న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే

Sep 14 2025 6:19 AM | Updated on Sep 14 2025 6:19 AM

న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే

న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే

హైకోర్టు జడ్జి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌

వరంగల్‌ లీగల్‌ : యువ న్యాయవాదులకు శిక్షణ త రగతులు అవసరమేనని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌గౌడ్‌ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ భవన్‌లో తెలంగా ణ రాష్ట్ర న్యాయవాది పరిషత్‌ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా జడ్జి లక్ష్మణ్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సీనియర్‌ న్యాయవాది కె.వి. గుప్తా రాసిన ‘తెలంగాణ కోర్టు ఫీ యాక్ట్‌ పుస్తకం’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌గౌడ్‌ మాట్లాడారు. యాంటీ కరప్షన్‌ లాస్‌, ప్రాక్టీస్‌ అండ్‌ ప్రొసీజర్‌ అంశాల్లో యువ న్యా యవాదులు మెళకువలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాద పరిషత్‌ అ ధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌.ప్రభాకర్‌ రెడ్డి, శ్యాంశాని సునీల్‌, చొళ్లేటి రామకృష్ణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వలుస సుధీర్‌, పులి సత్యనారాయణ, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు

అమ్మవారికి హైకోర్టు జడ్జి పూజలు..

హన్మకొండ కల్చరల్‌ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు.. జస్టిస్‌ను ఘనంగా స్వాగతించారు. పూజలనంతరం అర్చకులు శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తి పట్టాభి రామారావు, వరంగల్‌ జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement