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీలత 2022, నవంబర్ 18న వరంగల్ ఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాదిన్నరపాటు పనిచేశారు. 18న జాబ్మేళా కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఈనెల 18న ములుగు రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాధవి ఒక ప్రకటలో తెలిపారు. హైదరాబాద్లోని కృషి విజ్ఞాన్ ఫర్టిలైజర్స్లో 67 ఉద్యోగాల భర్తీకి జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, అగ్రికల్చరల్, మార్కెటింగ్ అర్హతతోపాటు 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 9963177056 , 9177097456 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
నేనే రాజు.. నేనే మంత్రి
టీజీ ఎన్పీడీసీఎల్లో సమాంతర వ్యవస్థ నడిపిస్తున్న ఓ డివిజన్ అధికారిహన్మకొండ: ‘ఇక్కడ నేనే రాజు... నేనే మంత్రి అన్నట్లుగా ఓ డివిజన్ అధికారి వ్యవహరిస్తున్న తీరు టీజీ ఎన్పీడీసీఎల్లో హాట్టాపిక్గా మారింది. సంస్థ నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రభుత్వ విధానాలు, పాలక మండలి తీసుకున్న నిర్ణయాల మేరకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నడుచుకుంటారు. కానీ ఆ డివిజన్ అధికారి మాత్రం తన ఆలోచనలు, నిర్ణయాలు ఆచరిస్తూ టీజీ ఎన్పీడీసీఎల్కు సమాంతర వ్యవస్థను నడిపిస్తున్నారని విద్యుత్ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఎన్పీడీసీఎల్ వ్యాప్తంగా డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు, ఎస్ఈలు, డీఈలు, మానవ వనరుల విభాగం అధికారులు, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ సంస్థ నిబంధనలు ఆచరిస్తూ అమలు చేస్తుంటే హనుమకొండ సర్కిల్లోని ఈ డివిజన్ అధికారి అవేమీ తనకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో ఉద్యోగం చేస్తూ, జీతం తీసుకుంటూ సొంత నిర్ణయాలతో ముందుకెళ్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి.. టీజీ ఎన్పీడీసీఎల్లో డిప్యుటేషన్లపై నిషేధం కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ సమయంలో ఎటువంటి బదిలీలు, డిప్యుటేషన్లు ఉండొద్దు. అయినా ఈ డివిజన్ అధికారి ఏప్రిల్ 4న పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండగా సంస్థ నిబంధనలను పక్కనపెట్టి ఇద్దరు ఉద్యోగులకు డిప్యుటేషన్ వేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో రెండు రోజుల తర్వాత పాత తేదీ ఏప్రిల్ 4వ తేదీతో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రద్దు చేస్తున్నట్లు మరో ఉత్తర్వులు వెలువరించారు. దీంతో పాటు ఆదే తేదీతో వర్క్ ఆర్డర్ పేరుతో అదే డిప్యుటేషన్ను కొనసాగిస్తున్నారు. ఎన్పీడీసీఎల్లో డిప్యుటేషన్ వేసే అధికారం కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు మాత్రమే ఉంది. ఒకవేళ డిప్యుటేషన్ అవసరమైతే సీఎండీ నుంచి అనుమతి పొందాలి. ఈ నిబంధనలేమీ పాటించకుండా వర్క్ ఆర్డర్ పేరుతో డిప్యుటేషన్ కొనసాగిస్తుండడం గమనార్హం. మే 17న ‘సాక్షి’లో ‘ఎన్పీడీసీఎల్లో ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతోపాటు పలు విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు దిద్దుబాటుకు ఉపక్రమించారు. మే మాసం రెండో పక్షంలో ఏప్రిల్ 4కు ముందు డిప్యుటేషన్కు అనుమతి కోరుతున్నట్లు హనుమకొండ సర్కిల్కు లేఖ రాశారు. ఏప్రిల్లో చేసిన డిప్యుటేషన్కు మే రెండో పక్షంలో లేఖ రాయడం, ఈ లేఖపై హనుమకొండ ఎస్ఈ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలోని సీఈ స్థాయి అధికారుల ద్వారా ఎస్ఈపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్లో హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో డీఈ టెక్నికల్గా ఉన్న విజేందర్రెడ్డి మేలో సెలవుపై వెళ్లారు, ఈస్థానంలో మరో అధికారికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. పాత తేదీతో లేఖ పంపగా.. ఆ లేఖపై సీఈ స్థాయి అధికారుల ఆదేశంతో ఎలాంటి తేదీ వేయకుండా ఎస్ఈ సంతకం చేసినట్లు తెలిసింది. డివిజన్ కార్యాలయం నుంచి మేలో డిస్పాచ్ నంబర్–1.. తేదీ 1–4–2024తో లేఖ పంపితే అదనపు బాధ్యతల్లో ఉన్న డీఈ టెక్నికల్ మాత్రం తనకు లేఖ అందిన మే 24 తేదీతో సంతకం చేసి సంబంధిత సెక్షన్కు పంపారు. పర్సనల్ ఆఫీసర్ కూడా మే 24న తన చేతికి వచ్చినట్లు నమోదు చేసినట్లు సమాచారం. బిల్కౌంటర్ల ఎత్తివేత.. విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి ప్రతి విద్యుత్ రెవెన్యూ కార్యాలయం (ఈఆర్ఓ)లో బిల్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఈ డివిజనల్ అధికారి తన డివిజన్ పరిధి రెండు బిల్ కౌంటర్లు ఎత్తివేశారు. యాజమాన్యం, సీఎండీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా తన సొంత నిర్ణయాలు అమలు చేస్తూ.. బిల్ కౌంటర్లు లేకుండా చేశారు. దీంతో విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఎన్పీడీసీఎల్కు వచ్చే ఆదాయ మార్గాలను మూసి వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ డివిజనల్ ఇంజనీర్ వ్యవహార శైలితో కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆయన వేధింపులు భరించలేక కొందరు అధికారులు, ఉద్యోగులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నేనే నాయకుడిని.. నాకు ఎదురులేదని బెదిరింపులు యాజమాన్యం నిబంధనలు ఆ అధికారికి పట్టని వైనం తన ఆలోచనలే ఆచరణ.. సంస్థ నిర్ణయాలు ఇక్కడ బేఖాతర్ ఇబ్బందులు పడుతున్న కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు -
ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2024
● ముగ్గురు ఆడపిల్లలే అని ఎన్నడూ బాధపడలేదు ● మహాలక్ష్మీలు పుట్టారని సంతోషించేవారు ● నా ఇష్టాలను ఎప్పుడూ కాదనలేదు ● 2016లో రాజకీయాల్లోకి వస్తానంటే సమయం ఉందన్నారు ● ఎనిమిదేళ్ల తర్వాత తీసుకొచ్చారు.. నిలిచి గెలిచారు.. ● ఎన్నికల సమరంలో ప్రతీక్షణం నా వెనుకాలే ఉన్నారు ● ‘సాక్షి’తో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఫిట్‘లెస్’ స్కూల్ బస్సులపై కొరడా ఫిట్నెస్ చేయించుకోని, నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై రవాణాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. – 8లోuమానసిక ధైర్యం నూరిపోశారు.. నా జీవితంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికలు మరిచిపోలేని తీపి గురుతులు. కడియం కూతురుగా రాజకీయాల్లోకి వచ్చిన నాపై ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు కొంత బాధగా అనిపించాయి. అప్పుడు నాన్న ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని పట్టించుకోవద్దని మానసిక ధైర్యం నూరిపోశారు. ఆత్మస్థైర్యంతో ప్రచారంలో పాల్గొన్నా. ఎంపీగా నా విజయం కోసం నాన్న ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. డాక్టర్గా పని చేస్తున్నప్పుడు ఆ కేసులు చూసి..డాక్టర్గా పనిచేస్తున్నప్పుడే ఎక్కువ శాతం మహిళలు గర్భసంచి సమస్యతో బాధపడుతూ వచ్చేవారు. ఎందుకీ సమస్య అంటూ ఆరా తీయగా కౌమారదశలో వచ్చే పీరియడ్స్కు సరైన ప్యాడ్లు వినియోగించకపోవడమని తెలిసింది. ఆ సమస్యకు పరిష్కారం కోసం వెంటనే కడియం ఫౌండేషన్ ద్వారా బాలికలకు ప్యాడ్లు పంపిణీ చేయడం ప్రారంభించా. సంవత్సరంలో పదివేల మందికి ప్యాడ్లు పంచా. నాన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 6.5లక్షల మంది బాలికలకు పంపిణీ చేసినట్లు తెలిసింది. -
అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దు
వరంగల్ అర్బన్: ఎన్నికల కోడ్ ముగిసినందున పెండింగ్లో ఉన్న, ప్రారంభానికి నోచుకోని అభివృద్ధి పనుల్ని జాప్యం చేయకుండా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్ డివిజన్ల వారీగా వివిధ అభివృద్ధి పనులపై ఇంజనీర్లతో సమీక్షించారు. ఈసందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. మహా నగరంలో పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్, సీఎంఏ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, స్మార్ట్ సిటీ తదితర పథకాల వివరాలపై ఆరా తీశారు. టెండర్లు పూర్తయిన పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలన్నారు. జనరల్ ఫండ్ కింద ఇంకా మిగిలి ఉన్న పనులకు వెంటనే టెండర్ పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఈఈలు శ్రీనివాసరావు, సంజయ్కుమార్, డీఈలు రవికుమార్, సంతోశ్బాబు, రవికిరణ్, సారంగం, రంగారావు, జేఏఓ సరిత, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది జవాబు దారీగా నిలవాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం హనుమకొండ 9వ డివిజన్లోని అలంకార్ జంక్షన్, కాకతీయ కాలనీ, యాదవనగర్ ఈఎల్ఎస్ఆర్, అమృత్ థియేటర్, హనుమకొండ పోస్టాఫీస్, చౌరస్తా తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మేయర్, కమిషనర్ అశ్వినితానాజీ వాకడే పర్యటించారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. కాకతీయ కాలనీలో కల్వర్టు శిథిలావస్థకు చేరిందని, నూతనంగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై ఉన్నందున ఆ యజమానికి లిట్టర్ పెనాల్టీ విధించాలని సీఎంహెచ్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ చీకటి శారద ఆనంద్, ఎస్ఈ కృష్ణారావు, సీఎంహెచ్ఓ రాజేశ్, సిటీ ప్లానర్ వెంకన్న, ఈఈ రాజయ్య, డీఈ రవికుమార్, ఏఈ శ్రీకాంత్ పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లతో సమీక్ష -
ఉమ్మడి జిల్లాలో స్కూల్ బస్సుల వివరాలు
ఖిలా వరంగల్: నూతన విద్యా సంవత్సరం ఈనెల 12న నుంచి ప్రారంభమైంది. కళాశాలలు, పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులను తరలించేందుకు స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వీటికి తప్పకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి పిల్లలను తీసుకెళ్లే వాహనాలకు ఫిట్నెస్ చేయించాలి. ఇందుకోసం రవాణా శాఖ అధికా రులు వాహనాల సామర్థ్య పరీక్షల గడువు మే 15 వరకు ఇచ్చారు. ఒక వైపు విద్యాసంస్థలు ప్రారంభమైనా ఇంకా ఉమ్మడి జిల్లాలో 25శాతానికి పైగా బస్సులకు ఫిట్నెస్ కావాల్సి ఉంది. 10 బస్సులు ఉన్న విద్యాసంస్థలో 6 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేయించి మిగిలిన వాటికి ఫిట్నెస్ లేకుండానే రోడ్డు ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం స్కూల్ బస్సులు 1,755 ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందినవి 1,182 మాత్రమే. మిగిలిన 573బస్సుల్లో త్వరగా పూర్తి చేసుకోవాలని సూ చిస్తున్నారు. కాల పరిమితి పూర్తి చేసుకున్న, వివిధ కారణాల చేత 225 బస్సులను అధికారులు ఫిట్నెస్ చేయకుండా తిరస్కరించారు. ఇంకా మిగిలిన 348 బస్సులకు ఆన్లైన్ చేసి ఫిట్నెస్ సిర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉందని డీటీసీ చెబుతున్నారు. తూతూ మంత్రంగా పరీక్షలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైౖవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను సంబంధిత అధికారులు తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. కనీసం పది నిమిషాలైనా చెక్ చేయకుండానే బస్సులను పంపించేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఆధికారులు అప్రమత్తమవుతారు. ప్రమాదాలు జరగకుండా ముందుగానే బస్సుల తనిఖీ చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీఏ అధికారులు ఏం చేయాలి? పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి బస్సు ఫిట్నెస్ పకడ్బందీగా చూడాలి. నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలి. చాలా పాఠశాలలకు ఎక్కువ సంఖ్యలో బస్సులుంటాయి. ఒకటి రెండు బస్సులను చూసి ఫిట్నెస్ అయిందని మమ అనిపించకుండా ప్రతి బస్సును చెక్ చేయాలి. నెల, రెండు నెలలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బస్సుల పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి చెక్ చేస్తుండాలి. ఏవైనా లోపాలుంటే ఒత్తిళ్లకు లొంగకుండా బస్సును సీజ్ చేయాలి. విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాంప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సకాలంలో బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలి. పాఠశాలల పునఃప్రారంభం నుంచే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాం. ఫిట్నెస్లేని బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. యాజమాన్యాలు నిర్లక్ష్యాన్ని వీడి ఫిట్నెస్లు చేయించుకోవాలి. ఆనుభవం ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలి. పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ హనుమకొండ జిల్లా మొత్తం ఫిట్నెస్ చేయించు బస్సులు చేసుకున్నవి కోవాల్సినవివరంగల్ 352 252 100 హనుమకొండ 920 621 299 జనగామ 103 76 27 భూపాలపల్లి 130 89 41 ములుగు 95 50 45 మహబూబాబాద్ 155 94 61 మొత్తం 1,755 1,182 573 -
‘కుడా’ వైస్ చైర్పర్సన్గా అశ్విని తానాజీ
గ్రేటర్ వరంగల్ కమిషనర్కు అదనపు బాధ్యతలు వరంగల్ అర్బన్: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) వైస్ చైర్పర్సన్గా, గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ శుక్రవారం జీఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా జనగామ కలెక్టర్గా పదోన్నతిపై బదిలీ అయినా.. ఆయన వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ‘కుడా’కు వైఎస్ చైర్మన్గా ప్రత్యేక అధికారిని నియమిస్తారని, అందుకే ఇంత కాలం జాప్యం జరుగుతుందనే చర్చ కొనసాగింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా గ్రేటర్ వరంగల్ కమిషనర్కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కల్పిస్తూ.. ఆదేశాలిచ్చింది. గట్టెక్కిస్తారా? ‘కుడా’ చేపట్టిన ఏ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హృదయ్ పథకం మినహా ఇతర ప్రాజెక్టుల్లో పెద్దగా పురోగతి లేదనే ఆరోపణలున్నాయి. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలోని 171 గ్రామాల పరిధి 1,805 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ‘కుడా’ చేపడుతున్న ప్రాజెక్టులు పెద్దగా ఉన్నా వాటిని ఆచరణలో పెట్టేందుకు అవసరమైన అధికారులు, సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. దీంతో కీలక ప్రాజెక్టులైన ఇన్నర్ రింగ్ రోడ్డు, బాలసముద్రంలోని షాపింగ్ కాంప్లెక్స్, మునిపల్లిలో టౌన్షిప్, హంటర్ రోడ్డులోని సైన్స్ కేంద్రం, భద్రకాళి దేవాలయం వద్ద మాడ వీధులు, విశాఖపట్నం కై లాసగిరి తరహాలో రోప్ వే, హంటర్ రోడ్డులో హెల్త్ ఫా, రిక్రియేషన్ కేంద్రాలు, కొత్త మాస్టర్ ప్లాన్ అన్ని ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. ఈనేపథ్యంలో.. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న అశ్విని తానాజీ ఏ మేరకు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తారనే చర్చ సాగుతోంది. -
బడి బస్.. ఫిట్లెస్!
25శాతం బస్సులు సామర్థ్య పరీక్షలకు దూరం ● పాఠశాలలు పునఃప్రారంభమైనా స్పందన అంతంతే ● నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ● పిల్లల ప్రాణాలంటే లెక్కేలేదా? ● నామమాత్రంగానే ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్ వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థకు 8 స్కూల్ బస్సులున్నాయి. వీటి ద్వారానే విద్యార్థులను తీసుకువస్తారు. పాఠశాల పునఃప్రారంభంనాటికి అన్నింటికీ ఫిట్నెస్ చేయించాలి. కానీ అందులో ఐదు బస్సులకు చేయించారు. మిగతా బస్సులకు చేయించకుండానే రోడ్డెక్కించారు. ఆ బస్సులు పాతవి కావడంతో ఫిట్నెస్కు వెళ్తే తిరస్కరించే అవకాశం ఉందని సదరు యాజమాన్యం ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క పాఠశాలనే కాదు.. నాలుగైదు బస్సులు, మినీ వ్యాన్లు ఉన్న పాఠశాలల ఇదే పంథాను ఎంచుకున్నాయి. నిపుణులైన డ్రైవర్లను పెట్టుకుంటే జీతాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని, ప్రతి సంవత్సరం కొత్తవారిని తీసుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి. -
వారంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం
కలెక్టర్ సిక్తా పట్నాయక్ హన్మకొండ అర్బన్: వారం రోజుల్లో జిల్లాలోని ధరణి పెండింగ్ దరఖాస్తుల్ని పరిష్కరిస్తామని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం ఽహైదరాబాద్ నుంచి కలెక్టర్, అధికారులతో ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారంపై భూ పరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్మిట్ట ల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీసీఎల్ఏ నవీన్మిట్టల్ మాట్లాడుతూ.. భూముల మార్కెట్ ధరల్ని సవరించడానికి మండలాల పరిధిలో ఆర్డీఓ చైర్మన్గా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సబ్ రిజిస్టార్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ చైర్మన్గా, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, జెడ్పీటీసీలు సభ్యులు కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే.. కలెక్టర్ చైర్మన్గా అనామలీస్ కమిటీ ఏర్పాటు చేయాలని దీనిలో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రిజిస్టార్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈకమిటీలు త్వరగా ఏర్పాటు చేసి భూముల మార్కెట్ ధరలను సవరించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ గణేశ్, పరకాల, హనుమకొండ ఆర్డీఓలు నారాయణ, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి కాళోజీ సెంటర్: పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ఉమ్మడి వరంగల్ కలెక్టర్లతో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించారు. వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ల స్థాయిలో పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేక కార్యాచరణతో పరిష్కరిస్తామని, మండలాలకు అవసరమైన అదనపు సిబ్బందిని కేటాయిస్తామని చెప్పారు. వీసీలో వరంగల్, హనుమకొండ జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
వరంగల్ అదనవు కలెక్టర్ సంధ్యారాణి కాళోజీ సెంటర్: బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని వరంగల్ అదనవు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. కలెక్టరేట్లో డీసీపీ రవీందర్తో కలిసి పశుసంవర్థక, మున్సిపల్, పంచాయతీ, పోలీసు అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. వెటర్నరీ అధికారులు ధ్రువీకరించిన జంతువులను మాత్రమే ఈనెల 17న బక్రీద్కు వినియోగించాలన్నారు. పండుగ కోసం వాహనాల్లో తరలించే జంతువులకు అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులను ఏర్పాటుచేయాలని పోలీసు శాఖకు సూచించారు. కబేళాల నిర్వాహకులకు అధికారులు అవగాహన కల్పించాలని, పండుగ ముగిసే వరకూ కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా పశుసంవర్థక అధికారి బాలకృష్ణ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు జోనా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)శనివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 20247రెడ్క్రాస్ సేవలు అభినందనీయంకలెక్టర్ సిక్తా పట్నాయక్ హన్మకొండ అర్బన్: అత్యవసర సమయాల్లో ముందుంటూ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రజ లకు అందిస్తున్న సేవలు అభినందనీయమని హనుమకొండ కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినో త్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీలోని జనరిక్ మందుల షాప్, తలసేమియా సెంటర్ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. తలసేమియా బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్త గ్రూప్లను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టినేర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లా రెడ్క్రాస్ సొసైటీ రక్త కేంద్రం, తలసేమియా సెంటర్, జనరిక్ మెడికల్ షాపు నిర్వహణలో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు రక్తదాతలకు కలెక్టర్, పాలకవర్గం చేతుల మీదుగా శాలువాలతో సత్కరించి ప్రశంసపత్రాలు, షీల్డులు బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ పి.విజయ్చందర్రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణగౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, జిల్లా పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్రావు, పుల్లూరు వేణుగోపాల్, సీహెచ్ సంధ్యారాణి, బాశెట్టి హరిప్రసాద్, రక్తదాతలు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.న్యూస్రీల్ -
No Headline
హన్మకొండ : వానా కాలం వచ్చేసింది. భారీ వర్షాలు కురిస్తే వరదలు పోటెత్తే ప్రమాదముంది. నయీంనగర్ వంతెన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండడం నగరవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడు నెలల్లో నయీంనగర్ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పారు. రెండున్నర నెలలు కావొస్తున్నా స్పీడందుకోవడం లేదు. బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో నగరవాసుల్లో ఆందోళన పెరుగుతోంది. కాలనీలు ఎక్కడ వ రద ముంపునకు గురవుతాయేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నయీంనగర్ రోడ్డులో నాలాపై అప్పటి అవసరాల మేరకు 62 ఏళ్ల (1961–62) క్రితం తక్కువ సామర్థ్యంతో పైపులతో కల్వర్టు నిర్మించారు. ఆతర్వాత హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిని రెండు లైన్ల రోడ్డుగా విస్తరించిన క్రమంలో 2005లో కల్వర్టును విస్తరించారు. పైపులతో నిర్మించిన కల్వర్టు తక్కువ సామర్థ్యం కలిగి ఉందని, వర్షాలు కురిసినప్పుడు వరద నీటిలో వ్యర్థాలు కొట్టుకొచ్చి పైపులు మూసుకుపోయేవి. వరద నీరు బ్యాక్వాటర్గా మారి ఎగువన ఉన్న కాలనీలు ముంపునకు గురవుతూ వచ్చేవి. రాకపోకలకు ఇబ్బంది.. నయీంనగర్లో నాలాపై బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నయీంనగర్ ప్రాంతం విద్యా సంస్థలకు, కోచింగ్ సెంటర్లకు నిలయం. వ్యాపార సంస్థలు ఈప్రాంతంలో ఉన్నాయి. దీంతో పాటు కరీంనగర్, నిజామాబాద్కు ప్రధాన రూట్ ఈ రోడ్డు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు, వ్యాపారులు, వినియోగదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గాన వెళ్లే బస్సులు హనుమకొండ చౌరస్తా, పెద్దమ్మగడ్డ, కేయూసీ మీదుగా నడుస్తున్నాయి. దీంతో కిలో మీటర్లు పెరిగి అదనంగా పెద్దమ్మ గడ్డ స్టేజీని ఏర్పాటు చేసి ఆర్టీసీ చార్జీలు పెంచింది. ప్రయాణికులపై అదనంగా భారం పడుతోంది. ఈవంతెనకు రెండు వైపులా ఉన్న వారు సమ్మయ్యనగర్, అంబేడ్కర్ భవన్ రోడ్డు మార్గంలో.. నయీంనగర్ పొచమ్మ కుంట, కేయూసీ–పెద్దమ్మ గడ్డ మార్గంలో తిరిగి వెళ్తున్నారు. వర్షం కురిస్తే అంబేడ్కర్ భవన్ ఎదుట రోడ్డుపై నడుము లోతున నీరు నిలుస్తుంది. అదేవిధంగా పోచమ్మకుంట మార్గంలోనూ వరద నీరు చేరి రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పనుల్లో వేగం పెంచి, త్వరగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. కొనసా...గుతున్న నయీంనగర్ నాలా బ్రిడ్జి పనులునత్తనడకన పనులు.. ముంపు కాలనీల ప్రజల నుంచి తీవ్ర నిరసన, ఆందోళనలు వ్యక్తమవడంతో నాలా విస్తరణ, అధిక సామర్థ్యం కలిగిన ఆధునిక వంతెన నిర్మాణానికి ప్రభుత్వం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంకల్పించింది. రెండేళ్ల క్రితం అధునాతన నాలుగు లైన్ల వెడల్పుతో వంతెన నిర్మాణానికి స్మార్ట్ సిటీ నిధులు రూ.15 కోట్లు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ ముగిసిన రెండేళ్లకు ఎట్టకేలకు నాలుగు లైన్ల వంతెన నిర్మాణ పనులు ఏప్రిల్ 5న మొదలు పెట్టారు. పాత వంతెనను కూల్చేసి కొత్త వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. అప్పటి నుంచి నెమ్మదిగా పనులు సాగుతున్నాయి. పనులు మొదలు పెట్టిన క్రమంలో వర్షాకాలం వచ్చేలోపు నూతన వంతెన పూర్తి చేయాలని భావించారు. 15 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జూలై, ఆగస్టులో ఏటా భారీ వర్షాలు కురుస్తూ.. వరద పోటెత్తే అవకాశం ఉంది. వరదలు వచ్చిన ప్రతీసారి నాలాకు ఇరువైపులా ఉన్న కాలనీలు ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్నారు. ఈసారైనా వరద, ముంపు సమస్య తీరుతుందని ఆశిస్తే నయీంనగర్ వంతెన పనులు నెమ్మదిగా కొనసాగుతుండడంతో నాలా చుట్టు పక్కల ప్రాంత కాలనీవాసులు మళ్లీ వరదనీరు ముంచేస్తుందని ఆందోళన చెందుతున్నారు. -
నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి
వరంగల్ అర్బన్: నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం సాయంత్రం జీడబ్ల్యూఎంసీ పరిధి మడికొండలో భవన నిర్మాణ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యటించి పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. చట్టంలో సూచించినట్లుగా ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టే భవనాలకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ వెంకన్న, ఏసీపీ బషీర్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానం చేసేందుకు ముందుకురావాలి
హన్మకొండ చౌరస్తా: రక్తదానం చేసేందుకు ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని హనుమకొండ డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంక్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జీఎంహెచ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, వైద్య శా ఖ అధికారులు మదన్మోహన్, యాకూబ్పాషా, ఉషారాణి, జీఎంహెచ్ ఆర్ఎంఓ సారంగం, ప్రోగ్రాం అధికారులు ఉమశ్రీ, హిమబిందు త దితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
కాశిబుగ్గ: ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం మంత్రి వరంగల్ ఓ సిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి కొన్ని సమస్యలపై అప్పటికప్పుడు ఆధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎలక్షన్ కోడ్ కారణంగా ప్రజలను కలవలేకపోయానని ఇక నుంచి అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఏసమస్యలున్నా.. తనని నేరుగా వచ్చి సంప్రదించాలని సూచించారు. మంత్రి క్యాంపు కార్యాలయానికి రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అనేక మంది సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. 35వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేణుకుంట్ల శివకుమార్ శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించాలంటూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఎన్నో సమస్యలను మంత్రి సంబంధిత అధికారులకు ఫొన్ చేసి పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ సిటీ క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ -
బక్రీద్ను శాంతియుతంగా జరుపుకోవాలి
వరంగల్ అదనవు కలెక్టర్ సంధ్యారాణి కాళోజీ సెంటర్: బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ అదనవు కలెక్టర్ జి.సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ముస్లిం మతపెద్దలు, మున్సిపల్, పంచాయతీ, పోలీస్ అధికారులతో గురువారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ బక్రీద్కు వెటర్నరీ అధికారులు ధ్రువీకరించిన జంతువులను మాత్రమే వినియోగించాలని, వాహనాల్లో తరలించే జంతువులకు అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే పోస్టులపై నిర్ధారణ చేసుకోవాలని, ఎవరూ తొందరపడవద్దని అధికారులకు సూచించారు. కబేళాల నిర్వాహకులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పండుగ ముగిసే వరకు పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సౌజన్య, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి బాలకృష్ణ, ఆర్డీఓ సిదం దత్తు, తహసీల్దార్ ఇక్బాల్, మైనార్టీ మత పెద్దలు దర్శన్సింగ్, ఫుర్కాన్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి నగదు రూపేణా వసూళ్లు
వరంగల్ అర్బన్: ఎట్టకేలకు నెల రోజుల తర్వాత గ్రేటర్ వరంగల్లో పన్నుల వసూళ్లు నగదు రూపంలో చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం(నేటి) నుంచి బల్దియాకు చెందిన 9 మీసేవా కేంద్రాల్లో, వార్డు ఆఫీసర్లు బకాయిదారుల నుంచి క్యాష్ రూపంలో పన్నులు స్వీకరించనున్నారు. నగదుతోపాటు డిజిటల్ వసూళ్లు చేపట్టనున్నారు. కొన్నేళ్లుగా క్షేత్ర స్థాయిలో, మీ సేవ కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ బిల్ కలెక్టర్లు డిజిటల్, నగదు రూపంలో ఆస్తి, నీటి, చెత్త, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తుండడంతో అనేక అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర పురపాలక శాఖ గుర్తించింది. నెల రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో నగదు రూపంలో వసూళ్లకు బ్రేక్ వేసింది. ఈనేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా డిజిటల్ పద్ధతి ద్వారా పన్నుల స్వీకరణ వల్ల అన్ని మున్సిపాలిటీల్లో వసూళ్ల శాతం తగ్గుముఖం పట్టింది. కొన్ని మున్సిపాలిటీల్లో ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలివ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. పురపాలక శాఖ అధికారుల ఆదేశాల మేరకు సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్సీ(సీజీజీ) సాంకేతిక సహాయంతో మార్పులు చేశారు. అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ బిల్ కలెక్టర్లను పన్నుల వసూళ్ల నుంచి పూర్తిగా తప్పించారు. వీరి స్థానంలో శాశ్వత ఉద్యోగులను డివిజన్కు ఒకరి చొప్పున వార్డు ఆఫీసర్ను నియమించారు. ఇక మీదట 66వ డివిజన్లు, బల్దియాకు చెందిన మీసేవ కేంద్రాలైన వరంగల్ హెడ్ పోస్టాఫీస్, కాశిబుగ్గ సర్కిల్, శివనగర్, ఉర్సు, పోచమ్మ మైదాన్, బల్దియా ప్రధాన కార్యాలయం, హనుమకొండ అశోకా థియేటర్ ఎదురుగా, నయీంనగర్, నక్కలగుట్ట, సుబేదారి, కాజీపేటలో వార్డు ఆఫీసర్లు, కొంత మంది జూనియర్ అసిస్టెంట్లకు పూర్తి స్థాయిలో పన్నుల వసూళ్ల బాధ్యత కట్టబెట్టారు. దీంతో పన్నుల వసూళ్ల శాతం మెరుగుపడుతుందని బల్దియా పన్నుల విభాగం అధికారులు భావిస్తున్నారు.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
లైఫ్లో మర్చిపోలేని వంటింటి చిట్కాలివిగో!
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్కు ఎలా అంటగడతారు?’
హైదరాబాద్లో భారీ వర్షం
స్టార్ హీరో పాదాలకు నమస్కరించిన టాలీవుడ్ డైరక్టర్!
ఈ సౌత్ ఇండియన్ భామలపై ఓ లుక్కేసుకోండి! (ఫొటోలు)
ఎయిరిండియా భోజనంలో మెటల్ బ్లేడ్..!
ప్రియురాలితో సింపుల్గా నటుడి ఎంగేజ్మెంట్
ఢిల్లీ ఎయిర్పోర్టులో పవర్ కట్స్
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్.. రషీద్ ఖాన్ తర్వాత..!
నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ
Advertisement