breaking news
Tollywood
-
‘స్పిరిట్‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’
సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా సోదరుడు, భద్రకాళి పిక్చర్స్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ‘రొమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలపై మాట్లాడిన ప్రణయ్.. రివ్యూవర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.‘రివ్యూ చేయడం చాలా ఈజీ’..సినిమా రివ్యూ చేయడం చాలా సులభమైన పని అని ప్రణయ్ అభిప్రాయపడ్డారు. దాదాపు 90 శాతం సినిమాలు లేదా 10లో 9 సినిమాలు విడుదలైన తర్వాత విఫలమవుతుంటాయని.. వాటిని రివ్యూ చేయడం సులభమేనని అన్నారు. చివరికి ప్రేక్షకుల తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్‘స్పిరిట్’తో చూస్తాం!ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ‘రొమాంచకం’ చిన్న సినిమా కాబట్టి దానిపై రివ్యూవర్లు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ సినిమా విషయంలో చేసినట్లే పెద్ద సినిమా అయిన ‘స్పిరిట్’ విషయంలోనూ చేయగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘స్పిరిట్’ విడుదలైనప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!తాము ఆ సినిమా ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నామని చెప్పారు. దీంతో ప్రణయ్ రెడ్డి వంగా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాత ప్రణయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!
బిగ్బాస్ సీజన్-10లో తొలి వీకెండ్ ఎపిసోడ్కు రంగం సిద్ధమైంది. వారమంతా హౌస్లో కంటెస్టెంట్ల ఆటతీరు, గొడవలు, టాస్కులతో సందడి నెలకొనగా.. వీకెండ్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతో మరింత ఆసక్తి పెరగనుంది. కంటెస్టెంట్లు చేసిన తప్పులను ప్రశ్నించడంతో పాటు.. బాగా ఆడినవారిని అభినందిస్తూ నాగార్జున తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయనున్నారు.ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమితఊహించని సర్ప్రైజ్ఈ వారం హౌస్లో అన్ని అంశాల్లోనూ తమ ఆటతో ఆకట్టుకున్న కంటెస్టెంట్లుగా రామ్ప్రసాద్, రోహిత్, వంశీలు నిలిచారు. వారి ఆటతీరును నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాదు.. ఈ ముగ్గురికి ఊహించని సర్ప్రైజ్ కూడా ఇచ్చారు.వారు తాగిన మిల్క్షేక్ గ్లాసులను స్వయంగా నాగార్జున కడగడం ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్లను ప్రోత్సహించేలా ఆయన చేసిన ఈ పని చూసి హౌస్మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. దీంతో తొలి వీకెండ్ ఎపిసోడ్లో రామ్ప్రసాద్, రోహిత్, వంశీలకు నాగార్జున ఇచ్చిన ఈ ప్రత్యేక గౌరవం హైలైట్గా నిలిచింది. -
అందుకే ‘శ్రీలత..’పాటను తెలంగాణ ఫోక్ స్టైల్ లో కంపోజ్ చేయలేదు: మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి
‘శ్రీలత..’ పాట కోసం డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే సినిమాలోని కథలో భాగమవుతూ, ప్రమోషన్ కు కూడా ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాం. పాటలో క్యాచీ లిరిక్స్ కూడా కుదిరాయి. ప్రజలు ఈ పాటను ఓన్ చేసుకునేలా ఉండాలని డిజైన్ చేసి ముందే రిలీజ్ చేశాం.ఈ పాటకు ట్యూన్, లిరిక్స్ ఒకే రోజులో ఫైనల్ అయ్యాయి. పాట అందరికీ రీచ్ అవ్వాలనే కంప్లీట్ గా తెలంగాణ ఫోక్ స్టైల్ లో కంపోజ్ చేయలేదు. చరణం మెలొడియస్ గా ఉండేలా ట్యూన్ డిజైన్ చేశాను’ అని అన్నారు సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి. ప్రియదర్శి, ఫోక్ డాన్సర్ నాగదుర్గ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. బన్నీవాస్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘శ్రీలత..’పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, లిరిక్ రైటర్ అలరాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. .సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. 'శ్రీలత..' పాట మా ఫ్యామిలీ మెంబర్స్ కు బాగా నచ్చింది. వాళ్లు ఫోన్స్ చేసి పాట బాగుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మా సాంగ్ కు రెస్పాన్స్ బాగుంది. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్ , ఇద్దరు సింగర్స్ పాడిన విధానం తమను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ పాటలో నేను నటించాను. ఈ ఆలోచన బన్నీ వాస్ గారిది. మీరు ఇన్ని సాంగ్స్ కు మ్యూజిక్ చేశారు. మీరు ఎవరో ప్రేక్షకులకు తెలియాలి కదా అని ఈ సాంగ్ లో నేను కూడా నటించేలా చేశారు. నేను ప్రజలకు తెలియాలి అనే ఆలోచన నాలో కూడా ఉండేది. అందుకే ఒక ప్రైవేట్ సాంగ్ నేనే పర్ ఫార్మ్ చేస్తూ చేయాలని కూడా అనుకున్నాను. పాటలో నటించడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ పాటలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. లిరిక్ రైటర్ అలరాజు అన్న డైరెక్టర్ వంశీరెడ్డి అన్నకు ఫ్రెండ్. నాకు కూడా అలరాజు అన్న తెలుసు. ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో ఐడియా ఉంది. ఈ పాటలో తెలంగాణ వారికి వాడుకలో ఉన్న, సుపరిచితమైన కొన్ని పదాలతో పాట రాశాడు. అవి పాటకు అందాన్ని తీసుకురావడమే కాదు త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా చేశాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటకు కనెక్ట్ అయ్యారు. పాట బాగుందని కాల్ చేసిన చెబుతున్నారు.లిరిక్ రైటర్ అలరాజు మాట్లాడుతూ.. ‘ఈ పాట రాసేప్పుడు డైరెక్టర్ వంశీ రెడ్డి ..‘కథతో సంబంధం లేకుండా ఈ పాట అందరికీ నచ్చేలా ఉండాలి. సినిమా చూశాక ఇంకా శ్రోతలకు కనెక్ట్ కావాలి’అని చెప్పారు. మీరు ఇప్పుడు ఆడియో వింటుంటే నచ్చుతుంది. కానీ సినిమాలో చూసినప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా ఈ పాటను ఇష్టపడతారు. హీరో హీరోయిన్స్ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో వచ్చే సాంగ్ ఇది. శ్రీలత అలకకు కారణం ఏంటి, శ్రీనివాస్ ఏం చెప్పి ఆమెను బుజ్జగించాడు అనే నేపథ్యంతో ఈ సాంగ్ రూపకల్పన చేశారు. రెగ్యులర్ ఎక్స్ ప్రెషన్స్ కాకుండా ఈ పాట సాహిత్యం కొత్తగా రాసేందుకు ప్రయత్నించాను. టైటిల్ రివీల్ చేసేందుకు ముందగానే ఈ పాట ఫైనల్ అయ్యింది. ఈ పాటలోని పదాలను పూర్తిగా ఫోక్ స్టైల్ లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశాను. ఒక పెద్ద మూవీకి వర్క్ చేస్తున్నానే ప్రెషర్ నాపై ఉండేది కానీ వాళ్లు ఇచ్చిన ఇన్ పుట్స్ వల్ల కంఫర్ట్ గా లిరిక్స్ రాశాను. శ్రీలత పాట నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇడుపుకాయితం గీత రచయితగా నా బతుకు మార్చిన కాగితం అనుకుంటాను’ అన్నారు. -
సినిమాల్లో అవకాశం అంటూ మోసం.. రోడ్డెక్కిన బాధితులు
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్షల్లో వసూలు చేసి మోసానికి ఒడిగట్టిన ఘటన హైదరాబాద్లో కలకలం సృష్టించింది. ఈమేరకు తమకు న్యాయం చేయాలంటూ భాదితులు అంబర్పేట్ శివం రోడ్డులోని సినిమా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంతమేర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.సినిమాలో అవకాశం ఇప్పిస్తామంటూ తమ దగ్గర రూ.లక్షల్లో డబ్బులు వసూళు చేసినట్లు బాధితులు తెలిపారు. తీరా అడిగే సరికి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని వారంతా వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇప్పించాలని వారంతా కోరారు. శివకుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: డీ10 విన్నర్ రాజు పై కేసు.. Victims protest at the residence of film distributor Shivakumar Goud.They alleged that Shivakumar had collected lakhs of rupees from several individuals by promising to secure film offers for them. pic.twitter.com/sQCOa6f0IC— Shakeel Yasar Ullah (@yasarullah) September 12, 2026 -
టీవీ షో డీ10 విన్నర్ రాజు పై కేసు.. యువతిని వేధించాడంటూ ఆరోపణలు
డీ10 టీవీ షో విన్నర్ రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ యువతిని లైంగికంగా వేధించాడంటూ ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఈ నెల 9న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు రాజును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే రాజుపై కేసు నమోదు చేసిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్నిరోజులుగా గోప్యంగా ఉంచినట్లు సమాచారం.డీ10 టీవీ షో ద్వారా రాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షో విన్నర్గా నిలిచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. -
బిగ్బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్
బిగ్బాస్ సీజన్10లో అగ్ని పరీక్ష తర్వాత మొదలవుతుంది అసలైన మహాపరీక్ష అని ముందే చెప్పినట్టుగానే బిగ్బాస్ హౌస్లో ఇప్పుడు అసలు ఆట మొదలైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టగా.. కేవలం ముగ్గురు మాత్రమే హౌస్మేట్స్గా మారారు. మరో ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్లో కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!అయితే ఎలిమినేట్ అయిన ఇద్దరినీ బిగ్బాస్ ఇంకా సీక్రెట్ రూమ్లోనే ఉంచాడని పలువురు కంటెస్టెంట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున.. చరణ్, చైత్రలతో ఫోన్లో మాట్లాడి.. వాళ్లు తమ ఇంటి దగ్గరే ఉన్నారని కన్ఫామ్ చేయించారు. దీంతో ఇక ఎలిమినేషన్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని వారికి క్లారిటీ ఇచ్చారు. కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్..ఈ క్రమంలో నాగార్జున కూడాడఇచ్చాడు. ఆటలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. గేమ్లో ఎవరు నిర్లక్ష్యం చేసినా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో 11 మంది రిస్క్లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు తమ గేమ్ను మరింత పదును పెడతారో చూడాలి. -
'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. తాజాగా టీజర్ విడుదల చేసి థియేటర్లలోకి వచ్చే విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.టీజర్ విషయానికొస్తే.. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాషణలతో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం – AK47’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ చమత్కారమైన రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
‘ఇరుముడి’ థీమ్తో బోజ్జ గణపయ్య.. వీడియో వైరల్
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. గణనాథుడి విగ్రహాలు సరికొత్త రూపాల్లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటుంటాయి. ట్రెండ్కు తగ్గట్టుగా విభిన్న ఆకారాల్లో విగ్రహాలను తయారు చేయడం ఆనవాయితీగా మారింది. అంతేకాదు.. బ్లాక్బస్టర్ సినిమాల థీమ్లను కూడా వినాయకుడి విగ్రహాల్లో ప్రతిబింబిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా థీమ్తో గణేశుడి విగ్రహాలు సందడి చేసిన సంగతి తెలిసిందే. హీరోల రూపాల్లోనూ విగ్రహాలు దర్శనమిస్తూ నెట్టింట వైరల్గా మారుతుంటాయి. ఇప్పుడు తాజాగా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థీమ్తో రూపొందించిన వినాయకుడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహాన్ని వైజాగ్లో తయారు చేశారు.శివుడు, పార్వతి కలిసి వినాయకుడికి ఇరుమడి కడుతున్నట్లుగా ఉన్న ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇక ఇరుముడి సినిమా విషయానికొస్తే.. రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్స్లో రిలీజై..తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. విడుదలైన రెండు వారాలకే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. మూడో వారం ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 225 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిర కీలక పాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. #IRUMUDI Effect 🤌👌Chudataniki Chala Bagundi 🛐స్వామియే శరణం అయ్యప్ప 🙏 pic.twitter.com/digPReR1ER— Hari SaaHo (@HariSaaho19) September 12, 2026 -
పాక్ సినిమాలో 'సలార్' ఫైట్ కాపీ? వీడియో వైరల్
పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా 'సలార్'. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించేసరికి ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదల విషయంలో పలుమార్లు వాయిదా పడటంతో ఎందుకనో థియేటర్లలో సరిగా ఫెర్ఫార్మ్ చేయలేదు. కానీ తర్వాత కాలంలో ఓటీటీ, టీవీలో ప్రసారమైన తర్వాత విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో 'సలార్' గురించి వినిపిస్తూనే ఉంటుంది.కానీ రీసెంట్గా కొన్నిరోజుల నుంచి 'సలార్' ఫైట్ సీన్ని పాకిస్తాన్కి చెందిన ఓ సినిమాలో కాపీ కొట్టారని చెప్పి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు. పాక్కి చెందిన హసీబ్ బిలాల్ అనే ఇన్ఫ్లుయెన్సర్.. ఏఐ ఉపయోగించి 'సలార్' స్ఫూర్తిగా తన ప్రతిరూపంలో వీడియో సృష్టించి దానిని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. చూడటానికి ఇది రియల్గా ఉండేసరికి చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో 'డ్రాగన్' చేస్తున్నాడు. మరి వీళ్లు ఈ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత 'సలార్ 2' కోసం కలుస్తారేమో చూడాలి? దీని కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త గట్టిగానే ఎదురుచూస్తున్నారు.What's going on in pakistan 😂#prabhas #salaar #prashanthneel #SpiritMovie pic.twitter.com/Ja8HbVt7RL— Rishika nayak (@karthiknayak897) September 7, 2026 -
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
ప్రతివారాంతంలో కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజవుతూనే ఉంటాయి. ఈ వారం అలా స్ట్రెయిట్, డబ్బింగ్ రూపంలో నాలుగైదు మూవీస్ విడుదలయ్యాయి. వీటిలో కార్తీ 'సర్దార్ 2', ఆనంద్-వైష్ణవి 'ఎపిక్', సుహాస్ 'మండాడి', సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' చిత్రాలున్నాయి. ఇంతకీ ఇవెలా ఉన్నాయి? వీటి రివ్యూలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ'బేబి' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'ఎపిక్'. 90స్ వెబ్ సిరీస్లోని చిన్న పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయి.. పై చదువుల కోసం లండన్ వెళ్లి ఓ అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్తో తీశారు. బోల్డ్ సీన్స్, రొమాన్స్ కాస్త ఎక్కువగానే దట్టించారు. అయితే స్టోరీ పెద్దగా లేకపోవడంతో చాలామంది ప్రేక్షకులకు ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కొన్నిచోట్ల ఎమోషన్ పర్లేదనిపించింది.పూర్తి రివ్యూ: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ2022లో వచ్చిన 'సర్దార్' సినిమాకు సీక్వెల్ 'సర్దార్ 2'ని స్పై యాక్షన్ థ్రిల్లర్గా తీశారు. కార్తీ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నప్పటికీ మిగిలిన విషయాలు పెద్దగా అలరించలేదు. ఎస్జే సూర్య విలనిజం కాస్త బోర్ కొట్టించగా.. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ గ్లామర్ సరిపోలేదు. పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి భాగాన్ని తీసినంత ఎంగేజింగ్గా దీనిని తీయలేకపోయారు.పూర్తి రివ్యూ: ‘సర్దార్ 2’ మూవీ రివ్యూతెలుగు నటుడు సుహాస్ చేసిన తమిళ చిత్రం 'మండాడి'. సూరి హీరో కాగా సుహాస్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించాడు. సముద్రంలోని బోట్ రేసింగ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఇది తీశారు. తెరపై కష్టం బాగా కనిపించింది. కథాకథనాలు పర్లేదనిపించాయి. ప్రస్తుతానికైతే తెలుగులో ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ కనిపిస్తున్నాయి.పూర్తి రివ్యూ: మండాడి మూవీ రివ్యూసుమంత్ హీరోగా చేసిన డివోషనల్ థ్రిల్లర్ సినిమా 'మహేంద్ర గిరి వారాహి'. సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేశ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఓ ఊరు, రాజకుటుంబం, ఓ శాపం, 33 ఏళ్ల వయసొచ్చేసరికి రాజకుటుంబంలోని పురుషులు చనిపోవడం అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తీశారు. ఈ రహస్యం వెనకున్న నిజాన్ని బయటకు తీసే యూట్యూబర్గా సుమంత్ చేశాడు. ఈ మూవీ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.పూర్తి రివ్యూ: ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ -
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
'బేబి' సినిమాతో మూడేళ్ల క్రితం హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా మూవీ 'ఎపిక్'. గతంలో వచ్చిన #90స్ వెబ్ సిరీస్లోని పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయిన తర్వాత ప్రేమలో పడితే అనే స్టోరీతో దీన్ని తీశారు. నిన్న(సెప్టెంబరు 11) థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి చాలావరకు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం తొలిరోజు బాగానే వచ్చాయి.ఇదీ చదవండి: బిగ్బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన 'ఎపిక్' సినిమాకు తొలిరోజు(ప్రీమియర్లతో కలిపి) మన దేశంలో రూ.2.10 కోట్ల నెట్ వసూళ్లు రాగా ఓవర్సీస్తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్తో కలిపి మొత్తగా రూ. 5 కోట్ల వరకు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తొలిరోజు టాక్ నెగిటివ్గా ఉన్న నేపథ్యంలో వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది చూడాలి?పైచదువుల కోసం యూకే వెళ్లిన ఓ తెలంగాణ పల్లెటూరి కుర్రాడు.. ఓ మోడ్రన్ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే వాళ్లు ఎంతవరకు హద్దులు దాటేశారు. ఈ క్రమంలోనే ఏమేం తెలుసుకున్నారు? తదితర అంశాలతో ఈ సినిమా తీశారు. అయితే ఎమోషన్స్ గానీ అటు లవ్ యాంగిల్ గానీ సరిగా వర్కౌట్ కాలేదని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. మరికొందరు మాత్రం తమకు నచ్చిందని అంటున్నారు. ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మించారు.ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ -
రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు
భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన పురాణ గాథలకు సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ మరోసారి సరికొత్త రూపం ఇవ్వబోతోంది. ఒకప్పుడు ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి సీరియళ్లతో దేశ టీవీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన సాగర్ కుటుంబం.. ఇప్పుడు వెండితెరపై మరింత భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ పేరుతో లైవ్-యాక్షన్ సినిమాటిక్ సాగా రూపుదిద్దుకుంటోంది. మొత్తం ఏడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.శ్రీమద్భాగవత మహాపురాణం విస్తృతమైన కథా ప్రపంచాన్ని కలిగి ఉంది. ఇంతటి విస్తారమైన కథని ఒకే సినిమాలో చెప్పడం కంటే ఏడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను మరింత పెంచుతోంది. ‘విష్ణురథ’ ఈ ఏడు భాగాల ప్రయాణానికి తొలి అధ్యాయం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామానంద్ సాగర్ కుటుంబానికి చెందిన ఈ తదుపరి తరం దర్శకులు ఇప్పుడు కుటుంబ వారసత్వాన్ని కొత్త తరహా సినిమా భాషతో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించారు. -
నా ముఖమే అంతా.. 'ప్యారడైజ్' దర్శకుడి ట్వీట్
మరో రెండు వారాల్లో నాని హీరోగా చేసిన 'ప్యారడైజ్' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మార్చి, ఆగస్టు అని చెప్పి రెండుసార్లు వాయిదా పడింది. ఈసారి కూడా అలానే జరగొచ్చు అని పుకార్లు వస్తున్న నేపథ్యంలో హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టారు. రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో మరో ఆసక్తికర సంఘటన కూడా జరిగింది.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!'ప్యారడైజ్' సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. గతంలో ఇతడు నానితో 'దసరా' తీశాడు. ఇప్పుడు ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే ఎప్పుడు చూసినా గానీ శ్రీకాంత్ సీరియస్గా ఫేస్ పెట్టి కనిపిస్తుంటాడు. పెద్దగా నవ్విన సందర్భాలు కూడా లేవు. ఎవరో ఈ విషయమై కామెంట్ చేయగా.. దీనికి రిప్లై ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు. 'నా ముఖమే అంతా' అని ఓ మీమ్ ఫొటోని పోస్ట్ చేసి సమాధానమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.పీరియాడికల్ సినిమాగా తీసిన 'ప్యారడైజ్'లో ప్రధానంగా తల్లికొడుకుల ఎమోషన్ ఉండనుందని హీరో నాని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ట్రైలర్ లాంటిది ఏం లేకుండానే చిత్రం థియేటర్లలోకి రానుందని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అంచనాలు ఎక్కువగా ఉన్న ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? దీని తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవితో మూవీ కమిట్ అయ్యాడు.ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు😂♥️#TheParadiseWillRiseFromSept24 https://t.co/pw00Bli9v0 pic.twitter.com/Sb3obcARmG— Nani (@NameisNani) September 11, 2026 -
అమ్మతనం కెరీర్కి అడ్డంకి కాదు: పరిణితీ చోప్రా
‘‘తల్లయిన హీరోయిన్లకు గతంలో అవకాశాలు చాలా తక్కువగా వచ్చేవి. హీరోయిన్గా చాన్స్లు వచ్చేవి కాదు. కానీ, ప్రస్తుతం అలా కాదు... పెళ్లయ్యాక, తల్లయ్యాక కూడా కథానాయికల సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. నటించాలనే ఆసక్తి ఉన్నంతకాలం అమ్మతనం కెరీర్కు అడ్డంకిగా మారదు’’ అని పరిణితీ చోప్రా తెలిపారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘షఖ్: ట్రస్ట్ నో వన్’. ఈ నెల 24 నుంచి నెట్ ఫ్లిక్స్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా పరిణితీ చోప్రా మాట్లాడుతూ–‘‘పెళ్లి, పిల్లలు తర్వాత అవకాశాలు అందుకునే విషయంలో గతంలో ఒక తరం నటీమణులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తల్లయిన మహిళలను లీడ్ రోల్స్లో చూడడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. నాటి ప్రేక్షకులు, పరిశ్రమ ఆలోచనా విధానం వల్ల ఒక తరం నటీమణులు కెరీర్ను త్యాగం చేయాల్సి వచ్చింది. బిడ్డకు జన్మనివ్వడం జీవితంలో అందమైన విషయం. ఆ కారణం వల్ల పని కోల్పోవాల్సి వస్తే బాధగా ఉంటుంది. ఇప్పుడు తల్లులైన హీరోయిన్ల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుండటం వల్లే రచయితలు, దర్శకులు వారికి తగ్గ కథలను సిద్ధం చేస్తున్నారు. ఆలియా, దీపికా, ప్రియాంకా చోప్రా వంటి వారు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే కెరీర్ను ముందుకు తీసుకెళుతుండటం సంతోషం. నటిగా నేను కూడా ఒకే తరహా పాత్రలు కాకుండా నాకు సరిపోయే వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే... పొలిటీషియన్ రాఘవ్ చద్దాని 2023లో పరిణితి పెళ్లి చేసుకున్నారు. వీరికి నీర్ అనే కుమారుడు ఉన్నారు. -
పుట్టినరోజు ప్రత్యేకం
‘బింబిసార, సర్, విరూపాక్ష’ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరోయిన్ సంయుక్త. సెప్టెంబరు 11న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె నటిస్తున్న ఐదు సినిమాల అప్డేట్స్ని పంచుకున్నారు మేకర్స్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’లో సంయుక్త కథానాయికగా నటించారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ సెట్ ఫొటోలు విడుదల చేశారు. కాగా రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాపో 23’ (వర్కింగ్ టైటిల్). కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలియజేసింది యూనిట్. అదే విధంగా సంయుక్త లీడ్ రోల్లో యోగేష్ కేఎమ్సీ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్న ‘ది బ్లాక్గోల్డ్’ చిత్రంలోని కొత్త పోస్టర్, సంయుక్త నటిస్తున్న ‘స్వయంభు, హైందవ’ సినిమాల నుంచి కూడా పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్. -
ఒకప్పుడు స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలకే కాదు.. కొత్త హీరోలకు కూడా ఓ కొత్త ఇమేజ్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన సినిమా వస్తుందంటే కథ కంటే ముందు హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డైలాగులు ఎలా పేలబోతున్నాయి? అనే ఆసక్తి ఉండేది. ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘పోకిరి’, ‘బిజినెస్మ్యాన్’, ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మాస్ బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!పూర్వ వైభవం ఎప్పుడు వస్తుంది?ముఖ్యంగా మహేశ్బాబు కెరీర్లో ‘పోకిరి’, ‘బిజినెస్మ్యాన్’ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్తో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి మరోసారి మాస్ పల్స్ తనకు ఎంత బాగా తెలుసో చూపించారు. అయితే కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దీంతో పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఏంటి? మళ్లీ ఆయన పూర్వ వైభవం ఎప్పుడు వస్తుంది? అనే చర్చ మొదలైంది.మళ్లీ ఆ పూరి కనిపిస్తారా..?పూరి జగన్నాథ్ కెరీర్లో ఎత్తుపల్లాలు కొత్తేమీ కాదు. పూరి సినిమాలు వరుసగా కనిపించకపోవడంతో ఆయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్’ అనే యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారైనా పూరి పూర్వ వైభవం చూపిస్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..? -
15 ఏళ్లుగా మూసి ఉన్న భవనం.. ఆ రూమ్లో ఏం జరిగింది?
హారర్ సినిమాలంటేనే భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠ రేపే ట్విస్టులు గుర్తుకొస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో హారర్ జానర్లో సరికొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అలాంటి ఓ విభిన్నమైన హారర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘418’. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం మిస్టరీ, భయానక వాతావరణంతో ఆసక్తిని పెంచుతోంది.సెప్టెంబర్ 18న విడుదల..సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా.. వెంకీ జీజీ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ముందుగా జూలై 31న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదీ చదవండి: బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్లో భారీ నష్టం -
బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్లో భారీ నష్టం
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజైంది. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. అయితే ఆ జోరు ఒక్కరోజుకే పరిమితమైంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకోవడంతో ఈ సినిమా కలెక్షన్లు ఎంత రాబెట్టిందని ప్రస్తుతం అనే చర్చ జరుగుతోంది.తొలిరోజే రూ.100 కోట్లకు పైగా..ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ‘టాక్సిక్’ తొలి రోజే ఇండియాలో రూ.101 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.145 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఇండియాలో కేవలం రూ.37 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 10 నాటికి ‘టాక్సిక్’ ఇండియాలో రూ.247 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.339 కోట్లుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!భారీ నష్టాలు?‘టాక్సిక్’ సినిమా నిర్మాణానికి రూ.500 కోట్లకు పైగే ఖర్చయిందనే వార్తలు వచ్చాయి. కనీసం రూ.500 కోట్ల బడ్జెట్ను పరిగణనలోకి తీసుకున్నా.. ప్రస్తుత నెట్ వసూళ్లతో పోలిస్తే భారీగానే నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘టాక్సిక్’కు సంబంధించిన ప్రస్తుత ట్రేడ్ అంచనాలను పరిశీలిస్తే.. నష్టాల పరంగా ‘ఆదిపురుష్’ను కూడా అధిగమించినట్లు తెలుస్తోంది.కాగా ‘టాక్సిక్’లో యశ్తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విడుదలకు ముందే వివాదాలు, ఆసక్తికర ప్రచారం లభించాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, మహిళలను చూపించిన తీరు చర్చనీయాంశంగా మారాయి. సీబీఎఫ్సీ ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. -
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!
నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..?తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం..‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. -
‘ది ప్యారడైజ్’ రిలీజ్పై క్లారిటీ.. వైరల్గా నానీ వీడియో!
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాను సెప్టెంబరు 24న థియేటర్లలోకి తీసుకున్నట్టు చిత్రబృందం తెలిపింది. విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని ఇటీవలే మళ్లీ ప్రకటించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.హాయ్ నాన్న ప్రమోషన్స్లో..ఈ నేపథ్యంలో గతంలో ‘హాయ్ నాన్న’సినిమా ప్రమోషన్స్లో భాగంగా నానీ కేసీఆర్ స్టైల్లో మాట్లాడుతూ కాసేపు అలరించాడు. ఇప్పుడీ వీడయో ‘ది ప్యారడైజ్’ మూవీ ఎట్టి పరిస్థితిల్లో అనుకున్న సమయానికే వస్తుందని చెప్తూ అభిమానులు వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..‘తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉంది. అలాంటిది ఏం జరగదిక్కడ. సినిమా పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో అనుకున్న సమయానికే వస్తుంది. ఆ రోజు థియేటర్ల దగ్గర దావత్ చేసుకోవాలి’ అని నాని కేసీఆర్ స్టైల్లో చెప్పి నవ్వులు పూయించాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. Trailer cut has already been done and it is all set to air. The news of NO TRAILER is just a speculation. Team hasn't confirmed it yet either. #TheParadise pic.twitter.com/x04iEv8KAX— The Cine Gossips (@TheCineGossips) September 11, 2026 -
ఈ ఇద్దరి స్టార్ హీరోలు ఒకే స్కూల్.. ఎక్కడంటే..?
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్2. ఇటేవలే వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదల కావడంతో కార్తీ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తి చదువుకున్న స్కూల్ డేస్ కోసం ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఇద్దరూ చెన్నైలో..సూపర్స్టార్ మహేశ్ బాబు, కార్తి.. ఇద్దరూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలు . వీరికి కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల పరంగా వీరిద్దరి ప్రయాణం వేర్వేరు అయినా స్కూల్ డేస్ లో వీరిద్దరికీ మంచి అనుభందం ఉందని మీకు తెలుసా.. మహేశ్బాబు, కార్తీ ఇద్దరూ చెన్నైలోని సెయింట బేడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. ఆ టైంలో మహేశ్బాబుకి కార్తి రెండు సంవత్సరాల జూనియర్. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్మీడియాలో వార్తను తెగ వైరల్ చేస్తున్నారు. ( ‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?)కలిసి నటిస్తారా..ఇద్దరు స్టార్ హీరోలకు ఉన్న ఈ కామన్ కనెక్షన్ అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సినిమాల పరంగా కాకుండా బయట కూడా మంచి స్నేహితులు కావడంతో వీళ్లకాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..మహేశ్బాబు విషయానికి వస్తే.. దర్శకధీరుడు రాజమౌళి , సూపర్స్టార్ మహేశ్బాబు కాంబినేషన్లో తెరకెక్కుత్ను చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. . ప్రియంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా మహేశ్ బాబు.. రుద్ర, శ్రీరాముడిగా కనిపించనున్నాడు. 2027 ఏప్రిల్ 7 నాటికి థియేటర్లలతో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 80s నాటి లుక్స్తో ఉన్న ఫొటోలే కనిపిస్తున్నాయి. పాతకాలం నాటి హెయిర్స్టైల్, డ్రెస్సింగ్, ఫిల్మ్ కెమెరా లుక్తో తమ తమ ఫొటోలను మార్చుకుంటూ నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ అభిమాన హీరో, హీరోయిన్తో కలిసి పక్కపక్కనే ఉన్నట్లుగా ఫొటో క్రియేట్ చేసి అభిమానులు సోషల్మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఎంత సరదాగా ఉందో.. అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.APK ఫైల్స్ ఓపెన్ చేయద్దు.. కొంతమందికి ఈ ఫొటోలు ఎలా చేయాలో తెలియక ప్రామిట్ కోసం సోషల్మీడియాలోని వ్యక్తులను నమ్మివాళ్ల చేతిలో బలైపోతున్నారట. దీనికి కారణం సైబర్ నేరగాళ్లు పంపిన APK ఫైల్స్ ఓపెన్ చేయడమేనట. ఈ ట్రెడ్ క్రేజ్ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ( లోకేశ్ , అనిరుధ్కు అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా BMW కార్లు!)ఫొటో అప్లోడ్ చేసే ముందు ఇదీ చూడండి..AI టూల్స్లో ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు, అభిమాన హీరోల ఫోటోలు అని వచ్చిన ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు అవి నిజమా కాదా అని తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.‘1980ల ట్రెండ్ను ఫాలో అవుతున్న నెటిజన్లు సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అభిమాన హీరోల ఫొటోలని సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫేక్ యాప్స్, ఏపీకే ఫైళ్లను పంపిసూత మోసాలకు పాల్పడుతున్నారు. చాట్జీపీటీ పేరుతోనూ నకిలీ యాప్స్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాప్స్తో జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పద లింకులు తెరవకూడదు’ అని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: (బిగ్బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?) -
హెచ్పీవీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవగాహన
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ) ఆధ్వర్యంలో హెచ్పీవీ వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్ అవేర్నెస్ ఈవెంట్స్కు ఏఏఎఫ్ఏ మద్దతుగా నిలిచింది.3 లక్షల మందికి పైగా..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమం ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా యువతులకు చేరువైందని, సామాజిక బాధ్యత ఉన్న అల్లు అర్జున్ అభిమానులంతా సమష్టి కృషితో ఈ ఘనతను సాధించామనీ అభిమానులు పేర్కొన్నారు. గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులంతా ఒక్కటవడం చాలా ఆనందంగా ఉందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
హలో డార్లింగ్.. ప్రభాస్కి కేటీఆర్ 'ప్రాంక్ కాల్'
ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఊహించని ఫోన్ కాల్తో అవాక్కయ్యాడు. ఇది కూడా బీఆర్ఎస్ నేత కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చేసరికి కాస్త తికమక పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి ప్రాంక్ కాల్ గోల?మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 'ది అండర్ 18 వరల్డ్' అనే యూత్ టాక్ షో పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. అక్కడున్న పిల్లలు.. కేటీఆర్కు ఓ ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరారు. మీ వ్యక్తిగత మొబైల్ నుంచి ఎవరైనా స్టార్ హీరోకు కాల్ చేయాలని అడగ్గా.. ప్రభాస్కు కాల్ చేశారు. ప్రభాస్ కూడా వెంటనే స్పందించి 'గుడ్ ఈవెనింగ్ సార్' అని పలకరించారు. కానీ కేటీఆర్ బదులుగా పక్కనే కూర్చున్న ఒక పాప ఫోన్ అందుకుంది. చాలా అమాయకంగా నటిస్తూ.. "సార్, నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మొబైల్ దొరికింది. ఇందులో చూస్తే మీ నెంబర్ కనిపించింది.. ఇంతకీ నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా?" అని ప్రశ్నించింది.కేటీఆర్ నంబర్ నుంచి తనకు ఫోన్ రావడం, తీరా చూస్తే గుర్తుతెలియని చిన్నారి వాయిస్ వినిపించేసరికి ప్రభాస్కు ఏం అర్థం కాలేదు. దీంతో వెంటనే కాల్ కట్ చేసేశాడు. ప్రభాస్ రియాక్షన్ చూసి కేటీఆర్ సరదాగా నవ్వుతూ తలపట్టుకున్నారు. తర్వాత స్వయంగా కేటీఆర్ మళ్లీ ప్రభాస్కి కాల్ కలిపారు. ప్రభాస్ లైన్లోకి రాగానే అసలు విషయం చెప్పారు.తాను ‘ది అండర్ 18 వరల్డ్’ పాడ్కాస్ట్ షోలో ఉన్నానని, అక్కడున్న పిల్లల కోరిక మేరకు సరదాగా ఈ ప్రాంక్ చేశామని వివరించారు. అసలు విషయం తెలుసుకున్న ప్రభాస్ పగలబడి నవ్వుతూ వారితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.When kids pranked Prabhas from KTR’s phone, pretending they found it on the road! Too cute. 😀🥰#Prabhas #KTR #PrabhasFans pic.twitter.com/ib7FSWUmV9— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) September 11, 2026 -
‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సుమంత్.. చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంటాడు. ఒకప్పుడు పక్కా మాస్ కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అక్కినేని హీరో.. ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. కథలో కొత్తదనం, పాత్రలో వైవిధ్యం ఉంటేనే సినిమాకు ఓకే చెబుతున్న సుమంత్.. తాజాగా ‘మహేంద్రగిరి వారాహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐశ్వర్య రాజేష్, సిద్ధు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘మహేంద్రగిరి వారాహి’తో సుమంత్ ఈసారి ఎలాంటి అనుభూతిని అందించాడు? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మహేంద్రగిరి రాజవంశస్థులకు ఓ శాపం ఉంటుంది. ఆ వంశంలో పుట్టిన ప్రతి మగబిడ్డ 33వ పుట్టినరోజున మరణిస్తాడు. ఈ శాపం 200 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంటుంది. అలా 1993లో ఆ వంశంలో పుట్టిన రాజేంద్ర వర్మ(సిద్దు జొన్నలగడ్డ)మరణిస్తాడు. ఇక ఈ సారి రాజేంద్రవర్మ అల్లుడు, ఆ రాజవంశానికి వారసుడు నరేంద్ర వర్మ(వంశీ చాగంటి) కూడా మరణిస్తాడని పూజారులు చెప్తారు. కథలో ఇదో భాగం.. మరోవైపు హైదరాబాద్కు చెందిన యూట్యూబర్ సిద్ధు అలియాస్ సిద్ధార్థ్(సుమంత్)..దెయ్యాలు, దేవుళ్ల పేరుతో కొంతమంది జనాలను మోసం చేస్తున్నారనేది ఆధారాలతో బయటపెడుతుంటాడు. అతని పెరెంట్స్తో పాటు అన్నయ్య రాజీవ్(కమల్ కామరాజు) కూడా దేవుడిని నమ్ముతాడు. పెళ్లి దోషం పోయేందుకు మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఆలయంలో పూజలు చేయమని చెప్పడంతో, రాజీవ్ తన బర్త్డే రోజు ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో నరేంద్ర వర్మ కూడా ఆలయానికి వస్తాడు. మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో గుడి ముందే ఉండే దున్నపోతు ఇద్దరినీ పొడిచి చంపేస్తుంది. సరిగ్గా 33వ పుట్టిన రోజు నాడే ఇది జరుగుతుంది. తన అన్న మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు సిద్ధు. ఈ క్రమంలో మహేంద్రగిరి రాజవంశం శాపం వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. అదేంటి? రాజవంశస్తులకు శాపం ఉంటే.. రాజీవ్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అసలు 200 ఏళ్ల క్రితం ఆ శాపం ఎలా వచ్చింది? ఇప్పుడు జరుగుతున్న మరణాలకు నిజంగా అమ్మవారి శాపమే కారణమా లేదా దాని వెనుక ఎవరైనా ఉన్నారా? సిద్ధార్థ్ రీసెర్చ్లో తెలిసిన అసలు నిజాలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక వంశానికి అమ్మవారి శాపం అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ‘మురారి’. ఆ తర్వాత ఇలాంటి శాపాలు, దేవుడి కథతో చాలా సినిమాలే వచ్చాయి. `మహేంద్రగిరి వారాహి` కూడా అలాంటి కథే. రాజవంశానికి శాపం ఉండడంతో 33 ఏళ్లకే చనిపోవడం.. దీనికి వెనుక ఒక కారణం ఉండడం.. హీరో రీసెర్చ్ చేసి అసలు కారణం తెలుసుకోవడం..చివరకు శాప విమోచనం.. కథ సుఖాంతం.. ఇదే మహేంద్రగిరి వారాహి చిత్రం కథ. ఇలాంటి కథలను మంచి ట్విస్టులతో, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో తెరపై చూపిస్తే ఆసక్తి కలుగుతుంది. మహేంద్రగిరి వారాహిలో అది మిస్ అయింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో మాత్రం కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలోనే శాపం బ్యాక్స్టోరీ చెబుతారు. అది కథపై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ తర్వాత కథనం రొటీన్గానే సాగుతుంది. యూట్యూబర్గా హీరో పరిచయం.. దెయ్యాలు, దేవుడు లేడని చెబుతూ చేసే యూట్యూబ్ వీడియోలు.. ఇవన్నీ రొటీన్గానే సాగుతాయి. మహేంద్రగిరి రాజవంశస్తులు శాఫ విమోచనం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆసక్తికరంగా సాగుతాయి. హీరో ప్యామిలీ మహేంద్రగిరి ఆలయం వద్దకు వచ్చిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. చావుల వెనుక ఉన్న అసలు నిజాన్ని కనుక్కునేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషనే సెకండాఫ్ కథ. ఫస్టాఫ్తో పోలిస్తే ద్వితియార్థం కొంత ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని సీన్లు థ్రిల్లింగ్గా ఉంటాయి. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. అమ్మవారి సంబంధించిన సీన్లు బాగుంటాయి. అయితే స్క్రీన్ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. సిద్ధార్థ్ పాత్రకి సుమంత్ న్యాయం చేశాడు. ఫస్టాప్లో నార్మల్ యూట్యూబర్గా కనిపించడంతో అతని పాత్ర అంత ఇంపాక్ట్ చూపదు. కానీ సెండాఫ్లో మాత్రం బాగా నటించాడు.అయితే ఇప్పటికే ఆయన ఈ తరహా పాత్రలు చేయడంతో కొత్తగా అనిపించదు. ఇక రాజేంద్ర వర్మగా సిద్ధు జొన్నలగడ్డ తెరపై కాసేపు కనిపించి మెప్పించాడు. ఐశ్వర్య రాజేష్ పాత్ర కాసేపు సర్ప్రైజ్ చేస్తుంది. కమల్ కామరాజు పాత్ర నిడివి కూడా తక్కువే. పూజారి పాత్రకి బ్రహ్మానందం న్యాయం చేశాడు. ఆయన పాత్ర ఇచ్చే ట్విస్టు ఆకట్టుకుంటుంది. రాజీవ్ కనకాల మంజు భార్గవి, మీనాక్షి గోస్వామితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అనూప్ రూబెన్స్ పాటలు, నేపథ్య సంగీతం ఓకే.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఎపిక్నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి తదితరులుదర్శకత్వం: ఆదిత్య హాసన్సంగీతం: హేషమ్ వాహబ్సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్నిర్మాత: నాగవంశీవిడుదల తేదీ: 2026 సెప్టెంబరు 11‘బేబీ’తర్వాత ఇటు వైష్ణవి చైతన్య, అటు ఆనంద్ దేవరకొండ ఇద్దరూ బీజీ అయిపోయారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకోలేకపోయారు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఇద్దరు కలిసి జంటగా ‘ఎపిక్’ మూవీలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో నేడు(సెప్టెంబర్ 11 ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే?ఓటీటీలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన ‘#90స్’వెబ్ సిరీస్ లోని తమ్ముడు పాత్ర జీవితానికి సంబంధించిన కథ ఇది. ఆదిత్య(ఆనంద్ దేవరకొండ) పెద్దయ్యాక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అయితే ఇంట్లో వాళ్లు మాత్రం పైచదువుల కోసం లండన్ వెళ్లాలని ఒత్తిడి చేస్తారు. ప్లాన్ బిలో భాగంగా ఆదిత్య లండన్ వెళ్తాడు. అక్కడ కాలేజీలో తెలుగమ్మాయి కడలి(వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. తొలి రోజే ఇద్దరూ బాగా దగ్గరవుతారు. ప్రేమ, పెళ్లి వద్దనుకొని సహజీవనం ప్రారంభిస్తారు. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు ఉన్న వీరి సహజీవనం ఎలా కొనసాగింది? పెళ్లి వద్దనుకొని లండన్ వచ్చిన కడలి.. ఆదిత్యతో బంధాన్ని ఎలా సాగించింది? వీరి బంధం సహజీవనానికే పరిమితం అయిందా లేదా ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిందా? ప్రతి విషయంలోనూ ఇతరులపై ఆధారపడే ఆదిత్య.. ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?కొన్ని సినిమా కథలు చాలా సింపుల్గా ఉంటాయి కానీ తెరపై చూస్తుంటే మాత్రం ఎంటర్టైన్ అవుతాం. ఎపిక్ కూడా అలాంటి సినిమానే. ఒక యువకుడు హైదరాబాద్ నుంచి యూకే వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది ఈ సినిమా కథ. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ పాయింట్ యూత్తో యూత్ని ఆకట్టుకునేలా సినిమా తీయొచ్చు. ఆదిత్య హాసన్ అదే చేశాడు. యువతరానికి నచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అవి వర్కౌట్ అయ్యాయి కానీ మిగతా చోట్ల చాలా వరకు రొటీన్గా, లాజిక్లెస్గా అనిపిస్తాయి. కడలి పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా సరిగా లేదు. మొదట్లో ఆ పాత్రను చాలా మెచ్యూర్డ్గా పరిచయం చేసి ఆ తర్వాత సాధారణ అమ్మాయిలాగే చూపించారు. ఆమె నేపథ్యం ఒకలా.. లండన్లో ఆమె ప్రవర్తించే తీరు మరోలా ఉంటుంది. ఆదిత్య, కడలి మధ్య ఉన్న బంధం ప్రేమేనా లేదా ఇంకా వేరేదా అనేది క్లారిటీ ఉండదు. పరిచయం అయిన తొలి రోజే కడలి మెచ్యూర్డ్ అమ్మాయి..ఆదిత్య రూమ్కి వెళ్లడం..ముద్దులు పెట్టుకోవడం..ఆ తర్వాత వెంటనే హద్దులు దాటడం అనేది కన్విన్సింగ్గా అనిపించదు. అయితే ఆయా సన్నివేశాలు మాత్రం యూత్ని బాగా ఆకట్టుకుంటాయి. అలా అని దర్శకుడు తెరపై రొమాన్స్ మాత్రమే చూపించలేదు. సింపుల్ కథే అయినా అందులో చాలా మంచి విషయాలు చర్చించాడు కూడా. ప్రస్తుతం సమాజంలో ఉన్న కులాల పట్టింపు, అమ్మాయిల ఎదుర్కొనే శారీరక సమస్యలు..లాంటి అంశాలను పైపైన చూపిస్తూనే ఆలోచింపజేశాడు.ఫస్టాఫ్ మొత్తం ఫుల్ రొమాంటిక్గా, యూత్ని ఆకట్టుకునే సన్నివేశాలతో కొనసాగతుంది. ఆదిత్య, కడలి పరిచయం అవ్వడం.. సహజీవనం కొనసాగించడం.. మధ్య మధ్యలో మిడిల్ క్లాస్ కష్టాలను చూపిస్తూ ప్రథమార్థం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. ఇద్దరి సహజీవనం కాస్త ప్రేమగా మారడం..ఆదిత్య గందరగోళానికి లోనై స్నేహితుడితో మాట్లాడడం.. అతను చెప్పినట్లుగా ఫాలో అవ్వడం ఇలా కథ మొత్తం అక్కడక్కడే తిరుగుతుంది. దీంతో సెకండాఫ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ముగింపు కూడా గొప్పగా ఉండదు.ఎవరెలా చేశారు?ఇక నటన విషయానికి వస్తే ఆనంద్, వైష్ణవి అనగానే 'బేబి' సినిమా గుర్తొస్తుంది. ఆ ఇమేజ్ నుంచి బయటపడి కొత్తగా కనిపించారు. ఆనంద్ తన పాత్రలో సహజంగా అనిపించగా, వైష్ణవి మోడ్రన్ అమ్మాయి పాత్రలో కాన్ఫిడెంట్గా నటించింది. శివాజీ, వాసుకి తమ పాత్రలకు న్యాయం చేశారు. కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి అక్కడక్కడా నవ్వించారు. సాంకేతిక అంశాలకొస్తే హేషమ్ అబ్దుల్ వాహబ్ నేపథ్య సంగీతం బాగుంది. అజీమ్ మహమ్మద్ కెమెరా పనితనం, యూకే లొకేషన్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. నిర్మాణ విలువలు అదిరిపోయాయనని చెప్పొచ్చు.-అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
పిల్లలు లేకపోయినా పర్లేదనుకున్నాం.. కానీ
సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి, పిల్లల్ని కనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కెరీర్ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఈ విషయాల్ని కాస్త ఆలస్యంగానే ప్లాన్ చేస్తుంటారు. అయితే తన ప్రెగ్నెన్సీ మాత్రం అనుకోకుండానే జరిగిందని హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదంతా బయటపెట్టింది.'నాకు ప్రెగ్నెన్సీ రావడం పెద్ద సర్ప్రైజ్. గర్భం దాలుస్తానని అస్సలు ఊహించలేదు. మా ఇంటి బంగారం సినిమాలోని తస్సాదియ్యా పాట షూటింగ్ చేస్తున్న టైంలో నాకు కాస్త నీరసంగా అనిపించింది. డాక్టర్ దగ్గరకెళ్తే నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే నేను,రాజ్.. పిల్లల కోసం ప్లాన్ చేయలేదు. పెళ్లికి ముందే ఈ సంగతి మాట్లాడుకున్నాం''ఒకానొక టైంలో నేను, రాజ్ ఇద్దరం పిల్లలు లేకపోయినా పర్లేదని అనుకున్నాం. నాకు ఓకే. రాజ్ కూడా ఓకే అని అన్నాడు. కానీ ఇలా ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకోలేదు. ఇది నాకు ఆశ్చర్యకరమైన విషయం' అని సామ్ చెప్పుకొచ్చింది. మగ-ఆడబిడ్డ ఎవరు పుట్టినా సరే వాళ్ల కోసం షాపింగ్ చేసేసింది. ఏం పేరు పెట్టాలనేది కూడా ముందే నిర్ణయించుకున్నామని కూడా సమంత చెప్పింది.గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. గతేడాది డిసెంబరులో 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడిమోరుని వివాహం చేసుకుంది. ఈ ఏడాది 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని అందుకుంది. దీని రిలీజ్ టైంలో సామ్ ప్రెగ్నెంట్ అయిందనే సంగతి బయటకొచ్చింది. ఈ డిసెంబరులోనే బిడ్డ పుట్టే అవకాశముందని తెలుస్తోంది. -
మాస్ ధమ్
శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘చకోర’. దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో డా. చింతాడ హేమారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రసంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ధమ్ ధమ్... అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా మెహర్ బాబా కొరియోగ్రఫీ చేశారు. అభిఖ్య తనికెళ్ళ ఈ పాటను పాడారు. ‘‘ఈ మాస్ సాంగ్ యువతను ఊర్రూతలూగించేలా ఉంది’’ అని పాటను విడుదల చేసిన సంగీతదర్శకుడు జీవీ ప్రకాష్కుమార్ అన్నారు. అక్టోబరు 8న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
భావోద్వేగాల కళ్యాణం కమనీయం
ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి డైరెక్టర్ వీవీ వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘కళ్యాణం కమనీయం జీవితం’ సినిమా చిన్నదే గానీ తీసిన వాళ్లు చిన్నవాళ్లు కాదు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి’’ అన్నారు పైలా ప్రసాద్ రావు. ‘‘ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించిన క్లీన్ మూవీ ఇది’’ అని కిషోర్ గుండాల పేర్కొన్నారు. ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అని రవి లోకిరెడ్డి తెలిపారు. -
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
‘‘కెరీర్లో యావరేజ్ సినిమాలు, హిట్స్, ఫ్లాప్స్... ఇలా చాలా ఉంటాయి. కానీ...‘ఇరుముడి’ సినిమా యాక్టర్గా నాకు విపరీతమైన సంతృప్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సోల్ జీవీ ప్రకాష్ మ్యూజిక్. నిర్మాత నవీన్ ప్రతిరోజూ ఫోన్ చేసి, కలెక్షన్స్ చెబుతుండేవారు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వారి సంతోషాన్ని నాతో పంచుకునేవారు’’ అని రవితేజ అన్నారు. రవితేజ హీరోగా నటించిన సినిమా ‘ఇరుముడి’. ప్రియా భవానీశంకర్ హీరోయిన్ గా నటించగా, సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం గత నెల 21న విడుదలైంది. గురువారం జరిగిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఇరుముడి’ సినిమా అంటే శివ నిర్వాణ. ఆయనకు ఈ సక్సెస్ క్రెడిట్ దక్కుతుంది. మా అమ్మాయి మోక్షు అండ్ టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పారు. శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘రవన్నగారితో సినిమా అంటే... దర్శకులు అనిల్, బాబీ, గోపీచంద్గార్లు గుర్తుకు వస్తారు. రవన్న డైరెక్టర్స్ లీగ్లో నేను చేరడం హ్యాపీగా ఉంది. నా భార్య భాగ్య ఈ సినిమా విషయంలో మీకు ఏది నచ్చితే అది చేయమని చెప్పింది. అదే చేశాను. ఈ సినిమాతో భరించలేనంత సంతోషాన్ని నా హార్ట్ తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి ఓ పెద్దావిడ ఒంటరిగా ఈ ‘ఇరుముడి’ సినిమా చూసేందుకు థియేటర్స్కు వెళ్లారు. ఆ వీడియోను రవన్నకు పంపాను. తెలుగు రాష్ట్రాలు మా ‘ఇరుముడి’ని ఓన్ చేసుకున్నాయి. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సంతోషంగా ఉండాలనే సినిమాలు తీస్తాను’’ అని అన్నారు.నవీన్ ఎర్నేని మాట్లాడుతూ – ‘‘ఇరుముడి’ నిర్మించే అవకాశం మాకు లభించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. సినిమాకు పూనకం వస్తే బ్లాక్బస్టర్ అని, ఆడియన్స్ కు పూనకం వస్తే ‘ఇరుముడి’ సినిమా అని నా స్నేహితుడు ఒకరు నాతో అన్నారు’’ అని చెప్పారు.వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు–సాంకేతిక నిపుణులు మా మైత్రీ ఫ్యామిలీలో యాడ్ అయ్యారు. ‘ఇరుముడి’ మా బ్యానర్లో కీరిటం లాంటిది. ఈ కీరిటంలో రవన్న, శివ నిర్వాణ వంటి వజ్రాలు ఉన్నాయి’’ అని చెప్పారు.ఈ వేడుకలో ‘ఇరుముడి’ టీమ్కి చెందిన సాయికుమార్, నక్షత్ర, జీవీ ప్రకాష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూనిట్ సభ్యులకు షీల్డులను ప్రదానం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ‘ఇరుముడి’ ఘనవిజయం పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు. దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, రచయిత బీవీఎస్ రవి, రచయిత–దర్శక–నిర్మాత కోన వెంకట్, నిర్మాత సాహు గారపాటి ‘ఇరుముడి’ ఘనవిజయం సాధించినందుకు యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. -
వృషకర్మ ఫిక్స్
నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘‘మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో నాగ చైతన్య వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాథ్, కెమెరా: రాగుల్ హెరియన్. -
భలే మంచి పని చేశావ్ తారా..!
సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా అభిమానుల తాకిడి ఉంటుందని తెలిసిందే. అందులోనూ ప్రత్యేకించి సినిమా హీరో, హీరోయిన్లు అయితే ఫ్యాన్స్ జోష్ మామూలుగా ఉండదు. ఇక వారు ఎక్కడికి వెళ్లినా కవర్ చేసేందుకు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పోటీ పడుతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు మొబైల్ ఫోన్లతో సెలబ్రిటీల వీడియోలు తీసేందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు... సెలబ్రిటీ కారు దిగింది మొదలు లోపలికి వెళ్లి, తిరిగి కారు ఎక్కేవరకు వారిని వెంబడిస్తుంటారు. ఇలాంటి వ్యవహారాలు ఒక్కోసారి సెలబ్రిటీలకు విసుగు పుట్టిస్తుంటాయి. తాజాగా హీరోయిన్ తారా సుతారియాకి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే... తారా సుతారియా ముంబైలోని బాంద్రాలో ఓ ప్రదేశానికి వెళుతుండగా ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. లోపలికి వెళుతుండగా మొబైల్ ఫోన్ పట్టుకుని అతి సమీపంలోకి వచ్చి వీడియో తీస్తున్న ఓ వ్యక్తి ఫోన్ను పక్కకు నెట్టేసి, లోపలికి వెళ్లారామె. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తారా సుతారియా తన వ్యక్తిగత భద్రతను కాపాడుకోవడానికి తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అంటూ పలువురు నెటిజన్లు తమ కామెంట్స్తో ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ‘‘భలే మంచి పని చేశావ్ తారా... ఇలా మీద మీదకు వచ్చి ముఖానికి దగ్గరగా ఫోన్ పెట్టి, ఫొటో తీయడం ఏ మాత్రం సరికాదు’’ అంటూ కామెంట్స్ షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే... ఇటీవల విడుదలైన ‘టాక్సిక్’లో కీలక పాత్ర చేసిన తారా సుతారియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. -
తొలిసారి కొడుకు ఫొటో రివీల్ చేసిన వరుణ్ తేజ్, లావణ్య
టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడు వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి సోషల్ మీడియాలో పంచుకున్నారు. వాయువ్ తొలి పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటోను షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2025 సెప్టెంబర్లో వరుణ్–లావణ్య దంపతులకు కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. అనంతరం తమ బిడ్డకు ‘వాయువ్ తేజ్’ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు.కుమారుడి ఫొటోను షేర్ చేసిన వరుణ్ తేజ్.. “నా ప్రపంచాన్నే మార్చేశావు” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ‘నా ప్రియమైన వాయువ్ తేజ్.. నా ప్రపంచాన్ని సాధ్యమైనంత అందంగా మార్చేశావు. నిన్ను తొలిసారి కళ్లారా చూడకముందే నీతో ప్రేమలో పడిపోయాను. నీ తండ్రిగా ఉండటం నా జీవితంలోనే అత్యంత అందమైన విషయం’ అంటూ వరుణ్ తేజ్ భావోద్వేగ పోస్ట్ చేశాడు.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారి 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని ప్రైవేట్గా ఉంచిన ఈ జంట 2023లోకుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇదీ చదవండి: ‘డిసి’ సక్సెస్.. లోకేశ్, అనిరుధ్లకు ఖరీదైన గిఫ్ట్స్ My dear boy, you changed my world in the best way possible. I fell in love with you even before I laid my eyes on you for the first time. Being your father is the most beautiful part of my life.Happy 1st birthday, Vaayuv.I love you, always.❤️😘 pic.twitter.com/nUfXCuBJXF— Varun Tej Konidela (@IAmVarunTej) September 10, 2026 -
‘విద్యార్థులపై ఒత్తిడి నివారణే లక్ష్యం’
హైదరాబాద్లో ‘జై గౌరీపుత్ర గణేశా’ చిత్రబృందం సందడి చేసింది. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ను హైదరాబాద్లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రీవ్యూ హాల్లో ఘనంగా విడుదల చేసింది. విద్యార్థులపై పెరుగుతున్న విద్యా ఒత్తిడి, దాని కారణంగా ఎదురవుతున్న మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణ వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది.చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్లో విద్యార్థుల జీవితాల్లో ఎదురయ్యే ఒత్తిడి, మానసిక సంఘర్షణలను చూపించడంతో పాటు వాటి నుంచి బయటపడేందుకు అవసరమైన సందేశాన్ని అందించేలా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. -
సెప్టెంబర్ 18న థియేటర్లలోకి ‘మిస్సింగ్ మేఘన’
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.ఫస్ట్ కాపీ మూవీస్, కేడీ అండ్ కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ధృవన్ సంగీతం అందిస్తున్నారు. కాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ను డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేశారు. -
‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్స్గా రానున్న ‘హనుమాన్ అంశ్2’, ‘హనుమాన్ అంశ్3’పై ఆసక్తి పెరిగింది. పార్ట్2లో పలువురు ప్రముఖులు నటించనున్నారని వస్తున్న వార్తలపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ పేర్లు తెరపైకి వచ్చాయి.నిర్మాత ఏమన్నారంటే..‘హనుమాన్ అంశ్2’లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అతిథి పాత్రల్లో కనిపిస్తారా? అనే ప్రశ్నకు నిర్మాత నమ్రతా సింగ్ ఆసక్తికరంగా స్పందించారు. కొందరు సెలబ్రిటీలను ఇప్పటికే సంప్రదించినట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికే పార్ట్2 కథ పలువరి సెలబ్రిటీలకు తెలుసునని తెలిపారు. అయితే విరాట్, అనుష్క ఇద్దరూ సినిమాలో నటించేందుకు అంగీకరించారా లేదా అని మాత్రం ఆమె స్పష్టంగా తెలపలేదు.చదవండి: సమంత ఎంగేజ్మెంట్ రింగ్ ఇంత ఖరీదా..? డిజైనర్ ఎవరంటే.?కాగా విరాట్-అనుష్కలకు నీమ్ కరోలి బాబాపై ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట పలు సందర్భాల్లో కైంచీ ధామ్ను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే ‘హనుమాన్ అంశ్’లో వీరిద్దరినీ భాగం చేయాలనే ఆలోచన ఆసక్తిని కలిగిస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మూడు భాగాలుగా..ఇక ‘హనుమాన్ అంశ్’ను మొదటి నుంచే మూడు భాగాలుగా తెరకెక్కించాలని భావించినట్లు నిర్మాత తెలిపారు. ‘తొలి భాగంలో నీమ్ కరోలి బాబా ప్రారంభ జీవితం నుంచి కైంచీ ధామ్( ఆధ్యాత్మిక ఆశ్రమం) వరకు చూపించాం. రెండో భాగం కైంచీ ధామ్, అక్కడి భారతీయ భక్తుల కథలపై తెరకెక్కిస్తాం. మూడో భాగంలో బాబా ఆధ్యాత్మిక ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందనే అంశాన్ని చూపించబోతున్నాం’ అని తెలిపారు. అయితే విరాట్-అనుష్కలు ఇందులో కనిపిస్తారా? లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది.ఇదీ చదవండి: బిగ్బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా? -
వీళ్ల ఎంగేజ్మెంట్ రింగ్ ఇంత ఖరీదా..? డిజైనర్ ఎవరంటే.?
సమంత కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇస్తూ.. తన ప్రగ్నెన్సీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ అభిమానులతో పంచుకుంటూ ఏదో సందర్భంలో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’తో మాట్లాడిన సమంత.. తన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. దీంతో సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో సమంత ధరించిన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఎక్కువ మంది చదివింది: బిగ్బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?‘ఈ రింగ్ ఎంపికలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మొత్తం రాజ్ చూసుకున్నాడు. ఆయన్నే అడగాలి. రాజ్ ప్రపోజ్ చేసిన సమయంలోనే తొలిసారి ఆ రింగ్ను చూశాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఉంగరాన్ని గ్రీస్కు చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్ రూపొందించారని మాత్రం నాకు తెలుసు. అని సమంత తెలిపింది. అయితే దీనిని ఏథెన్స్కు చెందిన థియోడోరోస్ సవోపౌలోస్ రూపొందించినట్లు తెలుస్తోంది. సమంత రింగ్ ధరించిన ఫొటోను ఆయన కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.విలువ ఎంతంటే..అయితే ఇప్పుడు ఆ రింగ్ ఖరీదు ఎంత ఉంటుందనే చర్చ. లొజెంజ్ కట్ డైమండ్తో రూపొందించిన ఈ రింగ్ విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందట. ఇందులో ఎనిమిది పోర్ట్రెయిట్ కట్ వజ్రాలు పూల రేకుల మాదిరిగా అమర్చినట్లు తెలుస్తోంది. అయితే పోర్ట్రెయిట్ కట్ వజ్రాలకు భారతీయ ఆభరణాల చరిత్రతోనూ మంచి అనుబంధం ఉంది. మొఘల్ కాలంలో ఈ తరహా డిజైన్లు దొరికేవని చెబుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి అరుదైన డిజైన్లను రూపొందించేవారి సంఖ్య కూడా తక్కువేనట. కాగా సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇదీ చదవండి: హీరోయిన్ ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక -
బిగ్బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?
బిగ్బాస్ తెలుగు 10లో కామనర్గా అడుగుపెట్ని షాలిని తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతకముందు ‘అగ్నిపరీక్ష2’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టి తన మాటలతో ఆట తీరుతో మెప్పిస్తోంది. అయితే ఎప్పుడూ యాక్టివ్గా, కానిఫడెంట్గా కనిపించే షాలిని జీవితంలో ఓ విషాద కథ ఉన్నట్లు మీలో ఎంతమందికి తెలుసు..? ఆమె జీవతంలో జరిగిన కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవే ఏంటో తెలుసుకుందాం రండి!ఇదీ చదవండి: Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్లో ప్రచారం.. కంటెస్టెంట్పై ఫిర్యాదు8 ఏళ్ల వయసులోనే తల్లి మృతి..షాలిని తన వ్యక్తిగత జీవితం గురించా మాట్లాడుతూ.. ‘8ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు తండ్రి కూడా మృతి చెందారు. చిన్నతనంలోనే ఇలా జరగడంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఈ విషయాన్ని అగ్ని పరీక్షలో పాల్గొన్న చెప్పాలని అనిపించలేదు. ఎందుకంటే ఈవిషయాలన్నీ చెప్పా ప్రేక్షకుల నుంచి సానుభూతి పొందడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు’ అని షాలిని తెలిపారు.కామనర్గా బిగ్బాస్లోకి..సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే షాలిని రీల్స్, ఫొటోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బిగ్బాస్ అగ్నిపరీక్ష 2’లో పాల్గొని తన ఆట తీరుతో మెయిన్ షోకు అర్హత సాధించింది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్బాస్ తెలుగు 10లో కామనర్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో షాలిని గేమ్పై ఆసక్తి పెరుగుతోంది. అగ్నిపరీక్షలో తనపై వచ్చిన అభిప్రాయాలను దాటి.. బిగ్బాస్ 10లో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదీ చదవండి: ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక.. -
ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక..
కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టి వరుస అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆషిక రంగనాథ్. గ్లామర్తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పుడు తమిళం, తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ప్రస్తుతం సర్ధార్2 సినిమాతో అటు తమిళ ప్రేక్షకులకూ, ఇటు తెలుగు వారికీ పలకరించింది. మరి సినిమా అవకాశాలపై ఆమె మనసులో మాట ఏంటో తెలుసా? ఆమె మాటల్లోనే..ఇదీ చదవండి: ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‘ హీరోయిన్గా అవకాశాలు రావడం ఒక ఎత్తైతే వచ్చిన ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపంచాలనేదే నా కోరిక. స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కంటే.. తన ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెరవడం ముఖ్యం. అందుకే కథ విన్నప్పుడు పాత్ర ఎలా ఉంటుంది?. ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అని పరిశీలించిన తర్వాతే సినిమాలకు ఓకే చెప్తా.చిత్ర సీమలో అడుగుపెట్టిన 2నుంచి 3 సంవత్సరాలకే తెలుగులో అవకాశాలు వచ్చాయి. కానీ అప్పుడు అంత ఐడియా లేదు. ఇవి మంచి ప్రాజెక్ట్లా కాదా అని. అందువల్లే కొంచం లేట్ అయింది. 2023లో వచ్చిన అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను.తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనేదే నా కోరిక. మంచి కథలు, బలమైన పాత్రలు వస్తే భాషతో సంబంధం లేకుండా నటించేందుకు సిద్ధం. హీరోయిన్ కేవలం అందంతో కాకుండా నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలనేదే లక్ష్యం. (బిగ్బాస్లో హైరిస్క్ టెన్షన్.. వేడెక్కిన వాతావరణం..)సర్దార్2 నా కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. చాలా మంది హీరోలతో చేసనప్పటికీ కార్తీ సార్తో కలిసి పనిచేయడం మంచి అనుభం. సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం తెరపై కనిపిస్తాయి. తెలుగులో నాకు నచ్చిన చిత్రాల్లో అలా వైకంఠపురం, సీతారామం సినిమాలు ఇష్టం. ఈ చిత్రాల్లో సాంగ్స్ ఇప్పటికీ ఇంట్లో వింటుంటాను.‘ అని ఆషిక గతంలో పలు ఇంటర్వ్యులో తెలిపారు. ఇదీ చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
బిగ్బాస్లో హైరిస్క్ టెన్షన్.. వేడెక్కిన వాతావరణం..
బిగ్బాస్ ఇంట్లో మరోసారి హైరిస్క్ టెన్షన్ మొదలైంది. మహాపరీక్షలో భాగంగా రోహిత్, టెంపర్ వంశీ, ముకేశ్, త్రిగుణ్లకు బిగ్బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో విజయం సాధించిన ఇద్దరికి హౌస్మేట్గా మారే అవకాశం కల్పించడంతో పాటు.. హైరిస్క్ జోన్లోకి ఒకరిని పంపాల్సి ఉంటుందని చెప్పాడు.విజయం కోసం ఒకరిని హైరిస్క్లోకి పంపే వ్యక్తి పేరును ఇచ్చిన స్లాట్లో సరిగ్గా అమర్చాలని బిగ్బాస్ సూచించాడు. ఈ టాస్క్లో ముకేశ్, త్రిగుణ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ కృష్ణుడిని హైరిస్క్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే కృష్ణుడు పేరును అసంపూర్తిగా అమర్చడంతో.. ఆ పేరును పరిగణనలోకి తీసుకోబోమని బిగ్బాస్ స్పష్టం చేశాడు. ఇదీ చదవండి: విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!మరోవైపు రోహిత్, వంశీలు చైత్ర పేరును హైరిస్క్ కోసం సూచించారు. ఇదే సమయంలో షాలినీ డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం హౌస్లో కొత్త వివాదానికి దారితీసింది. చైత్రను హైరిస్క్లోకి నెట్టినందుకే షాలినీ ఇలా సంబరాలు చేసుకుంటోందంటూ బ్లూ టీమ్ సభ్యులు ఆమెతో వాదించారు.దీంతో చైత్ర, షాలినీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా స్పందించడంతో హౌస్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ గొడవ ఎక్కడివరకు వెళ్లిందనేది ఎపిసోడ్లో ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
‘సర్దార్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సర్దార్ 2నటీనటులు: కార్తి, ఎస్.జే. సూర్య, మాళవిక మోహన్, ఆశికా రంగనాథ్, యోగిబాబు, రజిషా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్నిర్మాత: ఎస్. లక్ష్మణ్ కుమార్దర్శకత్వం: పీఎస్ మిత్రన్సంగీతం: సామ్ సి.ఎస్ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టివిడుదల తేది: సెప్టెంబర్ 10, 2026కార్తి..పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం మనవాడిగానే చూస్తారు. ఊపిరి, సత్యం సుందరం లాంటి చిత్రాలతో ఆయనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఆయన చిత్రాలన్నీ ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం సర్దార్ 2. 2022లో వచ్చిన బ్లాక్ బస్టక్ మూవీ ‘సర్దార్’కి కొనసాగింపు ఇది.నేడు(సెప్టెంబర్ 10) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ‘సర్దార్’ముంగింపే ఈ చిత్రానికి ప్రారంభం. ఇన్స్పెక్టర్ నుంచి రా ఏజెంట్గా మారిన విజయ్ ప్రకాశ్(కార్తి).. రా చీఫ్ మనోజ్ బొమ్మై (ఆశిష్ విద్యార్థి)కి తెలియకుండా ఓ రహస్య ఆపరేషన్ చేపడతాడు. అందులో భాగంగా మాజీ రా ఏజెంట్ వాల్రస్ (అచ్యుత్ కుమార్)ని కలుస్తారు. అయితే అప్పటికే ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ బ్లాక్ డగ్గర్ (ఎస్.జె.సూర్య) మనుషులను అతనిపై దాడి చేస్తారు. చనిపోయే ముందు , విజయ్ కు తన దగ్గర ఉన్న ఓ 'కీ'ని ఇస్తాడు. అలాంటి మరో కీని మరో రా ఏజెంట్ (మాళవిక మోహనన్) తన కూతురు ఫైజా (ఆషిష్ రంగనాథ్)కు ఇస్తుంది. డి.ఆర్.డి.వో. ఛీఫ్ టైగర్ హరిశ్చంద్ర (బాబు ఆంటోనీ) దగ్గర ఇంకో కీ ఉందదే విషయం తెలుస్తుంది. దానిని సంపాదిస్తే.. ఓ భారీ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని రక్షించొచ్చు అని విజయ్ భావిస్తాడు.(చదవండి: మండాడి మూవీ రివ్యూ)అయితే విజయ్ కంటే ముందే బ్లాక్ డగ్గర్ ఆ 'కీ'ని సొంతం చేసుకుని, ఈ దేశాన్ని నాశనం చేయడానికి సిద్థమవుతాడు. సరిగ్గా అదే సమయంలో రంగంలోకి దిగుతాడు సర్దార్(కార్తి). ప్రభుత్వం దృష్టిలో చైనాలో చనిపోయిన సర్ధార్ తిరిగి ఎలా వచ్చాడు? బ్లాక్ డగ్గర్ మిషన్ ఏంటి? మూడు ‘కీ’ల వెనుక ఉన్న రహస్య కథేంటి? బ్లాక్ దగ్గర్ మిషన్ని అడ్డుకునేందుకు తన కొడుకు విజయ్తో కలిసి సర్దార్ చేసిన సాహసాలేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘సర్దార్’లో నీటి సమస్యను, వన్లైన్ పైప్లైన్ ప్రాజెక్ట్ ద్వారా జరిగే కుట్రను చూపించిన దర్శకుడు.. సీక్వెల్లో యాంటి బయాటిక్ మందుల్ని మితిమీరి వాడటం వల్ల జరగబోయే అనర్థాల్ని చూపించాడు. అయితే పార్ట్ 1 మాదిరి ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో మాత్రం దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. కథ, కథనం రొటీన్గా ఉంటూ.. చాలా వరకు సర్దార్ సినిమాతో పాటు పలు స్పె యాక్షన్ సినిమాలను గుర్తుకు చేస్తాయి. తర్వాత ఏ జరుగుతుందన్న ఉత్కంఠ కూడా రేకెత్తించదు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కథను పక్కకు పెట్టి ఎక్కువగా స్టైలీష్ మీదే దృష్టిపెట్టాడు దర్శకుడు . ఫస్టాఫ్ అంతా డోకు బయోవెపన్ చుట్టే తిరుగుతుంది. దాన్ని తెరిచేందుకు మూడు తాళాలు అవసరం..వాటి కోసం హీరో ఒకవైపు.. విలన్ మరోవైపు ప్రయత్నాలు చేస్తారు. ఆయా సీన్లను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దితే బాగుండేది. కానీ చాలా సింపుల్గా, సాగదీతగా ఆ సన్నివేశాలు సాగుతాయి. ఒకానొక దశలో చిరాకు కలిగిస్తాయి కూడా. అలాగే సర్దార్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సిల్లీగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో అయినా కథనం ఉత్కంఠభరితంగా సాగుతుందా అని ఆశించిన ప్రేక్షకుడికి.. కాసేపటికే నిరాశ తప్పదు. కోటలో ఉన్న ప్రమాద కర ఆయుదాన్ని వెతికిపట్టుకునేందుకు తండ్రి,కొడుకులు ప్రయత్నించడం.. బ్లాక్ డగ్గర్ దాన్ని స్వాధీనం చేసుకొని దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించడం.. చివరిలో తండ్రి కొడుకులు కలిసి ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడం.. సెకండాఫ్ అంతా ఇలానే సాగుతుంది. చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉండడం.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడంతో సెకండాఫ్ మరింత చిరాకు పెట్టిస్తుంది. ఇక చివరిలో పార్ట్ 3 కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. అయితే అది తెరపైకి వస్తుందా లేదా అనేది చూడాలి. ఎవరెలా చేశారంటే.. కార్తి నటన గురించి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఇందులో కూడా తండ్రి కొడుకులుగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలను పోషించి మెప్పించాడు. అయితే కథ, కథనం బలంగా లేకపోవడంతో కార్తి పడిన కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయిపోయింది. ఇక విలన్గా ఎస్.జే సూర్య నటన చాలావరకు అతిగా అనిపించింది. అయితే తెరపై మాత్రం స్టైలీష్గా కనిపించాడు. మాళవిక మోహన్, ఆశికా రంగనాథ్, నాజర్, అచ్యుత్ కుమార్, ఆషిష్ విద్యార్థి యోగిబాబుతో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. సామ్ సీఎస్ బీజీఎం పర్వాలేదు. చాలా వరకు హలీవుడ్ సినిమాలను ఇమిటేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులో ఒకే ఒక పాట ఉంది. అది కూడా అంతగా ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. వాటికి ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సిందే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్లో ప్రచారం.. కంటెస్టెంట్పై ఫిర్యాదు
బిగ్బాస్ తెలుగు10 రియాలిటీ షోకు సంబంధించిన ఓటు ప్రచారంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఓ కంటెస్టెంట్కు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారంటూ ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డికి, కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రికి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.18 ఏళ్లు నిండిన వారికే..‘నల్గొండ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మమేకమైనట్లు కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ పాఠశాలలు విద్య కోసమే తప్పా రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారం కోసం కాదు. ఇది విద్యా వాతావరణాన్ని భంగపరచడం, పిల్లల భద్రతకు ప్రశ్నార్థకం చేయడమే. భవిష్యత్తులో పాఠశాలల్లో ఇలాంటి ప్రచారాలు జరగకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలి’ అని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారికే బిగ్ బాస్ రియాలిటీ షో ఓటింగ్ కి అర్హులను చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: వర్షిణికి వాష్రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష? -
మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: మండాడినటీనటులు: సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులునిర్మాణ సంస్థ: ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్నిర్మాత:ఎల్రెడ్ కుమార్దర్శకుడు: మతిమారన్ పుగళేందిసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్సినిమాటోగ్రఫీ:ఎస్.ఆర్. కథిర్ఎడిటింగ్: ప్రదీప్ ఇ.రాఘవ్విడుదల తేది: సెప్టెంబర్ 10, 2024వైవిధ్యమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలుగు నటుడు సుహాస్ నటించిన తొలి తమిళ సినిమా మండాడి. ఇందులో ఆయన విలన్ పాత్రను పోషించగా.. కోలీవుడ్ యాక్టర్ సూరి హీరోగా నటించాడు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో టాలీవుడ్లోనూ ‘మండాడి’పై హైప్ క్రియేట్ అయింది. మరి మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేటంటంటే.. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు. ఈ సారి టీమ్లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు. రాజీ కోసం మల్లేష్ని తీసుకొని కళింగపట్నం వస్తాడు కాళి. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన ఆ ఊరిలోకి అడుగుపెడతాడు. రాజీలో భాగంగా పడవ పోటీలకు దిగుతారు. అందులో ఎవరు గెలిస్తే వాళ్లు కళింగపట్నానికి అధికారిక జట్టు, ఓడిపోయిన వాళ్లు పోర్ట్ ని వదిలివెళ్లిపోవాల్సి ఉంటుందని కండీషన్ పెడతారు. మరి ఈ పోటీలో కాళి తన కళింగ వారియర్స్ టీమ్ని ఎలా గెలిపించాడు? కాళిని ఓడించేందుకు పులి చేసిన కుట్రలు ఏంటి? అసలు కాళి ఊరి వదిలివెళ్లిపోవడానికి గల కారణం ఏంటి? ఎప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న కాళి, పులి ఇప్పుడు బద్ద శత్రువులుగా ఎలా మారారు? ఈ కథలో ఏంజిల్(మహిమా నంబియార్), మునయ్య(సత్యరాజ్)పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పడవ పోటీల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇది. దానికి స్నేహబంధాన్ని, పల్లెటూరి ఎమోషన్ని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సముద్రంలో పడవల పోటీ అనే పాయింట్ కొత్తగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న కథ, సన్నివేశాలన్నీ రొటీన్గానే ఉన్నాయి. హీరో, విలన్ ఒకప్పుడు స్నేహితులుగా ఉండడం.. ఓ కారణంగా విడిపోయి బద్ద శత్రువులుగా మారడం.. చివరకు ఇద్దరి మధ్య పోటీ జరగడం..హీరో గెలవడం.. ఇలాంటి నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ చిత్రం నేపథ్యం కూడా ఇలానే సాగుతుంది. ముగింపులో వచ్చే పడవ పోటీ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. అయితే సినిమా ప్రారంభం అయిన కాసేపటికే ప్లాష్బ్యాక్ స్టోరీతో పాటు క్లైమాక్స్ కూడా ఊహించొచ్చు. అయినప్పటికీ ఒకటి రెండు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ కథనం చాలా వరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్లో అసలు కథ ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. హీరో హైదరాబాద్ నుంచి కళింగపట్నం వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. పంచాయితీ పెట్టడం.. పడవల పోటీకి రెడీ అవ్వడం ఇవన్నీ రొటీన్గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్తో సెకండాఫ్ పూర్తిగా ఊహించొచ్చు. అయితే కథను ఊహించినా..కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే పడవల పోటీ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అలాగే ప్లాష్బ్యాక్లో సాగే కాళీ, ఏంజల్ ప్రేమ సన్నివేశాలు, కోచ్ ముని జట్టుని నడిపించే తీరు.. ఎమోషన్ కూడా ఆకట్టుకుంటుంది. ఫస్టాప్తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. ముఖ్యంగా పడవ పోటీలకు సంబంధించిన సన్నివేశాలే ఈ సినిమాకు ప్రధానబలం అని చెప్పొచ్చు. ఎవరెలా చేశారంటే.. కాళి పాత్రకి సూరి పూర్తి న్యాయం చేశాడు. ఎలాంటి ఎలివేషన్స్, హంగులు లేకుండా చాలా సింపుల్గా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. దానికి తగ్గట్లుగానే సూరి నటించాడు. యాక్షన్తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక సుహాస్ విలన్గా మెప్పించాడు. తెరపై కొత్త గెటప్లో కనిపిస్తూనే.. మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఏంజల్గా మహిమా నంబియార్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. చక్కగా నటించింది. ఇక సత్యరాజ్ కూడా మంచి పాత్రను పోషించాడు. కోచ్ మునయ్య పాత్రలో ఒదిగిపోయాడు. మల్లేష్ పాత్ర పోషించిన నటుడితో పాటు మిగిలినవారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం కథను ఎలివేట్ చేసేలా ఉంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రపీ బాగుంది. సముద్రపు సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్లో చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఎవరూ ముందుకు రాలేదు.. శృతిహాసన్ పోరాడి గెలిచారు!
ఇండియన్ సినిమాలో అతి తక్కువ మంది బోల్డ్ అండ్ బ్యూటీ హీరోయిన్లలో నటి శృతిహాసన్ ఒకరిని చెప్పవచ్చు. ఈమె ఫెయిర్ నెస్, డేరింగ్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. నటి వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసినా, ఆ తరువాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు కమలహాసన్ పుత్ర రత్నం ఈ బహుముఖ ప్రతిభావంతురాలు శృతిహాసన్. గాయనిగా, సంగీత దర్శకురాలిగా, కథానాయకిగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ బ్యూటీ బహుభాషా కథానాయకి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే ఈమె సంచలన నటి ఏ విషయంలోనైనా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు.. చూస్తారు అని ఎదురు చూడటం శృతిహాసన్ నైజం కాదు. ఇందుకు చిన్న ఉదాహరణ ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాని వల్ల ప్రయోజనం ఎంత కలుగుతుందో, అదే స్థాయిలో దు్రష్పచారం జరుగుతోందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎక్కువగా సాధింపులకు గురౌతున్నారు. ఇక సినిమా రంగంలో కథానాయికలు డీఫేమ్ చర్యలతో మానసిక వేదనకు గురౌతున్నారు. తమ ప్రమేయం లేకుండానే తమ రూపాలు, వ్యాఖ్యలను మార్పింగ్ చేస్తున్నారు. దీంతో మనోవేదనకు గురౌతున్న పలువురు నటీమణులు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారే కానీ ఎవరూ కార్యాచరణకు ముందడుగు వేయడం లేదు. అయితే నటి శృతిహాసన్ మాత్రం ధైర్యంగా ముందడుగు వేసి ఏఐ టెక్నాలజీతో మహిళలను డీఫేమ్ చేస్తున్న వారికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి గెలిచారు. ఏఐ టెక్నాలజీతో అక్రమాలకు పాల్పడే చర్యలపై ఇటీవల ముంబై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు నటి శృతిహాసన్ చాలా మందికి రోల్ మోడల్ అయిపోయారు. సినీ ఇండస్ట్రీలో చాలా మందికి మార్గదర్శిగా నిలిచారని ప్రశంసలను అందుకున్నారు. -
ఉంటే మరింత మెరిసేవాళ్లు!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచం మొత్తం మీద సంవత్సరానికి దాదాపు 20 లక్షల మంది ఆత్మహత్య చేసుకుని మరణిస్తున్నారు. మన దేశంలో సుమారు రెండు లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేవలం బలహీన మనస్కులే ఆత్మహత్య చేసుకుంటారనేది అపోహ మాత్రమే. ప్రపంచాన్ని తన నియంతృత్వ పోకడలతో గడగడలాడించిన ‘హిట్లర్’ మొదలుకొని ఇటీవల త్రిపుర రాష్ట్ర పోలీస్ అధినేత లాంటి ఎందరో దేశాధినేతలు, అధికారులు, సైంటిస్టులు, సినీ తారలు చివరకు ఈ విధంగానే తనువు చాలించారు. ముఖ్యంగా సినిమా తారల గురించి చెప్పాలంటే... సిల్వర్ స్క్రీన్ పై ఎంతో పేరు తెచ్చుకున్న నటీనటులు కొందరు చివరకు ఇలాగే ఆత్మహత్యలకు పాల్పడ్డారు.హాలీవుడ్ను ఒకప్పుడు ఒక ఊపు ఊపిన మార్లిన్ మన్రో చివరకు నిద్ర మాత్రలు మింగి మరణించింది. వ్యక్తిగత జీవితంలో మూడు వివాహాలు, విడాకులు, అనేక ప్రేమ వ్యవహారాలు నడిపిన మార్లిన్ జీవితం అర్ధాంతరంగానే ఆత్మహత్యతో ముగిసింది. బాలీవుడ్ విషయానికొస్తే... ‘మొగల్ ఏ ఆజమ్’ హీరోయిన్ మధుబాల... ప్రేమనాథ్, దిలీప్ కుమార్ల మధ్య ట్రయాంగిల్ లవ్లో విరక్తితో అర్ధాంతరంగా మరణించింది. సుమంగళిగా మరణించాలన్న ఆమె చివరి కోరికను కిషోర్ కుమార్ నెరవేర్చాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు గురుదత్... అటు భార్య గీతాదత్ ఇటు తాను ప్రేమలో పడ్డ వహీదా రెహమాన్ మధ్య నలిగిపోయి, చివరికి లవ్ ఫెయిల్యూర్ భరించలేక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. స్మితా పాటిల్, దివ్య భారతి, మోనాల్, ప్రత్యూష బెనర్జీ, జియా ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ వంటి వారు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇటు సౌత్లో శోభ, ఫటాఫట్ జయలక్ష్మి, సిల్క్ స్మిత, ఉదయ్ కిరణ్, రంగనాథ్.. లాంటి ఎందరో తారలు బలవన్మరణానికి పాల్పడిన వారే. సినీ రంగంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారిలోఎక్కువగా ప్రేమ, పెళ్లి, విడాకులు, ఆర్థిక, కుటుంబ సమస్యలు, అవకాశాలు తగ్గిపోవడం లాంటి కారణాలతోనే జీవితాన్ని ముగించారు. హీరోల కంటే హీరోయిన్లలోనే ఆత్మహత్యలు ఎక్కువ... హీరోలకు ఏదైనా సమస్య వస్తే దాంట్లోంచి బయటపడేందుకు ఉన్నన్ని మార్గాలు హీరోయిన్లకు లేకపోవడమే అందుకు ఒక కారణం. ఇంకో ముఖ్య కారణం ఏంటంటే హీరోయిన్లకు 35 ఏళ్లు వచ్చే వరకే మంచి అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత అవకాశాలు తగ్గుతుంటాయి. చాలామంది హీరోయిన్లకు నటనే జీవనాధారం. కానీ హీరోలు నటనతో పాటు రియల్ ఎస్టేట్, హోటల్స్, థియేటర్లు, స్టూడియోలు లాంటి వ్యాపారాలతో అధికంగా నిలదొక్కుకోగల్గుతారు. సక్సెస్తో స్ట్రెస్: చిత్ర సీమలోని వారికి ఫెయిల్యూర్ కంటే సక్సెస్తోనే స్ట్రెస్ ఎక్కువ. ముందు సినిమా సూపర్ డూపర్ హిట్ అయి, తదుపరి సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే చాలా సందర్భాల్లో వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. అలాగే తారలకు నిజ జీవితంలో తగినంత స్వేచ్ఛ ఉండదు. కొందరు గాడ్ ఫాదర్ గుప్పెట్లో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే కొందరి తారల జీవితాలు బంగారు పంజరంలోని చిలకలా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఒంటరితనం, అభద్రత, తనను తానుగా ప్రేమించే వారి కోసం పడే తపన, గుర్తింపు కోసం పడే ఆరాటం కూడా వారి నైరాశ్యానికి తోడవుతాయి. అవమానం భరించలేక: సినిమా ప్రపంచంలో తరచుగా పార్టీలు, మద్యానికి, మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడటం, తద్వారా మానసికంగా మరింత బలహీనపడి చివరకు దయనీయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడతారు. కొందరు తారలు ఉన్నదంతా ఖర్చు పెట్టో లేక ఒక సినిమా తీసి అది అట్టర్ ఫ్లాప్ అయి ఆర్థికంగా దివాళా తీసో దాని నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితంలో ఏ చిన్న ఒడుదుడుకులు వచ్చినా అది పెద్ద సంచలనంగా మారి, ఆ అవమానాన్ని భరించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొందరైతే చిన్నా–చితక అవకాశాలతో రాజీ పడలేక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. తొలి దశలోనే చికిత్స అవసరం: తారలకు నటనతో పాటు ఆత్మవిశ్వాసం, ఈ రంగుల ప్రపంచంలో బతక నేర్చే మెళకువలు, ఆటుపోట్లను సమానంగా తీసుకునే మనోబలం, స్క్రీన్ లైఫ్ను, పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకొనే మేధస్సు, ఆర్థిక, ప్రేమ, వివాహ విషయాలలో ఆచితూచి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొనే ప్రజ్ఞ చాలా అవసరం. ఆ మధ్య డిప్రెషన్కు లోనైన దీపికా పదుకోన్ సైకియాట్రిస్టును సంప్రదించి చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకొని తనలా మరెవ్వరూ బాధపడకూడని ‘లివ్, లవ్ అండ్ లాఫ్’ అనే ఎన్జీఓను స్థాపించి చాలామందికి సేవ చేస్తోంది. మనోవేదనకు గురైన తారలు తొలి దశలోనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి తగిన వైద్యం, కౌన్సిలింగ్ చేయించుకోవడం అవసరం. ఒకనాడు తాము ఒక వెలుగు వెలిగిన రంగుల ప్రపంచం, చివరకు బ్లాక్ అండ్ వైట్గా మారితే తట్టుకోలేక అర్ధాంతరంగా తనువు చాలించిన సినీ తారల ట్రాజెడీ కథలు ప్రస్తుతం సినీ రంగంలో ఉన్నవారికి ఒక కనువిప్పుగా ఉండాలని ఈ ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం నాడు ఆశిద్దాం.ఈ సమయం దాటిపోతుంది→ ఆత్మహత్య భావాలతో బాధపడేవారు తమలో తామే కుంగిపోకుండా తమలోని మనోవేదనను ఆత్మీయులతో పంచుకుంటే వారి బాధ చాలావరకు తగ్గుతుంది.→ అలాంటివారికి జీవితంలోని సమస్యలకు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదని, ధైర్యంగా ముందుకెళ్లేందుకు ఇతర ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని తెలియజెప్పాలి. → మనసుకు తగిలిన గాయాన్ని మాన్పేందుకు ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అంటే మంచి మాటలతో సాంత్వన కలిగించడం, వారిని ఆ సంఘటన లేదా షాక్ నుంచి బయటకు వచ్చేలా వారి దృష్టి మళ్లించడం, నీకు నేనున్నాను లేదా మేమంతా నీకు అండగా ఉన్నామనే భరోసా కలిగించడం అవసరం. → ఎవరికైనా జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలుండవు. సముద్రంలోని అలల్లాగా కష్టాలు మనల్ని పలకరించి మళ్లీ వెనక్కి వెళతాయని చెప్పాలి. → గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా ‘ఈ సమయం దాటిపోతుంది’ అనే సూక్తిని ఆ కష్ట సమయంలో గుర్తు చేసుకుంటే ఆత్మహత్య భావాలనుంచి బయట పడే అవకాశం ఉంది. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రముఖ మానసిక వైద్యులు, రచయిత, విజయవాడ email:indlas2@gmail.com -
Bigg Boss 10 : వర్షిణికి వాష్రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష?
బిగ్బాస్ తెలుగు సీజన్ 10లో ఆట రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య పోటీతో పాటు గ్రూపులుగా చర్చలు, బాధ్యతల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. మూడో రోజు ఎపిసోడ్లో హైరిస్క్ జోన్, కొత్త కెప్టెన్ ఎంపిక, ఇంటి పనుల పంపకం, మానిటరింగ్ విషయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం సాగింది. మరోవైపు తనకు లభించిన ప్రత్యేక పవర్ ని షాలిని ఉపయోగించుకుంది. ఇంతకీ మూడో రోజు ఏం జరిగింది?. అసలు వర్షిణి శాశ్వతంగా వాష్రూమ్ కడగాల్సిన అవసరం ఏం వచ్చింది.? నిన్న జరిగిన ఎపిసోడ్ పై ఒక లక్కేద్దాం రండి..!రెండు టీమ్లకు షాక్.. హైరిస్క్లోకి ఇద్దరు బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లో బ్లూ, రెడ్ టీమ్లు ఆశించిన స్థాయిలో రాణించలేదని బిగ్బాస్ ప్రకటించాడు. రెండు టీమ్లు విఫలమైనందుకు చెరో కంటెస్టెంట్ను హైరిస్క్లో పెట్టాలని ఆదేశించాడు. బ్లూ టీమ్ నుంచి రామ్ ప్రసాద్ స్వయంగా ముందుకొచ్చాడు. తనను హైరిస్క్లో పెట్టాలని టీమ్ సభ్యులకు చెప్పాడు. రెడ్ టీమ్లో మాత్రం చరణ్, షాలినీలలో ఒకరిని ఎంపిక చేయాలని చర్చ జరిగింది. చివరకు టీమ్ సభ్యుల నిర్ణయంతో మేరకు చరణ్ హైరిస్క్లోకి వెళ్లాడు.కెప్టెన్సీ బాధ్యతలో మార్పు..హైరిస్క్లోకి వెళ్లిన రాంప్రసాద్, చరణ్లు రెండు టీమ్లకు సంబంధించిన కొన్ని హక్కులను కోల్పోయారు. దీంతో బ్లూ టీమ్ కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది. కొత్త కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేయాలనే చర్చలో ముఖేశ్, త్రిగుణ్ పేర్లు వినిపించినప్పటికీ.. ఇక్కడో మ్యాజిక్ జరిగింది. రాంప్రసాద్ ప్రతిపాదనతో దేబ్జానీకి అవకాశం దక్కింది. టీమ్ సభ్యుల అంగీకారంతో ఆమె బ్లూ టీమ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది.పనుల పంపకంలో వివాదం..ఇంటి పనుల విషయంలోనూ కంటెస్టెంట్ల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. వంట పూర్తయ్యే వరకు పాత్రలు శుభ్రం చేసే వ్యక్తి కిచెన్ దగ్గరే ఉండాలంటూ త్రిగుణ్, వర్ష, సుధీర్.. రోహిత్కు సూచించారు. అయితే తాను ఎప్పుడూ అక్కడే ఉండటం సాధ్యం కాదని, అవసరమైనప్పుడు పిలిస్తే వచ్చి పని చేస్తానని రోహిత్ చెప్పాడు. ఆ తర్వాత బిగ్బాస్ రెండు టీమ్లకు మరో బాధ్యత అప్పగించాడు. ఒక టీమ్ ఇంటి పనులు చేయాలని, మరో టీమ్ వాటిని పర్యవేక్షించాలని చెప్పాడు. దీంతో ఏ టీమ్ ఏ బాధ్యత తీసుకోవాలనే దానిపై చర్చ మొదలైంది.రోహిత్ విషయంలో రచ్చ..బ్లూ టీమ్ తరఫున దేబ్జానీ.. తమ టీమ్ ఇంటి పనులు చేస్తుందని, రెడ్ టీమ్ మానిటరింగ్ బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది. అయితే రోహిత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాము కూడా అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరాడు.మాటామాటా పెరగడంతో..రోహిత్ మాటలపై వర్ష, త్రిగుణ్, కృష్ణుడు స్పందించడంతో వాతావరణం వేడెక్కింది. మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుధీర్తోనూ రోహిత్కు గొడవ జరిగింది. తన పని తాను చేయాల్సి ఉండగా సుధీర్ ఎందుకు చేశాడంటూ రోహిత్ ప్రశ్నించాడు. ఈ సమయంలో త్రిగుణ్ జోక్యం చేసుకోవడంతో ‘నీకు సంబంధం లేని విషయంలో ఎందుకు కలుగజేసుకుంటున్నావు?’ అంటూ రోహిత్ ఘాటుగా స్పందించాడు.ఎవరికి ఏ పని?చివరకు దేబ్జానీ ఇంటి పనులను కంటెస్టెంట్లకు విభజించింది. వంశీకి కుకింగ్ బాధ్యత అప్పగించి, అతనికి సహాయంగా ఝాన్సీని నియమించింది. దేబ్జానీ మానిటర్గా వ్యవహరించనుంది. షాలినికి వాష్రూమ్, అమన్కు లాండ్రీ, సృష్టికి హౌస్ క్లీనింగ్ బాధ్యతలు దక్కాయి. సుధీర్కు మానిటరింగ్ బాధ్యత, రోహిత్కు అంట్లు తోమే పని అప్పగించి.. అతడిని త్రిగుణ్ పర్యవేక్షించాలని నిర్ణయించారు. చైత్రకు హౌస్ క్లీనింగ్ బాధ్యత ఇచ్చారు. వర్షిణికి వాష్రూమ్ బాధ్యత..ఇక ఎపిసోడ్లో షాలిని తనకు లభించిన ప్రత్యేక పవర్ ని ఉపయోగించుకోవడం మరో హైలైట్గా నిలిచింది. తనకు కేటాయించిన వాష్రూమ్ క్లీనింగ్ బాధ్యతను వర్షిణికి అప్పగించింది. దీంతో వర్షిణి బిగ్బాస్ హౌస్లో ఉన్నంతకాలం వాష్రూమ్ బాధ్యత ఆమెనే చేయాలి. వర్షిణి నవ్వుతూ తనకు ఇచ్చిన బాధ్యతను స్వీకరించింది.30 సెకన్ల ఛాలెంజ్..అంట్లు తోముతున్న రోహిత్ను పర్యవేక్షించే బాధ్యత త్రిగుణ్కు దక్కడంతో ఇద్దరి మధ్య మరోసారి వివాదం మొదలైంది. త్రిగుణ్ పిలవగానే ‘30 సెకన్లలో వస్తా’ అన్న రోహిత్.. ఆలస్యం చేసాడు. నిజానికి ఇక్కడ రోహిత్ కావాలనే అలా చేశాడు .త్రిగుణ్ ఈ విషయాన్ని బిగ్బాస్ దృష్టికి తీసుకెళ్లాడు.అంతటితో ఆగకుండా రోహిత్ పని చేస్తున్న విధానంపై త్రిగుణ్ సూచనలు చేయడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది. ‘ఇలా చేయాలి.. అలా చేయాలి’ అంటూ తనను మానిటర్ చేయడంపై రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘నేను ఇంట్లోని వాళ్లను కాదు.. నిన్నే మానిటర్ చేస్తున్నా’ అంటూ త్రిగుణ్ కౌంటర్ ఇచ్చాడు. ఇలా మూడో రోజుకే బిగ్బాస్ హౌస్లో ఆధిపత్య పోరు, పనుల విషయంలో విభేదాలు బయటపడటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత వేడెక్కేలా కనిపిస్తోంది. -
TVK నినాదాలతో దద్దరిల్లిన ‘సిగ్మా’ ఈవెంట్.. సీఎం విజయ్ తనయుడి రియాక్షన్
తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుక తమిళనాడులోని సేలంలో ఘనంగా జరిగింది. తెలుగు నటుడు సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈవెంట్లో జేసన్ సంజయ్ ప్రసంగిస్తుండగా అభిమానులు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) నినాదాలతో హోరెత్తించారు. 'మా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు' అని సంజయ్ అనగానే అభిమానుల కేరింతలు మరింత పెరిగాయి. దీంతో కాసేపు ప్రసంగాన్ని ఆపిన సంజయ్ చిరునవ్వుతో థంబ్స్ అప్ చూపిస్తూ స్పందించారు.కొంతకాలం క్రితం సీఎం విజయ్, సంజయ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ పలు రూమర్లు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వేడుకలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. సంజయ్ తన తండ్రి విజయ్ నటించిన ‘తిరుమలై’ తాను థియేటర్లో చూసిన తొలి సినిమా అని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తనకు 3 ఏళ్ళు అని చెప్తూ నవ్వుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తాను దర్శకుడిగా మారుతున్న విషయం మొదటగా తన తల్లికి ఫోన్ చేసినట్లు తెలిపారు. ఈ చిత్ర హీరో సందీప్ కిషన్ సైతం విజయ్ను తమ సినిమాకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. దానికి సంజయ్ కూడా చిరునవ్వుతో మద్దతు తెలిపారు. దీంతో తండ్రి, కొడుకుల మధ్య విబేధాలపై వస్తున్న ప్రచారానికి ఈ వేడుకలోని సంజయ్ స్పందన కొంత స్పష్టత ఇచ్చినట్టయింది.ఇక ‘సిగ్మా’ హీస్ట్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంపత్ రాజ్, శివ్ పండిట్, యోగ్ జేపీ, షీలా రాజ్కుమార్, రాజు సుందరం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘సీక్రెట్ సోల్జర్’ నుంచి సాంగ్ రిలీజ్
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. ఈ సినిమా సెప్టెంబరు 18న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్ని రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ను కంపోజ్ చేసి అలపించిన తీరు ఆకట్టుకుంది. రెహమాన్ అందించిన సాహిత్యం పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. -
కళ్యాణం కమనీయం జీవితం పెద్ద విజయం సాధించాలి: వి.వి. వినాయక్
ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఈ సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా పాల్గొన్నారు.డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ఈ సినిమా చిన్నదే గానీ సినిమా తీసిన వాళ్లు చిన్న వాళ్లు కాదు. ఈ చిత్రంతో ఒక కొత్త దర్శకుడికి అవకాశం కల్పించినందుకు ప్రొడ్యూసర్స్ ప్రసాదరావు, కిషోర్ కి మా డైరెక్టర్స్ అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నా. మా సత్యనారాయణ రెడ్డి గారికి మంచి మిత్రులు రాజవంశీ ఈ సినిమాను చూసి నచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి. అలాగే ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి మూవీలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరు, గుర్తింపు రావాలి. ఈ సినిమా సక్సెస్ తో ప్రొడ్యూసర్స్ గారికి మరిన్ని మూవీస్ చేసే బలం చేకూరాలని కోరుకుంటున్నా’ అన్నారు.హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ - ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఒక జంట తమ బంధాన్ని విడిపోకుండా చూసుకోవాలి అనే మంచి పాయింట్ తో మా సినిమాను డైరెక్టర్ రవి గారు తెరకెక్కించారు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే క్లీన్ మూవీ ఇది. మంచి కథ, కథనం, మ్యూజిక్, పర్ ఫార్మెన్స్ లు, టెక్నికల్ గా క్వాలిటీ అన్నీ మా సినిమాలో చూస్తారు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మా మూవీ టీమ్ అందరికీ థ్యాంక్స్. ఈ నెల 18న థియేటర్స్ లో మా సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా’అన్నారు.హీరోయిన్ సాహితీ అవంచ మాట్లాడుతూ..రైటర్ అరవింద్ గారు ఇచ్చిన ఒక మంచి ఐడియాతో మా మూవీ స్టార్ట్ అయ్యింది. ఆ పాయింట్ ను మా డైరెక్టర్ రవి లోకిరెడ్డి బ్యూటిఫుల్ మూవీగా రూపొందించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సినిమాను నమ్మి స్ట్రాంగ్ గా నిలబడిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్లు మా లాంటి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. ఇలాంటి మంచి మూవీలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. మంచి కథ ఉంటే చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా మీ ఆదరణ పొందుతుంది. ఈ నెల 18న థియేటర్స్ కు రండి. మీరు తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. అన్నారు. -
బిగ్బాస్లో రాంప్రసాద్, చరణ్లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?
ఈరోజు బిగ్బాస్10 హౌస్లో హైరిస్క్ జోన్ టాస్క్ ఉత్కంఠ రేపనుంది. రెండు టీమ్ల నుంచి ఒక్కొక్కరిని హైరిస్క్లో పెట్టాలని బిగ్బాస్ ఆదేశించాడు. హైరిస్క్లో ఉన్నవారు ఈ వారంలో ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.ఎలాంటి వాదనలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండానే బ్లూ టీమ్ నుంచి రాంప్రసాద్ హైరిస్క్ జోన్లోకి వెళ్లేందుకు అంగీకరించాడు. అందుకు కారణం ఏంటని అడగగా.. శనివారం చెప్తా అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో తమ టీమ్ తరఫున రాంప్రసాద్ను హైరిస్క్లో పెడుతున్నట్లు నరేశ్ బిగ్బాస్కు తెలిపాడు.ఎమోషనల్ వాతావరణం..ఇక రెడ్ టీమ్ నుంచి చరణ్ను యూనానిమస్గా ఎంపిక చేసినట్లు రోహిత్ ప్రకటించాడు. అయితే అంతకుముందే త్రిగుణ్.. రోహిత్ హైరిస్క్లోకి వెళ్లడని టీమ్ సభ్యులతో చెప్పడం ఆసక్తికరంగా మారింది. చివరకు రోహిత్ కాకుండా చరణ్ హైరిస్క్ జోన్లోకి వెళ్లాడు.ఇదీ చదవండి: సందీప్రెడ్డికి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్మరోవైపు.. ‘హైరిస్క్లో ఉంటాను.. అక్కడి నుంచి ఎలాగైనా బయటికి వస్తా అంటూ రాంప్రసాద్ బిగ్బాస్ ముందు ఎమోషనల్ అయ్యాడు. చరణ్తో రోహిత్ మాట్లాడుతూ.. ‘ఒక్కరు నీకు సపోర్ట్ చేసినా.. నీ కోసం నేను పోరాడేవాడిని’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో హౌస్లో ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణం నెలకొంది. మరి ఈరోజు జరగబోతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కువమంది చదివింది: ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మరీ వెక్కిరించాడు: ఐశ్వర్య లక్ష్మి -
సందీప్రెడ్డికి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. ఆ సినిమా తర్వాత ఇటు విజయ్, అటు సందీప్..ఇద్దరు కెరీర్ పరంగా బిజీ అయ్యారు. సందీప్ అయితే యానిమల్ చిత్రం పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అయినా కూడా ఇద్దరి మధ్య స్నేహ బంధం అలానే కొనసాగుతుంది. ఇటీవల సందీప్ నిర్మించిన ‘రోమాంచకం’ చిత్రానికి విజయ్ అండగా నిలిచాడు. మూవీ ప్రమోషన్స్లో పాల్గొని సందీప్పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఇక తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ నటించిన ‘ఎపిక్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో గెస్ట్గా వచ్చాడు సందీప్. ఇదే ఈవెంట్కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. ఇలా విజయ్, సందీప్ మరోసారి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ తన అభిమాన డైరెక్టర్కి ఒక ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఇచ్చిన వాచ్ ని సందీప్ రెడ్డి వంగ వెంటనే పెట్టుకోవడం చూసి వీళ్ళిద్దరికి ఒకరి ఉంటే ఒకరు ఎంత ఇష్టమో అని ఆ వీడియోని చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.#VijayDeverakonda gifted a brand new watch to #SandeepReddyVanga ! their bonding ❤️ https://t.co/56uF21Sgey pic.twitter.com/eFcfW46wGc— Rajesh Manne (@rajeshmanne1) September 8, 2026 -
చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్ .. ‘అమ్ములు ’లుక్ రిలీజ్
హార్ట్ ఆఫ్ కాకా అంటే ఎవరో తెలుసా? అమ్ములు. ఈ అమ్ములు ఎవరో కాదు నటి అనస్వర రాజన్. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’లో అనస్వర రాజన్ చేస్తున్న పాత్ర పేరు అమ్ములు, నివేతా పేతురాజ్, సునీల్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు చిరంజీవి. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో మెడికల్ స్టూడెంట్ అమ్ములు రోల్లో అనస్వర రాజన్ నటిస్తున్నారని మంగళవారం (సెప్టెంబరు 8) ఆమె పుట్టినరోజు సందర్భంగా వెల్లడించి, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ‘హార్ట్ ఆఫ్ కాకా’ అని పేర్కొన్నారు. వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. Happy Birthday to the'HEART OF KAAKA', Ammulu Paapa, #AnaswaraRajan 🤍#KAAKA Shoot in progress..Worldwide Grand Release on January 13th, 2027 🔥 pic.twitter.com/BOCBm6kSZg— Kaaka (@KaakaMovie) September 8, 2026 -
Bigg Boss 10: రోహిత్ కళ్లు నెత్తికెక్కాయి...అతన్ని కిందకు దింపాలి.. వర్షిణి ఫైర్
బిగ్బాస్ 10 రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ‘మహాపరీక్ష’లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కూల్గా, కామ్గా ఉంటాడనుకున్న కృష్ణుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. మరోవైపు రోహిత్పై యాంకర్ వర్షిణి చేసిన సంచలన వ్యాఖ్యలు హౌస్లో హీట్ పెంచాయి. ఇక సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే బ్యాగ్ టాస్క్ నుంచి నామినేషన్స్, ప్రొటెక్టివ్ బాస్ టాస్క్ వరకు మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.సైన్యం కోసం బ్యాగ్ టాస్క్హౌస్మేట్స్ అంతా కలిసి తమ లీడర్లుగా రామ్ప్రసాద్, రోహిత్లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 12 మంది ఇంటిసభ్యులకు నాయకులకు సైన్యంగా నిలబడేందుకు బిగ్బాస్ ఓ బ్యాగ్ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో కొన్ని బ్యాగ్లను ఉంచి.. వాటిలో ఉన్న బ్యాడ్జ్ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. బ్యాగ్ అందుకున్న సైనికుడు దాన్ని తన నాయకుడికి ఇవ్వాలి. ఆ బ్యాగ్లో ఉన్న బ్యాడ్జ్ల ఆధారంగా నాయకులు తమ టీమ్లోకి సభ్యులను తీసుకోవాల్సి ఉంటుంది.మొదట ముఖేష్ గౌడ బ్యాగ్ తీసుకుని రామ్ప్రసాద్కు ఇవ్వగా.. అందులోని తొలి బ్లూ బ్యాడ్జ్ను త్రిగుణ్కు ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ అమన్కు రెడ్ బ్యాడ్జ్ ఇచ్చాడు. అనంతరం టెంపర్ వంశీకి మరో రెడ్ బ్యాడ్జ్ ఇచ్చి తన టీమ్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత శాలినిని కూడా తన జట్టులోకి తీసుకున్నాడు. అలా రామ్ ప్రసాద్.. త్రిగుణ్, ముఖేష్, సుధీర్, నరేష్, దేబ్జాని, చరణ్, వర్షిణి, చైత్రతో.. రోహిత్.. వంశీ, శాలిని, వంశీ, సృష్టి, ఝాన్సీ, కృష్ణుడుతో టీమ్స్ని ఫామ్ చేసుకున్నారు. అయితే వర్షిణిని రాంప్రసాద్ ముందుగా తన టీమ్లోకి తీసుకోలేదు. రోహిత్ తనకున్న ఆప్షన్తో ఆమెను రాంప్రసాద్ టీమ్లోకి పంపాడు. దీంతో వర్షిణి..రాంప్రసాద్ పై అలక పూనింది. ‘నన్ను ఎందుకు పిక్ చేసుకోలేదు? నాకెందుకు బ్యాడ్జ్ ఇవ్వలేదు?’ అని అతన్ని నిలదీసింది.దీనికి రామ్ప్రసాద్ స్పందిస్తూ.. ‘రోహిత్ నిన్ను ఖచ్చితంగా తీసుకోడు అనే నమ్మకం ఉంది. అందుకే నిన్ను చివరి వరకు తీసుకోలేదు’ అని చెప్పాడు.గ్రూప్ గేమ్పై వర్షిణి, చరణ్ మధ్య డిస్కషన్ఇక వర్షిణి, ఆర్జే చరణ్ మధ్య గ్రూప్ గేమ్ అంశంపై చర్చ జరిగింది. ‘గ్రూప్’ అని అనడం తనకు నచ్చలేదని చరణ్ చెప్పగా.. ‘గ్రూప్గా ఆడుతున్నప్పుడు గ్రూప్ గేమ్ అనకపోతే ఏమంటాం?’ అంటూ వర్షిణి రివర్స్ కౌంటర్ ఇచ్చింది.అంతేకాదు.. ‘మీరంతా కలిసే ఉంటున్నారు. కానీ మీతో ఝాన్సీ ఎందుకు కలవడం లేదు?’ అని చరణ్ను ప్రశ్నించింది. దీనికి చరణ్ తనకు అలా అనిపించడం లేదని చెప్పగా.. ‘నాకు కనిపిస్తుంది’ అంటూ వర్షిణి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.రోహిత్ తోపులా ఫీలవుతున్నాడుఅనంతరం బిగ్బాస్ బ్లూ టీమ్ సభ్యులకు ఓ కీలక టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులుగా ఉండేందుకు అనర్హులు అనిపించే ఒక్కొక్కరి పేరును చెప్పాలని సూచించాడు.ఈ సందర్భంగా వర్షిణి అనూహ్యంగా రోహిత్ పేరును చెప్పింది. అంతేకాదు.. అతని గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అగ్నిపరీక్షలో రోహిత్ను చూసినప్పుడు అతనితో మంచి వైబ్ ఉంటుందని అనుకున్నానని చెప్పింది. కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత అతని యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందని విమర్శించింది. రోహిత్ తనను తాను పెద్ద తోపులా ఫీల్ అవుతున్నాడని.. ‘నా అంతటోడు లేడు, నేనే పెద్ద దేవుడ్ని’ అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడని వ్యాఖ్యానించింది. అతను గేమ్లో ఓడిపోయినప్పటికీ.. తన తప్పును అంగీకరించకుండా ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు.. త్రిగుణ్ ‘గ్రూప్’ అని అనగానే రోహిత్ ట్రిగ్గర్ అయ్యాడని వర్షిణి చెప్పింది. ‘దొంగను దొంగ అంటే ఎంత కోపం వస్తుందో.. సార్గారిని గ్రూప్ అనగానే అంత కోపం వచ్చింది. అగ్నిపరీక్ష నుంచి బిగ్బాస్ హౌస్లోకి వచ్చేలోపే రోహిత్ కళ్లు నెత్తికెక్కాయి. అది రియాలిటీ కాదు. అతనికి రియాలిటీ ఏంటో తెలియాలి. అతన్ని కిందకు దింపాలి’ అంటూ కాస్త సీరియస్గానే మాట్లాడింది.రోహిత్పై కృష్ణుడు ఫైర్..ఆ తర్వాత నామినేషన్ బాధ్యత రెడ్ టీమ్కు వచ్చింది. బ్లూ టీమ్ సభ్యుల్లో హౌస్మేట్స్గా మారేందుకు ఎవరు అనర్హులో చెప్పే బాధ్యతను బిగ్బాస్ రోహిత్కు అప్పగించాడు.రోహిత్ వరుసగా కృష్ణుడు, రామ్ప్రసాద్, వర్షిణి, త్రిగుణ్, దేబ్జానిలను అనర్హులుగా ప్రకటించాడు. దీంతో కృష్ణుడు రోహిత్పై ఫైర్ అయ్యాడు. ‘కీ తనకు ఇచ్చారని కుళ్లుబోతుతనం.. సుపీరియారిటీ కాంప్లెక్స్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే రోహిత్ మాత్రం నవ్వుతూ నిలబడిపోయాడు. రామ్ప్రసాద్, వర్షిణి సైతం రోహిత్పై మండిపడ్డారు.‘ప్రొటెక్టివ్ బాస్’ టాస్క్లో ఫౌల్ గేమ్ఆ తర్వాత నామినేట్ అయిన పది మంది సభ్యులకు బిగ్బాస్ ‘ప్రొటెక్టివ్ బాస్’ టాస్క్ ఇచ్చాడు. ఇందులో డిఫెండర్లను కిల్ చేస్తూ బాస్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో బ్లూ టీమ్ అటాకర్స్గా, రెడ్ టీమ్ డిఫెండర్స్గా టాస్క్ ప్రారంభమైంది. ఈ క్రమంలో త్రిగుణ్ ఫౌల్ గేమ్ ఆడాడని రోహిత్ ఆరోపించాడు. మొత్తంగా చూస్తే బిగ్బాస్ 10 రెండో రోజు ఎపిసోడ్లో మాటల యుద్ధం మాత్రం బాగానే కనిపించింది. ముఖ్యంగా రోహిత్పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. కృష్ణుడు కూడా ఊహించని విధంగా ఫైర్ అవుతూ కనిపించాడు.అయితే టాస్క్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎపిసోడ్లో పెద్దగా పస లేదనిపించింది. -
రష్మీ.. మమకారం
పెంపుడు జంతువులు ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానమని, వాటి పరిరక్షణ చాలా అవసరమని నటి రష్మీ గౌతమ్ అన్నారు. మంగళవారం శ్రీనగర్కాలనీలో ‘ది ఎనిమల్ ప్లేస్’ పేరిట ఏర్పాటు చేసిన వెటర్నరీ క్లినిక్ను ఆమె ప్రారంభించారు. పెంపుడు జంతువులు మానసిక ప్రశాంతత, సంతోషాన్ని అందిస్తాయన్నారు. పెంపుడు జంతువుల కోసం అత్యాధునిక చికిత్సలు, సేవలను అందిస్తున్నామని డాక్టర్ సలీం మస్కటీ, డాక్టర్ మార్షా గాబ్రియేల్ పేర్కొన్నారు. -హైదరాబాద్ -
‘పిఠాపురంలో… అలా మొదలైంది’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘‘ప్రేమ, హాస్యం, సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి అంశాలతో పాటు యువతకు ఒక మంచి సందేశాన్ని అందించేలా ‘పిఠాపురంలో అలా మొదలైంది’ సినిమాను రూపొందించాం’’ అని మహేష్ చంద్ర తెలిపారు. ఆయన దర్శకత్వంలో పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పిఠాపురంలో అలా మొదలైంది’. చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా పతాకాలపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అలాగే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోందని కూడా పేర్కొన్నారు. ‘‘ఇరుముడి, విశ్వనాథ్ అండ్ సన్స్, మా ఇంటి బంగారం’ సినిమాల తరహాలోనే మా సినిమా కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలి΄ారు. -
హబ్లో జోరు.. హుషారు
కథ డిమాండ్ చేస్తే చాలు.. తమ సినిమాల షూటింగ్స్ కోసం దేశ విదేశాలు చుట్టేస్తుంటారు మేకర్స్. పైగా తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా పరిధి దాటి అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటుతోంది. అందుకే కాబోలు స్వదేశంతో పాటు బడ్జెట్ ఎక్కువ అయినా విదేశాల్లోనూ షూటింగ్స్కి ఏమాత్రం వెనకాడటం లేదు. పలు సినిమాల చిత్రీకరణలు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంటే మరికొన్ని మూవీస్ షూటింగ్స్ విదేశాల్లోనూ జరుగుతున్నాయి.అయితే మెజారిటీ సినిమాలు మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ హబ్గా చెప్పుకునే హైదరాబాద్లోనే జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్లు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, మహేశ్బాబు, గోపీచంద్, శర్వానంద్, శ్రీ విష్ణు... వంటి పలువురు హీరోలు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. మరి... ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం. కాలేజ్లో కాకా... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ఈ సినిమాకి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్, సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని సిటీ కాలేజ్లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ బాబీ. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని సరికొత్త తరహా పాత్రలో చూపించనున్నారట ఆయన. ‘‘చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసిన ‘కాకా’ టైటిల్ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రకటన నుంచే ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, మాస్ అప్పీల్తో ఆ అంచనాలను మరింత పెంచింది. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్లో చూపించిన విధానం, పవర్ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ కలిసి గ్లింప్స్ను ఆసక్తికరంగా మార్చాయి. మిడిల్ క్లాస్ అవతార్లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్తో కనిపించగా, యంగ్ వెర్షన్లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్తో గ్లింప్స్ను మరింత ఆసక్తికరంగా మలిచారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లేలా ఉంటాయి. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్...’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్కు మరింత స్వాగ్ను జోడించింది. సంక్రాంతి సందర్భంగా ‘కాకా’ సినిమాని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అజీజ్ నగర్లో... వరుస పాన్ ఇండియన్ మూవీస్తో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఏకకాలంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారాయన. ఓ వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్న ప్రభాస్.. మరోవైపు ‘ఫౌజీ’ మూవీలో నటిస్తున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ప్రభాస్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ‘ఫౌజీ’ని రూపొందిస్తున్నాం. ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్లో కనిపించనున్నారు ప్రభాస్. డిసెంబరు 3న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, విడుదల చేసిన ప్రభాస్ సరికొత్త పోస్టర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఓ యోధుడిలా, రక్తంతో తడిసిన దుస్తులు, శరీరమంతా గాయాలతో, చుట్టూ నేలకూలిన సైనికుల మధ్య తుపాకీని పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్న ప్రభాస్ లుక్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంషాబాద్లో... మహేశ్బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ‘‘సూపర్స్టార్ మహేశ్బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘వారణాసి’ నుంచి మహేశ్ రెండు స్పెషల్ స్టిల్స్ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండు స్టిల్స్ చూస్తే ‘వారణాసి’ సినిమా సోల్, రుద్ర పాత్ర తీరు అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. శతాబ్దాలను దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ వ్యక్తి ప్రయాణంగా సాగే ఇతిహాసం ఇది. ఇందులో ఒక వ్యక్తి అసాధారణ ప్రయాణం అతడిని భారతదేశంలోని పవిత్ర జలాల నుంచి భూమి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు, 120 దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ‘వారణాసి’లో శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్లో విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ చిత్రం ద్వారా ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ‘‘విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ‘సింగ’ వంటి భారీ ప్రాజెక్ట్తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న ‘సింగ’ టైటిల్తో పాటు ఆయన లుక్ను రివీల్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపీచంద్ను కొత్త కోణంలో చూపించేలా వెంకట్ ఒక గ్రిప్పింగ్ కథని సిద్ధం చేశారు. ఈ మూవీ నుంచి గడ్డం, మీసం, చెవిపోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్లో రిలీజ్ చేసిన గోపీచంద్ లుక్ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్డే ట్రీట్గా నిలిచింది. టైటిల్ టీజర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో రూపొందింది. ఫైట్ మాస్టర్గా సక్సెస్ అందుకున్న వెంకట్ దర్శకుడిగా హీరోను ఎంత పవర్ఫుల్ మాస్ లుక్లో చూపించారో ఈ గ్లింప్స్తోనే నిరూపించారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. కెమెరామెన్ షామ్దత్. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో గ్రాండ్గా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన సినీ అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ముచ్చింతల్లో... శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ముఖ్యమైన నటీనటులు పాల్గొంటున్నారట. ‘‘పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘భోగి’. శర్వానంద్–సంపత్ నందిల కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన, లెన్తీ యాక్షన్ షెడ్యూల్ను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్తో కూడిన ప్రదేశాల్లో తెరకెక్కించాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రూపొందించిన ఈ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలెట్గా నిలుస్తాయి. ఈ చిత్రంలోని శర్వానంద్ రగ్డ్, గ్రాండ్ స్కేల్ విజన్కు ప్రశంసలు లభించాయి. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమా పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్ లుక్కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాని ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాయిదా పడింది. శంకర్పల్లిలో... హీరో శ్రీ విష్ణు–డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్æ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. ఈ మూవీలో రెబ్బా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. అనిల్ సుంకర, రాజేష్ దండ నిర్మించిన ఈ మూవీ 2023 జూన్ 28న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తి వినోదాలు అందించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.‘సామజ వరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిషోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెకక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపిస్తుందని యూనిట్ పేర్కొంది. ఆర్ఎఫ్సీలో... తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్, సముద్ర ఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024 జనవరి 12న విడుదలైన బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆంజనేయస్వామి పాత్రను ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషభ్ శెట్టి పోషిస్తున్నారు.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హంపీలోని అంజనాద్రి బెట్టలో ఆరంభం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ వర్మ. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అన్న నేపథ్యంలో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. ‘హనుమాన్’లో హనుమంత్గా నటించిన తేజ సజ్జా ‘జై హనుమాన్’లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్ర పోషించనున్నారట.సంబరాల జోరు ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. సాయిదుర్గా తేజ్తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు రూపొందిస్తున్నారట రోహిత్ కేపీ. ‘‘ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది’’ అని యూనిట్ పేర్కొంది.ఇదిలా ఉంటే... పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని సినిమాల చిత్రీకరణలు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
ఎపిక్తో బిగ్ బ్లాక్బస్టర్ కొడుతున్నాం: విజయ్ దేవరకొండ
‘‘ఆదిత్య హాసన్ తీసిన ‘90స్’ వెబ్ సిరీస్ చూశాక తను సినిమా చేస్తే కచ్చితంగా చూడాలనిపించింది. తన దర్శకత్వంలో ‘ఎపిక్’ మూవీలో నటించడం ఆనంద్ అదృష్టం. ఆనంద్ సినిమాల ఎంపిక, కెరీర్ పట్ల చాలా గర్వపడుతున్నాను. ఆనంద్ ఫిల్మోగ్రఫీలో ‘ఎపిక్’ లాంటి మరో మంచి చిత్రం చేరుతుంది. వైష్ణవి బ్రిలియంట్ పెర్ఫార్మర్. సెప్టెంబరు 11న ‘ఎపిక్’తో బిగ్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘ఎపిక్–ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘సెప్టెంబరు 11న ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ ఉంది. అక్టోబరు 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా ఉంది. నవంబరులో దేవరకొండ రష్మిక ‘మైసా’ ఉంది... కాబట్టి నాన్స్టాప్గా మిమ్మల్ని (ఫ్యాన్స్) కలుస్తూనే ఉంటాను. తెలుగు సినిమాకి ఇది గొప్ప సంవత్సరం. నాన్స్టాప్గా ఫిల్మ్స్ వస్తున్నాయి... ప్రేక్షకులు చూస్తున్నారు.. హిట్స్ అవుతున్నాయి. రెండు రోజుల్లో ‘ఎపిక్’ వస్తుంది. ఆ తర్వాత నాని ‘ది ప్యారడైజ్’, ఆ తర్వాత ‘రణబాలి, మైసా’, తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ మూవీస్ వస్తున్నాయి. డిసెంబరులో ‘ఫౌజి’ మూవీ, బాలయ్యగారి ‘దాదా’ వస్తున్నాయి. ఈ ఏడాది ముగింపు సాలిడ్గా ఉండబోతోంది. రవితేజ అన్న ‘ఇరుముడి’ సూపర్గా ఉంది’’ అని చెప్పారు. మరో ముఖ్య అతిథి సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – ‘‘అర్జున్ రెడ్డి’ టైమ్లో నేను, విజయ్ కాలిఫోర్నియా వెళ్లాం. అప్పుడు ఆనంద్ ‘అర్జున్ రెడ్డి’ చర్చల్లో పాల్గొన్నాడు. ఐటీ జాబ్ చేస్తున్నాడు కానీ సినిమా అంటే మాకు ఉన్నంత పిచ్చి ఉందేంటీ అనుకున్నాను. సడన్గా ‘దొరసాని’ సినిమాతో హీరో అయ్యాడు. ‘ఎపిక్’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘కింగ్డమ్’ మూవీలో ‘అన్నా అంటే నేæ...’ పాట మా అన్న విజయ్, నా బంధానికి సరి΄ోయేలా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళుతుంటారు. మా ఫ్యామిలీలో విజయ్ అన్న అలాగ. ఇక ‘ఎపిక్’ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అని చెప్పారు.మనల్ని మనం నమ్మాలి: వైష్ణవీ చైతన్యమంగళవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ‘ఎపిక్’ మూవీ గురించి వైష్ణవీ చైతన్య మాట్లాడుతూ– ‘‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’లో కడలి అనే పాత్ర చేశాను. తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూనే, తన జీవితాన్ని కడలి ఎలా ముందుకు నడిపించింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది. గతంలో నేను ఏదైనా విషయం బయటకు మాట్లాడాలంటే కాస్త భయపడేదాన్ని. అయితే కడలి పాత్ర ద్వారా ముందు మనల్ని మనం నమ్మాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మనల్ని మనం నమ్మినప్పుడే ఇతరులు మనల్ని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో సమయంలో వారి కోసం వారు నిలబడాలని నేర్చుకున్నాను. ఈ సినిమా పరంగా పెద్ద చాలెంజ్ ఏంటంటే నేను కర్లీ హెయిర్తో కనిపించడమే. షూటింగ్ ఉందంటే... అందరికంటే ముందుగానే నేను నా హెయిర్ని సెట్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం సితార బ్యానర్లో నితిన్గారితో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
ఒకే జానర్కు ఫిక్స్ కాలేదు: సుమంత్
‘‘ఒక నటుడిగా ఇప్పటివరకూ విభిన్నమైన జానర్స్లో డిఫరెంట్ పాత్రలు చేశాను. ఒకే జానర్లో సినిమాలు చేయాలని ఎప్పుడూ ఫిక్స్ కాలేదు. హీరో పాత్రలు చేయడంతో పాటు బలమైన సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ కూడా చేశాను. ఇప్పుడు కూడా విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ఆ క్యారెక్టర్స్లో డెప్త్ ఉండాలి’’ అని సుమంత్ చెప్పారు. సుమంత్, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్లో సిద్ధు జొన్నలగడ్డ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో సుమంత్ చెప్పిన విశేషాలు...⇒ ‘మహేంద్రగిరి వారాహి’లో యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మూఢనమ్మకాల గురించి చర్చించే క్యారెక్టర్లో నటించాను. ఇదొక డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ ఇందులో ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీక్వెన్స్, వాణిజ్యపరమైన అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ఒక వంశంలోని వ్యక్తులు 33 ఏళ్ల వయసు దాటిన తర్వాత చనిపోవడం అనే పాయింట్ మా సినిమా ట్రైలర్లో కనిపించింది. ఈ పాయింట్ ‘మురారి’ సినిమాను కూడా గుర్తు చేస్తున్నప్పటికీ మా ‘మహేంద్రగిరి వారాహి’ కథ, స్క్రీన్ప్లే చాలా భిన్నంగా ఉంటాయి.⇒ దర్శకుడు సంతోష్ ఈ సినిమా కంటే ముందు నాకు వేరే కథ చెప్పాడు. కానీ ఆ కథ నచ్చలేదు. ఆ తర్వాత ‘మహేంద్రగిరి వారాహి’ కథ చెప్పగా నచ్చింది. వేదాలు, పురాణాల పట్ల మంచి అవగాహన ఉన్న సంతోష్కి ఇది సరైన సబ్జెక్ట్ అనిపించింది. ఈ చిత్రం ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి. ముందు ఈ సినిమాను ఇంత బిగ్ స్కేల్లో తీస్తారని అనుకోలేదు. షూటింగ్ 60 శాతం పూర్తయిన తర్వాత నిర్మాత లక్ష్మణ్గారు మాకు తోడయ్యారు. ఈ సినిమాలోని ఓ సీరియస్ కీ రోల్ను సిద్ధు జొన్నలగడ్డ చేశాడు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గారి రీ–రికార్డింగ్, మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.⇒ ప్రస్తుతం మైథాలజీ ట్రెండ్ నడుస్తోందని ఈ సినిమా చేయలేదు. ‘కార్తికేయ 2, ‘కాంతార’ సినిమాల కంటే ముందే ఈ సినిమా టైటిల్ను రిజిస్టర్ చేయించాం. కాకపోతే ఆ సమయంలో మా సినిమా మేకింగ్కు సరైన నిర్మాత సహకారం లేదు. ఏడాది ఆ తర్వాత మధుగారు, ఆ తర్వాత లక్ష్మణ్గారు ఈ సినిమా ప్రాజెక్ట్లో భాగమయ్యారు. ⇒ ఇటీవల జరిగిన మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అఖిల్ గురించి సరదాగా మాట్లాడాను. తనని అయ్యగారు అని పిలుస్తుంటారట. అక్కినేనిగారి అందరి మనవళ్లలో నేనే పెద్దవాడిని. పెద్దవాడిని కాబట్టి అయ్యగారు అంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో సరదాగా అన్నాను. అది ట్రెండ్ అయ్యిందని మా వాళ్ళు నాకు చెప్పారు. -
60 అడుగుల ఎత్తు నుంచి దూకిన మాళవిక మోహనన్
హీరోయిన్ మాళవిక మోహనన్ ‘సర్దార్-2’ సినిమాలో యాక్షన్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఆమె ఏకంగా 60 అడుగుల ఎత్తు నుంచి తాడు సహాయంతో డైవ్ చేసిందట. అయితే అది నిజంగా కాదు, సినిమా కోసమే.విమానం నుంచి దూకుతున్న అనుభూతి కలిగేలా షూటింగ్లో భారీ బ్లోయర్లను ఏర్పాటు చేశారని మాళవిక తెలిపింది. అంత ఎత్తు నుంచి కిందకు వస్తూనే శరీర భంగిమను కాపాడుకోవడంతో పాటు డైలాగ్ కూడా చెప్పాల్సి వచ్చిందట. కెరీర్లో తాను చేసిన అత్యంత క్రేజీయెస్ట్ సీన్ ఇదేనని చెప్పుకొచ్చింది. ఎంత పక్కా జాగ్రత్తలు తీసుకొని చేసినప్పటికీ అంత ఎత్తు నుంచి కాస్త కిందకు జారాలంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది. కానీ హీరోయిన్ మాళవిక మాత్రం ఎంజాయ్ చేశానని చెబుతోంది.ఇక హీరో కార్తీ, తనకు ఒక కామన్ పాయింట్ ఉందని మాళవిక తెలిపింది. ఇద్దరికీ భోజనం కంటే అల్పాహారం, స్నాక్స్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పింది.పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్ 2’. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య విలన్ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. -
‘మా అన్నలో బాగా నచ్చిన క్వాలిటీ ఇదే..’
'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన అందుకుంది. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ను మంగళవారం హైదరాబాద్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చదవండి: ‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్ఇవే నేర్చుకున్నా..‘విజయ్ దేవరకొండలో మీకు నచ్చిన అంశం ఏంటి’ అని యాంకర్ సుమ ఆనంద్ దేవరకొండను అడిగారు. ఆయన బదులుగా.. ‘మా అన్న దేనికీ భయపడరు. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అసలు ఆయన భయంతోనే బతకరు అదే మా అన్నయ్య నుంచి నేర్చుకున్నా’ అని ఆనంద్ దేవరకొండ చెప్పారు. దీంతో అక్కడ ఉన్న విజయ్దేవరకొండ అభిమానులు సంబరపడ్డారు. రణబాలి టీజర్..కాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. ఈ సినిమా అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో రేపు (సెప్టెంబర్ 9) టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. Brothers Bonding 🥰Ma anna #VijayDeverakonda దేనికీ భయపడడు. ఎలాంటి పరిస్థితినైనా Face చేస్తాడు, Attack చేస్తాడు.”:- Hero #AnandDeverakonda #EPIC pic.twitter.com/NI0NAgOfSf— Milagro Movies (@MilagroMovies) September 8, 2026 -
జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఈ మార్పు గమనించారా?
భారతీయ సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వం పక్షాన అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డులు చరిత్రలో తొలిసారిగా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాయి. ఇక నుంచి నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానాన్ని దేశరాజధాని ఢిల్లీకే పరిమితం చేయకుండా, దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వేదికను మార్చాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1954లో తొలి జాతీయ అవార్డుల నాటి నుంచి ఇప్పటి వరకు అనేక దశాబ్దాలుగా ఢిల్లీ వేదికగానే సాగుతూ వచ్చిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం అలా తొలిసారిగా ఈ ఏడాది వేదిక మార్చుకుంది. గుజరాత్లోని నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్ (కేవడియా)లో ఈ సెప్టెంబర్ 22న తాజా అవార్డుల ప్రదానం జరగనుంది.ఏటేటా రాష్ట్రపతి చేతుల మీదుగా సాగే ఈ ప్రదానోత్సవం... ఈసారీ అదే సంప్రదాయాన్ని కొనసాగించనుంది. ఈ నెల ద్వితీయార్ధంలో గుజరాత్ పర్యటనలో ఉండనున్న భారత రాష్ట్రపతి ఈ 72వ జాతీయ అవార్డులను విజేతలకు అక్కడే అందజేయనున్నారు. 2024వ సంవత్సరానికి గాను నేషనల్ అవార్డు విజేతల పేర్లను మొన్న జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే.నర్మదా తీరంలో ఏర్పాటుచేసిన వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)తో గుజరాత్లోని ఏక్తా నగర్ కొంతకాలంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గుజరాత్ పర్యటనలో భాగంగా ఏక్తా నగర్ను సైతం రాష్ట్రపతి సందర్శించనున్నారు. అక్కడే ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. సర్వసాధారణంగా ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో ఏటా జరిగే ఉత్సవానికి భిన్నంగా ఈసారి మరింత కన్నులపండుగగా కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.ఇప్పటికి ఏడు దశాబ్దాల పైగా ఏటా ఇస్తున్న ఈ అవార్డుల్లో ఫీచర్ ఫిల్ములు, నాన్ – ఫీచర్ ఫిల్ములు, భారతీయ సినిమాపై అత్యుత్తమ రచనలనే ప్రధాన విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తారు. 2024వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు గాను అందించనున్న తాజా 72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’ ఎంపికైంది. ఉత్తమ నటిగా యామీ గౌతమ్ (చిత్రం: ‘ఆర్టికల్ 370’), ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్మూట్టి (చిత్రం: ‘భ్రమయుగం’), కార్తీక్ ఆర్యన్ (చిత్రం: ‘చందు ఛాంపియన్’)లు సంయక్తంగా విజేతలయ్యారు. ఈసారి నాన్ ఫీచర్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్కు రావడం విశేషం. ఇప్పుడు సరిగ్గా అదే ప్రాంతంలో జాతీయ అవార్డుల ప్రదానం జరగడం గమనార్హం.ఇదీ చదవండి: ఏపీలో చిరంజీవి కుమార్తెకు కీలక పదవి!వివిధ విభాగాల్లో మన తెలుగు సినిమాలు ‘కల్కి 2898 ఏడీ’, ‘పుష్ప-2’తో పాటు ‘అమరన్’, ‘భూల్ భులయ్యా-3’, ‘స్త్రీ-2’ తదితర చిత్రాలు సైతం అవార్డులు స్వీకరించనున్నాయి. అవార్డు ప్రదానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ నటీనటులు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు గుజరాత్కు రానుండడం విశేషం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు, మరాఠీ, గఢ్వాలీ సహా వేర్వేరు భాషల్లో రూపొందించిన ఫిల్ములు అవార్డులను అందుకోనున్నాయి. సంథాలీ భాషలో రూపొందిన ఓ ఫిల్ముకు తొలిసారిగా నాన్ – ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కడం విశేషం. -
‘బతుకమ్మ ఛాలెంజ్ను సద్వినియోగం చేసుకోండి’
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను యువ ఫిలిం మేకర్స్ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండీ జి. ముకుందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, సెట్విన్ మాజీ చైర్మన్ గిరిధర్రెడ్డితో కలిసి మంత్రి ఛాలెంజ్ పోస్టర్ను ఆవిష్కరించారు.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్విజయవంతం చేయాలని..మంత్రి మాట్లాడుతూ.. షార్ట్ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఛాలెంజ్ చక్కటి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. యువ ఫిలిం మేకర్స్, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. -
‘బేబీ’ గుర్తుకు రాకపోతే విజయం సాధించినట్టే: వైష్ణవి చైతన్య
‘బేబీ’ తర్వాత ఆనంద్, నేను ఛాలెంజింగ్గా తీసుకొని ‘ఎపిక్’ చేశాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘బేబీ’ గుర్తుకురాకపోతే మేము విజయం సాధించినట్టే. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది’ అన్నారు తెలుగు బ్యూటీ వైష్ణవి చైతన్య. బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వైష్ణవి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మనం ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ, ప్రతి లవ్ స్టోరీలోనూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఎపిక్ లో కూడా ఆ ప్రత్యేకత ఉంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యూకేకి చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్ లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణల మీద నడిచే సినిమా. అమ్మాయి జీవితాన్ని ఒకలా చూస్తుంది. అబ్బాయి ఒకలా చూస్తాడు. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు? వీరిద్దరి ఆలోచనలు ఏంటి? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాలో హంగామా ఉండదు. హత్తుకునేలా ఉంటుంది.→ ఇందులో ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. క్లారిటీ ఉన్న అమ్మాయి.→ కడలి పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ, కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. బయటకు రాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది.→ కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. ఎపిక్ ఎంచుకోవడానికి కారణమదే.→ దర్శకుడు ఆదిత్యతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆయన జీవితాన్ని చాలా లోతుగా గమనిస్తుంటారు. జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, అందులో ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంటారు. ఎపిక్ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. ఆదిత్య, కడలి పాత్రల మధ్య జరిగే చిన్న విషయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూపిస్తారు. ఆదిత్య యూనిక్ డైరెక్టర్. నాకు బాగా ఇష్టమైన దర్శకులలో ఆయన ఒకరు.→ నేను ఏదైనా విషయం బయట మాట్లాడాలంటే కాస్త భయపడుతుంటాను. కడలి పాత్ర ద్వారా నేనొక విషయం నేర్చుకున్నాను. ముందు మనల్ని మనం నమ్మాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి.→ అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉన్న సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే.. ఒక సముద్రం లాంటి అమ్మాయి, తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూ.. తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించింది అనేది ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది.→ ఈ సినిమాలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడతాం కాబట్టి, 90s వెబ్ సిరీస్ అంత క్లీన్ ఎంటర్టైనర్ లా ఉండకపోవచ్చు. కానీ, దర్శకుడు ఆదిత్య ఈ సినిమాకి ఏది అవసరమో అది చూపిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడొచ్చు.→ కొత్త సినిమా విషయాలకొస్తే.. సితార బ్యానర్ లో నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళ్ లో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. -
వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్బాస్ హౌస్
బిగ్బాస్ సీజన్ 10లో హౌస్మేట్గా మారేందుకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద రచ్చ మొదలైంది. రెడ్, బ్లూ టీమ్ సభ్యుల ఫొటోలను పెట్టి.. హౌస్మేట్గా మారేందుకు అర్హత లేని ఐదుగురి ఫొటోలపై కారణాలు చెబుతూ స్టార్ చేయాలని బిగ్బాస్ ఆదేశించాడు. దీంతో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.రాంప్రసాద్, వర్షిణి ఎం చెప్పారంటే..బ్లూ టీమ్ నుంచి వర్షిణి, రాంప్రసాద్ కలిసి రోహిత్, చరణ్ ఫొటోలపై స్టార్ చేశారు. అగ్నిపరీక్షలో రోహిత్ను పదేపదే లేపి పైకి కూర్చోబెట్టారని.. అంతేతప్ప అతనికి అంత సీన్ లేదని వర్షిణి చెప్పింది. అగ్నిపరీక్షలో రోహిత్ 100 శాతం ఇచ్చాడని అనుకుంటే.. హౌస్లో మాత్రం 10 శాతం కూడా చరణ్ లేడని రాంప్రసాద్ వ్యాఖ్యానించాడు.మరోవైపు దేబ్జానీ.. షాలినీ ఫొటోపై స్టార్ చేసింది. షాలినీకే అంతా తెలుసన్నట్లు వ్యవహరించడం తనకు నచ్చలేదని చెప్పింది. అలాగే సృష్టి, అమన్ కూడా హౌస్మేట్గా ఉండేందుకు అర్హులు కాదంటూ బ్లూ టీమ్ సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.రెడ్ టీమ్వాళ్ల వాదనలు ఇవీ..ఇదే టాస్క్ను రెడ్ టీమ్కు కూడా బిగ్బాస్ ఇచ్చాడు. అయితే ఈసారి కూడా అందరి ముందే కారణాలు చెప్పాలని ఆదేశించాడు. దీంతో రోహిత్ రంగంలోకి దిగాడు. రాంప్రసాద్, వర్షిణి, వినాయకుడు (కృష్ణుడు), దేబ్జానీ, త్రిగుణ్ ఫొటోలపై స్టార్ చేశాడు. వీళ్లు కూడా హౌస్మేట్గా పనికిరారని చెబుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లు టాస్క్లో రూల్స్ అన్నీ బ్రేక్ చేశారని, ఎదుటివాళ్లు చెప్పేది వినే ఓపిక కూడా లేదని రోహిత్ ఆరోపించాడు. ఊరికే ఓవర్ డామినేషన్ చేస్తారని, పనికిరాని వాదనలు చేస్తారని విమర్శించాడు. రోహిత్ మాటలకు వర్షిణి వెకిలిగా నవ్వడంతో వాతావరణం మరింత వేడెక్కింది.రోహిత్కి గట్టి కౌంటర్..అక్కడితో ఆగని వినాయకుడు (కృష్ణుడు).. రోహిత్కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. తాను 100 శాతం ఇవ్వలేదని ఎలా అంటావంటూ ప్రశ్నించాడు. ‘యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ ఏ లీడర్.. నువ్వు ఎలా ఉండాలో మాకు చెబుతున్నావు. నువ్వు రాజు.. మేము నీ సైనికులమా?’ అంటూ రోహిత్పై తీవ్రంగా మండిపడ్డాడు.ఇప్పటికే టాస్క్ విషయంలో రెండు టీమ్ల మధ్య పోటీ తారస్థాయికి చేరగా.. రోహిత్, వినాయకుడి మధ్య మాటల యుద్ధం మరింత ఆసక్తిని పెంచింది. ప్రోమో చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్లో బిగ్బాస్ హౌస్లో పెద్ద వార్ జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుంది? ఎవరు వెనక్కి తగ్గుతారు? హౌస్మేట్గా మారే అవకాశం ఎవరికి దక్కుతుంది? తెలియాలంటే ఈరోజు రాత్రి 9.30 గంటల వరకు వేచి చూడాల్సిందే! -
ఏపీలో చిరంజీవి కూమార్తె సుస్మితకు పదవి
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు, ఫ్యాషన్ డిజైనర్, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్లో పదవి దక్కింది. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమె నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారికంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై సూచనలు చేయడం, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యం కావడం వంటి అంశాల్లో సుస్మిత కొణిదెల తన సేవలను అందించనున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే మెగా కుటుంబానికి ఓ పదవిని ఇచ్చింది. తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా చిరంజీవి సతీమణి సురేఖను నియమించిన సంగతి తెలిసిందే.ఇక సుస్మిత విషయానికొస్తే.. ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ని ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం సినీ నిర్మాతగా రాణిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. తన తండ్రి చిరంజీవిని హీరోగా పెట్టి ఆమె నిర్మించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి విడుదలై విజయాన్ని అందుకుంది. -
ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు రెడీ అయింది. సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ కథేంటంటే.. సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. -
‘దురంధర్’ రేంజ్లో ‘అరసన్’.. శింబు మాటలతో పెరిగిన అంచనాలు!
తమిళ హీరో శింబు నటిస్తున్న తాజా చిత్రం అరసన్. వెట్రిమారన్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. నటి ప్రియాంక మోహన్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా నటి ఆండ్రియా, సముద్రఖని, కిశోర్ తదితరులు ముఖ్య పాత్ర లు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్స్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరచాలి. ముఖ్యంగా నటుడు శింబు గెటప్స్ ఆసక్తని రేకెత్తిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు అరసన్ చిత్రం గురించి ఎక్కడా మాట్లాడని నటుడు శింబు తొలి సారిగా ఇటీవల ఒక వేదికపై స్పందించారు. ఆయ న పేర్కొంటూ అరసన్ చిన్న చిత్రం కాదు. ఇందులో నేను చిన్న వయసు నుంచి పలు వయసుల గెటప్స్లో కనిపిస్తాను. హిందీలో దురంధర్ చిత్రం ఎంత ప్రభావం చూపిందో, తమిళంలో అరసన్ చిత్రం అంతగా ప్రభావం చూపుతుంది. దర్శకుడు వెట్రిమారన్ పూర్తిగా దృష్టి పెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. పలు యదార్థ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నామని శింబు పేర్కొన్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు శింబు చెప్పా రు. అరసన్ చిత్రం కచ్చితంగా తమిళ సినిమా ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో ఆయన అభిమానులు తమ ఖుషీ అవుతున్నారు. -
Bigg boss 10 : బిగ్బాస్ ఇంట్లో తొలిరోజే రచ్చ.. ‘నాయకుడి’ కోసం పెద్ద గొడవ!
బిగ్బాస్ అంటేనే ఆటలు, టాస్కులు, గొడవలు, అరుపులు.. షో మొదలైన తొలి రోజే ఇవన్నీ కనిపించాయి. ఒకవైపు ‘మ్యాజికల్ కీస్’ కోసం పోటీ.. మరోవైపు హౌస్మేట్స్ హోదా కోసం ‘మహా పరీక్ష’. ఇక టీమ్ లీడర్ల ఎంపిక దగ్గరికి వచ్చేసరికి సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా హౌస్ రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపించింది. మాటల యుద్ధంతో హౌస్లో వేడి వాతావరణం నెలకొంది. ఇంతకీ తొలిరోజు ఏం జరిగింది? ఎవరి చేతికి ఎలాంటి పవర్స్ వచ్చాయి? ఎవరు ఏ టీమ్కు నాయకులుగా నిలిచారు? తొలిరోజు హైలెట్స్పై ఓ లుక్కేయండి..మరో ఇద్దరి చేతికి మ్యాజికల్ కీస్!బిగ్బాస్ ఇంట్లో మొత్తం 16 మంది ఉండగా.. ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు మ్యాజికల్ కీస్ను సొంతం చేసుకున్నారు. మరో ఇద్దరికి కీస్ రావాల్సి ఉండటంతో.. ఈ వారమంతా ‘మహా పరీక్ష’ ఉంటుందని బిగ్బాస్ ప్రకటించాడు. వచ్చే వారంలో చాలామంది ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని, ఇంకా ఎవరూ పూర్తి స్థాయి హౌస్మేట్స్ కాలేదని స్పష్టం చేశాడు. మ్యాజికల్ కీస్ సాధించిన ఎనిమిది మంది కలిసి మరో ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్బాస్ సూచించాడు. దీంతో త్రిగుణ్ వంశీ, కృష్ణుడు పేర్లను ప్రతిపాదించాడు. మరోవైపు షాలినీ రోహిత్ పేరును సూచించింది. కొద్దిసేపు చర్చ జరిగిన అనంతరం అందరూ కలిసి వంశీ, కృష్ణుడు పేర్లకు ఓటు వేశారు. దీంతో వారిద్దరూ కూడా మ్యాజికల్ కీస్ను దక్కించుకున్నారు.రోహిత్ టాస్క్ చేయలేదంటూ త్రిగుణ్ ఫైర్బిగ్బాస్ ఇచ్చిన వాటర్ కొట్టే టాస్క్ను రోహిత్ చేయలేదంటూ పలువురు కంటెస్టెంట్లు ప్రస్తావించారు. ఇదే విషయాన్ని త్రిగుణ్ కూడా పదేపదే ప్రస్తావిస్తూ తన వాదనను వినిపించాడు. అయితే తమ నిర్ణయం అందరికీ నచ్చకపోవడంపై దేబ్జానీ అసంతృప్తి వ్యక్తం చేసింది.‘మీ నిర్ణయం నాకు ఫెయిర్గా అనిపించలేదు’ అంటూ రాం ప్రసాద్తో దేబ్జానీ చెప్పింది. అయితే సెలెబ్రిటీ కేటగిరీలో ఉన్న ఇద్దరికే అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందంటూ సరదాగా నవ్వేసింది.వర్షిణితో అమన్ ఫ్లర్టింగ్..ఇక హౌస్లో కొన్ని సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. కిచెన్లో ఝాన్సీ, వర్షిణి టీ తయారు చేస్తుండగా.. అక్కడికి వచ్చిన అమన్ వర్షిణితో సరదాగా ఫ్లర్ట్ చేశాడు. వర్షిణి టీ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఆమెను పొగిడాడు. మరోవైపు బెడ్రూంలో రాం ప్రసాద్, నరేష్, దేబ్జానీ సరదాగా మాట్లాడుకున్నారు. రాం ప్రసాద్ను ‘రామన్న’ అంటూ పిలిచిన దేబ్జానీ.. ఇంట్లో జెన్యూన్ పర్సన్ నువ్వే అంటూ ప్రశంసించింది.త్రిగుణ్, షాలినీ మధ్య కిచెన్లో గొడవకిచెన్లో చపాతీలు చేస్తున్న త్రిగుణ్ వద్దకు వచ్చిన షాలినీ కర్రీ గురించి అడిగింది. అయితే ‘అది నా కేటగిరీ కాదు’ అని త్రిగుణ్ సమాధానం ఇచ్చాడు. ఆ మాటను షాలినీ తప్పుగా తీసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సాధారణంగా కూడా చెప్పొచ్చు కదా అంటూ షాలినీ ప్రశ్నించడంతో మాటామాటా పెరిగింది.నామినేషన్స్పై నరేష్, రాం ప్రసాద్ కామెడీమరోవైపు నామినేషన్స్ గురించి నరేష్, రాం ప్రసాద్ సరదాగా మాట్లాడుకున్నారు. గార్డెన్లో తిరుగుతూ ‘వాళ్లని చేద్దాం.. వీళ్లని చేద్దాం.. వద్దులే పాపం.. వాళ్లకి ఫ్యామిలీ ఉంది.. వీళ్లకి ఈ కష్టాలున్నాయి’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేసుకున్నారు. చివరికి మనిద్దరమే మిగిలాం.. ఒకరినొకరం నామినేట్ చేసుకుందాం అంటూ ఇద్దరూ నవ్వులు పూయించారు.ఒక్కొక్కరి చేతికి ఒక్కో పవర్మ్యాజికల్ కీస్ సొంతం చేసుకున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ బిగ్బాస్ పిలిచి.. వారి కీ ద్వారా లభించే పవర్ ఏంటో వివరించాడు. అయితే తమకు వచ్చిన పవర్ గురించి ఇతర కంటెస్టెంట్లతో చర్చించవద్దని వార్నింగ్ ఇచ్చాడు.ముందుగా త్రిగుణ్కు ‘టేక్ ఓవర్’ పవర్ వచ్చింది. అంటే తనకు నచ్చిన మరో కంటెస్టెంట్ పవర్ను తీసుకునే అవకాశం అతడికి లభించింది. ఝాన్సీకి ఓ పవర్ ఇచ్చి వీకెండ్ ప్రారంభం కావడానికి ముందు వీక్లో ఎప్పుడైన దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పాడు. ఎలిమినేషన్ భయం ఉంటే ఈ పవర్ని యూజ్ చేసుకొని సేవ్ కావచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ముఖేష్ గౌడ: ఇతరుల పవర్ను రివర్స్ చేసే అవకాశంవర్షిణి: ‘గ్రాబ్ ఎనీ విన్’ పవర్కృష్ణుడు: ‘స్వాప్’ పవర్షాలినీ: ఇంట్లోని ఒక డ్యూటీని అసైన్ చేసే పవర్శ్రిష్టి: ఒకరిని నేరుగా నామినేట్ చేసే పవర్రాం ప్రసాద్: ‘సేఫ్ షీల్డ్’.. నామినేషన్ నుంచి ఒకరిని కాపాడే అవకాశంనరేష్: నామినేషన్స్లో డబుల్ ఓట్స్ వేసే పవర్.. ఇలా మ్యూజికల్ కీస్ గెలుచుకున్న ఒక్కొక్కరికి ఒక్కో పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్కిచెన్, క్లీనింగ్ డ్యూటీల దగ్గర మళ్లీ గొడవఆ తర్వాత హౌస్లో కిచెన్, క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ వంటి పనులను విభజించే ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలోనూ త్రిగుణ్తో గొడవ జరిగింది.సుధీర్ డిష్ వాషింగ్ బాగా చేశాడని చెప్పడంతో.. ‘మేం చేయలేమా?’ అంటూ ముఖేష్, రోహిత్, సుధీర్, షాలినీ తదితరులు వాదనకు దిగారు. డ్యూటీలను ఎవరు ఎలా చేయాలనేది తామే నిర్ణయించుకుంటామని వారు స్పష్టం చేశారు.దేబ్జానీ బ్యాటరీని సరిగ్గా ధరించకపోవడంతో బిగ్బాస్ ఆమెను హెచ్చరించాడు. అయితే ‘ఎందుకు బిగ్బాస్.. క్యూట్గా చెప్పొచ్చు కదా’ అంటూ దేబ్జానీ సరదాగా స్పందించింది. చివరకు బిగ్బాస్కు సారీ చెప్పింది. దీనికి బిగ్బాస్ కూడా ఆసక్తికరంగా స్పందిస్తూ.. తాను స్కూల్ ప్రిన్సిపల్నో.. సాంటానో మున్ముందు తెలుస్తుందని చెప్పాడు.హౌస్మేట్ హోదా కోసం ‘మహా పరీక్ష’ఇక అసలు ఆట ఇక్కడే మొదలైంది. ‘హౌస్మేట్స్ హోదాను పొందడమే మీ లక్ష్యం. నామినేషన్లో లేకపోయినా అందరికీ ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. మహా పరీక్షలో గెలిచి హౌస్మేట్ హోదాను పొందాలి. ఎలిమినేషన్ మాత్రం కన్ఫామ్’ అంటూ బిగ్బాస్ కీలక ప్రకటన చేశాడు.అంతేకాకుండా 16 మంది రెండు టీమ్లుగా విడిపోయి.. హై రిస్క్ నుంచి నో రిస్క్ వైపు తీసుకెళ్లగల సత్తా ఉన్న ఇద్దరు నాయకులను ఎంచుకోవాలని సూచించాడు.లీడర్గా రోహిత్.. రాంప్రసాద్టీమ్ లీడర్ల ఎంపికలో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో దాదాపు అందరూ రోహిత్కు మద్దతు తెలిపారు. ఒక్క ఝాన్సీ మాత్రమే మినహాయింపు. మరోవైపు సెలెబ్రిటీ కంటెస్టెంట్లు రాం ప్రసాద్, త్రిగుణ్ పేర్లకు ఓటు వేశారు.అయితే త్రిగుణ్ మాత్రం రాం ప్రసాద్ను లీడర్గా ఉంచాలని సూచించాడు. అగ్నిపరీక్ష టీమ్ మొత్తం కలిసి రోహిత్కు ఓటు వేసిందని, వాళ్లంతా ఒక గ్రూప్గా ఉన్నారని త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. తాను మాత్రం ఝాన్సీకి ఓటు వేసినట్లు చెప్పాడు.త్రిగుణ్పై షాలినీ, శ్రిష్టి ఫైర్త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలతో షాలినీ, శ్రిష్టి, రోహిత్, చరణ్, అమన్ తదితరులు అతడిపై మాటల దాడికి దిగారు.‘మేం రోహిత్ ఆట చూశాం.. అందుకే అతడిని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు కూడా సెలెబ్రిటీలకే ఓట్లు వేసుకున్నారు కదా.. మరి మేం అలా అన్నామా?’ అంటూ షాలినీ, శ్రిష్టి ప్రశ్నించారు.దీంతో హౌస్లో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బిగ్బాస్ ఇంట్లో రెండు టీమ్లు ఏర్పడ్డాయి. బ్లూ టీమ్కు రాం ప్రసాద్, రెడ్ టీమ్కు రోహిత్ నాయకులుగా నిలిచారు. లీడర్ల ఎంపికతో తొలి రోజు ఎపిసోడ్ ముగిసింది.మొత్తానికి బిగ్బాస్ సీజన్ తొలి రోజే ఆటకు కావాల్సిన మసాలా మొత్తం కనిపించింది. మ్యాజికల్ కీస్, కొత్త పవర్స్, నామినేషన్స్ చర్చలు, వ్యక్తిగత గొడవలు, సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా మారిన గ్రూప్ వార్.. ఇలా తొలిరోజే హౌస్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ‘మహా పరీక్ష’లో ఎవరు నెగ్గుతారు? ఎవరు హౌస్మేట్స్గా కొనసాగుతారు? ఎవరి ప్రయాణం మధ్యలోనే ముగుస్తుందో చూడాలి. -
గుర్తింపు కోసం అందాలు ఆరబోయను : కయాదు లోహర్
చేతిలో అవకాశాలు ఫుల్గా ఉన్న నటి కయాదు లోహర్. తమిళం తెలుగు మలయాళం అంటూ ఇప్పుడు దక్షిణాది సినిమాను చుట్టే స్తోందనే చెప్పాలి. ఈ బ్యూటీ నటించిన ఒక తెలుగు చిత్రం, ఒక మలయాళ చిత్రం ఒకే సారి విడుదల అవ్వడం విశేషం. అందులో ఒకటి జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించిన ఇమ్మార్టల్ కాగా, మరొకటి దుల్కర్ సల్మాన్తో జత కట్టిన ఐయామ్ గేమ్ చిత్రం. జీవి ప్రకాష్ కుమార్ కు జంటగా నటించిన ఇమ్మార్టల్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ఐయామ్ గేమ్ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్లొందనే విమర్శలను కయాదు లోహర్ ఎదుర్కొంటోంది. అయితే ఈ రెండు చిత్రాలు మిశ్రమ స్పందనతోనే ప్రదర్శింపబడుతున్నాయి. దీంతో డ్రాగన్ చిత్రం తరువాత ఈ అమ్మడికి సరైన సక్సెస్ రాలేదు. అయితే ఇటీవల విమర్శలను ఎదుర్కొంటోంది. బిజీగా ఉన్న నటికి విమర్శలు ఎదురవ్వడం సహజమే. కాగా తనపై వస్తున్న విమర్శలపై ఒక భేటీలో స్పందించిన ఈ భామ.. తాను ప్రస్తుతం సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నానని, ఒక్క రోజు కాల్ షిట్ను మాత్రమే ఐయామ్ గేమ్ చిత్ర ప్రమోషన్స్కు కేటాయించినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇమ్మార్టల్ చిత్ర ప్రమోషన్ లో పాల్గొనడానికి సమయం లేకపోయిందని పేర్కొంది. ఇకపోతే గ్లామర్ గురించి అడుగుతున్నారని, అయితే కథానాయికలు అనవసరంగా ఆట బొమ్మలుగా చూపించడానికి తాను వ్యతిరేకమని అన్నారు. అయితే కథకు తప్పని సరి అయితే, ఆ పాత్ర నమ్మదగినదిగా తనకు అనిపిస్తే హద్దులు మీరని గ్లామర్ కు సమ్మతిస్తానని పేర్కొంది. అంతే కానీ ఎవ రి దృష్టిలో పడాలనో అందాలారబోయనని కయాదు లోహర్ వెల్లడించారు. -
మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు: సుమంత్ ప్రభాస్
‘‘రోమాంచకం’ చేస్తున్నప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అంతే బాగా ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. మేము కోరుకున్నటే ఆడియన్స్ బాగా నవ్వుకుంటున్నారు. ఈ మూవీ వల్ల హీరో ప్రభాస్ అన్నని కలవడం సంతోషం. ఈ సినిమా నాకు అన్ని రకాలుగా చాలా ప్రత్యేకం. ఇంకా మా చిత్రం చూడని వారు థియేటర్లకు వెళ్లండి.. మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు’’ అని హీరో సుమంత్ ప్రభాస్ తెలి పారు. వేణుగో పాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల అయింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన బ్లాక్ బస్టర్ ఈవెంట్లో డైరెక్టర్ వేణుగో పాల్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సందీప్, ప్రణయ్గార్లు ‘రోమాంచకం’కి అవకాశంతో పాటు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కుటుంబ ప్రేక్షకులంతా మా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ–‘‘రోమాంచకం’ సినిమా థియేటర్స్లో బాగా రన్ అవుతోంది. ఎక్కడా నవ్వులు తగ్గలేదు. మా మూవీకి 8.5 కోట్ల రూ పాయల కలెక్ష న్స్ వచ్చాయి’’ అని పేర్కొన్నారు. ‘‘థియేటర్స్కు వచ్చి ‘రోమాంచకం’ మూవీ చూడండి. మీకొక డిఫరెంట్ ఎక్స్పీరియ న్స్ ఇస్తుంది’’ అన్నారు డైరెక్టర్, యాక్టర్ అనుదీప్ కేవీ. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ రజిత, డైలాగ్ రైటర్ మీరక్, నటులు సోహాన్, నరేంద్ర రవి, వెంకటేష్ కాకుమాను మాట్లాడారు. -
నా కెరీర్లో సర్దార్ 2 చాలా ముఖ్యం: కార్తీ
‘‘నా కెరీర్లో ‘సర్దార్ 2’ కచ్చితంగా చాలా ముఖ్యమైన సినిమా. ఇలాంటి ఒక గూఢచారి పాత్ర దొరకడం నా అదృష్టం. ‘సర్దార్ 2’ సినిమా విజయంపై నాకు నమ్మకం ఉంది. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను’’ అని కార్తీ అన్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్ 2’. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య విలన్ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ–‘‘కమల్హాసన్గారికి ‘ఇండియన్’(తెలుగులో భారతీయుడు) సినిమా ఎలానో నాకు ‘సర్దార్’ అలాగ. ఈ మూవీ తెలుగులోనూ చాలా పెద్ద హిట్ అయింది. ఆ మూవీ చూడని వారు ఓ సారి ఓటీటీలో చూసి ‘సర్దార్ 2’ కి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్కి తెరకెక్కించిన మా నిర్మాతలు లక్ష్మణ్, వెంకటేశ్గార్లకు, విడుదల చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జునగారికి, సుప్రియగారికి, శ్రీధర్గారికి ధన్యవాదాలు’’ అన్నారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ–‘‘కార్తీసర్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఆల్టైమ్ ఫేవరేట్ మూవీస్లో ఆయన ‘ఆవారా, ఖైదీ, సర్దార్’ వంటి సినిమాలున్నాయి. ‘సర్దార్ 2’ ఘన విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో డైరెక్టర్స్ బోయ పాటి శ్రీను, కళ్యాణ్ శంకర్, అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, వై.రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, అనిల్ సుంకర, శ్రీధర్, హీరోయిన్లు మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, నటుడు ఎస్జే సూర్య మాట్లాడారు. -
ఆటా పాటా
వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. కీర్తీ సురేష్, కృతీ శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు. అర్చన, జీ స్టూడియోస్, సురేష్ ప్రోడక్షన్స్ సమర్పణలో సాహు గార పాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతోందని తెలిసింది. వెంకటేశ్, కల్యాణ్ రామ్లతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. అలాగే కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. -
RC17: సుకుమార్ కథ లాక్ చేశారా? ఇక చరణ్కు ఫైనల్ నెరేషన్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘RC17’పై ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ను పూర్తి చేసి కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే రామ్ చరణ్కు ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నారట. నెరేషన్ పూర్తయిన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకోనున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 డిసెంబర్లో ‘RC17’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా స్క్రిప్టింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ పనుల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందనే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అయితే చరణ్-రష్మికది ఫ్రెష్ కాంబో కాబట్టి ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది. ఇందులో భాగంగానే హీరోయిన్గా రష్మికని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది.సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది. -
విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 9న టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఇదీ చదవండి: సాయిబాబాపై సినిమా.. రిలీజ్ డేట్ ఇదే..కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
నాని ది ప్యారడైజ్.. రిలీజ్ డేట్పై క్లారిటీ
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్తో యూట్యూబ్లో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. చదవండి: సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమఅయితే సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు రావడంతో మూవీ విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని చిత్ర బృందం మరోసారి ప్రకటించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబరు 24న రిలీజ్ డేట్తో కూడిన పోస్టర్ను విడుదల చేసింది. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేయనున్నారు. -
తెరపైనా అదరగొడుతున్న ‘మిర్జాపూర్’.. కలెక్షన్లు ఎంతంటే.?
పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవి కిషన్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మిర్జాపూర్:ది మూవీ’. ఓటీటీలో ‘మిర్జాపూర్’ వెబ్సిరీస్కు మంచి ఆదరణ రావడంతో అదే పేరుతో మరో కొత్త కథతో తెరపైకీ తీసుకొచ్చారు. ఇప్పుడీ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తొలి రోజు నుంచే మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. ఆదివారం మరింత జోరు చూపించింది. మూడో రోజు ఏకంగా రూ. 36 కోట్ల నెట్ వసూళ్లూ సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువమంది చదివింది: ‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులురూ.100 కోట్లకు చేరువలో..గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం రూ.25.75 కోట్లతో బోణీ కొట్టింది. శనివారం అదే జోరులో కలెక్షన్లు మరింత పెరిగి రూ. 32 కోట్లకు చేరాయి. ఆదివారం వచ్చే సరికి ఈ చిత్రం రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్లు సుమారు రూ. 93.75 కోట్లకు చేరాయి. ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టేందుకు దాదాపు రూ.6 కోట్ల దూరంలోనే ఉంది.ఇదీ చదవండి: బిగ్బాస్లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లుఈ చిత్రం.. ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. సాక్నిల్క్(గణాంకాల నివేదిక) ప్రకారం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.132.35 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇందులో దాదాపు రూ.20 కోట్లు ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చినట్లు సమాచారం. -
మలయాళం బిగ్బాస్లో ‘గంధర్వ’ హీరోయిన్
మిస్ కేరళ-2014 విజేతగా గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి సురేశ్.. తాజాగా ‘బిగ్బాస్ మలయాళం 8’లోకి అడుగుపెట్టారు. మోహన్లాల్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఆమె పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి.. సినిమాల నుంచి రియాలిటీ షో వైపు అడుగులు వేయడం విశేషం.మిస్ కేరళ టైటిల్ గెలుచుకున్న తర్వాత గాయత్రి సురేశ్ సినిమాల్లోకి ప్రవేశించారు. కుంచాకో బోబన్ సరసన నటించిన ‘జమ్నా ప్యారి’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం ‘కరింకున్నం 6ఎస్’, ‘ఒరే ముగమ్’, ‘ఒరు మెక్సికన్ అపరాథ’ తదితర మలయాళ చిత్రాల్లో నటించారు. కొంతకాలం బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన ఆమె.. తన కెరీర్కు కొంతకాలం విరామం ఇచ్చారు.తాజాగా ‘డిస్కో’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు గాయత్రి ప్రకటించారు. ఆంటోనీ పెపే, అర్జున్ అశోకన్, చెంబన్ వినోద్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గాయత్రి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ‘హీరో హీరోయిన్’, ‘నేను లేని నా ప్రేమ కథ’, ‘గంధర్వ’ తదితర చిత్రాల్లో నటించారు. ర్యాంప్ వాక్ మోడల్గా కూడా గుర్తింపు పొందిన గాయత్రి.. సోషల్ మీడియాలో తన ఫొటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంటారు.ఇదిలా ఉండగా.. బిగ్బాస్ మలయాళం నాలుగో సీజన్కు ముందు గాయత్రి సురేశ్ షోలో పాల్గొంటారనే ప్రచారం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు తనను సంప్రదించిన విషయాన్ని అప్పట్లో ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే ఆ సీజన్లో తాను కంటెస్టెంట్గా పాల్గొనడం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే భవిష్యత్లో ఏదైనా సీజన్లో బిగ్బాస్ హౌస్లోకి రావచ్చని అప్పట్లో సంకేతాలు ఇచ్చారు. ఆమె అన్నట్టుగానే ఇప్పుడు బిగ్బాస్ మలయాళం 8లో గాయత్రి సురేశ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న గాయత్రి.. బిగ్బాస్ హౌస్లో ఎలాంటి ఆటతీరు కనబరుస్తారో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: బిగ్బాస్ హౌస్లోకి బాక్సింగ్ దిగ్గజం.. వణికిపోతున్న పోటీదారులు! -
బిగ్బాస్లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?
బిగ్బాస్ సీజన్ 10లో అసలు ఆట మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే హౌస్లో తొలినాళ్లలోనే విభేదాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం ఆసక్తిని పెంచుతోంది.బిగ్బాస్ సూచనల మేరకు..తొలి టాస్క్లో భాగంగా ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు కీలను సొంతం చేసుకున్నారు. మిగిలిన వారిలో మరో ఇద్దరికి ఆ రెండు కీలను ఎవరు ఇవ్వాలనేది నిర్ణయించుకోవాలని బిగ్బాస్ సూచించినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో ఎవరికి ఆ అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది.మరోవైపు కీల విషయంలో కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముకేశ్.. రాంప్రసాద్, త్రిగుణ్తో వాదిస్తున్నట్లు ప్రోమోలో కనిపించింది. ‘నాకు అన్నీ తెలిసినట్లు ముందే వెళ్లిపోవడానికి తొందరపడ్డారు’ అంటూ ముఖేశ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్బాస్లో ప్రత్యర్థులవుతారా..?మీతో ఆడితే గెలవచ్చు..ఇక త్రిగుణ్ మరో టీమ్తో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రోమోలో కనిపించాయి. ‘మీతో ఆడితే గెలవచ్చు’ అంటూ టెంపర్ వంశీని త్రిగుణ్ దూరం పెట్టినట్లుగా చూపించారు. దీంతో హౌస్లో గ్రూపులు ఏర్పడుతున్నాయా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఆ రెండు కీలను ఎవరికి ఇస్తారు? కీలక నిర్ణయం ఎవరికి అనుకూలంగా మారుతుంది? తెలియాలంటే ఈరోజు జగరబోయే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.ఇదీ చదవండి: టాలీవుడ్ 'చిన్న' హీరో.. బిగ్బాస్ 10లోకి వచ్చేశాడు View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్బాస్లో ప్రత్యర్థులవుతారా..?
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 10వ సీజన్ నిన్న (ఆదివారం) గ్రాండ్గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్గా సందడి చేశాడు. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్ నుంచి 6 మంది హౌస్లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ ఆ ఇద్దరి కంటెస్టెట్లపైనే పడింది. వాళ్లే రాంప్రసాద్, నరేశ్లు. బుల్లితెరపై తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన నరేశ్, రాంప్రసాద్ మంచి స్నేహితులు. ఇప్పుడు వీరిద్దరూ బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. బయట మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ.. హౌస్లో మాత్రం ఎలా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.బిగ్బాస్ విషయానికి వస్తే..బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత సంబంధాల కంటే ఆటకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. టాస్కులు, నామినేషన్లు, కెప్టెన్సీ పోటీలు వంటి అంశాలు హౌస్మేట్స్ మధ్య విభేదాలకు కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలో నరేశ్, రాంప్రసాద్ మధ్య స్నేహం ఆటను ఎంతవరకు ప్రభావితం చేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి ఉంటే హౌస్లో మంచి కామెడీ పండే అవకాశం ఉంది. ఒకరి బలహీనతలు, మరొకరి ప్లస్ పాయింట్లు ఇద్దరికీ బాగా తెలుసు కాబట్టి.. వారి మధ్య సంభాషణలు, సరదా పంచ్లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారొచ్చు.ఇదీ చదవండి: బిగ్బాస్ 10: హాట్ టాపిక్గా నాగార్జున రెమ్యునరేషన్భేదాభిప్రాయాలు రావడం..అయితే బిగ్బాస్ అంటేనే అనూహ్య పరిణామాలకు కేరాఫ్. ఒక టాస్క్లో పోటీ పడటం, నామినేషన్ సమయంలో ఒకరిపై మరొకరు అభిప్రాయం చెప్పాల్సి రావడం, ఇంట్లో నిర్ణయాల విషయంలో భేదాభిప్రాయాలు రావడం.. ఇలా ఏదైనా వారి మధ్య చిన్నపాటి మనస్పర్థకు దారితీయొచ్చు.ఇదీ చదవండి: శారీరక లోపం వరమైతే.. బిగ్బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్ఒకవేళ గొడవ జరిగితే?ఇదే ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. బయట మంచి స్నేహితులైన వీరిద్దరూ హౌస్లో గొడవ పడితే.. ఆ తర్వాత వెంటనే కలిసిపోతారా? లేక ఆట కోసం తమ స్నేహాన్ని పక్కన పెడతారా? అన్నది చూడాలి. ముఖ్యంగా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉండటంతో.. వాదన జరిగితే అది మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే వీరిద్దరి స్నేహమే హౌస్లో బలంగా మారుతుందా? లేక బిగ్బాస్ ఆట వారి స్నేహానికి పరీక్షగా నిలుస్తుందా? అనేది బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా? -
నిర్మాతల సంక్షేమమే మా లక్ష్యం
లక్డీకాపూల్: చిన్న నిర్మాతల సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, త్వరలో ప్రకటిస్తామని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) అధ్యక్షుడు సి. కల్యాణ్ వెల్లడించారు. చిన్న నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో దాదాపు 95 శాతం మంది నిర్మాతలు మద్దతు ఇవ్వడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. నిర్మాతల సంక్షేమమే తమ లక్ష్యం అని, వారికి లోటు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్మాతలందరూ ఒకే తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. గత రెండున్నరేళ్లుగా అందరూ కలిసి ముందుకు రాలేకపోయారని, ఇకపై కలిసి పని చేయాలని సి. కల్యాణ్ అన్నారు. ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో మొత్తం 1,168 ఓట్లకు గాను 643 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సి. కల్యాణ్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా మోహన్ వడ్లపట్ల, కేఎల్ దామోదర్ ప్రసాద్, కోశాధికారిగా చదలవాడ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు కానుమిల్లి, టి. రామసత్యనారాయణ గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పద్మిని నాగులపల్లి, రవిశంకర్ యలమంచిలి, సునీల్ నారంగ్, మోహన్ గౌడ్, కృష్ణప్రసాద్ శివలెంక, డీవీవీ దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, డీఎస్ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు వజ్జా, జె. పుల్లారావు, బాపిరాజు బల్లిపాడు, రామకృష్ణ గౌడ్, నయీమ్ అహ్మద్ ఎస్.కె., కె. నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యారు. -
బుల్తో ఫైట్
గత ఏడాది నవంబరులో జరిగిన ‘వారణాసి’ ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్ని గుర్తు చేసుకుంటే... ఆ వేడుకలో మహేశ్బాబు ఒక మెకానికల్ బుల్పై కూర్చుని వేదిక మీదకు వచ్చిన విషయం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... బుల్తో ఫైట్ చేయడానికి మహేశ్బాబు సిద్ధం అవుతున్నారట. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్లో మహేశ్బాబు పాత్రకు సంబంధించిన ఎలివేషన్ షాట్లో బుల్ విజువల్ కూడా కనిపించింది. ఇప్పుడు ఈ ఫైట్ చిత్రీకరణ కోసమే హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ని రూపొందించారని సమాచారం. ఈ ఫైట్ షూట్కి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నారట చిత్రదర్శకుడు రాజమౌళి. ఈ వారంలో ఈ ఫైట్ చిత్రీకరణను ఆరంభించనున్నారని తెలిసింది. ‘వారణాసి’ సినిమాకి హైలైట్స్గా నిలిచేవాటిలో ఈ ఫైట్ది ప్రముఖ స్థానం అని టాక్. ఇక పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్బాబు. ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
మహేంద్రగిరి వారాహి పెద్ద హిట్ కాబోతోంది
‘‘చిన్నప్పట్నుంచి నేను అమ్మ, నాన్నలతో కొన్ని విషయాలను చెప్పలేకపోయేవాణ్ణి. అలాంటప్పుడు ప్రతి ఫోన్కాల్ సుమంత్ అన్నకే వెళ్లేది. ఒక్కసారి కూడా ఆయన కాదనలేదు. ఈ రోజు నేను ఆయన సినిమా ఫంక్షన్కు వచ్చి, మాట్లాడటం హ్యాపీగా ఉంది. సుమంత్గారు నాకు స్పెషల్ బ్రదర్’’ అని అక్కినేని అఖిల్ అన్నారు. సుమంత్ హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరై, బిగ్ టికెట్ను లాంచ్ చేసిన అఖిల్ మాట్లాడుతూ– ‘‘సిద్ధుగారు హీరోగా సినిమాలు చేస్తూనే, కంటెంట్ ఉన్న ఈ తరహా సినిమాలో కూడా భాగమైనందుకు అభినందిస్తున్నాను. ఈ సినిమా కోసం దర్శకుడు సంతోష్ ప్రాణం పెట్టారు. ‘మహేంద్రగిరి వారాహి’ చాలా పెద్ద హిట్ కాబోతోంది. ఈ సినిమా సక్సెస్మీట్కు నన్ను పిలవాలని అడుగుతున్నాను. ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించిన లక్ష్మణ్, మధుగార్లకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. సుమంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం దాదాపు 150 థియేటర్స్లో వారాహి విగ్రహాలను పెట్టడం జరిగింది. గతంలో ‘అమ్మోరు’ సినిమాకు ఇలా చేశారట. ఈ సినిమా విషయంలో ఎప్పట్నుంచో ఒక డివోషనల్ వైబ్ను ఫీలవుతున్నాను. ఏదో శక్తి మా వెనకాల ఉందనిపిస్తోంది. సెప్టెంబరు 11న మా కష్టార్జితాన్ని థియేటర్స్లో మీరు చూడబోతున్నారు. ఇక ‘లెనిన్’తో తన సత్తా ఏంటో అఖిల్ నిరూపించాడు’’ అని తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘నేను యాక్టర్గా స్ట్రగుల్ అయినప్పట్నుంచి నిర్మాత మధుగారు నాకు తెలుసు. మధుగారి వల్ల ఈ మూవీలో భాగమయ్యాను’’ అని అన్నారు. సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మిన సుమంత్గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలోని రాజేంద్రవర్మ పాత్ర కోసం సిద్ధుగారిని అ్రపోచ్ అయినప్పుడు, ఆయన కథ నచ్చి, చేశారు. ఈ సినిమాతో నిర్మాతలకు ఒక మంచి హిట్ ఇచ్చి, వారి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను’’ అని చెప్పారు. మధు కాలిపు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం సుమంత్గారితో రెండున్నరేళ్లుగా జర్నీ చేస్తున్నాం. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన సిద్ధుకు రుణపడి ఉంటాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ చేశాను’’ అన్నారు బ్రహ్మానందం. -
‘గుప్పెడంత మనసు' రిషి సర్.. బిగ్బాస్ 10లోకి ఆగయా
ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్బాస్ హౌస్లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్( ముకేశ్ గౌడ) వచ్చేశాడు. చివరి కంటెస్టెంట్గా లోపల అడుగుపెట్టేశాడు.రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్గా 10వ సీజన్లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుంది. -
నటిగా మొదలుపెట్టి యాంకర్గా ఫేమస్ అయి.. ఎట్టకేలకు 'బిగ్బాస్'లోకి..
ప్రతిసారి 'బిగ్బాస్'లోకి గ్లామరస్ యాంకర్స్ని తీసుకొస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాతో హౌస్లోకి వచ్చిన బ్యూటీ వర్షిణి. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈమె పేరు వినిపించేది. కానీ చివరలో తూచ్ ఈమె లేదని తేలేది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్లో కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇకపోతే వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్బాస్లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి? -
'బిగ్బాస్'లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ 'వినాయకుడు'
తెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.. 'బిగ్బాస్' హౌస్లో 13వ కంటెస్టెంట్గా అడుగుపెట్టేశాడు. ఇతడి అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి? -
Bigg Boss 10: బిగ్బాస్లోకి నిజామాబాద్ కుర్రాడు
ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు. -
శారీరక లోపం వరమైతే.. బిగ్బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్
ప్రతిసారి బిగ్బాస్ షోలోకి కమెడియన్స్ వస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాలో పొట్టి నరేశ్ అలియాస్ కమెడియన్ నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గత పదేళ్లుగా పలు షోలతో అలరిస్తున్న ఇతడు.. ఇప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో బిగ్బాస్ 10లోకి 11వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్ ఆడిషన్స్కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. -
బిగ్బాస్ 10లోకి 'టెంపర్' విలన్
ఈసారి బిగ్బాస్లోకి టాలీవుడ్ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. తన లుక్స్తోనే అందరినీ భయపెట్టే 'టెంపర్' వంశీ.. 9వ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు. చూడటానికి రఫ్ అండ్ టఫ్గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి? -
Bigg Boss 10: అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి..ఎవరీ అమన్?
బిగ్బాస్ 10వ సీజన్లో 5వ కంటెస్టెంట్స్గా కామనర్స్ నుంచి అమన్ వెళ్లాడు. ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా గెలిచి హౌస్లోకి వెళ్లాడు. అయితే సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పోలిస్తే అమన్కు అంతగా పరిచయం లేకపోవడంతో.. అసలు ఎవరీ అమన్? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ముఖ్యంగా బిగ్బాస్ అగ్నిపరీక్షలో తనదైన శైలిలో ఆకట్టుకున్న అమన్.. ఇప్పుడు ఏకంగా బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.అమన్ మసూద్ మోడల్, డిజిటల్ క్రియేటర్, సోషల్ మీడియా పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యాషన్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన కంటెంట్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో కనిపిస్తూ వచ్చారు. నటన, మోడలింగ్పై ఆసక్తితో పాటు డిజిటల్ కంటెంట్ రంగంలోనూ యాక్టివ్గా ఉన్నారు.అయితే అమన్కు అసలు గుర్తింపు తెచ్చింది మాత్రం ‘బిగ్బాస్ అగ్నిపరీక్ష 2’. బిగ్బాస్ తెలుగు 10లో కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి అవకాశం దక్కించుకునేందుకు నిర్వహించిన ఈ సెలెక్షన్ షోలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకోని..ఇప్పుడు బిగ్బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు. మరి బిగ్బాస్ హౌస్లో కూడా అమన్ ఆకట్టుకుంటాడా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. -
బిగ్బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా?
అంగరంగ వైభవంగా 'బిగ్బాస్' 10వ సీజన్ మొదలైంది. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే కమెడియన్ ఆటో రాంప్రసాద్ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. తనదైన డ్యాన్స్తో అలరించాడు. గతంలో ఇతడి స్నేహితులైన ముక్కు అవినాష్, ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్లు కమెడియన్ కేటగిరీలో వచ్చారు. ఫుల్ ఎంటర్టైనర్ చేశారు. మరి వాళ్లని రాంప్రసాద్ మర్చిపోయేలా చేస్తాడా లేదా అనేది చూడాలి?రాంప్రసాద్ విషయానికొస్తే ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్కి రైటర్గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్తో కలిసిపోయాడు. ఇతడి టీమ్లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. -
‘బిగ్బాస్’లోకి ఇద్దరు ఆడపిల్లల తల్లి.. ఎవరీ సీరియల్ బ్యూటీ!
బిగ్బాస్ 10వ సీజన్లో 6వ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టిన చైత్ర రాయ్ స్వతహాగా కన్నడ. సొంత భాషలోనే తొలుత నటిగా కెరీర్ ప్రారంభించింది. సీరియల్స్తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.చైత్ర కేవలం సీరియళ్లకే పరిమితం కాలేదు. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లో ఓ సహాయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయానికొస్తే ప్రసన్న అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండో పాప పుట్టి కేవలం 10 నెలల మాత్రమే అవుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టేసింది. మళ్లీ తనదైన ప్రతిభ చూపించి తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకోవాలని అనుకుంటోంది.ప్రతి సీజన్లోనూ సీరియల్స్ నుంచి పాపులర్ నటీనటులను బిగ్బాస్ హౌస్లోకి తీసుకురావడం ఓ ఆనవాయితీ. ఈసారి చైత్ర రాయ్ని ఆ అవకాశం వరించింది. గ్లామర్, ఆమెకున్న ఫ్యాన్ బేస్, బోల్డ్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ షోకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని బిగ్బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. 10 నెలల పాపని వదిలేసి వెళ్తున్న ఈమె షోలో ఎంతలా మెప్పిస్తుందో చూడాలి? -
బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చిన ఫేమస్ యాంకర్
బిగ్బాస్ 10లోకి యాంకర్ కేటగిరీలో సుధీర్ రెడ్డి నాలుగో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. ఇతడి విషయానికి వస్తే గతంలో ఓ మీడియా ఛానెల్లో యాంకర్గా పనిచేశాడు. ప్రస్తుతం 'సుధీర్ టాక్స్' పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ(నంద్యాల)లో పుట్టి పెరిగిన సుధీర్.. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటూ పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు.సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి.. ఇప్పుడు బిగ్బాస్ 10లో ఓ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టడు. మరి బుల్లితెరపై అలరించిన ఇతడు ఈ రియాలిటీ షోలో ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి? -
అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్బాస్లోకి అడుగుపెట్టిన లేడీ రైతుబిడ్డ
తొలి సీజన్ నుంచి బిగ్బాస్ షోలో సామాన్యులు పాల్గొన్నప్పటికీ మహా అయితే ఒకటి రెండు వారాలకు మించి ఉండేవాళ్లు కాదు. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్, కల్యాణ పడాల లాంటి వాళ్లు ఏకంగా విజేతలయ్యారో.. కామనర్స్ అనే పదానికి విలువ పెరిగింది. వీళ్లని ఎంపిక చేసేందుకు పెట్టిన అగ్నిపరీక్ష పోటీపైనే ఆడియెన్స్కి ఆసక్తి కలిగింది. అలా ఈసారి జరిగిన అగ్నిపరీక్షలో నెగ్గిన సింగర్ ఝాన్సీ ఇప్పుడు సగర్వంగా బిగ్బాస్ 10 హౌస్లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టేసింది.తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్తో గెలిచి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి? -
టాలీవుడ్ 'చిన్న' హీరో.. బిగ్బాస్ 10లోకి వచ్చేశాడు
తెలుగు సినిమాల్లో హీరోగానే కెరీర్ మొదలుపెట్టి మధ్యలో సహాయ పాత్రలు చేసి ప్రస్తుతం హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తున్న అదిత్ అరుణ్ అలియాస్ అదిత్ ఈశ్వరన్ అలియాస్ త్రిగుణ్.. బిగ్బాస్ 10లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టేశాడు.తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్ అరుణ్.. జెనీలియా 'కథ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.ప్రస్తుతానికైతే అదిత్ చేసిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా తెలుగులో రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో సెకండ్ హీరోగానూ నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్బాస్ 10 హౌస్లోకి అడుగుపెట్టాడు. వ్యక్తిగత విషయానికొస్తే 2023లో నివేదిత అనే అమ్మాయిని అదిత్ అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గతేడాది ఓ ఆడపిల్ల పుట్టింది. ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంటింటికి మళ్లీ పలికే పేరు కావాలి’ అని బిగ్బాస్లోకి వస్తున్నాని త్రిగున్ చెప్పాడు. అంతేకాదు. 2.0 స్టార్ట్ చేశానని.. ఇకపై త్రిగున్ని కొత్తగా చూశారని కూడా చెప్పాడు. మరి నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. ఈ షోలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి. -
Bigg Boss 10: తొలి కంటెస్టెంట్గా సీరియల్ బ్యూటీ!
ప్రతిసారి బిగ్బాస్లోకి సీరియల్ బ్యూటీస్ కచ్చితంగా వస్తారు. అలా ఈసారి ఆ కోటాలో వచ్చిన ముద్దుగుమ్మ దేబ్జానీ మోదక్. బిగ్బాస్ 10లోకి ఈమె కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. ఇప్పటికే సీరియల్స్, షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే.కోల్కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టింది.సీరియల్స్తో అలరించిన ఈమె.. బిగ్బాస్తో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి? సీరియల్ ప్రేక్షకులు, లేడీ అభిమానుల నుంచి ఈమెకు మద్ధతు లభించే అవకాశముంది. టాస్కుల్లో ఫెర్ఫార్మెన్స్ బాగుంటే టాప్ కంటెండర్ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది. -
బిగ్బాస్ 10: హాట్ టాపిక్గా నాగార్జున రెమ్యునరేషన్
బిగ్బాస్ షో అనగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికి గుర్తొచ్చే ఏకైన పేరు ‘కింగ్’ నాగార్జున. తెలుగులో ఇప్పటివరకు 9 సీజన్లు పూర్తవ్వగా..మొదటి రెండు తప్ప మిగిలిన సీజన్లన్నింటికీ ఆయనే హోస్ట్గా చేశాడు. తెరపై స్టైలీష్ ఎంట్రీ ఇస్తూనే తనదైన మాటతీరుతో దారితప్పుతున్న ఆటను గాడిలో పెడుతూ..బిగ్బాస్ షోని విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయితే సీజన్ 10కి కొత్త హోస్ట్ వస్తాడని ప్రచారం జరిగినప్పటికీ..మళ్లీ నాగార్జుననే బరిలోకి దింపారు నిర్వాహకులు. దీని కోసం భారీగా పారితోషికం అందించారట. ఇప్పుడు నాగార్జున రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.సీజన్ 3కి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకున్న నాగార్జున.. సీజన్ 9కి వచ్చేసరికి రూ. 35 కోట్ల వరకు తీసుకున్నాడట. తెలుగు బిగ్బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డు నాగార్జునకే దక్కింది. ఇక సీజన్ 10కి వచ్చేసరికి పారితోషికం మరింత పెరిగినట్లు సమాచారం. బిగ్బాస్ 10 కోసం నాగార్జునకి రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులోనే స్పెషల్ ప్రోమోలు, ప్రమోషనల్ షూట్స్ కూడా ఉన్నాయట. దాదాపు 15 వారాల పాటు బిగ్బాస్ షో కొనసాగుతుంది. ఫినాలతో కలిపి మొత్తం 30 రోజుల పాటు నాగార్జున షోలో కనిపిస్తాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పారితోషికం విషయం నిజమే అయితే.. ఒక్కో రోజు రూ. కోటికిపైనే తీసుకుంటున్నల్లు లెక్క. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమే. అసలు పారితోషికం ఎంత అనేది అధికారికంగా ప్రకటించలేరు.కాబట్టి ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు. -
పందెం అంటే పోటీ కాదు.. తెలివి ‘మండాడి’ ట్రైలర్
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. -
తెలుగులోకి మలయాళ హిట్ సినిమా.. ఫస్ట్లుక్ రిలీజ్
టీచర్స్ డే సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ ఫస్ట్లుక్ విడుదలైంది. జాతీయ అవార్డు గ్రహీత, ఉపాధ్యాయురాలు మారం పవిత్ర చేతుల మీదుగా ఈ పోస్టర్ను లాంచ్ చేశారు. నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు విజేత నవీన్ దేశబోయిన దర్శకత్వం వహిస్తున్నారు. జయంత్ కీలక పాత్రలో నటిస్తుండగా.. తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్ స్కూల్ టీచర్గా కనిపించనున్నారు. మలయాళ హిట్ ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’కు ఇది రీమేక్. పాఠశాల సమస్యలు, విద్యావ్యవస్థతో పాటు కుటుంబ భావోద్వేగాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు.ఈ సందర్భంగా జయంత్ మాట్లాడుతూ– ‘ ఇదో కొత్త తరహ చిత్రం. మనం రోజు స్కూల్లో ఎదుర్కొనే సమస్యలతో పాటు విద్యావ్యవస్థ గురించి మా సినిమాలో చెప్పటం జరిగింది’’ అన్నారు. దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ– ‘నేను ఈ సినిమా చేసినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నా గత చిత్రం ‘లతా భగవాన్ ఖరే’, చిత్రానికి దేశవ్యాప్తంగా 32 అవార్డులు వచ్చాయి. వాటితో పాటు ఫిలింఫేర్, నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాను. జయంత్ను హీరోగా పెట్టి నేను చేసిన ‘జయంత్ అండ్ జింగోపెన్’ మలయాళ సినిమా ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’ అనే చిత్రం రీమేక్. మలయాళంలో ఈ చిత్రం 111 రోజలు ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండటంతో అంత పెద్ద విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటుడి కొడుకు.. డెబ్యూ మూవీ ఇదే!
ప్రముఖ నటుడు శరత్ బాబు కుమారుడు ఆయుష్ తేజస్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కట్టా జయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన సీహెచ్ దివ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నానిషా హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రానికి క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకుడు కట్టా జయ్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం గ్రాండ్గా అన్నపూర్ణా స్టూడియోస్లో ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. శరత్ బాబు గారి కుమారుడు ఆయుష్ తేజస్ మా సినిమాలో హీరోగా నటించడం ఎంతో సంతోషంగా ఉంది. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్ కొట్టిన వి.వి. వినాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తొలి ప్రెస్ మీట్కు విచ్చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఇది మా డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమవుతున్నారు. ప్రేక్షకులు, మీడియా మా సినిమాను ఆదరించి, ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను’అన్నారు.హీరో ఆయుష్ తేజస్ మాట్లాడుతూ..‘మా సినిమా కథపై పూర్తి నమ్మకంతో, ఒక గొప్ప విజయాన్ని సాధిస్తామని విశ్వసిస్తున్నాం. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్ కొట్టిన వి.వి. వినాయక్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చేతుల మీదుగా మా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా టీమ్కు సంబంధించిన తొలి ప్రెస్ మీట్. మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మా సినిమాను అందరూ ఆదరించి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు. -
నిర్మాతల మండలి ఎన్నికలు.. ఏ ప్యానెల్ గెలిచిందంటే?
నిర్మాతల మండలి ఎన్నికల్లో మన ప్యానెల్ ఘనవిజయం సాధించింది. మొత్తం 663 ఓట్లు పోల్ కాగా.. మన ప్యానెల్ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్లుగా మోహన్ వడ్లపట్ల(మన ప్యానెల్), దామోదర్ ప్రసాద్ (ప్రోగ్రెసివ్ ప్యానెల్) ఎన్నికయ్యారు. ట్రెజరర్గా చదలవాడ (మన ప్యానెల్)ను ఎన్నుకున్నారు. జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు, తుమ్మలపల్లి మన ప్యానెల్ నుంచి ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా విజయం మన ప్యానెల్ నుంచి 12 మంది ఎంపిక కాగా.. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ముగ్గురు ఎంపికయ్యారు. ఈసీ మెంబర్స్..మన ప్యానెల్ – 121. పద్మిని2. ఏషియన్ సునీల్3. మోహన్ గౌడ్4. శివలెంక కృష్ణప్రసాద్5. దానయ్య6. వంశీ నందిపాటి7. పల్లి కేశవరావు8. శ్రీనివాసరావు9. పుల్లారావు10. బాపిరాజు11. ఆర్.కె. గౌడ్12. నయీంప్రోగ్రెసివ్ ప్యానెల్- 3 1. మైత్రీ రవి2. నిరంజన్ రెడ్డి3. డి.ఎస్. రావు -
బిగ్బాస్పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో
బిగ్బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో..ఈ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లాంచింగ్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రోమోలో నాగార్జున ఓ మ్యాజిక్ కీని చూపిస్తూ ఇది ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ల తలరాతను మార్చుతుంది అని చెప్పడం ఈ సీజన్పై అంచానాలు పెంచేస్తోంది. ప్రోమో చూస్తుంటే గత సీజన్లకు మించి ఈసారి లాంచింగ్ ఎపిసోడ్ను గ్రాండ్గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతుబిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలో చూపించడం ఆసక్తిని పెంచుతోంది. బిగ్బాస్లో హీరో కార్తీక్ సందడి చేసినట్లు ప్రోమోలో కనిపించింది.నాగార్జునకు సైతం షాక్!బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన హోస్ట్ నాగార్జున.. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు తాను ఇలాంటి కాన్సెప్ట్ను చూడలేదని బిగ్బాస్తో చెప్పడం ప్రోమోలో కనిపించింది. దీంతో ఈసారి హౌస్లో ఏదో కొత్తగా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.ఒకేసారి మూడు భాషల్లో..మరోవైపు తెలుగు బిగ్బాస్తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ బిగ్బాస్ షోలు ఇదే రోజు ప్రారంభం కానున్నాయి. ఆయా భాషల హోస్టులు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్లాల్.. నాగార్జునతో వర్చువల్గా భేటీ కావడం కూడా ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి కొత్త కంటెస్టెంట్లు, కొత్త కాన్సెప్ట్లు, గ్రాండ్ లాంచింగ్తో బిగ్బాస్ సీజన్ 10పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈసారి బిగ్బాస్ హౌస్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
రవితేజ ఇరుముడి.. పూనకాలు తెప్పించే ఫుల్ వీడియో సాంగ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. కేవలం మౌత్ టాక్తో వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ల మార్క్ దాటేసింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ రిలీజ్ చేశారు. థియేటర్లలో ఆడియన్స్కు పూనకాలు తెప్పించిన మల్లెపూల పల్లకి.. మందార పల్లకి అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు థియేటర్లు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ పాటకు చౌడమ్ శ్రీనివాసరావు లిరిక్స్ అందించగా.. డప్పు శ్రీను ఆలపించారు. ఈ సాంగ్ను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. -
‘అంతా రాములోరు చూస్కుంటారు‘ గ్లింప్స్ విడుదల
పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రం బృందం గ్లింప్స్ని విడుదల చేసింది. వీడియోలో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. సినిమాలో సంగీత్ శోభన్ మారుతి అనే గోదారి కుర్రాడులా కనిపిస్తున్నాడు. అనస్వర రాజన్ ‘శిరీష’గా వెండి తెరను పలకరించనుంది. -
Bigg Boss 10: హౌస్లోకి అడుగుపెట్టిన 16 మంది వీళ్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 10వ సీజన్ గ్రాండ్గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్గా సందడి చేశాడు. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్ నుంచి 6 మంది హౌస్లోకి వెళ్లారు. ఈ సారి హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ జాబితా, వారి నేపథ్యంతో పాటు లాంచ్ ఎపిసోడ్ ఎలా జరిగిందో పూర్తి వివరాలు ఇదిగో...బిగ్బాస్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే1) దేబ్జానీ మోదక్2) త్రిగుణ్3) సింగర్ ఝాన్సీ4) సుధీర్రెడ్డి5) అమన్6) చైత్ర రాయ్7) రాంప్రసాద్8) షాలిని9) టెంపర్ వంశీ10) సృష్టి11) జబర్దస్త్ నరేశ్12) చరణ్13) కృష్ణుడు14) వర్షిణి15) రోహిత్16 నిహర్ ముకేశ్పదహారో కంటెస్టెంట్గా నిహర్ ముకేశ్ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్బాస్ హౌస్లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్ వచ్చేశాడు. 16వ కంటెస్టెంట్గా లోపల అడుగుపెట్టేశాడు. ‘రయ్ రయ్ రారా’ సాంగ్కు డ్యాన్స్ వేస్తూ పదహారో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు నిహర్ ముకేశ్. ‘సామాన్య కుటుంబం నుంచి వచ్చా. 10 సంవత్సరాల కిందట యాక్టర్ అవ్వాలనుకున్నా. ఇప్పుడు సినిమాలో హీరో వరకు వచ్చా. యాక్టర్గా ప్రతి ఒక్కరు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అలా బిగ్బాస్లో కూడా నాకో అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుని ప్రేక్షకుల మనసును గెలుచుకుంటా. తెలుగు నాకు మాట్లాడటం రాదు. ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. తెలుగు నా నాలుక మీద కాదు గుండెలో ఉంటుంది‘ అని తెలిపాడు.ముఖేశ్ విషయానికి వస్తే..రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేశ్ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్గా 10వ సీజన్లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుందిపదిహేనో కంటెస్టెంట్గా రోహిత్పదిహేనో కంటెస్టెంట్గా ఎంపిక చేసేందుకు బిందు మాధవి వచ్చారు. రోహిత్ని ఎంపిక చేశారు. నాగార్జున రోహిత్కి టాస్క్ ఇచ్చారు. గ్లాస్ తీసుకెళ్లి హౌస్లో ఉన్నవారిలో ఒకరి మీద వాటర్ వేయమన్నారు. అయితే ఇలా చేయలేనని రోహిత్ చెప్పాడు. అనంతరం వైట్ గోల్డ్ మెడల్ తీసుకుని హౌస్లోకి వెళ్లాడు. పద్నాలుగో కంటెస్టెంట్గా వర్షిణివిశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలోని ‘పుట్టా ముద్దుగా’. పాటకు డ్యాన్స్ వేస్తూ బిగ్బాస్లోకి అడుగెపెట్టింది యాంకర్ వర్షిణి. ‘ఇదొక మంచి ఫ్లాట్ఫాం. నేను ఇక్కడ ఫిట్ అవుతానని అనుకోలేదు.రోజు నిద్రపోయే ముందు నాకు నేను ప్రశ్నించుకున్నా. తర్వాత కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది.వర్షిణి విషయానికి వస్తే..వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్బాస్లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి?పదమూడో కంటెస్టెంట్గా కృష్ణుడుతెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.'బిగ్బాస్' హౌస్లో 13వ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. ‘నాలో చాలా యాంగిల్స్ అన్నీ హౌస్లో చూపిస్తా’ అని కృష్ణుడు తెలిపారు. కృష్ణుడు విషయానికి వస్తే.. అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి?పన్నెండో కంటెస్టెంట్గా చరణ్ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం బిగ్బాస్ హౌస్కి ఎంపికయ్యాడు చరణ్. ‘నేను ఉండే విధానమే నా బలం. చుట్టు ఉన్నవాళ్లని నవ్విస్తా. తండ్రి చిరంజీవిగారికి, మీకు పెద్ద అభిమాని‘ అని చరణ్ నాగార్జునతో తెలిపారు. నాగార్జున లైవ్లో తన తండ్రికి నమస్కారాలు తెలిపారు. వైట్ గోల్డ్ మెడల్ అందుకున్న అనంతరం చరణ్ హౌస్లోకి వెళ్లాడు. ఎవరీ చరణ్..ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు.పదకొండో కంటెస్టెంట్గా జబర్దస్త్ నరేశ్పంజా సినిమాలోని భూమికి జానడు సాంగ్కి డ్యాన్స్ వేస్తూ బిగ్బాస్ హౌస్లోకి నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గూగుల్లో నరేశ్ అని వెతికితే బిగ్బాస్ నరేశ్ వచ్చేలా కష్టపడతానని తెలిపాడు. నరేశ్ విషయానికి వస్తే.. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్ ఆడిషన్స్కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.పదో కంటెస్టెట్గా సృష్టిమరో కంటెస్టెట్ని ఎంపిక చేసేందుకు జ్యూరీ ద్వారా ఎంపిక చేసేందుకు శ్రీముఖి వచ్చారు. సృష్టిని ఎంపిక చేశారు. ఈమెకు సైతం నాగార్జున వైట్ గోల్డ్ మెడల్ అందించారు. తొమ్మిదో కంటెస్టెంట్గా టెంపర్ వంశీటెంపర్ సినిమాలో విలన్గా నటించి ఆకట్టుకున్న వంశీ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లాడు. తన సినీ కష్టాలను తెలియజేసేలా ఏవీని రెడీ చేసుకొని స్టేజ్పైకి ఎంట్రీ ఇచ్చాడు. ‘చిరంజీవి మీద ఉన్న ఇష్టం.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కాలేజీ పుస్తకాలు చదవలేదు. కానీ చిరంజీవి ఉన్న సినిమా పుస్తకాల్ని ఒక్కటీ విడిచిపెట్టలేదు’ అని వంశీ చెప్పారు. సినిమా కష్టాల కోసం వివరించారు. కట్టేకాలేంత వరకు సినిమాలు చేస్తూ ఉంటానన్నారు. దాదాపు 50 సినిమాలు చేశానని చెప్పారు. తర్వాత పలు పాటలకు డ్యాన్స్ చేశారు. వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు.చూడటానికి రఫ్ అండ్ టఫ్గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి?ఎనిమిదో కంటెస్టెంట్గా షాలినీఎనిమిదో కంటెస్టెంట్గా కామనర్స్ నుంచి ఒకరి పంపే అవకాశం జ్యూరీకి ఇచ్చాడు నాగార్జున. దీంతో నవదీప్ .. దీపక్, హేమంత్, షాలినీలను పిలిచాడు. వీళ్లలో నుంచి చివరగా షాలినీని సెలెక్ట్ చేసినట్లు నవదీప్ ప్రకటించాడు. నవదీప్ సార్ నన్ను ఎంపిక చేసినప్పుడు ఇది నిజంగానే జరిగిందా అని ఆశ్చర్చపోయానని షాలనీ తెలిపారు.ఏడో కంటెస్టెంట్గా జబర్దస్త్ రాంప్రసాద్రాంప్రసాద్కు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లను చూసి వాళ్లు ఎం మాట్లాడుకుంటున్నారో మాకు లిప్ మూమెంట్ చెప్పాలని నాగార్జున అడిగారు. ఎలాగైనా మమ్మల్ని నవ్వించాలన్నారు. రాంప్రసాద్ నవ్వించే ప్రయత్నం చేశారు. రాంప్రసాద్ విషయానికొస్తే ..ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్కి రైటర్గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్తో కలిసిపోయాడు. ఇతడి టీమ్లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.ఆరో కంటెస్టెంట్గా చైత్ర రాయ్ అష్టాచెమ్మా సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అసలు పేరు చైత్రరాయ్. భర్త పేరు ప్రశన్న శెట్టి. రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో అమ్మగా, అక్కగా, భార్యగా పాత్రలు పోషిస్తున్నాను. ఒక నెగిటివ్ కామెంట్ వల్ల చాలా బరువు తగ్గారు . చిన్న బేబిని వదిలి బిగ్బాస్ హౌస్కి వచ్చినట్లు తెలిపారు. చైత్ర విషయానికొస్తే.. సీరియల్స్తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.బిగ్బాస్ గ్రాండ్ లాంచ్లో తమిళ యాక్టర్స్ సూర్య, కార్తీ సందడి చేశారు. సర్దార్2 మూవీ ప్రమోషన్స్ కోసం వాళ్లు బిగ్బాస్ షోకి వచ్చారు. ఐదో కంటెస్టెంట్గా అమన్బిగ్బాస్ 10వ సీజన్లో 5వ కంటెస్టెంట్స్గా కామనర్స్ నుంచి అమన్ వెళ్లాడు. ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా గెలిచి హౌస్లోకి వెళ్లాడు. సీక్రెట్ టాస్క్హోస్ట్ నాగార్జున అమన్కు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఒక రెడ్ బాక్స్ ఇచ్చి.. అందులో రెడ్ డాట్ ఉందని, హౌస్లోకి వెళ్లాక..వచ్చే ముగ్గురిలో కనీసం ఒకరికైనా ఇది తెలియకుండా పెట్లాలని అమన్కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. అమన్ కోసం ఒక స్వీట్ మెమోరీ అంటూ చిరిగిపోయిన టీషర్టును నాగార్జున అందించారు. వచ్చే శనివారానికి ఎన్ని హోల్స్ ఉన్నాయో చెప్పాలన్నారు. ఓ గోల్డ్ మెడల్ అందిచారు. నాలుగో కంటెస్టెంట్గా సుధీర్ రెడ్డినాలుగో నాలుగో కంటెస్టెంట్గా సుదీర్ వచ్చారు. సోషల్మీడియాలో ఇంటర్వ్యూ చేస్తూ అందరికి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం 'సుధీర్ టాక్స్' పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ(నంద్యాల)లో పుట్టి పెరిగిన సుధీర్.. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటూ పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు. తనకు ఇంటర్వ్యూ చేయమని నాగార్జున కోరగా..‘నాకు మీలో బాగా నచ్చేది. బిజినెస్ మ్యాన్గా, హీరోగా బాగా రాణిస్తున్నారు. లైఫ్లో ఎదైనా వెలితి ఉందా?’ అని అడగ్గా టైమ్ సరిపోవడం లేదని నాగార్జున అన్నాడు.సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి.. ఇప్పుడు బిగ్బాస్ 10లో ఓ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టడు. మరి బుల్లితెరపై అలరించిన ఇతడు ఈ రియాలిటీ షోలో ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి? మూడో కంటెస్టెంట్గా సింగర్ ఝాన్సీ గోల్డేన్ టికెట్ సాధించి సింగర్ ఝాన్సీ మూడో కంటెస్టెంట్గా వచ్చారు. ‘మూడో తరగతి నుంచే పాటలు పాడటం మొదలు పెట్టా. అందరికీ తెలిసేలా నన్ను నేను నిరూపించుకునేందుకు ‘బిగ్బాస్’కువచ్చా. అనుకోకుండా గోల్డెన్ టికెట్ సొంతం చేసుకున్నా.‘ అని తెలిపిందిఝాన్సీ కోసం కొన్ని విషయాలు..తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్తో గెలిచి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?రెండో కంటెస్టెంట్స్గా యాక్టర్ త్రిగున్ రెండో కంటెస్టెంట్స్గా యాక్టర్ త్రిగూన్ ఎంట్రీ ఇచ్చాడు. ది ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే శనివారానికి హౌస్కి వచ్చేసరికి కనీసం ముగ్గిరికి హౌస్లో దెయ్యం ఉందని నమ్మించాలి అని నాగార్జున అతనికి టాస్క్ ఇచ్చారు. త్రిగున్ నేపథ్యం ఇదే.. తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్ అరుణ్.. జెనీలియా 'కథ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.ప్రస్తుతానికైతే అదిత్ చేసిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా తెలుగులో రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో సెకండ్ హీరోగానూ నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్బాస్ 10 హౌస్లోకి అడుగుపెట్టాడు. వ్యక్తిగత విషయానికొస్తే 2023లో నివేదిత అనే అమ్మాయిని అదిత్ అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గతేడాది ఓ ఆడపిల్ల పుట్టింది. ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంటింటికి మళ్లీ పలికే పేరు కావాలి’ అని బిగ్బాస్లోకి వస్తున్నాని త్రిగున్ చెప్పాడు. అంతేకాదు. 2.0 స్టార్ట్ చేశానని.. ఇకపై త్రిగున్ని కొత్తగా చూశారని కూడా చెప్పాడు. మరి నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. ఈ షోలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.మొదటి కంటెస్టెంట్ దేబ్జానీ మోదక్‘గిరిగిర గింగిరానివే’ పాటకి చిందులు వేస్తూ మొదటి కంటెస్టెంట్గా దేబ్జానీ మోదక్ వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘మొదటి కంటెస్టెంట్గా అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. నా గురించి మూడు ముక్కల్లో చెప్పమంటే ఫన్ లవింగ్, నిజాయతీ, డే డ్రీమర్ను. నేను ఎక్కువగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడతా. ఎక్కడ వర్క్ చేసినా, రాత్రయితే ఇంటికి వచ్చేయాల్సిందే’ అని అన్నారు. దేబ్జానీకి నాగార్జున టాస్క్ ఇచ్చారు. హౌస్లోకి వచ్చే వాళ్ల ప్రవర్తన బట్టి వాళ్లకు పేర్లు పెట్టాలని కొన్ని బ్యాడ్జ్లను అందించారు.ఎవరీ దేబ్జానీ మోదక్ కోల్కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టింది.ఓ మ్యాజిక్ కీ ని నాగర్జున చూపించారు దాని కథ తెలుసుకునేందుకు బిగ్బాస్ హౌస్లోకి వెళ్లారు. హౌస్ అంతా కలియతిరిగిన నాగార్జునకు బిగ్బాస్ స్వాగతం పలికారు. తిరిగి స్టేజీపైకి వచ్చేశారు.బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్బాస్ సీజన్ 10’ ఎట్టకేలకు గ్రాండ్గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి షోకు మరింత జోష్ తీసుకొచ్చారు. పాటకు స్టెప్పులేస్తూ అలరించిన ఆయన.. ఈ సీజన్లో ఆట మరింత ఆసక్తికరంగా, సవాళ్లతో సాగబోతుందనే ఆయన చెప్పిన మాటలు, సరికొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక అసలు సందడి మొదలైంది. బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. షో ప్రారంభం అయితే చాలు టీవీకి అతుక్కుపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ షోకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 10వ సీజన్తో అలరించడానికి రేడీ అయింది. ఈ రోజు(సెప్టెంబర్ 6) బిగ్బాస్ 10 ప్రారంభం కానుంది. బిగ్బాస్ 10 ప్రోమో వచ్చేసిందిబిగ్బాస్ సీజన్ 10 మరికాసేపట్లో(సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ లాంచింగ్ ఎపిసోడ్ ప్రోమోని వదిలారు.గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా లాంచింగ్ గ్రాండ్గా ఉండబోతున్నట్లు పోమో చూస్తే అర్ధమవుతుంది. రైతు బిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలోనే చూపించారు.అలాగే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది. ఈ మూడు భాషల బిగ్బాస్ హోస్టులు(విజయ్ సేతుపతి, మోహన్ లాల్, సుదీప్) నాగార్జునతో వర్చువల్గా భేటీ అయ్యారు.‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్’ ఓటీటీలో సాయత్రం 7 గంటల నుంచి ప్రసారం అవుతుంది. ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు సీజన్ 10పై మరింత ఆసక్తిని పెంచేశాయి. పదో సీజన్ కు తగ్గట్టుగా దశావతారం అనే కాన్సెప్ట్తో సరికొత్త సర్ప్రైజ్లు ఇవ్వడానికి నిర్వాహకులు భారీ ప్లాన్ చేశారట. మరి షో ఎలా ఉండబోతుంది. కంటెస్టెంట్స్ ఎవరనేది మరికాసేపట్లో తెలిసిపోతుంది. అయితే షో ప్రారంభానికి ముందే నెట్టింట సీజన్ 10పై భారీ చర్చ జరుగుతోంది.తెలుగు బుల్లితెరపై ఇతర భాషల ‘బిగ్ బాస్’ హోస్ట్స్ సందడిబిగ్గాస్ 10 లాంచింగ్ని మరింత గ్రాండ్గా ప్లాన్ చేశారట. ఈ సారి అనేక సర్ప్రైజ్లతో లాంచింగ్ ఎపిసోడ్ని రూపొందించారట.అందులో భాగంగా ఇతర భాషల బిగ్బాస్ హోస్టులంతా తెలుగు బిగ్బాస్ వ్యాఖ్యాత నాగార్జునతో వర్చువల్గా భేటీ అవుతారట. ఈ సారి తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది.గెస్టులుగా కార్తీ, ఆనంద్ దేవరకొండబిగ్బాస్ 10 గ్రాండ్ లాంచ్కి తమిళ హీరో విజయ్తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ గెస్టులుగా వచ్చి ప్రేక్షకులను అలరించబోతున్నారట. ఎపిక్ సినిమా ప్రమోషన్స్ భాగంగా హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటు ఆనంద్ దేవరకొండ స్టేజ్పైకి రాబోతున్నారు. ఇక సర్దార్ 2 మూవీ ప్రమోషన్స్ కోసం కార్తీ కూడా బిగ్బాస్ షోకి వచ్చారట.బిగ్బాస్ 10లోకి 16 మందిఈ సారి హౌస్లోకి తొలి రోజే మొత్తం 16 మందిని పంపించబోతున్నారట. వారిలో సామాన్యుల కోటా నుంచి ఆరుగురు, సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది ఉన్నారు.హౌస్లోకి వెళ్లే సెలెబ్రెటీలు వీళ్లే..?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా ప్రకారం బిగ్బాస్ 10లోకి వెళ్లే సెలెబ్రెటీల లిస్ట్ ఇదే. 1) ఆటో రాంప్రసాద్2) టెంపర్ వంశీ3) దేబ్జానీ మోదక్4)యాంకర్ వర్షిణి5) ముఖేష్ గౌడ6)చైత్రా రాయ్7) నటుడు కృష్ణుడు8) జబర్దస్త్ నరేశ్9) టెంపర్ వంశీ10)యాంకర్ సుధీర్ రెడ్డిఅగ్ని పరీక్ష నుంచి వెళ్లే ఆరుగురు వీళ్లే.. 1) ఝాన్సీ2) రోహిత్ నాయుడు3)శ్రష్టి4) చరణ్5)అమన్ మసూద్6)షాలిని పటేల్ -
'పండు ఐ లవ్ యూ రా.. నేను వెళ్లిపోతున్నా'
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈశ్వర్ సాయి మోసం చేశాడని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫోక్ డ్యాన్సర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అందరికీ సారీ.. నాకు ఇక బతకాలని లేదంటూ తన లేఖలో పేర్కొంది. పండు ఐ లవ్ యూ రా.. పిల్లలందరికీ సారీ రా అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. నేను తప్పు చేశానని.. నా చావుకు నేనే కారణమంటూ అంటూ రాసుకొచ్చింది. నేను తప్పు చేశా.. అందుకే చనిపోవాలనుకుంటున్నానని మాధురి రాథోడ్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. కాపాడిన కుటుంబ సభ్యులు.. ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిపోడ్ వివాదంలో మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు మాధురిని కాపాడారు. ఈశ్వర్ సాయిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంటున్న మాధురిని కుటుంబ సభ్యులు కాపాడారు. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోనే మాధురి రాథోడ్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. -
అల్లు అర్జున్ రాకా.. ప్రముఖ నటుడి రోల్ రివీల్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న భారీ యాక్షన్ మూవీ రాకా. ఈ సినిమాకు అల్లు అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ముంబయిలో పూర్తి చేసుకుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్(బబ్లూ) కీలక పాత్ర పోషిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్లో తనకు ఒక ప్రత్యేకమైన లుక్తో కూడిన కీలక పాత్ర దక్కిందని రివీల్ చేశారు. దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయడం అదృష్టమని.. అంతేకాకుండా అల్లు అర్జున్తో కలిసి పనిచేయడంతో తన కల సాకారమైందని స్పష్టం చేశారు.కాగా.. ఈ సినిమాలో దీపిక పదుకొణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా జాన్వీ కపూర్ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్ చేయనున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. -
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..!
ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిపోడ్ మరింత ముదిరింది. ఈ వివాదంలో మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు మాధురిని కాపాడారు. ఈశ్వర్ సాయిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంటున్న మాధురిని కుటుంబ సభ్యులు కాపాడారు. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోనే మాధురి రాథోడ్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. మాధురి రాథోడ్ ఫిర్యాదు..అంతకుముందు ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై డ్యాన్సర్ రమావత్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈశ్వర్సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాసింగ బలాలే జానపద నృత్యంలో నటించి ఈశ్వర్సాయి పాపులర్ అయ్యారు. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. కేవలం మౌత్ టాక్తో వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ల మార్క్ దాటేసింది.తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీకమాసం ఫుల్ వీడియో పాటను ఇరుముడి టీమ్ విడుదల చేసింది. ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ పాడడంతో పాటు కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించగా.. సాయి కుమార్ కీలక పాత్రలో మెప్పించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరు కూడా చూసేయండి. -
నాని ది ప్యారడైజ్.. రిలీజ్ డేట్పై మరోసారి క్లారిటీ
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్తో యూట్యూబ్లో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ దీంతో సినిమా రిలీజ్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసే ఆలోచన లేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 18 years of entertaining. And this year, the stage is all set to burn with #TheParadise 🔥🔥🔥Natural Star @NameisNani as JADAL 💥#TheParadise GRAND RELEASE WORLDWIDE ON 24.09.26.Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥An @anirudhofficial musical 🎼… pic.twitter.com/sGx22f8BIK— SLV Cinemas (@SLVCinemasOffl) September 5, 2026 -
ప్రభాస్తో టాలీవుడ్ హీరో ఢీ.. పెద్ద సాహసమే..!
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ప్రభాస్తో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు మరో హీరో. రెబల్ స్టార్తో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఆయన హీరోగా వస్తోన్న లెగసీ మూవీ డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఫౌజీ రిలీజైన ఒక్క రోజు గ్యాప్లోనే విశ్వక్ సేన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. దీంతో వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.మరి ఫౌజీ ముందు లెగసీ మూవీ ఎంతవరకు నిలుస్తుందో వేచి చూడాల్సిందే. అయితే విశ్వక్ సేన్ ఒక్క రోజు గ్యాప్లోనే రావడం పెద్ద సాహసమనే చెప్పాలి. లేదంటే ఈ నిర్ణయం వెనుక నిర్మాతల పక్కా వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఫౌజీ అనుకున్న టైమ్కి రాకపోతే తమ సినిమాకు తిరుగుండదనే ఉద్దేశంతోనే ఈ డేట్పై కర్చీఫ్ వేసిందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ప్రభాస్ను ఢీకొట్టబోతున్న విశ్వక్ ప్లాన్ నిజంగా వర్కవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. MASS KA DAS IS COMING THIS DECEMBER. 🔥🔥#LEGACY locks DECEMBER 4, 2026 for its worldwide theatrical release.Vishwak Sen in a powerful new avatar.Kay Kay Menon in a key role.Saikiran Reddy Daida returning with his second film.THE LEGACY BEGINS. ⚔️#LegacyMovie… pic.twitter.com/kWW7MuX85q— LAKSHMIVENUGOPAL 🌞 (@venupro) September 5, 2026 -
టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్తో సినిమా
‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, 'ఇదీ సంగతి', ‘ఆటగదరా శివా’ తదితర సినిమాలతో మెప్పించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తీసిన లేటెస్ట్ మూవీ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఇదే పొడవైన టైటిల్ అని చెప్పొచ్చు. ఫిల్మోత్సవ్ బ్యానర్పై సొంతగా ఈయనే నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ కథ అందించారు. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రలు చేశారు. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: అమ్మ చీరలే నా స్టైల్.. నివేతా థామస్ ఆసక్తికర విషయాలు)‘ఆ నలుగురు’తో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్.. ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మొట్టమొదటి మిస్టరీ మ్యూజికల్ మూవీ ఇది. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలని మేళవిస్తూ రూపొందిన ఈ హై కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది అని చంద్రసిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
లెగసీ ఫిక్స్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెగసీ’. సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ హీరోయిన్. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబరు 4న ‘లెగసీ’ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘పవర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇది. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం. తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణంగా విశ్వక్ సేన్ పాత్ర సాగుతుంది’’ అని చిత్రబృందం ప్రకటించింది. -
ఆ ప్రేక్షకులంతా ఏమైపోయారనిపించింది– కార్తీ
‘‘స్పై బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే చాలా చిత్రాలు మన దేశం బయట జరిగే ఆపరేషన్స్ నేపథ్యంలో ఉంటాయి. కానీ ‘సర్దార్ 2’ మన దేశం లోపల మన కోసం గూఢచారులు చేసే సాహసాల నేపథ్యంలో ఉంటుంది’’ అని కార్తీ చెప్పారు. కార్తీ హీరోగా నటించిన సినిమా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు.→ ‘సర్దార్’లో వాటర్ కాన్సెప్ట్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మన జీవితాల్లోని ఓ ముఖ్యమైన అంశాన్ని ‘సర్దార్ 2’లో ప్రస్తావించాం. ఆ అంశాన్ని తెరపై చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. నాకు యాక్షన్ అంటే ఇష్టం. డ్యాన్స్ అంటే భయం (సరదాగా..). ‘సర్దార్ 2’లో తండ్రీకొడుకులు ఓ మిషన్ కోసం కలిసి పని చేస్తారు. తండ్రీకొడుకుగా నటించాను. ఇలా ఒకేసారి రెండు పాత్రలు చేయడం సవాల్గా అనిపించింది. అలాగే ఓపికతో మేకప్ వేసుకోవాల్సి వచ్చేంది.→ నాగార్జున అన్నయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘సర్దార్’ చిత్రం తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా రిలీజ్ అయింది. ‘సర్దార్ 2’ కూడా ఆ సంస్థ ద్వారానే రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది.→ ‘సత్యం సుందరం’ సినిమా థియేటర్స్లో సరిగ్గా ఆడలేదు. చాలా బాధగా అనిపించింది. కానీ ఓటీటీలో మంచి స్పందన లభించింది. అయితే ఒకప్పుడు ‘స్వాతిముత్యం’, ‘శంకరాభరణం’ వంటి చిత్రాలను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్స్ చేశారు. ఆ ప్రేక్షకులంతా ఇప్పుడు ఏమైపోయారని నాకు బాధగా అనిపించింది. → తమిళనాడులో రాజకీయాల పరంగా జనరేషనల్ షిఫ్ట్ జరిగిందని అనుకుంటున్నాను. నేటి తరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా యాక్టర్స్గా మేం మారుతున్నాం. అలానే పొలిటీషియన్స్ నెక్ట్స్ జనరేషన్కు అడాప్ట్ అవ్వాలి. ఇక సినిమాలు వద్దని విజయ్గారు నిర్ణయించుకుని, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వెళ్లారు. అలాంటి అంకితభావంతో ఎవరు వచ్చినా వారికి ప్రత్యేకమైన జర్నీ ఉంటుంది. అయితే మా అన్నయ్య (హీరో సూర్య) చెప్తుంది ఏంటంటే... ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయాలు మాత్రమే మార్గం కాదు. మా అగరం ఫౌండేషన్ నుంచి దాదాపు 8 వేలమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. → తెలుగులో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాను. ‘హిట్ 4’కి చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ‘మార్షల్’ సినిమా చేస్తున్నాను. -
రఫ్ కట్ చూశా... భలే నచ్చింది – రవితేజ
రవితేజ సోదరుడి తనయుడు, రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్గా నటించారు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మయూర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన రవితేజ మాట్లాడుతూ– ‘‘తెలంగాణలోని మహిషాపురంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమా రఫ్ కట్ చూశాను... భలే నచ్చింది. ఎమోషన్స్ బాగున్నాయి. కుషాల్, మయూర్లకు ఈ సినిమాతో మంచి పేరు, డబ్బులు, సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. తమిళ అమ్మాయి దీపా తెలంగాణ భాష నేర్చుకుని, ఈ సినిమాలో బాగా పెర్ఫార్మ్ చేసింది. తొలి సినిమా అయినా నాగరాజు బాగా తీశారు. తమ్ముడు మాధవ్ బాగున్నావ్ రా.. ! ఈ సినిమా కోసం మాధవ్ ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు బాగుంది. ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. మాధవ్ భూపతిరాజు మాట్లాడుతూ– ‘‘ఆయన (రవితేజ) నాకు పెదనాన్న కాదు... నా అన్నయ్య. నా తొలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆయన రావడం హ్యాపీగా ఉంది. ఒక మనిషికి, ఒక దున్న΄ోతుకు మధ్య ఉన్న అనుబంధం తాలూకు ఎమోషన్ను ఊరి దైవం మారెమ్మతో కథలో చక్కగా బ్లెండ్ చేశారు నాగరాజుగారు. ఇందులో మంచి లవ్స్టోరీ కూడా ఉంది’’ అన్నారు. మయూర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నాగరాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇది మా ఊరి కథ అని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. మాధవ్ ఇలాంటి రూటెడ్ కథను ఎంచుకోవడం ఒక సాహసమే అని చెప్పాలి’’ అని చెప్పారు. మంచాల నాగరాజు మాట్లాడుతూ– ‘‘2006 టైమ్ ఫ్రేమ్లో ఈ సినిమా కథ సాగుతుంది’’ అన్నారు. -
అనుష్క సినిమాలకు గుడ్బై చెప్పినట్టేనా?
దశాబ్దానికి పైగా టాలీవుడ్లో తన నటన, సౌందర్యంతో లేడీ సూపర్ స్టార్గా ఏకచక్రాధిపత్యం వహించింది నటి అనుష్క శెట్టి. ఆమె కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటం అనుష్క అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. 'బాహుబలి'తో అనుష్క పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది. అనుష్క శెట్టి సినిమాలకు దూరమవుతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె చివరి చిత్రం ఘాటీ విడుదలై ఇప్పటికే 365 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మరో తెలుగు సినిమాను అనుష్క ప్రకటించలేదు. క్రేజ్ ఉన్నప్పటికీ వరుస సినిమాలు చేయకుండా.. నచ్చిన కథ, పాత్ర కోసం మాత్రమే ఎదురుచూడటం అనుష్క స్టైల్. అయితే ఇంత సుదీర్ఘ గ్యాప్ రావడంతో ఆమె ఇక సినిమాలు చేయరనే ప్రచారం మొదలైంది. అయితే అనుష్కపై ఇలాంటి ఊహాగానాలు ఇప్పటివి కావు. కొన్నేళ్లుగా ఆమె వ్యక్తిగత జీవితంపై, సినిమాలపై రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్తో లింక్ చేస్తూ అప్పట్లో ఆమెపై వచ్చిన కథనాలకు కొదవ లేదు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు, ఆమె సినిమాలకు దూరమైందనే ప్రచారం కూడా నడిచింది.అయితే దీనిపై అనుష్క నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఆమె నిజంగానే సినిమాలకు గుడ్బై చెప్పారా? లేక మరో క్రేజీ ప్రాజెక్ట్తో సర్ప్రైజ్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఓ హీరో ఏడాది గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు. కానీ అదే హీరోయిన్ తీసుకుంటే అంతే సంగతులు. ఇక అనుష్క లాంటి నటిని ఇలాంటి గ్యాప్స్ ఏం చేయలేవు. మరో క్రేజీ ప్రాజెక్ట్తో వచ్చి మరో సూపర్ హిట్ కొడితే ఈ రూమర్స్ అన్నీ రూమర్స్గానే మిగిలిపోతాయి. అయితే ఇండస్ట్రీలో చాలామంది నుంచి మాత్రం ఇక ఆమె సినిమాలు చేయదనే టాక్ నడుస్తోంది. దీనిపై అనుష్క టీమ్ నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో చూడాలి. -
బూతు సినిమాలకు లేని ఇబ్బంది ఈ సినిమాలకు ఎందుకు?
జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య, ఆర్. నారాయణమూర్తి సెన్సర్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎక్కువ మంది చదివింది: పిచ్చి సినిమా అన్నవాల్లే చీఫ్ గెస్ట్లుగా వచ్చారు: అల్లరి నరేశ్సినిమాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు‘సెన్సార్ విషయంలో సినిమాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఓటీటీలలో ఎలాంటి సెన్సార్ లేకుండానే కంటెంట్ వస్తోంది. మరి తెరపై వచ్చే సినిమాలకు సెన్సార్ ఆంక్షలు ఎందుకు?. సినిమాల విషయంలో రాజకీయాలు మానుకోవాలి. ప్రభుత్వం, సెన్సార్ బోర్డు పెద్దలు కఠినమైన ఆంక్షలు పెట్టకుండా సినిమా వాళ్ల కష్టాలు కూడా అర్థం చేసుకోవాలి. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయ్యారు. కానీ ఏ రాజకీయ నేత సినిమాల్లోకి వచ్చి సూపర్స్టార్ కాలేదు. ప్రతి తెలుగు సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో పడుతోంది’ అని దర్శకుడు వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు చేశారు.షాక్ అయ్యా‘కామ్రేడ్ అనే పదం సెన్సార్ వాళ్లు వద్దంటే షాక్ అయ్యా. అసలు ఈ పదం అర్థం తెలుసా ఎవరికైనా? కామ్రేడ్ అంటే ఒక అమ్మ. ఒకే భావజాలంతో ఒకే లక్ష్యంతో.. ఓకే జీవనశైలితో ప్రజల కోసం వారి జీవితాలను వదిలేస్తారో వాళ్లే కామ్రేడ్స్. కామ్రేడ్ అని పిలుచుకోవడం మన అదృష్టం. అందువల్ల ఈ పదంపై సెన్సార్ వాళ్లు ఇబ్బందులు పెట్టవద్దు. కొన్ని సినిమాల్లో బూతులు ఉన్నా వదిలేస్తున్నారు. మరికొన్ని సినిమాలు మంచిగా ఉన్నా ఇబ్బందులు పెడుతున్నారు’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇదీ చదవండి: తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు -
నవ్వులు పూయిస్తున్న శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్
జానకిరాం మారెల్ల దర్శకకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు టీజర్ విడుదలైంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.సీరియస్గా సాగే నక్సలైట్ నేపథ్యంలోనూ శ్రీవిష్ణు తనదైన శైలిలో నవ్విస్తూ, పూర్తి వినోదాత్మకంగా ఈ టీజర్ ఉంది. రాష్ట్ర హోంమంత్రిని ఎత్తుకెళ్లే సన్నివేశం హైలైట్గా కనిపిస్తోంది. రాధిక శరత్కుమార్, ఉపేంద్ర లమాయే, షైన్ టామ్ చాకో, మహిమా నంబియార్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
సుమలత బహిరంగ క్షమాపణ చెప్పాలి: శేఖర్ మాస్టర్
జానీ మాస్టర్ సతీమణి సుమలతపై డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్కు, ఫెడరేషన్కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు చేశారు. తనపై సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని శేఖర్ మాస్టర్ తెలిపారు.తన ప్రమేయం లేకుండా ఎలాంటి నిరూపిత ఆధారాలు లేకుండా తన మనోభావాలు దెబ్బతినేలా సుమలత అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. తన పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా మాట్లాడారని ఆరోపించారు. ‘కక్కితే కాళ్ల మీద పడతాయి’ అంటూ తనపై అభియోగాలు మోపి, నిందలు వేసి వ్యంగ్యంగా, ఎటకారంగా మాట్లాడారని శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.పెద్దల మాటకు గౌరవంతో మౌనంఈ వివాదంపై మీడియా ముందుకు రావద్దని, గొడవలు వద్దని పెద్దలు సూచించారని శేఖర్ మాస్టర్ తెలిపారు. వారి మాటకు గౌరవం ఇచ్చే ఇంతకాలం మౌనంగా ఉన్నానని చెప్పారు. అయితే సుమలత వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందన్నారు.యూనియన్ సభ్యుల కోసం ముందుంటా‘యూనియన్ సభ్యులకు సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటా. యూనియన్ సభ్యులకు పర్సంటేజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని భావించిన సందర్భాల్లో ఎన్నో సాంగ్స్ను కూడా వదులుకున్నాను’ అని శేఖర్ తెలిపారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శేఖర్ మాస్టర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్పై ఫిర్యాదు -
‘పిచ్చి సినిమా అన్నవాల్లే చీఫ్ గెస్ట్లుగా వచ్చారు’
ఈవీవీ సత్యనారాయణ. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు వినోదాత్మక చిత్రాలంటే గుర్తు వచ్చే మొదటి డైరెక్టర్ ఈయన. సినిమా చేసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు చివరి వరకు కుర్చిలో కూర్చొపెట్టడంలో డైరెక్టర్ సత్యనారాయణకు వెన్నతో పెట్టిన విద్య. ఈయన తీసిన సినిమాలు అలాంటివి మరి. ‘ప్రేమ ఖైదీ’, ‘హలో బ్రదర్’, ‘అల్లుడా మజాకా’, ‘జంబలకిడి పంబ’, ‘కన్యాదానం’ వంటి మరెన్నో చిత్రాలు తీశారు. ‘జంబలకిడి పంబ’తో ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించారు. అయితే ఈ మూవీ కోసం అల్లరి నరేష్ ఓ బ్రాడ్కాస్ట్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇదీ చదవండి: బిగ్బాస్ తొలి కంటెస్టెంట్.. రైతుబిడ్డ ఝాన్సీరివర్స్ గేర్గా ..‘జంబలకిడి పంబ కథను నాన్న అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే రాసుకున్నారు. ఈ సినిమాని నరేశ్ గారిని హీరోగా పెట్టి తీశారు. అయితే కథ వినిపించినప్పుడు టైటిల్ పేరు ‘రివర్స్ గేర్’ అని ఫిక్స్ అయ్యారు. కథలో అంతా రివర్స్గా జరుగుతుంటది అని. రివర్స్ గేర్ అంటే బాగోదేమో, నెగెటివ్ టాక్ వెళ్తుంది అని నరేశ్గారు అభిప్రాయ పడ్డారు. తర్వాత మూవీ పేరుని ‘జంబలకిడి పంబ’గా ఫిక్స్ చేశారు. సగం చూసి వెళ్లిపోయారు..తర్వాత సినిమా కొనడానికి వచ్చే వాళ్లు మూవీ చూసి ఆడవాళ్లు మగాళ్లుగా అయిపోవడం ఏంటి.? అంతా డిఫరెంట్గా ఉందని.. ఇదోక పిచ్చి సినిమా అన్నారు. సినిమా సగం చేసే వెళ్లిపోయారు. అయితే సినిమాపై ఉన్న నమ్మకంతో నాన్న సొంతంగా రిలీజ్ చేశారు. ఇక్కడ క్రేజీ విషయం ఏంటంటే.. ఆ రోజు మధ్యలో వెళ్లిపోయిన వారినే 100 రోజల ఫంక్షన్కు చీఫ్ గెస్ట్లుగా వచ్చారు’ అని అల్లరి నరేశ్ తెలిపారు.ఇదీ చదవండి: ‘బిగ్బాస్’ కొత్త ఇల్లు సిద్ధం -
బిగ్ బాస్ 10 ఎంట్రీ పై ఆటో రాంప్రసాద్ క్లారిటీ!
బిగ్బాస్ సీజన్ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. అయితే ఎప్పటి మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లీకైంది. పలువురి సెలెబ్రెటీల పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వారిలో జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ సారి ఆయన హౌస్లో సందడి చేయబోతున్నాడు. అయితే బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీపై రాంప్రసాద్ డైరెక్ట్గా స్పందించలేదు కానీ.. పరోక్షంగా ఎప్పుడో హింట్ ఇచ్చాడు. కొత్తగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన బిగ్బాస్లోకి వెళ్తున్నాడనే విషయం దాదాపు కన్ఫామ్ అయిపోయింది. తాజాగా తన ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు రాంప్రసాద్. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ పెడుతూ.. తనకు సపోర్ట్ చేయాలని కోరాడు.(చదవండి: బిగ్బాస్ 10: ఈ సారి హౌస్లోకి వెళ్లేది వీళ్లే?)కొత్త చాప్టర్ ప్రారంభం.. బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్న నేపథ్యంలో తాజాగా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. అనంతరం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..‘జబర్దస్త్ నుంచి ఇప్పటివరకు నా కామెడీని ఎంజాయ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జబర్దస్త్ జర్నీ నాకు చాలా స్పెషల్. మీ ప్రేమ సపోర్ట్ కారణంగానే నేను ఈరోజుకి స్థాయిలో ఉన్నాను… ఇప్పుడు నా జీవితంలో మరొక కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతోంది. ఈ జర్నీలో కూడా మీ సపోర్ట్ ఇలాగే నా ఉండాలని కోరుకుంటున్నాను. చేంజ్ ఏదైనా మీకోసం ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా’ టీట్ చేశాడు. దీంతో ఆయన బిగ్బాస్లోకి వెళ్తున్నాడనే వార్త నిజమని తేలిపోయింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం హౌస్లోకి వెళ్లేవరకు అధికారికంగా చెప్పకూడదు.అందుకే రాంప్రసాద్ ఇలా పరోక్షంగా తన ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈ సారి రాంప్రసాద్తో పాటు మరో జబర్దస్త్ కమెడియన్ నరేశ్ కూడా హౌస్లోకి వెళ్తున్నట్లు సమాచారం. వీరితో పాటు యాంకర్ వర్షిణి, పల్లవి గౌడ, యూట్యూబర్ నందు, నటుడు టెంపర్ వంశీ, వినాయుకు మూవీ హీరో కృష్ణుడు, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. #Jabardasth nunchi ippati varaku naa comedy ni enjoy chesi, nannu support chesina prathi okkariki heartfelt THANK YOU ❤️🙏Aa journey naaku chala special… mee love & support valle ee roju nenu ee stage lo unna!Ippudu life lo oka new chapter start avvabothundi… ee journey lo… pic.twitter.com/gwOp7wLQmZ— Jabardasth Ram Prasad (@RamPrasadAuto) September 5, 2026 -
బిగ్బాస్ 10: అగ్ని పరీక్ష నుంచి ఆరుగురు.. హౌస్లోకి వెళ్లేది వీళ్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 10) గ్రాండ్గా ప్రారంభం కానుంది.ఈ సారి దాదాపు 20 మంది వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సీజన్లో సామాన్యుల కోటా నుంచి కూడా భారీగానే వెళ్లనున్నారు. దీని కోసం ఇప్పటికే ‘అగ్ని పరీక్ష’ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో నుంచి ఐదు లేదా ఆరుగురిని హౌస్లోకి పంపనున్నారు. అయితే ఆ జాబితాలో ఎవరెవరకు ఉంటారా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే రైతు బిడ్డ ఝాన్సీ కన్ఫామ్ అయింది.తాజాగా అగ్నిపరీక్ష గ్రాండ్ ఫినాలేలో మేకర్స్ 'టికెట్ టు బిగ్బాస్' ప్రకటించారు. ఈ టికెట్ గెలిచిన వారికి నేరుగా బిగ్బాస్ తెలుగు 10 హౌస్లోకి ఎంట్రీ లభిస్తుంది. ఈ పోటీలో ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే తొలి కంటెస్టెంట్గా ఝాన్సీ నిలిచింది. దీంతో సెప్టెంబర్ 6న జరగనున్న బిగ్బాస్ 10 గ్రాండ్ లాంచ్లో ఝాన్సీ హౌస్లోకి అడుగుపెట్టనుంది. మిగిలిన వారిలో ఇప్పటికే తనదైన ఆటతీరుతో మూడు గ్రీన్స్ సాధించిన మిథిలేష్ని కూడా హౌస్లోకి పంపనున్నారు. వీరితో పాటు చరణ్, రాజకుమారి, రోహిత్, అమన్ కచ్చితంగా బిగ్బాస్ 10లో పాల్గోనే అవకాశం ఉంది. ఆరుగురి కంటే ఎక్కువ పంపిస్తే..శ్రష్టి, షాలినీ వంటి వారు కూడా ఈ సీజన్లో పాల్గోనే అవకాశం ఉంది. అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి వెళ్లేది ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక సెలెబ్రెటీ కోటాలో ఈ సారి పది మంది వరకు హౌస్లోకి వెళ్లే అవకాశం ఉంది. వారిలో జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్, నరేశ్, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ, యాంకర్ వర్షిణి, ముఖేష్, చైత్ర రాయ్, నటులు టెంపర్ వంశీ, కృష్ణుడు, ఎక్స్ప్రెస్ హరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో నుంచి ఎవరు హౌస్లోకి వెళ్లేది ఎవరనేది దానిపై రేపు(సెప్టెంబర్ 6) స్పష్టత రానుంది. సీజన్ 10కి కూడా కింగ్ నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. -
తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇరుముడి’ . ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ను సైతం షేక్ చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సైతం సినిమాకు ప్రాణం పోసింది. తండ్రీకూతురు సెంటిమెంట్కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన ఇరుముడిని చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఇదీ చదవండి: బిగ్బాస్ తొలి కంటెస్టెంట్.. రైతుబిడ్డ ఝాన్సీఈ సినిమా వచ్చి చాలా రోజుల అవుతున్నా ఇంకా ఇరుముడి ఫీవర్ నడుస్తూనే ఉంది. పల్లె నుంచి పట్నం వరకు చిన్న, పెద్దా అని తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. . అయితే ఈ సినిమాను చూసేందుకు గ్రామల నుంచి ప్రేక్షకులు ట్రాక్టర్లతో థియేటర్లకు తరలివెళ్లారు. ఇందులో వృద్ధులు, మహిళలే అధికంగా ఉండడం విశేషం. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.200 కోట్లకు పైగా..మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' (Irumudi Movie) బాక్సాఫీస్ వద్ద కేవలం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. రవితేజ తన సుదీర్ఘ సినీ కెరీర్లో రూ.200 కోట్ల మార్కును అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇందులో ప్రియా భవానీ శంకర్, బేబి నక్షత్ర కీలక పాత్రలు పోషించారు.ఎక్కువ మంది చదివింది: కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియో IRUMUDI: టాలీవుడ్కి గత వైభవాన్ని గుర్తు చేస్తున్న రియల్ బ్లాక్బస్టర్ #IRUMUDI 🔥గ్రామాల నుంచి ట్రాక్టర్లలో తరలివస్తున్న ప్రేక్షకులు… 3వ వారంలోనూ అదే జోష్, అదే సందడి 'ఇరుముడి' సినిమాని థియేటర్లలో ఒక పండగలా జరుపుకుంటున్నారు ❤️@RaviTeja_offl pic.twitter.com/oDRifTpyGd— H A N U (@HanuNews) September 4, 2026 -
చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది
ప్రీతం కస్తూరి దర్శకత్వంలో సంకీర్త్ కొండ నిర్మాతగా చేసిన తెలుగు సినిమా 'డెలులు'. విజయ రాజ్ కుమార్, వేణి రావు, సాయి ప్రసన్న, అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ కీలక పాత్రలు చేశారు. ఆది చేబ్రోలు సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నేటి జెన్ జీ యువతకు దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దారు. తాజాగా హైదరాబాద్లో టీజర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్బాస్ జంటకు మరో కూతురు)హీరో విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను 10 నిమిషాల కథ ఫోన్ కాల్లో చెప్పగానే సంకీర్త్ కొండ నిర్మించడానికి ముందుకొచ్చారు. ఇప్పటివరకు ఎవరూ సాహసించని కథని ‘డెలులు’ ద్వారా చెప్పబోతున్నాం. నా తొలి సినిమా సమయంలో మెగాస్టార్ చిరంజీవి నన్ను అభినందిస్తూ మెసేజ్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒకసారి చిరంజీవి పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసి, “చిరంజీవి గారు నన్ను హీరోగా నమ్ముతున్నప్పుడు నేను కూడా నన్ను నమ్మాలి” అని భావించాను. ఆ ఆలోచనతోనే మళ్లీ కొత్తగా మొదలుపెట్టాను. ఇప్పుడు ‘డెలులు’తో వస్తున్నాను. చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది" అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: చాపచుట్టేసిన 'టాక్సిక్'.. 450 టికెట్స్ మాత్రమే విక్రయం) -
చాపచుట్టేసిన 'టాక్సిక్'.. 450 టికెట్స్ మాత్రమే విక్రయం
'కేజీఎఫ్' లాంటి బ్లాక్బస్టర్ తర్వాత ఏకంగా నాలుగేళ్ల సమయం తీసుకుని హీరో యష్ చేసిన మూవీ 'టాక్సిక్'. చాన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్తో రొమాన్స్, వయలెన్స్ ఎక్కువగా ఉండబోతుందనే హింట్ ఇచ్చారు. ట్రైలర్, సాంగ్స్తో అదే హైప్ మెంటైన్ అయ్యేలా చూసుకున్నారు. తీరా థియేటర్లలో మూవీ రిలీజయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 100 మందిలో ఒకరిద్దరు తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చలేదని టాక్ గట్టిగా వినిపించింది. దీంతో యష్ సినిమా పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారైంది.(ఇదీ చదవండి: నడుము గిల్లే సీన్ చేయనంది.. 'బేబి' చూసి షాకయ్యా)గత బుధవారం(ఆగస్టు 26) ఈ సినిమాని పాన్ ఇండియా భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్ చేశారు. వీటిలో ఎందులోనూ సరిపడా కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఇక ముందే ప్లాన్ చేసుకున్నట్లు ఇంగ్లీష్ వెర్షన్ ఈ శుక్రవారం(సెప్టెంబరు 04) మన దేశంలోని ముంబై, బెంగళూరు, గుర్గ్రామ్, నోయిడా నగరాల్లో 11 షోలు వేశారు. ఇప్పటికే డిజాస్టర్ టాక్ వచ్చేయడంతో ఈ వెర్షన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 450 టికెట్స్ అమ్ముడుపోయి రూ.1.40 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.అదే టైంలో ఈ శుక్రవారం దేశవ్యాప్తంగా 'టాక్సిక్' సినిమాకు రూ.1.50-1.60 కోట్ల మధ్య మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. హైదరాబాద్లో ప్రస్తుతం తెలుగు షోలు 20 లోపే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రాలోని చాలా నగరాల్లో ఇప్పటికే షోలు పూర్తిగా తీసేశారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే ఇంకా ప్రదర్శితమవుతోంది. 'కేజీఎఫ్' లాంటి సక్సెస్ తర్వాత యష్ సినిమాకు ఇలా జరగడం అంటే ఘోర అవమానమనే చెప్పొచ్చు.ప్రస్తుతానికైతే యష్ దృష్టంతా 'రామాయణ్' మీదే ఉంది. ఇందులో రావణుడిగా నటించడంతో పాటు నిర్మాణంలోనూ భాగమయ్యాడు. ఇది హిట్ అవ్వాల్సిన అవసరం ఇతడికే ఎంతైనా ఉంది. అలానే హీరోగా తర్వాత ఎలాంటి సినిమా? ఏ దర్శకుడితో చేస్తాడనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.(ఇదీ చదవండి: కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్బాస్ జంటకు మరో కూతురు) -
కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్బాస్ జంటకు మరో కూతురు
బిగ్బాస్ తెలుగు 10వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి షోలో ఎవరెవరు పాల్గొంటారా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే పెద్దగా బజ్ కనిపించట్లేదు. సరే ఈ సంగతి అలా వదిలేస్తే గతంలో ఇదే బిగ్బాస్లో రియల్ లైఫ్ జోడీ ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులయ్యారు. తమకు కృష్ణాష్టమి రోజున మరోసారి కూతురు పుట్టిందనే శుభవార్తని సోషల్ మీడియాలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: నడుము గిల్లే సీన్ చేయనంది.. 'బేబి' చూసి షాకయ్యా)'అమెరికా అమ్మాయి' సీరియల్తో తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయమైన మెరీనా.. తర్వాత కాలంలో మరో సీరియల్ నటుడు రోహిత్ సాహ్నిని ప్రేమించింది. అలా పెద్దల్ని ఒప్పించి వీళ్లిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నాడు. రోహిత్ కూడా పలు సినిమాలు, సీరియల్స్ చేశాడు. ప్రస్తుతం 'అమ్మోరు' అనే సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే 2022లో వీళ్లిద్దరూ జంటగా బిగ్బాస్ షోలో పాల్గొన్నారు.మెరీనా కొన్ని వారాలు ఉండి ఎలిమినేట్ కాగా రోహిత్ మాత్రం టాప్-5 వరకు వెళ్లాడు. ఇకపోతే 2024 నవంబరులో వీళ్లకు తొలుత ఓ అమ్మాయి పుట్టింది. ఆమెకు తయిరా అని పేరు పెట్టుకున్నారు. గతేడాది జన్మాష్టమి సందర్భంగా పాపని అందరికీ పరిచయం చేశారు. ఇప్పుడు ఏడాది తిరిగేసరికల్లా మరోసారి తమకు కూతురు పుట్టిందనే సంగతిని రోహిత్-మెరీనా బయటపెట్టారు. దీంతో తోటి నటీనటులు, నెటిజన్లు వీళ్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: 9 ఏళ్ల వయసులో 'భరతనాట్యం'.. శ్రీలీల చిన్నప్పటి వీడియో వైరల్) View this post on Instagram A post shared by Rohit Sahni (@rohitsahniofficial) -
9 ఏళ్ల వయసులో 'భరతనాట్యం'.. ఇప్పుడు స్టార్ హీరోయిన్
శుక్రవారం అంతటా కృష్ణాష్టమి వేడుకల్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది తమ పిల్లల్ని కృష్ణుడిగానో రాధలానే ముస్తాబు చేసి మురిసిపోయారు. ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం తనకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు అద్భుతంగా చేసిన భరతనాట్యం డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ వీడియోని పోస్ట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ)పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు శ్రీలీల. అవును గుంటూరు కారం, ధమాకా సహా తెలుగులో చాలా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. అయితే కృష్ణాష్టమి సందర్భంగా తన తల్లి వాట్సాప్ గ్రూపులో ఈ వీడియో షేర్ చేసిందని, దీనిని సోషల్ మీడియాలోనూ తనకు పోస్ట్ చేయాలనిపించి ఇన్ స్టాలో పెట్టానని శ్రీలీల దీనికి క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. శ్రీలీల క్లాసికల్ కూడా భలే చేస్తుందే అని మాట్లాడుకుంటున్నారు.తెలుగమ్మాయి అయినప్పటికీ బెంగళూరులో పెరిగిన శ్రీలీల.. కన్నడ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. 'పెళ్లి సందడి' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై 'ధమాకా'తో హిట్ కొట్టినప్పటికీ స్కంద, గుంటూరు కారం, రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ తదితర మూవీస్ చేసింది. వీటిలో 'భగవంత్ కేసరి' మాత్రమే ఉన్నంతలో సక్సెస్ అయింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పెద్దగా మూవీస్ లేవు. తమిళంలో ధనుష్తో చేసిన 'ఓం', అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఓ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి సక్సెస్ అయినదానిబట్టి శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉంటుంది.(ఇదీ చదవండి: నడుము గిల్లే సీన్ చేయనంది.. 'బేబి' చూసి షాకయ్యా) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
‘బిగ్బాస్’ కొత్త ఇల్లు సిద్ధం
విజయవంతంగా 10వ సీజన్లోకి అడుగుపెడుతున్న బిగ్ బాస్ తమిళం కొత్త ఇంటింతో సిద్ధమైంది. గడిచిన పదేళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఈ సీజన్ హౌస్ను సరికొత్తగా తీర్చిదిద్దారు. 10 సంఖ్య ప్రతిబింబించేలా ఆర్కిటెక్చర్, విండోస్, జామెట్రిక్ డిజైన్లతో ఇంటి ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా మలిచారు. ఈ రియాలిటీ షో చరిత్రలో ప్రపథమంగా మీడియా టూర్ పేరిట హౌస్లోకి ప్రతినిధులను తీసుకెళ్లారు. సామాన్యుడే ప్రధాన థీమ్ నేలతల్లి మూలాలను చాటేలా ఎర్తీగ్రీన్, రస్టిక్ బ్రౌన్ రంగులతో ప్రకృతి సిద్ధమైన లుక్ ఇచ్చారు. హౌస్ మధ్యలో నేల నుంచి ఉద్భవించే కామన్ మ్యాన్ శిల్పం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సంప్రదాయ భారతీయ కోర్ట్యార్ట్ శైలిలో డైనింగ్ ఏరియాను రూపొందించారు. డీప్ గ్రీన్స్, టీల్స్, సుడెన్ టెక్స్చర్లతో కర్వ్డ్ ఐలాండ్ మోడల్లో కిచెన్ స్పేస్ను తీర్చిదిద్దారు. ఈ సీజన్ నుంచి మొదటిసారిగా సింగపూర్, కెనడా, యూకేలోని ప్రేక్షకులు కూడా తమ అభిమాన పోటీదారులకు లైవ్ ఓటింగ్ వేసే వెసులుబాటు కల్పించారు. బిగ్ బాస్ తమిళ సీజన్ 10 గ్రాండ్ ప్రీమియర్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయ్ టీవీ , జియోహాట్స్టార్లో ప్రసారం కానున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. సాక్షి, చెన్నై:చదవండి: వైష్ణవి గురించి 'ఇరుముడి' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ -
నడుము గిల్లే సీన్ చేయనంది.. 'బేబి' చూసి షాకయ్యా
సినిమాలో హీరో లేదా హీరోయిన్ చేసే సీన్స్ చూసి మనం నిజంగా ఫీలైతే సదరు నటుడు సక్సెస్ అయినట్లే. 'బేబి' రిలీజ్ టైంలో ఇలానే జరిగింది. మూవీలోని బెడ్ రూం సన్నివేశాలు చూసి హీరోయిన్ వైష్ణవి చైతన్యపై చాలామంది ట్రోల్ చేశారు. అయితే ఈమెతో గతంలో జరిగిన ఓ షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టిన 'ఇరుముడి' దర్శకుడు శివ నిర్వాణ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైష్ణవి చేసిన 'ఎపిక్' చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా మాట్లాడాడు.(ఇదీ చదవండి: 'డిసి' సూపర్ హిట్.. బ్యూటీకి బంపర్ ఆఫర్)'నా 'టక్ జగదీష్' సినిమాలోని ఓ సీన్లో రౌడీ వచ్చి వైషు నడుము గిల్లాలి. కానీ తను వద్దని చెప్పింది. ఇబ్బందిగా ఫీలవుతున్నానని చెప్పింది. అప్పుడు దగ్గరకెళ్లి చెప్పా. ఇది పాత్ర, నువ్వు కాదని ఆమెతో అన్నాను. కట్ చేస్తే 'బేబి' చూసి షాకయ్యా. అప్పుడు నాకొకటి అనిపించింది. ఏంటి పాత్రలా ఫీలవ్వమంటే ఈ లెవల్లో జీవించేసిందా అని అనుకున్నాను' అని శివ నిర్వాణ.. వైష్ణవి చైతన్యతో గతంలో జరిగిన అనుభవం గురించి బయటపెట్టాడు.షార్ట్ ఫిల్మ్స్తో నటిగా మారిన వైష్ణవి చైతన్య.. అల వైకుంఠపురములో, టక్ జగదీష్, వరుడు కావలెను తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఎప్పుడైతే 'బేబి'తో హిట్ అందుకుందో అప్పటినుంచి హీరోయిన్గా అవకాశాలు వస్తున్నాయి. అలా ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఈమె చేసిన 'ఎపిక్' మూవీ వచ్చే శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ)#TuckJagadish లో...రౌడీ వచ్చి నడుము గిల్లే సీన్...UNCOMFORTABLE అని చెప్పింది..CUT చేస్తే BABY చూసి SHOCK అయ్యా!#ShivaNirvana | #VaishnaviChaitanya pic.twitter.com/KY0cE5isHR— Movies4u Official (@Movies4u_Officl) September 4, 2026 -
లాజిక్లు వదిలేసి మ్యాజిక్ను ఎంజాయ్ చేయండి: ‘అల్లరి’ నరేశ్
‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని యూనిట్ పేర్కొంది. శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత నేను చేసిన కామెడీ సినిమా ఇది. దీంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అన్న చిన్న భయం ఉండేది. ఫస్ట్ డేనే మా సినిమాకు మంచి టాక్ రావడం సంతోషాన్నిచ్చింది. లాజిక్లు వదిలేసి ఒక మ్యాజిక్ని ఎంజాయ్ చేయండి. చూడనివాళ్ళు, థియేటర్స్లో చూసి, ఇంకా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అందరూ ‘నరేష్ ఈజ్ బ్యాక్’ అంటున్నారు. కామెడీని ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఎమోషన్ గురించి కూడా గొప్పగా మాట్లాడుతున్నారు’’ అని తెలిపారు చంద్రమోహన్. ‘‘నరేష్గారి కామెడీ ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. బీ, సీ సెంటర్స్లో మా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు రాజేష్ దండా. -
పాఠాలు చెబుతాం... నిలదీస్తాం
టీచర్ అంటే క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం, స్ట్రిక్ట్గా ఉండటం మాత్రమే కాదు... విద్యను వ్యాపారంగా మార్చాలనుకుంటే నిలదీస్తాం అంటున్నారు సిల్వర్ స్క్రీన్ టీచర్స్. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా త్వరలో తెరకు రానున్న కొన్ని టీచర్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం.ప్రొఫెసర్ పాఠాలు యాక్షన్ మోడ్లో స్క్రీన్ పై ప్రభాస్ ఎలా కనిపిస్తారో చాలా సినిమాల్లో చూశాం. కానీ ‘మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సినిమాల్లో ప్రభాస్ క్లాస్గానూ కనిపించారు. తాజా సినిమా ‘స్పిరిట్’లో కూడా కొన్ని సీన్స్లో క్లాస్గా కనిపిస్తారట. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్, డాన్, కాలేజీ ప్రొఫెసర్... ఇలా మూడు డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తారట. ఆ మధ్య హైదరాబాద్లోని ఓ ప్రముఖ కాలేజీలో ప్రభాస్ పాల్గొనగా కీలక సన్నివేశాలను తీశారు. ప్రొఫెసర్గా ప్రభాస్ నటించిన సన్నివేశాలనే ఆ షెడ్యూల్లో చిత్రీకరించారనే ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తండ్రి గురువు... కుమార్తె శిష్యురాలు నిజ జీవితంలో తండ్రీ కూతుళ్ళు అయిన షారుక్ ఖాన్ –సుహానా ఖాన్లు ‘కింగ్’ సినిమాలో గురు–శిష్యులుగా కనిపించనున్నారని తెలిసింది. కాకపోతే ఈ చిత్రంలో గురువుగా సుహానాకు షారుక్ కాలేజీ పాఠాలు చెప్పరు. జీవిత పాఠాలు నేర్పుతారు. తనకు అన్యాయం చేసిన వారి భరతం పట్టే పాత్రలో సుహానా నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో ఆమె కొన్ని రిస్కీ యాక్షన్ సీక్వెన్స్లు చేయాల్సి ఉంది. ఆన్సెట్స్లో ఈ రిస్కీ ఫైట్స్ చేయడానికి షారుక్ సహాయం చేస్తున్నారట. అలాగే సినిమాలోనూ యాక్షన్ గురువుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాక్పీస్... తుపాకీ ‘హిస్టరీ లెసన్స్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి’ అంటూ ఆ మధ్య ‘టీచర్’ చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు బాలు శర్మ. ఈ సినిమా టైటిల్ లోగోలో చాక్పీస్ మాత్రమే కాదు... తుపాకీ కూడా కనిపించడం చర్చనీయాంశమైంది. యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. టీచర్గా ప్రముఖ నటి సిమ్రాన్ నటిస్తున్నారు. క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడంతో పాటు దుష్టుల పని పట్టే టీచర్గా ఆమె కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. దబాంగ్ టీచర్ ఆమె కోటీశ్వరురాలు... కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి, టీచర్గా చేరుతుందట. అది కూడా ట్రైనీ టీచర్గా... ‘దబాంగ్ టీచర్’ పేరుతో రూపొందుతున్న సిరీస్లో కనికా కపూర్ ఈ పాత్రను చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం, న్యాయం కోసం పోరాటం, విలక్షణమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టీచర్ నైనా పాత్ర కోసం తాను సుష్మితా సేన్, ఆలియా భట్లను స్ఫూర్తిగా తీసుకున్నానని, వారి బాడీ లాంగ్వేజ్ టీచర్ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంటుందని కనికా పేర్కొన్నారు. షకేబ్ సయ్యద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ డిజిటల్ వేదికగా త్వరలో వీక్షకుల ముందుకు రానుంది. -
కన్నప్పుడు కాలేజీ ఫీజు కూడా కట్టరా?.. ఎపిక్ ట్రైలర్ రిలీజ్
బేబీ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. ఈ జంట ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ అనే మూవీలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆదిత్యహాసన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే ఎపిక్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లండన్ బ్యాక్డ్రాప్లో జరిగిన లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇండియా నుంచి లండన్ వెళ్లిన ఇద్దరు ప్రేమలో పడే నేపథ్యంలో ఈ కథ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. -
మహేంద్రగిరి వారాహి.. ది రేజ్ ఆఫ్ వారాహి రిలీజ్
సుమంత్, ఐశ్వర్య రాజేశ్, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో వస్తోన్న డివోషనల్ మూవీ మహేంద్రగిరి వారాహి. వారణాసి గ్రామదేవత వారాహీ అమ్మవారి కథతో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ వారాహీ అమ్మవారిగా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ నుంచి ది రేజ్ ఆప్ వారాహి అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ను టాలీవుడ్ హీరో నాగచైతన్య చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు కడలి సత్యనారాయణ లిరిక్స్ అందించగా.. నకాశ్ అజిజ్ ఆలపించారు. ఈ సాంగ్ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో మాళవిక నాయర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. Happy to launch #TheRageOfVarahi from #MahendragiriVarahi 🔱🔗 https://t.co/pYkqIjAtccA powerful score by @anuprubens that elevates the essence of Varahi beautifullyMy best wishes to @iSumanth anna, director @Santhosshjagar1, producers Laxman garu, @kalipumadhu5 garu and…— chaitanya akkineni (@chay_akkineni) September 4, 2026 -
రాజ్ తరుణ్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
రాజ్తరుణ్, అమృత చౌదరి జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టార్టాయిస్. ఈ సినిమాకు రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్పై శశిధర్ నల్ల, విజయ్ కుమార్, ఇమ్మడి సంతోష్, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. నీ పరిచయం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. చిన్మయి, అనూప్ రూబెన్స్, జాహ్నవి ఆలపించారు. ఈ సాంగ్ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
జానీ మాస్టర్ సతీమణి సుమలతపై ఫిర్యాదు
సుమలత ఆరోపణలపై రఘు మాస్టర్ కౌంటరిచ్చారు. సుమలత పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రఘు మాస్టర్ ఫిర్యాదు చేశారు. తమ కార్యవర్గాన్ని ఫెడరేషన్ గుర్తించిందని రఘు మాస్టర్ స్పష్టం చేశారు. ఫెడరేషన్ గుర్తింపు లేఖతోనే బ్యాంకును ఆశ్రయించామని వెల్లడించారు. మేం ఇచ్చిన లేఖ ఆధారంగానే బ్యాంకు అనుమతించిందని రఘు మాస్టర్ తెలిపారు.సుమలత ప్యానెల్ను ఫెడరేషన్ గుర్తించలేదని రఘు మాస్టర్ ఆరోపించారు. సుమలత వ్యవహారంతో డాన్సర్స్ అసోసియేషన్ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. అసోసియేషన్లో వివాదాలను సుమలత మరింత పెంచుతున్నారని రఘు మాస్టర్ విమర్శించారు. త్వరలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతానని రఘు మాస్టర్ ప్రకటించారు. కాగా.. అంతకుముందు రఘు మాస్టర్ ప్యానెల్పై సుమలత ఫిర్యాదు చేసింది. బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ సుమలత ఆరోపించింది. -
రంభ ఊర్వశి మేనక.. ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..!
అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ చిత్రానికి చింతాడ చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురభి హీరోయిన్గా కనిపించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఇవాళే థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, నిమ్మకాయ ప్రసాద్ నిర్మించారు. -
కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్పై ఫిర్యాదు
డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్పై కేసు నమోదైంది. ఆయనపై జానీ మాస్టర్ సతీమణి సుమలత దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రఘు మాస్టర్ కార్యవర్గం చెల్లదంటూ ఆమె ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్కు పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మరింత తెలియాల్సి ఉంది. అసోసియేషన్ అధ్యక్షురాలిగా తొలగింపు.. కాగా.. గతేడాది డిసెంబరులో జానీ మాస్టర్ భార్య సుమలత.. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. వచ్చే ఏడాది డిసెంబరు వరకు పదవీకాలం ఉంది. కానీ అసోసియేషన్లో గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న సంఘటనల కారణంగా ఈమెని తప్పించారు. హైదరాబాద్లోని కృష్ణానగర్లో యూనియన్ డ్యాన్సర్స్ భేటీ అయ్యారు. ఈ మేరకు కార్యవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులని ప్రకటించారు.డ్యాన్సర్స్ అసోసియేషన్కి రఘు మాస్టర్ ప్రెసిడెంట్ కాగా.. మెహర్ బాబా మాస్టర్ సెక్రటరీ, బసవరాజు వైస్ ప్రెసిడెంట్, రాజన్న జాయింట్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. కార్యవర్గ సభ్యులుగా సతీష్, నాగార్జున, శివ కృష్ణ , జోజో ఉండనున్నారు. అయితే వీళ్లంతా తాత్కాలిక సభ్యులే. త్వరలో ఎన్నికలు జరుగుతాయని రఘు మాస్టర్ చెప్పారు. -
దుల్కర్ సల్మాన్ ‘ఐమ్ గేమ్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఐమ్ గేమ్నటీనటులు:దుల్కర్ సల్మాన్, ఖయాదు లోహర్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్, కథిర్ తదితరులునిర్మాతలు: దుల్కర్సల్మాన్, జోమ్ వర్గీస్దర్శకత్వం: నహాస్ హిదయత్సంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్విడుదల తేది: సెప్టెంబర్ 3, 2026దుల్కర్ సల్మాన్ పేరుకు మలయాళ నటుడే అయినా..తెలుగు వాళ్లకు బాగా దగ్గరైనవాడు. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. అలా ఈ వారం(సెప్టెంబర్ 3) తెలుగు ప్రేక్షకులను పలకరించిన చిత్రం ‘ఐమ్ గేమ్’.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. సినిమాపై మాత్రం హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డ్యాన్(దుల్కర్ సల్మాన్) ఓ రిచ్ కిడ్. చదువు పూర్తి చేసి తండ్రి కోరిక మేరకు బిజినెస్ రంగంలోకి వెళ్తాడు. అయితే ఆయన పని కంటే గ్యాంబ్లింగ్పైనే ఎక్కువ దృష్టిపెడతాడు. లక్షల రూపాయలు అప్పుతెచ్చి జూదం ఆడుతాడు. డబ్బులన్నీ పోగొట్టుకొని.. చివరకు అప్పు ఇచ్చినవాడి చేతిలో తన్నులు తింటాడు. కొడుకు పరిస్థితి చూసి తల్లి మెర్సీ(జయసుధ)దాచుకున్న రూ. 60 లక్షలు ఇస్తే..వాటిని కూడా క్రికెట్ బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకుంటాడు. బెట్టింగ్ నిర్వాహకులతో గొడవకు దిగి..కారులో పారిపోతుండగా ప్రమాదం జరిగి కుడి చేతిని కోల్పోతాడు. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి..వేరొకరి చేయిని డ్యాన్కి అతికిస్తారు. ఈ క్రమంలోనే ఫిజియోథెరపిస్ట్ ఇషా (కయాదు లోహర్)తో పరిచయం.. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. ఇలా అంతా బాగుందనుకునేలోపు డ్యాన్ కుడి చేయి.. అతని నియంత్రణలో లేకుండా పోతుంది. అతను చెప్పని,ఇష్టంలేని పనులన్నీ కుడి చేయి చేస్తుంది.అలా ఓ రోజు పబ్లో మద్యం సేవిస్తుండగా.. అక్కడకు వచ్చిన బెట్టింగ్ డాన్ డేవిడ్ (మిస్కిన్)ని చంపేందుకు ప్రయత్నించగా..డ్యాన్ బలవంతంగా అడ్డుకుంటాడు. అసలు డ్యాన్ కుడి చేయి ఎవరిది? ఎందుకు అలా ప్రవర్తిసుంది? డేవిడ్కు ఎందుకు చంపాలనుకుంది? అసలు ఆ చేతికి అంత శక్తి ఎలా వచ్చింది? క్రికెట్ విక్రమ్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతనితో డ్యాన్కు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..చేతికి వేరే ప్రాణం రావడం అనే కాన్సెప్ట్ కొత్తదేమి కాదు. ‘మావీరన్’, ‘సవ్యసాచి’ లాంటి చిత్రాలు ఈ కాన్సెప్ట్తో తెరకెక్కినవే. ఐమ్ గేమ్ కథ కూడా అలాంటిదే. కానీ ఆ కథను తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంది. యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు బాగుంది. అయితే అసలు కథ ప్రారంభం అంటే హీరోకి ఆపరేషన్ చేసి చేతిని అతికించే వరకు కథనం రొటీన్గా సాగుతుంది. అలాగే ద్వితియార్థం మొత్తం ఊహకందేలా సాగడం కూడా మైనస్. డ్యాన్ లైఫ్ స్టైల్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. జూదానికి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకోవడం.. అప్పు ఇచ్చినవాడు దాడి చేయడం.. బెట్టింగ్ ఇలా మొదటి అరగంట అంతా రొటీన్గానే సాగుతుంది. ఎప్పుడైతే ప్రమాదం జరిగి డ్యాన్కి చేతిని అతికిస్తారో అప్పటి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఆ చేయి తన నియంత్రణను కోల్పోయిన తర్వాత మరింత కామెడీ చేసే స్కోప్ ఉన్నా దర్శకుడు దాన్ని పైపైనే చూపించాడు. అలాగే లవ్స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. కానీ డేవిడ్పై దాడి చేసినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుటుంది. అయితే సెకండాఫ్పై మరింత ఆసక్తికరంగా ఉంటుందనుకుంటే.. కాసేపటికే నీరసం వచ్చేలా నెమ్మదిగా సాగుతుంది. హీరోకి చేతిని దానం చేసిన వ్యక్తి గురించి తెలియగానే.. ప్లాష్బ్యాక్లో ఏం జరిగింది? క్లైమాక్స్ ఎలా ఉంటుంది? అనేది ఈజీగా ఊహించొచ్చు. విక్కీ పాత్ర చుట్టూ సాగే ఫ్లాష్బ్యాక్ చాలా సాగదీసినట్లు, రొటీన్గా అనిపిస్తుంది. డేవిడ్ పాత్రను అటు భయంకరంగా చూపించలేదు.. ఇటు పూర్తి వినోదాత్మకంగానూ అలరించలేదు. బెట్టింగ్ వల్ల జరిగే అనర్థాల గురించి ఇచ్చిన సందేశం కూడా ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. అలాగే సినిమా నిడివి(177 నిమిషాలు) కూడా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. డ్యాన్ పాత్రకి దుల్కర్ సల్మాన్ పూర్తి న్యాయం చేశాడు. సినిమా ప్రారంభంలో గ్యాంబ్లర్గా, ఆ తర్వాత తన చేతిని తనే కంట్రోల్ చేసుకోలేని నిస్సహాయుడిగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఒక చేతితోనే చేసే యాక్షన్ సీన్లు బాగా అలరిస్తాయి. ఇక కయాదు పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. విక్కీ పాత్రలో ఆంటోనీ చక్కగా నటించాడు. మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చాలా చక్కగా నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం.తనదైన బీజీఎంతో చాలా సన్నివేశాలను ఎలివేట్ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. కొన్ని సాగదీత సీన్లను కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
అప్పట్లో దేవుళ్లు.. ఇప్పుడు స్మగ్లర్లు, క్రిమినల్స్: నటి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటి కస్తూరి శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వస్తోన్న మూవీస్పై కీలక వ్యాఖ్యలు చేసింది. మన తెలుగులో మొదట్లో హీరోలు దేవుడి పాత్రల్లో నటించేవారని తెలిపింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోలు పోలీస్, లాయర్, విప్లవాత్మకమైన పాత్రలు ఎక్కువగా కనిపించాయని పేర్కొంది. అయితే ఈ నాటి చిత్రాల్లో మాత్రం స్మగ్లర్, క్రిమినల్ లాంటి పాత్రల్లో మాత్రమే హీరోలు కనిపిస్తున్నారని విమర్శించింది. సోషల్ మేసేజ్తో వచ్చే చిత్రాలు చాలా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేసింది.కస్తూరి శంకర్ మాట్లాడుతూ.." చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినిమాను సినిమాగానే చూడాలి. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మాయాబజారు, కృష్ణార్జున యుద్ధం, ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు చూసేదాన్ని. అప్పట్లో దేవుడి పాత్రల్లో ఎక్కువ కనిపించేవారు. కానీ ఇప్పుడు సినిమాల్లో మాత్రం స్మగ్లర్, క్రిమినల్ పాత్రలు చేసే సినిమాలు వస్తున్నాయి. ఆనాడు ఒక సామాజిక బాధ్యతతో సినిమాలు చేసేవారు. అలాంటి సోషల్ మేసేజ్ ఇచ్చే మూవీనే మా ధర్మస్థల నియోజకవర్గం" అని తెలిపింది. ఆమె కీలక పాత్రలో నటించిన ధర్మస్థల నియోజకవర్గం ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఈ సందర్భంగా కస్తూరి శంకర్ తెలుగు సినిమాలను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. మొదట్లో తెలుగు సినిమాల్లో హీరోలు దేవుడి పాత్రల్లో నటించేవారు.ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోలు పోలీస్, లాయర్, విప్లవాత్మకమైన పాత్రల్లో నటించేవారు.ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోలు స్మగ్లర్, క్రిమినల్ లాంటి పాత్రల్లో నటిస్తున్నారు.- Kasthuri Shankar… pic.twitter.com/s1FglISJx7— Tupaki (@tupaki_official) September 3, 2026 -
అల్లు అర్జున్ రాకా.. రిలీజ్ డేట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ రాకా. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలు మరించ పెంచేశాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో టాక్ నెట్టింట వైరల్గా మారింది.ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 2028 జనవరి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. ఈ తేదీపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రాకా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అధికారిక ప్రకటన వస్తేనే ఫుల్ క్లారిటీ రానుందని తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో తండ్రి... ఇద్దరు కొడుకులు... ఇలా ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారట అల్లు అర్జున్. అంతేకాదు... ఈ మూడు పాత్రల్లో ఒకటి విలన్ రోల్ అని సమాచారం. ఇదే నిజమైతే ‘రాకా’ చిత్రంలో హీరోగా, విలన్గా అల్లు అర్జున్ నటన చూడొచ్చు. ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్లో దీపికా పదుకోణె నటిస్తున్నారు. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. 🚨 𝐒𝐇𝐎𝐂𝐊𝐈𝐍𝐆 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 🚨Allu Arjun’s #𝐑𝐀𝐀𝐊𝐀 Is 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋𝐋Y Set For 𝟐𝟔𝐓𝐇 𝐉𝐀𝐍𝐔𝐀𝐑𝐘 𝟐𝟎𝟐8 Release🗓️❤️🔥❤️🔥!Targeting A 𝟓-𝐃𝐀𝐘 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃 𝐑𝐄𝐏𝐔𝐁𝐋𝐈𝐂 𝐃𝐀𝐘 𝐖𝐄𝐄𝐊𝐄𝐍𝐃 🥁, The Film Has Announced Its Release Date Via Its… pic.twitter.com/ldGV5jN8tq— Movies Buster (@buster_movies) September 4, 2026 -
మార్కండేయుడిగా బహ్మాజీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
బ్రహ్మాజీ మార్కండేయుడి పాత్రలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు కలాల్ శ్రీనివాస్ నిర్మిస్తుండగా.. నాగరాజ్ కొట్టే దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ను సోషల్ మీడియాలో లాంఛ్ చేశారు.పోస్టర్లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్లో సంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో ఆయన లుక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.కాగా.. ఈ చిత్రంలో ప్రదీష్, వంగమయి పటేల్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీలో మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచ్చ రవి డైలాగ్స్ అందిస్తున్నారు. -
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నికల సందడి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల మండలి ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాతల సమస్యల పరిష్కారంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి తమ ప్యానెల్ కృషి చేస్తుందని తెలిపారు.కలిసి పనిచేద్దాం..ఈ సందర్భంగా నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధి రవి యలమంచిలి మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమా మంచి కంటెంట్తో ప్రేక్షకుల ఆదరణ పొందుతోందన్నారు. పరిశ్రమలో నిర్మాతలంతా ఐక్యంగా ఉండి మంచి సినిమాలను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ సంస్థ ఇప్పటివరకు సుమారు 180 సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసినట్లు తెలిపారు. నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.నిర్మాత అశోక్కుమార్ మాట్లాడుతూ.. నిర్మాతల మండలి ఎన్నికలు సాధారణంగా రెండేళ్లకు ఒకసారి జరగాల్సి ఉన్నప్పటికీ.. ఈసారి ఏడు నెలలు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. మండలిలో అధ్యక్షుడి మాట కూడా చెల్లని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం తాను నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. -
కల సంపూర్ణమైంది.. మెగా కోడలు ఉపాసన ఎమోషనల్
రామ్ చరణ్ భార్య ఉపానస ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. శ్రీ కృష్ణ జన్మాష్టమిని తన పిల్లలతో కలిసి చరణ్-ఉపాసన సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోని పోస్ట్ చేసిన మెగా కోడలు.. తన కల సంపూర్ణమైంది అని క్యూట్ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.2012లో చరణ్-ఉపాసన పెళ్లి చేసుకోగా.. 11 ఏళ్ల తర్వాత 2023లో వీళ్లకు కూతురు పుట్టింది. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇకపోతే ఈ ఏడాది జనవరిలో కవలలు(కొడుకు, కూతురు) పుట్టారు. వీళ్లకు శివరామ్, అన్వీరా అని పేర్లు పెట్టారు. తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉపాసన.. కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే తన కల సంపూర్ణమైంది అన్నట్లు రాసుకొచ్చింది. ఈ ఫొటోలనూ అన్వీరా, శివరామ్ ముఖాలని దాచిపెట్టింది.(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
చాలాసార్లు చావు నుంచి తప్పించుకున్నా: హీరో సుహాస్
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా సుహాస్ ఓ ఇంటర్వ్యులో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అనుకున్న దానికంటే ఎక్కువగానే సంపాదించా..‘మంచి మంచి అవకాశాలు రావడం వల్ల సంతోషంగా ఉంది. డబ్బులు కూడా అనుకున్నదాని కంటే ఎక్కువగానే సంపాదించా. మండాడిలో పూర్తిస్థాయిలో విలన్గా నటించా. పాత్ర కూడా భయపెట్టే విధంగా ఉంటుంది. సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. షూటింగ్ సముద్రం మధ్యలో చేశాం. కొన్ని సందర్భాల్లో చావు నుంచి కూడా తప్పించుకున్నాం. సముద్రం లోపల షూటింగ్ అంటే కొంచం కష్టంగానే ఉంటుంది’ అని తెలిపారు.కాగా ఈ సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మణికందన్ సహ–నిర్మాతగా వ్యవహరించారు. జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ రిలీజ్ చేస్తోంది. ఇదీ చదవండి: ఎయిర్హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీ -
ఎయిర్హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీ
ఎయిర్హోస్టెస్గా ఉద్యోగం.. మంచి జీతం. తన తల్లి కల కోసం సినిమాలవైపు వచ్చింది. నటనపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్కు వచ్చింది యువ హీరోయిన్ రాశీ సింగ్. ‘శశి’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో మరోసారి వెండి తెరపై కనిపించింది. ఛత్తీస్గడ్కు చెందిన ఈ భామ తన కెరీర్ విశేషాలను వెల్లడించింది. తన మాటల్లోనే..‘చిన్నప్పటి నుంచి నటిని కావాలని నిర్ణయించుకున్నా. నిజానికి మా అమ్మకు కూడా నటి కావాలనే కోరిక ఉండేది. కానీ కొన్ని కారణాల కాలేకపోయారు. ఆమె కల కోసం నన్ను ఇలా ప్రోత్సాహించారు. ఇప్పుడు నాలో ఆమెను చూసుకుంటున్నారు.గతంలో ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో ఎయిర్హోస్ట్గా పనిచేశా. ఆ ఉద్యోగం బాగానే ఉన్నప్పటికీ నా మనసంతా సినిమాల పైనే ఉండేది. అందుకే ఉద్యోగాన్ని వదిలేశా. తర్వాత మోడలింగ్ చేయడంతో పాటు కొన్ని ప్రకటనల్లో నటించా. గాడ్ఫాదర్ లేకపోవడంతో చాలా విషయాల్లో కష్టపడాల్సి వచ్చేది. అయితే ఆ శ్రమకు ఇప్పుడు ప్రతిఫలం దక్కింది.ఇదీ చదవండి: ‘ఓటీటీలు సోమరిపోతుల కోసమే’నాకు కెమెరా అంటే భయం ఉండేది కాదు. షూటింగ్ టైమ్లో నటనకు సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకున్నా. యాడ్స్లో పనిచేయడం కూడా కలిసొచ్చింది. మోడలింగ్ ద్వారా చాలామందిని కలుసుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టా.ఎక్కువ మంది చదివింది: రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి : అల్లరి నరేష్సినిమాలో నేను పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల నన్ను గుర్తుపట్టుకోవాలి. అందుకే తొందరపడకుండా కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నా. కథ విన్నాకే నిర్ణయం తీసుకుంటా. పరిశ్రమలో గుర్తుండుపోయే పాత్రలు చేయాలనేదే నా కోరిక’ అని రాశి సింగ్ ఓ ఇంటర్వ్యులో వెల్లడించారు. ఇదీ చదవండి: బిగ్బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? -
‘ఓటీటీలు సోమరిపోతుల కోసమే’
బేబీ మూవీతో ఫేమస్ అయిన టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రం ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ ఈ చిత్రానికి ఆదిత్యహాసన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న నటుడు శివాజీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.ఎక్కువ మంది చదివింది: 100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి: అల్లరి నరేష్ఆ కిక్కే వేరు..‘సినిమా అనేది ఒక అద్భుతం. ఇది థియేటర్లలో మాత్రమే చూడాలి. 200 నుంచి 300 మంది మధ్య ఓ సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. అంతేకాని ఓటీటీలో చూస్తూ.. జోమోటో వాడు వచ్చాడు.. స్విగ్గివాడు వచ్చాడని మూవీని ఆపి చూస్తే అంత మజా అనిపించదు. ఓటీటీ అనేది బాగా ఖాళీ ఉండి.. సోమరిబోతుల కోసం మాత్రమే. అని శివాజీ వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా తాను నటించిన ‘90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ థియేటర్లలో రిలీజ్ అయింటే కచ్చితంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసేదన్నారు. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి. నెటిజన్ల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.సినిమా విషయానికి వస్తే..ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఈ రోజు (సెప్టెంబర్ 4)న హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా రష్మిక హాజరుకానున్నారు.ఇదీ చదవండి: అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం Shocking Comments 😲 Actor #Sivaji about #90sWebSeries“OTT is for LAZY PEOPLE!!”If #90s had released in theatres, the film would have easily crossed ₹100 CR, according to Sivaji. pic.twitter.com/Wyrn4vJLHD— Milagro Movies (@MilagroMovies) September 3, 2026 -
‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
టైటిల్: బెత్లెహోమ్ కుటుంబ యూనిట్నటీనటులు: నివిన్ పౌలి, మమిత బైజు, సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులునిర్మాతలు: దిలీష్ పోతన్, ఫహద్, ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ తెలుగు విడుదల: మైత్రీ మూవీ రిలీజ్దర్శకత్వం: గిరీశ్ ఏడీసంగీత: విష్ణు విజయ్సినిమాటోగ్రాఫర్: అజ్మల్ సాబువిడుదల తేది: సెప్టెంబర్ 4, 2026మలయాళ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఈ మధ్య అక్కడ సినిమాలన్నీ ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ వారం తెలుగులో రిలీజ్ అయిన మలయాళ చిత్రమే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’. ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. నేడు(సెప్టెంబర్ 4) ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ‘ప్రేమలు’ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. జస్టిన్ (నివిన్ పౌలీ) ఊర్లో క్యాటరింగ్ బిజినెస్ రన్ చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు. ఊర్లో వాళ్లంతా హేళన చేస్తున్న పెద్దగా పట్టించుకోడు. అలాంటి వ్యక్తిని పక్కింట్లోకి కొత్తగా వచ్చిన ఓ కుటుంబంలోని అమ్మాయి ఆష్లే(మమితా బైజు) ప్రేమిస్తుంది. తొలుత స్నేహం చేసి ఆ తర్వాత అతని మంచితనం చూసి ప్రేమలో పడిపోతుంది. అయితే ఆమెకు జస్టిన్కి మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంటుంది. కాలేజీకి వెళ్లే అమ్మాయి ఆష్లే తనను ప్రేమించిందన్న విషయం తెలిసి జస్టిన్ కూడా ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ప్రేమ విషయం కొన్నాళ్లు సీక్రెట్గా ఉంచుదామని చెప్పి..ఎవరి కంటా పడకుండా తిరుగుతుంటారు. అయితే ఓ సంఘటన వీరి రహస్య ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరి కుటుంబ సభ్యలు ఎలా రియాక్ట్ అయ్యారు? చివరకు వీరిద్దరి ప్రేమ..పెళ్లి వరకు ఎలా వెళ్లింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. చారానా కోడికి బారానా మసాలా అన్నట్లుగా.. చిన్న కథకు కూడా కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి, భారీ హంగులతో సినిమాలు తెరకెక్కిస్తున్న రోజులివి. కానీ సినిమా గొప్పదనం ఎన్ని కోట్లు ఖర్చు చేశామన్నదానిలో లేదు.. తెరపై ఆ కథను ఎంత సహజంగా ఆవిష్కరించామన్నదానిలో ఉంటుంది. ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అవ్వాలి.. పాత్రల్లో తనను తాను చూసుకోవాలి.. అప్పుడే ఆ సినిమా బడ్జెట్తో సంబంధం లేకుండా విజయం సాధిస్తుంది. ఈ సూత్రాన్ని మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడో ఒంటబట్టించుకుంది. స్టార్ హీరోలు, భారీ సెట్లు, కోట్ల బడ్జెట్ల కంటే.. కథ, కథనానికే అక్కడ పెద్దపీట. అందుకే అక్కడి నుంచి వచ్చే సినిమాలు భాషల్ని దాటి ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్తుంటాయి. అలాంటి సహజత్వానికి అద్దం పట్టే మరో మలయాళ ఆణిముత్యమే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ సినిమా. ఈ సినిమా కథ కొత్తదేమి కాదు. చాలా సింపుల్ లవ్ స్టోరీ. ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్తో వచ్చిన సింపుల్ లవ్స్టోరీ.కథలో కొత్తదనమేమి లేకున్నా..దాన్ని తెరపై కొత్తగా చూపించడంలో మాత్రం దర్శకుడు గిరీశ్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ప్రేమలు సినిమా మాదిరే ఇందులో కూడా సహజత్వానికి పెద్ద పీట వేశాడు దర్శకుడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతి సన్నివేశం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆహ్లాదకరంగా కథనం సాగుతుంది. ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగినా..జస్టిన్, ఆష్లే పరిచయం తర్వాత మనం ఆ పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తుంటాం. హీరోహీరోయిన్ల పరిచయం..స్నేహితుల మాటలు.. లవ్ ప్రపోజల్.. ప్రతీది మన చుట్టుపక్కల చూసిన కథనే తెరపై చూపించిన అనుభూతి కలుగుతుంది. షార్ట్ఫిల్మ్ మేకింగ్తో జస్టిన్ తమ్ముడు రచ్చ నవ్వులు పూయిస్తుంది. ఆష్లే లవ్ ప్రపోజల్ సీన్ కూడా ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల లవ్ చుట్టునే తిరుగుతుంది. ఊర్లో వాళ్లుకి, స్నేహితులకు తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం.. చిన్న చిన్న గొడవలు..అలకలు.. కాలేజీ ఎపిసోడ్.. అన్ని ఆకట్టుకుంటాయి. ఇక వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత అసలు సంఘర్షణ మొదలవుతుంది. అయితే అక్కడ నుంచి కథను ఎమోషనల్గా నడిపించే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మళ్లీ హాస్యాన్నే ఎంచుకున్నాడు. తన తమ్ముడి లవ్స్టోరీ తెలిసిన తర్వాత.. ఆ జంటను కలిపేందుకు జస్టిన్ గ్యాంగ్ చేసే హంగామా అంతా నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ... అటు వైపు ఎక్కువ వెళ్ళలేదు. అలాగే హీరో లవ్ఫెయిల్యూర్ని పైపైనా చూపిస్తూ .. అతని తమ్ముడి లవ్స్టోరిని హైలెట్ చేస్తూ హాస్యం పండించాడు. హీరోహీరోయిన్ల ప్రేమలో డెప్త్ లేకున్నా.. కామెడీ సీన్లతో ఆలోటుని పూడ్చేశాడు. క్లైమాక్స్ కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఓ మంచి సినిమా చూశామనే ఫిలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారంటే.. నివిన్ పౌలీ పాత్రలో నివిన్ పౌలీ నటించలేదు..జీవించేశాడని చెప్పాలి.తెరపై హీరోలా కాకుండా కామన్ మ్యాన్గా కనిపించాడు. ముఖ్యంగా హీరోయిన్ ప్రపోజ్ చేసినప్పుటు ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా ఉంటాయి. తన ప్రేమను వ్యక్తం పరిచేందుకు పడే సిగ్గు, ఇన్ సెక్యూరిటీ.. ప్రతీది చాలా అద్భుతంగా పండించాడు. ఇక ఆష్ల పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది మమిత. ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది.నివిన్, మమితల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. హీరో తమ్ముడిగా సంగీత్ ప్రతాప్, అతని స్నేహితుడిగా రోషన్ షనవాస్ తమదైన కామెడీతో నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. విష్ణు విజయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు కూడా బాగుంటాయి. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కేరళ పల్లెటూరి అందాలనే కాదు గోవా అందాలను కూడా తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘ధర్మస్థ నియోజకవర్గం’ మూవీ రివ్యూ
టైటిల్:ధర్మస్థ నియోజకవర్గంనటీనటులు:సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, షఫీ, కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ కుమార్, తదితరులునిర్మాత: మేరుం భాస్కర్దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోటసంగీతం: మహావీర్ ఏలేందర్ఎడిటింగ్ : సాయిబాబు తలారివిడుదల తేది: సెప్టెంబర్ 4, 2026కథేంటంటే..ధర్మస్థల నియోజకవర్గం ఎమ్మెల్యే బైర్రాజు(సాయి కుమార్) ఓ సీనియర్ రాజకీయ నాయకుడు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతుంటాడు. అదే నియోజకవర్గంలో వాసుదేవ్(రాజీవ్ కనకాల), అతని భార్య కస్తూరి కాలేజీని నడుపుతూ అందులోనే డ్రగ్స్ దంగా చేస్తుంటారు. అక్కడ స్టూడెంట్స్కి విశ్వ(శివ కుమార్) ద్వారా డ్రగ్స్ అందించి.. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేస్తుంటారు. ఇలా విద్యార్థులను చెడగొడుతున్న కాలేజీ యాజమాన్యం, విశ్వపై పోరాటం చేస్తుంది అదే కాలేజీ లెక్చరర్ అరుంధతి(వితిక షేరు). ఆమెకు అదే కాలేజీ స్టూడెంట్స్ బద్రి(నటరాజ్), ఈషా(రాయంచ కొక్కురు)తోడుగా ఉంటారు. ఈ క్రమంలో బద్రి దారుణ హత్యకు గురవుతాడు. తన కొడుకు హత్య వెనుక ఎమ్మెల్యే బైర్రాజు ఉన్నాడని తెలిసి టీ కొట్టు అమ్ముకునే బద్రి తండ్రి ఈశ్వరయ్య(సుమన్) రాజకీయాల్లోకి వస్తాడు. విద్యార్థుల సపోర్ట్తో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బైర్రాజుపై పోటీకి దిగుతాడు. ధనబలం ఉన్న బైర్రాజుపై ఛాయ్వాలా ఈశ్వరయ్య గెలిచాడా లేదా? ఎన్నికల్లో గెలిచేందుకు బైర్రాజు వేసిన ఎత్తులను విద్యార్థులతో కలిసి ఈశ్వరయ్య ఎలా చిత్తు చేశాడు? బద్రి చావుకు కారణమైన వారిని ఎలా శిక్షించారు? ఈశ్వరయ్య గెలిచాక ధర్మస్థల నియోజకవర్గంలో వచ్చిన మార్పులు ఏంటి? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. పొలిటికల్ యాక్షన్ డ్రామాకి టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. సరైన పాయింట్ ఎంచుకొని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను నడిపితే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చ. దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట కూడా నేటి సమాజంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ని పాయింట్గా తీసుకొని దానికి పొలిటికల్ టచ్ ఇచ్చి ఓ మంచి కథను రాసుకున్నాడు. అయితే దాన్ని స్క్రీన్పై అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యాడు. క్రైమ్ డ్రామాకి పొలిటికల్ టచ్ ఇచ్చి గ్రిప్పింగ్గా కథను చెప్పిన విధానం బాగుంది. కానీ చాలావరకు కథనం ఊహకు అందేలా సాగుతుంది.ఫస్టాఫ్ అంతా కాలేజీ వాతావరణం, డ్రగ్స్ కు బానిసలుగా మారిన విద్యార్థుల జీవితాల చుట్టూ కథనం తిరుగుతుంది. డ్రగ్స్ కు బానిసైన విద్యార్థిని మరణం, అది చూసిన ఓ మహిళా లెక్చరర్, కొంత మంది విద్యార్థుల తిరుగుబాటు, ఆ వెంటనే హీరో దారుణ హత్యకు గురికావడంతో... ఇంటర్వెల్ ట్విస్ట్... సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది.సెకండాఫ్లో ఈశ్వరయ్య రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అప్పటి దాకా తనకు తిరుగే లేదని విర్రవీగిన బైర్రాజు... ఈశ్వరయ్య చేసే పొలిటికల్ కాంపెయిన్... తన కుమారుణ్ణి దారుణంగా చంపిన వాళ్లను మట్టుబెట్టడం, లెక్చరర్ అరుంధతి ఉగ్రరూపం అన్నీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటాయి. చివర్లో వరుణ్ సందేశ్ తో ఒక్క ఓటు విలువ ప్రాధాన్యం గురించి చెప్పిన తీరు... ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత విలువైనదో తెలియజేస్తుంది. అలాగే దుస్టుల సహవాసం ఎంత ప్రమాదకరమో వాసుదేవ్, కస్తూరిల పాత్రలతో చూపించారు. ఇలా పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది ధర్మస్థల నియోజకవర్గం.ఎవరెలా చేశారంటే..టీ అమ్ముకునే ఓ సామాన్య ఈశ్వరయ్య పాత్రలో సుమన్ చక్కగా నటించాడు.సెకండాఫ్లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఏడు సార్లు గెలిచి తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యే బైర్రాజు పాత్రలో సాయికుమార్ ఆకట్టుకుంటాడు. అయితే ఇలాంటి పాత్రలు ఆయన ఇప్పటికే చాలా పోషించడంతో కొత్తగా అనిపించదు. విలన్ పాత్రల్లో రాజీవ్ కనకాల, సీనియర్ నటి కస్తూరి మెప్పించారు. విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సత్య ప్రకాష్ కుమారుడు నటరాజ్ ఇందులో స్టూడెంట్ గా నటించి మెప్పించాడు.. అతనికి జోడిగా నటించిన రాయంచ కొక్కుర కూడా తన నటనతో ఆకట్టుకుంది. నటుడు శివకుమార్ కూడా తనకు బాగా సూట్ అయ్యే యంగ్ విలన్ పాత్రలో చక్కగా నటించాడు. సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, షఫీ, చివర్లో వరుణ్ సందేశ్, కాలకేయ ప్రభాకర్ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.సాంకేతిక విషయాలకొస్తే.. మహావీర్ ఏలేందర్ అందించిన సంగీతం బాగుంది. ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.సందర్భానుసారంగా రాసిన లిరిక్స్ ప్రేక్షకులను ఆలోచింప జేస్తాయి. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. ఫస్టాప్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ప్రముఖ నటుడు దునియా విజయ్కు విడాకులు
సీనియర్ కన్నడ నటుడు దునియా విజయ్, భార్య నాగరత్న విడిపోయారు. వారి విడాకుల కేసు కొన్నేళ్లు నుంచి కోర్టులో నడుస్తోంది. హైకోర్టు వారికి విడాకులను మంజూరు చేసింది. దునియా–నాగరత్నలు 1999లో పెళ్లి చేసుకోగా, గొడవలు వచ్చి 2013లో మొదటిసారిగా విడాకులకు కోర్టుకు వెళ్లారు. 2014లో రాజీ అయి కేసును విత్డ్రా చేసుకున్నారు. 2018లో తన భార్య వేధిస్తోందని విజయ్ మళ్లీ శాంతినగర ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరాడు. 2024 విచారణలో విజయ్ తన ఆరోపణలకు ఆధారాలను చూపలేకపోవడంతో అర్జీని కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు మెట్లెక్కాడు. ఇరుపక్షాల వాదనలను ఆలకించిన కోర్టు.. వారి దాంపత్య బంధానికి చట్ట ప్రకారం ముగింపు పలికింది. విజయ్ ఆనందం విడాకుల సంగతిని విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోర్టుకు శిరస్సు వంచి వందనం చేస్తున్నట్లు, తన వెంట ఉన్న అభిమానులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలని, కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు సంతోషం వ్యక్తంచేశాడు. కాగా, ఈ కేసు నడుస్తుండగానే విజయ్.. మోడల్, టెక్కీ అయిన కీర్తి పట్టాను 2010లో పెళ్లి చేసుకున్నాడు. భృతి వివరాలు.. విజయ్–నాగరత్నకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పిల్లల పోషణ, చదువుల ఖర్చును పూర్తిగా విజయ్ చూసుకోవాలని కోర్టు ఆదేశించింది. అలాగే 2 నెలల్లో రూ.2 కోట్ల భృతిని నాగరత్నకు అందజేయాలని సూచించింది. -
ప్రయాణం ఖరారు
అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూప శ్రీనివాస్, సునైనా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 18న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించారు మేకర్స్. ‘‘మహిళల భావోద్వేగాల ప్రధానంగా రూపొందిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది.పృధ్వీ, పాయల్ రాధాకృష్ణ -
అల్ల కల్లోలంగా అద్భుతంగా కుదిరింది: మణిశర్మ
సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గజ’. సతీష్ జై దర్శకత్వం వహించారు. చలంశెట్టి సునీల్ సమర్పణలో మైత్రి శరణ్ నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీస్ విడుదల చేయనుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘అల్లకల్లోలంగా...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించగా, రామ్ మిర్యాల పాడారు. ఈ పాట విడుదల వేడుకకి దర్శకుడు సాయి రాజేష్ అతిథిగా హాజరై, మాట్లాడుతూ–‘‘గజ’ టీజర్ బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి ’’ అన్నారు. సతీష్ జై మాట్లాడుతూ– ‘‘గజ’లో వాణిజ్య అంశాలతో పాటు మంచి సందేశం, భావోద్వేగాలు ఉంటాయి. క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు కంట తడి పెట్టుకుంటారు’’ అన్నారు. ‘‘సతీష్ ఈ సినిమాని ఎన్నో సవాళ్లని ఎదుర్కొని చేశాడు. ‘అల్ల కల్లోలంగా’ పాట అద్భుతంగా కుదిరింది’’ అని మణిశర్మ అన్నారు. ‘‘మణిశర్మగారి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందర్నీ ఆకట్టుకుంటాయి’’ అన్నారు మైత్రి శరణ్.


