ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి.. సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి.. సంక్షేమం

Sep 18 2025 6:49 AM | Updated on Sep 18 2025 6:49 AM

ప్రజా

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి.. సంక్షేమం

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి.. సంక్షేమం

హన్మకొండ అర్బన్‌: ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్‌–సికింద్రాబాద్‌ నగరాల మాదిరిగానే హనుమకొండ–వరంగల్‌ నగరాలు కూడా కలిసి ఉన్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

త్వరలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు ప్రారంభం..

2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ.4,100 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 2040 అవసరాలకు సరిపోయేలా మాస్టర్‌ ప్లాన్‌ను తీసుకువచ్చినట్లు వివరించారు. భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, అలాగే, హనుమకొండ కలెక్టరేట్‌ బంగ్లాను ఆధునికీకరించినట్లు చెప్పారు. జిల్లాలో రెండు ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

ఆరోగ్యశ్రీతో పేదలకు ఉచిత వైద్యసేవలు..

గత ప్రభుత్వం నగరంలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మంది పేదలు ఉచిత వైద్యసేవలు పొందుతున్నారని చెప్పారు.

435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు..

అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా జిల్లాలో 435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, వేలాది మందికి కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడంతో పాటు వేలాది మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా రేషన్‌ కార్డుల్లో చేర్చినట్లు చెప్పారు.

ఐదు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు..

విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని, నకిలీ విత్తన, ఎరువుల కొరత అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాదాబైనామాతో భూసమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

విదేశాల నుంచి పెట్టుబడులు..

రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించామన్నారు. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్‌, దావోస్‌, జపాన్‌ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించామని వివరించారు. హైదరాబాద్‌ వేదికగా పలు గ్లోబల్‌ ఈవెంట్లు నిర్వహించామని ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. మేయర్‌ సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, ఎంపీ కడియం కావ్య, హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు, స్నేహ శబరీష్‌, సత్యశారద, గ్రేటర్‌ కమిషనర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌, అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

ముందు చూపుతో గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధి

ప్రజాపాలన దినోత్సవంలో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి.. సంక్షేమం1
1/2

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి.. సంక్షేమం

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి.. సంక్షేమం2
2/2

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి.. సంక్షేమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement