breaking news
Tollywood
-
మీ ఫేవరేట్ హీరో ఎవరు?.. సిద్ధు జొన్నలగడ్డ ఏమన్నారంటే?
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా వస్తోన్న రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ తెలుసుకదా. ఇప్పటికే ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ నిర్మించారు.రిలీజ్కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో సిద్ధు సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు. ట్విట్టర్ వేదికగా ఆస్క్ సిద్దు పేరుతో చిట్ చాట్ నిర్వహించారు. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధనాలిచ్చారు సిద్ధు. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ గురించి సైతం పలువురు అడిగారు. అంతేకాకుండా మీ ఫెవరేట్ హీరో ఎవరని కూడా ప్రశ్నించారు. దీనికి సిద్ధు తన నచ్చిన హీరో రణ్బీర్ కపూర్ అంటూ ఆన్సరిచ్చారు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ త్వరలోనే జరగనుందని రిప్లై ఇచ్చాడు. Ranbir kapoor ! Fan boy moment Yet to happen— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) October 16, 2025 -
‘కె-ర్యాంప్’ టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్..
తన సినిమాలను ప్రేక్షకులకు రీచ్ చేసేందుకు సాధ్యమైనంత కొత్తగా ప్రయత్నిస్తుంటారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తన లేటెస్ట్ మూవీ కె-ర్యాంప్పై కూడా ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో తన సినిమా ‘ఎస్ఆర్ కల్యాణమండపం’కు డీజే మిక్స్ చేసి ఆ కంటెంట్ ను వైరల్ చేశారు. ఇప్పుడు ‘K-ర్యాంప్’ టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్ చేసి యూత్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ డీజే మిక్స్ "K-ర్యాంప్" మీద ఒక వైబ్ క్రియేట్ చేస్తోంది. టీజర్, ట్రైలర్ లో పేలిన డైలాగ్స్ అన్నీ ఈ డీజే మిక్స్ లో యాడ్ చేయడం కొత్త ఫీల్ కలిగిస్తోంది.జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. -
పేరు పెట్టకుండా బండ్ల గణేశ్ ట్వీట్.. ఆయన మీదేనా?
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh)కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన ఏ ట్వీట్ చేసినా.. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపైన తనదైన శైలీలో స్పందిస్తుంటారు. కొన్ని విషయాలపై డైరెక్ట్గా, మరికొన్ని విషయాలపై పరోక్షంగా ఆయన కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది. గురువారం మధ్యాహ్నం ఆయన తన ఎక్స్ ఖాతాలో “అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……! అంటూ రాసుకొచ్చాడు. పేరునూ ప్రస్తావించకుండా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉంటాయా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఆ నిర్మాతకు కౌంటర్గానేనా?ఇటీవల టాలీవుడ్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ ముందు కొంతమంది దర్శకనిర్మాతలు, హీరోలు ఇచ్చే స్టేట్మెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా మిత్రమండలి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నివాసు(Bunny Vasu) చాలా ఎమోషనల్గా మాట్లాడారు. తమ సినిమాను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తొక్కేయాలని చూస్తున్నారని.. కానీ జనాలు సినిమా బాగుంటేనే చూస్తారని, లేకపోతే చూడరని... డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది నడవదని అన్నారు. అంతటితో ఆగకుండా..తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకోవద్దని.. నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ రోజు సినిమా రిలీజై మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. ఇదే రోజు బండ్ల గణేశ్ పైవిధంగా ట్వీట్ చేయడంతో .. బన్నీవాసుకి కౌంటర్గానే ఇలా పోస్ట్ పెట్టాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆయన పోస్ట్ కింద చాలామంది ఇది బన్నీవాసు గురించే అని కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని, ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు అన్నారని తెలియదు కానీ.. బన్నీవాసు పేరు అయితే బాగా ట్రోల్ అవుతుంది.“అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……!— BANDLA GANESH. (@ganeshbandla) October 16, 2025 -
హోటల్ లీజు వివాదం.. వెంకటేశ్, రానాకు కోర్టు షాక్!
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోలు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబు కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. కాగా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో వెంకటేశ్, రానా, అభిరామ్తోపాటు నిర్మాత దగ్గుబాటి సురేశ్పై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.అసలు ఈ కేసు వివాదం ఏంటి..?డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్లోని వెంకటేష్కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు ఈ ఏడాది జనవరిలో గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. -
దెబ్బలు తగిలించుకున్న రమ్య.. ఆ ముగ్గురిలో ఒకరే కెప్టెన్!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కల్యాణ్ కెప్టెన్సీ ముగియనుంది. మరో కెప్టెన్ను ఎంచుకునేందుకు సమయం ఆసన్నమైంది. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్లను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్బాస్. కాకపోతే ఆ కండెండర్షిప్ను కాపాడుకునే బాధ్యత మీదే అని ఓ మెలిక పెట్టాడు. వైల్డ్ కార్డులు ఎంచుకున్న హౌస్మేట్స్తో తలపడి గెలిచి కంటెండర్షిప్ కాపాడుకోవాలన్నాడు.కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ముగ్గురుగార్డెన్ ఏరియాలో బాల్తో గోల్ చేయమని గేమ్ పెట్టాడు. ఇందులో అందరూ పోటాపోటీగా ఆడారు. ఒకరినొకరు తోసుకునే క్రమంలో కిందామీదా పడ్డారు. భరణిని అదుపు చేసే క్రమంలో రమ్య కిందపడిపోయింది. ఈ సమయంలో తన తలకు చిన్న దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వయొలెన్స్ వద్దని వైల్డ్ కార్డ్స్ అంటుంటే.. స్టార్ట్ చేసిందే మీ వాళ్లు అని మండిపడింది తనూజ. ఈ గేమ్స్ తర్వాత ఫైనల్గా సుమన్, గౌరవ్ (Gaurav Gupta) కెప్టెన్సీ కంటెండర్లయ్యారని తెలుస్తోంది. హౌస్లో అడుగుపెట్టినప్పుడు నాగార్జున.. నిఖిల్కు ఇచ్చిన పవర్ ద్వారా అతడు కూడా కెప్టెన్సీ కంటెండరయ్యాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! చదవండి: బిగ్బాస్ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్.. -
ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు
ఆసియా కప్ హీరో తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. ప్రస్తుతం మనశంకరవరప్రసాద్గారు మూవీలో నటిస్తోన్న చిరు.. ఈ టీమిండియా క్రికెటర్ను సత్కరించారు. ఈ సందర్భంగా మూవీ సెట్లో కేక్ కట్ చేసిన తిలక్ వర్మకు.. ఆసియా కప్ ఫైనల్ నాటి ఫోటోను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో నయనతార, అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు.కాగా..ఇటీవల దుబాయ్లో పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ విజయం కీలకమైన సమయంలో రాణించాడు. దీంతో తిలక్ వర్మపై పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మీసాల పిల్ల అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Megastar #Chiranjeevi Garu met young cricket sensation #TilakVarma on the sets of #ManaShankaraVaraPrasadGaru and felicitated him for his stellar contribution to India’s glorious win against Pakistan. 🏏💫A proud moment as the Megastar appreciated the Hyderabad boy’s talent,… pic.twitter.com/9HVOg2ZRy4— Team Megastar (@MegaStaroffl) October 16, 2025 -
కాంతార చాప్టర్-1 తగ్గేదేలే.. పుష్ప, సలార్ రికార్డ్స్ బ్రేక్!
కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార: చాప్టర్ 1 రెండు వారాలు దాటినా ఏ మాత్రం కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే రూ.650 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-10లో నిలిచింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ చిత్రాలను అధిగమించింది. కేవలం హిందీలోనే రూ.155.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్తో ప్రభంజనం సృష్టించిన కాంతార మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్(రూ. 152.65 కోట్లు), సాహో(రూ. 145.67 కోట్లు, బాహుబలి-ది బిగినింగ్' (రూ. 118.5 కోట్లు), పుష్ప: ది రైజ్ - పార్ట్ I(రూ. 106.35 కోట్లు) చిత్రాలను దాటేసింది. ఈ జాబితాలో పుష్ప-2 రూ. 812.14 కోట్ల వసూళ్లతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బాహుబలి-2(రూ. 511 కోట్లు), కేజీఎఫ్ -2 రూ. 435.33 కోట్లు, కల్కి 2898 ఏడీ రూ. 293.13 కోట్లతో ఉన్నాయి. ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఎనిమిదో ప్లేస్లో నిలిచింది. దీపావళి సెలవులు రావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.కాకగా.. ఈ సినిమాను 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు,హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు..పుష్ప -2: రూ. 812.14 కోట్లుబాహుబలి- 2: రూ. 511 కోట్లుకెజిఎఫ్- 2: రూ. 435.33 కోట్లుకల్కి 2898 ఏడీ: రూ. 293.13 కోట్లుఆర్ఆర్ఆర్ : రూ. 272.78 కోట్లురోబో2: రూ 188.23 కోట్లుమహావతార్ నరసింహ: రూ. 188.15 కోట్లుకాంతార చాప్టర్-1: రూ. 155.5 కోట్లుసలార్ - పార్ట్ I: రూ. 152.65 కోట్లుసాహో : రూ. 145.67 కోట్లు -
‘కాంతార చాప్టర్ 1’ దీపావళి బ్లాస్ట్.. కొత్త ట్రైలర్ అదిరింది!
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 680 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికీ అత్యధిక థియేటర్స్లో రన్ అవుతున్న ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్(Kantara Chapter 1 Deepavali Trailer)ని రిలీజ్ చేశారు మేకర్స్. దీపావళి కానుకగా నేడు(గురువారం) విడుదలైన ఈ కొత్త ట్రైలర్ సినిమాలోని కీలక సన్నివేశాలన్నింటిని చూపించారు. యాక్షన్ సీన్లను హైలెట్ చేస్తూ ఈ ట్రైలర్ని కట్ చేశారు. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించి ఈ చిత్రంలో యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషించాడు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. -
కొచ్చాడియాన్ కేసులో లతా రజనీకాంత్ పిటిషన్ కొట్టివేత
తమిళ స్టార్ హీరో రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు ఉన్న విషయం తెలిసిందే. 2015లో తమ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ టైంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం తిరిగి ఇవ్వకపోవడంతో లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదైంది. ఆమె ష్యూరిటీ సంతకం పెట్టడం వల్లే ఈ చిక్కులు వచ్చాయని సమాచారం. అయితే, ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. కానీ, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ బెంగళూరు కోర్టులో లత పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది.2014లో విడుదలైన 'కొచ్చాడియాన్' చిత్రానికి సంబంధించిన ఫోర్జరీ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ లత రజనీకాంత్ చేసిన దరఖాస్తును బెంగళూరు కోర్టు కొట్టివేసింది. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొంది. అయితే, 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిందితులపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె దరఖాస్తును కొట్టివేశారు.2015లో, చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో లత నకిలీ పత్రాలను ఉపయోగించి కోర్టును కూడా మోసం చేశారని ఒకరు పిటిషన్ వేశారు. తప్పుడు పత్రాలతో ఆమె మీడియా గ్యాగ్ ఆర్డర్ పొందారని పిటిషన్ దాఖలైంది. ఈ ఆర్డర్తో ఆమెపై వచ్చిన పలు మీడియా కథనాలు తొలగించారని అందులో పేర్కొన్నారు. కొచ్చాడియాన్తో సంబంధం ఉన్న ఆర్థిక వివాదాలకు సంబంధించిన దాదాపు 70 మీడియా సంస్థలకు చెందిన వార్తలు తొలగించారని తెలిపారు. -
కొత్తింట్లోకి యాంకర్ లాస్య.. ఘనంగా గృహప్రవేశం
ప్రముఖ తెలుగు యాంకర్ లాస్య (Anchor Lasya Manjunath) కొత్తింట్లో అడుగుపెట్టింది. భర్త మంజునాథ్తో కలిసి బుధవారం గృహప్రవేశం చేసింది. ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది. బంధుమిత్రులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. వారిలో నయని పావని, బంచిక్ బబ్లూ, గీతూ రాయల్, దేత్తడి హారిక, నోయెల్.. తదితరులు ఉన్నారు. లాస్య గృహప్రవేశానికి వెళ్లిన వారు ఆమె ఇల్లు చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.కుళ్లుకుంటావ్..లాస్య ఫ్రెండ్ నోయెల్ (Noel Sean) అయితే ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'నా ఇల్లు చూసి నువ్వు కచ్చితంగా కుళ్లుకుంటావు' అని లాస్య నాతో అంది. నిజంగానే ఇల్లు చూశాక నేను జెలసీగా ఫీలయ్యాను. ఇల్లు అంత బాగుంది. ఆ దేవుడు మీ జంటను ఎప్పుడూ ఇలాగే ఆశీర్వదించాలి అంటూ లాస్యతో దిగిన ఫోటోలు షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు లాస్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.బిగ్బాస్ నుంచి ఫ్రెండ్స్బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్గా ఓ వెలుగు వెలిగింది లాస్య. మంజునాథ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె వైవాహిక జీవితంలో అడుగుపెట్టాక కెరీర్కు గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది. తెలుగు బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. ఆ సమయంలోనే లాస్య, దేత్తడి హారిక, నోయెల్ సేన్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇకపోతే పేరెంట్స్ కోసం గతంలో ఇల్లు కట్టించిన లాస్య.. నాలుగు నెలల కిందట తండ్రికి మంచి కారును బహుమతిగా ఇచ్చింది. View this post on Instagram A post shared by Noel Sean (@mr.noelsean) చదవండి: శ్రియాతో లవ్ సీన్.. ఇబ్బందిపడ్డ రామ్చరణ్.. వీడియో చూశారా? -
బిగ్బాస్ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్.. ప్రేమికుడు చేసిన సంచలన ఆరోపణ
బిగ్బాస్ 9 తెలుగులో వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చిన ఆయేషా దుమ్మురేపుతుంది. కేరళకు చెందిన ఆమె అసలు పేరు ఆయేషా జీనత్.. అయితే, కోలీవుడ్లోనే ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. 2019లో ఆమె నటించిన సత్య సీరియల్ తమిళ్లో పాపులర్ అయింది. దీంతో ఏకంగా సత్య-2 కూడా రన్ చేశారు. అలా తమిళ్ బిగ్బాస్-6లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ సుమారు 60రోజుల పాటు కొనసాగింది. తెలుగులో స్టార్మా సీరియల్స్ సావిత్రమ్మ గారి అబ్బాయి, ఊర్వశివో రాక్షసివో వంటి ప్రాజెక్ట్లతో మెప్పించింది. ఇప్పుడు తెలుగు బిగ్బాస్లో కూడా తన స్టైల్లోనే పవర్ఫుల్గా టాలెంట్ చూపుతుంది.రెండుసార్లు నిశ్చితార్థంఆయేషా రెండుసార్లు నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ వివాహ జీవితంలో అడుగుపెట్టలేదు. మొదట హరన్ రెడ్డిని ప్రేమించింది. అతను ఫ్యాషన్ ఫోటోగ్రాపర్గా సినిమా పరిశ్రమలోనే కొనసాగాడు. కొన్ని ప్రాజెక్ట్లకు వారిద్దరూ కలిసి కూడా పనిచేశారు. అయితే, అతను తనను ప్రేమిస్తూనే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న ఆయేషా బ్రేకప్ చెప్పింది. ఇదే విషయాన్ని తమిళ్ బిగ్బాస్లో ఉన్నప్పుడు ఆమె పంచుకుంది. అయితే, 2023లో యోగేష్ (యోగి)తో డేటింగ్లో ఉన్నట్లు తెలిపింది. కానీ, ఎంగేజ్మెంట్తోనే అతనికి కూడా ఆమె గుడ్బై చెప్పేసింది. నిజాయితీ లేని ప్రేమ తనకు అవసరం లేదని ఆమె పలుమార్లు చెప్పుతూ వచ్చింది. కెరీర్ మీద మాత్రమే తన ఫోకస్ ఉంటుందని, ఈ ప్రేమలు తనకు పడవని ఒక క్లారిటీ వచ్చినట్లు పలు ఇంటర్వ్యూలో తెలిపింది.మోసం చేసిందని ఆయేషాపై కామెంట్ చేసిన మొదటి ప్రేమికుడుఆయేషా హీరోయిన్గా మూడు సినిమాల్లో కూడా నటించింది. తమిళ్ బిగ్బాస్లో చాలా వివాదాస్పద కంటెస్టెంట్గా ఆమె నిలిచింది. తోటి కంటెస్టెంట్స్ను ఆవేశంతో దూషించడం వల్ల తను చెడ్డపేరు మూటకట్టుంది. దీంతో హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో వారికి క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. ఒకసారి హౌస్ట్గా ఉన్న కమల్ హాసన్నే ఎదిరించి వైరల్ అయింది. అయితే, ఆమె తమిళ్ బిగ్బాస్లో ఉన్నప్పుడు ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆయేషాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందని కామెంట్ చేశాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి తనను అవమానించడమే కాకుండా.. కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని మరో ఇద్దరితో ఆమె ప్రేమాయణం నడిపిందని చెప్పాడు. అయితే, అతను చేసిన ఆరోపణల గురించి ఆయేషా మాత్రం ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఫైనల్గా ఆయేషా జీవితంలో మూడు ప్రేమకథలు బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. -
శ్రియాతో లవ్ సీన్.. ఇబ్బందిపడ్డ రామ్చరణ్.. వీడియో చూశారా?
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్చరణ్ చిరుత (2007) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్ శ్రియ 2001లో వచ్చిన ఇష్టం చిత్రంతో సినిమాల్లో ప్రవేశించింది. అంటే చరణ్ కంటే శ్రియ సీనియర్. వీరిద్దరూ జంటగా ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్లో చరణ్ తల్లిగా కనిపించింది.తొలిసారి కెమెరా ముందు రామ్చరణ్దానికంటే ముందు కూడా వీరు కలిసి యాక్ట్ చేశారు. అదెప్పుడంటారా? ఓ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఓ సీన్ ప్రాక్టీస్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సదరు ఇన్స్టిట్యూట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా యాక్టింగ్ కోచ్ కిశోర్ నమిత్ కపూర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ (Ram Charan), శ్రియా శరణ్లపై ఓ సీన్ చిత్రీకరించాం. చరణ్ కెమెరా ముందుకు రావడం ఇదే మొదటిసారి.ఇబ్బందిపడ్డ చరణ్చెప్పాలంటే అది ఒక వరంలాంటిది. ఫస్ట్ టైం కావడంతో చరణ్ చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు. శ్రియా (Shriya Saran) అప్పటికే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయిపోయింది. చాలా సినిమాలు చేసింది. కానీ శిక్షణ తీసుకుంటే మరింత రాటుదేలుతుందని నా అభిప్రాయం. కోచ్గా తనకెప్పుడూ పాజిటివ్ ఫీడ్బ్యాకే ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ క్లిప్ వైరల్గా మారింది. అందులో చరణ్ కాస్త పొడవుగా పెంచిన జుట్టు, గడ్డం, కళ్లజోడుతో కనిపించాడు. కెమెరా వంక చూసేందుకు సిగ్గుపడ్డాడు. డైలాగులు చెప్పేందుకు తనలో తానే ఘర్షణకు లోనయ్యాడు.అప్పటికీ, ఇప్పటికీ అంతే అందం!అప్పటికే శ్రియ దక్షిణాదిలో పాపులర్ హీరోయిన్ కావడంతో ఏమాత్రం బెరుకు లేకుండా యాక్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. చరణ్ ఇలా ఉన్నాడేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడెలా ఉన్నాడు? ఇప్పుడే రేంజ్కు ఎదిగిపోయాడు అని కొందరు అబ్బురపడుతున్నారు. శ్రియ.. అప్పటికీ, ఇప్పటికీ అంతే అందంగా ఉందని ప్రశంసిస్తున్నారు. శ్రియ చివరగా మిరాయ్ సినిమాలో నటించింది. రామ్చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ మూవీ చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Kishore Namit Kapoor (@knk_worldwide_actinginstitute) View this post on Instagram A post shared by Kishore Namit Kapoor (@knk_worldwide_actinginstitute) చదవండి: స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో -
‘మిత్రమండలి’ మూవీ రివ్యూ
టైటిల్ : మిత్రమండలినటీనటులు: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ తదితరులునిర్మాణ సంస్థ: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: కల్యాన్ మంతిన, భాను ప్రతాప,డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగలదర్శకుడు: విజయేందర్సంగీతం : ఆర్. ఆర్ ధ్రువన్సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ ఎస్జెవిడుదల తేది: అక్టోబర్ 16, 2025మిత్రమండలి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ‘జాతిరత్నాలు’తో పోల్చారు. ఓ జాతిరత్నం ప్రియదర్శి ఇందులో హీరోగా నటించడం.. స్టార్ కమెడియన్స్ అంతా ఇతర పాత్రల్లో కనిపించడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు అయితే పెరిగాయి. ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో బన్నీ వాసు చేసిన కామెంట్స్.. ‘ఈ సినిమా నచ్చకపోతే నా తర్వాత సినిమా చూడకండి’అంటూ నాని రేంజ్లో ప్రియదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ ‘మిత్రమండలి’పై హైప్ని క్రియేట్ చేశాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం(Mithra Mandali Movie Review).కథేంటంటే...జంగ్లీపట్నానికి చెందిన నారాయణ(వీటీవీ గణేష్)కి కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకంటే.. వారిని చంపేసే రకం. తుట్టె కులం అండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక ఎన్ఎమ్) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్)ని కలుస్తాడు. లంచం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్(సత్య) ద్వారా స్వేచ్ఛ పారిపోవడం వెనక అదే ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓయి), రాజీవ్ (ప్రసాద్ బెహరా) ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నలుగురు ఆవారాగాళ్లు. రోజంతా బాతకాలు కొట్టడం.. సాయంత్రం మందేసి చిందులు వేయడమే వీరి పని. ఇలాంటి చిల్లర గాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వేచ్ఛ పారిపోవడం వెనున ఉన్న అసలు కారణం ఏంటి? స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా(Mithra Mandali Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..కామెడీ చిత్రాలకు కథతో సంబంధం లేదు. నవ్వులు పూయించే సన్నివేశాలు ఉంటే చాలు, ఆ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇక కథతో కూడిన కామెడీ ఉంటే.. ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుంటారు. జంద్యాల, ఈవీవీ చిత్రాలే ఇందుకు నిదర్శనం. కథలో కొత్తదనం లేకున్నా.. కామెడీ పండించినా..ఆ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికి ఉదాహారణ ‘జాతిరత్నాలు’. ఈ రెండూ లేని కామెడీ చిత్రం ‘మిత్ర మండలి’. చెప్పుకోవడానికి పెద్ద కథ లేదు.. నవ్వుకోవడానికి కామెడీ సన్నివేశాలు లేవు. కానీ ‘స్టార్’ కమెడియన్స్ అంతా ఈ చిత్రంలో ఉన్నారు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు చూసుకున్న ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. కామెడీ చిత్రం కదా ఆ కొత్తదనం ఆశించడం తప్పే అవుతుంది. కానీ కామెడీ అనుకొని రాసుకున్న సన్నివేశాలు అయినా నవ్వులు పూయించే విధంగా ఉండాలి కదా? అది లేదు. ఒక ఫిక్షనల్ సిటీ.. కులపిచ్చి గల రాజకీయ నేత.. ఇంట్లో అమ్మాయి పారిపోవడం.. దాని వెనుక నలుగురు కుర్రాళ్లు ఉండడం.. ఈ సింపుల్ కథతో కావాల్సినంత కామెడీ పుట్టించొచ్చు. దర్శకుడు పేపర్పై రాసుకున్నప్పుడు కూడా ఇలాగే ఊహించొచ్చు. కానీ ఆయన ఊహకి తెర రూపం ఇవ్వడంలో మాత్రం విఫలం అయ్యాడు. కామెడీ అనుకొని రాసుకున్న సన్నివేశాలేవి నవ్వించలేకపోయాయి. ప్రధాన పాత్రలు చెప్పే డైలాగ్స్.. వారి ప్రవర్తన..ప్రతీదీ అతిగానే అనిపిస్తుంది. కులపిచ్చి ఉన్న నారాయణ ఎమ్మెల్యే టికెట్ కోసం చేసే ప్రయత్నం.. కూతురు పారిపోవడం.. నలుగురు మిత్రుల గ్యాంగ్ చేసే అల్లరి సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ సత్య చేసే కామెడీ ఒకటే కాస్త నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త బెటర్. ఛేజింగ్ సీన్, పెళ్లి సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా మిత్రమండలి చేసే కామెడీ కాస్త నవ్వులు పూయిస్తే.. చాలా చోట్ల అతిగానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి, రాగ్ మయూరి, విష్ణు, సత్య, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్..వీళ్ల కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో కామెడీ పండించగలరు. కానీ ఈ చిత్రంలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయారు. దానికి కారణం దర్శకుడు అనే చెప్పాలి. వీరి కామెడీ టైమింగ్ని వాడుకోవడంలో ఆయన విఫలం అయ్యాడు. ఉన్నంతలో సత్య ఒక్కడే కాస్త నవ్వించాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ ఆయన చేసే కామెడీ వర్కౌట్ అయింది. మిగతా పాత్రలన్నీ అతి చేసినట్లుగానే అనిపిస్తుంది. స్వేచ్ఛగా నిహారిక తన పరిధిమేర నటించింది. సాంకేతికంగా సినిమా ఓకే. ఆర్. ఆర్ ధ్రువన్ నేపథ్య సంగీతం పర్వాలేదు. నిబ్బా నిబ్బి సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
తెలుగు హీరోయిన్ మిస్సింగ్.. అసలు స్టోరీ ఇదే
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో మెప్పించిన వాసంతిక మిస్సింగ్ అంటూ రెండురోజులుగా సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. చాలామందికి అసలు విషయం ఏంటి అనేది తెలియలేదు. ఒక హాస్టల్ నుంచి వెళ్తున్న సీసీటీవి ఫుటేజ్ కూడా విడుదల చేయడంతో చాలామంది నిజమేనని అనుకున్నారు. అయితే, అసలు విషయం తను నటిస్తున్న కొత్త సినిమా గురించి. ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ వాసంతిక ఇచ్చింది. ఇప్పటికే 90's - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ చిత్రంలో దివ్య అనే పాత్రతో మెప్పించన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.డైరెక్ట్గా ఓటీటీలో విడుదలD/o ప్రసాద్రావు కనబడుటలేదు అనే సినిమాలో వాసంతిక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ టైటిల్ను చూస్తే అర్థం అయింది కదా. ఒక యువతి మిస్సింగ్ స్టోరీతో మూవీని తెరెక్కించారు. అందుకే సినిమా ప్రమోషన్ కోసం ఇలా హీరోయిన్ మిస్సింగ్ అంటూ ఒక వీడియోను వైరల్ చేశారు. ఈ చిత్రం డైరెక్ట్గా జీ5లో విడుదల కానుంది. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇందులో ఉధయబాను, రాజీవ్ కనకాల కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు.నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా వాసంతిక మెప్పించింది. సలార్లో కూడా ఆమె నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె కీలక పాత్రలో నటించిన సినిమా ఓటీటీలో విడుదల కానుంది. Swathi is missing.Family is in panic, the world is spinning.What next?Start tuned to know what happened to Swathi, D/o Prasadrao#SriRamVenkat #SouthIndianScrenss #ZEE5 #DaughterOfPrasadRaoKanabadutaledhu #ZEE5Telugu #RaajeevKanakala #UdayaBhanu #VasanthikaMacha pic.twitter.com/ZlpUnZWTrb— ZEE5 Telugu (@ZEE5Telugu) October 15, 2025 -
స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో!
'లవ్టుడే', 'డ్రాగన్' సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇతడు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ప్రేమలు బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 17న రిలీజవుతోంది. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్ 15న) స్వాగ్ ఈవెంట్ నిర్వహించారు.హీరోయిన్ జుట్టు పట్టుకుని లాగి..ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. డ్యూడ్ చిత్రంలో హీరోను బుగ్గగిల్లి క్యూట్గా ఫీలవుతుంది మమిత. ఈ సీన్ను స్టేజీపై రివర్స్ రోల్స్లో చేశారు. మమిత బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకుని లాగి, కొడుతున్నట్లుగా సీన్లో లీనమైపోయాడు ప్రదీప్. ఇది క్యూట్గా లేదు అని మమిత డైలాగ్ చెప్పింది. వీళ్ల యాక్టింగ్ చూసేవారి ఫీలింగ్ కూడా అదే! అదే విషయాన్ని యాంకర్ బయటకు చెప్పేసింది. ఇది నిజంగానే క్యూట్గా లేదమ్మా.. ఇంత వైలెంట్గా ఉన్నారేంటి? అని నవ్వేసింది. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే వేడుకలో మమిత ఎంతో గ్రేస్తో డ్యాన్స్ చేసింది. చదవండి: యూత్కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ! -
యూత్కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ!
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada Movie). రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ నేటి యువతరానికి ముఖ్యమైన సందేశం ఇచ్చాడు. మరీ ముఖ్యంగా అబ్బాయిలకు లవ్బ్రేకప్ అయినప్పుడు ఏం చేయాలో సలహా ఇచ్చాడు.ఆడవారి కోసం యుద్ధాలుసిద్ధు ఏమన్నాడంటే.. ఈ సృష్టి మొదలైందే ఆడవారితో! మీకోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెప్తోంది. మీ ముందు మేము నిమిత్తమాత్రులం! మేము ఎప్పుడైనా తెలియక ఏవైనా తప్పులు చేస్తే పెద్దమనసుతో క్షమించేయాలి. మీరు గొప్ప.. మీవల్ల మేము గొప్ప. ఇప్పుడు అబ్బాయిలకు సీరియస్గా ఓ విషయం చెప్తున్నా.. ఎప్పుడైనా ఒకమ్మాయి మీ మనసు ముక్కలు చేసి వెళ్లిపోయిందంటే.. తనను వెళ్లిపోనివ్వండి. లేదని వెంటపడ్డారనుకోండి. మీ ఆత్మగౌరవాన్ని మీరు కోల్పోయినట్లే లెక్క! ఎంత వెంటపడితే అంత మర్యాద కోల్పోతారు.ఏం పర్లేదు, ఏడ్వండి..ఆత్మగౌరవం ముఖ్యమని గుర్తుంచుకోండి. అమ్మాయి దూరమైతే బాధేస్తుంది. హృదయం ముక్కలవుతుంది, ఎందుకిలా అయిందని ఏడుస్తాం.. ఏం పర్లేదు బాధపడండి. కానీ, అప్పుడే వరుణ్ (తెలుసు కదాలో హీరో పాత్ర)లాంటివాడు మీలో నుంచి బయటకు వస్తాడు. మన ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండాలి. మీకింకా డౌట్స్ ఉంటే తెలుసు కదా సినిమా చూడండి. వరుణ్ అన్నింటికీ ఆన్సర్ ఇస్తాడు అని సిద్ధు చెప్పుకొచ్చాడు.చదవండి: బిగ్బాస్లో మాధురి కొత్త రూల్స్.. నచ్చకపోతే వెళ్లిపోమని వార్నింగ్! -
బిగ్బాస్లో మాధురి కొత్త రూల్స్.. నచ్చకపోతే వెళ్లిపోమని వార్నింగ్!
(Bigg Boss Telugu 9) వైల్డ్కార్డులు తమ ప్రతాపం చూపించాలనుకుంటున్నారో, ఏమో కానీ గొడవలు పడుతూనే ఉన్నారు. మాధురి తగ్గేదేలే అన్న లెవల్లో కొట్లాటకు సిద్ధం అవుతుంటే ఆయేషా కావాలని కొందరిని టార్గెట్ చేసి మరీ తిడుతోంది. మరి నిన్నటి (అక్టోబర్ 15వ) ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం...ప్రాంక్ పేరుతో..సంజనాతో కలిసి ప్రాంక్ గొడవ ప్లాన్ చేసింది మాధురి (Divvala Madhuri). ప్రాంక్ పేరుతో మనసులో ఉన్న కోపం, అక్కసునంతా సంజనాపై కక్కేసింది. ఆమె తిట్ల దండకానికి జడుసుకున్న సంజనా.. వెంటనే కట్ చెప్పేసి ఇదంతా ఊరికనే చేశామని చెప్పి ఊపిరి పీల్చుకుంది. మాధురి.. దివ్యను టార్గెట్ చేసిందో ఏంటోకానీ, మరోసారి ఆమెతో గొడవపడింది. దివ్య సాధారణంగా మాట్లాడుతుంటే కూడా నువ్వెంత? అని చీప్గా తీసిపడేసే ప్రయత్నం చేసింది. రూల్స్ పాటించనని, తనకు నచ్చినట్లుగానే ఉంటానని, అది నచ్చకపోతే హౌస్ నుంచి వెళ్లిపోమని దివ్యకు ఆర్డర్ వేసింది. లైవ్లో హౌస్మేట్స్ అందరికీ ఇంకా చాలానే ఆంక్షలు పెట్టింది.నా రూల్స్ నచ్చకపోతే వెళ్లిపోరాత్రి ఇకఇకలు పకపకలు ఉండొద్దని, లైట్స్ ఆఫ్ అయ్యాక అంతా సైలెంట్గా ఉండాలంది. మీ అల్లరి వల్ల తన నిద్ర చెడిపోతే క్షమించను అని వార్నింగ్ ఇచ్చింది. పొద్దున పాట వచ్చేవరకు మాట్లాడొద్దని కండీషన్ పెట్టింది. అంతగా మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాకి వెళ్లి సైలెంట్గా మాట్లాడుకోమంది. ఈ రూల్స్కు రీతూ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన మాట వినేందుకు ఇక్కడికి రాలేదు. బిగ్బాస్ రూల్స్ మాత్రమే పాటిస్తా అని కరాఖండిగా చెప్పింది. నా రూల్స్ నచ్చకపోతే బిగ్బాస్ హౌస్ నుంచి వెళ్లిపోమనగా.. నేనెందుకు వెళ్తా.. కావాలంటే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది రీతూ. మాధురి రూల్స్ పెడుతుంటే కెప్టెన్ ఏం చేస్తున్నాడో మరి!ఓవరాక్షన్ ఆపవే..కిచెన్లో గిన్నెలు తోమే దగ్గర ఆయేషా, రీతూకి పంచాయితీ అయింది. రాత్రి గిన్నె కడగనని ఆయేషా.. అది అర్ధరాత్రి సింక్లో వేశారని రీతూ గొడవపడ్డారు. నీ పని నువ్వు చేయకపోతేనే కదా అడుగుతున్నాను.. ఫస్ట్ కరెక్ట్గా ఉండు.. అని కోప్పడింది ఆయేషా. నువ్వు కూడా ఉండని రీతూ అనగా.. నువ్వు ఊరుకోవే.. ఏం పని చేయవు, అడిగితే న్యన్యన్య అంటావ్ అని ఆయేషా వెక్కిరించింది. మధ్యలో మాధురి కూడా దూరిపోయి రీతూపై రెచ్చిపోయింది. ఏయ్.. నీకో స్టాండ్ లేదా? అబద్ధాలు ఆడుతున్నావ్ అంటూ మండిపడింది. రీతూ కూడా తగ్గకుండా ఆమెకు కౌంటర్లిచ్చింది. ఇక గిన్నెలు తోముతున్న ఆయేషా.. ఆపవే ఓవరాక్షన్.. మాటలు ఆపేయ్ ఫస్ట్.. అంటూ రీతూను వాయించేసింది.పెద్ద లిస్ట్ చదివిన పచ్చళ్ల రమ్యమరోవైపు పచ్చళ్లపాప రమ్య మోక్ష తన సూపర్ పవర్ ఉపయోగించేసింది. ఈరోజు కోసం నిన్న ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ అంటే ఏదో బిర్యానీ, ఐస్క్రీమ్ అంతేగా అనుకునేరు.. కాదుకాదు! టిఫిన్లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ.. లంచ్లోకి ఎగ్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, వెజ్ టిక్కా పిజ్జా.. సాయంత్రం బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు, మిక్చర్, ఫ్యామిలీ ప్యాక్ ఐస్క్రీమ్, చాక్లెట్స్.. డిన్నర్కు చికెన్, వెజ్ పికిల్స్, నాన్వెజ్ పికిల్స్.. ఇలా పేద్ద లిస్ట్ చదువుకుంటూ పోయింది. ఈ ఫుడ్ను హౌస్మేట్స్ అందరూ ఆస్వాదించేందుకు వీల్లేదు. కేవలం రమ్య.. ఆమె సెలక్ట్ చేసిన సుమన్ మాత్రమే కలిసి షేర్ చేసుకోవాలి.చదవండి: దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. -
ఆలియా భట్ ఇంటికి ప్రత్యేకమైన గణేశుడు.. 17న పూజలు
ప్రముఖ బాలీవుడ్ స్టార్ జంట రణ్ బీర్ కపూర్, ఆలియా భట్(Alia Bhatt) కోసం మైసూరు శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) ఒక గణపతి మూర్తిని రూపొందించారు. ముంబైలోని రణ్బీర్(Ranbir Kapoor) దంపతులు కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే తమ ఇంటికి గణపతి విగ్రహం కావాలని యోగిరాజ్కు వారు గతంలోనే ఆర్డర్ ఇచ్చారు. అయోధ్య శ్రీరామ మూర్తిని యోగిరాజే రూపొందించడం తెలిసిందే. అప్పటి నుంచి యోగిరాజ్ పేరు ప్రతిష్టలు దేశ్యాప్తంగా వ్యాపించాయి. గత ఆరు నెలల నుంచి కష్టపడి నల్ల ఏకశిలతో ఆకర్షణీయమైన గణపతి విగ్రహాన్ని యోగిరాజ్ తీర్చిదిద్దారు. నాలుగు అడుగుల ఎత్తుతో ఈ విగ్రహం ఉంది. ఈనెల 17న ఆలియా దంపతులు ఇంటిలో ప్రతిష్టించి పూజలు చేయనున్నారు. విగ్రహం ధర ఎంత అన్నది మాత్రం గుట్టుగా ఉంచారు.కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాల రాముడి (శ్రీ రామ్ లల్లా) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. ముగ్గురు శిల్పులు వేర్వేరు శిలలతో రాముడి శిల్పాలను చెక్కగా అందులో యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్నే ఎంపిక చేశారు. రామ్లల్లా అని భక్తులు పిలుచుకునే ఈ చిన్నారి రాముడి విగ్రహాన్ని దాదాపు 4.25 అడుగుల ఎత్తుతో ఎంతో ఆకర్షణీయంగా కృష్ణశిలతో ఆయన తీర్చిదిద్దారు. ఇప్పుడు మరోసారి అలియా భట్ దంపతుల కోసం గణేశుడి విగ్రహాన్ని అందించనున్నారు. -
దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. తొలి భారతీయ సెలబ్రిటీగా రికార్డ్
భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంటారు నటి దీపికా పదుకొణె (Deepika Padukone). కేవలం తన నటనతోనే కాకుండా తన స్పీచ్లతోనూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అందుకే ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెటా AIకి తన గొంతును అందించిన తొలి భారతీయ సెలబ్రిటీగా ఆమె నిలిచింది. తాను ఇప్పుడు మెటా ఏఐలో భాగమైనట్లు ఒక వీడియోతో సోషల్మీడియాలో పంచుకున్నారు. ఆమెకు మరోసారి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది.మెటా ఇటీవల ప్రత్యేక ఏఐ చాట్బాట్ యాప్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వివిధ రకాల టెక్స్ట్, ఇమేజ్, వీడియో డేటాతో శిక్షణ ఇవ్వడం వల్ల మీరు అడిగే ప్రశ్నను కూడా విస్తృత స్థాయిలో అర్థం చేసుకుంటుంది. మీతో చాటింగ్ చేయడమే కాకుండా వాయిస్తో సలహాలు, కబుర్లు కూడా చెబుతుంది. మీకు కావాల్సింది ప్రాంప్ట్లను అందిస్తే చాలు మాట్లాడేస్తుంది. ఏదైనా అంశం మీద లోతుగా తెలుసుకోవాలనుకుంటే విశ్లేషణ కూడా చేస్తుంది. ఇప్పుడు ఇవ్వన్ని మీ అభిమాన నటి దీపికా పదుకొనె వాయిస్తో మీరు వినేయవచ్చు. ఆమెతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కానీ, ఆమె వాయిస్ మాత్రం ఏఐ ఆధారంగా మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది.వాయిస్ ఇన్పుట్స్తో మెటా ఏఐ అసిస్టెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు దానికి దీపికా పదుకొణె వాయిస్ తోడవుతుంది. అంటే స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఎప్పుడైనా దీపికతో మాట్లాడొచ్చన్నమాట. మెటా ఏఐలో హాలీవుడ్ నుంచి కొంతమంది ప్రముఖుల వాయిస్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇండియా నుంచి మాత్రం కేవలం దీపికా పదుకొనె వాయిస్ మాత్రమే అందుబాటులోకి రానుంది.ఈ క్రమంలోనే దీపిక ఒక వీడియోను షేర్ చేసుకున్నారు. ఇది చాలా బాగుంది అని తాను అనుకుంటున్నట్లు పేర్కంది. తాను ఇప్పుడు మెటా AIలో భాగమయ్యానని దీంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ అంతటా తన వాయిస్తో ఇంగ్లీషులో చాట్ చేయవచ్చని ఆమె పంచుకున్నారు. ఒక్కసారి దీనిని ప్రయత్నించి ఏమనుకుంటున్నారో తెలియజేయాలని ఆమె కోరారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
కృతిశెట్టి ఎదురుచూపులు.. ఇప్పుడా టైమ్ వచ్చింది
కొందరి హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నా సరే ఒక్కోసారి విజయాలు అందని ద్రాక్షే అవుతంది. నటి కృతిశెట్టి(Krithi Shetty) పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఉప్పెన చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. తొలి సినిమా తర్వాత వరుసగా విజయాలు దక్కాయి. దీంతో టాలీవుడ్లో దూసుకుపోతారనే ప్రచారం జరిగింది. అంతే ఆ తరువాత కృతిశెట్టి నటించిన చిత్రాలు పరాజయం పాలవడం మొదలెట్టాయి. అయితే ఆ తరువాత కోలీవుడ్పై దృష్టి సారించారు. అంతకుముందే తెలుగు, తమిళం భాషల్లో నటించిన ద్విభాషా చిత్రాలు ది వారియర్, కస్టడీ చిత్రాలు పూర్తిగా నిరాశపరచాయి. అయినప్పటికీ అమ్మడికి తమిళంలో అవకాశాలు వరించాయి. అయితే అక్కడ ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉండడం గమనార్హం. తమిళంలో కృతిశెట్టి నటించిన మూడు చిత్రాలు ఇప్పుడు ఒకే నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతుండడం విశేషం. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా కృతిశెట్టి కెరీర్కు హెల్ప్ అవుతుంది. దీంతో అలాంటి విజయం కోసం ఈ అమ్మడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. కార్తీకి జంటగా నటిస్తున్న వా వాద్దియార్ చిత్రం డిసెంబర్ 5న తెరపైకి రానుంది. తర్వాత ప్రదీప్ రంగనాథన్కు జంటగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కావలసింది. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ దీపావళికి తెరపైకి రానుండడంతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్కు వాయిదా పడింది. ఇకపోతే కృతి నటిస్తున్న మరో చిత్రం జీవీ. రవిమోహన్ నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో మరో నాయకిగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. వీటిలో నటి కృతిశెట్టి దశను మార్చే చిత్రం ఏది అవుతుందో చూడాలి. -
డ్యూడ్లో అందమైన భావోద్వేగాలు ఉంటాయి
‘‘డ్యూడ్’ వైవిధ్యమైన ప్రేమకథ. అందమైన భావోద్వేగాలు ఉంటాయి. కీర్తీశ్వరన్గారు చెప్పిన కథకంటే 20 శాతం ఎక్కువగానే సినిమా తీశారు. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ చెప్పిన విశేషాలు. → ‘డ్యూడ్’ యూత్తో పాటు ఫ్యామిలీ కూడా చూసే కంటెంట్. చాలా కొత్తగా ఉంటుంది. చెప్పాలంటే ‘సఖి’ లాంటి ఫ్యామిలీ మూవీ. ప్రదీప్గారి ‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలు తెలుగులో దాదాపు రూ. 12 కోట్లు కలెక్షన్స్ తెచ్చుకున్నాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి కాబట్టి ‘డ్యూడ్’ కచ్చితంగా రూ. 15 కోట్లు వసూలు చేస్తుందని నమ్ముతున్నాం. → ‘డ్యూడ్’ని తమిళంలో ఏజీఎస్ సంస్థ ద్వారా తమిళంలో మేమే విడుదల చేస్తున్నాం. తమిళ్తో సమానంగా తెలుగులోనూ మా సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది. → మేము హిందీలో తీసిన ‘జాట్’ మాకు మంచి వెంచర్. ‘జాట్ 2’ కూడా ఉంటుంది. ప్రభాస్గారితో, ఎన్టీఆర్గారితో మేం నిర్మిస్తున్న సినిమాలు 2026లోనే వస్తాయి. రామ్తో తీస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాగుంటుంది. ‘పెద్ది’ చిత్రం 2026 మార్చ్ 27న కచ్చితంగా విడుదలవుతుంది. ఆ తర్వాత సుకుమార్గారితో సినిమా ఉంటుంది. -
ఈ సినిమాను విడుదల కానివ్వం !
సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేశ్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితీ మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. నరసింహ నంది రచన, దర్శకత్వంలో దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్లోని డైలాగులు అసభ్యకరంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు మహిళా సమాఖ్య ప్రతినిధులు మంగళవారం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య ప్రతినిధులు దీపా దేవి, నీరజ, ధనమ్మ మాట్లాడుతూ– ‘‘టీజర్లో మహిళలను కించపరుస్తూ డైలాగులు ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి చిత్రాన్ని విడుదల కానివ్వం’’ అని తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో పద్మ, చంద్రమ్మ, నసీమా తదితరులు ఉన్నారు. -
ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా...
‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా... ట్రెండ్ సెట్ చెయ్...’ అంటూ సుధీర్బాబుతో ఆడి పాడుతున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రేయా శర్మ. సుధీర్ బాబు హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ కీలక పాత్రలు ΄ోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న రిలీజ్ కానుంది. రాయిస్, జైన్, సామ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ట్రెండ్ సెట్ చెయ్...’ అంటూ సాగే వీడియో సాంగ్ని బుధవారం విడుదల చేశారు. పబ్ నేపథ్యంలో సాగే ఈ పాటకి శ్రీమణి సాహిత్యం అందించగా, స్ఫూర్తి జితేందర్, రాజీవ్ రాజ్ పాడారు. జీతూ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘జటాధర’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వరుణ్ పాత్రకి గుడ్ బై చెప్పడం బాధగా ఉంది
‘‘తెలుసు కదా’ సినిమాలో నేను చేసిన వరుణ్ పాత్ర ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వయొలెన్స్ ని జనరేట్ చేస్తుంది. ఏడాదిగా వరుణ్ అనే రాడికల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను... ఆ పాత్రకి గుడ్ బై చెప్పడం బాధగా ఉంది’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. ఆయన హీరోగా, శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘ఈ దీపావళికి మా ‘తెలుసు కదా’. ప్రియదర్శి ‘మిత్రమండలి’, కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాలు విడుదలవుతున్నాయి. మంచి సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘మా సినిమా తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు శ్రీనిధి. ‘‘తెలుసు కదా’ నా మనసుకు దగ్గరైన సినిమా’’ అని రాశీ ఖన్నా పేర్కొన్నారు. ‘‘మా సినిమాని బిగ్ స్క్రీన్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని కృతీ ప్రసాద్ చెప్పారు. ‘‘ఈ సినిమా అద్భుతంగా రావడానికి కారణం నిర్మాతలే’’ అన్నారు నీరజ కోన. -
హీరోయిన్ ప్రణీత స్టన్నింగ్ లుక్.. బిగ్బాస్ బ్యూటీ ట్రేడిషనల్ లుక్!
అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత హాట్ ట్రీట్..బర్త్ డే డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్న దివ్యాంగణ సూర్యవన్షీ..బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ట్రేడిషనల్ లుక్..బ్లాక్ శారీలో హీరోయిన్ కాజోల్ గ్లామరస్ లుక్స్..థామా ప్రమోషన్స్లో బిజీ బిజీగా రష్మిక.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
గుర్తు పెట్టుకోండి.. మీరు కూడా బతికేది సినిమాపైనే.. బన్నీవాసు స్వీట్ వార్నింగ్!
టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు (Bunny Vasu) ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలకిచ్చే రేటింగ్స్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో మూవీ రేటింగ్స్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు మీ సైట్లో.. యాప్లో సినిమాలకు రేటింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. ఇవన్నీ చీప్ ట్రిక్స్ అని బన్నీవాసు విమర్శించారు. జర్నలిస్టులు మన చిత్రాలకు విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కదా.. అలాంటప్పుడు మీ రేటింగ్స్ ఎందుకని నిలదీశారు. టికెట్ కొనే సమయంలోనే ఈ సినిమా బాగుంది..ఇది బాగాలేదని రేటింగ్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇవాళ మిత్రమండలి మూవీ టీమ్ నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన కామెంట్స్ చేశారు.బాగున్నా సినిమాలకు ఎప్పుడు తేడా రాదని బన్నీ వాసు అన్నారు. మీరు కూడా సినిమా మీదే బ్రతుకుతున్నారని గుర్తు పెట్టుకోండని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఆ లైక్స్.. రేటింగ్స్ ఎవరు ఇస్తున్నారో కూడా అథాంటికేషన్ ఉండదని.. దానికి మెకానిజం ఏంటో కూడా తెలియదని బన్నీ వాసు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ టాలీవుడ్లో చర్చకు దారితీశాయి.కాగా.. బన్నీ వాసు సమర్పణలో వస్తోన్న చిత్రం మిత్ర మండలి. ఈ మూవీలో ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక ఎన్ఎం, విష్ణు, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విజయేంద్ర ఎస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. -
థియేటర్స్లోకి ‘సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్’
తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత ఓ సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్పై వెంకట్ రెడ్డి నంది స్వీయ దర్శకత్వం లో శ్రీకరణ్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తారకేశ్వరి’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ బోర్డు సభ్యుల నుండి ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ నిర్వహించి కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంది.ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత వెంకట్ రెడ్డి నంది మాట్లాడుతూ – “నా టీమ్ నాకు అండగా నిలిచింది. అందుకే ఈ తరహా సినిమాలు చేయగలుగుతున్నాను. సినిమా పట్ల అందరి కృషి, ప్రేమతోనే ఈ స్థాయికి వచ్చింది. అక్టోబర్ 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. నవంబర్ 7న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం” అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము మాట్లాడుతూ – “ఈ సినిమాకి మ్యూజిక్ చాలా చక్కగా కుదిరింది. వెంకట్ రెడ్డి గారి 16 సినిమాల్లో సగానికి పైగా నేను సంగీతం సమకూర్చాను. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే తృప్తి ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ – “ఈ సినిమా ఓ పల్లెటూరిలో జరిగిన యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కింది. గ్రామీణ వాతావరణంలో జరిగిన షూటింగ్ మరిచిపోలేని అనుభవం. వెంకట్ రెడ్డి నంది గారు మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. కథ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. నవంబర్ 7న థియేటర్లలో కలుద్దాం” అన్నారు. -
పనిమనిషికి ఆస్తి.. ఆమె కాళ్లపై పడి దండం పెట్టా: రంగనాథ్ కుమారుడు
పెద్దరికం, రాజసం, గాంభీర్యం.. ఆయన కనిపిస్తే ఇవన్నీ కలపోసినట్లుగా ఉంటాయి. ఆయనే టాలీవుడ్ నటుడు రంగనాథ్. మూడు వందలకు పైగా సినిమాలు చేసిన ఆయన 2015లో తన నివాసంలో ఉరేసుకుని చనిపోయారు. గోడలపై పనిమనిషి మీనాక్షి పేరు రాసి తన పేరిట ఉన్న బాండ్స్ను ఆమెకు అప్పగించాలని కోరారు. రంగనాథ్ జీవితం గురించి, చివరి రోజుల గురించి ఆయన కుమారుడు నాగేంద్ర కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.అమ్మ చనిపోయాక..'1995లో అమ్మ మంచానపడింది. నడుము కింది భాగానికి స్పర్శ లేకుండా పోయింది. తను ఎప్పటికీ కోలుకోలేదని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నాన్న, నేను ఇంటిపనులు విభజించుకున్నాం. నాన్న వంట చేస్తే నేను ఇల్లు తుడిచి గిన్నెలు తోమేవాడిని. అమ్మ బాత్రూమ్ వెళ్తే కూడా మేమిద్దరమే క్లీన్ చేసేవాళ్లం. మనుషుల్ని మాట్లాడుకున్నా కొద్దిరోజులకే పని మానేసేవారు. అక్క పెళ్లి కోసం నాన్న ఇల్లమ్మేశాడు. అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. రూ.800 అద్దె ఇంట్లోకి..సినిమాలు తగ్గిపోవడంతో రూ.2,500 అద్దె కడుతున్న ఇంటి నుంచి రూ.800 అద్దె ఉన్న ఇంటికి మారాం. ఆర్థిక పరిస్థితి బాగోలేదని అర్థమైంది. ఇలాగైతే కష్టమని నేను దుబాయ్ వెళ్లి సంపాదిస్తానన్నాను. నాన్న ఒప్పుకోకపోయినా దుబాయ్ వెళ్లాను. అందుకు నాపై కోపంతో ఏడాదిన్నరపాటు మాట్లాడలేదు. అయినా అక్కడే రెండేండ్లు ఉండి ఇండియాకు వచ్చేశా.. అమ్మకోసమైనా ఉండిపోరా అన్నాడు. అందుకే పనిమనిషికి ఆస్తిమళ్లీ రూ.2500 అద్దె ఉన్న పాత అపార్ట్మెంట్కు షిఫ్ట్ అయ్యాము. మీనాక్షి మా పనిమనిషి. అమ్మను బాగా చూసుకునేది. అమ్మ చనిపోయాక నాన్నను మాతో పాటు రమ్మన్నాం. కానీ నాన్న ప్రైవసీ కావాలన్నారు. స్వేచ్ఛగా జీవించాలనుకున్నారు. ఆయనకు అడ్డు చెప్పలేకపోయాం. మీనాక్షి.. తనకు ఇల్లు కావాలని అడిగిందని విన్నాను. అందుకే నాన్న చనిపోయేముందు ఆమె కోసం కొంత ఆస్తి రాసిచ్చి పోయాడు. ఏదేమైనా మా అమ్మానాన్న కోసం చాలా సేవ చేశావని మీనాక్షి కాళ్లపై పడి దండం పెట్టుకున్నాను. పదోసారి ప్రాణం పోయిందినేను కట్టుకున్న భార్య గతేడాది చనిపోయింది. ఆమె మనసు స్థిమితంగా ఉండదు. తొమ్మిదిసార్లు చనిపోయేందుకు ప్రయత్నించింది. ప్రతిచిన్నదానికి ఎక్కువ భయపడి, బెదిరిపోయి ట్యాబ్లెట్లు మింగేది. పదోసారి అలాగే చేసింది. కానీ, ఈసారి డోసు ఎక్కువయ్యేసరికి చనిపోయింది. నా భార్య చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు. అప్పుడే బంధుత్వాలను తెంచేసుకున్నా.. నా కొడుకుతో బతుకున్నాను. నాన్న ఎడమచేతికి తెలియకుండా కుడిచేత్తో దానధర్మాలు చేసేవాడు. ఆయన సంపాదించిందంతా ఆయనే ఖర్చు చేశారు. మాకేమీ ఇవ్వలేదు' అని నాగేంద్ర కుమార్ చెప్పుకొచ్చాడు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. -
ఓటీటీకి తెలుగు రొమాంటిక్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఎంత పెద్ద సినిమాలైనా నెల రోజుల తర్వాత ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్లకైతే కొదవే లేదు. వారంలో నాలుగైదు వెబ్ సిరీస్లే ఉంటున్నాయి. వీటిలో క్రైమ్, రొమాంటిక్ ఓరియంటేడ్ స్టోరీలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగులో మరో ఆసక్తికర సిరీస్ అలరించేందుకు వచ్చేస్తోంది.తెలుగులో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఆనందలహరి (Ananda lahari). ఈ సిరీస్లో ఆనంద్, లహరి అనే యువ జంట చుట్టూ తిరిగే ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పాన్ గోదావరి అంటూ ఈస్ట్ అబ్బాయి, వెస్ట్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ, పెళ్లి నేపథ్యంలో తీశారు. ఇందులో అభిషేక్, భ్రమరాంబిక జంటగా నటించారు ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఈ నెల 17 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్కు సాయి వానపల్లి దర్శకత్వం వహించారు.2 days to go!Not just another love story… it’s an Anandalahari of fun, drama & heart!Oct 17th, witness how East meets West — in love, war & Flexi Raju style! 😎@sureshProdns @SouthBayLive#aha #SureshProductionsmini pic.twitter.com/AuSbATe8uz— ahavideoin (@ahavideoIN) October 15, 2025 -
కించ పర్చాలని, కిందకు తొక్కాలని చూస్తున్నారు : ప్రియదర్శి
‘విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే బాగుంటుంది. కానీ కావాలనే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. కించ పర్చాలని, కిందకు తొక్కాలని టార్గెటెడ్గా హేట్ను వ్యాప్తి చేస్తున్నారు. ‘మిత్ర మండలి’ మీద కావాలనే నెగెటివ్ క్యాంపైన్ చేస్తున్నారు. అలా టార్గెటెడ్ హేట్రెడ్ని స్ప్రెడ్ చేసే వాళ్లు కనీసం సొంత పేరు కూడా పెట్టుకోరు. ఏవేవో పేర్లతో, ఫేక్ ఐడీలతో ఇలాంటి పనుల్ని చేసే వారిని మనం ఏం చేయగలం’అని అసహనం వ్యక్తం చేశారు హీరో ప్రియదర్శి. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిత్రమండలి’.విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్,సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘మిత్ర మండలి’ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు ఆద్యంతం ఎంటర్టైనింగ్గానే అనిపించింది. అందుకే నేను ‘మిత్ర మండలి’కి ఓకే చెప్పాను. నేను విన్నప్పుడు ఏం అనుకున్నానో.. తెరపైకి కూడా అదే వచ్చింది. అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను.→ అనుదీప్ ‘జాతి రత్నాలు’ కథ చెప్పినప్పుడు ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చింది. సమాజంలోని కొన్ని సమస్యల్ని సెటైరికల్గా చెబుతుంటారు. మిత్రమండలి చిత్రంలో కుల వ్యవస్థ మీద విజయేందర్ మంచి సెటైరికల్ సీన్లు రాసుకున్నారు. సినిమాల్లో ఇచ్చే సందేశాల ద్వారా సమాజం మారుతుందని నేను నమ్మను.→ ‘మిత్ర మండలి’లో ఎవ్వరినీ ఉద్దేశించి కథను రాసుకోలేదు. ఓ ఫిక్షనల్ క్యాస్ట్ నేమ్ పెట్టి చాలా సెటైరికల్గా తీశాం. ఏ ఒక్క కులం మీదనో సెటైర్ వేస్తున్నట్టుగా అనిపించదు. ఇది మమ్మల్నే అన్నట్టు ఉందే? అని అనిపిస్తే మాత్రం మేం ఏమీ చేయలేం (నవ్వుతూ). ఎవ్వరి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాత్రం మా చిత్రం ఉండదు. అందరినీ నవ్వించేలా, ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది.→ ‘జాతి రత్నాలు’, ‘మిత్ర మండలి’ ఒకేలా ఉండవు. ‘జాతి రత్నాలు’ తరువాత ‘35 చిన్న కథ కాదు’, ‘కోర్ట్’ వంటి డిఫరెంట్ చిత్రాలు చేశాను. ఎప్పుడూ ఒకే రకమైన జానర్ చిత్రాల్ని చేయడం నాకు కూడా ఇష్టం ఉండవు. ‘జాతి రత్నాలు’ టైపులో ఎవరైనా కథ చెబితే కూడా వద్దని అంటాను.→ ‘మిత్ర మండలి’ మీద నాకున్న నమ్మకంతోనే ‘ఈ సినిమా నచ్చకపోతే నా నెక్ట్స్ మూవీని చూడకండి’ అని అన్నాను. నాని అన్నకి ‘కోర్ట్’ మీద ఉన్న నమ్మకంతో ఈవెంట్లో అలా చెప్పారు. నాక్కూడా నా ‘మిత్ర మండలి’ మీద అంతే ప్రేమ, నమ్మకం ఉంది. అందుకే అలా అన్నాను. అంతే కానీ మిగతా చిత్రాల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు.→ అవతలి వాళ్లని నవ్వించే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ అవతలి వాళ్లని తక్కువ చేసి కామెడీ చేయడమే నా దృష్టిలో క్రింజ్ అవుతుంది. కొన్ని సార్లు వాదనలు గెలవలేనప్పుడు, మనల్ని ఏమీ చేయలేకపోతోన్నప్పుడు అలాంటి నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు. కొన్ని కొందరికి వర్కౌట్ అవుతుంది.. ఇంకొన్ని కొందరికి వర్కౌట్ కావు.→ప్రస్తుతం నా దగ్గరకు చాలా డిఫరెంట్ కథలు వచ్చాయి. అందులో ‘ప్రేమంటే’ అనే మూవీ షూటింగ్ జరుగుతోంది. మరో రెండు కథలు నాకెంతో నచ్చాయి. వాటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే జరుగుతుంది. -
తమిళ సినిమాకు తెలుగులో క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్లో ఊహించని రికార్డ్!
డ్రాగన్ మూవీతో తెలుగు ఆడియన్స్లోనూ క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ ఏడాదిలో రిలీజైన చిత్రం కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అదే ఊపులో మరో రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా వస్తోన్న లేటేస్ట్ సినిమా డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో కీర్తీశ్వరన్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ మూవీ రిలీజ్కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్లు ఓపెన్ కావడంతో ఓవర్సీస్లో హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తమిళ సినిమాకు తెలుగు ఆడియన్స్ ఎక్కువగా టికెట్స్ బుక్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు తమిళ వర్షన్కు 27 వేల డాలర్లు రాగా.. తెలుగు వర్షన్కు 32 వేల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ సినిమా విడుదలకు ముందే కలెక్షన్స్ జోరు చూస్తుంటే సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలైన లవ్ టుడే (2022), డ్రాగన్ (2025) తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి. లవ్ టుడే తెలుగు వెర్షన్ రూ.11.81 కోట్ల నికర కలెక్షన్లు సాధించింది. ఓవరాల్గా ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.66.57 కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో డ్రాగన్ చిత్రానికి రూ.18.68 కోట్లు రాగా.. ఇండియాలో రూ.101.34 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా.. ఇప్పటికే డ్యూడ్ భారతదేశంలో రూ.17.26 లక్షలు ముందస్తు బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, శరత్ కుమార్, హృదు హరూన్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. -
‘బలగం’ వేణుకు ‘ఎల్లమ్మ’ కష్టాలు!
సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ పడితే.. సదరు దర్శకుడి, హీరో చుట్టూ నిర్మాతలు క్యూ కడతారు. అడ్వాన్స్లు ఇచ్చి మరీ కొన్నాళ్ల పాటు ఎదురు చూస్తారు. దర్శకుడు వేణు(Venu Yeldandi) విషయంలోనూ అదే జరిగింది. ‘బలగం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు దగ్గరకు చాలా మంది నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్లారు. అడ్వాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వేణు మాత్రం తనకు అవకాశం ఇచ్చి దిల్ రాజుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. అదే ‘ఎల్లమ్మ’(Yellamma).నానితో ప్లాన్బలగం చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించింది దర్శకుడు వేణు రాసుకున్న కథే. పల్లెటూరి నేపథ్యంలో రాసుకున్న ఆ కథ అందరికి కనెక్ట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వెంటనే ‘ఎల్లమ్మ’ ప్రాజెక్టును ప్రకటించాడు. దిల్ రాజు బ్యానర్లోనే సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. నిర్మాత దిల్ రాజు కూడా ఎల్లమ్మ ప్రాజెక్ట్ని త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్లామని చెప్పాడు. తొలుత ఈ కథను నాని(Nani)తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నాని, వేణు కూడా పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పారు. కానీ కొన్నాళ్ల తర్వాత నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. ఎల్లమ్మ సినిమా తాను చేయడం లేదని తేల్చేశాడు. ఇతర కమిట్మెంట్స్తో బీజీగా ఉండడం వల్లే ఆయన తప్పుకున్నట్లు సమాచారం.కొంపముంచిన ‘తమ్ముడు’నాని తప్పుకున్న కొన్నాళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు నితిన్ చేతికి వెళ్లింది. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఓకే కూడా చెప్పేశాడు. తమ్ముడు రిలీజ్కి ముందు ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లోనూ నితిన్ తన తర్వాతి ప్రాజెక్టు ఎల్లమ్మనే అని చెప్పేశాడు. దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పాడు. కానీ తమ్ముడు రిలీజ్ తర్వాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది. దీంతో ఎల్లమ్మ ప్రాజెక్టు నుంచి నితిన్ కూడా తప్పుకున్నాడు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి నితిన్ తప్పుకున్నట్లు టాలీవుడ్ టాక్. ‘బెల్లం’ చెంతకు ‘ఎల్లమ్మ’ఎల్లమ్మ కథ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకు వచ్చింది. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. బడ్జెట్ దృష్ట్యా బెల్లకొండ అయితేనే ఈ చిత్రానికి సెట్ అవుతాడని దిల్ రాజు భావిస్తున్నాడట. ఇటీవల కిష్కింధపురి చిత్రంతో మంచి విషయాన్ని ఖాతాలో వేసుకున్నాడు బెల్లంకొండ. ఇప్పుడు అదే జోష్తో వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాడు. ఎల్లమ్మకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. -
30 రోజుల్లోనే ‘కానిస్టేబుల్’..చాలా మంది ఫోన్లు చేశారు : కెమెరామెన్ వళి
‘కానిస్టేబుల్’ చూసి ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్స్ చేశారు. 30 రోజుల్లోనే అంత క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చావా? అని పొగిడేస్తున్నారు. ఓ పెద్ద బ్యానర్ నుంచి కూడా కాల్ వచ్చింది. త్వరలోనే ప్రాజెక్ట్ చేద్దామని అన్నారు. ఇలా ‘కానిస్టేబుల్’కి మంచి స్పందన వస్తుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు కెమెరామెన్ షేక్ హజాతరయ్య(వళి). కెమెరామెన్గా 25 ఏళ్లలో 78 చిత్రాలకు పైగా చేసిన అనుభవం ఉన్న ఆయన సెంట్గా ‘కానిస్టేబుల్’ అంటూ అందరి ముందుకు వచ్చారు. వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్గా ఆర్యన్ సుభాష్ తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్గా విడుదలైంది. ఈ క్రమంలో కెమెరామెన్ వళి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..→ మాది నెల్లూరు జిల్లా. మక్కెనవారిపాలెం గ్రామం. నేను ఈ ఇండస్ట్రీలోకి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నారాయణ గారి వల్లే వచ్చాను. ఆయనే నన్ను ఇలా కెమెరా డిపార్ట్మెంట్లో పనిలోకి పెట్టారు. అలా 25 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రయాణంలో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేశాను. దాదాపు 8 భాషల్లో పని చేశాను. హిందీ, మరాఠీ భాషల్లో తీసిన చిత్రాలకు అవార్డులు కూడా వచ్చాయి.→ అరుంధతి, అన్నవరం, ఏక్ నిరంజన్, రగడ ఇలా ఎన్నో సినిమాలకు కెమెరా డిపార్ట్మెంట్లో పని చేశాను. నేను చిన్నతనం నుంచీ చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తరువాత ‘అన్నవరం’లో పవన్ కళ్యాణ్ను చూశాను. కష్టపడితే పైకి వస్తామని ఆయన్ను చూశాక అర్థమైంది.→ బలగం జగదీష్ ఓ సినిమాకు ఆర్టిస్ట్గా వచ్చారు. ఆ మూవీనికి నేను కెమెరామెన్గా పని చేశాను. అప్పుడు నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చింది. మీతో కచ్చితంగా ఓ సినిమాను తీస్తాను అని అప్పుడు బలగం జగదీష్ అన్నారు.→ జగదీష్ గారు ‘కానిస్టేబుల్’ కథను విన్న వెంటనే నా దగ్గరకు పంపారు. ఆర్యన్ సుభాష్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కథ అద్భుతంగా ఉంది అని జగదీష్ గారికి చెప్పాను. అలా ఈ మూవీ జర్నీని స్టార్ట్ చేశాం.→ వరుణ్ సందేశ్ గారు మాకు ఎంతో సహకరించారు. ఆయనతో వర్క్ చేస్తే సొంత ఫ్యామిలీ, బ్రదర్లా అనిపిస్తుంది. ఎక్కడా కూడా తన స్థాయిని ప్రదర్శించడు. సెట్లో అందరితో కలిసి మెలిసి ఉంటాడు. ఓ సారి షూటింగ్లో గాయమైనా కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేశారు.→ ప్రస్తుతం నేను రామ్ భీమన దర్శకత్వంలో ఓ మూవీని కమిట్ అయ్యాను. రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాకి కెమెరా డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాను. ఇవి కాకుండా శివ ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించనున్నాం. -
చాంతాడంత లిస్ట్ ఆర్డర్ చేసిన రమ్య.. తిన్న వెంటనే వాంతులు!
వైల్డ్కార్డులు హౌస్లో అడుగుపెట్టేముందు ఒక్కొక్కరికి ఒక్కో పవర్ ఇచ్చాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). అలా పచ్చళ్లమ్ముకునే రమ్య మోక్షకు బంపరాఫర్ ఇచ్చాడు. తనకు ఎప్పుడంటే అప్పుడు.. ఏది కావాలంటే అది.. నచ్చిన వంటకాలను అడిగితే బిగ్బాస్ కాదనుకుండా పంపిస్తాడని నాగార్జున చెప్పాడు. ఇంత మంచి ఛాన్స్ రమ్య (Ramya Moksha) వదులుకుంటుందా? సమస్యే లేదు.పెద్ద లిస్ట్ ఇచ్చిన రమ్యటిఫిన్లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరీ, మైసూర్ బజ్జీ.. లంచ్కి చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ, వెజ్ టిక్కా పిజ్జా, బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు కావాలంటూ సరుకుల లిస్ట్ చదువుతూనే ఉంది. ఈ లిస్ట్ విని బిగ్బాస్ గుడ్లు తేలేయడం ఖాయం. ఈ ఫుడ్ను సుమన్తో షేర్ చేసుకుంటానంది. అక్కడితో ఆగలేదట! 5 కిలోల చికెన్ కూడా అడిగేసిందట! పనిలో పనిగా చికెన్ పచ్చడి పెడుతుందేమో మరి!తినలేక తంటాలుదొరికిందే ఛాన్స్ అని ఆర్డర్ పెట్టింది కానీ ఆ వంటకాలన్నీ తినలేక నానా అవస్థ పడినట్లు తెలుస్తోంది. ఏకంగా వాంతులు కూడా చేసుకుందంటున్నారు. మరి ఆర్డర్ చేసిన వంటకాలను మిగతా హౌస్మేట్స్కు పంచారా? లేదంటే రమ్య కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని బిగ్బాస్ ఏమైనా ఆర్డర్లు వేశారా చూడాలి! చదవండి: అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. -
తొలి తెలుగు సింగర్ ఇక లేరు
చలనచిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో తొలి మహిళా సింగర్ రావు బాలసరస్వతి దేవి (97) (Raavu Balasaraswathi Devi) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం (అక్టోబర్ 15) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సంతాపం ప్రకటించిన వైఎస్ జగన్సింగర్ బాల సరస్వతీదేవి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. 'తెలుగు సంగీత ప్రపంచంలో బాల సరస్వతీ దేవి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా' అని ట్వీట్ చేశారు. తెలుగు సంగీత ప్రపంచంలో తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేసిన తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. pic.twitter.com/2y2lneAY7O— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025సింగర్ జర్నీబాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె నాలుగేళ్ల వయసులోనే పలు స్టేజీలపై సాంగ్స్ పాడారు. ఆరో ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్లో రికార్డు చేసింది. మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగులో తొలి నేపథ్య గాయని రికార్డు కూడా తనదే! సతీ అనసూయ (1936) సినిమాలో తొలిసారి పాట పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు. దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు. భక్త ధ్రువ, ఇల్లాలు, రాధిక వంటి పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు సినిమాల్లో పాడటం మానేశారు. కానీ గొంతు సవరించుకోవడం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారు. కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. అలా చివరి వరకు పాడుతూనే ఉన్నారు. చదవండి: 30లోకి ఎంటరైన హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ -
మెగా హీరో 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ రిలీజ్
మెగాహీరో సాయితేజ్ నుంచి గత రెండేళ్లుగా ఎలాంటి సినిమా రాలేదు. 2023లో 'విరూపాక్ష'తో సక్సెస్ అందుకున్నప్పటికీ.. పవన్తో కలిసి నటించిన 'బ్రో' ఫ్లాప్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు 'సంబరాల ఏటిగట్టు' అనే మూవీతో రాబోతున్నాడు. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)గ్లింప్స్ బట్టి చూస్తే మాస్ యాక్షన్ మూవీ అని క్లారిటీ వచ్చింది. అయితే విజువల్స్ అన్నీ 'కేజీఎఫ్'లో నరాచీని గుర్తుచేసేలా కనిపించాయి. సాయితేజ్ బాడీ బిల్డింగ్ అంతా బాగానే ఉంది. గ్లింప్స్లోనూ కథ ఎలా ఉండబోతుందనే రివీల్ చేశారు. లెక్క ప్రకారం గత నెలలోనే సినిమా రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా గ్లింప్స్లో మూవీ రిలీజ్ డేట్ వేయలేదు. మరి ఈ ఏడాది తీసుకొస్తారా లేదంటే వచ్చే ఏడాది థియేటర్లలోకి మూవీ వస్తుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మాధురి వస్తువు దొంగతనం.. గొడవ పడాలని చూస్తున్నావా?) -
బాయ్ఫ్రెండ్ ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోను: ఫ్లోరా సైనీ
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో జైలు జీవితం అంటే ఎవరైనా బాధపడతారు, అవమానంగా ఫీలవుతారు. కానీ, ఫ్లోరా మాత్రం తెగ సంబరపడిపోయింది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా జైల్లో అడుగుపెట్టింది. ఆమెను రిలీజ్ చేయమని బిగ్బాస్ కెప్టెన్ను ఆదేశించినప్పుడు మాత్రం తెగ బాధపడిపోయింది. అప్పుడే అయిపోయిందా! అని నిరాశచెందింది.ఐదో వారం ఎలిమినేట్దానికి కారణం.. హౌస్మేట్స్తో పెద్దగా కలవదు. తన పనేదో తను చేసుకుపోతోంది. హౌస్లో ఉండాలన్న ఆసక్తి కూడా తనకేమంత లేదు. ప్రతివారం ఎలిమినేషన్కు రెడీగా ఉంది. ఒకానొక సమయంలో తను సేవ్ అయినట్లు నాగార్జున చెప్పగానే ఏంటి? నిజమా! అని నోరెళ్లబెట్టింది. తను కోరుకున్నట్లుగా ఐదో వారం హౌస్ నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేసింది. తాజాగా సాక్షి ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లోరా పెళ్లి గురించి ఓపెన్ అయింది. అందుకే నాకు పెళ్లొద్దు'నాకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడు. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే.. పెళ్లి చేసుకున్న రెండుమూడేళ్లకే విడాకులు అవుతున్నాయి. అలా నా ఫ్రెండ్స్ను చాలామందిని చూశాను. కాబట్టి వివాహం జోలికి వెళ్లకూడదనుకుంటున్నా.. రిలేషన్షిప్లోనే సంతోషంగా ఉన్నాను' అని ఫ్లోరా సైనీ చెప్పుకొచ్చింది. ఫ్లోరా సైనీ మరో పేరు ఆశా సైనీ. ఈ బ్యూటీ తెలుగులో ప్రేమ కోసం, నువ్వు నాకు నచ్చావ్, చాలా బాగుంది, నవ్వుతూ బతకాలిరా, నరసింహనాయుడు వంటి పలు సినిమాలు చేసింది. పదేళ్లుగా హిందీలోనే చిత్రాలు చేస్తోంది.చదవండి: 30లోకి ఎంటరైన హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ -
వివాదాలతో సతమతం.. అప్పుడే ఫుల్స్టాప్ అంటున్న హన్సిక
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా రాణించినవారిలో హన్సిక మొత్వానీ (Hansika Motwani) ఒకరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్డమ్ అందుకున్నారు. దాదాపు 50కిపైగా చిత్రాల్లో కథానాయికగా నటించిన హన్సిక.. 2022లో సోహైల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే ఈమె పెళ్లి కూడా చాలామంది హీరోయిన్లలాగానే మనస్పర్థలతో ముగిసిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది.రెండు వివాదాల మధ్య హన్సికభర్తకు దూరంగా తన తల్లితోనే ఉండడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరోవైపు హన్సికపై ఆమె సోదరుని భార్య గృహహింస ఆరోపణలు చేసింది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి, మనశ్శాతి కోసం ఈ బ్యూటీ విహారయాత్రలు చేసి వచ్చినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సినిమాలపైనే ఫుల్ ఫోకస్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన హన్సిక తనపై వస్తున్న విమర్శలను తెలుసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.ఈ ఏడాది పూర్తయ్యేసరికి..దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన గురించి ఎవరేం అనుకుంటున్నారు? ఎలాంటి వదంతులు ప్రసారం అవుతున్నాయి? అని తన సన్నిహితుల ద్వారా వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా తన సమస్యలు తొలగిపోతాయని తన అత్యంత సన్నిహితురాలు వద్ద హన్సిక అన్నట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. హన్సిక ఆ మధ్య నాలుగు సినిమాలు చేసింది. కానీ, అవింకా రిలీజ్ కాలేదు.చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం -
తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?
మరో తెలుగు హీరోయిన్ వివాదంలో నిలిచింది. బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుతో వివాదం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సదరు మేకప్ ఆర్టిస్ట్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడంతో ఈ సంగతి బయటపడింది. సదరు హీరోయిన్, ఆమె తల్లిపై లేడీ మేకప్ ఆర్టిస్టు సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?'గత కొన్నిరోజులుగా ఓ స్టార్ హీరోయిన్ నన్ను వేధిస్తోంది. ఆమె టీమ్, కుటుంబ సభ్యులు అయితే చాలా స్టుపిడ్గా ప్రవర్తిస్తున్నారు. దక్షిణాదిలో వాళ్లకు తక్కువ మొత్తానికి లేదంటే ఫ్రీగా పనిచేసినట్లు ఇక్కడ కూడా పనిచేస్తారని అనుకుంటున్నారు. మాకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. నాకు నీతో పనిచేయాలని లేదు. కాబట్టి ఇకపై ఫోన్, మెసేజ్ చేయకు'(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం)'ఆమె కుటుంబానికి చెందిన ఓ మనిషి.. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మిగతావాళ్లు సారీ చెబుతున్నారు. కానీ నాకు మీతో పనిచేయాలని లేదు. మా డబ్బులు నొక్కేయడం ఆపండి. లేదంటే ఈసారి మీ పేర్లు బయటపెడతాను' అని సదరు మేకప్ ఆర్టిస్ట్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.విషయానికొస్తే.. రీసెంట్ టైంలో తెలుగులో వరస సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్లో పలు ప్రాజెక్టులు చేస్తోంది. అయితే నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసే మేకప్ ఆర్టిస్టులని ఈ హీరోయిన్ తల్లి వద్దని చెబుతోందట. బదులుగా వేరే వాళ్లని పెట్టుకుని వాళ్లకు డబ్బులిస్తోంది. అయితే మేకప్ ఆర్టిస్టులకు ఎంత డబ్బులు ఇస్తుందో అంతకు రెట్టింపు.. నిర్మాత నుంచి వసూలు చేస్తున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?(ఇదీ చదవండి: శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?) -
పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమాతో వస్తున్నాడు. 'కె ర్యాంప్' పేరుతో తీసిన ఈ చిత్రం.. దీపావళి కానుకగా ఈ శనివారం (అక్టోబరు 18) థియేటర్లలోకి రానుంది. దీంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఇతడు.. ఒక్కడే ఊళ్లు తిరుగుతూ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఓ మీడియా మీట్ సందర్భంగా పలువురు అభిమానులు, మూవీ లవర్స్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న రాగా కిరణ్ నుంచి 'వద్దు' అనే సమాధానం వచ్చింది.'పవన్ కల్యాణ్ ఫ్యాన్గా 'ఓజీ' మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియెన్స్ ఎలా అనిపించింది' అని ఓ వ్యక్తి.. కిరణ్ అబ్బవరంని అడిగాడు. దీనికి కిరణ్ నుంచి 'ఇప్పుడు వద్దు బ్రో' అనే సమాధానమొచ్చింది. అయితే ఎందుకు నో చెబుతున్నాననే దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడు నా సినిమా 'కె ర్యాంప్' రిలీజ్ ఉంది. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబితే దానికోసం ఎక్కువ వాడుకుంటున్నారేమో, ఇప్పుడు ఎక్కువ చెబితే టికెట్స్ తెగుతాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. నాకు అది వద్దు. మరీ అన్నిసార్లు అభిమానం గురించి పదేపదే చెప్పడం కరెక్ట్ కాదు' అని కిరణ్ అబ్బవరం నుంచి సమాధానం వచ్చింది.(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)కిరణ్ చెప్పింది నిజమేనేమే! ఎందుకంటే గతంలో ఒకరిద్దరు తెలుగు హీరోలు.. తమ సినిమాల రిలీజ్ టైంలో పవన్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు చాలా మాటలు చెప్పేవారు. కిరణ్ అబ్బవరం ఈ సమాధానం చెబుతుంటే అవే సంఘటనలు గుర్తొచ్చాయి. 'కె ర్యాంప్' విషయానికొస్తే.. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీశారు. కేరళ బ్యాక్ డ్రాప్లో మొత్తం స్టోరీ అంతా జరగనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటోంది.'కె ర్యాంప్'తో పాటు ఈ వీకెండ్ ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్.. లిస్టులో ఉన్నాయి. అయితే ఎవరికి వాళ్లు గట్టిగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. మరి వీళ్లలో ఎవరు హిట్ కొడతారనేది చూడాలి? ప్రస్తుతానికి అన్ని చిత్రాల ట్రైలర్స్ బాగున్నాయి. కాకపోతే ఏది నిలబడి గెలుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఇలియానా.. మూడోసారి తల్లి కాబోతుందా?) -
ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు: నిర్మాత రాజేశ్ దండ
‘‘నిర్మాతగా ‘కె–ర్యాంప్’ నాకు ఆరవ సినిమా. నా గత ఐదు చిత్రాల్లో ఎక్కడా ఇబ్బందికరమైన పదాలు లేవు. ఒక్కో సినిమా కథ ఒక్కోలా ఉంటుంది. అంతే కానీ కావాలని కొన్ని పదాలు పెట్టి, ప్రేక్షకులను థియేటర్స్కు రప్పించాలని అనుకోను. అలాంటి సినిమాలు నేను తీయను. ‘కె–ర్యాంప్’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు’’ అని చె΄్పారు నిర్మాత రాజేశ్ దండ. కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజేశ్ దండ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కిరణ్గారు కుమార్ అబ్బవరం అనే పాత్రలో నటించారు. ఈ సినిమా కథ విని ఎగై్జట్ అయ్యాను. మా సినిమాకు సెన్సార్ వాళ్ళు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది ఇందులో ఇబ్బందికరమైన పదాలు ఉన్నాయని కాదు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. వీటిని చూసి ఎవరైనా ఆడియన్స్ ప్రేరణ పొందుతారేమోనని ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు... అంతే. వల్గారిటీ లేదు. ఇక ‘కె–ర్యాంప్’ సినిమా కిరణ్గారి వన్ మ్యాన్ షోలా ఉంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ బ్లాస్ట్ అవుతుంది.ఈ సినిమాతో నిర్మాత శివతో నాకు మంచి ప్రయాణం మొదలైంది. నా మీద నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమాలో భాగమయ్యారు శివ. ప్రస్తుతం మా బ్యానర్లో హీరోయిన్ సంయుక్తతో ఓ సినిమా చేస్తున్నాం. అలాగే ‘అల్లరి’ నరేశ్గారితో ఓ సినిమా ఉంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘టార్గెటెడ్ ట్రోలింగ్ గురించి బన్నీ వాసుగారు మాట్లాడిన విషయాలను నేను ఫాలో కాలేదు. పూర్తి విషయాలు తెలిసిన తర్వాత స్పందిస్తాను’’ అని చె΄్పారు. ‘‘కిరణ్గారిని ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శివ బొమ్మకు. -
ఫ్లాష్బ్యాక్లో యాక్షన్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ఎన్టీఆర్ ఓ డిఫరెంట్ లుక్లోకి మారారని టాక్. ఫ్లాష్బ్యాక్లో వచ్చే పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలెట్గా నిలవనున్నాయట. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రం 2026 జూన్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘వార్ 2’ రికార్డ్ : హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలైంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అత్యధిక మంది వీక్షించిన చిత్రాల జాబితాలో ‘వార్ 2’ చిత్రం టాప్లో ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తెలిపింది. ఈ నెల 6 నుంచి 12 వరకూ 3.5 మిలియన్ల మంది వీక్షించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో గత వారం ఇండియాలోనే ఎక్కువమంది చూసిన సినిమాగా ‘వార్ 2’ నిలిచింది. -
‘అరి’ కథతో పుస్తకం తీసుకొస్తున్నాం : దర్శకుడు జయశంకర్
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. అరి షడ్వర్గాలను కాన్సెప్ట్గా తీసుకుని, ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని ఈ పాయింట్ని ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు శంకర్.చివర్లో కృష్ణుడి ఎంట్రీ, అరి షడ్వర్గాల గురించి ఆయన ఇచ్చే సందేశం అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మకంగా చిత్రంగా అరిని మలిచారంటూ ఆడియెన్స్ దర్శకుడి మీద ప్రశంసల్ని కురిపించారు. ఇక మీడియా, సోషల్ మీడియా, క్రిటిక్స్ ఇలా అందరూ కూడా చివరి 20 నిమిషాల గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అరిపై పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. అలా డివైన్ ట్రెండ్ను ఫాలో అవుతూ అరి చిత్రం ఆడియెన్స్ గుండెల్లోకి వెళ్లిపోయింది. అరి షడ్వర్గాలను ప్రధాన అంశంగా తీసుకుని, ఆరు పాత్రలతో దర్శకుడు సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్లో దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ - "అరి" సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మంచి రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చిన మీడియా వారికి థ్యాంక్స్. మూవీకి స్లోగా ఓపెనింగ్స్ వచ్చి పికప్ అవుతుందని ముందే అనుకున్నాం. అయితే రెండో రోజునే శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్స్ ను థియేటర్స్ దగ్గర చించివేయడం చూసి బాధగా అనిపించింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా జరుగుతుందేంటని ఇబ్బందిపడ్డాం. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. థర్డ్ డే నుంచి అరి సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి కనిపించింది. అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది గొప్పవాళ్లు చెబుతూ వచ్చారు గానీ వాటికి పరిష్కారం చూపించలేదు. ఈ ఆలోచనతోనే అరి చిత్రాన్ని రూపొందించాను. నేను చూసిన సినిమాలు కొన్ని ఇలాంటి కాన్సెప్ట్ తో చిత్రాన్ని చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి. ఈ సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. మా సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీ డేట్ అనౌన్స్ చేస్తాం’అన్నారు. -
ఆమె ఎవరో తెలియదు.. నేను పట్టించుకోను : సిద్ధు జొన్నలగడ్డ
ఈ మధ్య సినిమా ప్రెస్మీట్స్లో కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. సెలెబ్రిటీలను కించపరుస్తూ ప్రశ్నలు అడిగితే తాము కూడా ‘సెలెబ్రిటీ’అయిపోతామనే అపోహతో కాంట్రవర్సీ ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda )ను ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై నెటిజన్స్ ఘోరంగా మండిపడ్డారు. ‘తెలుసు కదా’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న సిద్దుని ఓ మహిళా జర్నలిస్ట్ ‘మీరు నిజ జీవితంలో స్త్రీలోలుడా(వుమనైజర్) ’ అని అడగడంతో స్టేజ్పై ఉన్న సిద్ధుతో పాటు తోటి జర్నలిస్టులకు కూడా ఒక్కసారి షాకయ్యారు. ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూ కాదు సినిమా ఇంటర్వ్యూ అని సిద్ధు కాస్త ఘూటుగానే ఆమెకు సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మహిళా జర్నలిస్టు ప్రశ్నను తప్పుపడుతూ పలువురు నెటిజన్స్ కామెంట్ చేశారు. తాజాగా ఈ వివాదంపై మరోసారి సిద్ధు స్పందించారు.తెలుసు కదా సినిమా ప్రచారంలో భాగంగా నేడు మీడియాతో ముచ్చటించిన సిద్దు.. ‘వుమనైజర్’ ప్రశ్నపై మరోసారి స్పందించారు. ‘అమె అలా మాట్లాడడం అగౌరవం. మైకు ఉంది కదా అని ఏది పడితే అది అడగడం కరెక్ట్ కాదు. ఆమె అలా అడిగి..నవ్వుతున్నారు కూడా. అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు పద్దతిగా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు. మైకు తీసుకోగానే మారిపోయారు. సినిమా రిలీజ్ ఉంది కదా..ఏం అయినా అడగొచ్చు అనుకోవడం కరెక్ట్ కాదు. సినిమాకు రియల్ లైఫ్కి తేడా ఉంటుంది. సినిమాలో హీరో అండర్ కవర్ పోలీసు అయితే..బయట కూడా ఎన్కౌంటర్ చేయడు కదా? డ్రగ్స్ తీసుకునే పాత్రలో నటిస్తే..బయట కూడా డ్రగ్స్ తీసుకుంటాడని అనుకుంటామా? సినిమాకి బయటకు తేడా తెలియదా? సీనియర్ జర్నలిస్టులు పద్దతిగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. తమిళ హీరో ప్రదీప్ని కూడా ఆమెనె ఏదో అడిగారని, ఇష్యూ అయిందని చూశాను. అలాంటి వాటిపై ఆలోచించడం వేస్ట్. ఇలాంటి ప్రశ్నలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్. పెద్దగా పట్టించుకోను. నా పనిపై నేను ఫోకస్ పెడతా’ అని సిద్దు చెప్పుకొచ్చాడు. కాగా సిద్దు నటించిన తెలుసు కదా మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్.. మాళవిక 'రాజాసాబ్' జాకెట్!
బర్త్ డే సెలబ్రేషన్స్లో పూజా హెగ్డే స్మైల్గ్రీస్లో షూటింగ్.. 'రాజాసాబ్' జాకెట్తో మాళవికఅందాలరాశిలా కనిపిస్తున్న రాశీఖన్నాస్విట్జర్లాండ్ ట్రిప్లో 'కాంతార' బ్యూటీ సప్తమిగౌడదుబాయి వెళ్లిపోయిన బిగ్బాస్ దివి వద్త్యలంగావోణీలో మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియఫ్రెండ్ పెళ్లి పార్టీలో 'హనుమాన్' హీరోయిన్ అమృత View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sapthaami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Tabu (@tabutiful) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
ఇలియానా.. మూడోసారి తల్లి కాబోతుందా?
కొన్నేళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేసి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న.. ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఏడాది జూన్ 19న రెండో కుమారుడికి జన్మనిచ్చింది. కానీ మూడు రోజుల క్రితం ఇలియానా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో బేబీ బంప్తో కనిపించింది. దీంతో మూడోసారి తల్లి కాబోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి అసలు విషయం?గోవాకు చెందిన ఇలియానా.. 2006లో వచ్చిన 'దేవదాస్' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పోకిరి, జల్సా, మున్నా, కిక్, జులాయి తదితర టాలీవుడ్ మూవీస్తో క్రేజ్ సంపాదించింది. 2012లో 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్కి వెళ్లింది. తర్వాత తెలుగు సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. అలా అని హిందీలో ఏమైనా కలిసొచ్చిందా అంటే లేదు. పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్లో 2018లో 'అమర్ అక్బర్ ఆంటోని' మరో ప్రయత్నం చేసింది. కానీ కలిసిరాలేదు.(ఇదీ చదవండి: 51 ఏళ్ల వయసులోనూ మలైకా ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్)అయితే 2014లోనే మన దేశ పౌరసత్వాన్ని విడిచిపెట్టిన ఇలియానా.. పోర్చుగీస్ పౌరసత్వం తీసుకుంది. అప్పటినుంచి అడపాదడపా హిందీ చిత్రాల్లో నటిస్తూ వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో మైఖేల్ డోలన్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. 2023 ఆగస్టులో తొలిబిడ్డకు జన్మనివ్వగా.. అదే ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. మొదటి కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ కాగా.. ఈ ఏడాది జూన్లో రెండో కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి కీను రాఫే డోలన్ అని పేరు పెట్టారు.ఇలియానా తాజాగా పోస్ట్ చేసిన విషయానికొస్తే.. ఇందులో బేబీ బంప్తో కనిపించింది. కానీ ఇది రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్న వీడియోలా అనిపిస్తుంది. ఇప్పుడు పోస్ట్ చేయడంతో మళ్లీ ప్రెగ్నెంట్ అయిందా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ రూమర్స్ నిజం కాదనిపిస్తోంది. ఒకవేళ అలా ఉంటే అనౌన్స్ చేసేదిగా!(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక) -
వీళ్లు తెలుగు హీరోహీరోయిన్.. అప్పట్లో ఇలా.. గుర్తుపట్టారా?
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ టైంలో రిలీజైన పాటలతో పాటు గతంలో రిలీజైన సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ హల్చల్ చేస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ క్లిప్ వైరల్ అయిపోతోంది. వీళ్లు ఆ హీరోహీరోయిన్ కదా అని తెలిసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. మరి మీరేమైనా వీళ్లని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?)పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరిలో ఒకరు నిహారిక కాగా మరొకరు దినేశ్ నాయుడు. దినేశ్ ఎవరబ్బా అని మీరు ఆలోచిస్తున్నారు కదా! ప్రస్తుతం తెలుగులో హీరోగా సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ అసలు పేరు దినేశ్ నాయుడు. అప్పట్లో అంటే 11-12 ఏళ్ల క్రితం పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్ చేశాడు. వాటన్నింటిలోనూ దినేశ్ అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు ఓ క్లిప్ వైరల్ అవుతోంది. ఇది పదకొండేళ్ల క్రితం వచ్చిన 'టర్మ్స్ అండ్ కండీషన్స్' పాటలోనిది.అప్పట్లో నిహారిక కూడా పలు షార్ట్ ఫిల్మ్స్ చేసేది. అలా ఈ పాట కోసం విశ్వక్ సేన్తో నటించింది. అప్పటి సాంగ్ క్లిప్ ఇప్పుడు వైరల్ అయ్యేసరికి విశ్వక్ సేన్ ఇంతలా మారిపోయాడా అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ 'ఫంకీ' సినిమా చేస్తుండగా.. నిహారిక యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి నిర్మాతగా మారిపోయింది. గతేడాది 'కమిటీ కుర్రోళ్లు' మూవీతో హిట్ కొట్టింది. ఇప్పుడు కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. ఏదేమైనా వైరల్ క్లిప్ వల్ల విశ్వక్-నిహారిక జంట సోషల్ మీడియాలో టాపిక్ అయిపోయారు.(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)Idheppudu chesav @VishwakSenActor 😂😂🤣😂🤣😂🤣🤣😂😂😂🤣😂😂🤣#VishwakSen pic.twitter.com/r8cSk1AECD— Karthik Chowdary (@KChowdaryyy) October 13, 2025 -
మెగాస్టార్ సంక్రాంతి సినిమా.. రొమాంటిక్ ఫుల్ సాంగ్ అవుట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్తో ఫుల్ స్వింగ్లో దూసుకెళ్తున్నారు.ఇటీవల దసరా సందర్భంగా క్రేజీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మీసాల పిల్లా అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. -
శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?
యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఈ ఏడాది 'రాబిన్హుడ్', 'జూనియర్' సినిమాలతో వచ్చింది. కానీ ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ఈనెల 31న 'మాస్ జాతర' మూవీతో రానుంది. దీనిపై పెద్దగా అంచనాలైతే లేవు. ఇవి కాకుండా తెలుగు, తమిళ, హిందీలో తలో చిత్రం చేస్తోంది. ఇప్పుడు ఇన్ స్టాలో కొత్తగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఇప్పుడిది ఏంటా అనే క్వశ్చన్ మార్క్గా మారింది.(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)'ఏజెంట్ మిర్చి'గా శ్రీలీల.. అక్టోబరు 19న ప్రకటన రానుందని చెబుతూ ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో గ్లామరస్గా రఫ్ అండ్ టఫ్ లుక్లో కనిపించింది. క్యాప్షన్ చూస్తుంటే ఇదేదో హిందీ ప్రాజెక్టులా అనిపిస్తుంది. అయితే అది సినిమానా లేదా వెబ్ సిరీస్ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇవేం కాకుండా యాడ్ లాంటిది అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', శివకార్తికేయన్ 'పరాశక్తి', కార్తిక్ ఆర్యన్తో ఓ రొమాంటిక్ సినిమా చేస్తోంది. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ నిలబడాలంటే ఇవి కచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన వరస చిత్రాల్లో నటించింది. కాకపోతే 'ధమాకా', 'భగవంత్ కేసరి'తో పాటు 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ తప్పితే మిగతావి ఏవి ఉపయోగపడలేదు. ఇప్పుడు చేస్తున్న మూవీస్పై కాస్త బజ్ ఉంది. మరి శ్రీలీల లక్ ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక
మంచు మనోజ్ మంచి జోష్లో ఉన్నాడు. ఈ ఏడాది నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. కొన్నినెలల క్రితం 'భైరవం' రిలీజై మిశ్రమ స్పందన అందుకుంది. కానీ గత నెలలో 'మిరాయ్'లో మనోజ్ చేసిన విలనిజానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా కొన్ని భారీ సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. అలా హిట్ ఇచ్చిన ఆనందంలో ఉన్న మనోజ్.. అడపాదడపా మూవీ వేడుకల్లోనూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓ టీవీ ఛానెల్ అవార్డ్స్ ఫంక్షన్కి భార్యతో పాటు వచ్చాడు.ఈ కార్యక్రమంలోనే యాంకర్ రవి మాట్లాడుతూ.. మనోజ్లో మీకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? అని మౌనికని అడగ్గా.. చాలా గొప్ప స్నేహితుడు అని చెప్పింది. మర్చిపోలేని సందర్భం ఏదైనా ఉంది అని అడిగితే.. ఓ రోజు నాకు క్షమాపణ చెబుతూ లెటర్ రాశాడు. కానీ నాకు అర్థం కాక మళ్లీ అడిగానని నవ్వుతూ మౌనిక చెప్పుకొచ్చింది. పక్కనే ఉన్న మనోజ్.. లెటర్ ఎప్పుడు రాశానా అని గుర్తుతెచ్చుకుని ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. ఈ ప్రోమోలో విషయాన్ని సగం సగం చెప్పినట్లు చూపించారు. మొత్తం ఎపిసోడ్లో మనోజ్ ఆ లేఖ ఎందుకు రాశాడు? ఏం రాశాడనేది మౌనిక బయటపెడుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: 51 ఏళ్ల వయసులోనూ ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్)మనోజ్, మౌనికని 2023లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఇది రెండో పెళ్లి. అయినాసరే పెద్దల్ని ఒప్పించి ఒక్కటయ్యారు. వీళ్ల ప్రేమకు గుర్తుగా గతేడాది కూతురు కూడా పుట్టింది. ప్రస్తుతం మనోజ్.. అటు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు మూవీస్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీలో మనస్పర్థలు, గొడవలు జరిగినప్పటికీ ఇప్పుడు అవన్నీ సర్దుబాటు అయినట్లే కనిపిస్తున్నాయి. 'మిరాయ్' రిలీజ్ టైంలో చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అని విష్ణు ట్వీట్ చేశాడు. మనోజ్ పేరుని ట్వీట్లో ప్రస్తావించనప్పటికీ అన్నదమ్ముల మధ్య అంతరం తగ్గిందనే టాక్ అయితే వినిపిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
'కాంతార'కు అక్కడ భారీ నష్టాలే.. కారణం ఇదే
కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ చిత్రం కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. సోమవారం కూడా సుమారు రూ. 20 కోట్లకు పైగానే రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.675 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో బాహుబలి-1 ఫైనల్ కలెక్షన్స్ మార్క్ను కాంతార దాటేసింది. అయితే, కాంతారా చాప్టర్ 1 అమెరికాలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ గణనీయమైన నష్టాలను చవిచూసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు, ఈ చిత్రం దాదాపు రూ. 4 మిలియన్ల డాలర్స్ (రూ. 36 కోట్లు) వసూలు చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా తాజాగా మేకర్స్ షేర్ చేశారు. ఈ కలెక్షన్స్ నంబర్ పర్వాలేదనిపించినప్పటికీ బ్రేక్-ఈవెన్ మార్కుకు చాలా దూరంలో ఉంది. ఈ సినిమాను చాలా ఎక్కువ ధరకు అమెరికాలో కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేయడానికి దాదాపు రూ. 8 మిలియన్ల డాలర్స్ అవసరం అవుతుంది. ఆ మార్క్ను కాంతార అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీంతో అమెరికాలో కాంతార నష్టాలు మిగల్చడం తప్పదని సమాచారం.అయితే, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ బెల్ట్లో మాత్రం భారీ లాభాల దిశగా కాంతార దూసుకుపోతుంది. దీపావళి సందర్భంగా ఈ వారంలో మరో నాలుగు ప్రధాన సినిమాలు విడుదల కానున్నడంతో కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఏదేమైనా మరో మూడు రోజులు మాత్రమే కాంతార సందడి కనిపించనుంది. ఈ ఏడాదిలో ఛావా సినిమా రూ. 800 కోట్ల కలెక్షన్స్తో టాప్ వన్లో ఉంది. ఇప్పుడు కాంతార కూడా ఆ మార్క్ను అందుకోవాలని చూస్తుంది. 2022లో విడుదలైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్ 1 నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
శ్రీజ ఎలిమినేషన్ .. సర్ఫ్ ఎక్సెల్తో కడిగినా సరే మరక పోదు.. ఇలా అవమానిస్తారా?
బిగ్బాస్ 9 నుంచి దమ్ము శ్రీజ ఎలిమినేషన్ గురించి సోషల్మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. ఆడియన్స్ ఓట్స్తో సంబంధం లేకుండా ఆమెను హౌస్ నుంచి పంపించేయడంతో షో పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్లలో శ్రీజ చాలా స్ట్రాంగ్ అని షో చూస్తున్న వారికి ఎక్కువగా అభిప్రాయం ఉంది. టోటల్లీ అన్ఫెయిర్ బిగ్బాస్ అంటూ కొందరు.. ఇదంతా దొంగాట అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.వాస్తవంగా శ్రీజ ఆట మొదటి రెండు వారాలు పరమ చెత్తగా ఉండేది. అయితే, ప్రియ ఎలిమినేషన్ తర్వాత తన పంతా పూర్తిగా మార్చేసుకుంది. ఒక శివంగిలా ప్రతి టాస్క్లలో దూసుకుపోయింది. ఎదురుగా ఎంత మంది ఉన్నా సరే సమాధానం చెబుతుంది. ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంటుగా తనను తాను మార్చుకుంది. కానీ, హౌస్లోకి కొత్తగా అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీల అభిప్రాయంతో ఆమెను తరిమేయడం ఏంటి అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. హౌస్లోకి వచ్చిన ఆరుగురిలో నలుగురు శ్రీజ వద్దు అనగానే ఇలా పంపించేయడం ఏంటి..? అలాంటప్పుడు ఓట్లు, పోల్స్, వీకెండ్లో నాగార్జున షో ఎందుకు అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. ప్రజాభిప్రాయం అనేది లేనప్పుడు ఈ షో ఎందుకు అంటూ బిగ్బాస్ను తప్పుబడుతున్నారు. బిగ్బాస్లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆమె జర్నీని కూడా చూపించకుండా చాలా అవమానకరంగా ఇలా గెంటేయడం ఏంటి దుమ్మెత్తిపోస్తున్నారు. సర్ఫ్ ఎక్సెల్తో కడిగినా సరే బిగ్బాస్ చరిత్రలో ఈ మరక పోదని అంటున్నారు. మా ఇష్టం వచ్చిన వాల్లను ఇంటికి పంపించేస్తామనే దోరణిలో తెలుగు బిగ్బాస్ ఉంది. కేవలం రేటింగ్ కోసమే కామనర్స్ను తీసుకున్నారా.. ఏడుగురు హౌస్లోకి వెళ్తే ఇప్పటికే నలుగురు ఇంటి బాట పట్టించారు. కనీసం శ్రీజకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చి హౌస్లోకి రప్పించాలని , అలాగైన బిగ్బాస్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.రీఎంట్రీపై దమ్ము శ్రీజ కామెంట్శ్రీజ ఎలిమినేషన్ వంద శాతం కావాలనే చేశారని ఎవరైనా చెబుతారు. దీంతో ఆమె రీ ఎంట్రీ కోసం చాలా సోషల్ మీడియా ఖాతాలు ఓటింగ్ పెట్టాయి. ప్రతి దానిలో ఆమె రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ గురించి ఆమె ఇలా మాట్లాడారు. దేవుని దయ వల్ల రీ ఎంట్రీ వుంటే తప్పకుండా హౌస్లోకి వెళ్తాను. నా కోసం ఇంత సపోర్ట్ ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. సామాన్యులకు హౌస్లోకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన బిగ్బాస్కు ధన్యవాదాలు. నేను ఎలిమినేషన్ అవుతానని కూడా ఊహించలేదు. సీక్రెట్ రూమ్ ఉంటుంది అనుకున్నాను. ఎప్పుడైతే నన్ను బజ్ ప్రోగ్రామ్కు పంపించారో అర్థం అయింది. సడెన్గా తీసుకున్న నిర్ణయం వల్ల నా జర్నీని కూడా టెలికాస్ట్ చేయలేదు. అని శ్రీజ అన్నారు. -
బావమరిది పెళ్లికి ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి..?
టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ – శివానీ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నితిన్ హ్యాట్రిక్ హిట్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. అక్టోబర్ 10న హైదరాబాద్లో నెల్లూరుకు చెందిన శివానీని ఆయన వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ దంపతులే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి ఆ ఇంటి ఆడపిల్ల కాబట్టి ప్రతి కార్యక్రమం ఆమె చేతుల మీదుగానే జరిపించారు. అయితే, తన బావమరిదికి పెళ్లి కానుకగా ఎన్టీఆర్ ఎలాంటి బహుమతి ఇచ్చారనేది సోషల్మీడియాలో వైరల్ అవుతుంది.కొత్త దంపతులు నితిన్–శివానీలకు పెళ్లి కానుకగా ఒక లగ్జరీ కారును ఎన్టీఆర్ ఇచ్చారని సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. నితిన్ అంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టం. గతంలో ఇదే మాట తారక్ కూడా చెప్పారు. తనకు సినిమా ఛాన్సులు రావడం వెనుక ఎన్టీఆర్ ప్రధానంగా ఉన్నారని తెలిసిందే. ఇప్పుడు తన బావమరిదికి ఏకంగా కారును గిఫ్ట్గా ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన లేనప్పటికీ రూమర్స్ మాత్రం బలంగానే వైరల్ అవుతున్నాయి.పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడైన నితిన్ 2023లో ‘మ్యాడ్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయ్, మ్యాడ్ స్క్వేర్ వంటి వరుస సినిమాలతో హిట్ అందుకున్నారు. -
ఇండియన్ సినిమా వైపు బ్రిటిష్ టాప్ సింగర్.. ఫస్ట్ సాంగ్ ఇదే
ఇండియన్ సినిమా ప్రపంచ దేశాలను మెప్పించే స్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే లండన్కు చెందిన పాప్ 'సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్' సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఒక మ్యూజిక్ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్తో 'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాటతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన ఇప్పుడు ఏకంగా కోలీవుడ్లో ఒక ఆల్బమ్లో పాట పాడనున్నారు. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) ప్రకటించారు.పదకొండేళ్ల వయసు నుంచే పాటలు రాయడంతో పాటు పాడటం కూడా ఎడ్వర్డ్ ప్రారంభించాడు. యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ఆయన సాంగ్స్కు దక్కుతుంటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో మ్యూజికల్ ఈవెంట్స్ నిర్వహించారు. ఇప్పుడు సంతోష్ నారాయణన్ సంగీతంలో ఓ ఆల్బమ్లో ఎడ్వర్డ్ పాట పాడనున్నారు. ఇదే ఆల్బమ్లో తన కుమార్తె 'ధీ' తో పాటు కేరళకు చెందిన ప్రముఖ రాపర్ హనమాన్కైండ్ కూడా భాగం కానున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం బెంగళూర్లో జరిగిన ఒక ఈవెంట్లో ‘దేవర’ నుంచి ‘చుట్టమల్లే’ పాటను ఎడ్వర్డ్ ఆలపించారు. ఆ వీడియో సోషల్మీడియాలో భారీగా వైరలైంది. -
నా మీద చెయ్యేస్తే కిందేసి తొక్కుతా.. కల్యాణ్పై రమ్య చీప్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు 9లో డబుల్ ఎలిమినేషన్(ఫ్లోరా సైనీ, శ్రీజ) తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి వచ్చేశారు. అయితే, సోమవారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల హంగామా కనిపించింది. వాళ్ల రాకతో బిగ్బాస్లో వైల్డ్ తుపాన్ మొదలౌతుందని నాగార్జున సూచించారు. కానీ, అక్కడ అంత సీన్ ఏమీ లేదు. వచ్చిన వారందరూ కూడా పూర్తి కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష పక్కా ప్లాన్తోనే కల్యాణ్, తనూజలను టార్గెట్ చేశారని తెలుస్తోంది. టాప్లో ఉన్న వీరిద్దరిని టార్గెట్ చేస్తే వారిని ఇష్టపడని ఓటర్స్ను తమ వైపు లాగేయవచ్చనే స్ట్రాటజీ మొదలుపెట్టారనిపిస్తుంది.సోమవారం ఎపిసోడ్లో కెప్టెన్గా ఉన్న కల్యాణ్ను మాధురితో పాటు రమ్య టార్గెట్ చేశారు. మొదట కల్యాణ్తో దివ్వెల మాధురి గొడవ పెట్టుకున్నారు. కూర్చోండి మేడం అని చాలా మర్యాదగా ఆమెకు గౌరవం ఇచ్చాడు కల్యాణ్. కానీ, ఇంత చిన్న విషయానికి ఆమె గొడవకు దిగారు. నువ్వేమైనా నా బాస్ అనుకుంటున్నావా అంటూ ఫైర్ అయ్యారు. కుర్చుంటేనే మాట్లాడుతారా అంటూ వెటకారంగా అనేశారు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఈ గొడవను భరణి ఆపాలని చూసినా మాధురి మాత్రం తగ్గలేదు. అయితే, కల్యాణ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత సమయం తర్వాత మాధురి మేడం సారీ అంటూ కల్యాణ్ కోరాడు. మీరు జీవితంలో ఎన్నో చూసి ఉంటారు. నేను చిన్నపిల్లోడినే క్షమించేయండి అంటూ కోరుతాడు. దీంతో మాధురి కూడా మంచిగానే రియాక్ట్ అయి ఆ గొడవను క్లోజ్ చేస్తారు.నోరుజారిన రమ్య మోక్షసోమవారం ఎపిసోడ్ మొత్తం కల్యాణ్ చుట్టే నడిచింది. అతనిపై రమ్య మోక్ష చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగానే ఉన్నాయి. ఒక సందర్భంలో మాధురితో కూర్చొని మాట్లాడుతూ.. కల్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అంటూ పెద్ద కామెంట్ చేసింది. శ్రీజ ఎలిమినేషన్ రౌండ్లో తన బెలూన్ కట్ చేశానని ఆ అబ్బాయి కల్యాణ్ ప్రవర్తన వేరేలా ఉందంటూ చెప్పింది. అసలు తనతో కల్యాణ్ మాట్లాడట్లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎదురు పడితే ముఖం తిప్పుకోవడమే కాకుండా కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదని మోక్ష చెప్పింది. అయితే, ఈ సమయంలో మాధురి కూడా రమ్యకు వంత పాడుతుంది. ఆ అబ్బాయితో మాట్లాడానికి ఇక్కడికి వచ్చామా లేదు కదా అని మాధురి చెబుతుంది. అతనికి (కల్యాణ్) అమ్మాయిల పిచ్చి ఫస్ట్.. అంటూ రమ్య మళ్లీ పైర్ అవుతుంది. ఈ సమయంలో మాధురి కూడా నోరు జారుతుంది. ఆ అబ్బాయి ప్రొఫెషన్ (ఆర్మీ) ఏంటో కూడా మర్చిపోయి ఇలా అమ్మాయిలతో చేస్తున్న బిహేవ్ బాగాలేదంటుంది.నా మీద చెయ్యి వేస్తే కిందేసి తొక్కేస్తా: రమ్యరమ్య బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చాక కల్యాణ్, తనూజలనే టార్గెట్ చేసింది. వారిద్దరూ ప్రస్తుతం టాప్లో ఉన్నారు. కాబట్టి వారిని ట్రిగ్గర్ చేస్తే.. తనకు లాభం అనే స్ట్రాటజీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఎవరైతే కల్యాణ్, తనూజలను ఇష్టపడరో వారందరూ రమ్య వైపు తిప్పుకునేందుకే ఇలా స్కెచ్ వేస్తుందనిపిస్తుంది. ఈ క్రమంలోనే తనూజతో కల్యాణ్ బిహేవ్ చేస్తున్న తీరుపై రమ్య గట్టిగానే రియాక్ట్ అయింది. వారిద్దరి బాండింగ్ గురించి ఆమె ఇలా కామెంట్ చేసింది. " తనూజ, కల్యాణ్లను చూస్తుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఆమె (తనూజ) మీద కల్యాణ్ చేతులు ఇలా వేసేసి తడుముతుంటే చూసేందుకు నాకే ఏదోలా ఉంది. అదే విధంగా నాతో ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా.. కిందేసి తొక్కేస్తా.. ఈ విషయంలో తనూజ ఎందుకు ఊరుకుంటుదో తెలియడం లేదు. కల్యాణ్ను కూడా ఆమె ఆపేయడం లేదు. హేహే అంటుందే కానీ.. అతన్ని ఆపదు. అందుకే కదా అతను అలా బిహేవ్ చేస్తున్నాడు. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు. వారిద్దరి కాంబినేషన్ ఏంటో అర్థం కావడం లేదు. అంటూ రమ్య కామెంట్స్ చేసింది. అదంతా విన్న తర్వాత అక్కడే ఉన్న మాధురి కూడా నిజమే కదా అంటూ తల ఊపడం మరింత ఆశ్చర్యాన్ని ఇస్తుంది.ఈ వారం నామినేషన్స్లో ఎవరు..?ఎపిసోడ్ చివరలో నామినేషన్ ప్రారంభమైంది. అయితే, వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు నామినేషన్లో లేరు. కానీ, వారి నుంచే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఇప్పటి వరకు తనూజ వల్ల సుమన్ శెట్టి, రామూ రాథోడ్ వల్ల పవన్, సంజన వల్ల భరణి నామినేట్ అయ్యారు. మిగిలిన నామినేషన్స్ మంగళవారం ఎపిసోడ్లో చూపించనున్నారు. అయితే.. తనూజ , దివ్య, రాము కూడా ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
లిటిల్ హార్ట్స్ మౌళికి భారీ రెమ్యునరేషన్తో మైత్రీ సినిమా!
లిటిల్ హార్ట్స్ (Little Hearts)సినిమాతో నటుడు మౌళి(Mouli Tanuj ) భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాదిలో ‘హ్యాష్ట్యాగ్ 90s’ అనే వెబ్ సిరీస్తో యూత్కు బాగా దగ్గరైన మౌళి తన టైమింగ్ డైలాగ్స్తో గుర్తింపు సంపాదించాడు. హీరోగా తొలి సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా తనతో ఒక సినిమా చేద్దాం అనుకునే రేంజ్కు చేరుకున్నాడు. కొత్త దర్శకులు కూడా ఇప్పటికే స్టోరీ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక భారీ నిర్మాణ సంస్థ నుంచి మౌళికి బిగ్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.చిన్న సినిమాగా విడుదలైన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఓటీటీలో కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది. దీంతో అతని మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు మౌళికి ఏకంగా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా ఆఫర్ ఇవ్వడమే కాకుండా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. ఏకంగా రూ. కోటి రెమ్యునరేషన్ కూడా వారు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కేవలం రెండో సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడం పెద్ద విషయమేనని చెప్పాలి. ఒక సినిమా హిట్ అయినప్పటికీ మరో ఛాన్స్ రావడం కష్టంగా ఉన్న ఈరోజుల్లో ఒక పెద్ద నిర్మాణ సంస్థ తన వద్దకే వచ్చి ఇలా ఆఫర్ ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. దీనంతటికీ కారణం మౌళికి యూత్తో బాగా కనెక్ట్ ఉంది. సోషల్మీడియాలో భారీ ఇమేజ్ ఉంది. అందుకే తనకు మైత్రీ మూవీస్ సినిమా అవకాశం ఇచ్చినట్లు టాక్. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో రావచ్చు. -
పదేళ్ల తర్వాత ధనుష్తో పనిచేయనున్న స్టార్ సంగీత దర్శకుడు
సౌత్ ఇండియాలో ప్రస్తుతం క్రేజీ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్న అనిరుధ్ తన సంగీత పయనాన్ని ప్రారంభించింది నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన 3 చిత్రంతోననే విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా, అందులోని వై దిస్ కొలవెరి పాట ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తరువాత 'రఘువరన్ బి.టెక్ , మారి, నవమన్మధుడు' చిత్రాల వరకూ ధనుష్ కోసం అనిరుధ్ సంగీతాన్ని అందించారు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉండటంతో అలా వారి జర్నీ కొనసాగింది. కానీ, వీరిద్దరి మధ్య బేధాబిప్రాయాలు వచ్చాయనే ప్రచారం కోలీవుడ్లో జరిగింది. కుటుంబ విషయంలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని కొందరు చెబితే... ఐశ్వర్యతో ధనుష్ విడాకులు తీసుకోవడం వల్ల అనిరుధ్ కాస్త దూరం జరిగాడని అంటారు. అయితే ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే.. సుమారు పదేళ్లుగా వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ హిట్ కాంబినేషన్లో చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సందర్భం ఇప్పుడు వస్తోందన్నది తాజా సమాచారం. ధనుష్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా అనిరుధ్ నటుడు రజనీకాంత్ చిత్రాలకు వరుసగా పని చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ధనుష్ హీరోగా లబ్బరు బంత్తు చిత్రం ఫేమ్ పచ్చుముత్తు తమిళరసన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే ధనుష్ అభిమానులకు ఖుషీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
దక్షిణ భారత కథలతో...
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సంస్థ ఆరు కొత్త తెలుగు, తమిళ ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్లను సోమవారం ప్రకటించింది. వాటిలో భాగంగా ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించనున్న తెలుగు చిత్రం ‘తక్షకుడు’. ఈ సినిమాలో ఆనంద్ అంధుడి పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా సందీప్ కిషన్ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ తెలుగు వెబ్ సిరీస్ రూ పొందనుంది.అలాగే ప్రియాంక మోహన్, పార్క్ హై–జిన్ ప్రధాన పాత్రల్లో రా కార్తీక్ దర్శకత్వంలో ‘మేడ్ ఇన్ కొరియా’ అనే తమిళ చిత్రం తెరకెక్కనుంది. అదేవిధంగా ఆర్. మాధవన్, నిమిషా సజయన్ ముఖ్య తారలుగా చారుకేశ్ శేఖర్ దర్శకత్వంలో ‘లెగసీ’ (తమిళం), గోమతి శంకర్ ప్రధాన పాత్రలో మిథున్ డైరెక్షన్లో ‘స్టీఫెన్’(తమిళం) చిత్రాలు, అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో ‘# లవ్’(తమిళం) అనే వెబ్ సిరీస్ రూ పొందనుంది. ‘‘పైన పేర్కొన్న సినిమాలు, సిరీస్ల ద్వారా దక్షిణ భారత భాషల్లోని కథలను ప్రోత్సహించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం’’ అని నెట్ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా శెర్గిల్ పేర్కొన్నారు. -
రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను: మమిత బైజు
‘‘డ్యూడ్’ సినిమాలోని కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు నాకు సవాల్గా అనిపించాయి. ఆ సన్నివేశాల కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. అలా చేయడం నాకు సవాల్గా, ఉత్సాహంగా అనిపించింది’’ అని హీరోయిన్ మమిత బైజు తెలి పారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ అవుతోంది.మమిత బైజు మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’లో నేను చేసిన కురల్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. ఈ సినిమాని కీర్తీశ్వరన్ అద్భుతంగా తీశారు. ప్రదీప్ రంగనాథ్ సెట్స్లో చాలా హెల్ప్ ఫుల్గా ఉంటారు. శరత్ కుమార్గారి లాంటి సినియర్తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి అభ్యంకర్ మ్యూజిక్ మా సినిమాకి బిగ్ ఎసెట్. నవీన్ , రవిశంకర్గార్లు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్గా తీశారు. మా చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
జోక్యం చేసుకోలేదు: జైన్స్ నాని
‘‘సినిమాలంటే చిన్నప్పటి నుంచే నాకు ప్యాషన్. కిరణ్ అబ్బవరంతో ఏడాదిన్నర ప్రయాణం చేశాను. ‘కె–ర్యాంప్’ చిత్ర కథ రాసుకుంటున్న సమయంలో తనకు అనిపించింది నాతో షేర్ చేసుకునేవారాయన. అంతేకానీ నా కథ, స్క్రిప్ట్ విషయంలో కిరణ్ ఎక్కడా జోక్యం చేసుకోలేదు’’ అని డైరెక్టర్ జైన్స్ నాని చెప్పారు. కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజ జోడీగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్పై రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 18న రిలీజ్ అవుతోంది.ఈ సందర్భంగా జైన్స్ నాని మాట్లాడుతూ–‘‘మాది నెల్లూరు. మద్రాస్ ఐఐటీలో చదువుకున్నా. అక్కడ కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. ఇండస్ట్రీకి వెళతానన్నప్పుడు మా నాన్నగారు.. ‘ఉద్యోగమా? డైరెక్టరా? అన్నది నువ్వే నిర్ణయించుకో?’ అని ప్రోత్సహించారు. ‘కె–ర్యాంప్’ లో హీరో క్యారెక్టర్ పేరు కుమార్. కథకు, హీరో పాత్రకి సరి పోయేలా ‘కె–ర్యాంప్’ అనే టైటిల్ పెట్టాం. పక్కాగా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా మాది.ఈ మూవీ ద్వారా కిరణ్, యుక్తి తరేజాకి మంచి పేరొస్తుంది. ఫ్రెష్ నెస్ కోసమే కేరళ నేపథ్యం తీసుకున్నాం. 47 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. ఫైనల్ కాపీ చూశాక రాజేష్, శివగార్లు నన్ను అభినందించారు. దీ పావళికి తెలుగులో బాగా పోటీ ఉంది. అయితే అన్ని సినిమాలూ హిట్ కావాలి. మా చిత్రం ఇంకొంచెం పెద్ద హిట్ కావాలి. నాకు ఎనర్జీతో ఉండే వినోదాత్మక చిత్రాలంటే ఇష్టం’’ అని చెప్పారు. -
అబ్బాయిగారు 60 ప్లస్
హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లోని ఈ 77వ సినిమాకు ‘ఆనంద నిలయం, వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం’.. వంటి టైటిల్స్ను మేకర్స్ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమాకు ‘అబ్బాయిగారు 60 ప్లస్’ అనే టైటిల్ను కూడా యూనిట్ పరిశీలిస్తోందనే టాక్ తెరపైకి వచ్చింది. వెంకటేశ్ కెరీర్లో ఆల్రెడీ ‘అబ్బాయి గారు’ అనే సూపర్హిట్ ఫిల్మ్ ఉండటం, త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ ఎక్కువగా ‘అ, ఆ’ అక్షరాలతో మొదలయ్యే సంప్రదాయం ఉండటంతో ‘అబ్బాయిగారు 60 ప్లస్’ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.హిందీలో సంక్రాంతికి వస్తున్నాం?వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై, సూపర్ హిట్ అయింది. కాగా, ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని ‘దిల్’ రాజు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
మిత్రమండలి అలరిస్తుంది: శ్రీ విష్ణు
‘‘మిత్రమండలి’ మూవీ సీక్వెన్స్ బాగున్నాయి. ఫ్రెండ్స్తో కలిసి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది. ఇది నా ప్రామిస్’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం జంటగా నటించిన సినిమా ‘మిత్ర మండలి’. ఎస్. విజయేందర్ దర్శకత్వంలో బన్నీ వాసు సమర్పణలో కల్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరై, ‘తెల్లకోడి నల్లకోడి కళ్లముందే జోడి కూడి..’ పాటను విడుదల చేశారు. దర్శకులు వివేక్ ఆత్రేయ, కల్యాణ్, ఆదిత్యా హాసన్ , అనుదీప్ అతిథులుగా హాజరై, సినిమా విజయాన్ని ఆకాంక్షించారు.అనంతరం ప్రియదర్శి మాట్లాడుతూ–‘‘మిత్రమండలి’ హిట్ కాక పోతే నా నెక్ట్స్ సినిమా చూడొద్దు. ‘కోర్ట్’ సినిమా టైమ్లో నాని అన్న చెప్పిందే కాపీచేసి, ‘మిత్రమండలి’ కోసం నేను చెబుతున్నాను’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిత్రమండలి’. ఈ దీ పావళికి రిలీజ్ అయ్యే నాలుగు సినిమాలూ హిట్ కావాలి. అందరితో పాటుగా మనం కూడా ఎదగాలని కోరుకునే వ్యక్తిని నేను. డబ్బులు పెట్టి పక్క సినిమాపై ట్రోలింగ్ చేసి ఎదుగుదాం అనుకుంటే మాత్రం... పైన దేవుడు ఉన్నాడు.. చూసే ప్రేక్షకులు ఉన్నారు. వాళ్లే చూసుకుంటారు.సినిమా బాగుంటే చూస్తారు. లేక పోతే నీదైనా, నాదైనా.. ఏ సినిమానైనా ఆడియన్స్ పక్కన పెడతారు. ఎంతమంది ఏం చేసినా నేను పరిగెడుతూనే ఉంటాను. అదే నా విజయం అని నమ్ముతాను’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. హిట్ కొడుతున్నాం అని ప్రోత్సహించిన కల్యాణ్ మంతెన, భాను, విజయేందర్, సోమరాజుగార్లకి థ్యాంక్స్’’ అన్నారు ఎస్. విజయేందర్.‘‘మా సినిమా ట్రైలర్కి మంచి స్పందన లభిస్తోంది. కానీ, కొంతమంది హేటర్స్ కూడా ఉన్నారు. వాళ్లు మా సినిమా ప్రీమియర్స్కి కూడా వస్తారని తెలుసు. వాళ్లకు మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ హాయిగా నవ్వించడం’’ అన్నారు నిర్మాత భాను ప్రతాప. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత విజయేందర్. ఈ వేడుకలో చిత్రయూనిట్ పాల్గొంది. -
ఆ పదం బూతు అని నిజంగా తెలియదు.. రాశీ ఖన్నా క్యూట్ కామెంట్స్!
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా. ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 17 థియేటర్లలోకి రానుంది.అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లకు హాజరైన రాశి ఖన్నా ఓ బూతు పదాన్ని మాట్లాడింది. ఆమె మాట్లాడిన ఆ పదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. మూవీ ప్రచారంలో భాగంగా పిచ్చి ము..ని కాదంటూ కామెంట్స్ చేసింది. అయితే తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ రాశీ ఖన్నా దీనిపై క్లారిటీ ఇచ్చింది. అది బూతు పదమని తనకు తెలియదని చెప్పుకొచ్చింది. అదొక క్యూట్ వర్డ్ అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దీనిపై హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆ పదాన్ని బామ్మ క్యారెక్టర్కు వాడినట్లు వివరించారు. రాశీని బామ్మ అలానే పిలుస్తుందని అన్నారు. అది క్యూట్ వర్డ్ అనుకొని మాట్లాడేశానని రాశీ ఖన్నా తెలిపింది. కానీ ఆ తర్వాత అది బూతు పదమని తెలిసిందని వెల్లడించింది. ప్రస్తుతం రాశీ ఖన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. I'm not laughing like a pichi munda.:- #RaashiKhannapic.twitter.com/yBHxJGldHs— Milagro Movies (@MilagroMovies) October 11, 2025 "నాకు అది బూతు అని తెలియదు..I thought it was a Cute Word."– #RaashiiKhanna | #TelusuKada pic.twitter.com/vdwYblQgqy— Whynot Cinemas (@whynotcinemass_) October 13, 2025 -
పాలక్ తివారీ బర్త్ డే సెలబ్రేషన్.. బంగారంలా మెరిసిపోతున్న విష్ణుప్రియ!
బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న పాలక్ తివారీ.. బంగారం లాంటి శారీలో మెరిసిపోతున్న విష్ణుప్రియ.. దివాళీ మూడ్లో హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ సన్నింగ్ లుక్.. ఎల్లో డ్రెస్లో ఇంద్ర బ్యూటీ సోనాలి బింద్రే..కలర్ఫుల్ శారీలో అనసూయ బ్యూటీ లుక్స్... View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
విక్రమ్ వారసుడి మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఫుట్బాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు. In a Land of Chaos, rises a Believer! #BisonKaalamaadan 🦬 காளமாடன் வருகை Trailer Out Now ▶️ https://t.co/mwDlHRrJqx 4 Days to go until his last Raid 🔥#BisonKaalamaadanFromDiwali #BisonKaalamaadanOnOct17 🎆@applausesocial @NeelamStudios_ #SameerNair @deepaksegal… pic.twitter.com/kDLfnFWBcQ— Anupama Parameswaran (@anupamahere) October 13, 2025 -
టాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
చిత్రం శ్రీను , సుష్మ , రామ్ బండారు హీరో, హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం మేఘన. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు సుధాకర రెడ్డి వర్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ శివ సాయి ఫిలిమ్స్ బ్యానర్పై నంది వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్తో టీజర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈ సినిమా హీరో చిత్రం శ్రీనివాస్ మాట్లాడుతూ..'మంచి కంటెంట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది. నా ఖాతాలో మరో హిట్ పడుతుందని నమ్మకం ఉందియ నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు' అని అన్నారు. హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ.. 'ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి మా యూనిట్లోని ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సహకరించారు. ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్న చనిపోయి మూడేళ్లు అవుతోంది. ఆ తర్వాత నేను ఎప్పుడూ బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. కానీ ఈ సినిమా ప్రెస్మీట్ సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ మూవీ నా జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురాబోతుంది' అని అన్నారు.దర్శకుడు సుధాకర రెడ్డి వర్ర మాట్లాడుతూ.. 'చిన్న ప్రొడక్షన్ అయినా పెద్ద కలలతో ఈ సినిమా చేశాం. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, కేవలం రెండేళ్లలోనే చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. కథలో మానవ సంబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెంకట్ రమణ, మౌనిక , సౌమ్య , మల్లేశ్వరి ,,యం.నగేష్ బాబు , రోశిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డ్రమ్స్ రాము సంగీతమందిస్తున్నారు. -
'కాంతార 1'లో ఇంత పొరపాటు ఎలా చేశారు?
ఎంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, ట్రోల్ చేద్దామా అని చూస్తుంటారు. రాజమౌళి లాంటి దర్శకులు దీనికి భయపడి ఏళ్లపాటు సినిమాని ఫెర్ఫెక్ట్గా వచ్చే వరకు తీస్తుంటారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు 'కాంతార 1'లో చాలా పెద్ద పొరపాటుని నెటిజన్లు బయటపెట్టారు. ఆ సంగతి ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.2022లో వచ్చిన 'కాంతార' సినిమాని ప్రస్తుతం జరుగుతున్నట్లు తీశారు. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1'ని మాత్రం 16వ శతాబ్దంలో జరిగే కథగా తెరకెక్కించారు. అందుకు తగ్గట్లే అడవిలో సెట్ వర్క్ గానీ, పాత్రధారుల కాస్ట్యూమ్స్ గానీ ప్రతిదీ చాలా చక్కగా చూపించారు. కానీ ఒక్కచోట మాత్రం మూవీ టీమ్ దొరికిపోయింది. అందరూ దీన్ని కనిపెట్టకపోవచ్చు గానీ కొందరు నెటిజన్లు మాత్రం తప్పుని పట్టేశారు.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)సెకండాఫ్లో 'బ్రహ్మకలశ' అనే పాట ఉంటుంది. గూడెంలో ఉండే దేవుడిని రాజు ఉండే చోటుకి తీసుకొచ్చే సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఈ పాటలో కాంతార అలియాస్ రిషభ్ శెట్టి తమ దేవుడిని తలపై పెట్టుకుని తీసుకురావడం, తర్వాత స్నానమాచరించి పూజలు చేయడం.. ఇలా అంతా చూపించారు. అయితే అందరూ కలిసి కింద కూర్చుని భోజన చేస్తున్న సన్నివేశంలో మాత్రం ఓ చోట 20 లీటర్ల ప్లాస్టిక్ క్యాన్ కనిపించింది. షూటింగ్ చేస్తున్నప్పుడు దీన్ని అక్కడి నుంచి తీయడం మర్చిపోయినట్లున్నారు. అది ఇప్పుడు మూవీలో, రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన వీడియో సాంగ్లో కనిపించింది.వీడియో సాంగ్లో సరిగ్గా 3:06 నిమిషాల ఈ పొరపాటుని మీరు గమనించొచ్చు. దీన్ని మరీ అంతలా ట్రోల్ చేయడం లేదు గానీ ఫన్నీగానే 16వ శతాబ్దంలో వాటర్ క్యాన్ ఎలా వచ్చిందబ్బా అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: Bigg Boss 9: వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్) -
ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ నటి
తెలుగు సీరియల్ నటి గుడ్ న్యూస్ చెప్పేసింది. ఆమెనే 'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నె. పదిరోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈమె.. ఇప్పుడు ప్రియుడిని పరిచయం చేసింది. ఇద్దరు జంటగా, రొమాంటిక్గా దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తోటీ నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ దీప్తి ప్రియుడు ఎవరు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)తెలుగులో సీరియల్స్ అనగానే కన్నడ నటులే గుర్తొస్తారు. అలాంటి వాళ్లలో దీప్తి మన్నె ఒకరు. బెంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ తొలుత కన్నడలో సీరియల్స్, సినిమాలు చేసింది. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గత కొన్నేళ్లలో 'రాధమ్మ కూతురు', 'జగద్ధాత్రి', 'పద్మావతి' తదితర సీరియల్స్ చేసింది. ఇక సెలవ్ అనే తెలుగు మూవీతో పాటు యెవన్, దేవదాస్ బ్రదర్స్, కర్త, హింగ్యాకే, నమ్మూర హైక్లు అనే కన్నడ చిత్రాల్లో నటించింది.ప్రస్తుతం తాను రోహన్తో ప్రేమలో ఉన్నానని దీప్తి.. ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఇతడికి ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు తెలుస్తోంది. 'డియర్ రోహన్. నీ కోసమే ఇన్నాళ్లుగా నేను ఎదురుచూస్తున్నాను. నాకు దక్కిన మరపురాని బహుమతి నువ్వు. నన్ను కోరుకున్నందుకు థ్యాంక్యూ. ఐ లవ్ యూ' అని ప్రియుడి గురించి దీప్తి చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే పరిచయం చేసింది. త్వరలో నిశ్చితార్థం, పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. బహుశా ఈ ఏడాది పూర్తయ్యేలోపు శుభకార్యాలు చేస్తారేమో!(ఇదీ చదవండి: నిజ జీవితంలో అమ్మాయిల పిచ్చి ఉందా?.. సిద్ధు షాక్!) -
నిజ జీవితంలో అమ్మాయిల పిచ్చి ఉందా?.. సిద్ధు షాక్!
డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ అయ్యాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). టిల్లు స్క్వేర్తో మరో పెద్ద హిట్ అందుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన జాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఇప్పుడు తెలుసు కదా చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సోమవారం (అక్టోబర్ 13) చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమించారా?ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హీరో సిద్ధుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. రియల్ లైఫ్లో మీరు స్త్రీలోలుడా? టీనేజ్లో ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించడం లాంటివేమైనా చేశారా? అని ఓ మహిళా విలేఖరి ప్రశ్నించింది. అది విని సిద్ధుకు మండిపోయింది. ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని కోప్పడ్డాడు. ఈ మధ్యే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్పైనా సదరు మహిళా జర్నలిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళ హీరోను కించపరుస్తూ..మీరు హీరోలానే ఉండరు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే.. అది మీ హార్డ్ వర్కా? లేక అదృష్టమా? అని ప్రశ్నించారు. వెంటనే శరత్ కుమార్ మైక్ అందుకుని ఆమె ప్రశ్నను తప్పుపడుతూ కౌంటరిచ్చాడు. కిరణ్ అబ్బవరం సైతం స్పందిస్తూ... పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను అలా కించపరిచే ప్రశ్నలు అడగొద్దని విజ్ఞప్తి చేశాడు. బిగ్బాస్ షోలో నాగార్జున సైతం.. ప్రదీప్ను రజనీకాంత్, ధనుష్తో పోలుస్తూ అతడు ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి ఎదుగుతాడని మెచ్చుకున్నాడు.చదవండి: యూరిన్ తాగి 48 రోజులు బతికాడు: హీరో -
సిద్ధు 'తెలుసు కదా' ట్రైలర్ రిలీజ్
'డీజే టిల్లు' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'తెలుసు కదా'. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు కాగా.. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం(అక్టోబరు 17) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)ట్రైలర్లో అయితే స్టోరీ ఏంటనేది అస్సలు రివీల్ చేయలేదు. ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి. ప్రేమించిన వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు అనుకునే మనస్తత్వం. అలాంటిది ఇద్దరమ్మాయిలతో రిలేషన్లోకి వెళ్తాడు. వాళ్లిద్దరూ కలిసి అంటే ముగ్గురు జర్నీ చేస్తారు? ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగింది? అనేదే తెలియాలంటే మూవీ చూడాలి. చూస్తుంటే రెగ్యులర్ లవ్ స్టోరీలా అయితే అనిపించట్లేదు. మరి సిద్ధు ఈసారి ఏం చేస్తాడో చూడాలి?ఈ సినిమాతో పాటు ఇదే వీకెండ్లో మరో మూడు మూవీస్ కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. అవే 'మిత్రమండలి', 'డ్యూడ్', 'కె ర్యాంప్'. ఈ చిత్రాల ట్రైలర్స్ ఇప్పటికే రిలీజ్ కాగా, ఇవి కూడా బాగానే అనిపించాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుంది? ప్రేక్షకుల మనసు ఏది గెలుచుకుంటుందనేది చూడాలి? గత నెలలో టాలీవుడ్కి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు రాబోయే సినిమాల బట్టి ఈనెల కూడా కలిసొస్తుందా లేదా అనేది తేలుతుంది.(ఇదీ చదవండి: సాయంత్రం 6 గంటలకే వచ్చాడుగా ఏమైంది? మురుగకి సల్మాన్ కౌంటర్) -
యూరిన్ తాగి 48 రోజులు బతికాడు: హీరో
కోలీవుడ్ హీరో హరీశ్ కల్యాణ్ (Harish Kalyan), అతుల్య రవి జంటగా నటించిన చిత్రం 'డీజిల్' (Diesel Movie). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ 2022లోనే పూర్తయింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్కు నోచుకుంది. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కాబోతోంది. పార్కింగ్, లబ్బర్ పండు మూవీతో హిట్లు అందుకున్న హరీశ్.. ఈ సినిమాతో ముచ్చటగా మూడో హిట్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు.షూటింగ్కు ముందు ప్రిపరేషన్ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించాడు. హరీశ్ కల్యాణ్ మాట్లాడుతూ.. డీజిల్ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి ముందు రెండుమూడు రోజులు సముద్రతీరానికి వెళ్లాం. ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు సముద్రంలోకి కూడా వెళ్లొచ్చాం. అప్పుడు 70 ఏళ్ల మత్య్సకారుడు నాకో విషయం చెప్పాడు. జీవితం విలువ తెలిసొచ్చిందికొన్నేళ్ల క్రితం ఓ తుపాను వల్ల అతడి పడవ సముద్రంలో నెల రోజులకు పైగా చిక్కుకుపోయింది. తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దువైపు లాక్కొనిపోయింది. బక్కచిక్కిపోయి పీలగా మారినప్పటికీ ప్రాణాలతోనే బతికిబయటపడ్డాడు. సముద్రంలో ఉన్న 48 రోజులు అతడు తన యూరిన్ తాగి ప్రాణాలు కాపాడుకున్నాడు. సముద్రపు నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకని ఆ పని చేశాడు. అతడు చెప్పింది విన్నాక జీవితం విలువ మరింత తెలిసొచ్చింది అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి -
దీపిక అడిగింది ఇవ్వాల్సిందే!: అర్జున్ రెడ్డి బ్యూటీ
మిగతా ఇండస్ట్రీల మాదిరిగా సినీ పరిశ్రమ ఓ పద్ధతి ప్రకారం లేదు. ఇక్కడ పనిగంటలు కరెక్ట్గా ఉండవు. అన్నిచోట్లా ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఎనిమిది గంటలు పనిచేసే విధానాన్ని అనుసరించాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. చిన్న, మధ్యతరహా సినిమాలకు ఈ డిమాండ్లు సెట్ అవుతాయేమో కానీ భారీ బడ్జెట్ చిత్రాలకు వీటిని ఫాలో అవడం కష్టం!దీపికా.. నాకు చాలా ఇష్టంఈ కారణం వల్లే స్పిరిట్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు దీపిక చేజారిపోయాయి. దీపిక డిమాండ్ గురించి తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకు దీపికా పదుకొణె అంటే చాలా ఇష్టం. స్కూల్లో చదువుకునే రోజుల నుంచి తనను చూస్తున్నాను. ఆమె జర్నీని ఫాలో అయ్యాను. తనొక గొప్ప యాక్టర్. తనకు ఏది అవసరమో దాని గురించి నిర్భయంగా మాట్లాడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని నొక్కి చెప్పింది. తనవల్లే మేమందరం మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాం. సినిమాతను కోరుకున్నది తనకు దక్కాల్సిందేనని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. అటు కొంకణ సేన్ శర్మ మాట్లాడుతూ.. మేమేం సర్జరీ చేసే డాక్టర్స్ కాదు కదా.. మేమూ మనుషులమే! మాకూ చిన్నపాటి బ్రేక్స్ కావాలి అని పేర్కొంది. షాలిని పాండే తొలి చిత్రం అర్జున్ రెడ్డితో బాగా పాపులర్ అయింది. తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లోనూ తళుక్కుమని మెరిసింది. ధనుష్ ఇడ్లీ కొట్టు మూవీలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది.చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి -
'కె. ర్యాంప్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరోయిన్
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్గా గుర్తింపు పొందిన వారు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే జెనీలియా, భూమిక, అన్షు, లయ, రంభ, మీనా, విజయశాంతి,సంగీత వంటి హీరోయిన్లు రీఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొంతమంది మెప్పించారు కూడా. అయితే, తాజాగా ముంబై బ్యూటీ కామ్న జెఠ్మలానీ( Kamna Jethmalani) టాలీవుడ్లోకి మరో ఛాన్స్ కోసం వచ్చేసింది. కిరణ్ అబ్బవరం సినిమా కె.ర్యాంప్తో ప్రేక్షకులను పలకరించనుంది.2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణంతో బాగా పాపులర్ అయింది. అయితే, ఆ తర్వాత కింగ్, సైనికుడు వంటి సినిమాల్లో కనిపించినా పెద్దగా ప్రభావం చూపించలేదు. 2013లో చివరిగా శ్రీ జగద్గురు ఆది శంకర మూవీలో మాత్రమే కనిపించింది. సుమారు 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వెండితెరపైకి కామ్నా జెఠ్మలానీ రానుంది.కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ను వివాహం చేసుకుంది. సినిమా ఛాన్సుల కోసం ఈ విషయాన్ని కూడా ఆమె కొంత కాలం దాచింది. అయినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆమె కె.ర్యాంప్తో వస్తుంది. అయితే, ఎంతమాత్రం విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.రీసెంట్గా జూనియర్ సినిమాతో జెనీలియా మెప్పించింది. కానీ, తమ్ముడు సినిమాలో లయ పాత్ర అంతగా క్లిక్ కాలేదని చెప్పాలి. మరోవైపు సంగీత మాత్రం రీఎంట్రీలో చాలా సినిమాలతో అదరగొట్టేస్తుంది. అయితే.., భూమిక, మీరా జాస్మిన్, సదా వంటి స్టార్స్ ఇప్పటికే గట్టిపోటీ ఇచ్చేందుకు రేసులో ఉన్నారు. -
ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి (Madhuri Divvala). ఒకరు నాకెదురొచ్చినా వారికే రిస్క్.. నేను వారికి ఎదురెళ్లినా వారికే రిస్క్ అంటూ హౌస్మేట్స్కు వార్నింగ్ ఇస్తూనే ఇంట్లో అడుగుపెట్టింది. అంతేగాకుండా ఇకపై తన పేరు దివ్వెల కాదు దువ్వాడ మాధురి అని ప్రకటించింది. హౌస్లో అడుగుపెట్టి ఒక పూటయిందో, లేదో.. అప్పుడే గొడవలు మొదలుపెట్టేసింది.కెప్టెన్తో గొడవకిచెన్లో పని చేస్తున్న మాధురిని కూర్చోమన్నాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు కూర్చోమంటూ గౌరవంతో కుర్చీ ఆమెవైపుకు జరిపాడు. అందులోనూ పెడార్థం వెతికింది మాధురి. నేను వెళ్లాలి.. కూర్చోకపోతే ఊరుకోరా? అని అడిగింది. అప్పటికీ కల్యాణ్ ఎంతో ఓపికగా.. ఈరోజు వంట చాలా లేట్ అయింది.. రేపటినుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని సుతిమెత్తగా హెచ్చరించాడు. ఎవర్నీ లెక్క చేయని మాధురినేను అరగంట కూర్చున్నాను. అప్పుడు లేట్ అవుతుందని తెలియదా? అప్పుడేం చేశారు? అని తిరిగి కెప్టెన్నే తప్పుపట్టింది మాధురి. మీరిలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అని వార్నింగ్ ఇచ్చాడు కల్యాణ్. దీంతో దివ్య మధ్యలో కలగజేసుకుని వంట ఆలస్యమవుతుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె వినిపించుకుంటేగా! అస్సలు లెక్కచేయలేదు. నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందన్న కల్యాణ్ మాటల్ని మాత్రం బలంగా పట్టుకుంది. ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్?అందుకు కల్యాణ్.. నేను గౌరవంతో కూర్చోమని చెప్పాను.. అందుకామె వెటకారంగా మాట్లాడటం అవసరమా? అని వాదించాడు. ఏయ్.. వాయిస్ ఎందుకు లేస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్? అని మాధురి కల్యాణ్పై కోప్పడింది. అందరిపై అరిచేసిన మాధురి చివర్లో మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. అనాల్సిన మాటలన్నీ అనేసి లాస్ట్లో ఏడవడం దేనికని కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. ఫైర్ బ్రాండ్ అనుకున్న మాధురి అప్పుడే కన్నీటి కుళాయి తిప్పడం.. చూసేవారికి కాస్త విడ్డూరంగానే కనిపిస్తోంది. చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్: రికార్డు సృష్టించిన లాపతా లేడీస్.. ఏకంగా -
ఓటీటీలో ‘జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ’ ఫైనల్ స్ట్రీమింగ్
జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఫైనల్ సిరీస్ "జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ" ఓటీటీలో విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ యానిమేటెడ్ సిరీస్గా నెట్ఫ్లిక్స్లో నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్ డైనోసార్లు మనుషుల ప్రపంచంలోకి వచ్చిన తర్వాత జరిగే సంఘటనల గురించి తెలియజేస్తుంది. మొదటి సీజన్లో, బ్రూక్లిన్, సోయోనా శాంటోస్ వంటి పాత్రలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇందులో కూడా వారు కొనసాగనున్నారు. ఈ సిరీస్ ప్రధానంగా వినోదం, స్నేహం, డైనోసార్ల గురించి ఉంటుంది. "జురాసిక్ పార్క్" ఫ్రాంచైజీలో భాగం, డ్రీమ్వర్క్స్ యానిమేషన్ ద్వారా ఈ సిరీస్ను తెరకెక్కించారు. -
పెళ్లి కోసం 15ఏళ్లు ఆగాము.. ఎందుకంటే: కీర్తి సురేశ్
కీర్తి సురేశ్(Keerthy Suresh) తాను ప్రేమించిన ఆంథోనీ తటిల్తో గతేడాది వివాహం అయింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొచ్చి, చెన్నైలలో ఆంథోనికి వ్యాపారాలున్నాయి. కాలేజీ రోజుల్లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. అలా 15 ఏళ్ల పాటు రహస్యంగా ఉన్న వారి ప్రేమ.. పెళ్లితోనే ప్రపంచానికి చెప్పారు. అయితే, పెళ్లి కోసం అంత సమయం ఎందుకు ఆగాల్సి వచ్చిందో తాజాగా కీర్తి చెప్పింది.ప్రముఖ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ఒక టాక్ షోలో కీర్తి సురేశ్ తన పెళ్లి, ప్రేమ గురించి ఇలా చెప్పింది. 'పెళ్లి విషయంలో మేము కావాలనే సమయం తీసుకున్నాం. కాలేజీ రోజుల్లోనే (2010) ప్రేమలో పడ్డాం. కానీ, ముందు నా చదువు పూర్తి కావాలని ఆలోచించాను. కెరీర్ పరంగా ఎటువైపు అనేది కూడా ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేదు. కానీ, జీవితంలో ఇద్దరం స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే, గత ఆరేళ్లుగా నేను సినిమాలతో బిజీగా ఉన్నాను. తను ఖతార్లో ఉన్నాడు. అక్కడ ఆయిల్ పరిశ్రమలో వ్యాపారం చూసుకునే వాడు. ఇప్పుడు ఓకే పెళ్లి గురించి ఇంట్లో చెబుదామని అనుకున్నాం. కానీ, ఇంట్లో రిలీజియన్ (మతం)గురించి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయని కూడా భయపడ్డాను. అయినప్పటికీ ఒకరోజు మా నాన్న దగ్గరికి వెళ్లి ఆంథోనీ గురించి చెప్పాను. ఆ సమయంలో నాన్న నుంచి ఎలాంటి వ్యతిరేఖత రాలేదు. సింపుల్గానే పెళ్లికి ఒప్పుకున్నారు. నాలుగేళ్ల క్రితమే తన ప్రేమ విషయాన్ని నాన్నతో చెప్పాను.' అని కీర్తి గుర్తు చేసుకుంది. -
నేను కూర్చుంటే లేచి వెళ్లిపోయేవారు.. పవన్-రీతూల లవ్ట్రాక్ ఫేక్!
బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) ఐదోవారం ఎలిమినేషన్ పూర్తయింది. జనాల ఓటింగ్స్ తక్కువ రావడంతో ఫ్లోరా ఎలిమినేట్ అయింది. స్వయంకృతపరాధం + వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ వల్ల శ్రీజ (Srija Dammu) ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత వీరిద్దరూ నటుడు శివాజీ హోస్ట్ చేస్తున్న బిగ్బాస్ బజ్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఎంత టార్చర్ చేస్తే..ఈ సందర్భంగా శివాజీ.. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నది మనసులో బలంగా పెట్టుకున్నావని, నీకు అదే పెద్ద మైనస్ అయిందని శ్రీజకు చెప్పాడు. ఇక శ్రీజ.. ఒక మనిషిని నువ్వు నెగెటివ్.. నెగెటివ్.. నువ్వు ఎవరికీ సెట్ కావు, నీతో మాట్లాడకూడదు అంటే ఆటోమేటిక్గా ఎక్కడో డౌన్ అవుతాం. పైగా నేను కొందరి దగ్గర కూర్చుంటే వాళ్లు అక్కడుండేవారు కాదు, వెళ్లిపోయేవారు అని తెలిపింది. అందుకు శివాజీ.. హౌస్మేట్స్ నిన్ను చూసి పారిపోతున్నారంటే ఆ రెండువారాలు ఎంత టార్చర్ చేసుంటావు? అని కౌంటరిచ్చాడు.కంటెంట్ కోసం లవ్ ట్రాక్డిమాన్ పవన్ (Demon Pawan) గురించి చెప్తూ.. 'నేను వెళ్తే లవ్ యాంగిల్ ఏదైనా ట్రై చేయొచ్చు, నాకు లవ్ యాంగిల్ వేయొచ్చేమో.. అని డిమాన్ బిగ్బాస్కు వెళ్లేముందు నాతో అన్నాడు. కంటెంట్ కోసం అలా చేస్తున్నాడు!' అంటూ పవన్-రీతూల లవ్ యాంగిల్ ఫేక్ అని బయటపెట్టింది. నిజానికి హౌస్లో డిమాన్ పవన్ గేమ్ చాలా బాగా ఆడతాడు. కానీ రీతూతో లవ్ ట్రాక్ వల్ల తనపై అనవసరమైన నెగెటివిటీ వస్తోంది. తను ఎంత కష్టపడ్డా సరే అది హైలైట్ కాకుండా పోతోంది. పవన్కు ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్ అయిన శ్రీజ.. అతడిది ప్రీప్లాన్డ్ లవ్ ట్రాక్ అని బయటపెట్టింది.చదవండి: 'నువ్వే కావాలి'@25.. ఒక ట్రెండ్ సెట్టర్.. కానీ, వదిలేసిన స్టార్ హీరో -
అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. కారణం సంధ్య థియేటర్ ఘటనేనా?
టాలీవుడ్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. చిరు మినహా మిగిలిన అందరికీ వారసత్వంగా ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా సొంతంగా తన అభిమానుల సైన్యాన్ని రెడీ చేసుకోనున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చాలామందిని ఉత్సుకతను రేకెత్తించింది.ఇప్పటివరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మెగా అభిమాన సంఘాల ద్వారానే పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ, మెగా ప్యాన్స్ పలుమార్లు ఇప్పటికీ కూడా బన్నీ సినిమాలతో పాటు ఆయన్ను కూడా ట్రోల్స్ చేయడం జరుగుతూనే ఉంది. దీంతో బన్నీ అభిమానులు కూడా తమ శక్తికి మించి వారికి కౌంటర్స్ ఇస్తున్నారు. ఇప్పడు తమకంటూ ఒక ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండాలని వారు భావించినట్లు ఉన్నారు. అందుకే "Allu Arjun Fans Association" పేరుతో ఒక సంఘం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా కమిటీ సభ్యులను ఎన్నుకుంది.సంధ్య థియేటర్ ఘటనతో మార్పుఅల్లు అర్జున్కు టాలీవుడ్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఉన్న యూత్లో ఎక్కువ మంది ఆయన్ను అభిమానించే వారే ఉన్నారని చెప్పవచ్చు. కానీ, పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తనకు అండగా ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. ఈ కేసులో అరెస్టు అయినప్పుడు అల్లు అర్జున్ సరైన అభిమానుల సంఘం అవసరాన్ని గ్రహించాడని కొందరు చెబుతారు. పెద్ద సంఖ్యలో వ్యవస్థీకృత అనుచరులతో కూడిన ఒక టీమ్ తనకు అవసరమని ఆయన గుర్తించినట్లు ఇండస్ట్రీలోని తన సన్నిహితులు చెబుతున్నారు. ఆ సమయంలో బన్నీకి అధికారికంగా అభిమానుల సంఘం లేదు. దీంతో అతని తరుపున ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని సమర్థవంతంగా రీచ్ చేసేవారు లేరు. ఈ సంఘటనను ఛాన్స్గా తీసుకున్న కొందరు అతనిపై సోషల్మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. దీంతో ట్రోల్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. అదే టైమ్లో తనకు కూడా ఒక బలమైన సంఘం ఉండుంటే ఇలా జరిగేది కాదని చెబుతారు. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా అల్లు అర్జున్ కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ప్లాన్ ఉన్నట్లు సమాచారం. తనను అభిమానించే వారి కుటుంబాలకు తనవంతుగా సాయం చేసేందుకు ముందు వరుసలో ఉండాలనే ప్లాన్తో ఆయన ఉన్నారట.ఎన్టీఆర్ కోసం యుద్ధమే చేసిన అభిమాన సంఘాలుసినిమా హీరోలకు ఏదైనా సమస్య వస్తే మొదటి బలంగా గొంతు ఎత్తేది అభిమాన సంఘాలే... రీసెంట్గా ఎన్టీఆర్- అనంతపురం అర్బన్ ఎమ్మేల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదం గురించి చెప్పవచ్చు. తారక్ గురించి అతను చేసిన వ్యాఖ్యలకు ఆయన అభిమానులు విరుచుకుపడ్డారు. ఇప్పటికీ కూడా ఆ ఎమ్మేల్యే స్వేచ్ఛగా తిరగలేకుండా ఉన్నారు. అలా కొన్ని సందర్భాల్లో తమ హీరో కోసం వారు అండగా నిలబడుతారు.We are delighted to officially launch and announce the Allu Arjun Fans Association!Presenting the list of elected committee members of both AP & TS States who will serve for the upcoming term.Hearty congratulations and best wishes to all the members – may your journey ahead… pic.twitter.com/Ca2cJjg0Pr— Allu Arjun Fans Association (@AAFAOnline) October 12, 2025 -
గ్రాండ్మాస్టర్ అనంతన్తో సుమన్ కరాటే మెలకువలు
ప్రముఖ సినీ నటుడు సుమన్ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. తమిళం, తెలుగు, కన్నడలో 500కు పైగా చిత్రాల్లో నటించారు. సుమారు రెండు దశాబ్ధాలకు పైగానే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలతో అలరించిన ఆయనలో మరో ప్రత్యేకత ఉంది. సుమన్కు కరాటే, మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం పొందారు. ఈ విభాగంలో ఎన్నో పతకాలు గెలుచుకున్నారు. మార్షల్ ఆర్ట్స్లో రీసెంట్గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు కూడా.. తనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. అంతేకాక గోపాల్ గురుక్కళ్ వద్ద కలరిపయట్టు అభ్యసించారు. అయితే, 65ఏళ్ల వయసులో కూడా ఆయన కరాటే యుద్ధ కళలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సుమన్ ప్రస్తుతం ఊటీలో ఉన్నారు. మలేషియాకు చెందిన గ్రాండ్మాస్టర్ అనంతన్ వద్ద కరాటేలో ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రాండ్మాస్టర్ కె. అనంతన్ మలేషియాకు చెందిన అత్యంత ఆదరణ పొందిన మార్షల్ ఆర్టిస్ట్ కావాడం విశేషం. అతను ఒకినావా గోజు ర్యు కరాటే దో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ మలేషియాకు అధిపతిగా ఉన్నారు. గతంలో కూడా ఆయన నుంచి సుమన్ కొన్ని మెలుకువలు నేర్చుకున్నారు. అలా వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. -
'నువ్వే కావాలి'@25.. ఒక ట్రెండ్ సెట్టర్.. కానీ, వదిలేసిన స్టార్ హీరో
తెలుగు సినిమా చరిత్రలో ‘నువ్వే కావాలి’ సినిమా చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2000 సమయంలోని యూత్కు ఈ సినిమాతో ఎన్నో తీపి గుర్తులు తప్పకుండా ఉంటాయని చెప్పవచ్చు. ఆ సమయంలో యూత్ను బాగా ఆకర్షించిన చిత్రాల్లో నువ్వే కావాలి ముందు వరుసలో ఉంటుంది. కె.విజయభాస్కర్ దర్శకత్వానికి త్రివిక్రమ్ రచనా శైలి మరింత బలాన్ని ఇచ్చింది. ఆపై కోటి అందించిన అద్భుతమైన సంగీతం ఇప్పటి తరం యూత్ను కూడా మెప్పిస్తుంది.తరుణ్ బాల నటుడిగా దాదాపు 30 సినిమాలు చేశాడు. కానీ, హీరోగా ఆయనకు ఇదే తొలి సినిమా.. హీరోయిన్గా రిచా నటించగా మరో కీలకమైన పాత్రలో సాయి కిరణ్ నటించారు. మలయాళంలో భారీ విజయం సాధించిన ‘నిరం’ చిత్రానికి రీమేక్గా నువ్వే కావాలి తెలుగులో విడుదలైంది. అయితే, ఈ మూవీ ఇక్కడ కూడా కొన్ని థియేటర్స్లలో 400 రోజులు కూడా ఆడింది. 20 సెంటర్స్కు పైగానే 200రోజులు పాటు రన్ అయింది. ఆరు సెంటర్స్లలో 365రోజులు ప్రదిర్శించారు.ఈ చిత్రం అక్టోబరు 13, 2000న విడుదలైంది. మొదట్లో ఈ చిత్రానికి తక్కువ థియేటర్లే దక్కాయి. హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండి ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు. సుమారు మూడు కోట్లమందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసినట్లు ఒక అంచనా. రూ. 1.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్ర విజయంతో స్రవంతి రవికిషోర్ ఆర్థిక కష్టాలు కూడా తీరిపోయాయని చెబుతారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు.ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ మహేష్ బాబు ఈ సినిమా హీరో ఎంపిక ఎలా జరిగిందో గతంలో నిర్మాత రవికిషోర్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ఒక మంచి యువ నటుడితో బడ్జెట్లో సినిమా తీసి లాభాలు అందుకోవాలని రవికిషోర్ ఆలోచన. అప్పుడే మహేష్ బాబు కథానాయకుడిగా ప్రవేశించారు. రాజకుమారుడు సినిమా విడుదలై యువరాజు షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలోనే 'నిరం' చిత్రం చూడమని మేకర్స్ ప్రింట్ పంపించారు. రెండు నెలలయినా ఆయన నుంచి స్పందన రాలేదు. రెండో ప్రత్యామ్నాయంగా సుమంత్ అనుకున్నారు. కానీ సుమంత్ అప్పటికే యువకుడు, పెళ్ళిసంబంధం చిత్రాల్లో నటిస్తూ ఖాళీ లేకుండా ఉన్నాడు. తర్వాత రాం గోపాల్ వర్మ హిందీ సినిమా మస్త్లో నటిస్తున్న ఆఫ్తాబ్ శివదాసానీని కూడా పరిశీలించారు. అయితే, తమ బడ్జెట్లో అయ్యేలా కనిపించలేదు. చివరగా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని రవికిషోర్ నిర్ణయించుకున్నాడు. బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ పెద్దయిన తర్వాత ఒక వ్యాపార ప్రకటనలో కనిపించాడు. తరుణ్ కుటుంబం కూడా అతన్ని కథానాయకుడిగా ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే రవికిషోర్ తమ సినిమాను గురించి చెప్పి అతన్ని ఒప్పించారు. ఆ సినిమాకు తరుణ్ పారితోషికం రూ. 3 లక్షలు. కథానాయిక కోసం చాలా వెతుకులాట జరిగింది. చివరికి వద్దనుకున్న ఫోటోల్లో మళ్ళీ వెతుకుతుంటే రిచా సరిపోతుందనిపించింది. రెండో కథానాయకుడిగా గాయకుడు రామకృష్ణ కొడుకు సాయికిరణ్ను ఎంచుకున్నారు.సినీ ట్రెండ్ సెట్టర్: ఈ చిత్రం తెలుగు ప్రేమకథా చిత్రాల ధోరణిని మార్చిన సినిమా. వాస్తవికత, సహజమైన సంభాషణలు, యువతరాన్ని ఆకట్టుకునే కథనంతో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఈ సినిమా తరుణ్, త్రివిక్రమ్, విజయభాస్కర్, కోటి వంటి ప్రతిభావంతుల కెరీర్కు మైలురాయిగా నిలిచింది. హిందీ రీమేక్: ఈ సినిమా తుఝే మేరీ కసమ్ అనే పేరుతో హిందీలో పునర్నిర్మించబడింది, ఇందులో జెనీలియా, రితేష్ దేశ్ముఖ్ నటించారు.‘నువ్వే కావాలి’ సినిమాకు జాతీయ అవార్డు లభించింది. ఇది 2000 సంవత్సరానికి ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది.నంది అవార్డులు:- ఉత్తమ కథానాయకుడు – తరుణ్- ఉత్తమ కథానాయిక – రిచా పల్లోడ్- ఉత్తమ దర్శకుడు – కె. విజయభాస్కర్- ఉత్తమ రచయిత – త్రివిక్రమ్ శ్రీనివాస్- ఉత్తమ సంగీత దర్శకుడు – కోటి- ఉత్తమ చిత్రం – ఉషాకిరణ్ మూవీస్ -
ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేస్తే..!
అనీష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఓటీపీ’. ‘ఓవర్... టార్చర్... ప్రెజర్’ అనేది ఉపశీర్షిక. జాన్విక, స్వరూపిణి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించగా, రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్.‘ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేశానండి...’, ‘అంటే... ఒకరికి తెలియకుండా మరొకరిని...’, ‘అరె... మామ బ్రేకప్ అనగానే ఊపిరాడట్లేదురా నాకు’ అనే డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘ఈ చిత్రంలో తండ్రీకొడుకుల ఎమోషన్ కొత్తగా ఉంటుంది. మా ‘లవ్ ఓటీపీ’ సినిమాతో ఎవరూ ఊహించని ఎంటర్టైన్మెంట్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం’’ అని చెప్పారు నిర్మాత విజయ్ .యం రెడ్డి. -
మా అమ్మ కల నిజమైంది: నిర్మాత మల్లికార్జున
రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్ ప్రధాన పాత్రధారులుగా నటించిన సినిమా ‘మటన్ సూప్’. రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో మల్లికార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. ఈ సందర్భంగా మల్లికార్జున ఎలికా మాట్లాడుతూ– ‘‘మటన్ సూప్’కి నేను ఓ కో డైరెక్టర్గా వచ్చాను. రామచంద్ర ప్యాషన్ చూసి, ఈ సినిమా నిర్మించాను.ప్రేక్షకుల స్పందన చూస్తుంటే మేం పడ్డ కష్టాన్ని ఇట్టే మర్చిపోయాం. మా సినిమా స్క్రీన్ ప్లే చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నా దర్శకత్వంలో ఓ హారర్ మూవీ చేస్తున్నాను. అలాగే రామచంద్రతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నేను సినిమాలు చేయాలని, స్క్రీన్పై నా పేరు కనిపించాలని మా అమ్మగారు కలలు కన్నారు. ‘మటన్ సూప్’తో ఆ కల నిజమైంది. కానీ ఇప్పుడు ఇది చూడటానికి మా అమ్మగారు లేకపోవడం చాలా బాధగా ఉంది’’ అని చెప్పారు. -
ఆలోచింపజేసేలా...
రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఒక మంచి ప్రేమకథ’(Oka Manchi Prema Katha) . ఈ సినిమాకు కథ, మాటలు, పాటలను ఓల్గా అందించగా, అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించారు. హిమాంశు పోపూరి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రోహిణి ముల్లేటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పాత్రను చూస్తే, ఆడియన్స్ కోప్పడతారు’’ అని అన్నారు.‘‘ఇరవైఏళ్ల క్రితం కుటుంబరావు, ఓల్గాగార్లు ఓ సినిమా కోసం నన్ను అ్రపోచ్ అయ్యారు. అప్పుడు అది కుదర్లేదు. ఇప్పుడు ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నా మనసుని హత్తుకుంది’’ అని పేర్కొన్నారు రోహిణి హట్టంగడి. ‘‘అందరిలోనూ ఓ ఆలోచనను రేకెత్తించేలా ఈ సినిమాను తెరకెక్కించాను. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆడియన్స్ను నవ్విస్తూ, ఏడిపించేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని తెలిపారు అక్కినేని కుటుంబరావు.‘‘ఈ సినిమాలో నేను కూడా ఓ రోల్ చేశాను. అందరికీ నచ్చే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు హిమాంశు. ‘‘మంచి సినిమా రావాలని కోరుకునే ఆర్టిస్టులు మాకు దొరకడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఓల్గా. సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్, ఈటీవీ విన్ ప్రతినిధులు సంధ్య, నితిన్ మాట్లాడారు. -
తన గోతిలో తనే పడ్డ శ్రీజ.. ఆడపులి రెమ్యునరేషన్ ఎంతంటే?
వరుసగా సామాన్యులను బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తున్నారు. మనీష్, ప్రియ, హరిత హరీశ్.. ఇప్పుడు శ్రీజ! అందదరూ తమ చేతులారా ఎలిమినేషన్ను కొనితెచ్చుకున్నవాళ్లే! మొదటి రెండువారాల్లో శ్రీజను చూసిన జనాలు ఈమె ఎప్పుడు వెళ్లిపోతుందిరా బాబూ.. నోరేసుకుని పడిపోతుంది! అని అసహనం వ్యక్తం చేశారు. శ్రీజ ఎలిమినేట్ కావాల్సిందే! అని బలంగా కోరుకున్నారు.అన్ఫెయిర్ ఎలిమినేషన్కానీ ఇప్పుడు సీన్ మారింది. శ్రీజ (Srija Dammu) ఎలిమినేషన్ను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది కదా విజయం అంటే! తన తప్పులు తెలుసుకుంది. నాగార్జున చెప్పిన హింట్స్ను, వీకెండ్లో స్టూడియోలో జనాల రెస్పాన్స్ను అన్నింటినీ శ్రద్ధగా గమనించింది. ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చింది.వరస్ట్ నుంచి తోపు కంటెస్టెంట్గా..అరవడం తగ్గించింది. అవసరమైనచోట మాత్రం ఆడపులిలా నిలబడి మాట్లాడింది. ఆటలో అయితే ఆడ,మగ తేడా లేకుండా అందరిపైనా విరుచుకుపడింది. గెలుపొక్కటే నా లక్ష్యం అన్నచందంగా ఆడింది. చెత్త కంటెస్టెంట్ నుంచి తోపు కంటెస్టెంట్గా నిలిచింది. స్నేహితుడు పవన్ కల్యాణ్కు ఇచ్చిన మాట ప్రకారం అతడిని కెప్టెన్ను చేసింది. ఈ క్రమంలో తనే బలిపశువైంది. గతవారం ఇంటిసభ్యులను జంటలుగా విడిపోమంటే శ్రీజ అతి తెలివితో కల్యాణ్తో జత కట్టలేదు. వైల్డ్కార్డ్స్ వల్ల గేమ్ నుంచి అవుట్ఒకే జట్టుగా ఉంటే అందరికీ ఈజీ టార్గెట్ అయిపోతామని.. చివర్లో మనిద్దర్లో ఒకరికి మాత్రమే ఏదైనా మంచి జరిగే ఛాన్స్ ఉందని చెప్పింది. అలా పవన్.. తనూజతో, శ్రీజ.. సుమన్తో జత కట్టింది. గేమ్స్ అన్నీ అయిపోయేసరికి పవన్-తనూజ జట్టు సేఫ్ అయ్యారు. శ్రీజ-సుమన్ డేంజర్ జోన్లో పడ్డారు. తన స్ట్రాటజీ వల్ల పవన్కు కలిసొచ్చింది కానీ శ్రీజ చిక్కులో పడింది. ఇప్పుడేకంగా వైల్డ్ కార్డ్స్ ఆమెను గడ్డిపోచలా ఆటలో నుంచి తీసేశారు. ఆడపులి రెమ్యునరేషన్గెలిచే వస్తానని కొండంత ఆశలు పెట్టుకున్న శ్రీజకు ఇది జీర్ణించుకోలేని విషయం. ఏదేమైనా తిట్టిన నోళ్లతోనే ఆడపులి అని పిలిపించుకోవడమంటే ఆషామాషీ కాదు. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్న అందరిలాగే శ్రీజకు సైతం వారానికి రూ.60-70 వేల మేర రెమ్యునరేషన్ అందింది. ఈ లెక్కన ఐదు వారాలకుగానూ రూ.3 లక్షల నుంచి రూ. 3.50 లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: నాలుగేళ్లుగా శ్రీనివాస్తోనే బతుకుతున్నా.. నరకం చూడని రోజంటూ లేదు -
నాలుగేళ్లుగా శ్రీనివాస్తోనే బతుకుతున్నా.. నరకం చూడని రోజంటూ లేదు!
బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో దివ్వెల మాధురి (Madhuri Divvala) వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే బంధాలు, బంధుత్వాలు జాన్తానై.. ఆడేందుకు వచ్చా, గెలిచే పోతా అని ధీమాగా చెప్తోంది. అంతేకాదు, తన పేరును దువ్వాడ మాధురిగా మార్చేసుకుంది. తన ఇంట్రో వీడియోలో ఇంకా ఏమందంటే.. నాది ముక్కుసూటిగా ఉండేతత్వం.. అందుకే ఫైర్బ్రాండ్ అని పిలుస్తుంటారు. నాకు ఇంటర్లోనే పెళ్లి చేశారు. ఆరాధ్య, అర్హ, అఖిల.. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వీళ్లే నా ప్రపంచం.కలిసుందామని ప్రయత్నించా..మొదటినుంచీ నాకు, నా భర్తకు మధ్య అండర్స్టాండింగ్ తక్కువ. అయినా సరే కలిసుండేందుకు చాలా ఏళ్లు ప్రయత్నించాను. కానీ, అస్సలు కుదురలేదు. చివరకు విడిపోవాల్సి వచ్చింది. కుటుంబ సమస్యల వల్ల ఒంటరిగా మిగిలినప్పుడు అదే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారు ఒంటరిగా కనిపించారు. తనతో నా జర్నీ మొదలైంది. మాధురి అంటే శ్రీనివాస్.. శ్రీనివాస్ అంటే మాధురిగా నాలుగేళ్లుగా కలిసి బతుకుతున్నాం.అర్థమైందా రాజాఅయితే ఈ నాలుగేళ్లలో నేను నరకం చూడని రోజంటూ లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాలో నాపై నెగెటివ్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లలని చూడకుండా నా కూతుర్లని ట్రోల్ చేశారు. నిజంగా నేనేంటో మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడు దువ్వాడ మాధురి 2.0ని బిగ్బాస్ హౌస్లో చూస్తారు, అర్థమైందా రాజా.. అని ఇంట్రో వీడియోలో పేర్కొంది. ఆయన వద్దంటే షోకి రాకపోయేదాన్నినాగార్జున దగ్గర కూడా మాట్లాడుతూ.. సమాజమంతా ఒకవైపు నిలబడితే.. నేనొకవైపు నిలబడ్డాను. నా జీవితం నాకు నచ్చితే చాలు, ఎవరికీ నచ్చాల్సిన అవసరం లేదు. దాదాపు 80% మంది నన్ను అర్థం చేసుకున్నారు. ఇంకా 20% మంది ఎందుకు నాకు నెగెటివ్గా ఉండాలి. వారిని కూడా నావైపు తిప్పుకోవడానికే బిగ్బాస్ హౌస్కు వెళ్తున్నా.. దువ్వాడ శ్రీనివాస్ గారి కోసం ఏదైనా వదులుకుంటాను. ఆయన చెప్పారు కాబట్టే ఈ షోకి వచ్చాను. ఆయన వద్దని అభ్యంతరం చెప్పుంటే రాకుండా ఉండిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. మరి దువ్వాడ మాధురి హౌస్లో ఎలా ఉంటుంది? వైల్డ్ ఫైర్లా అగ్గి రాజేస్తుందా? అనేది చూడాలి!చదవండి: పవన్ను వదల్లేనంటూ రీతూ ఏడుపు.. పోయి హగ్ చేసుకోమన్న ఫ్లోరా -
ఆరోజు షూటింగ్కి వెళ్లా.. నాన్న చనిపోయారు: రమ్య మోక్ష
బిగ్బాస్ 9లో ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా రమ్య మోక్ష (Ramya Moksha) హౌస్లో అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ బ్యూటీ.. తన జర్నీ గురించి ఏవీ వీడియోలో చెప్పుకొచ్చింది. రాజమండ్రిలో రోజ్మిల్క్ ఎంత ఫేమస్సో నేనూ అంతే ఫేమస్.. మాదొక చిన్న ఫ్యామిలీ. అమ్మా నాన్న.. రమ్య, అలేఖ్య, సుమ. ఇదే మా కుటుంబం. షూటింగ్కు వెళ్లిన రోజే..నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. నేను చేసిన ఫిట్నెస్ వీడియోలకు క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవడంతో పచ్చళ్ల బిజినెస్ ప్రారంభించాం. తక్కువ సమయంలోనే మా వ్యాపారం బాగా ఎదిగింది. ఒకరోజు సినిమా షూటింగ్ ఉందని కొడైకెనాల్ వెళ్లాను. ఆరోజు ఉదయం ఐదు గంటలకు నాన్న చనిపోయారు. నేను వచ్చేసరికి నాన్నను తీసుకెళ్లిపోయారు. సినిమా చేయకుండా ఉండాల్సిందినేను ఎంతో బతిమాలి చివరకు రెండు నిమిషాలు నాన్నను కడసారి చూసుకున్నాను. నేను ఆరోజు షూట్కు వెళ్లకుండా ఉండాల్సింది. అసలు ఆ సినిమాయే చేయకుండా ఉండాల్సింది అనిపించింది. నాన్న చనిపోయిన తర్వాతి వారమే ఆడియో రిలీజ్లంటూ వివాదాల్లో చిక్కుకున్నాం. ఎవరెవరో వచ్చి ఊరికనే తిట్టేవాళ్లు. చాలా ఫేస్ చేశాం. అప్పుడు మా అక్క కోపం తట్టుకోలేక రివర్స్లో తిట్టింది. కెరీర్పై ఫోకస్ పెట్టా..క్షణికావేశంలో జరిగిన తప్పు వల్ల మా జీవితాలు తారుమరయ్యాయి. బిజినెస్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు బిగ్బాస్లాంటి ప్లాట్ఫామ్లో అవకాశం దొరికితే నేను వదలుకుంటానా? కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా నేను రెడీ అని చెప్పుకొచ్చింది. మరి బిగ్బాస్ షోలో రమ్య మెప్పిస్తుందా? ట్రోలర్స్కు ఛాన్స్ ఇస్తుందా? చూడాలి! -
పవన్ను వదల్లేనంటూ రీతూ ఏడుపు.. పోయి హగ్ చేసుకోమన్న ఫ్లోరా
బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఐదోవారం నామినేషన్స్ పూర్తవగానే ఎలిమినేట్ అయ్యేదెవరనేది ఫిక్స్ అయిపోయింది. కానీ రీతూ, ఫ్లోరా డేంజర్ జోన్లో ఉన్నట్లు కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేశాడు నాగ్. హౌస్లో ఉంచినా సరే, పంపించినా సరే అన్నట్లుగా ఫ్లోరా చాలా కూల్గా ఉంది. కానీ, రీతూ మాత్రం ఏడుపందుకుంది. ఇద్దరినీ యాక్టివిటీ రూమ్కు పిలిచిన నాగ్.. చివరిసారి మీ మనసులోని మాటలు చెప్పమన్నాడు.ఆ విషయం సంజనాకు మాత్రమే తెలుసుఅప్పుడు ఫ్లోరా (Flora Saini) మాట్లాడుతూ.. బిగ్బాస్ హౌస్లో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత నేను నా బెడ్పై చాలాసార్లు ఏడ్చాను. ఆ విషయం సంజనా ఒక్కరికే తెలుసు. తను మాత్రమే నా దగ్గరకు వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు కూడా సంజనా ఒక్కరే వచ్చింది. సంజనాను నేను మిస్ అవుతాను. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీ గేమ్ ఎంజాయ్ చేయ్ అంటూ కాస్త ఎమోషనలైంది. రీతూ వంతు రాగా ఏడుస్తూనే మాట్లాడింది.వెళ్లి పవన్ను హగ్ చేసుకో..పవన్, నిన్ను చాలా మిస్ అవుతా.. నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని లేదు. బాగా ఆడు.. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి ఏకధాటిగా ఏడ్చేసింది. తర్వాత నాగ్.. ఫ్లోరా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అప్పటికీ రీతూ ఏడుపు ఆపకపోయేసరికి ఫ్లోరా.. నువ్వు సేఫ్ అయ్యావ్, ఎందుకేడుస్తున్నావ్.. హ్యాపీగా వెళ్లు, పవన్ను హగ్ చేసుకో అని చెప్పింది. సంజన, ఇమ్మాన్యుయేల్, దివ్య, శ్రీజలకు థంబ్స్ అప్ ఇచ్చి తనూజ, భరణికి థంబ్స్ డౌన్ సింబల్ ఇచ్చింది. సుమన్ శెట్టి.. థంబ్స్ అప్, థంబ్స్ డౌన్కు మధ్యలో ఉన్నాడంది. అందరికీ గుడ్బై చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.చదవండి: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే? -
'మీ అందానికి సీక్రెట్ ఏంటని అడిగా'.. డ్రాగన్ హీరో ప్రదీప్
డ్రాగన్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. మరో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్గా కనిపించనుంది. వీరిద్దరు జంటగా వస్తోన్న యూత్ ఎంటర్టైనర్ డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా యూత్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు హీరో ప్రదీప్. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో తన అందానికి సంబంధించిన ఓ సీక్రెట్ను పంచుకున్నారు. మొదటిసారి శరత్ కుమార్ సార్ను కలిసినప్పుడు మీ వయస్సు ఎంత సార్ అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. దాదాపు 71 ఏళ్ల వయసులోనూ కేవలం 40 ఏళ్ల యువకుడిలా కనిపించారని అన్నారు. ఆయనతో సార్ అసలు మీరు ఏం తింటారు? ఇంత అందంగా, యంగ్గా ఫిజిక్ ఉండడానికి కారణమని ఏంటని అడిగినట్లు తెలిపారు. దీనికి నేను రోజు ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగుతానని శరత్ సార్ నాతో చెప్పారని వెల్లడించారు. బీట్ రూట్ జ్యూస్ తాగితే అందంగా తయారు అవుతారేమో అనుకుని రోజు తాగేవాడినని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆరోగ్యపరంగానే కాకుండా.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించారు.కాగా.. డ్యూడ్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 17న థియేటర్లలో విడుదల కానుంది. -
బర్త్ డే నైట్ మేమిద్దరం మాత్రమే.. అల్లు స్నేహా పోస్ట్ వైరల్
'పుష్ప 2' సినిమాతో ఇతర దేశాల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ముంబైలో షూటింగ్ జరుగుతోంది. అయితే కొన్నిరోజుల క్రితం బ్రేక్ తీసుకున్న బన్నీ.. భార్య స్నేహాతో కలిసి ఫారిన్ ట్రిప్ వేశాడు. అక్కడ స్నేహా పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోల్ని ఇప్పుడు ఈమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) సెప్టెంబరు 29న స్నేహా పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఈమె తన భర్త అల్లు అర్జున్తో కలిసి ఆమ్స్టర్ డామ్ దేశానికి వెళ్లిపోయింది. అక్కడే బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఆ దేశంలో తిరుగుతున్న కొన్ని ఫొటోలని స్నేహా పోస్ట్ చేసింది. ఇప్పుడు పుట్టినరోజుని బన్నీ, తాను మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి కొన్ని ఫొటోలని షేర్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
కాటాలన్ మూవీ.. మాస్ అవతార్లో హీరో
అంటోని వర్గీస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “కాటాలన్”. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో హీరో మాస్ అవతార్లో కనిపిస్తున్నాడు. మంటల చుట్టూ సిగరెట్తో, కళ్లలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అదిరిపోయింది. రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ ఇన్టెన్సిటీని సూచిస్తున్నాయి.పాన్-ఇండియా బ్లాక్బస్టర్ “మార్కో” తర్వాత, క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కాటాలన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే పాన్-ఇండియా కాన్సెప్ట్గా భారీ స్థాయిలో నిర్మిస్తునారు. పాల్ జార్జ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. థాయ్లాండ్ యాక్షన్ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత ఒంగ్-బాక్ సిరీస్ యాక్షన్ డైరెక్టర్ కెచా ఖాంఫఖ్డీ తన టీమ్తో కలిసి రూపొందించారు. అదే సిరీస్లో నటించిన పాంగ్ కూడా ఈ సినిమాలో కనిపించనుంది.ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాటాలన్ లో తెలుగు నటుడు సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథ, స్క్రీన్ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Cubes Entertainments®️ (@cubesentertainments) చదవండి: అల్లు అర్జున్ గొప్పోడయ్యాడు.. దేశంలోనే..: సాయిదుర్గ తేజ్ -
హీరో ప్రదీప్ డేంజర్ అన్న బ్యూటీ.. బిగ్బాస్ స్టేజీపై దివ్వెల మాధురి డ్యాన్స్
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై నెల రోజులవుతోంది. మొదట్లో ఊపు మీదున్న షో తర్వాత కాస్త గాడితప్పింది. దీంతో బిగ్బాస్ షోకు సరికొత్త హంగామా తీసుకొచ్చేందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను దింపుతున్నారు. ఈ రోజు రాత్రి ఆరుగురు సెలబ్రిటీలు హౌస్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్గా ఉంటాయని హెచ్చరించాడు నాగ్. తమిళ, కన్నడ, మలయాళ బిగ్బాస్ల హోస్ట్లతోనూ నాగ్ ముచ్చటించాడు. డ్యూడ్ సినిమా హీరోహీరోయిన్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు స్టేజీపైకి అతిథులుగా విచ్చేశారు. ప్రదీప్ చాలా డేంజర్పనిలో పనిగా రెండు స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా.. ప్రదీప్ ప్రమాదకరమైన వ్యక్తి అని నాగార్జునకు కంప్లైంట్ చేసింది మమిత. అది విని అవాక్కైన ప్రదీప్.. నేనేం చేశాను? అని నోరెళ్లబెట్టాడు. అందుకు మమిత చిరునవ్వుతోనే అయినా నువ్వు కొంచెం డేంజరసే అని మరోసారి నొక్కి చెప్పింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్లు హౌస్లో అడుగుపెట్టనున్నారు. దివ్వెల మాధురి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి మిగతావాళ్ల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి! చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. డేరింగ్ సీన్ లీక్!
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం చెర్రీ సరసన బాలీవుడ్ భామ, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పుణెలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఓ బ్యూటీఫుల్ సాంగ్ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. పర్వత ప్రాంతంలో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. చెర్రీ ఓ రాయిపై నిలబడి డ్యాన్స్ చేయడంపై డేరింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్ డేరింగ్ డ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్ షూట్ సీన్ లీక్ కావడం టాలీవుడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట విజువల్ ట్రీట్గా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే పర్వత ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. View this post on Instagram A post shared by IWMBuzz (@iwmbuzz) -
గాంధీపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన నటుడు శ్రీకాంత్
గత వారం రోజులుగా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ వార్తల్లో ఉంటూ వచ్చాడు. మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన ఇతడు.. తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. గాంధీ మహాత్ముడేమీ కాదని, భారత దేశానికి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారి వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీని తర్వాత మరో వీడియోలో వర్ణించడానికి వీల్లేని విధంగా కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) అయితే శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్లో శనివారం ఫిర్యాదు చేశారు. అలానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇతడు నటించిన 'అరి' సినిమా ప్రదర్శనని అడ్డుకున్నారు. థియేటర్ బయట శ్రీకాంత్ దిష్టిబొమ్మని కూడా పలువురు వ్యక్తులు దహనం చేశారు. ఆదివారం.. మా అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. శ్రీకాంత్ తీరు గురించి ఫిర్యాదు చేశారు.దీంతో ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలుగులో నోటికొచ్చినట్లు మాట్లాడిన ఇతడు.. ఇప్పుడేమో ఇంగ్లీష్లో క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలానే మూవీ రివ్యూయర్లపై దారుణమైన కామెంట్స్ చేశాడు. నటుడిగా ఇతడు బాగా చేస్తుండొచ్చు గానీ అప్పుడప్పుడు ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) View this post on Instagram A post shared by Shrikanth Krishnaswamy (@shrikanth_bharat) -
సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రైలర్.. రిలీజ్లో ట్విస్ట్!
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada). ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఈనెల 12 వైజాగ్ ఈవెంట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఊహించని విధంగా ట్రైలర్ రిలీజ్ తేదీపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని పోస్టర్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 13న ఉదయం 11 గంటల 34 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సిద్ధు ఫ్యాన్స్ కాస్తా డిస్సాపాయింట్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.UNAPOLOGETICALLY RADICAL 💥💥#TelusuKadaTrailer out tomorrow at 11.34 AM. Love will be unhinged ❤🔥#LoveU2#TelusuKada in cinemas worldwide from October 17th!STAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @harshachemudu @vishwaprasadtg… pic.twitter.com/EwAIC1yWyI— People Media Factory (@peoplemediafcy) October 12, 2025 -
అల్లు అర్జున్ గొప్పోడయ్యాడు.. దేశంలోనే..: సాయిదుర్గ తేజ్
అల్లు అర్జున్ (Allu Arjun) గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అంటున్నాడు మెగా హీరో సాయిదుర్గతేజ్ (Sai Durga Tej). ఆయన్ను చూస్తే చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తాజాగా సాయిదుర్గ తేజ్ హైదరాబాద్లో.. ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్పోను ప్రారంభించాడు. ఈ ఈవెంట్లో విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఒకరు అల్లు అర్జున్ గురించి ప్రశ్న అడిగారు.పాన్ ఇండియా స్టార్అందుకు సాయి దుర్గతేజ్ స్పందిస్తూ అల్లు అర్జున్ గారు అని సంబోధించాడు. అల్లు అర్జున్గారి గురించి ఏం చెప్పాలండి? ఆయన సూపర్గా యాక్ట్ చేస్తారు. దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిపోయారు. చాలా గొప్పోళ్లు అయిపోయారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంతో గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.సినిమాసినిమాల విషయానికి వస్తే.. సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్లో రిలీజవ్వాల్సిన మూవీని పలు కారణాలతో వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.చదవండి: గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు -
గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఈ మధ్యే కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఆల్రెడీ సినిమాలు చేస్తోంది, నిర్మిస్తోంది. ఓ పక్క ఆరోగ్యం గురించి అవేర్నెస్ కల్పిస్తోంది, మరోవైపు ఫ్యాషన్, పర్ఫ్యూమ్ బిజినెస్ చేస్తోంది. అలాగే ఏకం అనే లెర్నింగ్ సెంటర్ని నడిపిస్తోంది. ఆ మధ్య పికిల్బాల్ టీమ్ కూడా కొనుగోలు చేసి వార్తల్లోకెక్కింది. ఇంకా కొత్త జర్నీ ఏంటనుకుంటున్నారా? మరేం లేదు.. తనకంటూ ఓ ఇల్లు కొనుగోలు చేసింది. ఈమధ్యే గృహప్రవేశంఅందులోనే తన ప్రయాణం ఉండబోతుందని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇటీవలే గృహప్రవేశం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో సమంత ఎరుపు రంగు డ్రెస్ సాంప్రదాయంగా ముస్తాబైంది. ముఖానికి కుంకుమ పెట్టుకుని పూజలో పాల్గొంది. పూజగది ఫోటోను షేర్ చేసింది. అలాగే తన జిమ్ వర్కవుట్స్ వీడియోను కూడా జత చేసింది.సినిమాటాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన సమంత.. ‘ట్రలాలా’ బేనర్తో నిర్మాతగా మారింది. తన సొంత బ్యానర్పై తొలిసారి ‘శుభం’ చిత్రాన్ని నిర్మించింది. ఇదే బేనర్లో తాను కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ సినిమా చేస్తోంది. అలాగే రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే హిందీ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: ఎన్టీఆర్ బామ్మర్ది రిసెప్షన్ వేడుక.. సతీసమేతంగా హాజరైన అక్కినేని అఖిల్ -
నెట్ఫ్లిక్స్లో ఉన్న టాప్ 10 మూవీస్ ఇవే.. ట్రెండింగ్లో పాత చిత్రం!
ఒటీటీల క్రేజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. థియేటర్స్ వెళ్లి సినిమా చూసేవారి కంటే..ఓటీటీలో చూసేవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో టాప్ 1లో ఉన్న ఓటీటీ ఫ్లాట్ఫార్మ్ నెట్ఫ్లిక్స్. టాలీవుడ్, బాలీవుడ్తో పాటు అన్ని ప్రాంతాల హిట్ సినిమాలు ఎక్కువగా ఇందులోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఉన్న టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేద్దాం.ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి నటించిన యాక్షన్ చిత్రం వార్2. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ హిందీ వెర్షన్ టాప్ 10లో మొదటి స్థానంలో ఉండగా.. తెలుగు వెర్షన్ టాప్ 5లో ఉంది.ఇక టాప్లో 2లో మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార చిత్రం హిందీ వెర్షన్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ థియేటర్స్లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. రిషబ్ శెట్టి ఖాతాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.ఇక టాప్ 3లో యానిమేషన్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహా’ ఉంది. థియేటర్స్లో రూ.320 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీల్లోనూ అదరగొడుతోంది.నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ గా రిలీజ్ అయిన ‘ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10’ మూవీ టాప్ 4లో కొనసాగుతుంది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్. సైమన్ స్టోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరా నైట్లీ, గై పీర్స్, డేవిడ్ అజాలా కీలక పాత్రలు పోషించారు.టాప్ 6లో సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రం ఉంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు మృణాల్ ఠాకూర్, రవి కిషన్, రోష్ని వాలియా, విందు దారా సింగ్, దీపక్ దోబ్రియాల్, కుబ్రా సైట్, సంజయ్ మిశ్రా, చుంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. ఈ ఏడాది ఆగస్ట్లో థియేటర్స్లో రిలీజై అయిన ఈ చిత్రం.. అపజయాన్ని మూటగట్టుకుంది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లలో సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నివారాలుగా ఈ చిత్రం టాప్ 10లో కొనసాగడం గమనార్హం. టాప్ 7లో దడక్ 2 ఉంది. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ నేపథ్యంలో సాగే ఈ కథలో అత్యంత సున్నితమైన కుల వివక్షను చూపించారు.టాప్ 8లో బ్లాక్ బస్టర్ మూవీ సయ్యారా కొనసాగుతుంది. ఇక టాప్ 9 లో క్రైమ్ థ్రిల్లర్ ఇన్స్పెక్టర్ జెండె ఉంది. ఒకప్పటి నొటోరియస్ బికినీ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ కేసును ఛేదించిన ఓ పోలీసు ఆఫీసర్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ మనోజ్బాజ్పాయూ లీడ్ రోల్లో నటించారు. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఓడుం కుతిర చాదుం కుతిర’టాప్ 10లో కొనసాగుతుంది. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, రేవతి పిళ్లై హీరోయిన్లుగా నటించారు. -
యూత్ని ఏడిపించిన మూవీ తీసిన డైరెక్టర్.. అప్పట్లో ఇలా
హీరోహీరోయిన్లు గానీ డైరెక్టర్స్ గానీ సెలబ్రిటీలు అయిపోయిన తర్వాత కానీ మీడియాలో ఎప్పుడుపడితే అప్పుడు కనిపిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు మాత్రం వీళ్లకు సంబంధించిన పాత ఫొటోలు లేదంటే చిన్ననాటి చిత్రాలు బయటపడుతుంటాయి. అప్పట్లో ఇలా ఉండేవారా అని నెటిజన్ల ఆశ్చర్యపోవడం గ్యారంటీ. ఇప్పుడు అలానే ఓ తెలుగు డైరెక్టర్.. తన టీనేజీ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి ఇతడెవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్నది డైరెక్టర్ సాయి రాజేశ్. ఇలా చెబితే కొందరు గుర్తుపడతారు గానీ 'బేబి' మూవీ తీసిన దర్శకుడు అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ అంతా ఈ మూవీ చూసి తెగ ఫీలయిపోయారు. కొందరైతే థియేటర్లలోనే ఏడ్చేశారు కూడా! అయితే సాయి రాజేశ్కి ఇదే తొలి చిత్రం కాదు.. గతంలో రెండు తీశాడు కాకపోతే అవి కామెడీవి కావడంతో పెద్దగా రిజిస్టర్ కాలేదు.(ఇదీ చదవండి: అట్లీతో సినిమా.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!)నెల్లూరుకి చెందిన సాయి రాజేశ్.. టాలీవుడ్లో తీసిన తొలి సినిమా 'హృదయ కాలేయం'. సంపూర్ణేశ్ బాబుని హీరోగా పెట్టి తీశాడు. కానీ తన పేరు మాత్రం స్టీఫెన్ శంకర్ అని వేసుకున్నాడు. తర్వాత ఇదే సంపూర్ణేశ్ బాబుతో 'కొబ్బరిమట్ట' అనే చిత్రం తీశాడు. ఈ రెండూ బాగానే ఆడాయి కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో రూట్ మార్చాడు. 'కలర్ ఫొటో' అనే చిత్రానికి స్టోరీ అందించిన సాయి రాజేశ్.. నిర్మాతగానూ వ్యవహరించాడు. నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. 'బేబి'కి కూడా జాతీయ సినీ అవార్డ్ రావడం విశేషం.'బేబి'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేశ్.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. చాన్నాళ్ల నుంచి ముందుకు కదట్లేదు. మరోవైపు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ'కి స్టోరీ అందిస్తున్నాడు. మరి సాయి రాజేశ్ నుంచి తర్వాత సినిమా ఎప్పుడొస్తుందో ఏంటో?(ఇదీ చదవండి: నా తండ్రి ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు: ప్రదీప్ రంగనాథ్) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
ఎన్టీఆర్ బామ్మర్ది రిసెప్షన్ వేడుక.. సతీసమేతంగా హాజరైన అక్కినేని అఖిల్
టాలీవుడ్ హీరో నార్నే నితిన్ ఓ ఇంటివాడయ్యారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ నెల పదో తేదీన వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. మ్యాడ్ స్క్వేర్ మూవీతో ఫేమస్ అయిన నితిన్ మన యంగ్ టైగర్ బామ్మర్ది అన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్తో అభిమానులను అలరించిన హీరో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు.తాజాగా నితిన్ -శివానీల వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో మన అక్కినేని హీరో అఖిల్ కూడా పాల్గొన్నారు. తన సతీమణి జైనాబ్ రవ్దీతో కలిసి గ్రాండ్ రిసెప్షన్కు హాజరయ్యారు. అఖిల్ తన భార్య చేయి పట్టుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. -
శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలతో ప్రజలు కొట్టుకునే పరిస్థితి: .‘మా’కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు
మహాత్మా గాంధీజీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గాంధీ జయంతి రోజు(అక్టోబర్ 2) రాయడానికి వీల్లేని బూతుపదాలతో గాంధీజీ దూషిస్తూ సోషల్ మీడియాలో శ్రీకాంత్ అయ్యంగార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్పై చర్యలు తీసుకోవాలని ‘మా’ను కోరారు. అతడి సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ...మా అధ్యక్షులు మంచు విష్ణు కు ఫిర్యాదు చేశాడు.అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలా శ్రీకాంత్ మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి ఉంది.నిన్న సైబర్ క్రైమ్ లో శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఫిర్యాదు చేశాం. ఇప్పుడు ‘మా’ అధ్యక్షుడికి కూడా కలిశాం. ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ చెప్పింది. పెద్ద హీరోలు కూడా శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలపై స్పందించాలి. ఆయనపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే మేము యాంటీ బయోటిక్ కావల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ‘మా’కు డిస్ప్లీనరీ కమిటీ ఉంది. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే మీటింగ్ పెట్టి..తగిన చర్యలు తీసుకుంటాం’ అని మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివ బాలాజీ అన్నారు. -
నన్ను సూపర్ స్టార్గా నిలబెట్టిన సినిమా ఇదే: విజయశాంతి
ఈ ఏడాది అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి. కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అభిమానులను మరోసారి ఆకట్టుకుంది. విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. అయితే 1990ల్లో విజయశాంతి స్టార్ హీరోయిన్గా రాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ పలు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న విజయశాంతి తాను నటించిన మూవీని గుర్తు చేసుకుంది. తన కెరీర్లోనే సూపర్ స్టార్గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన చిత్రమని ట్విటర్లో పోస్ట్ చేసింది.1985 అక్టోబర్ 11న తాను నటించిన ప్రతిఘటన మూవీలోని సూపర్ హిట్ సాంగ్ను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఈ దుర్యోధన దుశ్శాసన పాటను అందించిన శ్రీ వేటూరి గారికి, ఈ పాట పాడిన ఎస్ జానకి అమ్మకు, మాటల రచయిత ఎంవీఎస్ హరనాథ్ రావు గారికి.. విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చింది. ప్రతిఘటన సినిమా తర్వాత లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ప్రజల నుంచే వచ్చిందని గతంలోనే విజయశాంతి వెల్లడించింది. అలాగే లేడీ జాకీ చాన్, లేడీ అమితాబ్ అని కూడా తనను పిలిచేవారని గత ఇంటర్వ్యూలో పేర్కొంది. కాగా.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా విజయశాంతి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు.1985 అక్టోబర్ 11.....2025 అక్టోబర్ 11....నేటికీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన చిత్రం నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకం.నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్ "ప్రతిఘటన".దర్శకులు శ్రీ టీ కృష్ణ గారికి, నిర్మాత శ్రీ రామోజీరావు గారికి,… pic.twitter.com/ZcR4eyfBDC— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 11, 2025 -
Andhra King Taluka Teaser: ‘ఫ్యాన్..ఫ్యాన్ అని గుడ్డలు చింపేసుకోవడమే..
రామ్ పోతినేని-భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలుకా. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజైంది. రామ్ పోతినేని ఎనర్జీ, మాస్ డైలాగ్స్తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఈ చిత్రంలో హీరో ఉపేద్రకు రామ్ వీరాభిమానిగా కనిపించబోతున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి.. ఆంధ్ర కింగ్ (ఉపేంద్ర)కు వీరాభిమానిగా మారిన హీరోకి వచ్చిన సమస్యలు ఏంటి? తన హీరో కోసం ఆయన ఏం చేశాడు? అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ‘సినిమాకు ఎందుకు తీసుకెళ్లావ్.. పిల్లాడిని ఇలానే పాడు చేసి పెట్టు.. ’ అని హీరో తల్లి చెప్పే డైలాగ్తో టీజర్ ప్రారంభం అవుతుంది. ‘మీ హీరో చెప్పినదానికన్నా.. ఈ హీరో చెప్పిందే బాగా నచ్చింది’, ‘బొమ్మ బ్లాక్ బస్టర్ అక్కడ.. నిన్ను నైజాంలో కోసి గుంటూరులో కారం పెట్టి సీడెడ్లో ఫ్రై చేజేసి ఆంధ్రాలో పోలావ్ వండేస్తే..మొత్తం అయిపోతది’, ‘ఫ్యాన్..ఫ్యాన్ అని గుడ్డలు చింపేసుకోవడమే కానీ.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు. ఏం బతుకులుగా మీవీ.. ఛీ ఛీ’ అని ఓ వ్యక్తి(మురళి శర్మ) చెప్పే డైలాగ్ టీజర్ ముగుస్తుంది. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. నవంబర్ 28 ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. -
అమ్మ పంపిన ఆ ఒక్క ఫోటోతో హీరోయిన్ అయిపోయా : మాళవికా మనోజ్
అమ్మ పంపిన ఒక్క ఫొటోతోనే స్కూల్ గర్ల్ నుంచి సడెన్గా సిల్వర్స్క్రీన్పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సోషల్ మీడియాలో జోష్ పెంచి, అభిమానుల గుండెల్లో క్వీన్ గా సింహాసనం దక్కించుకుంది. ఆమె మలయాళీ క్యూటీ మాళవికా మనోజ్. ఆమె చెప్పిన విశేషాలు...→ నా మొదటి సినిమా ‘ప్రకాశన్ పరక్కట్టే’ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పదో తరగతి చదువుతున్నప్పుడు అమ్మ నా ఫోటో పంపింది. నేను సెలెక్ట్ అయ్యే వరకు ఆ విషయం నాకు తెలియలేదు.→ సినిమాలు అసలు నా ప్లాన్స్లోనే లేవు. ప్యూర్ యాక్సిడెంట్! చిన్నప్పుడు ఫొటోలు తీయించుకోవటం అంటే చాలా ఇష్టం. మోడల్ అవుదామనే ఆలోచన లేదు కాని, నా ఫొటోలు చూస్తే నాకే నచ్చేది. నేను సిగ్గరిని కూడా. స్కూల్ డ్రామాల్లో ఒక్కసారి కూడా స్టేజ్ మీదకెళ్లలేదు.→ ప్రకాశన్ పరక్కట్టే టీమ్ను కలిసిన తర్వాతే నాలో స్పార్క్ వచ్చింది. సినిమా పూర్తయ్యాక ఫీల్ బాగుంది. అప్పటినుంచే ఈ జర్నీ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాను.→ ‘జో’ నా కెరీర్లో మైలురాయి. థియేటర్స్ కంటే ఓటీటీలో, రీల్స్లో చూసి చాలామంది నన్ను ఇష్టపడ్డారు. ఇప్పటికీ చాలామంది, నేను మలయాళీ కాదని, తమిళ అమ్మాయిగానే గుర్తిస్తుంటారు. ఇది ఫన్నీ అయినా, నాకు గర్వకారణం.→ తెలుగు తెరపై అడుగుపెట్టడం సవాలు. భాషా అడ్డంకి పెద్దది. కాని, ‘ఓ భామ అయ్యో రామా!’ టీమ్, నన్ను ప్రేమతో ముందుకు నెట్టి, ఎంతో ప్రోత్సహించింది.→ ప్రతి ఒక్కరిలాగే, ‘మా నాన్నే నా మొదటి హీరో’. ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరోస్.→ అమ్మ డ్యాన్సర్ కాబట్టి, చిన్నప్పటి నుంచే నాట్యంలోనూ శిక్షణ తీసుకున్నాను.→ సోషల్ మీడియా, నా కెరీర్కు కొత్త రెక్కలు ఇచ్చింది. ఒక చిన్న రీల్ కూడా సినిమాకు క్రేజ్ తెస్తుంది. అందుకే, అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను.→ ప్రస్తుతం మూడు భాషల్లో సినిమాల్లో బిజీగా ఉన్నాను. కొత్త కథలు, కొత్త ప్రతిభలతో ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను.→ డెసర్ట్స్, స్వీట్స్ అంటే పిచ్చి ఇష్టం. అందులోనూ చాక్లెట్ పేస్ట్రీకి నేను ఎప్పుడూ ‘నో’ చెప్పలేను. అది నా బలహీనత.→ పెసర పిండి, పెరుగు, కస్తూరి పసుపు కలిపిన ఫేస్ మాస్క్ నా చర్మ సౌందర్య రహస్యాల్లో మొదటిది. ఆ తర్వాత గోరువెచ్చని కొబ్బరి నూనె మసాజ్. ఎక్కువగా సహజసిద్ధమైన ఉత్పత్తులతోనే సౌందర్యాన్ని కాపాడుకుంటాను.→ ఫ్యాషన్ డిజైనింగ్లో నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకే సినిమాల్లోనూ ఎక్కువగా నా కాస్ట్యూమ్స్ని నేనే డిజైన్ చేస్తాను.→ ఒక బటన్ నొక్కితే ఎక్కడికైనా తక్షణమే వెళ్లగల పవర్ కావాలన్నది నా కల. ఎందుకంటే, నేనొక పెద్ద ట్రావెల్ లవర్. కాస్త సమయం దొరికినా బ్యాగ్ సర్దేసుకుంటాను. -
అట్లీతో సినిమా.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) తివిక్రమ్తో సినిమా చేయాల్సింది. కానీ అనూహ్యంగా అట్లీతో సినిమా(AA22)ను ప్రకటించి షాకిచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇంత త్వరగా సెట్స్పై వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. పనులన్నీ చకచక పూర్తి చేసి..షూటింగ్ని ప్రారంభించారు. తాజాగా ఈ మూవీకి సంబంధిచి ఓ క్రేజీ రూమర్ నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రానికిగానూ అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట.తగ్గేదేలే.. మొన్నటి వరకు తెలుగు నుంచి ప్రభాస్(Prabhas) ఒక్కడే ఇండియన్ బాక్సాఫీస్ని శాసించాడు. ఇప్పుడు ఆ లిస్ట్లో బన్నీ కూడా చేరిపోయాడు. ఆయన నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డును సృష్టించింది. ఈ చిత్రం తర్వాత బన్నీ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న చిత్రానికి అత్యధికంగా రూ. 180 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే రూ. 120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఇప్పుడు ఆ విషయంలో ప్రభాస్ని దాటేశాడు బన్నీ. మార్కెట్లో తనకున్న డిమాండ్ దృష్ట్యా.. నిర్మాతలు కూడా అంత పెద్దమొత్తంలో ఇవ్వడానికి ఒకే చెప్పేశారట. చిత్ర దర్శకుడు అట్లీ, హీరోయిన్ దీపికా పదుకొణెలు కూడా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నారట.కొత్త ప్రపంచంఇప్పుడు బన్నీ నుంచి ఒక సినిమా వస్తుందంటే అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయం. ఆ అంచనాలను మించేలా అట్లీ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఇందుకుగాను అట్లీ ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాడట. అది ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని చెబుతున్నాడు. రూ. 700 కోట్ల బడ్జెట్తో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్ కోసమే రూ. 250 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే.. విజువల్స్ పరంగా సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్కు కూడా పరిచయం చేసేందుకు ప్రముఖ మార్కెటింగ్ సంస్థతో భాగస్వామ్యం అయింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. -
భరణికి గట్టిగానే హెచ్చరిక.. కెప్టెన్సీ కోసం కల్యాణ్, పవన్ల మోసం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రణరంగంలానే ఉంది. గతంలోకంటే ఎక్కువ టాస్క్లు పెడుతూ బిగ్బాస్ జోరు పెంచాడు. తాజాగా శనివారం ఎపిసోడ్ నాగార్జున ఎంట్రీతో మరింత హీట్ పెరిగింది. ఈ వారంలో భరణి చేసిన తప్పులతో పాటు రితూ, పవన్లను కూడా నాగ్ ఎండగట్టారు. తనూజాకు ఒక వీడియో చూపించి అసలు విషయం తెలుసుకోవాలంటూ సూచన ఇచ్చారు. ఇకనైన గేమ్ మీద ఏకాగ్రత పెట్టాలని నాగ్ సలహా ఇచ్చారు.ఈ వారం ఉత్తమ ప్రదర్శనతో ఇమ్మాన్యుయేల్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. గోల్డెన్ స్టార్ల మనసు కూడా గెలుచుకున్నాడు. దీంతో పవర్ అస్త్ర పోటీలో కూడా ఇమ్మూ తనదైన ముద్రవేశాడు. తనూజ,దివ్య రాము, కళ్యాణ్,భరణిలతో కలిసి పవర్ అస్త్ర పోటీలో ఇమ్మూ ఉన్నారు. ఈ టాస్క్లో పవర్ అస్త్రను అతను గెలుచుకున్నాడు.భరణిని గట్టిగానే హెచ్చిరించిన తెలంగాణ అమ్మాయితెలంగాణ అమ్మాయి శ్రుతి ప్రస్తుతం యూకేలో ఉంటుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్లో ఆమె ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొంది. ఈ క్రమంలోనే షో గురించి మాట్లాడాలని ఆమెకు నాగార్జున మైక్ ఇచ్చారు. తనకు ఫేవరేట్ ఇమ్మానుయేల్ అని చెప్పిన ఆమె భరణి ఆట మాత్రం నచ్చదని సూటిగానే చెప్పేసింది. ఇదే విషయాన్ని భరణితోనే డైరెక్ట్గానే అనేసింది. మీ ఆట మార్చుకోండి లేదంటే బిగ్బాస్లో మేము ఉంచమని పేర్కొంది. బంధాలు పెట్టుకున్నవాళ్లతోనే ఎక్కువగా క్లోజ్గా ఉంటున్నారని చెప్పింది. బంధాలు పెట్టుకోని వాళ్లను మాత్రం కిందకు తోసేస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే శ్రీజాని కూడా తోసేశారని చెప్పింది. అది ఎంతమాత్రం ఆడియన్స్కు నచ్చలేదని క్లారిటీ ఇచ్చింది.పవన్, కల్యాణ్ల మోసంబిగ్బాస్లో చాలామందిని మెప్పించిన కంటెస్టెంట్ తనూజ.. ఈ వారంలో ఆమె ఆట బాగున్నప్పటికీ బంధాల విషయంలో కాస్త ఇబ్బంది పడిందని చెప్పాలి. ఈ క్రమంలోనే నాగార్జున ఆమెను కన్ఫెషన్ రూమ్కు పిలిచి మాట్లాడారు. కెప్టెన్గా కల్యాణ్ గెలిచాడు కదా అందుకు సబంధించిన వీడియో ఒకటి చూడాలని ప్లే చేస్తాడు. అందులో కల్యాణ్ గెలుపు కోసం డెమాన్ పవన్ తన షూస్తో చేసిన పనిని వీడియోలో నాగ్ చూపించారు. ఈ వీడియోలో ఏం గమనించావ్ అని తనూజని నాగ్ కోరుతారు. అతను (పవన్) కాలితో ఎటు వైపు లైట్ వెలిగిందో కళ్యాణ్కి చూపిస్తున్నట్లు ఉందన్ని తనూజ చెబుతుంది. దాంతో నాగార్జున అసలు విషయం చెప్తాడు. నాన్నా నాన్నా అంటూ బంధం పెంచుకున్న భరణి లైట్ ఆఫ్ చేశాడని డెమాన్ పవన్ క్లియర్గా కళ్యాణ్కి అలా తన లెగ్తో చూపించాడని క్లారిటీ ఇస్తాడు. కళ్యాణ్ కూడా దీని ఆధారంగానే సమాధానం చెప్పాడని నాగ్ అంటారు. కానీ, ఈ విషయం నీతో ఎవరూ చెప్పలేదని క్లారిటీ ఇస్తారు. ఇకనైనా సరే జాగ్రత్తగా ఆట ఆడాలని తనూజను నాగ్ కోరుతారు.ఆటలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా కిందపడిపోయిన భరణికొన్ని గేమ్స్లలో భరణి ఆడిన తీరు మెచ్చి నాగార్జున గోల్డెన్ స్టార్ ఇస్తారు. దానిని దివ్య చేతుల మీదుగా తీసుకుంటానని ఆయన కోరతాడు. దీంతో తనూజలో కనిపించని బాధను వ్యక్తం చేస్తుంది. దివ్య ఎంట్రీ తర్వాత భరణి కూడా తనూజకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే బెడ్ టాస్క్ గురించి నాగార్జున మాట్లాడుతారు. శ్రీజాని అలా తోసేయడం కరెక్ట్ అనిపించిందా భరణి అని నాగ్ అడుగుతారు. డెమాన్ పవన్ కంటే ముందే నువ్వు బెడ్ నుంచి పడిపోయావ్ కదా అని నాగ్ వీడియోతో చూపిస్తాడు. దీంతో చేసేది ఏం లేక స్వార్ధంగా ఆలోచించాను సార్ అని తప్పును ఒప్పుకుంటాడు. దీంతో నాగార్జున కూడా చురకలు అంటిస్తాడు. ‘ఎంతో ఎదగాల్సిన నువ్వు పడ్డది బెడ్ పై నుంచి కాదు.. మా దృష్టిలో నుంచి కూడా కిందికి పడ్డావ్ అంటారు. మహాభారతంలో ధర్మరాజు ఎన్ని తప్పులు చేస్తున్నాడో నువ్వు కూడా అన్ని చేస్తున్నావ్ అంటూ క్లాస్ తీసుకున్నారు. ఆటలో ముందుకు వెళ్లాల్సిన శ్రీజాను కిందకు తోసేశావ్. నీవల్ల ఆమె ఆటే ఆగిపోయింది. కేవలం పొరపాటు వల్లే జరిగింది. అని భరిణిపై గట్టిగానే నాగ్ హెచ్చరించారు. Demon Pavan gave a shoe signal to Kalyan Padala in the captaincy taskI really doubt you r a real soldierKalyan can't win a single task on his own without cheatingWorst to the coreShame on the BB team for encouraging this shit#BiggBossTelugu9 #BiggBoss9Telugu #Thanuja pic.twitter.com/b1XToXizj3— Aadarshini Aadarshini (@a_aadarshini) October 11, 2025 -
రెండు..మూడు..ఏడు..ఇంకోసారి మేజిక్!
సిల్వర్ స్క్రీన్పై కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఆ జంటను మరిన్ని సినిమాల్లో చూడాలనేంతగా వారి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది. పైగా ఈ పెయిర్ నటించిన సినిమా హిట్ అయితే... ‘హిట్ జోడీ’ అనే పేరు కూడా వస్తుంది. అలా వెండితెరపై తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు హిట్ కూడా అందుకున్న కొన్ని జంటలు మళ్లీ కలిసి నటిస్తున్నాయి. ఒకరు రెండోసారి జత కడితే... మరొకరు మూడోసారి... ఇంకొకరు ఏకంగా ఏడో సారి... ఇలా హిట్ మేజిక్ని రిపీట్ చేయడానికి రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. ఎన్నాళ్లకెన్నాళ్లకు... హీరో చిరంజీవి(Chiranjeevi), హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. 19 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాతో రిపీట్ అవుతోంది. ‘బింబిసార’ మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ రెడ్డి సమర్పణలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్గా రూ΄÷ందుతోన్న ‘విశ్వంభర’ 2026 వేసవిలో విడుదల కానుంది. రెండోసారి... హీరో చిరంజీవి– హీరోయిన్ నయనతార(Nayanthara) కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతోంది. వీరిద్దరూ తొలిసారి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 అక్టోబరు 2న రిలీజైంది. ఆ తర్వాత చిరంజీవి, నయనతార కలిసి ‘గాడ్ఫాదర్’ (2022) చిత్రంలో అన్నా–చెల్లెలుగా నటించారు. తాజాగా వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ మూవీ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి చిరంజీవి–నయనతార సందడి చేసిన ‘మీసాల పిల్ల...’ అంటూ సాగే తొలి పాట ప్రోమోని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 27 ఏళ్ల తర్వాత... కొన్ని జంటలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. హీరో నాగార్జున(Nagarjuna Akkineni), హీరోయిన్ టబు జోడీ కూడా అలాంటిదే. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన రెండో చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ తమదైన నటనతో సందడి చేసిన వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని ఫిల్మ్నగర్ టాక్. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఈ చిత్రం కోసం 27 ఏళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారట నాగార్జున–టబు. నాగార్జున కెరీర్లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, వారిలో టబు ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ‘సిసింద్రి’ (1995) సినిమాలో నాగార్జున– టబు ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఏడోసారి... హీరో వెంకటేశ్(Venkatesh), హీరోయిన్ మీనాలది ప్రత్యేకమైన జోడీ. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ‘చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, దృశ్యం, దృశ్యం 2’ వంటి అరడజను సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో వీరి జోడీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఇప్పుటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న వీరిద్దరూ ‘దృశ్యం 3’ సినిమా కోసం మరోసారి జోడీగా నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దృశ్యం’ (2014), ‘దృశ్యం 2’ (2021) సినిమాలు అద్భుతమైన హిట్స్ అందుకున్నాయి. ఈ సిరీస్లో రానున్న తాజా చిత్రం ‘దృశ్యం 3’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్లాల్, మీనా జోడీగా మలయాళంలో ‘దృశ్యం 3’ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ రూపొందనున్న ‘దృశ్యం 3’లో వెంకటేశ్–మీనా మరోసారి జంటగా నటించి, ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం పూర్తయ్యాక ‘దృశ్యం 3’ సెట్స్పైకి వెళ్లనుంది. థియేటర్లలో జాతర హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి థియేటర్లలో ‘మాస్ జాతర’ చూపించేందుకు సిద్ధం అయ్యారు. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాథరావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 డిసెంబరు 23న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో రవితేజ–శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ధమాకా’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ద్వితీయ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా ‘మాస్ జాతర’ రూ΄÷ందడం.. రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం.. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి ఇప్పటికే అద్భుతమైన స్పందన రావడం... వంటి కారణాలతో ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. సలార్: శౌర్యాంగపర్వంలో... ‘బాహుబలి’ చిత్రం తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్’ వంటి చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత ‘సలార్: శౌర్యాంగపర్వం’ మూవీ చేస్తారు. ప్రభాస్, శ్రుతీహాసన్ జోడీగా నటించిన తొలి చిత్రం ‘సలార్: పార్ట్ 1 సీజ్ఫైర్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీ 2023 డిసెంబరు 22న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ప్రభాస్ యాక్షన్... ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాకి సీక్వెల్గా ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో అలరించిన ప్రభాస్– శ్రుతీహాసన్ జోడీ ద్వితీయ భాగంలోనూ అలరించబోతుందని ఫిల్మ్నగర్ టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారాయన. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాతే ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ పై దృష్టి పెడతారట. ‘సలార్: ΄ార్ట్ 1 సీజ్ఫైర్’ చూసిన వారందరూ ‘సలార్: ΄ార్ట్ 2 శౌర్యాంగపర్వం’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి... నాని హీరోగా నటించిన ‘నానీస్ గ్యాంగ్లీడర్’ (2019) చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంకా మోహన్. ఆ తర్వాత మరోసారి వీరిద్దరూ ‘సరి΄ోదా శనివారం’ (2024) సినిమాలో నటించారు. ఇప్పటికే రెండు సినిమాల్లో సందడి చేసిన ఈ జంట మరోసారి జోడీగా కనిపించనున్నారని ఫిల్మ్నగర్ టాక్. ‘సాహో, ఓజీ’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ్ర΄ారంభమైంది. ఈ సినిమాలో నానీకి జోడీగా ప్రియాంకా మోహన్ నటించనున్నారట. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ‘ఓజీ’ చిత్రంలో హీరోయిన్గా నటించారు ప్రియాంక. తాజాగా నాని సినిమాలో ఆమెని హీరోయిన్గా తీసుకోనున్నారట సుజీత్. పైగా నాని–ప్రియాంక కాంబినేషన్కి కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండటంతో వీరు మూడోసారి నటించడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ముచ్చటగా మూడోసారి... హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా కలిసి ముచ్చటగా మూడోసారి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై సూపర్ హిట్గా నిలవడంతో ΄ాటు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ మూవీ తర్వాత విజయ్–రష్మిక నటించిన ద్వితీయ చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా విడుదలైన ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్’). గతంలో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘వీడీ 14’కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రంలోనే మరోసారి విజయ్–రష్మిక పెయిర్గా మారారు. ఇదిలా ఉంటే రీల్ లైఫ్లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక రియల్ లైఫ్లో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 3న వీరి నిశ్చితార్థం జరిగింది. 2026 ఫిబ్రవరిలో విజయ్–రష్మికల వివాహం జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత... హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 జనవరి 14న రిలీజై, సూపర్ హిట్గా నిలవడంతో ΄ాటు జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్న శర్వానంద్, అనుపమ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). సంపత్ నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధా మోహ¯Œ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960ల కాలంలోని ఉత్తర తెలంగాణ– మహారాష్ట్రల సరిహద్దు ్ర΄ాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూ΄÷ందుతోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ డింపుల్ హయతి ఓ కీలక ΄ాత్ర చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్యలది క్రేజీ కాంబినేషన్ అనే చె΄్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. మొదటి చిత్రంతోనే వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన వీరి జోడీ రెండో సారి ప్రేక్షకులను అలరించనుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా ‘90స్’(ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాస¯Œ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఓ మధ్య తరగతి యువకుడి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ‘బేబీ’తో బ్లాక్బస్టర్ అందుకున్న ఆనంద్–వైష్ణవి రెండోసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై యువతలో మంచి ఆసక్తి నెలకొంది. రెండోసారి... హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికాజాన్లది హిట్ పెయిర్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజ వరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, ప్రేక్షకులను నవ్వించింది. ఆ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికాజాన్ కలిసి నటించిన ద్వితీయ చిత్రం ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలక΄ాటి నిర్మించారు. తొలి చిత్రం ‘సామజ వరగమన’తో నవ్వులు పంచిన శ్రీవిష్ణు, రెబా ‘మృత్యుంజయ్’తో మాత్రం భయపెట్టనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
నా తండ్రి ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు: ప్రదీప్ రంగనాథ్
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ఫుల్ సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబరు 17న ఈ చిత్రం విడుదల కానుంది. కొద్దిరోజులుగా ప్రదీప్ రంగనాథన్ పేరు టాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన తండ్రి చేస్తున్న పని గురించి కొందరు చర్చించుకుంటే.. మరికొందరు మాత్రం అతనిపై ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నారు. 'మీరు హీరో మెటీరియల్లా లేరు.. కానీ, రెండు సినిమాలకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అరుదు' అంటూ ఒక జర్నలిస్ట్ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు కూడా ప్రదీప్కు మద్ధతుగా నిలిచారు. జర్నలిస్ట్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రీసెంట్గా కిరణ్ అబ్బవరం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ సదరు జర్నలిస్ట్ను కోరారు.వెండితెరపై ప్రదీప్ రంగనాథ్ ఒక సాధారణ యువకుడిలా కనిపించడమే కాదు నిజ జీవితంలో కూడా అంతేనని చెప్పవచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల పాటు సరైన ఛాన్స్ కోసం ఆయన కష్టపడ్డారు. ఫైనల్గా విజయం సాధించారు. డబ్బు, పేరు అన్నీ ప్రదీప్కు వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఆయన కుటుంబం సాధారణ జీవితమే గడుపుతుంది. ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ పంచుకున్నారు.నా తండ్రి చెన్నైలో సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఒక జిరాక్స్ షాపు నడుపుతూనే మా కుటుంబాన్ని నాన్న పోషించారు. నాకు సినిమా ఛాన్సులతో పాటు పేరు, డబ్బు వచ్చింది. అయినప్పటికీ నాన్న మాత్రం జిరాక్స్ షాప్ నడుపుతూనే ఉన్నారు. ఎప్పటికీ మన మూలాలను మరిచిపోవద్దని ఆయన చెబుతుంటారు. రోజూ ఉదయాన్నే బస్సులోనే షాప్కు వెళ్తారు.. ఒక కారు కొనిస్తానని చెప్పినా సరే దానిని తిరస్కరించారు. ఇప్పటికీ బస్సులోనే ఆయన ప్రయాణం చేస్తారు. సింపుల్గా ఉండటమే నాన్నకు ఇష్టం.' అని ప్రదీప్ చెప్పారు.ప్రదీప్ రంగనాథ్ తన కాలేజీ రోజుల గురించి కూడా గుర్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్లో 98 శాతం మార్కులతో పాస్ అయ్యానని చెప్పారు. కానీ, తనకు ఎక్కువ సినిమాలంటే పిచ్చి అని కూడా తెలిపారు. దీంతో తన తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందే వారని గుర్తుచేసుకున్నారు. అయితే, చదువును అశ్రద్ధ చేయనని వారికి చెప్పాను. జయం రవితో కొమలి సినిమాను డైరెక్ట్ చేసిన తర్వాత పరిశ్రమలో ఫేమ్ దక్కిందన్నారు. ఆ తర్వాత లవ్ టుడేతో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. ప్రదీప్ డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.Reacting to the "Hero Material" Controversy, #KiranAbbavaram asks the media personnel to ask him anything but be gentle about the likes of #PradeepRanganathan terming him as our Guest from Other State! pic.twitter.com/xdQ3dATvTi— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 11, 2025 -
తొలిప్రేమ.. ఆ అమ్మాయి ఇన్స్టా ఇప్పటికీ చూస్తుంటా: సిద్ధు
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). ఈ మూవీ అక్టోబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రేమ కథను పంచుకున్నారు. ‘తెలుసు కదా’ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్గా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, టి.జి.కృతిప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు.ఇద్దరిని ప్రేమించిన ఓ యువకుడి స్టోరీతో తెలుసు కదా చిత్రం తెరకెక్కింది. అయితే, తన నిజ జీవితంలోని ప్రేమకథను కూడా సిద్ధు జొన్నలగడ్డ ఇలా పంచుకున్నారు. 'నేను ఏడో తరగతిలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం. కానీ, ఆ అమ్మాయితో నా ప్రేమ గురించి చెప్పలేదు. ఇంతలోనే పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. చివరి రోజున శ్లామ్ బుక్ తీసుకొని తన వద్దకు వెళ్లాను. ఒక కొటేషన్తో పాటు తన ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ కూడా అందులో రాసింది. చివరిసారిగా నా నుంచి వెళ్తూ.. ఓ లుక్ ఇచ్చి సైకిల్పై వెళ్లిపోయింది. ఇప్పటికీ ఆ సీన్ నా కళ్ల ముందే తిరుగుతుంది. కానీ, ఆ తర్వాత కూడా ఎప్పుడూ నా ప్రేమ విషయాన్ని ఆమెతో పంచుకోలేదు. కొన్నేళ్ల తర్వాత తనకు పెళ్లి కూడా అయిపోయింది. పిల్లలు కూడా పుట్టేశారని తెలిసింది. ఆమెతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ ఇన్స్టాగ్రామ్లో తన ప్రొఫైల్ అప్పుడప్పుడు చూస్తుంటాను.' అని సిద్ధు చెప్పాడు. -
కలైమామణి అవార్డ్ అందుకున్న సాయిపల్లవి, అనిరుధ్
సినిమా, నాటకం, బుల్లితెర, సంగీతం వంటి కళారంగాల్లో విశిష్ట సేవలు అందించిన కళాకారులకు మూడేళ్లకు గాను కలైమామణి అవార్డు(kalaimamani award)లను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రదానం చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఈ అవార్డులు ప్రకటించ లేదు. ఎట్టకేలకు 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి కలైమామణి అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేసిన గత నెల ప్రకటించారు.అలాగే, తమిళ మహాకవి భారతియార్, గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, బాలసరస్వతిల పేరిట అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే 2021కిగాను నటనా విభాగంలో ప్రముఖ సినీనటి సాయిపల్లవి(Sai Pallavi) ఎంపిక అయ్యారు. సీఎం స్టాలిన్ చేతులమీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. మూడేళ్లకు గాను మొత్తం 90 మందికి పురస్కారాలు అందజేశారు. సంగీత దర్శకులు అనిరుధ్ రవిచందర్తో పాటు సినీ నటులు, దర్శకుడు ఎస్జే సూర్య, విక్రమ్ ప్రభు వంటి ప్రముఖులు కూడా అవార్డులు అందుకున్నారు. -
నవంబరులో సంతాన ప్రాప్తిరస్తు
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను నవంబరు 14న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం మేకర్స్ ప్రకటించారు.‘‘నేటి సమాజంలో యూత్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంలో వినోదాత్మకంగా రూ పొందిన సినిమా ఇది. ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్. -
మోగ్లీ వస్తున్నాడు
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈ సినిమాను డిసెంబరు 12న రిలీజ్ చేయనున్నట్లగా మేకర్స్ ప్రకటించారు. ‘‘ఓ ఎమోషనల్ క్యారెక్టర్లో రోషన్ నటించాడు. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, బండి సరోజ్ విలనిజమ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్గా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
థియేటర్స్లో గట్టిగా నవ్వుకుంటారు: కిరణ్ అబ్బవరం
‘‘కొత్త స్క్రిప్ట్తో సినిమా చేద్దామని ‘క’ చిత్రం చేశాను. కానీ ‘కె–ర్యాంప్’ మాత్రం నా అభిమానుల కోసం చేశాను. ఈ చిత్రంలో నా క్యారెక్టరైజేషన్ ఇప్పటి యువ తారానికి దగ్గరగా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్స్లో గట్టిగా నవ్వుకుంటారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ ఈ చిత్రదర్శకుడు నానియే’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’.యుక్తీ తరేజా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వీకే నరేశ్, సాయికుమార్, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జైన్స్ నాని మాట్లాడుతూ – ‘‘ట్రైలర్లోని ఎనర్జీకి సినిమా ఏ మాత్రం తగ్గదు’’ అని చె ప్పారు. ‘‘మా సినిమా విడుదల తేదీని చాలా రోజుల క్రితమే ప్రకటించాం.ఈ దీపావళికి పెద్ద బ్యానర్స్ నుంచి సినిమాలు వస్తున్నాయి. అయినా మా సినిమాకు థియేటర్స్ దొరుకుతాయి’’ అని పేర్కొన్నారు రాజేశ్ దండా. ‘‘ఈ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్ర చేశాను’’ అని తెలి పారు వీకే నరేశ్. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి, రైటర్ రవి మాట్లాడారు. -
Vasudevasutham Teaser: ధర్మాన్ని కాపాడేందుకు...
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వసుదేవసుతం’(Vasudevasutham). అంబికా వాణి హీరోయిన్గా నటిస్తున్నారు. వైకుంఠ్ బోను దర్శకత్వంలో బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.ఈ సినిమా టీజర్ను హీరో సత్యదేవ్ విడుదల చేపారు. ‘‘ఈ కథ ధర్మానికి అడ్డొస్తే.. మేనమామ అయినా, లక్షల బంధుగణమైనా, ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా... ధర్మ హింస తథావచ అన్న శ్రీ కృష్ణుడిదే కాదు. ధర్మాన్ని కా పాడేందుకు ఎంతటి మారణ హోమానికైనా ఎదురెళ్లే ఓ యువకుడిది’ అనే డైలాగ్ ‘వసుదేవసుతం’ సినిమా టీజర్లో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
నేను చాలా లక్కీ: రాశీ ఖన్నా
‘‘ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నాను. నేను చాలా లక్కీ. టాలీవుడ్కి తిరిగొచ్చి, మళ్ళీ వరుస సినిమాలు చేస్తుండటం అనేది తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఓ నటిగా నాకు దర్శక– నిర్మాతల్లో ఏర్పడిన గుర్తింపు వల్లేనని నమ్ముతున్నా’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో రాశీ ఖన్నా పంచుకున్న సంగతులు. ⇒ ‘తెలుసు కదా’ కథను దర్శకురాలు నీరజగారు చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇది రెగ్యులర్ లవ్స్టోరీ కాదు. అందుకే ఒప్పుకున్నాను. నాకు తెలిసి ఈ తరహా ప్రేమకథా చిత్రం ఇప్పటివరకు రాలేదు. ఇందులో మేం ఓ కొత్త పాయింట్ని టచ్ చేశాం.⇒ ‘తెలుసు కదా’లో నేను అంజలి అనే పాత్రలో కనిపిస్తాను. కథలో మా ముగ్గురి (సిద్ధు, అంజలి, రాశీ) పాత్రలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ సినిమా ఆడియన్స్కు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. నీరజ బాగా డైరెక్ట్ చేశారు. ఓ మహిళా దర్శకురాలితో నేను పని చేయడం ఇదే తొలిసారి. అయినా డైరెక్షన్కి మేల్, ఫీమేల్ అనే తేడాల్లేవ్. ⇒ క్రమశిక్షణతోనే జీవితంలో ఎదగగలమని నమ్ముతాను. అందుకే నేను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉంటాను. అలాగే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఫిట్గా ఉండటం ముఖ్యం. నేను ఎప్పుడూ వర్కౌట్స్, సరైన డైట్తో ఫిట్గా ఉండాలనుకుంటాను. ఇక ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’పై నాకు నమ్మకం లేదు. అదో ఆకర్షణ అనుకుంటాను. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు ఉన్న పరిమితులు వంటి అంశాలను ‘తెలుసు కదా’లో ప్రస్తావించాం. ⇒ పవన్ కల్యాణ్గారి ‘ఉస్తాద్ భగత్సింగ్’ చేస్తున్నాను. హిందీలో చేసిన ‘120 బహదూర్’ చిత్రం నవంబరు 21న విడుదలవుతుంది. విక్రాంత్ మెస్సేతో లవ్ స్టోరీ ఫిల్మ్, మాధవన్తో టైమ్ ట్రావెల్ బ్యాక్డ్రాప్ మూవీ చేశాను. ‘ఫర్జీ 2’ సిరీస్ చేస్తున్నాను. అలాగే ఒక ఓటీటీ ప్రాజెక్ట్లో లీడ్గా నటించాను. -
బాలల దినోత్సవం నాడు 'స్కూల్ లైఫ్' విడుదల
పులివెందుల మహేష్ హీరోగా, దర్శకుడిగా రూపొందించిన చిత్రం 'స్కూల్ లైఫ్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 14న అంటే బాలల దినోత్సవం నాడు థియేటర్లలోకి రానుంది. నైనిషా క్రియేషన్స్ బ్యానర్లో గంగాభవని నిర్మాతగా వ్యవహరించారు. సావిత్రి, షన్ను, సుమన్, ఆమని, మురళి గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.మా 'స్కూల్ లైఫ్' నా ఒక్కడి కల కాదు, మా టీమ్ సభ్యులందరూ కలిసి కష్టపడి తీసిన చిత్రం. రాయలసీమ నేటివిటీకి పెద్దపీట వేస్తూ, ఒక స్కూల్ నేపథ్యంలోని చక్కటి ప్రేమ కథ, రైతుల కష్టాలు, స్నేహం తదితర అంశాలతో తెరకెక్కించాం. నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని పులివెందుల మహేశ్ చెప్పాడు. -
'ఫెయిల్యూర్ బాయ్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫెయిల్యూర్ బాయ్స్'. శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్పై వీవీఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. వెంకట్ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫిలింఛాంబర్లో శనివారం, ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు.నటుడు సూర్య మాట్లాడుతూ - 'ఫెయిల్యూర్ బాయ్స్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ చిత్రంలో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి లాంటి మంచి నటులు ఉన్నారు. యంగ్ టీమ్ అంతా ఈ సినిమాకు వర్క్ చేసింది. ఫెయిల్యూర్ బాయ్స్ సినిమా పెద్ద సక్సెస్ అందుకుని దర్శక నిర్మాతలకు, మూవీ టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అని అన్నారు. -
పక్క రాష్ట్రం హీరోలను అలా కించపరచకండి: హీరో కిరణ్ అబ్బవరం
ఇటీవల డ్యూడ్ సినిమా ప్రెస్మీట్లో ఓ మహిళా జర్నలిస్ట్.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan )పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘మీరు హీరోలానే ఉండరు.. రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ హార్డ్ వర్కా లేదా అదృష్టమా అని ఆమె ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు పక్కనే ఉన్న సీనియర్ నటుడు శరత్ కుమార్ మంచి సమాధానమే ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఆ జర్నలిస్ట్పై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న హీరోని అలా అనడం కరెక్ట్ కాదంటూ ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా ఈ వివాదంపై తెలుగు హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) స్పందించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను అలా కించపరస్తూ ప్రశ్నలు అడగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'కె ర్యాంప్'. దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. సదరు మహిళా జర్నలిస్ట్ మరోసారి ప్రదీప్ రంగనాథన్పై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చాడని చెప్పాలనుకున్నానని.. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ట్రోల్ చేస్తున్నారని ఆమె చెబుతూ.. ‘మీరేమంటారు?’ అని కిరణ్ని అడిగారు.‘నన్ను అడగండి పర్లేదు. కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక హీరోని అలా కించపరిచే ప్రశ్నలు అడగడం మంచిది కాదు. మీరు(మీడియా) నన్ను ఒక మాట అన్న పడతా. మనం మనం ఒకటి. కానీ పక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్లను అలా కించపరచడం కరెక్ట్ కాదు. మీ లుక్స్ ఇలా ఉన్నాయని అడగడం చూసి నాకే చాలా బాధగా అనిపించింది. తప్పగా అనుకోకండి.. ఇకపై అలాంటి ప్రశ్నలు అడగకండి’ అని సదరు మహిళా జర్నలిస్టుకు కిరణ్ విజ్ఞప్తి చేశారు. -
అప్పటిరోజులు గుర్తుచేసిన కాజల్.. స్టైలిష్గా కల్యాణి
ఒకప్పటిలా అందంగా కనిపించిన కాజల్ అగర్వాల్స్టైలిష్ మోడ్రన్ లుక్లో కల్యాణి ప్రియదర్శన్సాయంతాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తున్న వైష్ణవిచీరకట్టులో నాభి అందాలతో నభా నటేశ్కలర్ఫుల్ డ్రస్సులో అమలాపాల్ వయ్యారాలుటంగ్ ట్విస్టర్తో నవ్వించిన రుక్మిణి వసంత్ View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
ప్రధాని మోదీని కలిసిన చరణ్-ఉపాసన.. కారణం ఏంటంటే?
ప్రధాని నరేంద్ర మోదీని మెగా హీరో రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఆయనతో శనివారం భేటీ అయ్యారు. రీసెంట్గా ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. సదరు లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోదీని కలిసినట్లు చరణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.'మన ప్రధానమంత్రిని కలవడం ఎంతో గౌరవంగా అనిపించింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వెనుకున్న విజన్ని పంచుకోవడం గర్వంగా ఉంది. విలువిద్య మన సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగం. ఏపీఎల్ ద్వారా దీన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలన్నది మా ఆశయం. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది, ఈ వేదిక వాళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుంది' అని చరణ్ చెప్పుకొచ్చాడు.మన దేశంలో క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ తదితర గేమ్స్కి లీగ్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలిసారి ఆర్చరీ(విలువిద్య) లీగ్ పోటీలు నిర్వహించారు. మొత్తంగా ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీ పడ్డాయి.చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'తో వచ్చాడు. కానీ ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవుతోంది. వేసవికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' ట్రైలర్ రిలీజ్
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన సినిమా 'కె ర్యాంప్'. దీపావళి కానుకగా ఈ నెల 18న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇప్పటికే ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఫన్నీగా ఉంటూనే ఆకట్టుకునేలా ఉంది. టీజర్ విడుదలైనప్పుడు లిప్ కిస్సులు, బూతుల గురించి కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో ఈసారి ట్రైలర్లో ఆ డోస్ తగ్గించినట్లే కనిపించారు. రెండు మూడు చోట్ల మాత్రం కిస్సులు, డబుల్ మీనింగ్ బూతులు వినిపించాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ బామ్మర్ది పెళ్లి.. అమ్మాయికి వెంకటేశ్ ఫ్యామిలీతో బంధుత్వం)ట్రైలర్ బట్టి చూస్తే.. కుమార్ అనే కుర్రాడికి తండ్రి మాత్రమే ఉంటాడు. దీంతో అల్లరిచిల్లరగా తిరుగుతూ మందు తాగుతూ బతికేస్తుంటాడు. అయితే చదువుకునేందుకు కేరళలోని కొచ్చి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇబ్బంది పెట్టి మరీ ఆమె తనని ప్రేమించేలా చేస్తాడు. కుమారే అనుకుంటే ఆమెకు సైకలాజికల్ ప్రాబమ్స్ ఉంటాయి. దీంతో తిక్కతిక్కగా ప్రవరిస్తుంది. చివరకు ఈ జంట ఒక్కటైందా లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.చాన్నాళ్లుగా కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తున్నాడు. కానీ గతేడాది దీపావళికి రిలీజైన 'క' చిత్రం మాత్రమే హిట్ అయింది. ఈ ఏడాది మార్చిలో 'దిల్ రుబా' అనే మూవీతో వచ్చాడు. ఇది ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో యూత్ని టార్గెట్ చేసి 'కె ర్యాంప్' తీశాడు. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి? దీపావళికి దీనితో పాటు మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
ఎన్టీఆర్ బామ్మర్ది పెళ్లి.. అమ్మాయికి వెంకటేశ్ ఫ్యామిలీతో బంధుత్వం
ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నే నితిన్ పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మీ శివాని అనే అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని శంకరపల్లిలో ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లి కొడుకు ఎవరనేది అందరికీ తెలుసు. తారక్ భార్య లక్ష్మీ ప్రణతికి సొంత తమ్మడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ తదితర చిత్రాలతో హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.మరి పెళ్లి కూతురు ఎవరు ఏంటనేది మాత్రం పెద్దగా తెలియదు. అయితే ఈ పెళ్లిలో హీరో వెంకటేశ్ కుటుంబం కూడా కనిపించడంతో అమ్మాయికి వీళ్లకు బంధుత్వం ఏంటా అని అందరూ అనుకున్నారు. అయితే పెళ్లి కూతురు లక్ష్మీ శివానిది నెల్లూరు. కానీ వ్యాపారరీత్యా ఈమె తండ్రి కృష్ణప్రసాద్ హైదరాబాద్లో ఉన్నారు. దీంతో లక్ష్మీ శివాని.. చదువంతా భాగ్యనగరంలోనే పూర్తి చేసింది. అయితే దగ్గుబాటి కుటుంబంతో వీళ్లకు బంధుత్వం ఉంది. దివంగత రామానాయుడికి ఈమె మనవరాలు అవుతుంది. అంటే వెంకటేశ్, సురేశ్ బాబుకు కూతురు వరస అవుతుంది.(ఇదీ చదవండి: హీరో రానా నుంచి 'బూతుల' సినిమా.. టీజర్ రిలీజ్)అందుకే నార్నే నితిన్-శివాని పెళ్లిలో దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన హీరో వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, నాగచైతన్య తదితరులు సందడి చేశారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా ఈ వివాహ వేడుకలో కనిపించారు. గతేడాది నవంబరులో నితిన్-శివానిల నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెళ్లి జరిగింది.నార్నే నితిన్ విషయానికొస్తే.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్, శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాలతో వచ్చాడు. ప్రస్తుతానికైతే ఇతడి చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేసి త్వరలో కొత్త చిత్రాల్ని ప్రకటిస్తాడేమో చూడాలి!(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)#Venkatesh & #Rana at Narne Nithin Marriage pic.twitter.com/5XcCBoAtZz— Taraq(Tarak Ram) (@tarakviews) October 11, 2025 -
హీరో రానా నుంచి 'బూతుల' సినిమా.. టీజర్ రిలీజ్
రీసెంట్ టైంలో సినిమాల్లో వైల్డ్నెస్ పేరిట బూతుల్ని, బూతు సన్నివేశాల్ని అక్కడక్కడ ఉపయోగిస్తున్నారు. కొన్నింటికి సెన్సార్ కత్తెర వేస్తున్నప్పటికీ మరికొన్నిసార్లు మాత్రం మూవీకి 'ఏ' సర్టిఫికెట్ లాంటివి తెచ్చుకుని రిలీజ్ చేస్తున్నారు. వీటిని యూత్ చూస్తారు. ఫ్యామిలీ అడియెన్స్ కాస్త దూరంగానే ఉంటారు. సరే ఇదంతా పక్కనబెడితే రానా నిర్మాతగా 'డార్క్ చాక్లెట్' అనే మూవీ త్వరలో రాబోతుంది. దీని టీజర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)టీజర్ చూస్తుంటే.. యజ్ఞ అనే హీరో, ఓ ముగ్గురు వ్యక్తుల(ఓ మహిళ, ఇద్దరు పురుషులు) మధ్య జరిగే కథే ఈ సినిమా స్టోరీలా అనిపిస్తుంది. టీజర్ లో బూతు సన్నివేశాలేం లేవు గానీ బూతు మాటలు మాత్రం కాస్త గట్టిగానే వినిపించాయి. వీటిని టీజర్ కోసమే పెట్టారా? నిజంగా మూవీలోనూ ఉంచుతారా అనేది చూడాలి? అయితే హీరో రానా నిర్మాతగా ఈ తరహా మూవీ వస్తుందని అస్సలు ఊహించలేదు.'35' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వదేవ్ ఇందులో హీరో కాగా బిందుమాధవి హీరోయిన్. మరో ఇద్దరు కూడా తెలుగు నటులే. 'కిడ్స్ పక్కకెళ్లి ఆడుకోండి' ,'పాన్ మసాలా మూవీ', 'జానర్ అడగొద్దు' లాంటి క్యాప్షన్స్ చూస్తుంటే కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అలానే రిలీజ్ ఎప్పుడనేది కూడా అక్టోబరు 31, నవంబరు 14, డిసెంబరు 5 అని మూడు తేదీలు ప్రకటించి, మనల్నే ఎంచుకోమన్నట్లు చూపించారు. శశాంక్ శ్రీ వాస్తవ్య దర్శకుడు కాగా వివేక్ సాగర్ సంగీతమందించాడు. చూస్తుంటే ఇది పెద్దల కోసం మాత్రమే తీసిన సినిమాలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మొన్న విజయ్..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!) -
సరికొత్త ప్రేమకథతో ‘ప్రేమిస్తున్నా’
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘ప్రేమిస్తున్నా’.భాను దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న ఈ విడియోలో సినిమా ఎలా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ...‘అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా, మేము విడుదల చేసిన సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా కు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోందని’అన్నారు. -
ఫ్లోరా ఎలిమినేషన్ ఫిక్స్? బిగ్బాస్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా!
ఫ్లోరా సైనీ (Flora Saini).. ఈపాటికే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్! అలా అని తనపై జనాల్లో అంత వ్యతిరేకత ఉందా? అంటే రవ్వంతైనా లేదు. కానీ, తనపై పాజిటివిటీ కూడా లేదు. హౌస్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించకపోవడమే ఫ్లోరాకు పెద్ద మైనస్. అయితే కామనర్స్ చేసిన ఓవరాక్షన్ వల్ల ఫ్లోరాకు ఓట్లు పడ్డాయి. తనను లేటుగానైనా పంపించొచ్చు, ముందు తలనొప్పిగా తయారైన కంటెస్టెంట్లను తరిమేద్దాం అన్న ఉద్దేశంతో మనీష్, ప్రియ, హరీశ్లను బయటకు తోసేశారు.స్కెచ్ వర్కవుట్ అయినట్లేనా?కానీ, తన వల్ల షోకి ఎటువంటి ప్లస్ లేకపోయేసరికి బిగ్బాస్ (Bigg Boss Telugu 9).. ఫ్లోరా ఎలిమినేషన్కు పెద్ద స్కెచ్ వేశాడు. తనను రెండువారాలు డైరెక్ట్గా నామినేట్ చేశాడు. పైగా ఈవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వచ్చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురిని హౌస్లో దింపుతున్నారు. కాబట్టి తనతో పనేం లేనందున ఫ్లోరాను హౌస్ నుంచి సాగనంపుతున్నారు.ఫ్లోరా ఏం చేసింది?ఫ్లోరా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతుంది. తిన్నామా, పడుకున్నామా, గేమ్స్ ఆడామా.. అంతే! అంతకుమించి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లేదు. సంచాలక్గా ఉన్నప్పుడైతే తప్పుల మీద తప్పులు చేస్తోంది. ఎవరైనా తనను నామినేట్ చేసినా, ప్రశ్నించినా సైలెంట్గా ఉంటుందే తప్ప తిరిగి కౌంటర్లివ్వడం చాలా అరుదు. ఇలాంటి సైలెంట్ కంటెస్టెంట్ జనాలకు అంతగా నచ్చరు. అందుకే లక్స్ పాప ఈ వారం బయటకు వచ్చేస్తోందన్నమాట!చదవండి: పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్: బిగ్బాస్ కంటెస్టెంట్ -
‘అరి’పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశంసలు
జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’ చిత్రం నిన్న(అక్టోబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ వారం వచ్చిన చిత్రాలన్నింట్లోనూ అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది.ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దర్శకుడు జయశంకర్ను అభినందించారు. ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు. అరి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. అర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. -
మొన్న విజయ్..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!
విజయ్ దేవరకొండ( Vijay Devarakonda), రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ డైరెక్ట్గా తమ ప్రేమ విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పకపోయినా.. చాలాసార్లు హింట్ ఇస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీకి చెందిన వారితోనే ప్రేమలో ఉన్నానని గతంలో విజయ్ చెప్పాడు. రష్మిక కూడా సింగిల్ కాదంటూ.. చెప్పేసింది. ఇలా పరోక్షంగానే ప్రేమ విషయాన్ని చెప్పిన ఈ జంట..ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు. మీడియాతో వార్తలు రావడం.. వాటిని వీరిద్దరు ఖండించకపోవడంతో ఎంగేజ్మెంట్ జరిగింది నిజమనే అంతా నమ్మారు. తాజాగా ఈ జంట తమ నిశ్చితార్థం విషయాన్ని కూడా పరోక్షంగానే అభిమానులతో పంచుకున్నారు.విజయ్ అలా.. రష్మిక ఇలావిజయ్-రష్మికల ఎంగేజ్మెంట్ ఈ నెల 3న జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే ఉంగరాలు మార్చుకున్నారట. ఈ విషయాన్ని మొదట విజయ్ పరోక్షంగా బయటకు తెలియజేశాడు. ఇటీవల ఆయన పుట్టపర్తికి వెళ్లాడు. అక్కడ ఆయన చేతికి ఉంగరం కనిపించింది. గతంలో ఎప్పుడూ ఉంగరం ధరించని విజయ్ చేతికి.. కొత్త రింగ్ కనిపించడంతో ఇది కచ్చితంగా ఎంగేజ్మెంట్దే అంటూ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా తన నిశ్చితార్థం విషయాన్ని పరోక్షంగానే బయటపెట్టింది. ఇన్స్టాలో తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో రష్మిక చేతికి డైమండ్ ఉంగరం ఉంది. అది హైలెట్ చేసేలా ఆ వీడియో ఉంది. దీంతో రష్మిక కూడా ఎంగేజ్మెంట్ విషయాన్ని బయటకు చెప్పడానికే ఆ వీడియో పెట్టిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.అలా ప్రేమలో..రష్మిక-విజయ్ కలిసి నటించిన తొలి సినిమా ‘గీత గోవిందం’. ఆ సినిమాలో వీరిద్దరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారట. ఆ తర్వాత ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు. అప్పటికే వీరిద్దరు ప్రేమలో ఉన్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక ‘థామా’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. విజయ్.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు రవి కిరణ్ కోలాతోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రోజు ఈ సినిమా పూజాకార్యక్రమం జరిగింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
'ఇడ్లీ కొట్టు' కలెక్షన్స్.. హిట్ సాంగ్ విడుదల చేసిన మేకర్స్
ధనుష్, నిత్యా మేనన్ జోడీగా నటించిన చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. కానీ, కోలీవుడ్లో మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్కు రప్పించిన సినిమాగా గుర్తింపు పొందింది. అయితే, తాజాగా ఈ సినిమాలో హింట్ సాంగ్ ఎన్న సుగమ్ వీడియో వర్షన్ను మేకర్స్ విడుదల చేశారు.ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ. 70 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో కూడా మంచి టాక్ వచ్చింటే వంద కోట్ల మార్క్ను దాటేసేది. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాపై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీలో ధనుష్ పాత్ర చాలామందిని తమ గతాన్ని గుర్తు చేసిందని చెబుతారు. తన వ్యక్తిత్వం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేసి.. తండ్రి వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తిలా జీవితాన్ని గడుపుతాడు. అతనికి తోడుగా నిత్యా మేనన్ తన నటనతో జీవించేసింది. -
వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మూవీ రివ్యూ
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. బలగం జగదీష్ నిర్మాతగా ఆర్యన్ సుభాష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ఈ వారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీలో కానిస్టేబుల్గా వరుణ్ సందేశ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు? అసలు ఈ మూవీ కథ ఏంటి? అన్నది చూద్దాం..కథేంటంటే..మోకిలా మండలంలోని శంకరపల్లి ఊర్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆడ, మగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ సీరియల్ కిల్లింగ్స్ పోలీసులకు పెద్ద ఛాలెంజింగ్గా మారుతుంది. అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా కాశీ (వరుణ్ సందేశ్) పని చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్లో కాశీ మేనకోడలు కీర్తి (నిత్య శ్రీ) కూడా బలి అవుతుంది. మరి ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనకాల ఉన్నది ఎవరు? కాశీ ఆ కిల్లర్ను పట్టుకుంటాడా? ఎవరిని అనుమానించినా సరే చివరకు వాళ్లు కూడా చనిపోతుంటారు? అసలు వీటన్నంటి వెనకాల ఉన్నది ఎవరు? చివరకు ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.ఎలా ఉందంటే..సీరియల్ కిల్లర్స్, క్రైమ్ స్టోరీలకు ఓ ఫార్మూలా ఉంటుంది. చాలా మంది ఆ ఫార్మూలాను వాడుకుని కథను అల్లుకుంటారు. కానీ కానిస్టేబుల్ విషయంలో మాత్రం అంతా కొత్తగా, డిఫరెంట్గా ఉంటుంది. ఆడియెన్స్ ఊహించి ఏదీ కూడా తెరపై జరగదు. ప్రతీ ఒక్క చోట ప్రేక్షకుడ్ని సర్ ప్రైజ్ చేసుకుంటూ వెళ్తుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా సీరియల్ కిల్లింగ్స్, కొందరి మీద అనుమానం వచ్చేలా సీన్లను చూపించడం, హీరో ఇంట్లోనే విషాదం జరగడం వంటి సీన్లతో సాగుతుంది. ఇంటర్వెల్కు ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్లో అసలు కథ రివీల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే ఊహకు భిన్నంగా ఉంటుంది. అలా మొత్తానికి ఓ మంచి క్రైమ్, థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..ఈ చిత్రంలో కాశీ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటాడు. వరుణ్ సందేశ్కు ఇలాంటి పాత్ర చాలా కొత్త. ఈ మూవీలో వరుణ్ సందేశ్ లుక్స్, యాక్టింగ్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్కు సర్ ప్రైజింగ్గా ఉంటాయి. హీరోయిన్ మధులిక పాత్ర కూడా మెప్పిస్తుంది. యాక్టింగ్కు ఓ మోస్తరుగా స్కోప్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక భవ్య శ్రీ, నిత్య శ్రీ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. అసలు ట్విస్ట్ ఏంటి? విలన్ ఎవరన్నది మాత్రం సినిమాలో చూస్తేనే కిక్ వస్తుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఇలాంటి సీరియల్ కిల్లింగ్ స్టోరీలకు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. ఇందులోనూ మంచి ఆర్ఆర్ ఉంటుంది. షైక్ హజారా కెమెరా కూడా సీన్లకు తగ్గట్టుగా మూడ్ను రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తాయి.ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగానే ఉన్నాయి. -
ఓజీ హీరోయిన్ 'ప్రియాంక' ఫోటోలు లీక్.. వార్నింగ్ ఇచ్చిన నటి
చెన్నై బ్యూటీ ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. తను స్నానానికి వెళ్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీలుగా వైరల్ అవుతున్నాయి. బాత్రూమ్ ఫోటోలు లీక్ అంటూ కొందరు ఫోటోలు షేర్ చేశారు. దీంతో తాజాగా ఆమె షోషల్ మీడియాలో రియాక్ట్ అయింది. రీసెంట్గా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఆయనకు సతీమణిగా ప్రియాంక మోహన్ నటించిన విషయం తెలిసిందే.వాస్తవంగా నెట్టింట వైరల్ అవుతున్న ప్రయాంక మోహన్ ఫోటోలు అన్నీ కూడా AI క్రియేట్ చేసినవే.. కానీ, అవి నిజమైన వాటి మాదిరిగానే ఉండటంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఆమె ఇలా స్పందించారు. ఇలాంటి నకిలీ ఫోటోలను వైరల్ చేయడం ఇకనైనా ఆపేయండి. నన్ను తప్పుగా చిత్రీకరించే కొన్ని AI-జనరేటెడ్ చిత్రాలు సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి వీటిని షేర్ చేయడం ఆపేయండి. AIని నైతిక సృజనాత్మకత కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి తప్పుడు సమాచారం కోసం కాదు. మనం ఏమి క్రియేట్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి వాటిని ఇతరులతో పంచుకుంటున్నాం అనేదాని గురించి జాగ్రత్తగా ఉండండి. అందరికీ ధన్యవాదాలు. అంటూ ఆమె షేర్ చేసింది.ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్, పవన్ కల్యాణ్ మధ్య సువ్వి.. సువ్వి సాంగ్ ఉంటుంది. ఆ పాటలో ఆమె ఇదే కాస్ట్యూమ్తో కనిపిస్తుంది. దీనిని ఛాన్స్గా తీసుకున్న కొందరు ఏఐ సాయంతో మరింత నీచంగా ఫోటోలు క్రియేట్ చేశారు. అవే ఇప్పుడు ప్రియాంకకు ఇబ్బందిగా మారాయి. నెటిజన్లు ప్రియాంక మోహన్కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ తీరుపై కాస్త ఏకాగ్రత పెట్టాలని సలహాలు ఇస్తున్నారు. ఏఐ సాయంతో ఇలాంటి ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసేవారిపై తప్పకుండా కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి ఆనందం కోసం మరోకరిని బలి చేయడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ (2019) చిత్రం ద్వారా ప్రియాంకా మోహన్ తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత శ్రీకారం, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో మెప్పించిన ఈ బ్యూటీ రీసెంట్గా ఓజీలో నటించింది. తమిళనాట శివ కార్తికేయన్ హీరోగా డాక్టర్, డాన్ సినిమాల్లో నటించింది.#priyankaMohan pic.twitter.com/wwyq3tnUC9— ❤️🩵🧡 (@ArjunPrathap13) October 10, 2025 -
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం.. హీరోయిన్ ఎవరంటే..
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త సినిమా రౌడీ జనార్దన్ (Rowdy Janardhan) ప్రారంభమైంది. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో మెప్పించిన క్లాసిక్ డైరెక్టర్ రవికిరణ్ ఇప్పుడు విజయ్తో భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుంది. గతంలో వీరిద్దరు కలిసి మహానటి మూవీలో కలిసి పనిచేశారు. ఇప్పుడు విజయ్కు జోడీగా ఆమె నటిస్తున్నారు. గతేడాదిలో కీర్తి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వివాహం తర్వాత ఆమె చేస్తున్న భారీ చిత్రం ఇదే కావడం విశేషం.ఫ్యామిలీస్టార్ మూవీ తర్వాత నిర్మాత దిల్ రాజు మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్నారు. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. SVC బ్యానర్లో భారీ బడ్జెట్తో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2026లో ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో విలన్గా నటుడు రాజశేఖర్ నటించబోతున్నారని సమాచారం. -
అక్క- బావ కాళ్లకు మొక్కిన నార్నె నితిన్.. వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, యంగ్ హీరో నార్నె నితిన్ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో శంకర్పల్లిలో ఈ వివాహ వేడుక జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ – స్వరూప దంపతుల కుమార్తె శివానీతో కలిసి నితిన్ ఏడడుగులు వేశారు. శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే, ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్లు అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కల్యాణ్ రామ్, రానా వంటి స్టార్ హీరోలు కూడా పెళ్లిలో సందడి చేశారు.కొత్త దంపతులను ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఆశీర్వదించారు. ఆ సమయంలో నితిన్ తన బావ ఎన్టీఆర్ కాళ్లకు నమస్కారం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆపై తారక్ కూడా వారిద్దరినీ చాలా ఆత్మీయతతో హగ్ చేసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథుల్ని కూడా తారక్ దంపతులే దగ్గరుండి ఆహ్వానించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడైన నితిన్ ‘మ్యాడ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్కు పరిచయమయ్యారనే విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
వరస్ట్ కంటెస్టెంట్ నుంచి కెప్టెన్గా కల్యాణ్.. గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ
తనూజ అమాయకత్వం, తింగరితనాన్ని బాగా వాడేసుకున్నాడు పవన్ కల్యాణ్. అతడిని సేఫ్ జోన్లో పడేయడంతో పాటు కెప్టెన్ అయ్యేందుకు దారులు పరిచింది తనూజ. అదెలాగో నిన్నటి (అక్టోబర్ 10వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..పూల్ టాస్క్కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎందుకు సేఫ్ జోన్లోకి పంపించావు, తనకంటే నువ్వే బాగా ఆడావు కదా! అని ఇమ్మాన్యుయేల్, దివ్య అడిగారు. అందుకు తనూజ.. మేము జట్టు కట్టేటప్పుడే సేఫ్ అవడంలాంటివి వస్తే తనే తీసుకుంటానన్నాడు. అప్పుడే మాటిచ్చాను అని చెప్పడంతో ఇమ్మూ-దివ్య నోరెళ్లబెట్టారు. ఇక డేంజర్ జోన్లో ఉన్నవారిలో ఒకర్ని సేఫ్ జోన్కు పంపించేందుకు బిగ్బాస్ చివరి ఛాన్స్గా పూల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అందరికంటే పవన్ బాగా ఆడాడు. ఈ గేమ్లో తనూజను దగ్గరుండి గెలిపించిన భరణి ఆమెను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయాడు.కల్యాణ్ను గెలిపించిన శ్రీజసేఫ్ జోన్లో ఉన్న ఇమ్మూ, కల్యాణ్, రాము, దివ్య, భరణి, తనూజ (Thanuja Puttaswamy)లకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇది చిన్నప్పుడు ఆడుకున్న దాగుడు మూతల ఆట. ఈ ఆటలో చివరకు కల్యాణ్, తనూజ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావాలన్నది డిసైడ్ చేయమని డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక్కడే శ్రీజ చక్రం తిప్పింది. తనూజకు అందరి సపోర్ట్ ఉంది.. కల్యాణ్కు లేదు.. అదీఇదీ చెప్పి అతడికి ఎక్కువ సపోర్ట్ వచ్చేలా చేసింది. కేవలం, సుమన్, సంజన మాత్రమే తనూజకు మద్దతిచ్చారు. మెజారిటీ సపోర్ట్ కల్యాణ్కు ఉండటంతో అతడు ఈ వారం కెప్టెన్గా నిలిచాడు.కల్యాణ్ను గుడ్డిగా నమ్మేస్తున్న తనూజకెప్టెన్సీ బ్యాండ్ దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానన్నాడు. తనను వరస్ట్ ప్లేయర్ అన్న దివ్యతో బ్యాండ్ కట్టించుకుని కాలర్ ఎగరేశాడు. అయితే తనూజ ఆట అర్థం కావట్లేదని ఇమ్మూ, భరణి చర్చించుకున్నారు. కల్యాణ్ను గుడ్డిగా నమ్మేస్తోంది. సేఫ్ అవ్వాల్సిన తను.. డేంజర్ జోన్కి వెళ్లిందే వాడివల్ల! అయినప్పటికీ తర్వాత మనం తనను డేంజర్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాం. కానీ, కెప్టెన్సీ టాస్క్లో మళ్లీ వాడ్ని సపోర్ట్ చేసింది అని గుసగులాడారు. తనూజ అమాయకత్వం కల్యాణ్కు బాగా కలిసొచ్చింది. కల్యాణ్ను కెప్టెన్ చేస్తానని గతవారం మాటిచ్చిన శ్రీజ.. తన మాట నిలబెట్టుకుంది.చదవండి: కాంతార విజయం.. రిషబ్కు మరో నేషనల్ అవార్డ్: స్టార్ డైరెక్టర్ -
కాంతార విజయం.. రిషబ్కు మరో నేషనల్ అవార్డ్ రావచ్చు: స్టార్ డైరెక్టర్
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇందులో ఆయన నటన చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. స్వయంగా దర్శకత్వం వహిస్తూనే ఇలా గొప్పగా నటించడం మామూలు విషయం కాదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్ శెట్టి మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో ఏకంగా ఈ చిత్రం రూ. 500 కోట్ల క్లబ్లో మొదటి వారంలోనే చేరిపోయింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్ కాంతార చాప్టర్ 1పై ప్రశంసలు కురిపించారు. రిషబ్ శెట్టి మరోసారి జాతీయ అవార్డ్ అందుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇండియా టుడేతో అట్లీ మాట్లాడుతూ.. కాంతార గురించి ఇలా చెప్పారు. 'సినిమా విడుదలైనప్పుడు నేను ఆమ్స్టర్డామ్లో ఉన్నాను. మొదటి రోజు సినిమా చూడటానికి సుమారు రెండున్నర గంటల పాటు కారులో వెళ్లాను. ఫైనల్గా ఫస్ట్ డే సినిమా చూశాను. థియేటర్ నుంచి వచ్చిన వెంటనే రిషబ్కు ఫోన్ చేసాను. అతను నాకు మంచి స్నేహితుడు. అతనంటే నాకు చాలా గౌరవం కూడా.. రిషబ్ శెట్టి చిత్రనిర్మాతలతో పాటు దర్శకులకు కూడా ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పగలను. కాంతార కోసం ఎవరూ చేయలేని పని అతను చేశారు. కాంతారలో నటించడమే కాకుండా దర్శకుడిగా పనిచేయడం అంటే సాధారణమైన విషయం కాదు. మరోకరికి ఇది సాధ్యం కాదని ఒక దర్శకుడిగా నేను చెప్పగలను. ఈ చిత్రంతో రిషబ్ తన నటనకు లేదా దర్శకుడిగా జాతీయ అవార్డ్ అందుకోవాలని ఆశిస్తున్నాను.' అని అట్లీ పేర్కొన్నారు.2022లో విడుదలైన కాంతార చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ను రిషబ్ శెట్టి అందుకున్నారు. అయితే, కాంతార చాప్టర్-1తో మరోసారి రిషబ్ నేషనల్ అవార్డ్ అందుకుంటారని దర్శకుడు అట్లీ పేర్కొన్నారు. 'జవాన్' చిత్రంతో బాలీవుడ్లో అట్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ కూడా జాతీయ అవార్డ్ అందుకున్నారు. -
'బెస్ట్ ఫేక్ న్యూస్' అవార్డ్ ఇవ్వండి.. సైమాకు సుదీప్ కౌంటర్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విలన్గా నటించబోతున్నారంటూ SIIMA (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. దీంతో సుదీప్( Sudeep) కూడా తనదైన స్టైల్లో సైమాపై పంచ్లు వేశారు. తమిళ హీరో శింబు, వెట్రిమారన్ మూవీలో విలన్ పాత్ర కోసం సుదీప్, ఉపేంద్ర ముందు వరుసలో ఉన్నారంటూ సైమా ఒక పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే సుదీప్ రియాక్ట్ అయ్యారు.సైమా గురించి సుదీప్ ఇలా అన్నారు. మీరు సైమా అవార్డ్స్ పేరుతో సాయంత్ర సమయంలో చేసే వేడుకపై నాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, మీ ఈ వార్తల విషయానికొస్తే.. ఒక సూచన ఇవ్వాలనిపించింది. ఇక నుంచి మీ మూలాలను మార్చుకొని గాసిప్స్ వార్తలు ప్రచారం చేసుకోండి. వచ్చే ఏడాది నుంచి బెస్ట్ ఫేక్ న్యూస్ అవార్డ్ పేరుతో సైమాలో చోటు కల్పించండి. అందులోనైనా మీ వార్తకు అవార్డ్ వస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. అని సుదీప్ కౌంటర్ ఇచ్చారు. అందుకు సైమా కూడా సరదాగా స్పందించింది. మీరు ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాం అంటూ మరో ట్వీట్ చేసింది. తమకు వచ్చే సమాచారాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకుంటామని చెప్పింది. అయితే మొదట చేసిన పోస్ట్ను సైమా వెంటనే తొలగించింది.కన్నడ బిగ్బాస్కు హోస్ట్గా ఉన్న సుదీప్.. తను నటించిన కొత్త చిత్రం 'మార్క్' కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2025 క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి విజయ్ కార్తీకేయ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలై 'మాక్స్' చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, శివరాజ్కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి నటించిన 45తో మార్క్ చిత్రానికి గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. ఆపై అదే సమయంలో దర్శన్ నటించిన ది డెవిల్ కూడా విడుదల కానుంది.Well @siima ...Huge respect for wat u do wth ua awards evenings. As for these news are concerned I have a suggestion.Whisper🤫: change ur sources. 🤗Also wanted to know if there is a "Best Fake News Award" coming up next SIIMA!! 😁 https://t.co/ydkA7k1E4W— Kichcha Sudeepa (@KicchaSudeep) October 10, 2025 -
శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్.. క్రేజీ హీరోతో రెండు సినిమాలు
ఇటీవల అమరన్ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మదరాసి చిత్రంతో కమర్షియల్ సక్సెస్ను సాధించిన నటుడు శివకార్తికేయన్. ఈయన తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఈయన నటిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. నటుడు రవి మోహన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటుడు అధర్వ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. టాలీవుడ్లో క్రేజీ కథానాయకిగా గుర్తింపు పొందిన శ్రీలీల( Sreeleela) కోలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రం ద్వారా నేరుగా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయం అవుతున్నారు. కాగా రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించబోతున్నారని సమాచారం. ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్లో డాన్ వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందిందన్నది గమనార్హం. ఈ చిత్రం నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారట.టీ మూవీలో కూడా నటి శ్రీలీల కథానాయకిగా నటించనున్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే లేదు. ఇదే గనుక నిజం అయితే ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ శివకార్తికేయన్తో సినిమాలు చేసిన హీరోయిన్గా గుర్తింపు పొందుతుంది. -
స్పెయిన్ టు ఫ్రాన్స్
స్పెయిన్లో వెంట వెంటనే లొకేషన్స్ షిఫ్ట్ అవుతున్నారు హీరో రవితేజ. ఆయన కెరీర్లోని 76వ సినిమా చిత్రీకరణ ఇటీవల స్పెయిన్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్పెయిన్లోని వాలెన్షియా, సమీప దీవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా మరో షూటింగ్ షెడ్యూల్ శుక్రవారం ప్రారంభమైనట్లు యూనిట్ పేర్కొంది. జెనీవా, ఫ్రాన్స్ లొకేషన్స్లో కూడా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశామని మేకర్స్ తెలిపారు.మొత్తం ఈ 25 రోజుల ఫారిన్ షెడ్యూల్లో కీలకమైన టాకీపార్టుతోపాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రెండుపాటలను కూడా చిత్రీకరించనున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
'నా తరఫున ఎవరూ నిలబడరని తెలుసు'.. మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్!
ఓ వ్యక్తి తనకు సారీ చెప్పేందుకు మూడు వారాల సమయం పట్టిందని టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ తెలిపింది. నేను ఈ సారి మౌనంగా ఉండాలని అనుకోలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నా తరఫున ఎవరూ నిలబడరని నాకు తెలుసు.. ఈ అనుభవం నన్ను లోతుగా గాయపరిచిందని తెలిపింది. నాకు కావల్సింది కేవలం ఒక నిజమైన క్షమాపణ.. బాధ్యతను స్వీకరించడం మాత్రమేనని మంచు లక్ష్మీ పోస్ట్ చేసింది.ఇలాంటి చిన్న చిన్న ప్రతిఘటనలే ఆడవాళ్ల గొంతుని మూగబోకుండా కాపాడతాయని మంచు లక్ష్మీ తన పోస్ట్లో రాసుకొచ్చింది. నాకంటే ముందు ధైర్యంగా మాట్లాడిన ఆడవాళ్ల వరుసలోనే నేనూ నిలబడి ఉన్నా… వారి ధైర్యమే నాకు రోజు బలాన్నిస్తుందని తెలిపింది. పత్రికా రంగం వృత్తిపై నాకు చాలా గౌరవం ఉందని.. ప్రజలకు నిజం తెలియజేయడంలో ప్రాణం పెట్టే జర్నలిస్టులు ఈ సమాజానికి వెలుగు చూపే దీపాల్లాంటి వారని కొనియాడింది. కానీ ఆ శక్తిని సార్థకమైన సంభాషణల కంటే వ్యక్తిగత దాడుల కోసం వాడినప్పుడే అది ఎంతో బాధని కలిగిస్తుందని రాసుకొచ్చింది. నేను ఇంతటితో ఈ విషయాన్ని ప్రశాంతంగా ముగిస్తున్నాను.. ఇకపైన కూడా ఆత్మగౌరవంతో నడవబోతున్నాను.. నిజాయితీతో తన కథని వినిపించే ప్రతి మహిళకు గౌరవం తెలియజేస్తున్న మంచు ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. ఇటీవల మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను వయస్సు గురించి ప్రశ్నించారు. ఇది కాస్తా పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. తాజాగా ఆ వ్యక్తి క్షమాపణలు కోరడంతో మంచు లక్ష్మీ వివరణ ఇచ్చింది. ఇక ఇలాంటివీ రిపీట్ కాకుండా చూసుకుంటానంటూ అతను మంచు లక్ష్మీని క్షమాపణలు కోరాడు. -
గ్రాండ్గా నార్నే నితిన్ పెళ్లి వేడుక.. బామ్మర్ది పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ సందడి!
మ్యాడ్ స్క్వేర్ హీరో నార్నే నితిన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్.. గతేడాది శివానీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట. తాజాగా ఇవాళ జరిగిన పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో సందడి చేశారు. పెళ్లికూతురి బ్యాక్ గ్రౌండ్ ఇదే..కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో గతేడాది నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాల కంటే ముందుగానే ఆయన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) అనే మూవీలో నటించారు. అదే నార్నే నితిన్ నటించిన మొదటి చిత్రం కావడం విశేషం. Mana tarak Anna 😍👌🔥 at Nithin naren wedding #JrNTR @tarak9999 pic.twitter.com/sRVaBcBZR6— NTR Fans (@NTR2NTR_FC) October 10, 2025 -
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. మటన్ సూప్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: మటన్ సూప్నిర్మాణ సంస్థలు - అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్నటీనటులు - రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులురచన, దర్శకత్వం - రామచంద్ర వట్టికూటినిర్మాతలు - మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల సినిమాటోగ్రఫీ : భరద్వాజ్, ఫణింద్ర మ్యూజిక్ : వెంకీ వీణ ఎడిటింగ్ : లోకేష్ కడలి విడుదల తేదీ: 10-10-2025నిజ సంఘటనల ఆధారంగా తీసిన లేటేస్ట్ మూవీ మటన్ సూప్. ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. డిఫరెంట్ టైటిల్తో డైరెక్టర్ రామచంద్ర వట్టికూటి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ చిత్రం ఆడియన్స్ను ఎంతమేర ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం.మటన్ సూప్ కథేంటంటే..శ్రీరాం (రమణ్) ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాడు. డబ్బులు ఇవ్వడం.. ఇవ్వకపోతే వారి నుంచి నిర్దాక్షిణ్యంగా వసూళ్లు చేయడం చేస్తుంటాడు. దీంతో అతనికి శత్రువులు ఎక్కువవుతారు. అతని పార్ట్నర్తో కలిసి చేసే వ్యాపారం వల్ల చాలా శ్రీరాంకు సమస్యలు వస్తుంటాయి. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన సత్యభామ (వర్ష విశ్వనాథ్)ను శ్రీరాం ప్రేమిస్తాడు. వీరిద్దరూ ప్రేమికుల రోజున పార్క్లో ఉండటం, గజగంగ్ దళ్ చూడటం.. అలా అక్కడే ఆ ఇద్దరికీ పెళ్లి చేయడం జరుగుతుంది.అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో శ్రీరాంపై కొందరు దాడి చేస్తారు. మొహంపై యాసిడ్ పోయటంతో మొత్తం కాలిపోతుంది. దీంతో శ్రీరాం హాస్పిటల్ పాలవుతాడు. శ్రీరాంను సత్య ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటుంటుంది. శ్రీరాంకి దగ్గరి బంధువైన శివరాం(జెమినీ సురేష్) ఈ దాడి మీద విచారణ చేస్తుంటాడు. అసలు దాడి ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఇంతకీ శ్రీరాంపై దాడి చేసిందెవరు? కృష్ణకు శ్రీరాంకు ఉన్న సంబంధం ఏంటి? అసలు శ్రీరాం తల్లికి వచ్చే అనుమానం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటే..ఈ మధ్య సినిమాల్లో కంటే ఎక్కువగా క్రైమ్స్, రకరకాల పద్దతుల్లో నేరాలు జరుగుతున్నాయి. అలా అందరినీ షాకింగ్కు గురి చేసే ఓ కేసుని తీసుకుని దర్శకుడు ఈ మటన్ సూప్ చిత్రాన్ని తెరకెక్కించాడు. డైరెక్టర్ రామచంద్ర వట్టికూటి ఎంచుకున్నఈ క్రైమ్ కథను అనుకున్న విధంగానే తెరపై ఆవిష్కరించాడు. ఇలాంటి క్రైమ్ కథల్లో ఉండే ట్విస్ట్లు మామూలే. సినిమా క్లైమాక్స్ ఏంటో అందరికీ ముందే తెలుస్తుంది. అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ చెప్పడంంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాలను రాసుకున్న తీరు ఆట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్లో బిల్డ్ చేసిన స్టోరీ.. సెకండాఫ్లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ సినిమాలో ఆకట్టుకునేలా ఉన్నాయి.ఎవరెలా చేశారంటే..రమణ్ ఇందులో రెండు పాత్రల్లో మెప్పించాడు. గత సినిమాతో పోలిస్తే నటన పరంగా తను మెరుగైనట్లు కనిపించాడు. హీరోయిన్ వర్ష విశ్వనాథ్ తన పాత్రలో మెప్పించింది. జెమినీ సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా నటించాడు. యాక్టర్ గోవింద్, గోపాల్ మహర్షి, కిరణ్ మేడసాని వారి పాత్రల పరిధి మేరకు నటించారు. భరద్వాజ్, ఫణీంద్ కెమెరా వర్క్, వెంకీ వేణు సంగీతం ఫర్వాలేదనిపించాయి. ఎడిటర్ తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. ఓవరాల్గా మటన్ సూప్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్గా ఓ సెక్షన్ను ఆకట్టుకునేలా ఉంది. -
అట్లీ మూవీ షూటింగ్ గ్యాప్.. విదేశాల్లో వాలిపోయిన బన్నీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఏఏ22 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ముంబయిలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించనున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్కు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఐకాన్ స్టార్ వెకేషన్లో చిల్ అవుతున్నారు. తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నారు. తాజాగా ఈ ఫోటోలను బన్నీ భార్య సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
జైలులో దర్శన్.. కొత్త సినిమా రొమాంటిక్ సాంగ్ విడుదల
కన్నడ హీరో దర్శన్ జైలులో ఉండగానే ఆయన నటించిన సినిమా విడుదల కానుంది. రేణుకాస్వామి హత్య కేసులో జైలుకెళ్లిన దర్శన్..బెయిల్పై బయటకొచ్చినప్పటికీ సుప్రీం కోర్టు ఎంట్రీతో ఆయన మళ్లీ జైలుకెళ్లారు. అయితే, దర్శన్ నటించిన కొత్త సినిమా 'డెవిల్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఒక పాటను తాజాగా విడుదల చేశారు. దీనిని సింగర్స్ కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 12న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో దర్శన్కు జోడీగా రచన రాయ్ నటించింది. దర్శకుడు ప్రకాష్ వీర్ తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్ టైమ్లో ఆయన బెయిల్ నుంచి బయటకు రావచ్చని సమాచారం. -
'ఇక్కడ నన్ను దొబ్బెస్తున్నారండి'.. చిరంజీవి సాంగ్పై బుల్లిరాజు అప్డేట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్ మరో హిట్కు రెడీ అయిపోయారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. దసరా కానుకగా సందర్భంగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.అయితే ప్రోమో రిలీజ్ తర్వాత మీసాల పిల్ల ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో అలరించిన బుల్లిరాజు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి అలరించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో అనిల్ రావిపూడితో బుల్లిరాజు చేసిన కామెడీ నవ్వులు తెప్పిస్తోంది. మీసాల పిల్ల ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని అందరూ నన్ను దొబ్బేస్తున్నారండి అంటూ బుల్లి రాజు భీమ్స్ సిసిరోలియోను అడిగాడు. వెళ్లి డైరెక్ట్గా డైరెక్టర్ను అడుగు అంటూ బుల్లిరాజు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి- బుల్లిరాజు మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు తెప్పిస్తోంది.ఈ చిత్రంలోని మీసాల పిల్ల లిరికల్ వీడియో ఫుల్ సాంగ్ అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియే సంగీతమందించారు. కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు.From fans, audiences to Bulli Raju, everyone is all excited to the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 💥#MeesaalaPilla Lyrical Video on Monday, 13th October ❤️🔥— https://t.co/EHn4RGd1j5A #Bheemsceciroleo Musical 🎵#ChiruANIL ~ #MSG Sankranthi 2026 RELEASE😎… pic.twitter.com/S2sY6uDEjy— Shine Screens (@Shine_Screens) October 10, 2025 -
అందుకే ‘జాతి రత్నాలు’తో పోల్చుతున్నారు : ‘మిత్రమండలి’ నిర్మాతలు
‘మిత్ర మండలి’ అనేది బడ్డీస్ కామెడీ. అందుకే అందరూ ‘జాతి రత్నాలు’ సినిమాతో పోల్చుతున్నారు. కానీ ‘జాతి రత్నాలు’ కథకు, మా సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మూవీని ఎంతలా ఎంజాయ్ చేశారో మా చిత్రాన్ని చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారు’ అన్నారు నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ బన్నీ వాస్ మాకు మంచి స్నేహితులు. ఓ సారి మా ఇద్దరినీ ఈ కథ వినమని చెప్పారు. కళ్యాణ్ ఎక్కువగా వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. మేం ఇద్దరం ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాం. ఆ టైంలో ఈ కథను విన్నాం. ఈ మూవీతో పాటుగా మరో రెండు ప్రాజెక్టుల్ని కూడా స్టార్ట్ చేశాం. వాసు వల్లే ఈ కథ మాకు వచ్చింది. ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్గా ఉంటుంది.→ విజయేందర్ మంచి దర్శకుడు. అనుదీప్, ‘మ్యాడ్’ కళ్యాణ్, ఆదిత్య హాసన్లతో విజయేందర్ పని చేశాడు. పూర్తి స్క్రిప్ట్తోనే మా వద్దకు వచ్చాడు. కథను ఎంత అద్భుతంగా రాసుకున్నాడో.. అంతే అద్భుతంగా తీశాడు. కొత్త దర్శకుడిలా, మొదటి సినిమాలా అనిపించలేదు.→ ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘జంబర్ గింబర్ లాలా’ పాటను అనుకోకుండా చిత్రీకరించాం. ముందు అసలు ఆ పాటను అనుకోలేదు. కానీ మాకు సినిమా పూర్తయిన తరువాత ఏదో అసంతృప్తిగా అనిపించింది. దీంతో బ్రహ్మానందం గారితో అలా పాటను చిత్రీకరించాం. ఆయన కూడా ఆ పాటను, లిరిక్స్ను ఎంజాయ్ చేశారు.→ ఈ సినిమా కోసం ‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్ టౌన్తో పాటు ఫిక్షనల్ క్యాస్ట్ని డైరెక్టర్ క్రియేట్ చేశాడు. ఆ ఫిక్షనల్ టౌన్లో జరిగే కథ, అందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఫిక్షనల్ క్యాస్ట్తో సమాజంలో ఉన్న క్యాస్ట్ సిస్టం మీద సెటైరికల్గా సీన్లను చిత్రీకరించాం. ఈ చిత్రం ఎక్కువగా యూత్కు రిలేట్ అవుతుంది.. వారికి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది.→ మేం అన్ని రకాల జానర్లలో చిత్రాల్ని చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్తో వస్తున్నాం. త్వరలోనే హారర్ మూవీని ప్రారంభించనున్నాం. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథలతో సినిమాల్ని తీయాలని అనుకుంటున్నాం. -
నా 'హనీమూన్' ఎప్పుడో మీరే ఫిక్స్ చేయండి: త్రిష
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోతుందని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే, ఈసారి నిజమనే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే త్రిష తన సోషల్మీడియాలో ఒక పోస్ట్ చేసింది. చాలామంది అభిమానులు నా జీవితాన్ని కూడా నిర్ణయించేస్తున్నారు. ఇంకేముంది నా హనీమూన్ షెడ్యూల్ కూడా మీరే ప్లాన్ చేయండి అంటూ ఆమె ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ గురించి ఆమె ఇలా సరదాగా రియాక్ట్ అయింది.చండీగఢ్ వ్యాపారవేత్తను త్రిష వివాహం చేసుకోబోతోందంటూ తమిళనాడులో వార్తలు వైరల్ అయ్యాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలిపారని కూడా పెద్ద ఎత్తున బాలీవుడ్లో కూడా ప్రముఖ మీడియా సంస్థలు ప్రకటించాయి. తమిళం, తెలుగు పరిశ్రమలో సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు. చండీగఢ్లో ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్న అతని గురించి వివరాలు పరిమితంగా ఉన్నాయంటూనే రెండు కుటుంబాల మధ్య పరిచయం చాలా సంవత్సరాల నుంచే ఉందంటూ పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. దీంతో ఈ రూమర్స్పై నిజమనే సంకేతాలు ఇస్తున్నాయని నెటిజన్లు పేర్కొన్నారు. కానీ, తాజాగా త్రిష చేసిన పోస్ట్తో అదంతా ఫేక్ అని మరోసారి క్లారిటీ అయింది.2015లో వరుణ్ మణియన్ అనే బిజినెస్మ్యాన్తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్నిరోజులకు విబేధాలు రావడంతో పెళ్లి చేసుకోలేదు. మరోవైపు వరుస సినిమాలతో త్రిష బిజీగా ఉంది. చిరంజీవి విశ్వంభరలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే.