Lifestyle
-
'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే ఏకంగా పదికిలోలు..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మూవీ రికార్డు రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదురోజుల వరకు అలానే కొనసాగుతూ వెళ్తోందంటే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీలో స్పై హంజా అలీ మజారిగా నటించిన రణవీర్ సింగ్ ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా క్రూరంగా కనిపించేందుకు చాలా తక్కువ టైంలోనే పదికిలోలు పైనే బరువు పెరిగారట. విలక్షణ పాత్రలతో అభిమానులను మెప్పించే రణవీర్ ఫిజిక్ పరంగా చాలా కేర్ తీసుకుంటారట. అది కూడా ఆరోగ్యకరమైన రీతీలోను ఉంటుందని, ఎలాంటి షార్టకట్లు ఫాలో అవ్వరని చెబుతున్నాడు అతని ఫిట్నెస్ కోచ్. అంత తక్కువ వ్యవధిలో రణవీర్ శరీరాన్ని అంతలా ఎలా మార్చగలిగాడో తెలుసుకుందామా..!.గత కొన్నేళ్లుగా, నటుడిగా రణవీర్ సింగ్ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతలా అభిమానులను కట్టిపడేసేలా తెరపై ఆ పాత్రను పండించడం కోసం రణవీర్ ఎంతలా కష్టపడ్డారో వింటే నోటమాట రాదు. ఆ విషయాన్ని స్వయంగా ఆ మూవీలో నటించని సహనటుడు, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ ముస్తఫా అహ్మద్ వెల్లడించారు. ఆయన 'ధురంధర్: ది రివెంజ్'లో రిజ్వాన్ షా పాత్రలో ఒదిగిపోయారు. ఫిట్నెస్ కోచ్ ముస్తఫా రణవీర్ సింగ్ తెరపై క్రూరంగా కనిపంచడం కోసం కేవలం ఆరు వారాల్లోనే పదికిలోల బరువు పెరిగారట. నిజానికి షూటింగ్ చేసే సమయం తక్కవు ఉండటంతో చాలా తక్కువ వ్యవధిలోనే రణవీర్సింగ్ బరువు పెరగక తప్పని పరిస్థితని చెప్పుకొచ్చారు. రణవీర్ దాదాపు పదికిలోలు దాక పెరగాల్సి ఉంది. అయితే ఆ టైంకి రణవీర్ బరువు కేవలం 76 నుంచి 77 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణవీర్ ఏకంగా 87-88 కిలోలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రణవీర్కి ఏ పని అప్పగించినా ఓ యంత్రంలా చేసేస్తారని అంటున్నాడు కోచ్ ముస్తఫా. తాను రోజుకు 3,000-3,600 కేలరీలు తీసుకుంటుండగా, రణ్వీర్ తీసుకునేది రోజుకు 3,600 నుండి 4,000 కేలరీలు. అందులో ఎక్కువ భాగం 600-700 కేలరీలు ప్రోటీన్ షేక్ల నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే రోజుకు రెండు ప్రోటీన్ షేక్లు, 240 గ్రాముల ప్రోటీన్ కోసం చికెన్, మటన్ ఎక్కువుగా తీసుకునేవాడట. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) తాను ఆరువారాల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైన్ చేశానని, మిగతా మొత్త ఆయన స్వయంగా కేర్ తీసుకున్నదేనని అంటున్నాడు. షూటింగ్ షెడ్యూల్ రీత్యా పూర్తి స్థాయిలో ఆయనకు శిక్షణ ఇవ్వకపోయినా రణవీర్ తన పాత్ర బాగా కనిపించాలనే ఉద్దేశ్యతో చాలా జాగ్రత్తతు తీసుకుంటారని, ఆ విషయంలో ఆయనకు సాటిరారెవ్వరూ అని ప్రశంసిస్తున్నాడు. శ్వాసను మెరుగుపరుచుకుంటూ..వెయిట్ ట్రైనింగ్ చేస్తాడు. చాలామంది శరీరం కండలు తిరిగిన దేహంలా కనిపించేలా చేస్తే..ఆయన మాత్రం బలంతో కూడిన కండరాల కోసం ప్రయత్నిస్తాడని అన్నారు. తెరపై అతడు చాలా సమర్థుడైన వ్యక్తిలా కనిపించేందుకు భోజన విరామ సమయంలో సైతం వెయిట్ ట్రైనింగ్ చేసేవాడని అన్నారు. అలా చేస్తే ఫిట్నెస్ కోచ్కి ట్రైనింగ్ సులభతరం అవుతుందని చెబుతున్నాడు. ఇక్కడ రణవీర్ ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో చాలా ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు పెరిగారనేది గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. కాగా, రణవీర్ సింగ్, ముస్తఫా ఈ మూవీ కోసం దాదాపు 16 నుంచి 18 గంటలు చిత్రీకరణలో పాల్గొన్నారట.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్
భారత్లో ఫిట్నెస్ అందరికీ అందుబాటులో ఉండేలా అవగాహన కల్పిచే వ్యక్తుల్లో ప్రముఖులు మిలింద్ సోమన్. ఆయన 90వ దశకపు పాప్ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి నుంచి..ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్కు పోస్టర్ బాయ్గా మారే వరకు సోమన్ ప్రయాణం..కండరాల నిర్మాణం కంటే..క్రమశిక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చేసే మారథాన్లు, లాంగ్ వాక్లు అన్ని ఆర్భాటానికి తావివ్వకుండా చెప్పులు కూడా లేకుండా నిశబ్దంగా సాగుతాయి. అలాంటి సోమన్ దంపతులు హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలంటే ఆహరంతో కాకుండా, కదలికలతో బంధాన్ని ఏర్పాటు చేసుకోండి అని పిలుపునిస్తూ..పలు ఆసక్తికర ఫిట్నెస్ సలహాలు ఇచ్చారు. అవేంటంటే..సోమన్ దృష్టిలో, ఫిట్నెస్ అంటే ఒకేసారి చేసే వ్యాయామాలు లేదా ఒకే రకమైన దినచర్యలు కాదని అంటారు. ఇది ఉమ్మడి లక్ష్యానికి సంబంధించినదిగా చేసుకుంటే దంపతులు ఇరువురు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. జంటలు కలసి వ్యాయామాలకు సంబంధించి..సింపుల్ వాటిని ఎంచుకుంటూ సాగితే..వారి మధ్య బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. అంతేగాదు జీవితం నుంచి ఇరువురు ఏం ఆశిస్తున్నారో ఇద్దరికీ స్పష్టత వస్తుంది. ఇక్కడ సోమన్ తాను ఎక్కువసేపు శ్రమించే కార్యకలాపాలవైపు మొగ్గు చూపితే..ఆమె యోగా ద్వారా ప్రశాంతతను తీసుకువస్తుందట. ఈ వైరుధ్యం వారిని విభజించకుండా, ఇద్దరి విధానాలను మరింతగా బలపరించిందని చెబుతున్నారు సోమన్. ప్రతిసారి ఒకే వర్కౌట్లని చేయడం కాదు, ఆరోగ్యంగా ఉండటానికి ఒకరి విధానాన్ని మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) జంక్ ఫుడ్ డేట్స్కు అతీతంగాచాలామటుకు దంపతులు భోజనానికి బయట ప్రాధాన్యత ఇస్తారు. అర్థారాత్రి వరకు చిరుతిండ్లు తినడం, వారాంతపు విలాసాలతో బిజీగా ఉంటారు. అయితే దంపతులు ఈ అలవాట్లను శారీరక కార్యకలాపాలతో భర్తీ చేస్తే..ఇద్దరి ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుతుందని పిలుపునిస్తున్నారు. అవి సరదా సరదాగా సాగే విహారయాత్రలు, వాకింగ్, ఈత కొట్టడం, తదితర మార్గాల్లో కొత్తదనంతో కూడిన వ్యాయామ కదలికలను అన్వేషించాలి. ఇవి శారీరక మానిసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసే మంచి అలవాట్లకు మారతాయట. ఈ జీవనశైలితో జంటలు మరింత బలంగా, సంతోషంగా, పైగా ఒకరికొకరు అనేలా అనుబంధంగా ఉంటారని బలంగా నమ్ముతానని చెబుతున్నారు సోమన్. సోమన్ ఫిట్నెస్..తరచుగా ఫిట్నెస్ ఐకాన్గా పిలిచే సోమన్ దినచర్య ఎంతమాత్రం కఠినంగా ఉండదు. ఆయన జిమ్కి వెళ్లరు, పర్సనల్ ట్రైనర్ కూడా లేరు. కానీ కొన్ని వారాలు లేదా మూడు, నాలుగుసార్లు పరుగెట్టడం, మరికొన్ని వారాలు అస్సలు పరిగెత్తకుండా ఉంటారు. తీవ్రత వ్యాయామాల కంటే..నిలకడకు ప్రాధాన్యత ఇస్తారు సోమన్. ఎక్కువగా పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటి ప్రాథమిక వ్యాయామాలు చేస్తుంటారు. ప్రయాణిస్తున్నప్పుడూ కూడా కదలకలు ఉండేలా చూసుకుంటారాయన.ఫిట్నెస్ ప్రయాణంపై మహిళలకు సూచనలు..బిజీగా ఉండే పట్టణ జీవనశైలిలో ఉన్న మహిళలకు సోమన్ ఆచరణాత్మకమైన సలహాలందించారు. అవేంటంటే..మూడు కిలోల మీటర్ల దూరం నుంచి క్రమంగా ఐదు లేదా పది కిలోమీటర్లకు నడక పెంచడం. అలాగే అతివేగంగా వ్యాయామాలు చేయొద్దని సూచించారు. అన్నింటికంటే నిలకడను నేర్చుకోమని చెబుతున్నారు. తాను తొమ్మిదేళ్ల వయసులో జాతీయ స్థాయి ఈతగాడిగా లైఫ్ని ప్రారంభించి..కదలికల చుట్టూ కేంద్రీకృతమైన జీవితానికి పునాది వేశానని చెబుతున్నారు. ఆయన క్రీడాకారుడి నుంచి సూపర్మోడల్గా, చివరికి ఫిట్నెస్ కోసం బహిరంగంగా ప్రచారం చేసే వ్యక్తిగా మారడం వరకు చూస్తే..అదంగా అసాధారణంగా కనిపిస్తుందని అన్నారు. సోమన్ దార్శనికతను ప్రతిబింబించే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది పింకాథాన్ మాత్రమే. కేవలం మహిళల కోసం ఒక పరుగు పోటీగా ప్రారంభమైన ఇది, క్రమంగా మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకోవడం విశేషం.మొదటిసారి పరుగెత్తేవారి నుంచి దృష్టి లోపం ఉన్నవారి వరకు, పసిపిల్లలతో పరుగెత్తే తల్లుల నుంచి చీరలు కట్టుకున్న అమ్మమ్మల వరకు, ఫిట్నెస్ ఎవరి కోసం అనే మూస ధోరణులను పింకాథాన్ నిరంతరం సవాలు చేస్తూ వస్తోంది.దాని ఎదుగుదల కూడా అంతే స్పష్టంగా ఉంది. వివిధ నగరాల్లో పాల్గొనేవారి సంఖ్య పెరగడంతో, వేలాది మంది మహిళలు ఇందులో చేరడంతో, ఈ కార్యక్రమం కేవలం ఒక మారథాన్ స్థాయిని దాటిపోయింది. ఇది ఇప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించే ఒక సమాజంగా మారింది. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) (చదవండి: పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!) -
ఇండియాలోనే స్విట్జర్లాండ్
లడఖ్ ప్రాంతం సమ్మర్లో ప్రత్యేక దృశ్యాన్ని అందిస్తుంది. హిమాలయాల కొండల మధ్య ఉన్న లోయలు, మోనాస్టరీస్ మధ్య నడిచే ప్రయాణం ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఉదయం వేళలో పర్వతాలపై పడే సూర్యకిరణాలు చుట్టుపక్కల ప్రాంతాలను బంగారు రంగులోకి మార్చేస్తాయి.గ్రామాల మధ్య జీవనంచిన్న గ్రామాల్లో ప్రజల జీవనం ప్రకృతి రిథమ్తో కలిసి నడుస్తుంది. వీధుల్లో నడిచే ప్రజలు, మోనాస్టరీస్ పక్కన కనిపించే ప్రశాంత వాతావరణం ప్రయాణికులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. హిమాలయన్ గాలులు, దూరంగా కనిపించే మంచు పర్వతాలు ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా వాయు మార్గంలో లేదా ట్రైన్ ద్వారా ఢిల్లీకి చేరుకోవాలి. అక్కడి నుంచి లేహ్కి డైరెక్ట్ ఫ్లైట్ వెళ్లవచ్చు. లేహ్ విమానాశ్రయం నుండి ప్రయాణం ప్రారంభమైన తర్వాత హిమాలయాల మధ్య రోడ్ జర్నీ ఒక అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. జీరో వాలీ అనే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక అందమైన లోయ. ఈస్టర్న్ హిమాలయాస్ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం సమ్మర్లో పచ్చని రంగులతో కనిపిస్తుంది. వ్యాలీ మధ్య స్ప్రెడ్ అయిన పాడీ ఫీల్డ్స్, ఫారెస్ట్ ప్రాంతం ఈ ప్రదేశాన్ని ఒక నేచురల్ కాన్వాస్లా మార్చేస్తాయి. ఉదయ సమయంలో వ్యాలీ మీద పడే సాఫ్ట్ వెలుగు చుట్టూ ఉన్న హిల్స్ని మరింత అందంగా చూపిస్తుంది. మేఘాలు కొండల మధ్య నెమ్మదిగా సాగుతుంటే, ఈ ప్రదేశం మొత్తం ఒక ప్రశాంతమైన మరో లోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది.అపాతాని సంస్కృతిజీరో వాలీలో జీవించే అపాతాని ట్రైబ్ ప్రజల జీవనం ప్రకృతితో కలిసి నడుస్తుంది. విలేజెస్ మధ్య కనిపించే బాంబూ హౌజెస్, పాడీ ఫీల్డ్స్ మధ్య ఉన్న ఫుట్పాత్స్ ఈ ప్రదేశంలో లైఫ్ రిథమ్ ఎలా ఉంటుందో చూపిస్తాయి. స్థానిక మార్కెట్లలో ప్రజలు సమయం గడపడం, వ్యాలీ మధ్యలో కనిపించే గ్రామాలు ఈ ప్రయాణాన్ని ఒక కల్చరల్ అనుభవంగా మార్చేస్తాయి. సమ్మర్ సీజన్లో వ్యాలీలో పచ్చని రంగులు మరింత విస్తృతంగా కనిపిస్తాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ముందుగా అస్సాంలోని గౌహతి వరకు వాయు మార్గంలో చేరుకోవచ్చు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో జీరో వ్యాలీకి వెళ్లవచ్చు. గౌహతి నుంచి ఇటానగర్ మీదుగా కొండల మధ్య నడిచే రోడ్స్ ద్వారా వ్యాలీ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈస్టర్న్ హిమాలయాస్ మధ్య నడిచే ఈ రోడ్డు ప్రయాణంలో అడవులు, లోయలు, జలపాతాలు ఎన్నో కనిపిస్తాయి. ఇవన్నీ మీ ప్రయాణాన్ని ఒక మెమోరబుల్ జర్నీగా మార్చేస్తాయి. (చదవండి: లాంజ్లో ఫ్రీగా కూర్చోవడానికి ఇలా చేయండి) -
పక్షవాతానికి వార్నింగ్ బెల్..!
పక్షవాతం అనే సమస్య అకస్మాత్తుగా వైకల్యం తెచ్చిపెట్టి మరొకరిపై ఆధారపడేలా చేస్తుంది. ఒకసారి పక్షవాతానికి గురైతే చాలాకాలం మరొకరిపై ఆధారపడాల్సి రావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో జీవితాంతం ఆ బాధ తప్పకపోచ్చు. అయితే అంతటి తీవ్రమైన పక్షవాతం కూడా తాను వచ్చే ముందర కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతుంది. వాటిని తెలుసుకుని ముందే జాగ్రత్త పడితే ఆ ముప్పు తప్పుతుంది. ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ (టీఐఏ) అనేవే ఆ వార్నింగ్ సిగ్నల్స్. ప్రమాద ఘంటికలను మోగించే ఆ హెచ్చరిక ఏమిటో చూద్దాం...ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (సంక్షిప్తంగా ‘టీఐఏ’)ను పక్షవాతానికి (బ్రెయిన్ స్ట్రోక్కు) ముందస్తు సూచనగా పరిగణించవచ్చు. పక్షవాతంలో ఉండే లక్షణాలే ‘టీఐఏ’లోనూ కనిపిస్తయి. కాకపోతే అవి తాత్కాలికంగా కనిపించి తగ్గిపోతాయి. కానీ పక్షవాతంలో అలా కాదు. ఆ లక్షణాలు అలాగే ఉండిపోతాయి. ఈ నేపథ్యంలో ‘టీఐఏ’ను ఓ ముందస్తు హెచ్చరికలా పరిగణించి, జాగ్రత్తపడితే భవిష్యత్తులో వచ్చే వైకల్యపు ముప్పు చాలావరకు నివారించవచ్చు. అయితే టీఐఏ ఒకసారి కనిపించిందంటే అది మళ్లీ వచ్చేందుకు (రికరెన్స్కు) అవకాశం ఎక్కువ. అందుకే దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎందుకు వచ్చిందో తెలుసుకుని, పక్షవాతానికి వాడే మందుల్ని జీవితాంతం వాడాలి. పక్షవాతమే వచ్చినంత జాగ్రత్తగా ఉండాలి. టీఐఏ లక్షణాలు: ముఖంలోని ఓ పక్కభాగంలో అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం ఒకవైపు చేయి లేదా కాలూ బలహీనపడటం లేదా తాత్కాలికంగా పడిపోవడం మాట ముద్దముద్దగా రావడం లేదా మాట పడిపోవడం నిలకడగా నిలవలేకపోవడం (బ్యాలెన్స్ తప్పడం) అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లు కనిపించకపోవడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్లో ఈ లక్షణాలన్నీ సాధారణంగా కాసేపే ఉండవచ్చు. ఇవన్నీ గంటలోపే తగ్గిపోతాయి. అయితే పక్షవాతం వచ్చినప్పుడు అవే లక్షణాలు చాలాకాలం పాటు లేదా జీవితాంతం ఉండిపోతాయి. అందుకే టీఐఏ హెచ్చరికలను సీరియస్గా తీసుకుని, డాక్టర్ను సంప్రదించి వారు సూచించిన మందులు, సలహాలు పాటించాలి. అంతేకాకుండా... తగిన జీవనశైలి మార్పులతో (లైఫ్స్టైల్ మాడిఫికేషన్స్తో) భవిష్యత్తులో రాబోయే పక్షవాతాన్ని నివారించుకోవచ్చు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్కు కారణాలు... 1) మెదడుకు రక్తాన్ని సప్లై చేసే రక్తనాళాలు లేదా మెదడులోని రక్తనాళాలు సన్నబడటం. 2) గుండెలో లేదా మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, అవి రక్తప్రవాహంలో కొట్టుకు΄ోయి మెదడులోని రక్తసరఫరాకు అడ్డుపడటం. టీఐయే / పక్షవాతం ముప్పు ఎవరెవరిలో... రక్తంలో కొవ్వులు ఎక్కువగా ఉన్నవారిలో అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉన్నవారిలో పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారిలో నిద్రలో గురకపెట్టే వారిలో (స్లీప్ ఆప్నియా), నిర్ధారణ: టీఐఏ లక్షణాల ఆధారంగా దాన్ని నిర్ధారణ చేయడం తేలికే. సాధారణంగా ఎమ్మారై బ్రెయిన్, కెరోటిడ్ డాప్లర్ ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్ కోయాగ్యులేషన్ పారామీటర్స్ వంటి పరీక్షలతో టీఐఏని నిర్ధారణ చేస్తారు. చికిత్స: రక్తాన్ని పలుచబార్చే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అసిట్రోమ్, స్టాటిన్స్ వంటి మందులను సూచిస్తారు. రక్తనాళాలు సన్నబారడం 70 శాతం కంటే ఎక్కువగా జరిగితే స్టెంటింగ్ లేదా ఎండరాక్టమీ వంటి ప్రక్రియలు చేయాల్సిరావచ్చు.డా. రంజిత్, సీనియర్ న్యూరాలజిస్ట్ (చదవండి: 'మత్తు'కు మందు ఇలా..!) -
జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!
బరువు తగ్గడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా భావిస్తుంటారు చాలామంది. అలాంటిది ఆరు పదుల వయసులో వెయిట్లాస్కు ఉపక్రమించి సక్సెస్ అందుకుంది ఈ మహిళ. అది కూడా మూడు నెలల్లో తగ్గి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ప్రూవ్ చేసింది. ఒత్తిడితో కూడిన వృత్తిజీవితాన్ని హ్యాండిల్ చేస్తూ..బరువు తగ్గడం విశేషం. మరి అంతలా స్లిమ్గా మారిన ఆ మహిళ ఫిట్నెస్ మంత్రా ఏంటో చూద్దామా..!.కెరీర్ కోచ్ అయిన క్రిస్ బోయెట్చెర్ తాను ఫిట్నెస్కి వయసు ఎప్పుడు అడ్డంకి కాదని నిరూపించడానికే ఈ వెయిట్లాస్ జర్నీకి ఉపక్రమించినట్లు తెలిపారు. ఇంతకుమునుపు పని నిమిత్తం జర్నీలు, ఎక్కువ గంటల పని, తదితరాలతో బిజీగా గడిపి, ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. అందుకే తన జీవితానికి అనుకూలమైన వ్యవస్థకు కట్టుబడి ఉండాలని డిసైడ్ అయ్యానని అంటోంది. అలా మూడు నెలల్లో తన శరీరాకృతిని మార్చుకోగలిగానని అంటోంది. ఆ క్రమంలో దశాబ్దాలుగా అనుభూతి చెందని బలాన్ని తిరిగి పొందగలిగానని చెబుతోంది. తనకు ఎంత తీరిక లేని దినచర్యతో ఉన్నప్పటికీ, క్రమబద్ధమైన ప్లాన్ని మిస్ చేయలేదట. ఇన్నాళ్లు ఆత్యానూన్యత భావంతో ఉన్న అధిక బరువుని..సక్రమమైన జీవనశైలితో చెక్పెట్టి స్లిమ్గా మారినిట్లు చెబుతోంది. అలా 73 కిలోల నుంచి 66 కిలోలకు అనూహ్యంగా తగ్గిపోయానని అంటోంది. అలాగే తానేమి కఠినమైన త్యాగాలు చేయలేదని, తన వాస్తవిక జీవితానికి అనుకూలమైన, నిర్వహించదగిన జీవనశైలిని ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ ప్రణాళిక పక్కాగా ఫాలో అయ్యేలా కేర్ తీసుకున్నానని, దాంతో నాజూకుగా మారి ఆత్మవిశ్వాసంతో అందరి ముందుకు రాగలిగానని అంటోంది. నెటిజన్లు సైతం ఆమె రూపు రేఖల్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని దశాబ్దాలు జీవించినా సరైన జీవన విధానం, నిరంతర కృషి, బలం, ఆత్మవిశ్వాసంతో మొత్తం ఆరోగ్యాన్ని ఇట్టే మార్చుకోగలరని ప్రూవ్చేసింది, స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేరీ అంటూ పోస్టులు పెడుతున్నారు. Mary is a 62 year old administrator.She thought she would never lose the belly fat and build strength at her age.Mary was beginning to believe "I'm too old for that." But she decided to try anyway.She was dealing with travel for work, long hours, and the belief that her… pic.twitter.com/atZvUZgTnO— Chris Boettcher (@chrisboettcher9) February 16, 2026 (చదవండి: మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..) -
ఒక వ్యక్తిని 'కరిష్మాటిక్' అని ఎప్పుడు పిలుస్తారంటే..
చాలామంది కరిష్మా (Charisma) పుట్టుకతో వచ్చే వరం అనుకుంటారు, లేదా కేవలం సినిమా స్టార్లకు మాత్రమే ఉంటుందని భ్రమిస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, కరిష్మా అనేది నేర్చుకోగలిగే ఒక Behavioral Skill.కరిష్మా అంటే అందంగా ఉండటం కాదు, ఎదుటివారిని 'అందంగా' ఫీలయ్యేలా చేయడం. మీరు ఒక గదిలోకి అడుగుపెట్టినప్పుడు, అక్కడ ఉన్న వాతావరణం మీ రాకతో పాజిటివ్గా మారితే... అదే కరిష్మా. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పక్కన ఉంటే మనకు తెలియని ఒక ఉత్సాహం, నమ్మకం కలుగుతాయి. దీనికి వెనుక ఉన్న సైన్స్ మరియు సైకాలజీని డీకోడ్ చేద్దాం.The Charisma Trifectaఒక వ్యక్తిని మనం 'కరిష్మాటిక్' అని ఎప్పుడు అంటామంటే, వారిలో ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడు:1. Presence: మీరు ఎవరితో ఉన్నారో, ఆ క్షణంలో పూర్తిగా వారితోనే ఉండటం. మీ మనసు ఎక్కడో ఉండి, మీరు అక్కడ ఉన్నట్లు నటిస్తే కరిష్మా మాయమైపోతుంది. మీ ఏకాగ్రతే మీ ఆకర్షణ.2. Power: ఇది ఎదుటివారిని భయపెట్టే శక్తి కాదు. మీ జ్ఞానం, మీ హోదా, మీ ఆత్మవిశ్వాసం లేదా మీ శారీరక దృఢత్వం ద్వారా వచ్చే 'ప్రభావం'. లోకానికి మీరు ఏదో ఒకటి సాధించగలరనే నమ్మకం కలిగించడం.3. Warmth: మీ శక్తిని ఎదుటివారి మేలు కోసం వాడతారనే భరోసా. మీరు ఎంత పవర్ఫుల్ అయినా, మీలో ఆత్మీయత లేకపోతే మిమ్మల్ని 'అహంకారి' అంటారు. శక్తికి ఆత్మీయత తోడైనప్పుడే అది 'కరిష్మా' అవుతుంది.The Halo Effectసైకాలజీలో Halo Effect అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక వ్యక్తిలో ఒక మంచి లక్షణం ఉంటే, మన మెదడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి తెలివైనవాడు, నమ్మదగ్గవాడు అని భావిస్తుంది. ఉదాహరణకు, మంచి డ్రెస్సింగ్ లేదా మంచి నవ్వు. కరిష్మాటిక్ వ్యక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తమ బాడీ లాంగ్వేజ్ని, ప్రెజెన్స్ని అద్భుతంగా మెయింటైన్ చేస్తారు.రియల్ కరిష్మామోటివేషన్ స్పీకర్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు "ఎప్పుడూ నవ్వుతూ ఉండు, బిగ్గరగా మాట్లాడు, అందరినీ పొగుడు" అని చెప్తుంది. ఇది ఒక్కోసారి Fake గా అనిపిస్తుంది. కానీ కరిష్మా అనేది లోపలి నుండి రావాలి. మీరు మీ గురించి మీరు గొప్పగా ఫీలైనప్పుడు, ఎదుటివారిలో మంచిని చూడగలిగినప్పుడు మీ కళ్ళలో ఒక మెరుపు వస్తుంది. అదే అసలైన ఆకర్షణ.మీ చరిష్మా కోడ్ని అన్లాక్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీరు ఒక ఆకర్షణీయమైన లీడర్గా మారే మార్గం ఇది.Step 1: అభద్రతా భావం, పరధ్యానం బ్రేక్ చేయండిమీరు మాట్లాడేటప్పుడు ఫోన్ చూడటం లేదా మీ గురించి మీరు తక్కువగా ఊహించుకోవడం వంటి పాత అలవాట్లను 'Break' చేయండి. అభద్రతా భావం (Insecurity) ఉన్న చోట కరిష్మా ఉండదు.Step 2: యాక్టివ్ ఎంగేజ్మెంట్ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి చూసి మాట్లాడండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు వారిని ఎంత గౌరవిస్తారో మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా బిల్డ్ చేయండి. మీ నడకలో, నిలబడే తీరులో ఒక 'గ్రేస్' ఉండాలి.Step 3: ప్రభావితం చేసే శక్తిమీరు ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు మీ అవసరం అక్కడ ఉండాలి. మీ జ్ఞానంతో, మీ వినయంతో అందరినీ ఆకట్టుకోండి. మీరు లేని సమయంలో కూడా మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇదే 'Beyond' స్టేజ్.మీ కరిష్మా చెకప్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారికి మీరు ఇస్తున్న 'అటెన్షన్' ఎంత?2. మీలో Power and Warmth బ్యాలెన్స్డ్గా ఉన్నాయా?3. మిమ్మల్ని కలిసిన తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా ఫీలవుతున్నాడా లేక ఇబ్బందిగా ఫీలవుతున్నాడా?కరిష్మా అంటే ఎదుటివారిని గెలవడం!బ్రో, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అంటే కేవలం అందంగా కనిపించడం కాదు, అద్భుతంగా ప్రవర్తించడం. మీరు మీ చుట్టూ ఉన్నవారిని ఎంతగా ప్రోత్సహిస్తారో, వారిని ఎంతగా అర్థం చేసుకుంటారో.. అదే మీ కరిష్మాను పెంచుతుంది. ఇది మీ ప్రొఫెషనల్ గ్రోత్ కి ఒక రాకెట్ ఇంజిన్ లాంటిది."Charisma is the ability to influence without logic."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: కొత్త ఆలోచనలను మనసులో ఎలా నాటాలి?) -
మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..
చర్మసంరక్షణకు సంబంధించిన కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె వంటి ఎన్నో ఆయిల్స్ రాసి, అంతగా ప్రయోజనం పొందక విసిగిపోయినవాళ్లెందరో ఉన్నారు. సరిగ్గా ఆ టైంలో నెట్టింట వైరల్గా మారింది నల్పమరాది తైలం. అసలేంటి తైలం అని అందరిలోనూ ఒకటే కుతుహలం రేకెత్తించింది. ఇంతకీ ఏంటి ఆయిల్..? చర్మ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతుందంటే..ఆ ఆయిల్ నల్పమరాది తైలం. ఇది భారతదేశంలోని కేరళకు చెందిన ఒక సాంప్రదాయ ఆయుర్వేద ఔషధ తైలం. కేరళ ఆయుర్వేదం నుంచి ఉద్భవించింది. చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి, ఛాయను మెరుగుపర్చడానికి, ఎండవల్ల వచ్చిన టాన్(నలుపుదనాన్ని)ని తొలగించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీని తయారీలో తరుచుగా కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. ఇటీవల గత కొన్ని రోజులుగా ఈ ఆయిల్ గురించి నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ తైలం హాట్టాపిక్గా మారింది. అంతేగాదు తాము ఈ ఆయిల్ని వినియోగించి చూశాం అంటూ ఇస్తున్న రివ్యూలు కూడా ఈ క్రేజ్కి కొంత కారణం. దాంతో ఈ ప్రొడక్ట్ ప్రధాన ఆకర్షణగా మారడమే గాక, తరతరాలుగా విశ్వసిస్తున్న ఈ ఆయిల్ పట్ల ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు, చర్మ సంరక్షణ ప్రియులను నుంచి పెద్ద ఎత్తున్న సానుకూల స్పందన రావడం విశేషం. తయారీ..నల్పమరాది తైలం ప్రధానంగా మర్రి, రావి, గోమేధిక, అత్తి వంటి నాలుగు రకాల చెట్ల బెరడులతో తయారు చేస్తారు. ఇది చర్మాన్ని స్వస్థపరిచి, కాంతివంతం చేస్తుంది. ఈ తైలానికి సాధారణంగా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. ఇందులో పసుపు, వెటివర్, ఆమ్లా, వంటివి కూడా జోడిస్తారు. ఇవి చర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి ఉపయోగపడతాయి.మూడువేల ఏళ్లకు పైగా చర్రిత కలిగిన పురాతన తైలం కేరళలో ఉద్భవించిందని చాలామంది ప్రజల గట్టి నమ్మకం. నాలుగు పవిత్రమైన చెట్ల బెరడు నుంచి వచ్చిన మిశ్రమం కావడంత దీన్ని "నల్పమరం" అని పిలస్తారు. దీన్ని గాయాలు మాన్పడానికి, చర్మాన్ని మెరుగుపరచడానికి ఎక్కువుగా వినియోగించేవారట. ఇది శిశువుల చర్మాన్ని మృదువుగా ఉంచుతుందట. మంత్రసానులు ఈ నూనెలోని పలుచని ద్రావణాన్ని శిశువుల మసాజ్ కోసం వినియోగిస్తారట. అంతేగాదు ప్రపంచ యుద్ధాల సమయంలో, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల మహిళలు సాంప్రదాయ నల్పమరాది తైలం మిశ్రమాలను పునరుద్ధరించి, వాటిని కొబ్బరి ఆకుల బుట్టలలో నిల్వ చేసేవారట. అంతటి విశిష్టత కలిగిని నూనెని మీరు కూడా ట్రై చేసి చూడండి మరి...!. View this post on Instagram A post shared by Dr Midhila Reghunath (B.A.M.S) (@ayursutraabydrmidhila) (చదవండి: 9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!) -
9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!
చాలామటుకు 9 టు 5 ఉద్యోగాల చేసే వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందట. పగలు అంత ఆపీస్లోనే గడిచిపోవడంతో వ్యక్తిగతంగా సమయం కేటాయించుకునే వీలు అస్సలు ఉండు. అందులోనూ ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేంత అవకాశం అస్సలు ఉండదు. అలాంటప్పుడు అధిక బరువు సంబంధిత అనారోగ్య సమస్యల బారిన ఇట్టే పడుతుంటారు. అలాంటివాళ్లు ఫిట్గా ఉండాలంటే ఈ ఫిట్నెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలకు ప్రసిద్ధిగాంచిన విద్యుత్ జమ్మాల్ టిప్స్ ఫాలో అయితే చాలు. మరి అవేంటో చూద్దామా..!.టాటాప్లే ఫిట్నెస్లో ‘ఫిట్ అండ్ ఫేమస్’తో జరిగిన సంభాషణలో ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడు విద్యుత్ జమ్వాల్ ఇలా చెప్పుకొచ్చారు. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేస్తానని, దొరకనప్పుడు అస్సలు బాధపడని అన్నారు. కానీ ఆఫీస్కి వెళ్లేవారు, క్రమబద్ధమైన జీవితం గడిపేవారు ముఖ్యంగా 9-5 ఉద్యోగాలు చేసేవారు నెలకు ఐదు కిలోలు తగ్గాలని లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. అందుకోసం కనీసం పదికిలోమీటర్లు లేదా కనీసం ఒక కిలోమీటరైనా నడవాలని చెప్పారు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా టైమ్టైబుల్ పెట్టుకోవడం, దాన్ని అలవాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. అలా చేస్తే కచ్చితంగా అనారోగ్యం బారిన పడరని అన్నారు.వాకింగ్ ఒక్కటి చాలా..!?దీర్ఘకాలిక ఆరోగ్యానికి నడక ఒక అద్బుతమైన పునాది. దీనివల్ల హృదయ సంబంధ ఆరోగ్యం, బరువు నియంత్రణ, మెరుగైన జీవనశైలి, వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సంపూర్ణ ఫిట్నెస్ కోసం వాకింగ్ మాత్రమే సరిపోదు. బల శిక్షణ, ఫ్లెక్సిబిలిటీ వ్యాయమాలు కూడా తోడవ్వాలి అని చెబుతున్నారు. కేవలం నడకపైనే ఆధారపడితే కష్టమని అన్నారు. దీర్ఘకాలికా ఆరోగ్యం కోసం శరీరానికి తగినంత కదలిక ఉండాలని, నడవడంలో కూడా కొంగొత్త వాటిని జోడించి వాక్ చేయడం మరింత మంచిదని అన్నారు. కండరాలను పెంచుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు రెసిస్టెన్స్ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. దినచర్యలో యోగా, స్ట్రెచింగ్ను నేర్చుకుంటే మరింత మంచిదని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) (చదవండి: మా మాష్టారే పేషెంట్గా..!) -
కొత్త ఆలోచనలను మనసులో ఎలా నాటాలి?
మనం మట్టిలో ఒక విత్తనాన్ని వేయగానే అది చెట్టు అవ్వదు కదా! దానికి నీరు, ఎరువు, సరైన సమయం కావాలి. అలాగే, మన మనసులో కొత్త ఆలోచనలను నాటడం (Planting Ideas) కూడా ఒక కళ. దీన్నే మనం 'The Build Stage' అంటాం.మనసు ఒక సారవంతమైన భూమి లాంటిది. మీరు అందులో ఏది నాటితే అదే పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు మీ మనసులో 'నేను ఓడిపోతాను', 'నేను ఎవరికీ పనికిరాను' అనే కలుపు మొక్కలను నాటారు. ఇప్పుడు ఆ స్థానంలో 'విజయం', 'అద్భుతమైన వ్యక్తిత్వం' అనే విత్తనాలను నాటే సమయం ఆసన్నమైంది.1. The Germination of an Ideaఒక ఆలోచన మనసులో స్థిరపడాలంటే దానికి ఒక క్రమపద్ధతి ఉంటుంది.Exposure: ముందుగా మీరు కొత్త ఆలోచనలకు మీ మనసును తెరవాలి, గొప్ప వ్యక్తులను కలవడం, కొత్త పుస్తకాలు చదవడం లాంటివి చేయాలి. Acceptance: ‘‘ఆ ఆలోచన నా జీవితానికి ఉపయోగపడుతుంది" అని మీరు నమ్మాలి.Repetition (పునరావృతం): ఆ ఆలోచనను రోజుకు వందసార్లు మీ మెదడుకు గుర్తు చేయాలి.2. మెదడును ఎలా రీ-వైర్ చేయాలి? (Neuroplasticity)మనం చేసే పనులను బట్టి మన మెదడులోని నాడీ మార్గాలు (Neural Pathways) మారిపోతాయి. దీన్ని సైకాలజీలో 'Neuroplasticity' అంటారు. మీరు ఒకే నెగటివ్ ఆలోచనను పదే పదే చేస్తే, మీ మెదడు దానికి అలవాటు పడిపోతుంది. అలాగే, మీరు కొత్త ఆలోచనను పదే పదే ప్రాక్టీస్ చేస్తే, మెదడు దాన్ని ఒక కొత్త 'హైవే' లాగా మార్చేస్తుంది.3. నిజమైన 'బిల్డ్' పద్ధతిమోటివేషన్ "ఒకే రోజులో నీ లైఫ్ మార్చేయ్, రేపటి నుండే కొత్తగా ఉండు" అని చెప్తుంది. ఇది ఒక అబద్ధం, ఎందుకంటే 20 ఏళ్ల అలవాటు ఒక్క రోజులో పోదు. సైకాలజీ కొత్త ఆలోచనను చిన్న చిన్న పనుల ద్వారా ప్రాక్టీస్ చేయమంటుంది (Incremental Building). ఉదాహరణకు, మీరు 'కాన్ఫిడెంట్' అవ్వాలనుకుంటే, ఒకే రోజులో స్టేజ్ ఎక్కక్కర్లేదు. ముందు అద్దం ముందు మాట్లాడండి, ఆ తర్వాత స్నేహితుల ముందు మాట్లాడండి. ఇది నిజమైన 'బిల్డ్' పద్ధతి.4. మీ మనసులో కొత్త పంట!Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీని ఎలా నిర్మించాలో చూద్దాం.Step 1: కలుపు మొక్కల తొలగింపు (Break)మీ పాత భయాలు, నమ్మకాలు ఒక 'కలుపు' లాంటివి. పాత పద్ధతిలో "నేను చేయలేను" అనే నెగటివ్ సెల్ఫ్-టాక్ ఎక్కడ మొదలవుతుందో అక్కడ 'బ్రేక్' చేయండి. అది రాగానే దాన్ని తుడిచేయండి.Step 2: నిర్మాణాత్మక ఆచరణ (Build)కొత్త ఆలోచనలకు మద్దతు ఇచ్చే వాతావరణాన్నిబిల్డ్ చేయండి. మీ లక్ష్యానికి సంబంధించిన వ్యక్తులతో తిరగండి, ఆ విషయాలపైనే వినండి. ఏ ఆలోచనను మీరు పదే పదే వింటారో, అదే మీ పర్సనాలిటీగా మారుతుంది. ఇది 'నిర్మాణం' (Build).Step 3: ఆటోమేషన్ (Beyond)ఒక్కసారి కొత్త ఆలోచన మీ సబ్-కాన్షియస్ మైండ్ లోకి వెళ్తే, ఇక మీరు కష్టపడక్కర్లేదు. అది మీ ప్రవర్తనలో, మీ మాటల్లో ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మీరు మారుతారు, మీ జీవితం మారుతుంది. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మనసులో ఏముంది?ఈ రోజు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ వారం మీరు నాటాలనుకుంటున్న ఆ ఒక్క 'కొత్త ఆలోచన' ఏంటి?దాన్ని నాటడానికి మీరు వేస్తున్న మొదటి చిన్న అడుగు ఏంటి?మీరు నాటబోయే ఆ విత్తనం రేపు ఎలాంటి ఫలాలను (Results) ఇస్తుంది?మీరే మీ తోటమాలి!బ్రో, మనసు అనే తోటలో కలుపు మొక్కలు వాటంతట అవే వస్తాయి, కానీ మంచి మొక్కలు మనం నాటుకోవాలి. మీరు మీ మైండ్కి తోటమాలి లాంటివారు. ఏ ఆలోచనను పెరగనివ్వాలో, దేన్ని తీసేయాలో నిర్ణయం మీదే. మీ కొత్త వ్యక్తిత్వాన్ని ఒక అద్భుతమైన తోటలా నిర్మించుకోండి.గుర్తుంచుకోండి, "Your life is the harvest of your thoughts."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
నటి జ్యోతిక మోడర్న్ పేరెంటింగ్ టిప్స్..!
రీల్ లైఫ్లోనే గాదు రియల్ లైఫ్లో కూడా బ్యూటీఫుల్ కపుల్ ఎవరంటే ఠక్కున చెప్పేస్తారు సూర్య-జ్యోతికలని. ఈ ఇద్దరు నటనపరంగానే కాదు, వ్యక్తితత్వ పరంగానూ నూటికి నూరు మార్కులు దక్కించుకున్న గొప్ప జంటగా పేరు తెచ్చుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె దియా, కుమారుడు దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హీరో సూర్యతో పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక కొంతకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి..అశేష ఆదరాభిమానాలను అందుకుంది. అయితే ఆమె ఒక పక్క తన వృత్తిని, మాతృత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ..సూపర్ విమెన్గా పేరుతెచ్చుకుంది కూడా. మరి అలాంటి జ్యోతిక పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటుంది?, ఆమె చెప్పే అమూల్యమైన పేరెంటింగ్ టిప్స్ గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఒక ఇంటర్వూలో జ్యోతిక తాను తల్లిగా మారాక తనకు జీవితం పట్ల ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయిందన్నారు. ముఖ్యంగా తన పిల్లలను మీడియాకి, సెలబ్రిటీ హోదాకి చాలా దూరంగా ఉంచుతానని చెబుతున్నారు. వాళ్లకు సహనం, భావోద్వేగాల విలువ గురించి నేర్పిస్తుంటానని చెప్పారు. పేరెంట్స్గా పిల్లలను విలువలతో పెంచడం తోపాటు తాము కూడా కొన్ని విషయాలను వారి నుంచి నేర్చుకున్నామని అన్నారు. జీవితంలో కొన్ని సమయాల్లో వేగాన్ని తగ్గించి చిన్ని చిన్ని విషయాలను కూడా ఆస్వాదించడం, వాటి విలువ గురించి తెలుసుకోవడంలో పిల్లలు ఎంతగానో సహాయపడ్డారని అంటోంది. బాధ్యత, నిస్వార్థ ప్రేమ విలువలను తన పిల్లల ద్వారా తెలుసుకోగలిగానని చెబుతోంది. పిల్లలు ఎదుగుతుండటాన్ని చూడటం జీవితంలో అత్యంత సంతృప్తికరమైన క్షణాల్లో ఒకటని అన్నారు. అలాగే పిల్లల పెంపకంలో అత్యంత ముఖ్యమైనది వారి వ్యక్తిత్వాన్ని ప్రోత్సాహించడం అని ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు. పిల్లలు నిజంగా దేనిపట్ల మక్కువ కలిగి ఉన్నారో తెలుసుకుంటూ..ఆ విషయాలను అన్వేషించి, ఆ దిశలో వెళ్లేలా స్వేచ్ఛను ఇవ్వడానికే ప్రయత్నిస్తానని అన్నారామె. దీనివల్ల పిల్లలు ఇతరుల ఆదేశాలకు లేదా నిర్ణయాలకు లోబడకుండా, తమను తాము వ్యక్తీకరించుకోగలిగేలా ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుగకు సాగుతారని అంటోందామె. అంతేగాదు పిల్లలందరూ తమదైన రీతిలో ప్రత్యేకమైనవారని, విశిష్టమైన వాళ్లని నమ్ముతానని అన్నారు. అంతేగాదు సినీ ఆడంబరాలకు అతీతంగా వాస్తవాలను తెలసుకునేలా పెంచుతానని, ముఖ్యంగా ఒదిగి ఉండేలా పెంచుతానని అన్నారు. అలాగే ఆమె ప్రతి తల్లిదండ్రలు త పిల్లలతో కలిసి ఈ మూడు పనులు చేయాలని అన్నారు. అవేంటంటే..ప్రతిరోజూ పిల్లలతో కనీసం ఒక గంట నాణ్యమైన సమయం గడపడం ముఖ్యం. కలిసి భోజనం చేయండి, ఎటువంటి అంతరాయం లేకుండా మాట్లాడండి, బహుశా ఒక గేమ్ లేకా వాళ్లకు నచ్చిదాంతో మమేకమైతే.. పిల్లలు తమ మనసు విప్పి, వారు ఏమి ఆలోచిస్తున్నారో, వారిలో నిజంగా ఏమి జరుగుతుందో మనకు చెప్పడానికి సహాయపడుతుంది. వారి ప్రాణ స్నేహితుడు ఎవరు, వారికి ఎవరు ఇష్టం, ఒక పిల్లవాడిని ఎందుకు ఇష్టపడరు, ఏ ఉపాధ్యాయుడితో ఏమి జరుగుతోంది వంటి సాధారణ విషయాలు సైతం మనతో పంచుకుంటారు. రెండొవది ప్రయాణం చేయడం. కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబ బంధం చాలా బలపడుతుంది.మూడవది వారికి ఆదర్శంగా ఉండటం; వారికి సలహాలు ఇవ్వకండి.చివరగా ప్రతి తల్లి తన వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగల సామర్థ్యం ఆమెకు ఉంటుందని చెబుతోంది జ్యోతిక. తన మటుకు ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికి ప్రాధ్యాన్యత ఇస్తానని, రెండిటిని సమతుల్యం చేసుకునే పనులను బ్యాలెన్స్ చేస్తానని అన్నారామె. (చదవండి: నీతా అంబానీకి మానవతా పురస్కారం..!) -
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు రొమ్ము కేన్సర్..
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు తొలిదశ రొమ్ము కేన్సర్తో బాధపడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. అంతేగాదు వేల్స్ని ఒక విశ్వసనీయ సలహాదారుగా ప్రశంసించారు కూడా. ఆమె సాధ్యమైనంత తొందరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె ఒక అద్భుతమైన చీఫ్ ఆఫ్ స్టాఫ్, అలాగే నాకు తెలిసిన అత్యంత బలమైన వ్యక్తులలో ఒకరామె. దురదృష్టవశాత్తు వేల్స్కి తొలిదశ రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అన్నారు. ఆమె సత్వరమే ఈ సవాలుని స్వీకరించి ధైర్యంగా పోరాడాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. ఆమెకు కోలుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఆమె వెంట అద్భుతమైన వైద్య బృందం ఉందని, చికిత్స సమయంలో, ఆమె దాదాపు పూర్తి సమయం వైట్ హౌస్లోనే గడుపుతారని పోస్ట్లో వెల్లడించారు ట్రంప్. ఈ నేపథ్యంలో తొలిదశ రొమ్ము కేన్సర్ అంటే..?, ఇతర భాగాలకు వ్యాపించకముందే ముందుగా ఎలా గుర్తిస్తారు, ఎలాంటి చికిత్స అందిస్తారు, తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.తొలిదశ రొమ్ము కేన్సర్ అంటే ఏమిటి?తొలిదశ రొమ్ము కేన్సర్లో సాధారణంగా స్టేజ్ 0, స్టేజ్ I, కొన్ని స్టేజ్ II కేన్సర్లు ఉంటాయి. ఈ దశలో, కణితి రొమ్ముకే పరిమితమై ఉంటుంది లేదా సమీపంలోని శోషరస కణుపులకు చాలా తక్కువగా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ కేన్సర్ ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నందున, తర్వాతి దశలతో పోలిస్తే సత్వరమే చికిత్స తీసుకుని సులభంగా కోలుకోగలుగుతారు సదరు రోగులుఅంతేగాదు 'ది బ్రెస్ట్' అనే జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, స్టేజ్ I రొమ్ము కేన్సర్కు ఐదేళ్ల మనుగడ రేటు దాదాపు 90% కాగా, స్టేజ్ IVకు ఇది సుమారు 26% మాత్రమేనని తెలుస్తోంది. ఇక్కడ వైల్స్ విషయంలో "తొలిదశ" అనేది ఆమె సాధ్యమైనంత తొందరగానే ఈ సమస్య నుంచి బయటపడతారనేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ రొమ్ము కేన్సర్ను ముందుగానే గుర్తించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలను హైటెల్ చేసింది. ఈ దశలో మనుగడ రేట్లను గణనీయంగా మెరుగుపరుస్తుంది. చాలా సందర్భాలలో, తొలిదశ రొమ్ము కేన్సర్కు చికిత్స తీసుకుంటూనే రోజువారీ పనులను కొనసాగించొచ్చు కూడా. ఇక్కడ వైల్స్ కూడా ఆ నేపథ్యంలోనే చికిత్స పొందుతూనే పని కొనసాగించాలని నిర్ణయించుకున్నారామె. కానీ ఈ తొలి దశలలో, రొమ్ము కేన్సర్ని అంత సులభంగా గర్తించకపోవచ్చు. అయితే, అది ఇచ్చే హెచ్చరిక సంకేతాలను విస్మరించకూడదు:అవేంటంటే..రొమ్ములో లేదా చంకలో గడ్డరొమ్ము పరిమాణం లేదా ఆకారంలో మార్పులుచర్మంపై గుంటలు పడటం లేదా ముడతలు పడటంతల్లిపాలు కాకుండా చనుమొన నుంచి ఇతర స్రావాలు రావడంచనుమొన చుట్టూ చర్మం ఎర్రబడటం లేదా పొలుసులుగా మారడంనిరంతర రొమ్ము నొప్పిఅన్ని గడ్డలూ కేన్సర్ గడ్డలు కావని గమనించడం ముఖ్యం, కానీ ఏదైనా అసాధారణ మార్పును వెంటనే ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.ఈ కేన్సర్ ఎవరిలో అధికం అంటే..వయస్సు: వయసు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుందికుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము కేన్సర్ ఉండటం ప్రమాదాన్ని పెంచుతుందిజన్యు మార్పులు: BRCA1 మరియు BRCA2 వంటి వారసత్వంగా వచ్చే మార్పులుహార్మోన్ల కారకాలు: చిన్న వయసులోనే రుతుస్రావం ప్రారంభం కావడం లేదా ఆలస్యంగా మెనోపాజ్ రావడంజీవనశైలి కారకాలు: ఊబకాయం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడంఅయితే, రొమ్ము కేన్సర్తో బాధపడుతున్న చాలా మందికి ముందుగా ఎలాంటి స్పష్టమైన ప్రమాద కారకాలు కనిపించకపోవచ్చు. అందుకే క్రమం తప్పని స్క్రీనింగ్ చాలా కీలకం.ఎలా నిర్ధారిస్తారంటే?ఒక అధ్యయనం ప్రకారం, స్క్రీనింగ్ పరీక్షల్లో మహిళల్లో మామోగ్రఫీ అనే సాధనం మరణాల రేటును 20% వరకు తగ్గించగలదు. వాస్తవానికి సాధారణ స్క్రీనింగ్ పరీక్షల ద్వారానే ప్రారంభ దశ రొమ్ము కేన్సర్ను చాలామటుకు సులభంగా గుర్తిస్తారు. అత్యంత సాధారణ పద్ధతులు:మామోగ్రఫీ: రొమ్ము ఎక్స్-రే, ఇది చిన్న కణితులను గుర్తించగలదుఅల్ట్రాసౌండ్: ఘన గడ్డలు, ద్రవంతో నిండిన తిత్తుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుందిబయాప్సీ: కేన్సర్ను నిర్ధారించడానికి కణజాల నమూనాను తీసుకుంటారు40 ఏళ్లు పైబడిన మహిళలకు లేదా అధిక ప్రమాదం ఉన్నవారికి క్రమమైన స్క్రీనింగ్ చాలా ముఖ్యం.చికిత్సా పద్ధతులుప్రారంభ దశ రొమ్ము కేన్సర్కు చికిత్స అనేది కణితి పరిమాణం, రకం, అది వ్యాపించిందా లేదా అనే దానితో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ చికిత్సా విధానాలు:శస్త్రచికిత్స: కణితిని తొలగించడం (లంపెక్టమీ) లేదా మొత్తం రొమ్మును తొలగించడం (మాస్టెక్టమీ)రేడియోథెరపీ: శస్త్రచికిత్స తర్వాత మిగిలిపోయిన కేన్సర్ కణాలను నాశనం చేయడానికి తరచుగా ఉపయోగిస్తారుహార్మోన్ థెరపీ: హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్గా ఉండే కేన్సర్ల కోసంకీమోథెరపీ: కొన్ని సందర్భాల్లో, కేన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికిటార్గెటెడ్ థెరపీ: నిర్దిష్ట కేన్సర్ కణ లక్షణాలపై దృష్టి పెడుతుందివైద్యులు సాధారణంగా ప్రతి వ్యక్తికి అనుగుణంగా చికిత్సా ప్రణాళికలను రూపొందిస్తారు. తద్వారా కొద్దిపాటి దుష్ప్రభావాలతో సులభంగా ఈ కేన్సర్ బారి నుంచి బయటపడేలా చేస్తారు. ఏదిఏమైనా ఈ రొమ్ము కేన్సర్ని ముందుగా గుర్తించడమనేది చాలా శక్తిమంతమైనది. ఎందుకంటే ఈ దశలో చికిత్స అందించడం సులభం అవుతుంది. కొద్దిపాటి చికిత్సతోనే తొందరగా బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్కట్) -
అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్కట్
వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్ మీడియా వేదికగా 45 ఏళ్ల వయసులో 13% శరీర కొవ్వుని ఎలా తగ్గించుకున్నారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ఎలాంటి స్టెరాయిడ్లు, షార్ట్కట్లు, ఏఐ సలహాలు తీసుకోలేదని చెప్పారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీర కొవ్వు సాధారణంగా పెరుగుతుంది. బరువు స్థిరంగా ఉన్నా కొలెస్టాల్ స్థాయిలు పెరుగుతాయట. పైగా వయసుతోపాటు కండర ద్రవ్యరాశిని కోల్పోతామట. దాంతో చర్మం కింద, పొత్తుకడుపు వంటి అంతర్గత అవయవాలలోకి కొవ్వు విసరల్ ఫ్యాట్గా స్టోర్ అవుతుందని చెబుతున్నారు. ఇది టైప్2, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. పైగా రానురాను బరువు తగ్గడం కష్టంగా మారిపోతుందట. పురుషులలో సుమారు 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ..టెస్టోస్టెరాన్ క్రమంగా తగ్గడం జరుగుతుంది. దాంతో కండరాలను నిర్మించడం, కొవ్వు పంపిణీ చేయడంలో సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు అంకుర్ వారికూ. అందుకే తాను 3టీ ఫార్ములాతో ఆరోగ్యకరమైన రీతీలో కొలెస్ట్రాల్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఏంటా ఫార్ములా..? ఎలా అనుసరించాలంటే..T3 ఫార్ములా:T1 - ట్రాక్ వారానికి సుమారు 0.5 కిలోల బరువు తగ్గడానికి, రోజుకు 300 నుండి 500 కేలరీల స్వల్ప లోటు ఆరోగ్యకరమైనదట. డైట ప్లాన్..ఉదయం 9:30 - 1 స్కూప్ వే ప్రోటీన్, క్రియేటిన్, 1 వాల్నట్, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 5-6 ఎండుద్రాక్షలుఉదయం 11 గంటలకు - 200 గ్రాముల పనీర్/టోఫు/టెంపే, లేదా దాల్ చిల్లా, అప్పుడప్పుడు గుడ్లు.మధ్యాహ్నం 1 గంటకు - పండ్లుసాయంత్రం 4 గంటలకు - 2 రోటీలు (ఎమ్మర్ గోధుమ/జొన్న/సోయా బీన్) + కూర + పప్పు + తక్కువ కొవ్వు గల పెరుగుసాయంత్రం 6:30 గంటలకు - పెరుగుతో 1 స్కూప్ వే ప్రోటీన్అయితే తనకు ఇష్టమైన చోలే భటూరేని మాత్రం వదిలేయలేదట. అలాగే మిఠాయిని కూడా తిన్నట్లు తెలిపారు. అయితే కేలరీలు బ్యాలెన్స్గా ఉండేలా కేర్ తీసుకున్నారట.T2 - శిక్షణగుండె ఆరోగ్యానికి కార్డియో మంచిదే అయినప్పటికీ, వృద్ధులలో దీర్ఘకాలిక కొవ్వు తగ్గడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అత్యంత ప్రభావవంతమైన సాధనం.ఎందుకంటే ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఒకేసారి ఎక్కువ కండర సమూహాలను ఉత్తేజపరచడానికి, సిట్-టు-స్టాండ్స్ లేదా మోడిఫైడ్ ప్లాంక్స్ వంటి బహుళ కీళ్లను ఉపయోగించే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.వ్యాయామ దినచర్య:టెన్నిస్ - వారానికి 6 రోజులు, 1 గంట (కార్డియో పూర్తయింది)వెయిట్స్ - వారానికి 6 రోజులు, 45 నిమిషాలుప్రతి రోజు: 2 వ్యాయామాలు x 3 శరీర భాగాలకు సంబంధించిన వర్కౌట్లు = 6 వ్యాయామాలు10-12 సార్లు పునరావృతం చేస్తూ మొత్త మూడు సెట్లు చేయాలి.T3 - రూపాంతరంమార్పులను నమోదు చేయడానికి రోజువారీ బరువును, వారపు కొలతలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. అలాగే తన ఫోటోలను తన ట్రైనర్కు పంపిచినట్లు చెప్పారు.చాలామటుకు అదే డైట్ ప్లాన్ ఫాలో అయినట్లు తెలిపారు.సెలవులకు టూర్కి వెళ్లేముందు లేదా బ్రేక్ తీసుకోవాలనుకుంటే.. మరింతగా ఈ దినచర్యను వేగవంతం చేసినట్లు తెలిపారు. శరీరంలోని కొవ్వును తగ్గించడం అంటే మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇక్కడ కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వుని తగ్గించుకుంటే..మొత్తం జీవన నాణ్యతనే మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పుకొచ్చారు అంకుర్ వారికూ.మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక, వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు శారీరక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వును కోల్పోవడం మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్య జీవసంబంధమైన సూచికలను నెమ్మదింపజేస్తుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చిం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను పంపించడం ఉత్తమం. (చదవండి: వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు') -
వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు'
ఒకప్పుడు ‘సక్సెస్’ అంటే మంచి జాబ్, భారీ ప్యాకేజ్, లగ్జరీ లైఫ్.. అని భావించిన నగర జీవనం క్రమంగా మారుతోంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రజలు ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ వైపు మళ్లుతున్నారు. ఒత్తిడి, జీవనశైలి వ్యాధుల మధ్య ఇరుక్కున్న అర్బన్ జనరేషన్ ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదనే ధోరణికి వచ్చేసింది. ఈ మార్పే వెల్నెస్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోస్తోంది. వెల్నెస్ అనగానే కేవలం యోగా క్లాస్/ డైట్ మాత్రమే కాదు.., మానసిక ప్రశాంతత, శారీరక చురుకుదనం, భావోద్వేగ సమతుల్యత.. ఇవన్నీ కలిసిన సమగ్ర జీవన విధానమే నేటి వెల్నెస్ అని లైఫ్స్టైల్ కోచ్ డా.శ్రీ సోహం చెబుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పంచుకున్న ఆలోచనలు ఆయన మాటల్లోనే.. కాలుష్యంతో నిండిన నగర జీవితానికి కొద్దిసేపైనా బ్రేక్ ఇవ్వాలనే తపన యువతలో పెరుగుతోంది. ఆరోగ్యం కోసం ప్రజలు తిరిగి మూలాల వైపు అడుగేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలన్న ఆలోచన కూడా వెల్నెస్ ట్రెండ్గా మారింది. ఇప్పటికే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో చిన్న గెస్ట్హౌస్లు, నేచర్ గార్డెన్లు, వీకెండ్ రిట్రీట్స్ పెరుగుతున్నాయి. ఈ ప్రయాణంలో సరైన గైడెన్స్ ఉంటే శరీరం–మనసు రెంటిలోనూ అద్భుతమైన మార్పులు వస్తాయి. కార్పొరేట్ కల్చర్లోనూ వెల్నెస్ కీలకాంశంగా మారుతోంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించేందుకు, ఉత్పాదకత పెంచేందుకు అనేక కంపెనీలు యోగా, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్స్ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాయి. ‘సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఉద్యోగుల పనితీరు సహజంగానే పెరుగుతుంది. కొన్ని సంస్థల హెచ్ఆర్ విభాగం దీనిపై ఆలోచన చేయాల్సి ఉంది. కాన్షియస్.. మ్యాడ్ నెస్.. హైదరాబాద్ అంటే ఫుడ్ లవర్స్ సిటీ. రుచికరమైన ఆహారానికి తగ్గట్టుగా సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఇన్సోమ్నియా, పీసీఓడీ, థైరాయిడ్, షుగర్, బీపీ వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇన్ఫెరి్టలిటీ సమస్యలు, ఐవీఎఫ్ క్లినిక్స్ పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. తినడం తప్పు కాదు.. కానీ మనం ఏమి తింటున్నామో తెలుసుకుని తినాలి.. అప్పుడప్పుడు ఉపవాసం బాడీని డీటాక్స్ చేస్తుంది. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఉన్నా.. ‘స్టాప్ లెర్నింగ్, స్టార్ట్ అన్లెర్నింగ్’ అనే భావన ఆకర్షణగా మారుతోంది. సమస్యల నుంచి పారిపోకుండా.. జీవితంలోని ప్రతి క్షణాన్ని అవగాహనతో అనుభవించాలనే ఆలోచన ‘కాన్సియస్ మ్యాడ్ నెస్’ కాన్సెప్ట్కు బలం ఇస్తోంది. ఈ ఆలోచనలతో ఈ నెల 21న గండిపేటలోని ఆయర్వన్ వాటర్ సైడ్లో యోగా, మెడిటేషన్, భజన్ జ్యూమింగ్ ఎక్స్పీరియన్స్ అందించనున్నాం. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్ లైఫ్స్టైల్లో వెల్నెస్ కేవలం ట్రెండ్ కాదు.. అవసరంగా మారబోతోంది. సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకునే దిశగా యువత అడుగులు వేస్తోంది. స్ట్రెస్ నుంచి స్ట్రెంగ్త్కి ప్రయాణమే నేటి హైదరాబాద్ కొత్త లైఫ్స్టైల్. -
ఈ సర్జరీలతో గుండెకు బైపాస్..!
గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో కొవ్వు ఉండల వల్ల గానీ లేదా రక్తం గడ్డకట్టడంతో ఏర్పడిన క్లాట్స్ వల్లగానీ వల్ల రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడి... గుండెకు అవసరమైన రక్తం అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య తలెత్తాక... రక్తనాళాలు ఇంకా పూర్తిగా మూసుకుపోనప్పుడు స్టెంట్ వేయడమన్నది చాలామందికి తెలిసిన విషయమే. స్టెంట్ వేశాక రక్తాన్ని పలచబార్చే మందులు కూడా ఇస్తుంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో గుండెకు రకరకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, బీటింగ్ హార్ట్ సర్జరీ... అనే రకరకాల శస్త్రచికిత్సల పేర్లు వినిపిస్తుంటాయి. ఈ సర్జరీలు ఏమిటి, రకరకాల శస్త్రచికిత్సల తాలూకు ప్రయోజనాలేమిటి లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం.గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు... నిజానికి శస్త్రచికిత్స కంటే ముందుగా స్టెంట్ ద్వారా ఆ అడ్డంకిని తొలగించడానికి గుండె డాక్టర్లు ప్రయత్నిస్తారు. ముందుగా ఆ స్టెంట్ అంటే ఏమిటో చూద్దాం.స్టెంట్ అంటే ఏమిటి...? గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి రక్తనాళాల్లోకి వెళ్లాక అక్కడ మూసుకు΄ోయిన రక్తనాళాన్ని వెడల్పు చేసే ఉపకరణాన్ని స్టెంట్ అంటారు. ఇందులోనూ రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బెలూన్ వంటి ఉపకరనాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట దాన్ని ఉబ్బేలా చేయడం ద్వారా అక్కడ ఏర్పడిన అడ్డంకిని తొలగించడాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా బెలూన్ స్టెంట్ అమర్చడంగా చెబుతారు.నిజానికి ఇలా స్టెంట్ వేయడమన్నది పూర్తి స్థాయి శస్త్రచికిత్స కాదు. మొదట్లో తొడ భాగం లోని రక్తనాళాల నుంచి గుండెలోని రక్తనాళాల వరకు వెళ్లి అక్కడ మూసుకు΄ోయిన చోట స్టెంట్ వేసేవారు. అయితే ఇటీవల మణికట్టు నుంచే స్టెంట్ను పంపడమూ జరుగుతోంది. గుండెకు ఏరకమైన చికిత్స అవసరమనే విషయాన్ని తెలుసుకోడానికి... తొలుత యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించి, అటు తర్వాత గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో ఏదైనా సమస్య కనిపిస్తే... బైపాస్ చేయించాలా లేదా మందులతోనే సమస్యను పరిష్కరించవచ్చా లేదంటే స్టెంట్ వేయించాలా అని చాలా మంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ ఏయే సందర్భాల్లో చేస్తారో, అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.గుండెకు చేసే రకరకాల శస్త్రచికిత్సలేమిటి... వాటితో ప్రయోజనాలేమిటంటే... గుండెకు చేసే శస్త్రచికిత్సలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది బైపాస్ సర్జరీ. రెండోవి వాల్వ్ సర్జరీలు. వీటిల్లో... బైపాస్ సర్జరీలోనే... ఓపెన్ హార్ట్ సర్జరీ... దాంతోపాటు పలు సందర్భాల్లో నిర్వహించే రకరకాల సర్జరీలైన బీటింగ్ హార్ట్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ, టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులైజేషన్, ఎండోస్కోప్క్ సర్జరీ, హైబ్రిడ్ సర్జరీ, రొబోటిక్ బైపాస్ సర్జరీ వంటి వాటినీ అనుసరిస్తుంటారు. వాటి గురించి వరసగా...బైపాస్ శస్త్రచికిత్స అంటే : ముందుగా బైపాస్ శస్త్రచికిత్స అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే... వాటిని వెడల్పు చేయకుండా అలాగే వదిలేసి... వాటికి ప్రత్యామ్నాయంగా వేరే రక్తనాళాలను ఉపయోగించి, ఈ కొత్తమార్గం ద్వారా గుండెకు యథాతథంగా రక్తప్రసరణ జరిగేలా చేయడమే బైపాస్ శస్త్రచికిత్స. అంటే... ఇందులో అడ్డంకి ఉన్న రక్తనాళానికి పక్కగా... కరొనరీ ఆర్టరీ (బృహద్ధమని) నుంచి నేరుగా గుండెకండరానికి రక్తం అందేలా మరో రక్తనాళాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో కరొనరీ ఆర్టరీ నుంచి గుండె కండరానికి రక్తం అందేలా చేయడానికి అవసరమైన అదనపు రక్తనాళాన్ని కాలి నుంచి తీసుకున్న రక్తనాళాన్నిగాని లేదా రొమ్ము ఎముక పక్కనే ఉన్న మ్యామరీ ధమనిని గాని ఉపయోగిస్తారు. ఇలా చేసే క్రమంలో ఒకవేళ సిరను ఉపయోగిస్తే దాన్ని వీనస్ గ్రాఫ్ట్ అని, ధమనిని ఉపయోగిస్తే ఆర్టీరియల్ గ్రాఫ్ట్ అంటారు.బైపాస్ ఎవరికి అవసరం, దాంతో ఒనగూరే ప్రయోజనాలేమిటంటే... గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళమైన లెఫ్ట్ మెయిన్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెలో ఎడమపక్క ఉండే ముఖ్య రక్తనాళంలోని మొదటిభాగంలోనే అడ్డంకి ఉన్నప్పుడు గుండె తాలూకు పంపింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు ∙గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళంలో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పుడు ∙డయాబెటిస్ (మధుమేహ వ్యాధి) ఉన్న వారికి. ఓపెన్హార్ట్ సర్జరీ అంటే...? బైపాస్ శస్త్రచికిత్స సమయంలో రొమ్ముఎముకను చీల్చి సర్జన్ గుండె వరకు వెళ్తాడు. అయితే గండె అనుక్షణం కొట్టుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలా గుండె నిత్యం స్పందిస్తూ ఉండగా ఆపరేషన్ చేయడం ఒకింత కష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే తాత్కాలికంగా గుండెను ఆపేసి (అచేతన స్థితిలో ఉంచి) ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. అలా గుండె అచేతన స్థితిలో ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన రక్తప్రసరణ యథాతథంగా కొనసాగేందుకు హార్ట్లంగ్ మెషిన్ అనే పరికరాన్ని వాడతారు. ఏ శస్త్రచికిత్సలోనైతే ఈ హార్ట్లంగ్ మెషిన్ను వాడతారో... దాన్ని ‘ఓపెన్హార్ట్ సర్జరీ’ పరిగణించవచ్చు.బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే...? దీన్ని ‘ఆఫ్ పంప్ సర్జరీ’ అని కూడా అంటారు. ఇందులో కూడా రొమ్ము ఎముకను చీలుస్తారు. అయితే ఈ ప్రక్రియలో గుండె స్పందనలను ఆపడం, మళ్లీ ్ర΄ారంభించడం గానీ జరగదు. ఓ పక్క గుండె స్పందనలు యథావిధిగా కొనసాగుతుండగానే బై΄ాస్ సర్జరీ నిర్వహిస్తారు. ఆక్టోపస్ అనే ఒక ప్రత్యేక పరికరం ద్వారా గుండెలో ఆపరేషన్ జరుగుతున్న భాగం వరకు కదలకుండా చేసి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సాధారణ బై΄ాస్ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో పక్షవాతం, మతిమరపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీటింగ్ హార్ట్ సర్జరీ వల్ల అలాంటి ఆ దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గి΄ోతాయి.మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే..? గత కొద్దికాలంగా గుండె శస్త్రచికిత్సలో అత్యంత ఆధునికమైన, చాలా అధునాతమైన వినూత్న వైద్య పురోగతి జరుగుతోంది. కేవలం చాలా చిన్న గాటు సహాయంతోనే బై΄ాస్ సర్జరీ నిర్వహించడం కూడా వీటిల్లో ఒకటి. ఇందులో ఎదుర్రొమ్ము ఎముకను చీల్చాల్సిన అవసరమే ఉండదు. అయితే పెద్ద శస్త్రచికిత్సల్లోలాగే మత్తు మందు ఇవ్వాల్సి ఉంటుంది. చర్మంపైన చాలా చిన్నవైన గాట్లు పెడుతూ వెంటనే తగ్గి΄ోయి మూసుకు΄ోయే రంధ్రాలు చేయడం ద్వారా ఈ లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేస్తారు. గాటు, గాయం చాలా చిన్నవిగా ఉండటం వల్ల రోగులు చాలా త్వరగా కోలుకుంటారు. రక్తస్రావం, నొప్పి కూడా చాలా తక్కువే. శస్త్రచికిత్స తర్వాత ఆయాసం వంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కానీ సర్జన్కు కేవలం గుండెలోని కొద్దిభాగం మాత్రమే కనిపిస్తుంటుంది కాబట్టి ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడానికి అతడికి చాలా నైపుణ్యం కావాలి. పైగా పేషెంట్లదరికీ ఈ చికిత్స చేయడం సాధ్యం కాకపోవచ్చు.టీసీఆర్ఏటీ : ఈ ‘టీసీఆర్ఏటీ’ అనేది ‘టోటల్ కొరనరీ రీవాస్క్యులరైజేషన్ బై యాంటీరియర్ కొరకాటమీ’ అనే సర్జరీ ప్రక్రియ తాలూకు సంక్షిప్త రూపం. దీన్ని ఎదుర్రొమ్ముకు ఏమాత్రం కోత లేకుండా చేస్తారు. ఈ శస్త్రచికిత్సలో చిన్న గాటుతోనే (మినిమల్లీ ఇన్వేజివ్గానే) గుండె తాలూకు కీలకమైన ధమని అయిన ‘కొరనరీ ఆర్టరీకి సంబంధించిన అనేక రక్తనాళాలకు బై΄ాస్ దారులు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. దాంతో గుండె కండరాలకు రక్తం ఎలాంటి అంతరాయం లేకుండా అందుతుంది. కేవలం 6 నుంచి 10 సెంటీమీటర్ల చిన్నపాటి గాటుతోనే గుండెకు బైపాస్ (కార్డియోపల్మునరీ బైపాస్ –సీపీబీ) శస్త్రచికిత్స నిర్వహిస్తారు. మిగతా బైపాస్ ప్రక్రియలతో పోలిస్తే ఇదెంతో సురక్షితమైనదీ, నొప్పి చాలా చాలా తక్కువ. ఇందులో పేషెంట్ కోలుకోవడం చాలా వేగంగా జరుగుతుంది.కంప్లీట్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్ అంటే..? బైపాస్ శస్త్రచికిత్స చేసేప్పుడు జబ్బుపడ్డ ప్రతి ముఖ్యమైన రక్తనాళానికీ బైపాస్ గ్రాఫ్ట్ చేస్తారు. అంటే ఎన్ని రక్తనాళాల్లో అడ్డంకులు ఉంటే అన్ని చోట్లా బైపాస్ చేయడం కోసం అన్ని ప్రత్యామ్నాయ రక్తనాళాలను అతికిస్తారు... అంటే గ్రాఫ్ట్ చేస్తారని అర్థం. చాలామందిలో ఒక్కోసారి మూడు లేక నాలుగు గ్రాఫ్ట్లు కూడా వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి బై΄ాస్ సర్జరీలోనూ కనీసం ఒక ధమనిని ఉపయోగించడం పరి΄ాటి అయ్యింది. సాధారణంగా రొమ్ము ఎముకకు రక్తసరఫరా చేసే రొమ్ముఎముక ధమని (ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ)ని ఉపయోగించి ఎల్ఏడీ కరొనరీ ధమని అనే దానికి అనుసంధానం (గ్రాఫ్ట్) చేస్తారు. కాలి నుంచి తీసిన సిరలతో పోలిస్తే ఇలా రొమ్ముఎముక నుంచి తీసిన ధమని చాలా కాలం పాటు మన్నికతో ఉంటుంది. అయితే టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్లో కాలినుంచి సిరలను తీయకుండా మణికట్టులోని ధమనులను, ఎడమ, కుడి రొమ్ము ఎముక ధమనులను ఉపయోగించి సర్జరీ చేస్తారు.ఎండోస్కోపిక్ సర్జరీ అంటే...? ప్రస్తుతం చేస్తున్న సరికొత్త శస్త్రచికిత్సల్లో మణికట్టు నుంచి తీసే ధమని గానీ... లేదా కాలి నుంచి తీసే సిరల విషయంలోగానీ... పూర్తిగా గాటు పెట్టి తీయకుండా, చిన్న రంధ్రం మాత్రమే చేసి వాటిని సేకరిస్తారు. ఇలా చేయడం వల్ల చేసే గాయం చాలా చిన్నది కావడం వల్ల పేషెంట్ చాలా త్వరితంగా కోలుకోవడం సాధ్యమవుతుంది.హైబ్రీడ్ సర్జరీ అంటే...? కొన్నిసార్లు బై΄ాస్ శస్త్రచికిత్సలో పేషెంట్ చాలా సీరియస్గానూ అతడి పరిస్థితి అత్యంత సంక్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రక్తనాళాలకు యాంజియో΄్లాస్టీ ద్వారా, మరికొన్నింటికి బై΄ాస్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల చాలా రిస్క్లు తగ్గుతాయి. ఇలా చేయడం ద్వారా పేషెంట్ను చాలా త్వరగా కోలుకునేలా చేయవచ్చు. ఇలా ఒకే సర్జరీలో పలు రకాల శస్త్రచికిత్స ప్రక్రియలను చేయడాన్ని ‘హైబ్రీడ్ బై΄ాస్ సర్జరీ’ అంటారు.రొబోటిక్ బైపాస్ సర్జరీ అంటే...?ఈ ప్రక్రియలో డాక్టర్లు తమ బై΄ాస్ శస్త్రచికిత్సను రోబో సహాయంతో చేస్తుంటారు. ఈ ప్రక్రియలో మొదట మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ లేదా ఎండోస్కోపిక్ సర్జరీలో చాలా చిన్న రంధ్రం మాత్రమే చేసి, దాని ద్వారా మిగతా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అంత చిన్న రంధ్రం నుంచి డాక్టర్ వేళ్లు రోగి శరీరంలోకి ప్రవేశింపజేయడం కష్టం. అందుకే రోబో తాలూకు సన్నని వేళ్లని ఆ రంధ్రంలోకి ప్రవేశింపజేసి, డాక్టర్లు (శస్త్రచికిత్సకులు) లోపలి దృశ్యాన్ని తెరమీద చూస్తూ... రోబో వేళ్లను బయటి నుంచే యంత్రాల సహాయంతో నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు.బైపాస్ సర్జరీ తర్వాత... బైపాస్ శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ కోలుకోడానికి 2–3 నెలలు పడుతుంది. మొదట్లో కొద్దిగా నీరసంగా ఉండటం చాలా సాధారణంగా జరిగే పరిణామమే. రొమ్ముఎముక చీల్చడం వల్ల ఛాతీకండరాల్లో, మెడ ఎముకల్లో, వెన్నుపూసల్లో, జబ్బల్లో నొప్పులు ఉండటాన్ని డాక్టర్లు సాధారణంగా చూస్తుంటారు. అదే సమయంలో కాలు లేదా చేతి నుంచి రక్తనాళం బయటకు తీస్తారు కాబట్టి అక్కడ కూడా కొంత నొప్పి, వాపు ఉండవచ్చు. కొందరు ఈ ఆపరేషన్ తర్వాత మనోనిబ్బరం కోల్పోతారు. మరికొందరికి జ్ఞాపకశక్తి, దృష్టికేంద్రీకరణ శక్తి కొద్దిగా తగ్గవచ్చు. కానీ ఆర్నెల్లో పేషెంట్ తన పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.త్వరగా కోలుకోవడం కోసం... పేషెంట్లు తమ జీవనోపాధి కోసం చేసే పనులు అంతగా బరువైనవి కాక΄ోతే రెండు నెలల తర్వాతి నుంచే తమ వృత్తులకు హాజరుకావచ్చు. అయితే కాస్తంత బరువు పనులు చేసేవారు కనీసం మూడు నెలలు ఆగడం మంచిది. ఇక ఈ ఆపరేషన్ తర్వాత రెండునెలల పాటు వాహనం నడపడం అంత మంచిది కాదు. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...పొగతాగడం పూర్తిగా మానేయడం. ∙మంచి పుష్టికరమైన పోషకాహారం తీసుకుంటూ, దేహానికి శ్రమ కలగని విధంగా తగినంత వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. ∙బరువును అదుపులో ఉంచుకోవడం. ∙మనోనిబ్బరంతో వ్యవహరించడం.చివరగా... పైన సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ, వైద్యులు చేసే సూచనలను తప్పక అనుసరించడం ద్వారా గుండె శస్త్రచికిత్స తర్వాత కూడా సాధారణ జీవితాన్ని గడపడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే.నిర్వహణ: యాసీన్డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ టి. వంశీధర్, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ (చదవండి: పైల్స్ నుంచి ఫ్రీ అవ్వండి ఇలా..!) -
76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!
బరువు తగ్గడంలో కొందరు అనుసరించే ఆరోగ్యకరమైన విధానాలు ఎందరికో ప్రేరణగా ఉంటాయి. అలాంటి వెయిట్లాస్ జర్నీ గురించి మహారాష్ట్ర వైద్యుడు చూసిన ఒక కేసు గురించి చెప్పుకొచ్చారు. ఒక రియల్ జంట అద్భుతంగా బరువు తగ్గినం విధానాన్ని షేర్చేసుకున్నారు. మొదట తన వద్దకు కాస్త తగ్గితే చాలని వచ్చిన వాళ్లు ఎంతలా అనూహ్యంగా బరువు తగ్గారో చెప్పారు. జస్ట్ రెండున్నర నెలలో ఇంతలా బరువు తగ్గుతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..!పిసిఒఎస్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊబకాయం తదితరాల హోపియోపతిక్ ప్రాక్టీషనర్ డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్ తన అనుభవంలో చూసిన ఒక జంట కేసు గురించి చెప్పుకొచ్చారు. ఆ దంపతులు సాధారణ వెయిట్లాస్ కోసం వచ్చారని అన్నారు. సూచించిన కొద్ది ఆహారపు మార్పులతో ఇద్దరూ జస్ట్ రెండున్నరనెలల్లోనే ఏకంగా ఏడు కిలోలు తగ్గారని చెప్పారు. భర్త 71 కిలోల నుంచి 64 కిలోలకు, భార్య 82 నుంచి 75 కిలోలకు తగ్గారని చెప్పుకొచ్చారు. ఇలా బరువు తగ్గడంతో ఇద్దరికి వాపు, ఎల్డీఎల్ స్థాయిలు, బొడ్డుకొవ్వు కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మలబద్దక సమస్య కూడా చాలావరకు తగ్గిందని అన్నారు. అయితే ఈ దంపతులు ఎలాంటి క్రాష్డైట్ అనుసరించలేదని, స్థిరమైన ఆహార విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఈ ఇద్దరు ఉపకరించిన ఆ ఏడు ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.రెండుపూటలా తినడం..ప్రతి రోజు రెండు పూటలా తింటే చాలని అన్నారు. అలాగని అల్పాహారం ఎక్కువగా తీసుకోవద్దని సూచించారు.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వండినిపుణుడి ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ను కీలకమైన భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. ముఖ్యంగా గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్ను వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆయన దంపతులకు సలహా ఇచ్చారు.శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించారుతరువాత, హోమియోపతి నిపుణుడు ఆహారం నుంచి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించాలని సూచించారు. ఈ జంట స్వీట్లు, చక్కెర, బేకరీ ఆహారాలను తినకుండా ఉండాలని చెప్పానని అన్నారు.ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చుకోవడం..నిపుణుడు దంపతులకు ప్రతిరోజూ వారి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ ఆహార ప్రణాళికలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి అయిన అంశం. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండిబర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు దరిచేరనివ్వదని సూచించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు సదా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ దంపతులు ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినాలని, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలని చెప్పారు.రోజుకు 30-40 నిమిషాలు నడవండినిపుణుడు దంపతులను రోజుకు 30-40 నిమిషాలు నడవమని సూచించారు. అది కూడా ముఖ్యంగా భోజనం తర్వాత.స్థిరంగా ఉండండిబరువు తగ్గడం అనేది ఒక్కసారిగా జరిపోయేది కాదు. క్రమంత తప్పకుండా బరువు తగ్గడానికి ఏర్పాటు చేసుకున్న నియమాలను ఉల్లంఘించకుండా చూసకోవడం అత్యంత కీలకం. ఇక్కడ బరువు తగ్గడం అంత తేలికై పని కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటూ..ఆకలి కోరికలు తగ్గేలా ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే..వెయిట్లాస్ అనేది అత్యంత ఈజీ. అన్నింట్లంకంటే ముఖ్యమైనది స్థిరత్వాన్ని మెయింటైన్ చేయడమే అన్ని నొక్కి చెబుతున్నారు డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్. 2.5 months.One couple.Simple home-cooked food.✅ Results:• Weight ↓ 7 kg (both)• HbA1c improved• LDL cholesterol ↓• Waist ↓ ~3 inches• Constipation resolved• Energy levels ↑No crash diets.No supplements.Just disciplined nutrition. pic.twitter.com/d2302h5Iti— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) March 9, 2026 (చదవండి: ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..) -
రోజూ వైన్, మాంసం : షాకిస్తున్న 102 ఏళ్ల బామ్మ
తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్స్టైల్, ఫుడ్ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార నియమాలు, చక్కటి జీవనశైలి, నియమ నిబద్ధతతో ఉంటారని అనుకుంటాం కదా. కానీ ఈమె అలవాట్లు అందుకు భిన్నం. ప్రస్తుతం సెంచరీ దాటేసింది తైజౌ గ్రామీణ ప్రాంతంలో నివసించే జిన్ బావోలింగ్ (Jin Baoling).సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ 102 ఏళ్ల జిన్ బావోలింగ్ కొడుకు, కోడలు మనవరాలు సహా సన్నిహిత కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. వృద్ధురాలి. దీర్ఘాయువు రహస్యాలు, దినచర్యఏంటో తెలిస్తే షాకవ్వక మానరు.తైజౌ ఈవినింగ్ న్యూస్ నివేదిక ప్రకారం, వందేళ్లు నిండిన ఆమె మానసికంగా చురుగ్గా, సాధారణంగా మంచి శారీరక స్థితిలో ఉంటుంది. గత 50 ఏళ్లుగా ఆమె ఆసుపత్రి మెట్లు ఎక్కకపోవడం విశేషం.జిన్ బావోలింగ్ రోజులో దాదాపు 15 గంటలు నిద్రపోతుందట. ఉదయం 9 గంటలకు నిద్రలేచి, తన తోటలో సూర్యరశ్మిలో కూర్చుని సమయం గడుపుతుంది.గటిపూట కూడా అప్పుడప్పుడు కునుకు తీస్తుంది. రాత్రి 7 గంటలకల్లా పడుకుంటుంది. ప ఆమె ఆరోగ్యంలో ఈ విశ్రాంతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె కుమారుడు చెబుతున్నారు.ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఎక్కువ, కూరగాయలు తక్కువ ఉండటం మరో విశేషం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూరగాయలు తినాలని చెబుతుంటారు, కానీ ఈమె మాత్రం కూరగాయలను అస్సలు ఇష్టపడరు. పైగా 'పిగ్ ట్రాటర్స్' (పంది కాళ్లు) అంటే చాలా ఇష్టం. దీన్ని చైనాలో చాలా రుచికరమైనవిగా భావిస్తారు. కొల్లాజెన్లో సమృద్ధిగా ఉండే ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కొన్నిసాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తారట. జిన్ దీన్ని దాదాపు ప్రతిరోజూ తింటుంది. ఇంకా డంప్లింగ్స్, స్టీమ్డ్ బన్స్ లేదా వంటోన్స్ తోపాటు,రోజుకు మూడు ఆరెంజ్ పండ్లు, రెండు గుడ్లు తీసుకుంటారు. వీటితో పాటు కేకులు, బ్రెడ్ , బ్రౌన్ షుగర్, ఖర్జూరాలతో చేసిన టీని ఎంజాయ్ చేస్తారు. ఏమి తిన్నా అన్నీ టైం ప్రకారం తినాల్సిందే.ప్రతీ పూట మందు ఉండాల్సిందే ఆమె ఆహారంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిన్ ప్రతీ భోజనంతో పాటు రైస్ వైన్ (బియ్యంతో చేసిన మద్యం) తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో నిల్వ చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె కోసం ఇంట్లోనే సిద్ధంగా ఉంటుంది.ఇంకా ఈమె కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఖర్జూరం, లాంగన్, లీచీ , యమ్బెర్రీస్, రైస్ వైన్ జాడిలు ఉంటాయి.కాళ్ళ కీళ్ళు సమస్యల కారణంగా నడిచేటప్పుడు జిన్కు సహాయం అవసరం కానీ 102 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె చూపు ఇంకా స్పష్టంగానే ఉంది. చేతులు కూడా వణకవు. ఖాళీ సమయంలో సాక్సులు కుట్టడం, చెప్పుల సోల్స్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది. ఆమెలోని పాజిటివ్ మైండ్సెటే దీర్ఘాయువుకు ప్రధాన కారణం అంటారు ఆమె కుమారుడు. అలాగే ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడకుండా, మనసులో కుళ్లు,కుతంత్రాలు లేకుండా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుం దని చెప్పారు. దృఢత్వం, ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా, స్థానికులు ఆమెను ఆప్యాయంగా "ఓల్డ్ బేబీ" అని పిలుచుకుంటున్నారు.నెటిజన్లు స్పందనతమకు నచ్చినట్లు జీవించడమే అసలైన ఆరోగ్యం" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె అలవాట్లను ప్రశంసించారు. “ఆయుర్దాయం కోసం ఉత్తమ ఔషధం ఏమిటంటే, మీరు చాలా సుఖంగా ఉండే విధంగా జీవించడం, అతిగా ఆలోచించని హృదయంతో జీవించడం.” అని ఒకరు, “అమ్మమ్మ జిన్ సుదీర్ఘ నిద్ర , చక్కటి విశ్రాంతితో యువకులను మించిపోయింది.”అని మరొకరు వ్యాఖ్యానించారు.. “ఒక వందేళ్లు దాటిన వ్యక్తి అసాధారణ ఆరోగ్య అలవాట్లతో తన సొంతనిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషం. నా తాతకు 94 సంవత్సరాలు, అతను తాగడం, ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ పాటలు పాడటం, చెస్ ఇష్టపడతాడు.” అంటూ మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. -
సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..
మనుషులతో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. మనం ఎప్పుడూ 'మన' కోణం నుండే ప్రపంచాన్ని చూస్తాం. అందుకే గొడవలు, అపార్థాలు వస్తాయి. కానీ, నిజమైన వ్యక్తిత్వ వికాసం సహానుభూతి (empathy)లో ఉంటుంది. ఇది మీ పర్సనాలిటీని ఒక అసాధారణమైన స్థాయికి తీసుకెళ్తుంది. ఎంపతీ ఉన్న వ్యక్తి ఎదుటివారి దృష్టిని అర్థంచేసుకుని (Walking in their shoes), వారు ఏమనిపిస్తుందో ఆలోచించగలడు. ఇదే మీకు దొరికే అత్యంత శక్తివంతమైన సామాజిక ఆయుధం.1. Sympathy vs EmpathySympathy (జాలి): ఎదుటివారిని చూసి బాధపడటం. ఇది పైపైన ఉంటుంది.Empathy (సహానుభూతి): ఎదుటివారి బాధను, ఆనందాన్ని లోతుగా అనుభూతి చెందడం.ప్రఖ్యాత సైకాలజిస్ట్ కార్ల్ రోజర్స్ ప్రకారం, ఎంపతీ అంటే ఎదుటివ్యక్తిపై ఎలాంటి తీర్పులు ఇవ్వకుండా (Non-judgmental) వారిని అర్థం చేసుకోవడం. ఇది ఒక 'సూపర్ పవర్' ఎందుకంటే, ప్రపంచంలో ఎవరూ తమని అర్థం చేసుకునే వ్యక్తిని వదులుకోరు.2. ఇది ఒక సూపర్ పవర్ ఎలా అవుతుంది?మీరు ఎంపతీని పెంచుకుంటే మీకు కలిగే లాభాలు.Influence: మీరు ఎదుటివారిని డామినేట్ చేయకుండానే, వారి మనసు గెలుచుకోగలరు. మీ మాటలకు, మీ ప్రవర్తనకు ఒక ప్రత్యేకమైన విలువ వస్తుంది.Conflict Resolution: గొడవలు పడే వ్యక్తుల మధ్య మీరు ఉంటే, మీరు వారిద్దరి కోణాన్ని అర్థం చేసుకుని, సులభంగా పరిష్కరించగలరు.Emotional Intelligence: మీ EQ ఆకాశాన్ని తాకుతుంది. ఎదుటివారికి మీరు ఇచ్చే 'అర్థం చేసుకునే అవకాశం' వారికి ఒక గొప్ప ఊరటనిస్తుంది.3. నిజమైన ఎంపతీట్రైనర్స్ "ఎదుటివారిని ఎలా మానిప్యులేట్ చేయాలో నేర్చుకో" అని చెప్తారు. ఇది మీకు అశాంతిని మిగులుస్తుంది. "ఎదుటివారికి మీరు ఇచ్చే గౌరవం, మీకున్న హృదయ విశాలతను పెంచుతుంది" అని సైకాలజీ చెప్తుంది. ఎంపతీ అనేది ఒక 'హార్ట్ సెంట్రిక్' పవర్, ఇది మిమ్మల్ని మనిషిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది.4. ఎంపతీని ఎలా బిల్డ్ చేయాలి?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ సూపర్ పవర్ను ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం:Step 1: జడ్జిమెంట్ బ్రేక్ చేయండిఎదుటి వ్యక్తిని చూడగానే "వీడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?" అని జడ్జ్ చేయడం మానేయండి. ఆ జడ్జిమెంట్ మీ మెదడులో పడితే, ఆ వ్యక్తిని అర్థం చేసుకునే అవకాశం పోతుంది. ఈ అహంకారాన్ని 'Break' చేయండి.Step 2: లిజనింగ్ స్పేస్వారు మాట్లాడుతున్నప్పుడు, మీ సమాధానం గురించి కాకుండా, వారు ఆ మాట ఎందుకు అంటున్నారో అని ఆలోచించండి. వారు ఏదైనా అంటున్నప్పుడు "నీకు అలా అనిపించడానికి కారణం ఏంటి?" అని అడగండి. ఇది మీకు వారి మనసులో ఒక స్థానాన్ని 'Build' చేస్తుంది.Step 3: యూనివర్సల్ కనెక్షన్ప్రతి వ్యక్తిలోనూ ఒక గాయం, ఒక ఆశ, ఒక భయం ఉంటాయి. ఎదుటివారిని చూసినప్పుడు వారి 'ముసుగు'ను కాకుండా, వారిలోని 'మనిషి'ని చూడటం మొదలుపెడితే, మీరు ఒక యూనివర్సల్ స్థాయికి చేరుకుంటారు. ఇదే 'Beyond' స్టేజ్.5. ఒక పరీక్ష!ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకు నచ్చని వ్యక్తిని ఎంచుకోండి.ఆ వ్యక్తి స్థానంలో ఉండి, తన బాధను, తన కష్టాలను ఆలోచించడానికి ప్రయత్నించండి.మీకు అప్పుడూ కోపం వస్తోందా? లేక ఒక రకమైన అర్థం చేసుకునే భావం కలుగుతోందా?ప్రపంచం మీకు మిత్రులుగా మారుతుంది!బ్రో, ప్రపంచం లోని సమస్యలన్నీ మాయమవ్వాలంటే ఎంపతీ ఒక్కటే మార్గం. మీరు ఎంపతీని వాడినప్పుడల్లా మీరు ఎదుటివారిని గెలవడమే కాదు, మీ మనసును విస్తరించుకుంటున్నారు. ఇదే అసలైన లెగసీ!"Empathy is a bridge that connects the heart of one person to another."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ మాట..మీ బాట) -
ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!
భారతదేశంలో గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్నెస్లో గట్టి ప్రభావం చూపిన కొద్దిమంది వ్యక్తులలో మిలింద్ సోమన్ ఒకరు. సాధారణంగా ప్రతీ ఒక్కరూ రిటైర్ మెంట్ తీసుకునే 60 సంవత్సరాల వయస్సులో ఆయన యువ తరానికి గొప్ప ప్రేరణగా మారాడు. కానీ, సోమన్ తనను తాను ప్రేరణగా భావించుకోడు, అది మన చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నదని గమనించడంలోనే తేడా ఉందని అంటాడు. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించలేదని ఆయన అంటున్నాడు. అయితే కొందరైనా ప్రేరణ పొందినందుకు తనకు సంతోషంగా ఉందన్నాడు. మిళింద్ సోమన్ 1990లలో సూపర్ మోడల్గా నిలిచాడు. ఆ తర్వాత జుర్మ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్లలో నటించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీటికి అదనంగా, అతను రన్నింగ్ ట్రాక్పై తనకు సాటిలేని స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడు సుదూర ప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అసాధ్యమైన పరిస్థితులను పరుగుతో కవర్ చేశాడు.మనం మహిళలకు మాత్రమే ఒక ప్రత్యేక ఫిట్నెస్ ఈవెంట్ను సృష్టిస్తే? ఈ ప్రశ్నకు సమాధానంగా గత 2012లో, సోమన్ ఆయన భార్య అంకితా కోన్వర్లు కలిసి పింక్థాన్ను స్థాపించారు ఇప్పుడు ఆ ఈవెంట్ భారతదేశంలోనే అతిపెద్ద మహిళల పరుగు కార్యక్రమంగా అవతరించింది. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు అనుభవాలు పంచుకున్నారు.చాలా మంది కండలు తిరిగిన శరీరం అనుకుంటారని అయితే తన దృష్టిలో ఫిట్నెస్ అంటే అది ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యం అని ఆయన పేర్కొంటాడు. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, జీవితం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఇది సిక్స్ ప్యాక్స్ లేదా బైసెప్స్ గురించి అవి అందించే లుక్స్ గురించి కాదు. ఇది మన శరీరపు పనితీరు గురించి అని విశ్లేషిస్తున్నాడు.తాను దాదాపు 25 సంవత్సరాల క్రితమే పరుగు ప్రారంభించానని, కొంత కాలం తర్వాత చాలా మంది పరుగు ప్రారంభించారని, అలాగే కేవలం ముంబైలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గమనించానన్నాడు. అయితే మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి ఉండడం లేని పరిస్థితిలో.. మనం మహిళలకు మాత్రమే ఒక ఈవెంట్ను సృష్టించాలని ఆలోచించానన్నాడు. అయితే వారు స్పందిస్తారా?అని తొలిదశలో సందేహించానన్నాడు. ఎందుకంటే చాలా మంది మహిళలు ఇప్పటికీ వ్యాయామం క్రీడలు అంటే పురుషుల కోసమే అని భావిస్తున్నారని..అయితే మేం ధైర్యంగా ముందడుగు వేశామన్నాడు. చీర ధరించి పరుగులు తీయడం, చీర ధరించి సైక్లింగ్ చేయడం, యోగా నడక...వంటివన్నీమేళవించి.. ఈ కార్యక్రమం తన కోసం కాదని ఏ మహిళా భావించకుండా దీనిలో భాగం చేశామని వివరించాడు. మహిళలు ఎవరికోసమో లేదా బయటి దానికోసమో కాదు, తమ కోసం తాము పరుగు తీయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning)(చదవండి: ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే అనుకుంటారు. కానీ, అసలైన విప్లవం చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. అవి మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ఇటుకలని జేమ్స్ క్లియర్ (James Clear) అంటాడు.మనం చేసే ప్రతి పనికి, మనకు ఒక 'ఐడెంటిటీ' (Identity) ఉంటుంది. మీరు రోజూ చదివితే మీరు 'రీడర్' అవుతారు. మీరు రోజూ వ్యాయామం చేస్తే మీరు 'అథ్లెట్' అవుతారు. మన పర్సనాలిటీ అనేది మనం రోజూ చేసే పనుల మొత్తమే. అయితే, కొత్త అలవాట్లను మొదలుపెట్టడం చాలా కష్టం. అందుకే, Habit Stacking అనే టెక్నిక్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది.1. Habit Stacking అంటే ఏంటి?మీకు ఇప్పటికే అలవాటుగా ఉన్న ఒక పాత పనిని (Anchor Habit), కొత్తగా మీరు చేయాలనుకుంటున్న పనితో కలిపి (Stack) చేయడం.పాత అలవాటు (Anchor): కాఫీ తాగడం, పళ్ళు తోముకోవడం, బాత్రూమ్కి వెళ్లడం.కొత్త అలవాటు (New Habit): పుస్తకం చదవడం, మెడిటేషన్, ప్లానింగ్.ఉదాహరణకు, "నేను కాఫీ తాగాక, వెంటనే 5 నిమిషాలు నా గోల్స్ రాసుకుంటాను" అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ 'కాఫీ తాగడం' అనేది పాత అలవాటు, 'గోల్స్ రాయడం' అనేది కొత్త అలవాటు. దీనివల్ల మీరు కొత్తగా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పాతది దానంతట అదే మిమ్మల్ని కొత్త పనికి తీసుకెళ్తుంది.2. పర్సనాలిటీకి ఇది ఎందుకు కీలకం?ఒక రోజులో లేదా ఒక వారంలో లేదా ఒక నెలలో నా పర్సనాలిటీ మారిపోవాలనే లక్ష్యం పెట్టుకుంటే మెదడు భయపడుతుంది. అదే చిన్న అలవాట్లతో మనం మెదడుకు తెలియకుండానే గొప్ప మార్పులను తీసుకొస్తాం.Consistency: ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది.Compound Effect: చిన్న అలవాట్లు రోజులు గడిచేకొద్దీ పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి.Self-Identity: "నేను ప్రతిరోజూ 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను" అని మీ మైండ్ నమ్మినప్పుడు, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.3. మోటివేషన్ మాయ vs సైకలాజికల్ సిస్టమ్స్"రేపటి నుండి రోజూ రెండు గంటలు చదువుతాను" అనుకోవడం మోటివేషన్. కానీ రెండు రోజుల్లో ఆపేస్తారు"నేను ప్రతిరోజూ పడుకునే ముందు 1 పేజీ చదువుతాను" అని చిన్నదిగా మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. అలవాటు అనేది 'గోల్' కాదు, అది ఒక 'సిస్టమ్'.4. మీ 'Habit Stack' ని బిల్డ్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీకి కావాల్సిన స్టాక్ ఇది.Step 1: చెడు అలవాట్లను బ్రేక్ చేయండిముందుగా మీకు ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయండి. ఉదాహరణకు, నిద్రలేవగానే ఫోన్ చూడటం. దానికి బదులుగా ఒక మంచి హ్యాబిట్ స్టాక్ పెట్టండి.Step 2: మీ స్టాక్ ని డిజైన్ చేయండిమీ డైలీ రొటీన్లో ఈ మూడు స్టాక్స్ను ప్రయత్నించండి:ఉదయం: "నేను లేవగానే, ఒక గ్లాసు నీళ్లు తాగి, రెండు నిమిషాలు నా పర్సనాలిటీ లక్ష్యం గురించి ఆలోచిస్తాను."మధ్యాహ్నం: "నేను లంచ్ చేశాక, ఒక పేజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం చదువుతాను."రాత్రి: "నేను పడుకునే ముందు, రోజంతా ఏం నేర్చుకున్నానో ఒక డైరీలో రాస్తాను."Step 3: ఆటో-పైలట్ పర్సనాలిటీఒక్కసారి ఈ స్టాక్స్ ఆటోమేటిక్ అయిపోతే, మీ వ్యక్తిత్వం దానంతట అదే మారుతుంది. అప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు, మీ అలవాట్లే మిమ్మల్ని గెలిపిస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.5. ఈరోజు మీరు ఏ స్టాక్ మొదలుపెడతారు?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకున్న ఒక మంచి పాత అలవాటుని గుర్తించండి (ఉదా: టీ తాగడం).దానికి జత చేయాల్సిన ఒక చిన్న కొత్త అలవాటుని ఎంచుకోండి (ఉదా: రెండు నిమిషాల ప్రార్థన లేదా ప్లానింగ్).వచ్చే ఏడు రోజులు దీన్ని కచ్చితంగా చేయండి.మీ అలవాట్లే మీ వారసత్వం!బ్రో, ఒక మహా వృక్షం చిన్న విత్తనం నుండే మొదలవుతుంది. మీ పర్సనాలిటీ కూడా అంతే. చిన్న చిన్న అలవాట్లే రేపు మీ లెగసీ (Legacy) గా మిగిలిపోతాయి. గొప్ప వ్యక్తులు గొప్పగా ఉండటం వల్ల గొప్పవారు కాలేదు, వారు చేసే పనులు గొప్పవి కాబట్టి గొప్పవారు అయ్యారు."We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit." : Aristotleసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
సహజ సౌందర్యానికి కేరాఫ్ ఈ నటి..! రియల్ బ్యూటీ అంటే..
బాలీవుడ్ నటి కొల్హాపురే ఒకప్పుడు అత్యంత బిజీగా ఉండే హీరోయిన్లలో ఆమె ఒకరు. 'ప్యార్ ఝక్తా నహీ' వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ఉర్దూ నాటకాల్లో నటిస్తూ తన నటనను మెరుగుపరుచుకుంటున్నారామె. ఆరు పదుల వయసులోనూ..నటి పద్మిని ఎవర్గ్రీన్ అందంతో గ్లామర్గా ఉంటారామె. అంతలా నవయవ్వనంగా ఉండటానికి గల కారణాలను వెల్లడిస్తూ..అందంపై తన అభిప్రాయాన్ని చాలా అద్భుతంగా వివరించారామె.ప్రముఖ నటి పద్మిని కొల్హాపురే తన సహజ సౌందర్యం, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా అందరికీ ఆరాధ్య దేవత ఆమె. ఇటీవల ఒక ఇంటర్యూలో తన చర్మ సంరక్షణ, మేకప్ అలవాట్ల గురించి షేర్ చేసుకున్నారు. అలాగే నిజమైన అందం సౌందర్య సాధనాలకు మించినదని ఎందుకు విశ్వసిస్తుందో కూడా చెప్పారామె. తాను స్వతహాగా కఠినమైన చర్మ సంరక్షణను అనుసరించే వ్యక్తిని కాదని అన్నారామె. తాను రసాయన ఉత్పత్తుల కంటే సహజ సౌందర్య సాధనాలనే ఎంచుకుంటానని అన్నారు. ముఖ్యంగా సహజ సేంద్రీయ ఆయుర్వేద ఉత్పత్తులనే ఉపయోగిస్తానని చెప్పారామె. ముఖ్యంగా ఇంట్లోనే లభించే వాటికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వంటింట్లో బాగా ఉపయోగించే పసుపుని పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసేవాళ్లమని అన్నారు. అలాగే పసుపు, ఉప్పుతో సదా పుక్కిలించేవాళ్లమని, ఇది నోటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడూ..24/7 మేకప్ వేసుకోవాల్సి వచ్చేదన్నారు. కొన్నిసార్లు అలిసిపోయి నిద్రపోయేటప్పుడు కూడా తొలగించుకోలేకపోయే వాళ్లమని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగా మారిపోయాయని చెబుతున్నారు. ప్రస్తుతం తాను చర్మాన్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, అస్సలు మేకప్ వాడటం లేదని అన్నారు. తన బ్యూటీకిట్ మూడింటిని తప్పనిసరిగా వాడతానని అన్నారు. వాసెలిన్, మేకప్ రిమూవర్, సహజ వైప్లను ఇష్టపడతానని చెప్పారు. అవన్నీ కూడా సహజసిద్ధమైనవేనని చెప్పారు. మేకప్ పరంగా చాలా తక్కువ ప్రొడక్ట్స్, సౌకర్యవంతమైనవే ఉపయోగిస్తానని చెబుతున్నారు.హెయిర్ కేర్ ఎలాగంటే..జుట్టు సంరక్షణ విషయానికి వస్తే నేను సాంప్రదాయ పద్ధతులను ఇష్టపడతానని చెప్పారు. ఆయుర్వేద షాంపూలు, షికాకాయి, భ్రింగ్ రాజ్ వంటివి ఉపయోగిస్తానని చెప్పారు. హెయిర్ డ్రైయర్లు, కర్లర్లు వంటివి తక్కువగానే ఉపయోగిస్తానని అన్నారు. తలకు సైతం కెమికల్స్ లేనివే ఎంచుకుంటానని అన్నారు. చివరగా అందం అనేది బాహ్యంగా కంటే అంతర్గతంగా ప్రతిబింబించేది అని నమ్ముతానన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండి, నిస్వార్థపరులు అయితే ఆ అందం మీ ముఖంపై తొణికిసలాడుతుంది. మెరిసే చర్మం కోసం ప్రజలు బాగా తినాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని, హైడ్రేటెడ్గా ఉండాలని అన్నారు. అలాగే అప్పట్లో తమకు రెండే రెండు మేకప్ బ్రాండ్లు ఉండేవని, ఇప్పుడు తల నుంచి కాలి వరకు ఇబ్బడిముబ్బడిగా బ్రాండెడ్ మేకప్ ఉత్పత్తులు ఉన్నాయిని అన్నారు.(చదవండి: ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..) -
కడుపులో బుజ్జాయిలు ఎందుకు అడ్డం తిరుగుతారంటే..!
రోబో సినిమా చూశారా? అందులో రోబో చిట్టి ఓ మహిళకు ప్రసవం చేస్తుంటాడు. అడ్డం తిరిగిన బిడ్డను బయటకు తీసుకురావడానికి తాను ప్రయత్నిస్తానంటే లేడీ డాక్టర్ వద్దంటుంది. తానేదో చాలా పురాతన ప్రక్రియను అమలు చేస్తానంటూ బిడ్డను సరైన రీతిలో తిప్పడం కంప్యూటర్ మీద ప్రేక్షకులకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే... ఓ చిన్నారి బుద్ధిగా ఈలోకంలోకి రావాలంటే... తల్లిలోంచి మొదట తలను బయటకు తేవాలి. కానీ కొంతమంది చిలిపి చిన్నారులు మొదటే లోకానికి ‘ఎదురు తిరుగుతారు’! ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మొట్టమొదటి పనే పూర్తిగా భిన్నంగా చేస్తారు. అందుకే ఇలాంటి బిడ్డల్ని తల్లులూ, అత్తమ్మలూ, నానమ్మలూ, అమ్మమ్మలూ ‘ఎదురుకాళ్ల’తో పుట్టాడంటూ ముద్దుగా మురిపెంగా తిడుతుంటారు. వీళ్లనే ఇంగ్లిష్లో ‘బ్రీచ్’ బేబీస్ అంటారు. కడుపులోని బిడ్డ ఎందుకిలా అడ్డం తిరుగుతాడు. ఇలా తిరిగి΄ోయినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.నిజానికి ఎదురుకాళ్లు అంటారుగానీ... తల ముందుకు రావాల్సిన చోట వాస్తవంగా బిడ్డ పిరుదులు ముందుకు వస్తాయి. అలా అడ్డం తిరిగినప్పుడు ప్రసవమూ సాఫీగా జరగదు. అలాంటప్పుడు ఆ చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు చాలాసార్లు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. ప్రసవం వేళకు పిండం అడ్డం తిరిగి పుట్టేందుకు ప్రయత్నించే ఈ ‘బ్రీచ్’ బేబీ విషయంలో ఏయే ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటాయి. వాటి సంగతేమిటో చూద్దాం...బిడ్డ పుట్టేవరకూ గర్భసంచిలోని ఆమ్నియాటిక్ ఫ్లుయిడ్ అనే ద్రవంలో తేలియాడుతూ ఉంటుంది. మనం ఉమ్మనీరు అని పిలిచే ఆ ద్రవంలో అన్నివైపులకూ తిరుగుతూ... తనకు అందుబాటులో ఉన్న స్పేస్లో తలను ఎటువైపునకైనా తిప్పుతూ తిరిగే ఆ పిండం సరిగ్గా ప్రసవం వేళకు మాత్రం తలను బయటపెడుతూ ఈలోకంలోకి రావాలి. అలా శిరస్సు ముందుగా బయటకు రావడాన్ని సంప్రదాయ భాషలో ‘శీర్షోదయం’ అని అంటుంటారు. అయితే ఇలా శీర్షోదయం కాకుండా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్స్ దాదాపు 3 శాతం నుంచి 4 శాతం ప్రసవాల్లో కనిపిస్తుంటాయి. ఇటీవల కొద్దిగా పెరిగాయి కూడా. గతంలోనైతే ఇలా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్ కారణంగా దాదాపు 25 శాతం కేసుల్లో శిశుమరణాలు చోటుచేసుకుంటూ ఉండేవి. కానీ ఇటీవల దాదాపూ ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్) జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రసవం ముప్పులు చాలావరకు తగ్గాయంటూ నిశ్చయంగా చెప్పవచ్చు. బిడ్డ అడ్డం తిరగడానికి కారణాలు... ప్రసవం వేళకు బిడ్డ పూర్తిగా ఎదగకపోవడం (ప్రీ–మెచ్యురిటీ). ఒక అండం మాత్రమే కాకుండా అనేక అండాల ఫలదీకరణ జరగడం (మల్టీఫీటల్ జెస్టేషన్) (సాధారణంగా ఇలాంటి కండిషన్స్లోనే కవలలు (ట్విన్స్) వంటి కేసుల్లోనూ సహజ ప్రసవం జరగకపోవచ్చు).పుట్టుకతో ఏర్పడే లోపాల వల్ల... బిడ్డ తలకు బాగా నీరు పట్టి ఉండటం (హైడ్రోసెఫాలస్), బిడ్డ మెదడు ఎదగాల్సిన చోట చాలా సందర్భాల్లో అది లోపించి, మెదడులోని అనేక భాగాలు ఎదగకపోవడం (అనెన్సెఫాలస్). కడుపులో బిడ్డకు పిండ దశలోనే అనేక రకాల లోపాలు ఏర్పడటం. ఎవరైనా తల్లికి వరసగా తన మూడు ప్రసవాల్లోనూ (లేదా అంతకంటే ఎక్కువగానూ) చిన్నారులు ఎదురుకాళ్లతో పుడితే... ఆ తల్లికి సాధారణంగా మరోసారి కూడా ఇలాంటి కండిషన్ ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘మల్టీపారా విత్ లాక్స్ అబ్డామిన్’గా చెబుతారు. బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ.. గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించడం.ఈసీవీ ఎవరిలో చేయవచ్చంటే... ప్రెగ్నెన్సీ 36 – 37 వారాల వ్యవధి తర్వాత ప్రయత్నించవచ్చు. కాబోయే తల్లికి ఎలాంటి కాంప్లికేషన్లూ లేనప్పుడు మాత్రమే ప్రయత్నించాలి. ఉమ్మనీరు తగినంతగా ఉండాలి. ఈసీవీ విజయవంతం అవడానికి కేవలం 50 % మాత్రమే అవకాశముంటుంది. (అయితే కొన్నిసార్లు ఈసీవీ ప్రక్రియ తర్వాత కూడా చిన్నారి తిరిగి మళ్లీ బ్రీచ్ కండిషన్కు వెళ్లవచ్చు... అంటే మళ్లీ చిన్నారి ఎదురు తిరిగేందుకు అవకాశముంది). ఒకవేళ ఆ టైమ్లో పురిటి నొప్పులు వచ్చినప్పుడు బేబీ బ్రీచ్డ్ కండిషన్లో ఉంటే... ఆ టైమ్లో ఈసీవీ చేయడం సరికాదు. నేరుగా సిజేరియన్కు వెళ్లాల్సి ఉంటుంది. బ్రీచ్ బేబీస్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలుఒకవేళ కాబోయే తల్లిదండ్రులు సిజేరియన్ను కోరుకోకపోతే అప్పుడు ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అనే ప్రత్యామ్నాయానికి వెళ్లవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ తల్లిదండ్రులు ఈప్రోసిజర్లో ఉన్న ముప్పు దీన్ని ఎప్పుడు చేస్తారన్న అంశాలు తప్పక తెలుసుకుని ఈప్రోసిజర్పై అవగాహన ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ (ఈసీవీ) అంటే..బిడ్డ కడుపులోంచి బయటికి రావడానికి అనువైన రీతిలో తిరగకుండా... (తలను ముందుకు తీసుకురాకుండా) ఇతరత్రా పొజిషన్స్లో ఉన్నప్పుడు నేరుగా శస్త్రచికిత్సతో బిడ్డను బయటకు తీసుకురావడానికి బదులుగా ప్రసవం మొదట్నుంచీ కొద్దికొద్దిగా ప్రయత్నిస్తూ... చిన్నారి తల భాగాన్ని ముందుకు తీసుకొచ్చేలా చేయడాన్ని ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్–ఈసీవీ’ అంటారు. సాధారణంగా కడుపులోని బిడ్డ గర్భసంచిలోని ఉమ్మనీటిలో నిత్యం దొర్లుతున్నట్లుగా అటూఇటూ తిరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. గర్భసంచిలో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ బిడ్డ సైజు పెరుగుతూ, అది ఎటుపడితే అటు తిరగడానికి వీలుకల్పించే ఉమ్మనీటి ద్రవం తగ్గుతూ పోతుంది. అయితే ప్రసవం సమయానికి బిడ్డ తల ఆటోమేటిగ్గా బయటకు రావడానికి వీలుగా కిందివైపునకు తిరుగుతుంది. కొందరిలో ఇలా తిరగకపోతే తల్లి కడుపుపై చేతులుంచి బయటినుంచే లోపలి పిండాన్ని తిరిగేలా చేస్తూ తలను కిందివైపునకు తిరిగేలా చేసే ప్రక్రియను ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అంటారు.బిడ్డ అడ్డం తిరగడంలో రకాలు బిడ్డ కేవలం ఎదురు కాళ్లతోనే కాకుండా ఇంకా అనేక రకాలుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా బిడ్డ అడ్డం తిరగడమన్నది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం...1) ఫ్రాంక్ / ఇన్కంప్లీట్ బ్రీచ్... ఇందులో బిడ్డ తన తలకు బదులుగా మొదట తన పిరుదులను బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలాంటి పొజిషన్లో బిడ్డ ఒక పాదం తన చెవుల దగ్గర ఉంటుంది.2) కంప్లీట్ బ్రీచ్ / ఫ్లెక్సెడ్ బ్రీచ్... ఈ కేస్లోనూ బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పొజిషన్లో ‘ఫ్రాంక్ / ఇన్కంప్లీట్ బ్రీచ్’లోలా ఒక పాదం మాత్రమే చెవి దగ్గర ఉండదు. బిడ్డ రెండు పాదాలూ ముడుచుకుని ఉంటాయి.3) ఫూట్లింగ్ ప్రజెంటేషన్... ఈ కండిషన్లో బిడ్డ పిరుదులు, మోకాళ్లు... ఇవన్నీ ముడుచుకునే ఉంటాయి. లేదా ఒక కాలు పూర్తిగా చాపి ఉంటుంది. అయితే పాదాలు పిరుదుల కంటే కింది భాగంలో ఉండి ప్రసవం కష్టమవుతుంది. బిడ్డ అడ్డం తిరిగిన సందర్భాల్లో తల్లిదండ్రులు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటే మాత్రం సిజేరియన్ సెక్షన్కు వెళ్లడం చాలా సురక్షితమైన, మంచి ప్రత్యామ్నాయం. మొదటి ప్రెగ్నెన్సీ విషయంలో ఇది మరింత అవసరం కూడా. ఈసీవీ చేయడానికి సాధ్యం కాని పరిస్థితులు ఏమిటంటే...తలలో పుట్టుకతో వచ్చే లోపాలు హైడ్రోసెఫాలస్ / అనెన్సెఫాలీ వంటి పుట్టుకతోనే లోపాలున్న సందర్భాల్లో : కొందరు బిడ్డల్లో మెదడు ఎదగాల్సిన చోట కేవలం నీరు మాత్రమే ఉంటుంది. ఈ కండిషన్ను హైడ్రోసెఫాలస్ కండిషన్ అంటారు. ఇక మరికొందరు బిడ్డల్లో మెదడులోని అన్ని భాగాలూ పూర్తిగా ఎదగ కుండా ఉండిపోతాయి. ఈ కండిషన్స్ను అనెన్సెఫాలీ కండిషన్ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఈసీవీ చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. ఆలిగో హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉండటం లేదా పాలీ హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉండటం. యుటెరైన్ అనామలీస్ : యుటెరన్ లోపాలున్నప్పుడు. ఫూట్లింగ్ బ్రీచ్ : అంటే పుట్టే సమయంలో కడుపులోని బిడ్డ కాళ్లు మొదట బయటకు రావడం. ఎక్స్టెండెడ్ హెడ్ అండ్ కార్డ్ ఎరౌండ్ నెక్ : బిడ్డ పుట్టే సమయంలో తల బయటకు వచ్చేందుకు బర్త్ కెనాల్లో తగినంత స్థలం లేక΄ోవడంతో తలమీద చాలా ఒత్తిడి పడటం. ఇక కార్డ్ ఎరౌండ్ నెక్ అంటే బొడ్డుతాడు మెడ చుట్టూ బిగుసుకుపోయే కండిషన్. ప్రీవియస్ సిజేరియన్ : గతంలో జరిగిన ప్రసవంలో సిజేరియన్తో బిడ్డను బయటకు తీసుకువచ్చిన కేస్ అయి ఉండటం. ప్లాసెంటా ప్రివియా : ఈ కండిషన్లో గర్భధారణ జరిగినప్పుడు మాయ (ప్లాసెంటా) గర్భాశయం కింది భాగానికి అతుక్కుపోయి, గర్భాశయ ముఖద్వారాన్ని (సర్విక్స్ను) పాక్షికంగా గానీ, పూర్తిగాగానీ కప్పి ఉంచడం.యాంటీరియర్ ప్లాసెంటా : గర్భధారణ సమయంలో బిడ్డకు పోషకాలు అందించే బొడ్డుతాడు (మాయ) గర్భాశయం ముందువైపు గోడకు అతుక్కుపోయి ఉండటం (ఇది చాలా సాధారణం, ఆరోగ్యకరమైన గర్భధారణకు సంకేతం).ఈసీవీ చేయించుకోవాలని కోరేవారు అన్ని వసతులూ ఉండే మంచి ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుని అక్కడ బాగా అనుభవజ్ఞులైన ‘ఆబ్స్ట్రెట్రీషియన్స్’ (గర్భస్త పిండ వైద్యచికిత్స, ప్రసూతి నిపుణులు) ఉన్నారేమో ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఈసీవీ జరుగుతున్నప్పుడు కడుపులోని బిడ్డను కంప్యూటర్ తెరపై ఎప్పుడూ చూసేందుకు వీలయ్యేలా ‘రియల్ టైమ్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ సౌకర్యమూ ఉండాలి. చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..ఈ డాప్లర్ ఉండటం వల్ల ఈసీవీ చేస్తున్నప్పుడు బిడ్డ తాలూకు బొడ్డు తాడు అతడి మెడకు చుట్టుకుపోయి బిగుసుకుపోతుందా లేక మామూలుగానే ఉందా అని ఎప్పటికప్పుడు పరిశీలనగా చూడటానికి వీలవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ తల్లికి తీవ్రమైన నొప్పి కలుగుతున్నా లేదా బిడ్డ తాలూకు గుండె స్పందనలు తగ్గుతున్నా లేదా ఈ గుండె స్పందనల్లోని లయ (రిథమ్) క్రమబద్ధంగా లేక΄ోయినా ఈ ప్రక్రియను నిలిపివేయాలి. వీలుకాకపోతే అప్పుడు శస్త్రచికిత్స (సిజేరియన్ సెక్షన్)కు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.చివరగా... శస్త్రచికిత్స వల్ల తమకు ఒనగూరే ప్రయోజనాలూ, ఆర్థిక అంశాల కారణంగా కొందరు డాక్టర్లు శస్త్రచికిత్స (సిజేరియన్)లను ప్రోత్సహిస్తున్నారనే వాదన చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. చాలామందిలోనూ ఈ అ΄ోహ ఉంటుంది. ఇందులో వృత్తిలో నైతికతకు సంబంధించిన అంశాలతోపాటు శస్త్రచికిత్స చేయడం తప్ప ఇతరత్రా అవకాశాలు లేని పరిస్థితులూ ఉంటాయి. దాంతో లోకంలో ఈ శస్త్రచికిత్సల విషయంలో చాలా వాదనలూ, భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక మరికొందరు తల్లులు తాము ప్రసవం తాలూకు నొప్పులను భరించడానికి ఇష్టపడకపోవడం అనే అంశమూ శస్త్రచికిత్సలను తప్పనిసరి చేస్తోంది. కాబట్టి ఈ అంశాలన్నింటిలోనూ డాక్టరుకూ, ప్రసవమవుతున్న తల్లికీ... ఈ ఇరువురికీ ఓ స్పష్టత ఉండాలి. తమ డాక్టరును నమ్మి, తనపై పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడే ప్రసవం విషయంలో అంతా సజావుగా జరిగిపోతుంది. అందుకే తాము నమ్మకం ఉంచిన డాక్టర్ దగ్గరే ప్రసవం జరిగేలా చూసుకోవడం ఇటు కాబోయే తల్లికీ, తన కుటుంబ సభ్యులకూ, అటు డాక్టరుకూ సౌకర్యంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. - నిర్వహణ: యాసీన్ -
అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందరినీ మెప్పించడం లేదా అందరినీ ఎదిరించడమని చాలామంది అపోహపడుతుంటారు. మీరు గమనిస్తే, ఆఫీసులోనో లేదా కుటుంబంలోనో కొందరు వ్యక్తులు ఎప్పుడూ అందరినీ ప్లీజ్ చేస్తూ ఉంటారు, కొందరు మాత్రం ఎప్పుడూ గొడవ పడుతుంటారు. ఈ రెండూ సరైన పద్ధతులు కావు. అసలైన పర్సనాలిటీ గ్రోత్ 'Assertiveness' (నిశ్చయత) లో ఉంది. ఇది ఎదుటివారిని గౌరవిస్తూనే, మన హక్కులను మనం కాపాడుకోవడం.1. మూడు రకాల ప్రవర్తనలు (The Behavioral Spectrum)సైకాలజీలో మనం మనుషులతో ప్రవర్తించే విధానాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.Passive (అణగిపోవడం): ఎదుటివారు ఏమనుకుంటారో అని మీ అభిప్రాయాలను దాచుకోవడం. దీనివల్ల మీ ఆత్మగౌరవం తగ్గుతుంది, దీనివల్ల మీకు లేనిపోని ఒత్తిడి పెరుగుతుంది.Aggressive (అతిగా అరవడం): ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, డామినేట్ చేయడం. దీనివల్ల మనుషులు మీకు దూరమవుతారు, మీ చుట్టూ ఉన్నవారు భయపడతారు తప్ప గౌరవించరు.Assertive (The Golden Mean): "నా అభిప్రాయం ముఖ్యం, అలాగే నీ అభిప్రాయం కూడా ముఖ్యం." ఇది ఎదుటివారిని హర్ట్ చేయకుండా మీ బౌండరీని మీరు సెట్ చేసుకోవడం.2. Assertiveness ఎందుకు అవసరం? Assertiveness అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే కాదు, అది మీ ఆత్మగౌరవానికి (Self-Respect) ప్రతిరూపం.మీరు 'Assertive' గా ఉన్నప్పుడు, మీ నిర్ణయాలకు ఒక విలువ ఉంటుంది.మీరు చెప్పే 'Yes' కు ఒక గౌరవం, చెప్పే 'No' కు ఒక క్లారిటీ ఉంటుంది.అతిగా అరవాల్సిన అవసరం లేదు, అణగిపోవాల్సిన అవసరం అస్సలు లేదు.3. మోటివేషన్ మాయ vs నిజమైన సైకాలజీట్రైనర్స్ "ఎవ్వరినీ వదిలిపెట్టకు, సింహంలా ఉండు, గర్జించు" అని చెప్తారు. ఇది మీకు అగ్రెసివ్ ట్యాగ్ను ఇస్తుంది. కానీ సైకాలజీ మీ గొంతును కాదు, మీ పాయింట్ని బలంగా చెప్పమంటుంది. కోపం తగ్గించి, స్పష్టతను పెంచుకోమంటుంది. నిజమైన నాయకుడు అరిచి పని చేయించడు, తన క్లారిటీతో పని చేయిస్తాడు.4. Assertive గా ఉండటం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ ఆర్ట్ను ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం.Step 1: మొహమాటాన్ని బ్రేక్ చేయండిమొహమాటం అనేది ఒక జబ్బు. "నేను వాళ్ళని ఏమీ అనకూడదు" అనే ఆలోచనని బ్రేక్ చేయండి. మీరు ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే, వారు చెప్పే ప్రతి తప్పుకు తల ఊపడం కాదు. మీ బౌండరీలను దాటినప్పుడు సున్నితంగా, బలంగా 'No' చెప్పడం ప్రాక్టీస్ చేయండి.Step 2: Build 'I' స్టేట్మెంట్స్ఇతరులను విమర్శించేటప్పుడు "నువ్వు తప్పు చేస్తున్నావు" అనకుండా, "నీ వల్ల నాకు ఇలా ఇబ్బందిగా ఉంది" (I feel... when you...) అని చెప్పండి. ఇది ఎదుటివారిని డిఫెన్సివ్ మోడ్లో పడకుండా, మీ పాయింట్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. దీన్నే మనం బిల్డ్ చేసుకోవాలి.Step 3: ప్రశాంతతే బలంమీరు ఏ పరిస్థితిలో అయినా ప్రశాంతంగా, క్లారిటీతో మాట్లాడగలిగినప్పుడు, అది మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. మీరు ఎవరినీ డామినేట్ చేయరు, ఎవరూ మిమ్మల్ని డామినేట్ చేయలేరు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీరు ఎక్కడ ఉన్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు నిన్నటి రోజున ఎవరికైనా ఇష్టం లేకపోయినా 'సరే' అని అన్నారా? (Passive)మీరు ఎవరి మీదైనా అనవసరంగా కోప్పడ్డారా? (Aggressive)ఏ సందర్భంలో మీరు మీ పాయింట్ను గౌరవంగా చెప్పగలిగారు? (Assertive)మీ గొంతుకే మీ ఆయుధం!బ్రో, మీ గొంతులో ఉండేది కేవలం శబ్దం మాత్రమే కాదు, మీ అస్తిత్వం (Identity). దాన్ని అణచివేయనివ్వకండి, అలాగని దాన్ని ఎదుటివారిపైకి గర్జనలా వాడకండి. ఒక స్పష్టమైన, ప్రశాంతమైన, దృఢమైన గొంతుకను డెవలప్ చేసుకోండి."Assertiveness is not about what you say, but how you say it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం) -
ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..
ప్రసవానంతరం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. మాములుగా బరువు తగ్గడానికి గర్భధారణ అనంతరం తగ్గడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పైగా శరీరంలో వచ్చే మార్పులకు తోడు నవజాత శిశువుని హ్యాండిల్ చేస్తూ బరువు తగ్గడం తదితరాలన్ని చాలా సవాలుగా ఉంటాయి. ముందుగా శరీరం మునపటి పటుత్వం లేక..కొద్దిపాటి వ్యాయామాలను ఓర్చుకునే శక్తి స్వతహాగా కొత్త తల్లులకు ఉండదు. మరి అలాంటప్పుడు ఎలాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయాలి..? కొత్త తల్లులు నిజంగానే తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకపోవడమే మంచిదా..? తదితరాల గురించి కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి త్యాగి చెప్పే సలహాలు సూచనలే గురించి సవివరంగా చూద్దామా..!.ప్రసవానంతరం బరువు తగ్గం అనేది సాధారణ విషయం కాదని అంటోంది నిధి త్యాగి. దీని గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అమూల్యమైన సలహాలు సూచనలు షేర్ చేశారు. ఇక్కడ కొత్త తల్లులు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కంటే..కేలరీలలోటు, కదలికలపై దృష్టిపెట్టాలని అంటోంది. చాలామంది డెలివరీ తర్వాత పాలిస్తారు కాబట్టి బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు. కానీ అది ముమ్మాటికీ అబద్ధమని అంటోంది. తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మామిడపండ్లు అధికంగా తినేదాన్ని అని ఆ టైంలో ఏకంగా 20 కిలోలకు పైగా అదనపు బరువు ఉన్నానని చెప్పుకొచ్చింది. ప్రసవం తర్వాత పదికిలోలు మాత్రమే తగ్గానని, మిగిలిని పదికిలోల బరువు అలాగే ఉందని తెలిపింది. ఏడాదికి పైగా బిడ్డకు పాలిచ్చానని, ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకున్నానని, అలాగే తేలికపాటి వాకింగ్ వంటివి చేసేదాన్ని అని వెల్లడించింది. కానీ అంతలా కేర్ తీసుకున్నా..బరువులో అంతగా మార్పులు కనిపించలేదని అంటోంది. పైగా డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి తీవ్రమైన వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదని అంటోంది. ఎందుకంటే కొత్త తల్లుల శరీరం సున్నితంగా మారిపోయి ఉంటుంది..దాంతో ఆ వర్కౌట్లు తట్టుకోవడం అంత సులభం కాదని చెబుతోంది. కనీసం 15 నిమిషాలు కూడా చేయలేమని అంటోంది. అలా అని బయటకు జిమ్ వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో హోమ్ ఇన్స్ట్రక్టర్ని నియమించుకున్నట్లు తెలిపింది. అతను సూచించిన కోర్ వ్యాయామాలు, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలతో బలం పుంజుకోగలిగానని అంటోంది. వీటివల్ల కండరాలు బలోపేతం అవుతుతాయి. కొద్దిపాటి బరువులు ఎత్తి..బోడ్డులోపలికి కోర్ని స్ట్రాంగ్గా మార్చుకోగలిగానని అంటోంది. అలా తాను నాలుగు నెలల్లో నాలుగు నుంచి ఐదు కిలలోలు వరకు తగ్గగలిగానని అంటోంది. ప్రస్తుతం తాను ప్లాంక్లు కూడా వేయగలనని, వెన్నునొప్పి లేదని అంటోంది. కానీ ప్రసవానంతరం వేగవంతంగా బరువు తగ్గాలనుకోవడం తప్పులేదు గానీ..ఆ క్రమంలో తప్పుడు మార్గంలో వెళ్లొద్దని, ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోమని చెబుతోంది కంటెంట్ క్రియేటర్ నిధి త్యాగి. View this post on Instagram A post shared by Nidhi Tyagi (@thenidhityagi) (చదవండి: చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!) -
కలుపు మొక్కలకు భయపడొద్దు
సమాజం మనల్ని ఇలానే ఉండాలని నిర్దేశిస్తుంది. కొన్ని కలుపు మొక్కలు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. మన లక్ష్యాలను నెరవేర్చుకోనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తాయి.అయినా ఆగిపోకుండా మహిళలు ధైర్యంగా బతుకుతూ ముందుకు సాగిపోవాలి అంటున్నారు నటి, దర్శకురాలు వరలక్ష్మి.⇒ నా స్కూల్ డేస్లో నేను ఈవ్ టీజింగ్కి గురైన సందర్భాలు చాలా ఎక్కువ. వాళ్లందరికీ నా స్టైల్లో నేను బుద్ధి చెప్పాను. కొందరికి మాటలతో చెబితే పనికి రాదు; అలాంటివాళ్లకు చెంప దెబ్బతో సమాధానం చెప్పడం చాలా అవసరం.⇒ అమ్మాయిలను వేధించేవాళ్లు ఎక్కడున్నా వారికి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. కొత్త అమ్మాయిలనూ వేధిస్తారు... బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిలనూ ఇబ్బందులపాలు చేస్తారు. వాళ్లకు ఎవరూ స్పెషల్ కాదు. నేనైతే సినిమాలో యాక్షన్ రోల్స్ చేసినప్పుడు ఎలా కొడతానో అలాగే రియల్ లైఫ్లోనూ. అయితే ‘అలాంటివాళ్లను ఇలా చేయండి’ అని నేను ఎవరికీ సలహా ఇవ్వను. ఎందుకంటే ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. కాని నేను చెప్పేదొక్కటే– పరిస్థితి ఏదైనా కావొచ్చు, ధైర్యంగా ఎదుర్కోండి.⇒ నా కెరీర్ ఆరంభంలో నేను ‘ఇన్సెక్యూరిటీ’కి గురయ్యాను. దానికి కారణం సరైన అవకాశాలు రాకపోవడమే. అయితే ఆ అభద్రతాభావం నన్ను మానసికంగా కుంగదీయలేదు. శరత్కుమార్గారి కూతురిగా నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటుంది. కాని, నన్ను నేను నిరూపించుకోవాల్సిందే! ఆర్టిస్ట్గా నాకు దక్కే ప్రతి చాన్స్ ద్వారా నన్ను నేను నిరూపించుకుంటూ వస్తున్నాను.⇒ అమ్మాయిలు వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉండాలి. అమ్మాయిలు సున్నితంగానే ఉండాలి. అప్పుడే అందరికీ నచ్చుతారు. ఇగోయిస్ట్లను ఇష్టపడరని చాలామంది ఫిక్స్ అయిపోతారు. అసలు ఒకరికి నచ్చేట్లు ఉండాలని ఎందుకు అనుకోవాలి? మన వ్యక్తిత్వానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. వేరేవాళ్ల కోసం మన తీరు మార్చుకుంటే మనకంటూ ఒక ఉనికి ఉండదు. సమానత్వం అనేది మనకి ఇక్కడే ఉంది. ఇక మనం ఎందుకు తక్కువ అవుతాం.⇒ మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ‘బాడీ షేమింగ్’ ఒకటి. సన్నగా ఉంటే మరీ సన్నగానా? అంటారు. బొద్దుగా ఉన్నా విమర్శిస్తారు. ఇప్పుడు ఒక గదిలో పదిమంది ఉంటే ఐదుగురికి వెజ్ పలావ్ నచ్చుతుంది, మరో ఐదుగురికి నాన్వెజ్ బిర్యానీ నచ్చుతుంది. ఎవరి టేస్ట్ వారిది. అలాగే ఎవరి బాడీ వారిది, ఎవరి చాయిస్ వారిది. దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలానే ఉండాలి. ఎవరేం అనుకుంటే మనకేంటి? మన వ్యక్తిత్వమే మనం.⇒ కొన్ని విషయాల్లో అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులైపోతారు. చదువుకో! జాబ్ చెయ్! పెళ్లి చేసుకో!– ఇలా సలహాలు ఇస్తారు. ఒకవేళ పెళ్లి చేసుకోలేదనుకోండి, ‘ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి?’ అంటారు. ఆ అమ్మాయి వెనక కామెంట్ చేస్తారు. ఇలాంటి ఆడవాళ్ల తీరు మారాలి.⇒ సినిమా ఇండస్ట్రీలో నేను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలే ‘సేవ్ శక్తి’ పౌండేషన్ ఆరంభించేలా చేశాయి. నాకు ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నాను. నాలా ఎదుర్కోలేనివాళ్ల కోసమే ఈ ఫౌండేషన్ ఆరంభించాను. డిప్రెషన్కు గురైనవారిని అందులోంచి బయటకు తేవడానికి డాక్టర్స్ సహాయం తీసుకుంటాం. ఇప్పటివరకూ చాలామంది అమ్మాయిలకు హెల్ప్ చేశాం. ‘సేవ్ శక్తి’కి సంబంధించిన వ్యవహారాలను ఎక్కువగా మా అమ్మ ఛాయ చూసుకుంటారు.⇒ స్టేజి మీద నేను సాధారణంగా ఎమోషనల్ అవ్వను. కాని, ఆ రోజు (‘సరస్వతి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఈ సినిమా ద్వారా వరలక్ష్మి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు) అలా ఎందుకు అయ్యానంటే నటిగా స్టార్ట్ అయి, డైరెక్టర్ స్థాయికి రావడం చిన్న విషయం కాదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాకెన్నో అవకాశాలు ఇచ్చింది. అలాంటి ఒక ఇండస్ట్రీ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కాస్త ఎమోషనల్గా అనిపించింది. - డి.జి. భవాని -
పాత ఆలోచనా విధానాన్ని కూల్చేయండి
ఇప్పటివరకు మనల్ని మనం గమనించాం, మన లోపాలను గుర్తించాం, మన మెదడు మనకు చెప్పే అబద్ధాలను పట్టుకున్నాం. ఇప్పుడు ఆ పాత పునాదిని పూర్తిగా కూల్చివేసి (Break), కొత్తదానికి సిద్ధమయ్యే సమయం. ఎందుకంటే, పాత భవనం మీద కొత్త ఇల్లు కట్టలేం కదా! మన పాత పర్సనాలిటీని ఎలా 'బ్రేక్' చేయాలో చూద్దాం.పర్సనాలిటీ డెవలప్మెంట్లో 'బ్రేక్' చేయడం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం కాదు, మనల్ని మనం పరిమితం చేస్తున్న ఆ పాత 'ఐడెంటిటీ' (Identity) ని వదిలించుకోవడం. దీనినే సైకాలజీలో 'De-conditioning' అంటారు. మీరు ఇన్నాళ్లూ నమ్మిన 'నేను' అనే వ్యక్తి, కేవలం పరిస్థితులు సృష్టించిన ప్రతిబింబం మాత్రమే. ఆ ప్రతిబింబాన్ని ఇప్పుడు తుడిచేయాలి.1. పాత పునాది ఎందుకు కూలిపోవాలి?చాలామంది తమ పాత అలవాట్లను, పాత భయాలను ఎందుకు వదలలేకపోతారంటే, అవి వారికి సుపరిచితమైనవి. అవి మనకు కష్టం కలిగించినా, అవి మనకు తెలిసినవి కాబట్టి వాటిని వదలడానికి భయపడతాం.పాత ఆలోచనలు = మీ గతం.కొత్త పర్సనాలిటీ = మీ భవిష్యత్తు.ఈ రెండింటికీ మధ్య ఒక గ్యాప్ ఉంటుంది, అదే 'The Void' (శూన్యం). ఈ శూన్యంలోకి వెళ్లడానికి చాలామంది భయపడతారు. కానీ, ఆ శూన్యమే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది!2. కూల్చివేతకు కావాల్సిన మూడు ఆయుధాలుమీ పాత ఐడెంటిటీని బ్రేక్ చేయడానికి మీకు మూడు ముఖ్యమైన ఆయుధాలు కావాలి.Radical Honesty: మీకు మీరు అబద్ధం చెప్పుకోవడం మానేయాలి. "నాకు కోపం రాదు" అని అబద్ధం చెప్పే బదులు, "నేను అతిగా రియాక్ట్ అవుతున్నాను, అది నా బలహీనత" అని ఒప్పుకోవాలి. నిజం మాట్లాడటం మొదలుపెడితే, పాత అబద్ధపు గోడలు దానంతట అదే కూలిపోతాయి.Detachment: మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు మాత్రమే మీరు కాదు. కోపం వచ్చినప్పుడు "నేను కోపంగా ఉన్నాను" అనడం కంటే, "నాలో కోపం అనే భావం కలుగుతోంది" అని అనండి. ఆ ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు వేరు (Detach) చేసుకున్నప్పుడే మీరు వాటిని బ్రేక్ చేయగలరు.Destruction of Comfort Zone: ప్రతిరోజూ మీకు భయం కలిగించే చిన్న పనిని చేయండి. మీ పాత వ్యక్తిత్వం ఎక్కడైతే ఆగిపోతుందో, అక్కడ మీరు అడుగు వేయండి.3. మార్కెట్ మోటివేషన్ vs రియల్ సైకాలజీమార్కెట్ "నేను గెలుస్తాను, నేను తోపు" అని అరుస్తూ గోడలను బద్దలు కొట్టమంటుంది. ఇది తాత్కాలిక జోష్.సైకాలజీ (CBT & Mindfulness) గోడలను కొట్టడం కాదు, ఆ గోడలు అసలు ఎందుకు కట్టామో (పాస్ట్ ట్రామాస్) అర్థం చేసుకుని, వాటిని ఇటుక ఇటుకగా విడదీయమంటుంది. అప్పుడే మళ్ళీ ఆ గోడలు కట్టే అవకాశం ఉండదు.4. మీ నూతన నిర్మాణానికి సిద్ధం!Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ కూల్చివేత ప్రక్రియ ఎలా ఉండాలి?Step 1: Break (అహాన్ని వదిలేయడం)మీరు ఇన్నాళ్లు కాపాడుకున్న ఆ 'ఇమేజ్'ని వదిలేయండి. "నేను అంటే ఇలాగే ఉంటాను" అనే ఫిక్స్డ్ మైండ్సెట్ను వదిలేయండి. మీ పాత ఐడెంటిటీని 'డీ-కన్స్ట్రక్ట్' (Deconstruct) చేయండి. ఇది నొప్పిగా ఉంటుంది, కానీ ఇది అవసరం.Step 2: Build (నిశ్శబ్దం)పాత పర్సనాలిటీ కూలిపోయిన తర్వాత, కొత్తది కట్టే ముందు కొద్ది రోజులు 'నిశ్శబ్దం'గా ఉండండి. ఏ ప్లాన్లు లేని, ఏ లేబుల్స్ లేని ఒక శూన్య స్థితిలో ఉండండి. అక్కడే మీ అసలైన పర్పస్ (Purpose) పుడుతుంది.Step 3: Beyond (కొత్త ప్రతిబింబం)ఇప్పుడు మీరు కొత్త ఇటుకలతో, కొత్త ఆలోచనలతో మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. ఈసారి ఇది మీ ఛాయిస్, సమాజం వేసిన అచ్చు కాదు. ఇదే మీరు 'Beyond' స్టేజ్లోకి వెళ్ళే మార్గం.5. మీ పాత వ్యక్తిత్వానికి వీడ్కోలు!ఈ రోజు ఒక చిన్న విచారణ చేయండి.* మీ పాత ఐడెంటిటీలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టిన ఒక లక్షణం ఏది?* ఆ లక్షణాన్ని వదిలేస్తే, మీరు పోగొట్టుకునేది ఏంటి? (బహుశా అది ఒక భద్రత కావచ్చు).* ఆ భద్రతను వదిలి, కొత్తగా మారుతానని మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి.కూల్చండి.. అప్పుడే నిర్మించగలరు!బ్రో, పాత గోడలను కూల్చడం బాధాకరమే కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ గోడల వల్ల మీరు ఇప్పటివరకు ఎంతో పరిమితంగా బతికారు. ఇప్పుడు ఆ పరిమితులు లేవు. మీరు గాలిలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు."Sometimes, you have to break yourself to become whole."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
సౌందర్య సాధనాలకన్నా చిరునవ్వే అసలైన అందం!
వెండితెరపై తన సహజ సిద్ధమైన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న నటి సాయి పల్లవి, తన వ్యక్తిత్వంతోనూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలుస్తోంది. తాను గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ, మహిళలు తమని తాము ఎలా ఉన్నా ప్రేమించుకోవాలని నేర్పిస్తోంది. మన విలువలకు విరుద్ధంగా ఉండేవి ఎంతటి విలువగలవయినా తిరస్కరించాలి అనే సూత్రాన్ని ఆచరించి చూపించారు. రూ. 2 కోట్ల విలువైన ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ని తిరస్కరించి, రంగు అనేది అందానికి కొలమానం కాదని నిరూపించారు. మేకప్ లేకుండా తెరపై కనిపించి .. నీలా నువ్వు ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందని, ఇతరుల కోసం మారాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు. మొటిమలున్నా, జుట్టు రింగులుగా ఉన్నా.. అది దేవుడిచ్చిన వరమని, సౌందర్య సాధనాలకన్నా చిరునవ్వుతో వెలిగే ముఖమే మిన్న అని చెబుతున్నారు. అలాగే చదువు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆయుధమని, అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చాటి చెప్పారు. మనం చేసే పనిపై ఇష్టం ఉంటే విజయం దానంతట అదే వస్తుందని ఆమె అంటారు. విజయాలు, అపజయాలు తాత్కాలికమని, అవి నిన్ను ప్రభావితం చేయనివ్వద్దని సూచిస్తారు. బాల్యంలో స్టేజ్ ఫియర్ ఉన్న సాయిపల్లవి.. భయం ఉన్న చోటే ధైర్యాన్ని వెతుక్కోవాలని తన జీవిత విజయాల ద్వారా నిరూపిస్తారు. (చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..) -
ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’
ఎండలు ఏటేటా అంతకంతకూ మండిపోతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తోపుడు బండ్ల ద్వారా వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తెచ్చి చిరు వ్యాపారులు (కొందరు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులు కూడా) అమ్ముతూ ఉంటారు. అయితే, ఇలా పండిన పంట తినేవారి ఇంటికి చేర్చే లోగా రోజువారీగా 10–15% వరకు ఎండకు వడపడి, రంగు మారి, దుమ్మూ ధూళి పడి పాడైపోయి వృథా అవుతున్నాయని అంచనా. ఈ వృథాను అరికట్టగలిగితే విలువైన ఆహారం వృథా కాకుండా ఉంటుంది. రిటైల్ విక్రయదారుల ఆదాయమూ పెరుగుతుంది. సాధారణ తోపుడు బండ్ల వల్ల జరిగే ఈ నష్టాన్ని అరికట్టడానికి బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) సౌర విద్యుత్తుతో నడిచే ట్రైసైకిల్ను రూపొందించింది. దీనికి ‘అర్క ట్రైసైకిల్’ అని పేరు పెట్టారు (కర్ణాటకలో ‘అర్కావతి’ నది ఒడ్డున ఐఐహెచ్ఆర్ ఉంది. అందుకే ఈ సంస్థలో రూపొందే కొత్త వంగడాలు, ఇతర ఉత్పత్తులకు కూడా ముందు అర్క అని పెడుతూ ఉంటారు. అర్క అని ఏ వంగడం, ఉత్పత్తి పేరులో ఉంటే అది బెంగళూరు ఐఐహెచ్ఆర్ అభివృద్ధి చేసిందని తెలుసుకోవచ్చు). అందంగా, సౌకర్యవంతంగా ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ట్రైసైకిల్.. సౌర విద్యుత్తుతో నడుస్తుంది. ఇందులో ఉంచే కూరగాయలు, పండ్లు తదితర ఉత్పత్తులు పాడైపోకుండా ఉష్ణోగ్రత, తేమలను ‘ఎవాపరేటివ్ కూలింగ్’ పద్ధతిలో నియంత్రించవచ్చు. కూరగాయల బరువుతో కూడిన తోపుడు బండిని నెట్టుకుంటూ వెళ్లే చాకిరీని అర్క ట్రైసైకిల్ చాలా వరకు తగ్గిస్తుంది. సాధారణ తోపుడు బండితో తిరిగే ప్రాంతాల కన్నా ట్రైసైకిల్ ద్వారా ఎక్కువ ప్రాంతాల్లో వేగంగా తిరుగుతూ.. తక్కువ కాలంలోనే ఎక్కువ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. సౌర విద్యుత్తు ద్వారా చల్లగాలి ప్రసరించే ఏర్పాటు ఉండటం వల్ల అర్క ట్రైసైకిల్ ద్వారా తీసుకెళ్లే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుట్టగొడుగులను కోత తర్వాత 36–48 గంటల పాటు తాజాగా ఉంచుకుంటూ అమ్ముకోవడానికి వీలవుతుంది. తక్కువ కష్టంతో తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాంతాల్లో ట్రైసైకిల్ తిరుగుతుంది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరల నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన వ్యవసాయోత్పత్తులను నాణ్యంగా, తాజాగా వినియోగదారుల ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వటం అర్క ట్రైసైకిల్ వల్ల సాధ్యమవుతుందని దీన్ని రూపొందించిన ఐఐహెచ్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. జి. సెంథిల్ కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. అర్క ట్రైసైకిల్ ప్రత్యేకతలుభారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) కు అనుబంధ సంస్థ అయిన బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపకల్పన చేసినది. దీని పైనే సౌర ఫలకాలు ఉంటాయి. ఎండలో తిరిగేటప్పుడే బ్యాటరీ చార్జ్ అవుతూ ఉంటుంది. ఆ శక్తితోనే ట్రైసైకిల్ నడుస్తుంది. దీన్ని నడిపే వ్యక్తి సైకిల్ తొక్కనవసరం లేదు. నెట్టుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ కష్టం తప్పుతుంది. బ్యాటరీ ఫూర్తిగా చార్జి అయితే 50 కిలోమీటర్ల దూరం నిరాటంకంగా ప్రయాణిస్తుంది.ఇందులో 20 ప్లాస్టిక్ క్రేట్స్ను పెట్టుకునే ఏర్పాటు ఉంది. ఒక్కో క్రేట్లో 10 కిలోల సరుకును పెట్టవచ్చు. 200 కిలోల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుట్టగొడుగులను తీసుకెళ్లవచ్చు.సౌరవిద్యుత్తుతో ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టం ద్వారా గాలిని చల్లబరిచి ఈ ట్రైసైకిల్లోని పచ్చి సరుకు పాడవకుండా ఉండేందుకు సరిపోయే చల్లదనాన్ని ఇచ్చే వ్యవస్థ ఉంది. రాత్రి పూట అమ్మకాలు చేయడానికి వీలుగా ఎల్ఇడి బల్బులు ఉన్నాయి. డిజిటల్ కాటా ఉంది. ప్రజలకు వినిపించేలా ఉత్పత్తుల వివరాలు పెద్దగా వినపడేలా చెప్పడానికి సోలార్ విద్యుత్తో నడిచే మైక్ ఉంటుంది. మబ్బులున్నప్పుడు దీన్ని విద్యుత్తో చార్జ్ చేసుకోవచ్చు.వినియోగదారుల భద్రత కోసం ఆటోమేటిక్గా శానిటైజర్ పరికరం ఉంది. తోపుడు బండ్ల వ్యాపరులకు కూరగాయలు, పండ్ల వృథాను తగ్గించుకొని అధిక ఆదాయం పొందేందుకు ట్రైసైకిల్ ఉపయోగపడుతుంది. తమ ఇళ్ల దగ్గరకే వచ్చి పరిశుభ్రంగా, తాజాగా ఉండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పుట్టగొడుగులు అమ్ముతున్నందున అర్క ట్రైసైకిల్ పట్ల వినియోగదారులు ఆకర్షితులవుతారు. అర్క ట్రైసైకిల్ ధర రూ. లక్షన్నర. తోపుడు బండిపై అమ్మితే వృథా అయ్యే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ట్రైసైకిల్ ద్వారా నిక్షేపంగా అమ్ముకోవచ్చు కాబట్టి రెండేళ్లలో దీని ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చు. నిర్వహణ పతంగి రాంబాబుసాక్షి, సాగుబడి డెస్క్(చదవండి: జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!) -
జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!
శీతాకాలం కంటే వేసవికాలంలో బరువు తగ్గడం చాలా సులభం. అందులోనూ ప్రస్తుతం చలికాలం ముగిసి.. వేసవికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ఇన్నాళ్లు చలికి భయపడి ముసుగుతన్ని పడుకున్న వాళ్లంతా ఒక్కసారిగా ఈ మండే ఎండల్లో అయినా కొలెస్ట్రాల్ తగ్గించుకుని బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటివాళ్లు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ డాన్ గో నెట్టింట షేర్ చేసిన పదహారు రూల్స్ తప్పక ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన వేసవి సమీపించగానే చాలామంది వెయిట్లాస్కు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెయిట్లాస్ టిప్స్ షేర్ చేశారు ఫిట్నెస్ కోచ్ డాన్గో. ఆరోగ్యప్రదంగా తక్కువ టైంలో కిలోల కొద్ది బరువు తగ్గి.. మెరుగైన ఫలితాలు సత్వరమే అందుకోవాలంటే ఈ పదహారు రూల్స్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.నిద్రకు కొన్ని గంటల ముందు తినకపోవడం..నిద్రవేళకు కనీసం మూడు నుంచి ఐదు గంటలు ముందు తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా ఆహారం తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తీసుకోవడంలో కేర్.. శరీర బరువుని 12తో గుణించగా వచ్చిన మొత్తంని మీ రోజువారీ కేలరీలుగా కేటాయించండి. ఈ అసాధారణ సూత్రాన్ని తప్పక అనుసరించమని కోరారు ఫిట్నెస్ కోచ్.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం..రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ అవనసం. శరీర బరవుని ఏడుతో గుణిస్తే వచ్చిన మొత్తం మీర రోజువారిగా తీసుకోవాల్సిన ప్రోటీన్గా గుర్తించండి. ఈ విధానం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించుకుంటూ..కండరాలను నిర్మించడానికి, నిర్వహించొచ్చని చెబుతున్నారు. అందుకు ఈ మాత్రం ప్రోటీన్ తప్పనిసరి అని అన్నారు.ఆహారంలో జోడించాల్సిన ఆహారాలురోజువారీ ఆహారంలో ఏం చేర్చుకోవాలంటే..గ్రీకు పెరుగునీరు, కాఫీ, టీలీన్ గ్రౌండ్ బీఫ్ (వీలైతే అదనపు లీన్)చికెన్ బ్రెస్ట్ టర్కీ (గ్రౌండ్ లేదా బ్రెస్ట్)కొవ్వు చేపగుడ్లు, గుడ్డులోని తెల్లసొనకాటేజ్ చీజ్లీఫీ గ్రీన్స్బంగాళాదుంపలుషెల్ఫిష్బీన్స్, కాయధాన్యాలుబెర్రీలుఆపిల్, నారింజ, కివి, ద్రాక్షపండు వంటి అధిక ఫైబర్ పండ్లుఆకుపచ్చ క్రూసిఫెరస్ కూరగాయలుకాలీఫ్లవర్, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, మిరియాలు, ఆస్పరాగస్, దోసకాయలు వంటి ఇతర అధిక-పరిమాణ కూరగాయలురోజుకు రెండు పూటల భోజనం..ఫిట్నెస్ కోచ్ రోజుకు రెండు పూటలా భోజనం తీసుకునేలా చూసుకోమని సూచించారు.భోజన షెడ్యూల్లో తీసుకోవాల్సిన కేర్..ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన భోజన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంటుంది:పడుకునే ముందు 3 నుంచి 5 గంటల ముందు చివరి భోజనంనిద్రలేచిన 1 నుంచి 2 గంటల ముందు మొదటి భోజనంరెండవ భోజనం మధ్యలో ఉండాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలి అనేది ఇక్కడ ఉంది:గ్రీకు పెరుగు - ప్రేగులకు మంచిదిప్రోటీన్ పౌడర్ - ఆకలిని నియంత్రిస్తుంది, కండరాలను మెరుగుపరుస్తుందిబ్లూబెర్రీస్ - ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అలాగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.హైడ్రేటెట్గా ఉండండిశరీరానికి తగిప హైడ్రేషన్ కూడా అవసరం. దీని కోసం, ఫిట్నెస్ కోచ్ ఉదయం 500 మి.లీ నీరు, అలాగే భోజనానికి ముందు తర్వాత త్రాగాలని సూచిస్తున్నారు. అయితే, పడుకునే రెండు గంటల ముందు నీరు త్రాగడం మానేయాలని చెబుతున్నారు.శక్తిమంతమైన వ్యాయామాలు..ఆహారంతో పాటు, ఒక రోజు విశ్రాంతితో వారానికి మూడు సార్లు కాస్త ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అవసరైమతే కాస్త అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు మరింతగా చేసేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు.శరీరాన్ని కదిలిస్తూ ఉండండిశక్తి శిక్షణ తర్వాత, శరీరానికి సరైన కదలిక కూడా అవసరం. రోజుకు కనీసం 8 వేల నుంచి 10 వేల అడుగులు వేయండి" అని ఫిట్నెస్కోచ్ సిఫార్సు చేస్తున్నారు. డెస్క్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన ప్రణాలికకు అంతరాయం కలగకుండా..డెస్క్ కింద ట్రెడ్మిల్ తీసుకోవడం, వాక్ చేస్తూ మీటింగ్లు ప్లాన్ చేయడం వంటివి చేయాలి.నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండిచక్కటి సౌకర్యవంతమైన బెడ్రూమ్లో నిద్రపోవాలి. బెడ్రూమ్ చూడగానే నిద్ర వచ్చేలా ఆహ్లాదంగా ఉంచుకోవాలి.స్థిరమైన నిద్ర దినచర్య..మంచి నిద్ర తోపాటు ఇవి కూడా ఉండాలి.ఉదయం నిద్ర లేవగానే సూర్యరశ్మిని పొందండిముఖ్యంగా వారాంతాల్లో ఒకే సమయంలో నిద్రపోండి, మేల్కొనండిశరీరాన్ని చల్లబరచడానికి వేడి స్నానం లేదా స్నానం చేయండిమంచానికి ఒక గంట ముందు స్క్రీన్లను చూడటం మానుకోండిసూర్యుడు అస్తమించేటప్పుడు మసకబారిన లైట్లు లేదా ఎరుపు రంగు ప్రకాశించే బల్బులను ఉపయోగించండిపురోగతిని ట్రాక్ చేయండివార గడిచినప్పుడల్లా..బరువు, శరీరం కొలతల్లో వచ్చిన మార్పులు గమనించాలి. అందుకు తగ్గట్లుగా పోషకాహారం తీసుకుంటుండాలి. అలాగే ఆ మార్పులను ఫోటోలు తీస్తూ..గమనించుకోవాలన్నారు.పరివర్తనను గుర్తించి..మెయింటైయిన్ చేయాలి..కేవలం ట్రాక్ చేయడమే కాకుండా, బాడీలోని మార్పులను గమనిస్తూ..ఆ దిశగా ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకుంటుండాలి. ఈ సమయంలో ఆల్కహాల్ను నివారించండిమెరుగైన ఫలితాలు అందుకుంటున్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.నిరాశను దరిచేరనివ్వకుండా యాక్టివ్గా ఉండటం..అద్దంలో మార్పులు చూస్తూ..మరింత ఆత్మవిశ్వాసంతో డైట్ని, రూల్స్నిన స్థిరత్వంతో పాటించాలి. ఇలా చేస్తే..ఈ సమ్మర్లో సత్వరమే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు డాన్గో. అంతేగాదు నియమానుసారంగా సూచించిన ఈ రూల్స్ అన్నింటిని క్రమం తప్పకుండా ఫాలో అయితే ఈజీగా 14 కిలోలు తగ్గుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Dan Go | High Performance Health Coach (@coachdango)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..) -
మీ మైండ్ మీకు అబద్ధాలు చెప్తోందా?
మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం, కానీ ఒక్కోసారి అది మనకే విరుద్ధంగా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే, మన మనసు వాస్తవాలను వక్రీకరించి మనకు అబద్ధాలు చెప్తుంది. దీన్నే సైకాలజీలో "Cognitive Distortions" (ఆలోచనా వైకల్యాలు) అంటారు. వీటిని గుర్తించి, అదుపులో ఉంచుకోవడం అంటే.. మీ మెదడులో సాగుతున్న 'తప్పుడు కోడింగ్'ను సరిచేయడమే.చాలామందికి ఒక అలవాటు ఉంటుంది—ఒక చిన్న తప్పు జరిగితే, "నేను ఎప్పుడూ తప్పులే చేస్తాను" అని అనుకుంటారు. లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని పలకరించకపోతే, "అతనికి నా మీద కోపం, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు" అని భ్రమపడతారు. ఇవన్నీ నిజాలు కావు, ఇవన్నీ మీ మెదడు సృష్టించిన భ్రమలు. ఆరోన్ బెక్ (Aaron Beck) అనే సైకాలజిస్ట్ ఈ Cognitive Distortions అనే కాన్సెప్ట్ను ప్రపంచానికి పరిచయం చేశారు.1. మన మెదడు ఆడుతున్న 3 పెద్ద అబద్ధాలుమీ మెదడు రోజువారీ జీవితంలో మిమ్మల్ని మోసం చేసే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:All-or-Nothing Thinking: "నేను ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే నేను ఫెయిల్యూర్" అని అనుకోవడం. అంటే, మధ్యేమార్గం (Grey area) ఉండదు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.Catastrophizing: చిన్న సమస్య జరిగినా.. "ఇక నా జీవితం అయిపోయింది, అంతా నాశనం" అని అతిగా ఊహించుకోవడం.Mind Reading: "ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు" అని భ్రమపడటం. వాస్తవానికి, వారు మీ గురించి అస్సలు ఆలోచించడం లేదు.2. ఈ అబద్ధాలు మీ పర్సనాలిటీని ఎలా నాశనం చేస్తాయి?ఈ 'డిస్టార్షన్స్' వల్ల మీరు నిరంతరం ఒత్తిడిలో ఉంటారు.మీరు ఎప్పుడూ తప్పు చేస్తానేమోనని భయపడుతుంటారు (Anxiety).ఎదుటివారి గురించి తప్పుడు అభిప్రాయాలు పెంచుకుని రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటారు.అతిగా ఆలోచించి (Overthinking) మీ శక్తిని కోల్పోతారు.3. పాజిటివ్గా ఉంటే సరిపోదుట్రైనర్స్ "అన్నీ పాజిటివ్గానే చూడు" అని చెప్తారు. కానీ, అబద్ధం చెప్పే మెదడుకు 'పాజిటివ్ థింకింగ్' కేవలం ఒక ప్లాస్టర్ లాంటిది. మార్కెట్ పాజిటివిటీని నమ్మమంటుంది.సైకాలజీ (CBT - Cognitive Behavioral Therapy) మీ మెదడు అబద్ధం చెప్తున్నప్పుడు దాన్ని పట్టుకుని, "ఇది నిజమేనా? దీనికి ఆధారం ఏంటి?" అని లాజిక్తో ప్రశ్నించమంటుంది. దీన్నే 'Reality Testing' అంటారు.4. మీ మైండ్ ని రీ-సెట్ చేసుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ డిస్టార్షన్స్ ని ఎలా అదుపు చేయాలో చూద్దాం.Step 1: అబద్ధాన్ని పట్టుకోండిమీ మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచనలను ఇస్తుందో, వెంటనే 'STOP' అని అనుకోండి. "నేను నా మెదడు చెప్పే అబద్ధాన్ని నమ్మను" అని గట్టిగా చెప్పండి. ఇది ఒక చిన్న 'Break'.Step 2: లాజికల్ ఛాలెంజ్మీ మైండ్ చెప్పిన నెగటివ్ ఆలోచనకు ఒక కోర్టు విచారణ పెట్టండి.* "నేను ఫెయిల్యూర్" అని మీ మెదడు చెప్తే.. "గతంలో నేను సాధించిన విజయాలు ఏంటి?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సాక్ష్యాలతో మీ మెదడు అబద్ధాన్ని ఖండించండి.Step 3: క్లారిటీ ఒక్కసారి మీ మెదడు అబద్ధాలు చెప్తోందని మీకు తెలిస్తే, మీరు ఇక వాటికి భయపడరు. మీ మైండ్ ఒక అద్దంలా మారుతుంది—అక్కడ వాస్తవాలు మాత్రమే కనిపిస్తాయి, అపోహలు కాదు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మైండ్ చెప్పే అబద్ధాల లిస్ట్ఈ రోజు ఒక చిన్న పని చేయండి.ఈ రోజు మీకు వచ్చిన అతి పెద్ద నెగటివ్ ఆలోచనను రాసుకోండి.ఆ ఆలోచన 'Distortion' (అబద్ధం) అని మీకు అనిపిస్తోందా?ఆ ఆలోచన నిజం కాదని నిరూపించే 3 వాస్తవాలను రాయండి.మీ మెదడుకి మీరు యజమాని!బ్రో, మీ మైండ్ ఒక సర్వెంట్ లాంటిది. కానీ అది ఒక్కోసారి యజమానిలా ప్రవర్తిస్తూ మీకు తప్పుడు సమాచారం ఇస్తుంది. దాన్ని నమ్మడం మానేసి, దాని మీద నిఘా పెట్టండి. మీ మెదడు చెప్పే ప్రతిదీ నిజం కాదు, అది కేవలం ఒక ఆలోచన (Thought) మాత్రమే.గుర్తుంచుకోండి, "Don't believe everything you think."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
అర్జున్-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్ లుక్..!
సచిన్- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండుల్కర్, యువ వ్యాపారవేత్త సానియా చందోక్ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు క్రికట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంత్-రాధిక మర్చంట్ల వివాహవేడుక జరిగిన అదే ప్రదేశంలో అర్జున్ సానియాల వివాహం జరగడం విశేషం. ఆ నేపథ్యంలో ఆ సచిన్ టెండూల్కర్ ఇంట జరిగే పెళ్లి తంతుకి సంబంధించిన ప్రతీది అంబానీ కుటుంబమే స్వయంగా చూసుకుంది. అందుకు సచిన్ కూడా సభా ముఖంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. కాగా ఈ వేడుకలో ఫ్యాషన్కి ఐకాన్గా ఉండే రిలయన్స్ ఛైర్మన్, తన సిగ్నేచర్స్టైల్తో మెరిశారు. వేడుకుకు తగిన విధంగా తన ఆహార్యాన్ని ప్రతిబింబించేలా కేర్ తీసుకుంటారు నీతా. ఆమె ఈ వేడుకకి రిలయన్స్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అతడి భార్య శ్లోకా మెహతాలతో కలిసి విచ్చేశారు. ఈ వేడుకలో ఆయు ధరించిన చీర, ధగ ధగ మెరిసిపోతున్న నెక్లెస్ అత్యంత హైలెట్గా నిలిచాయి. నీతా ఈ వేడుక కోసం రాచరికపు స్టైల్ ఐవరీ బంగారు సిల్క్ చీర ఎంచుకున్నారు. ఈ ఆరుగజాల చీరలో నీతా బంగారపు బొమ్మలా ముగ్ధమనోహరంగా కనిపించారు. బంగారు మోటీఫ్లతో అలకరిచిన ఆ ఫ్యాబ్రిక్ ప్రకాశవంతమైన ఆకృతిని ఇచ్చింది. నిలువు జరీ చారలతో ఎంబ్రాయిడరీ స్లీవ్ బోర్డర్లు చీర లుక్ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆ చీరకు సింపుల్గా స్టేట్మెంట్ డైమండ్ నెక్లస్ చీర అందాన్ని అమాంతం రెట్టింపు చేసింది. చెవికి కూడా డైమండ్ స్టడ్ పోగులు ధరించి స్టైల్ పరంగా నీతాకు సాటిరారెవ్వరూ అనేంతగా ఉంది ఆమె ఆహార్యం. ఇక ముఖేశ్ అంబానీ కూడా క్లాసిక్ బ్లాక్ బంధ్ గలా సూట్లో హుందాగా కనిపించారు. అంతేగాదు ఈ జంట ఆధునాతన సంప్రదాయంతో కలగలసిన స్టైలిష్ లుక్లో అందరి మనసులను దోచుకున్నారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) (చదవండి: 'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా) -
బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..
ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం అంత ఈజీకాదు. ఆ రంగం ఎంత ఇష్టమైనా.. దానిలోని మెళుకువలపై పట్టు సాధించేది మాత్రం టీనేజ్ వయసుకే. అంతకంటే చిన్న వయసులో అంత సులభం కాదు..పైగా క్లాత్ని పట్టుకుని కుట్టుగల నేర్పరితనం, క్రియేటివిటీ ఉండదు. కానీ ఈ బుడతడు..పిట్ట కొంచెం కూత ఘనంలా అలవోకగా పలు రకాల ఫాబ్రిక్లను అందమైన డిజైనర్వేర్లా తీర్చిదిద్దుతుండటం విశేషం. అంతేకాదండోయ్ ఏకంగా ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్లో దిగ్గజ డిజైనర్ల మధ్య..తన ఫ్యాషన్వేర్ని ప్రదర్శించనున్నాడు కూడా. ఇలా అత్యంత పిన్నవయసులో ఫ్యాషన్ డిజైనర్గా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనున్న చిన్నారిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఆ చిన్నారి ఎవరంటే..ఆ చిచ్చర పిడుగే మాక్స్ అలెగ్జాండర్. ఆ చిన్నారి తల్లిదండ్రులు జాక్ అలెగ్జాండర్, షెర్రీ మాడిసన్ దంపతులు. పూర్తిగా భాషై పట్టు రాని ఆ వయసుకే ఈ బాలుడు మాక్స్ స్కెచ్ పట్టుకుని డిజైన్లు, సూది దారం సాయంతో చక్కటి కళ్లు చెదిరిపోయే ఫ్యాషన్వేర్లను క్రియేట్ చేసేస్తాడు. తనలోని ఫ్యాషన్ క్రియేటివిటీ తన సోదరి సమంత కారణంగా బయటకు వచ్చిందట. ఆమెకు ప్రస్తుతం 14 ఏళ్లు. తాను తయారు చేసిన డిజైనర్వేర్లన్నీ తన అక్క కోసమేనని, ఆమె వాటిని ధరించి చూడటం నిజంగా చాలా ఆనందాన్నిస్తుందని చెబుతున్నాడు మాక్స్. అతడి క్రియేటివిటీ అత్యంత విభిన్నం..ఫ్యాషన్ డిజైనర్లు ముందుగా తమ క్రియేటివిటీ లేదా ఆలోచనను కాగితంపై స్కెచ్తో పని చెబితే..మాక్స్ మాత్రం ముందుగా దాన్ని మడతలతో కట్టి చూస్తాడు. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి కుట్టేస్తాడు. తనకు డ్రేపింగ్ అంటే ఇష్టమని, ముందుగా ధరిస్తేనే..క్రియేటివిటీ తళుక్కుమని బుర్రలో ప్రత్యక్షమవుతుందని చెబుతున్నాడు మాక్స్. అలా ఇప్పటివరకు ఈ చిన్నారి 150కి పైగా డిజైనర్వేర్లు రూపొందించాడు. వాటిలో దుస్తులు, జాకెట్లు, స్కార్ఫ్లు, బ్యాగులు, కిమోనోలు, సూట్లు, స్టఫ్డ్ యానిమల్స కూడా ఉన్నాయి. అంతేగాదు తన సొంత రన్వే షోను ప్రదర్శించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పాడు. 2024లో ఎనిమిదేళ్ల వయసులో ఐక్యరాజ్యసమితలో ఫ్యాషన్ స్థిరత్వంపై ప్రసంగించాడు. వ్యర్థాలను పునర్వినియోగం చేసి.. దుస్తులుగా ఎలా మలచొచ్చో ఆలోచనాత్మకంగా వివరించాడు. పైగా దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేలా కాఫీ బీన్ బ్యాగ్ల నుంచి రూపొందించిన డిజైనర్వేర్లలో మెరిశారు మోడళ్లు. అలాగే ఆ చిన్నారి మాక్స్ చదువుకుంటూనే ఫ్యాషన్ వీక్లలో తన ప్రదర్శనలను ఇస్తుంటాడు. ఇదేగాక మాక్స్కి పలు స్కిల్ కూడా ఉన్నాయి. అవేంటంటే వంట చేస్తాడు, పికిల్బాల్, టెన్నిస్ వంటివి ఆడతాడు, కథలు రాస్తాడు. అలాగే తనకొక రెస్టారెంట్, కారు వాష్ని ఉండాలని కలలుకంటుంటాడు. పైగా ఇంజనీర్ కావలన్నిది అతడి ధ్యేయం కూడా. ఇక మాక్స్ తన పాఠశాల చదువుకి ఆటంకం లేకుండా వారాంతాల్లో ఫ్యాషన్కి సంబంధించిన స్కిల్స్లో నిమగ్నమవుతుంటాడట. నిజంగా పెన్సిల్ పట్టుకుని కుదురుగా బొమ్మలు వేయని ఆ చిరుప్రాయంలో ఇంత అసామాన్య ఫ్యాషన్ డిజైనర్ ప్రతిభ మాటలకందనిది కదూ..!.వీడియోపై క్లిక్ చేయండి(చదవండి: తనకు తాను ఓటు వేసుకుని మేయర్ అయిన మహిళ..! ఎక్కడంటే..) -
93 ఏళ్ల వయసులోనూ చలాకీగా విదేశీ బామ్మ..! ఆమె హెల్త్ సీక్రెట్ ఇదే..
ఆ బామ్మ చూస్తే తొమ్మిది పదుల వయసు అనిపించదు. వృద్ధాప్యాన్నే తిప్పికొట్టేలా ఆరోగ్యంగా,చలాకీగా ఉంటుందా బామ్మ. స్వతహాగా అమెరికన్ అయినా ఆమె మన భారత్ని మెచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంది. పైగా మన ఆధ్యాత్మికతకు ఫిదా అయ్యి..మన భారతీయత ఉట్టిపడేలా ఆహార్యం, సంస్కృతిని మార్చేస్తుకుందామె. పైగా ఈ గడ్డపైనే ఓ సామాన్య భక్తురాలిలా జీవిస్తోందామె. ఎవరామె అంటే..ఆ బామ్మే అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాకు చెందిన సుషుమ్న. దీర్ఘాయువు అనేది ఎక్కడ నుంచో కాదని, మన సంతోషం, జీవనవిధానం నుంచే వస్తుందని చెప్పలా జీవిస్తోంది ఈ బామ్మ. యాంటీ ఏజింగ్ ట్రెండ్కి సరిగ్గా సరిపోతుంది ఆమె జీవన విధానం. ఇప్పటికీ రెండు పూటల సైక్లింగ్ చేస్తుందట. తనకు ఎలాంటి వైద్య మస్యలు లేవని అంటోంది. బుద్దిపూర్వకంగా తినడం, శరీరానికి సరిపడ వ్యాయామాలు, స్నేహితులతో కలివిడిగా ఉండటం ఇవే తనను ఆరోగ్యంగా ఉంచుతున్నాయని చెబుతోంది. తొంభైఏళ్ల వయసులో కూడా తన పనులు తానే చలాకీగా చేసుకుంటానని అంటోంది. తనకు ఆర్థరైటిస్ తప్ప మరే సమస్యలు లేవని చెబుతోంది. వ్యవస్థాపకురాలు కమెల్ జాబర్ ఈ విదేశీ బామ్మ హెల్దీ లైఫ్ సీక్రెట్ గురించి నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆమె ప్రతి విషయాన్ని సానుకూలత దృక్పథంతో చూసే తీరే ఆమె దీర్ఘాయువుకి కారణం అంటూ ఆమె జీవిన విధానం గురించి పోస్ట్లో తెలిపారు. పైగా ఈ బామ్మ తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం మెడిసిన్స్ మానేయడమేనని హాస్యస్పదంగా చెబుతుంటుందని అన్నారు. ఆమె ఇప్పుడు కాలిఫోర్నియా, తమిళనాడులలోని ఆధ్యాత్మిక కమ్యునిటీలో సభ్యురాలు కూడా. 2001 నుంచి ఈ కమ్యూనిటిలో సభ్యురాలిగా అంకితభావంతో సేవలందిస్తోంది. ఒకప్పుడు ప్రముఖ సంస్థలో విజయవంతమైన సేల్స్ మేనేజర్ పనిచేసిన తదనంతరం ఈ జీవనశైలికి మారిపోయిందని చెప్పుకొచ్చారు పోస్ట్లో. నెటిజన్లు కూడా ఈ బామ్మ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టిన సూపర్బామ్మ అంటూ పోస్టులు పెట్టారు. విదేశాల్లో హైఫై లైఫ్ని పక్కన పెట్టి మన సంస్కృతి, వేషధారణను నేర్చుకుని ఆధ్యాత్మికవేత్తగా జీవించడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం అంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Kamel Jaber (@i__kamel) (చదవండి: నడక చాలు...జిమ్కు వీడ్కోలు...!) -
హర్మోన్లు ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయంటే..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కేవలం ఆలోచనలు, అలవాట్లు మాత్రమే కాదు. అది మీ శరీరంలో జరిగే Chemistry కూడా. చాలామంది తమ కోపానికి, బద్ధకానికి, ఆందోళనకు కారణం 'చేతకానితనం' అనుకుంటారు. కానీ, అది కేవలం కొన్ని హార్మోన్ల హెచ్చుతగ్గులు మాత్రమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.మనం ఒక వ్యక్తిని "కోపిష్టి" అంటాం, లేదా "చాలా ప్రశాంతమైన వ్యక్తి" అంటాం. కానీ ఒక వ్యక్తి మెదడులో నిరంతరం జరిగే రసాయన చర్యలే ఆ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. మీ హార్మోన్లు మీ కళ్ళకు కనిపించవు కానీ, మీరు ఎలా ప్రవర్తించాలో, మీరు ఎలా ఆలోచించాలో అవే నిర్ణయిస్తాయి.1. The Fantastic Four...మన ప్రవర్తనను ప్రధానంగా నాలుగు హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. వీటిని మనం 'హ్యాపీ హార్మోన్లు' అని పిలుస్తాం.Dopamine - The Reward Molecule: మీరు ఒక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు లేదా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు విడుదలవుతుంది. ఇది లేకపోతే మీరు బద్ధకంగా ఉంటారు, ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు.Serotonin - The Mood Stabilizer: ఇది మనలోని ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక హోదాను నియంత్రిస్తుంది. ఇది తక్కువైతే వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్లడం, విపరీతమైన ఆందోళన చెందడం జరుగుతుంది.Oxytocin - The Bonding Hormone: ఇది మనుషులతో మనల్ని కలిపి ఉంచుతుంది. ఇది ఎక్కువ ఉంటే మీరు నలుగురితో కలిసిపోయి ఉంటారు, తక్కువ ఉంటే ఒంటరితనం (Loneliness) ఫీలవుతారు.Endorphins - The Pain Killer: ఇవి ఒత్తిడిని, శారీరక నొప్పిని తగ్గిస్తాయి. వ్యాయామం చేసినప్పుడు ఇవి ఎక్కువగా విడుదలవుతాయి.2. కార్టిసాల్: మీ పర్సనాలిటీకి శత్రువుమీరు ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ (Cortisol) విడుదలవుతుంది. ఇది ఎక్కువ కాలం ఉంటే, మీ మెదడులోని 'హిప్పోకాంపస్' (జ్ఞాపకశక్తికి సంబంధించింది) బలహీనపడుతుంది. దీనివల్ల మీరు త్వరగా మర్చిపోవడం, కోపపడటం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం జరుగుతుంది. మీరు చేస్తున్న 'ట్రిగ్గర్' పనులన్నీ ఈ కార్టిసాల్ ని పెంచేవే!3. మోటివేషన్ vs బయోలాజికల్ ఫ్యాక్ట్స్సో-కాల్డ్ ట్రైనర్లు "నీ మైండ్ సెట్ మార్చుకో, అంతా మారుతుంది" అని చెప్తారు. అది నిజమే, కానీ ఆ మైండ్ సెట్ మారాలంటే మీ శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండాలి.మీరు రోజుకు 30 నిమిషాలు ఎండలో తిరగకపోతే, లేదా వ్యాయామం చేయకపోతే.. మీ మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచించాలనుకున్నా, మీ బయోలజీ మీకు సహకరించదు.4. బయోలాజికల్ రీ-ప్రోగ్రామింగ్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ హార్మోన్లను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు?Step 1: శారీరక అడ్డంకులను బ్రేక్ చేయండిమీరు బద్ధకంతో ఉన్నప్పుడు "నేను సోమరిపోతుని" అని అనుకోవద్దు. మీ శరీరానికి కావాల్సిన పోషకాలు, నిద్ర లేవేమో అని విశ్లేషించండి. మీ బయోలాజికల్ సైకిల్ ని 'Break' చేసి, సరైన నిద్ర, ఆహారం వైపు అడుగు వేయండి.Step 2: హార్మోనల్ హ్యాకింగ్Dopamine Detox: సోషల్ మీడియా లైకుల ద్వారా వచ్చే తక్షణ డోపమైన్ని ఆపేసి, కష్టపడి ఏదైనా పని చేయడం ద్వారా వచ్చే డోపమైన్ని అలవాటు చేసుకోండి.Oxytocin Boost: తోటి మనుషులతో కనెక్ట్ అవ్వండి, ఇది మీ స్ట్రెస్ ని తగ్గిస్తుంది.Step 3: బయో-మాస్టరీఒక్కసారి మీ శరీరంలోని రసాయన శాస్త్రం మీకు అర్థమైతే, మీరు ఒక మాస్టర్ లా ఉంటారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉండాలో, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలో మీ హార్మోన్ల ద్వారానే మీరు కంట్రోల్ చేసుకోగలరు.5. మీ హార్మోన్ల చెకప్ఈ రోజు మీరు ఈ చిన్న గమనికను గమనించండి.ఉదయం లేచినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? (ఉత్సాహమా లేక బద్ధకమా?) - ఇది మీ నిద్ర నాణ్యత మరియు డోపమైన్ లెవెల్స్ ని చెప్తుంది.సాయంత్రం వేళల్లో మీకు ఒత్తిడిగా అనిపిస్తుందా? - ఇది మీ కార్టిసాల్ లెవెల్స్ ని చూపిస్తుంది.మీరు ఫిజికల్ యాక్టివిటీ (వ్యాయామం) చేస్తున్నారా? - లేకపోతే మీ ఎండార్ఫిన్లు పని చేయడం లేదని అర్థం.మీ శరీరం మీ దేవాలయం!బ్రో, వ్యక్తిత్వం అంటే కేవలం మీ ఆలోచనలే కాదు, మీ శరీరం కూడా. మీరు మీ హార్మోన్లను పట్టించుకోకుండా, కేవలం మైండ్సెట్ మీద పనిచేస్తే అది పక్షవాతం ఉన్న వ్యక్తికి పరిగెత్తమని చెప్పినట్లే ఉంటుంది. మీ శరీరాన్ని సరిగ్గా చూసుకోండి, అప్పుడు మీ మైండ్ మీకు మద్దతు ఇస్తుంది."A healthy mind needs a healthy chemistry."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
వెలుగులతో రంగులు మార్చే భూమి..!
హిమాచల్ ప్రదేశ్లో ఉన్న స్పితి వ్యాలీ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో నిండిన పర్వతాలు కాదు వెలుగు, నీడల మధ్య నడిచే ఒక నిశ్బబ్ద నాటకం. మధ్యాహ్నం వెలుగుల్లో భారీ పర్వతాలకు ఒక కొత్త రంగు వస్తుంది. సాయంత్రం వెలుగుల్లో మరో రంగు అక్కడ సందడి చేస్తుంది. ఎడారిలా కనిపించే ఈ భూమిలో ప్రకృతి భాషను అర్థం చేసుకుంటే ఇక్కడి అందాల వెనక భావాలు కూడా అర్థం అవుతాయి. ఇక్కడి ప్రయాణం అనేది నెమ్మదిగా మనసును కబ్జా చేసే ఒక చక్కని పాటలోని సాహిత్యంలా ఉంటుంది. లోయల మధ్యలో వెలుగు నీడల ఈ ఆటను గమనిస్తే ప్రతీ గంట ఒక పెయింటింగ్లా ఉంటుంది. సందర్శనీయ స్థలాలుహిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ స్పితి జిల్లాలో ఉండే స్పితి వ్యాలీలో ఎన్నో అందమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో కీ మోనాస్టరీ, చంద్రతాల్ లేక్, కిబ్బర్ గ్రామం ఇవన్నీ చూస్తే మనం చూస్తున్నది సీనరీకాదుంకాలమే నిశ్బబ్దంగా సాగుతోంది అనిపిస్తుంది. రోడ్డుపై వచ్చే ప్రతీ మలుపు ఒక సోస్ట్కార్డులా ఉంటుంది.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలిహైదరాబాద్ నుండి ఢిల్లీకి ఫ్లైట్ లేదా రైలులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి మనాలీకి రోడ్డు జర్నీ ప్రారంభించవచ్చు. ఇక మనాలిలో మీకు నచ్చినంత టైమ్ స్సెండ్ చేసి స్పితీ వ్యాలీకి క్యాబ్ లేదా లోకల్ ట్రాన్స్పోర్టుతో అందమైన పర్వతాలను చూస్తూ చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో గమ్యస్థానం కన్నా ప్రయాణ అనుభవమే జీవితాంతం గుర్తుండి΄ోతుంది. (చదవండి: హోళీ..కలర్ఫుల్ టూర్ కోసం..ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాల్సిందే..!) -
హోళీ..కలర్ఫుల్ టూర్ కోసం..!
యమునా తీరంలో రంగుల ఆటవెలది... బ్రజ్ భూమిలో రంగుల కథలు...మాధవుడి నగరంలో రంగుల హరివిల్లు... కృష్ణ నగరంలో వసంత స్వాగతం...గోపాలుడి జన్మభూమిలో రంగుల ఋతువు...ఇంద్ర ధనస్సు రంగుల మధ్య ఓ మధురమైన దైవిక స్పర్శ...ఇవన్నీ కనులవిందుగా దర్శించాలంటే ఆ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సిందే!! కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికే అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మధుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి. ఉత్తర ప్రదేశ్లో ఉన్న మధుర, యమునా నదీ తీరం నిదానంగా, ఆగిపోయిన కాలంలా ఉంటుంది. ఇక్కడ ప్రతి గల్లీలో కృష్ణ నామస్మరణ, ప్రతి సంధ్యలో దీపాల ప్రకాశం, ప్రతి వసంతం రంగుల ప్రణయంలా ఉంటుంది. మధుర అంటే కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం.కృష్ణ జన్మభూమి వైభవంమధురలో ప్రయాణం ప్రారంభమయ్యే ప్రదేశం శ్రీ కృష్ణ జన్మభూమి. ఆ ప్రాంతంలో నడుస్తుంటే అక్కడి ప్రాచీన శిల్పం, మందిర గోపురాలను చూస్తుంటే మది నిండా ప్రశాంతమైన భావం కలుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయంలో శంఖ నాదం వినిపిస్తుంది. అలాగే భక్తుల మధ్య ఒక సమన్వయం కనిపిస్తుంది. ద్వారకాదీశ్ మందిరం వద్ద సంధ్యా హారతి సమయంలో దీపాల వెలుగు, భజనల్లో కలిసిన భక్తుల స్వరం ఇవన్నీ ఒక ప్యూర్ డివోషనల్ ఆరాను క్రియేట్ చేస్తాయి.యమునా తీరంలో నిశ్శబ్ద వేదంవిశ్రామ్ ఘాట్ దగ్గర ప్రతి ఉదయం యమునా తీరాన్ని తాకే సూర్యుడి కిరణాలు కనులకు ఆనందాన్ని, మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నదిపై అలా అలా సాగుతున్న తెప్ప, నీటిపై ప్రతిబింబించే ఆకాశం, నిదానంగా సాగే జీవితం. ఇదే అక్కడి ప్రతి ఉదయం కనిపించే దృశ్యం. ఇక్కడ నడుస్తుంటే మధుర అనేది ఒక ప్రదేశంలా కాదు, ఒక ఫీలింగ్ అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణం అంటే వేగం కాదు, కాలానికి తగిన విలువ అనిపిస్తుంది. బ్రజ్ భూమిలో రంగుల ఋతువుమధురలో హోలి అంటే పండుగ కాదు. ఒక జీవితోత్సవం. వసంత కాలంలో నగరం మొత్తం రంగులతో నవ్వుతుంది. గులాల్ బ్యాక్గ్రౌండ్లో వినిపించే గీతాలు, భజనల మధ్య ప్రతి గాలిలో ఉత్సాహం కనిపిస్తుంది. బర్సానా, వృందావన్ ప్రాంతాలు హోలి సందర్భంగా ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేస్తాయి. రాధాకృష్ణుల మధుర స్మృతులు, రంగుల మధ్య భక్తి భావం, నగరం మొత్తం ఒక వేదికలా మారుతుంది. ఇక్కడ హోలి అంటే రంగులతో ఆడే ఒక క్రీడ మాత్రమే కాదు. ఒక పరంపర. ఒక సంప్రదాయం. ఒక ఆచారం. కాలం అందించే ఆనందానికి ప్రతీక కూడా.‘రాధే రాధే’ అనే పలుకే మధురం...మధుర అనగానే ముందుగా అక్కడి ‘పెడా’గుర్తుకు వస్తుంది. అయితే దీంతోపాటు అక్కడి ప్రత్యేక అల్పాహారాన్ని రుచి చూడడం మర్చి΄ోవద్దు. పెడా, లస్సీ, చాట్ లాంటి తినుబండారాలు నగరంలో ప్రతి చోట సులభంగా లభిస్తాయి. స్థానికుల జీవితంలో భాగమైన వీటిని ఆస్వాదిస్తూ మీరు కూడా కాసేపు అక్కడి స్థానికులుగా మారిపోవచ్చు.పర్యాటకులు ఎక్కడికి వెళ్తున్నా అక్కడి స్థానికుల్లా జీవిస్తేనే పర్యటనలోని అందమైన అనుభూతులను సొంతం చేసుకోగలరు. అందుకే అంటారు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి అని. అలాగే మధురలో ఉన్నప్పుడు మధురవాసిలా మారిపోవాలి. ఇక్కడ ప్రతి గల్లీలో ఒక మిఠాయి దుకాణం, అందులో చిరునవ్వు చిందిస్తూ ‘‘రాధే రాధే’’ అని పలకరించే వ్యాపారి కనిపిస్తాడు. మీరు కూడా ‘రాధే రాధే’ అని పలకరించండి.చేయాల్సిన పనులుమధురలో యమునా తీరంలో ఉదయానే కాసేపు అలా తిరగడం ఒక చక్కని అనుభూతిని అందిస్తుంది. అందుకే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా మార్నింగ్ వాక్ చేసే అవకాశాన్ని ఎవరూ మిస్ చేయకూడదు. ఇది ఎవరూ చెప్పని ఒక ట్రావెల్ హ్యాక్.వీటితోపాటు సాయంత్రం సమయంలో హారతి చూడటం, గోవర్ధన గిరి పరిక్రమ చేయడం, హోలీ సందర్భంగా రంగుల మధ్య భజనలు వినడం, బృందావన్లో సంధ్యా సమయాన భక్తి గీతాలను వినడం ఇవన్నీ మధుర ప్రయాణంలో నిదానంగా మనసును హత్తుకునే విషయాలుగా మిగిలిపోతాయి.సందర్శనీయ స్థలాలుమధుర అనేది ఆ నందకిశోరుడు, అతని భక్తుల ప్రపంచం. ఇక్కడ బృందావన్లో బాంకే బిహారీ ఆలయం, గోవర్ధన పర్వతం, గోకులం, బర్సానా లాంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి గల్లీకి ఒక కథ ఉంటుంది. ప్రతీ వీధిలో ఒక ఙ్ఞాపకాల నిధి ఉంటుంది. గోవర్ధన పరిక్రమ సమయంలో భక్తులు నిదానంగా నడుస్తూ భక్తిలో నిమగ్నమవుతారు. గోకులంలో బాల కృష్ణుడి లీలల గురించి భక్తులు మాట్లాడే విషయాలు మీరు ఇగ్నోర్ చేయలేరు. బృందావన్ వీధుల్లో ప్రతి సంధ్యా సమయంలో భజనలు వినిపిస్తాయి.ఎలా వెళ్లాలి ?ఢిల్లీ నుంచి రైలు, రోడ్డు మార్గంలో మధురకు సులభంగా చేరుకోవచ్చు.రైలు యాత్రలో యమునా నది పక్కనే కనిపించే దృశ్యాలు ప్రయాణాన్ని మరింత మనోహరంగా మార్చేస్తాయి. ఆగ్రా, ఢిల్లీ నుంచి రోడ్డుమార్గంలో సాగే ప్రయాణం .. బ్రజ్ భూమిలో అడుగుపెడుతూనే ఆనందానుభూతిని కలిగిస్తుంది.ఎక్కడ ఉండాలి ?మధురలో చిన్నా పెద్ద ధర్మశాలల నుంచి ఆధునిక హోటల్స్ వరకు అనేక వసతి సదు΄ాయాలు ఉన్నాయి. యమునా తీరం దగ్గర ఉన్న వసతి స్థలాలు సంధ్యా సమయంలో ప్రత్యేక ప్రశాంతతను ఇస్తాయి. మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే నదీతీరంలో ఉన్న హోటల్స్లో తక్కువ ధరకే రూమ్స్ లభించే అవకాశం ఉంది. అందుకే ట్రైన్ లేదా ఫ్లైట్ టికెట్స్ వంటివి బుక్ చేసుకునే సమయంలో రూమ్స్ కూడా బుక్ చేసుకోవడం ఒక మంచి ప్రయాణికుడి లక్షణం. ఏం చూడాలి ? మధుర ప్రయాణికులకు ఒక మధురమైన అనుభూతిని కల్పిస్తుంది. ఇక్కడికి వస్తే మీరు కృష్ణ జన్మభూమి, ద్వారకాదీశ్ మందిరం, విశ్రామ్ ఘాట్, బృందావన్, గోవర్ధన్ వంటి అనేక ప్రదేశాలను కవర్ చేయవచ్చు. ఈ యాత్రను మధురంగా మార్చుకోవాలి అనుకుంటే చెక్ లిస్ట్ పెట్టుకుని వివిధ ్ర΄ాంతాలను అన్వేషించడం కన్నా ప్రశాంతంగా ఒక్కో ప్రాంతాన్ని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మధుర అనేది పర్యాటక ప్రదేశం కన్నా ముందు ఒక పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ప్రతి ప్రదేశం భక్తి, శిల్పకళ, సంప్రదాయం కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు (చదవండి: Munnar Tourist Place: "పచ్చందనమే పచ్చదనమే"..!) -
జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..!
ఇంతవరకు చూసిన వెయిట్లాస్ జర్నీలలో ఇది అత్యంత విభిన్నం. ఓ టీనేజర్ అధిక బరువు తగ్గేంచేందుకు ఎలా ప్రయత్నించాడో వివరించే వెయిట్లాస్ స్టోరీ ఇది. తన పదహారవ పుట్టిన రోజున తీసుకున్న నిర్ణయం..తనలో ఎంతలా పరివర్తనకు దారితీసిందో తెలిపాడు. అయితే జిమ్కి వెళ్లలేదని, అలాగే ఎలాంటి కఠినమైన డైట్లు పాటించలేదని అంటున్నాడు. కానీ రెండేళ్లలో 17 కిలోలు పైనే తగ్గానని అంటున్నాడు. జిమ్, డైట్ పాటించకుండా ఆ టీనేజర్ ఎలా బరువుతగ్గాడంటే..ఇంటి వ్యాయామాలతో అని చెబుతున్నాడు. అదేంటి అనుకోకండి. ఎందుకంటే తాను స్లిమ్గా ఆరోగ్యకరమైన బరువుతో ఉండాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి..వారి సహాయసహకారాలతో బరువు తగ్గాడు. పేరెంట్స్ సాయంతోనే..ఇంటిలోనే చేసే వ్యాయామా పరికరాలను కొనుగోలు చేసి మరి..వర్కౌట్లకు ఉపక్రమించాడు. బరువులు ఎత్తే ప్లేట్ల తోపాటు బార్బెల్ వంటి పరకరాలతో మంచి పురోగతిని అందుకున్నాడు. మొదట్లో పుల్అప్బార్లతో వేలాడిదీసినట్లు ఉండటం దాదాపు అసాధ్యం అనిపించింది. ఒకపుల్అప్ని కూడా పూర్తి చేయలేకపోయేవాడు. అయితే క్రమం తప్పకుండా సాధన చేసి..మంచి మెరుగుదలను అందుకున్నాడు. సరైన టెక్నిక్తో ఇవాళ సుమారు 18 పుల్అప్లు దాక నిర్వహించి..కండరాల బలాన్ని పెంపొందించుకుంటున్నాడు. అలా రెండేళ్లలో చూస్తుండగానే దాదాపు 17 కిలోలు తగ్గి..చాలా స్మార్ట్గా మారిన తన పరివర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఆ టీనేజర్. కేవలం క్రమశిక్షణ, నిబద్ధతత, క్రమం తప్పకుండా చేయడం వంటివి వెయిట్లాస్కి ప్రధానమైనవని అంటున్నాడు. బరువు తగ్గడం గురించి భయపడే వారికి తన వెయిట్లాస్ స్టోరీ ప్రేరణ అని చెప్పడమే గాక, స్లిమ్గా మారేలా ఇతరులను ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నాడు.(చదవండి: పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!) -
హార్ట్బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!
పుట్టుకతో వచ్చే రెండు రకాల గుండె లోపాలతో జన్మించిన కార్షియాక్ స్పెషలిస్ట్ అయినా ఆ మహిళ అలుపెరగని పోరాటం చేసి మరి జీవిస్తోందామె. ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్లు చేయించుకున్నా ఆశా అనే జ్యోతిని వెలిగిస్తూ..తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ప్రాణాంతకమైన ఆ గుండె పరిస్థితిని మందులతో నిర్వహిస్తూనే ఆరోగ్యకరంగా జీవిస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య పరిస్థితికి కుంగిపోయే వారికి ఆమె కథ ఓ ప్రేరణపుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన కార్డియాక్ స్పెషలిస్ట్ ఏంజెలికి అసిమాకి ఇంటర్మెటెంట్ ఏవీ బ్లాక కారణంగా 14 సెకన్లపాట్లు గుండె ఆగిపోయే పరిస్థితితో పోరాడుతోందామె. ప్రాణాంతకమైన పరిస్థితిలో పోరాడుతున్న ఆమెకు సరిగ్గా 36 ఏళ్ల వయసులో వచ్చిన స్ట్రోక్ మరోసారి కుప్పకూలిపోయేలా చేసింది. అప్పుడే తెలిసింది ఈ ప్రాణాంతక పరిస్థితికి తోడు గుండెలో "గ్యాపింగ్ హోల్" కూడా ఉందని నిర్థారణ అయ్యింది. ఆమెది ఆకస్మిక కార్డియాక్ మ సంబంధం ఉన్న పరిస్థితికి ఇది మరింత ప్రమాదకరమైన సంకట స్థితి.ఎప్పటి నుంచి పోరాడుతోందంటే..25 ఏళ్ల వయసులో ఏంజెలికీ తొలిసారిగా తనకు గుండెజబ్బుకి సంబంధించిన లక్షణాలు తొలిసారిగా కనిపించాయని చెప్పుకొచ్చింది. నెమ్మదిగా తలతిరడం నుంచి మొదలై నెలలుగా మూర్చపోయే వరకు దారితీసింది. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేకపోయినా..ఆమె ప్రాణాంతక గుండెజబ్బు బారినపడింది. పలు వైద్య పరీక్షల అనంతరం ఆమె హృదయస్పందన నిమిషానికి 120 బీట్స్ దాటినప్పుడల్లా ఆమె గుండె 14 సెకన్ల వరకు ఆగిపోతుందని వైద్యులు నిర్ధారించారు. దీని కారణంగా గుండెలో "పై నుంచి దిగువ గదులకు విద్యుత్ ప్రవహించదు, కాబట్టి ఆమెకు పేస్మేకర్ అవసరం. ఈ తీవ్రమైన గుండె జబ్బు గురించి వినడంతోనే ఏంజెలి ఇక తన జీవితం ముగిసిపోయిందనుకుంది. ఎందుకంటే బెడరూమ్ నుంచి బాత్రూమ్ వరకు కూడా వెళ్లలేనంతగా స్ప్రుహతప్పి పడిపోయేది. ఆ తర్వాత ఏంజెలికి ఫేస్మేకర్ని అమర్చారు. 1990లలో ఈ యంత్రంలో అనేక సమస్యలతో రావడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి ఆమెకు. ముఖ్యంగా బ్యాటరీలను నిరంతరం మార్చాల్సి వచ్చేది. ఆ క్రమంలో మెదడులోని రక్తనాళం పగిలి రక్తస్రావం కావడంతో స్ట్రోక్ను ఎదుర్కొంది. దాంతో ఆమెకు ఓపెన్-హార్ట్ సర్జరీతో సహా ఐదు ఫేస్మేకర్లు, మూడు అబ్లేషన్ల, ఒక ఓపెన్-హార్ట్ సర్జరీతో సహ తొమ్మిది వైద్య చికిత్సలు తీసుకుంది. ఇలా ఆమె జీవితాంతం ఇన్ని అనారోగ్య సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ..లండన్ నుండి కార్డియోమయోపతిలో పిహెచ్డి పూర్తి చేసింది, తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్ చేసింది, అక్కడ ఆమె ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది,. అలాగే అమెరికాలో 11 ఏళ్లు గడిపింది. అంతేగాదు ఏంజెలి తనలాంటి గుండె సమస్యతో బాధపడుతున్న వారికోసం..ఆ వ్యాధి నిర్థారణ పర్యవేక్షణ కోసం..ఒక పద్ధతిని ఆవిష్కరించింది. ఇది ప్రమాదకరమైన గుండె బయాప్సీలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇక ఏంజెలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదీగాక ఏంజెలి పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కారణంగా అనేక గర్భస్రావాలను ఎదుర్కొని మరి..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారామె. అయితే ఆ పిల్లలు ఇద్దరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యల లోపాన్ని అధిగమించడమే కాకుండా దాన్నే తన కెరీర్గా ఎంచుకుని..ఆ సమస్యకు చెక్పెట్టే దిశగా అడుగులు వేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం.(చదవండి: ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..) -
ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..
షిల్లాంగ్లోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ఇద్దరు అగ్నివీర్ శిక్షణార్థులు అనుమానిత మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ బారినపడి గంటల వ్యవధిలోనే మరణించారు. ఒక్కసారిగా అస్సాం రెజిమెంటల్ సెంటర్ ఉలక్కిపడింది. సత్వరమై సైనిక సౌకర్యంలో చుట్టుపక్కల కాంటాక్ట్ ట్రేసింగ్, ఆయా వ్యక్తులతో టచ్లో ఉన్నవారిని ఐసోలేషన్లో ఉంచడం తదితరాలతో వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేలా సత్వరమే అన్ని చర్యలు చేపట్టింది. కేవలం ఆర్మీ శిక్షణా కేంద్రంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా గట్టి నిఘా ఉంచినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇంతకీ అసలేంటి మెనింగోకాకల్ వ్యాధి ..? ఎందువల్ల వస్తుందంటే..?మెనింగోకాకల్ వ్యాధి అంటే ..?మెనింజైటిస్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలాల వాపుకు కారణమవుతుంది. ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్యానికి ఒక తీవ్రమైన ముప్పుగా అభివర్ణించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఇది అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవుల వల్ల సంభవిస్తుందని WHO పేర్కొంది. అయితే ఇది అంటువ్యాధి లాంటిదేనా..? కాదా అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు.బాక్టీరియల్ మెనింజైటిస్ అత్యంత తీవ్రమైన రకం మెనింజైటిస్ అని WHO చెబుతోంది. దీని కారణంగా రోగికి తీవ్రమైన, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. మెనింగోకోకస్ అనేది నీసేరియా మెనింగిటిడిస్ అనే బాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియల్ మెనింజైటిస్.వ్యాధి లక్షణాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం మెనింగోకాకల్ వ్యాధి యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:ప్రకాశవంతమైన కాంతి వల్ల ఇబ్బంది పడటంవిరేచనాలుజ్వరంతలనొప్పివాంతులుముదురు రంగులోకి మారినట్లు కనిపించే చర్మ దద్దుర్లుగట్టి మెడగందరగోళం,చిరాకుచాలా నిద్రమత్తుగా అనిపించడంనడవడానికి లేదా నిటారుగా ఉండటానికి ఇబ్బందివిపరీతమైన మంటలు, నొప్పులుకీళ్లు, కండరాల నొప్పిఆకలి లేకపోవడంఎవరికీ ఈ ప్రమాదం అధికం అంటే..ఈ ఇన్ఫెక్షన్ ఏ వ్యక్తినైనా ప్రభావితం చేయవచ్చు, అయితే, కొంతమందికి ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, టీనేజర్ లేదా చిన్న వయస్సులో ఉన్నవారుప్లీహ గాయం లేదా ప్లీహము లేకపోవడంసికిల్ సెల్ వ్యాధి ఉన్నవాళ్లకుకాంప్లిమెంట్ ఇన్హిబిటర్ మందులు తీసుకునేవాళ్లుమెనింగోకాకల్ వ్యాధి సాధారణంగా ఉండే ప్రాంతాలను సందర్శించడం వల్లదీనికారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు..బాధిత వ్యక్తులు వెంటనే వైద్య చికిత్స పొందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, చికిత్స పొందినప్పటికీ ప్రజలు చనిపోవచ్చు. ఈ వ్యాధి కారణంగా ఎదురయ్యే సమస్యలు..మెదడు దెబ్బతినడంమూత్రపిండాల నష్టంఅవయవాలు కోల్పోవడంనరాల దెబ్బతినడంపూర్తిగా వినికిడి లోపంనివారణ చర్యలువ్యాక్సిన్లు సాధారణ రకాల బాక్టీరియల్ మెనింజైటిస్ నుంచి ఉత్తమ రక్షణను అందిస్తాయని WHO చెబుతోంది. మెనింగోకాకస్, న్యుమోకాకస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి (Hib) వల్ల కలిగే మెనింగోకాకల్ వ్యాధిని టీకాలు నిరోధించగలవు. ఇతర నివారణ చర్యలు..11-12 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ కంజుగేట్ (MenACWY) వంటి టీకాలు వేయించడం.16 ఏళ్ల లోపు వాళ్లకు బూస్టర్డోస్లు వేయించడం. అలాగే సెరోగ్రూప్ B నుంచి అదనపు రక్షణ కోసం సిఫార్సు చేసిన MenB టీకాలు వేయించడం. టీకాలు సాధారణ జాతులను (A, C, W, Y, B) లక్ష్యంగా చేసుకుంటాయి. టీనేజ్ పిల్లలు, టీనేజర్లు, HIV లేదా అస్ప్లెనియా వంటి ఆరోగ్య ప్రమాదాలు ఉన్నవారికి ఈ టీకాలు వేయించడం మంచిది.పరిశుభ్రత పద్ధతులు: ముఖ్యంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత లేదా తినడానికి ముందు సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోండి. కడగని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండండి. పానీయాలు, ఆహారం, పాత్రలు, లిప్స్టిక్లు లేదా సిగరెట్లను పంచుకోవద్దు, దగ్గు/తుమ్ము వచ్చినప్పుడు చేతులు లేదా జేబురుమాల్ అడ్డుపెట్టుకోవడం. ఈ చర్యలు తీసుకుంటే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందే ఈ బ్యాక్టీరియాను కట్టడి చేయొచ్చు. ముఖ్యంగా దద్దుర్లు, మెడనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం సహాయం తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!) -
ముసుగు వెయ్యొద్దు మనసు మీద..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది తమలో ఉన్న లోపాలన్నింటినీ కప్పెట్టేసి, ఒక పర్ఫెక్ట్ ముసుగు వేసుకోవడం అనుకుంటారు. "నేను ఎప్పుడూ కాన్ఫిడెంట్గా ఉండాలి", "నాకు అసలు భయం వేయకూడదు" అని తమకు తాము అబద్ధాలు చెప్పుకుంటారు.కానీ సైకాలజీ ప్రకారం, మీలోని లోపాన్ని మీరు అంగీకరించనంత కాలం, దాన్ని మీరు మార్చలేరు. అంగీకారం (Acceptance) అనేది బలహీనత కాదు, అది మార్పుకు అవసరమైన అసలైన ధైర్యం.అంగీకారమే మార్పుకు ద్వారంకార్ల్ రోజర్స్ తన 'Client-Centered Therapy'లో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. మనం మనలోని ఏదైనా ఒక నెగటివ్ లక్షణాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని అసహ్యించుకుంటున్నంత కాలం, మన మెదడు ఆ లక్షణాన్ని డిఫెన్స్ మోడ్లో రక్షిస్తుంది. ఉదాహరణకు, అతిగా కోపం రావడం లేదా అసూయ పడటం.కానీ, "అవును, ప్రస్తుతం నాలో ఈ కోపం ఉంది" అని మీరు ఎప్పుడైతే నిజాయితీగా అంగీకరిస్తారో, అప్పుడు మీ మనసులో ఉన్న ఆందోళన (Anxiety) తగ్గుతుంది. ఆ ప్రశాంతతలోనే మార్పు సాధ్యమవుతుంది.ముసుగుల భారంసో-కాల్డ్ ట్రైనర్లు మిమ్మల్ని ఎప్పుడూ "నటన" చేయమని ప్రోత్సహిస్తారు. "నీ బలహీనతలను ఎవరికీ చూపించకు, పులిలా గర్జించు, లోపల ఏమున్నా బయటకు మాత్రం తోపులా కనిపించు" అని చెప్తారు.ఇది మీలో 'Incongruence' (అంతర్ఘర్షణ) పెంచుతుంది. బయట మీరు గొప్పగా నటిస్తున్నా, లోపల మీ 'Real Self' కు అది అబద్ధం అని తెలుసు. ఈ అబద్ధం మీ సెల్ఫ్-ఎస్టీమ్ (Self-esteem) ని దెబ్బతీస్తుంది. నిజమైన వికాసం అంటే లోపాలను దాచడం కాదు, వాటిని అంగీకరించి, బాధ్యత తీసుకోవడం.అంగీకారం అంటే రాజీ పడటం కాదు"నన్ను నేను ఇలాగే ఒప్పుకుంటే ఇక నేను ఎప్పటికీ మారలేనేమో?" అని చాలామందికి అనుమానం ఉంటుందిResignation (నిరాశ): "నేను ఇంతే, నా జీవితం మారదు" అని వదిలేయడం బలహీనత.Acceptance (అంగీకారం): "ప్రస్తుతానికి నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇది నా వాస్తవం. ఇక్కడి నుండి నేను ఎలా ముందుకు వెళ్ళాలి?" అని ఆలోచించడం బలం.ఉదాహరణకు, ఒక వ్యక్తికి స్టేజ్ ఫియర్ ఉందనుకోండి. "నాకు భయం లేదు" అని నటించడం కంటే, "అవును, నాకు స్టేజ్ ఎక్కాలంటే భయంగా ఉంది.. ఈ భయాన్ని జయించడానికి నేను ఏం చేయాలి?" అనడం నిజమైన పర్సనాలిటీ గ్రోత్.అంగీకార ప్రక్రియGenius Matrix మోడల్ ఉపయోగించి మనల్ని మనం ఎలా అంగీకరించాలో చూద్దాం.Step 1: అవమానాన్ని బద్దలు కొట్టండిమన లోపాలను ఒప్పుకోవడానికి మనకు అడ్డుపడేది 'సిగ్గు' (Shame). "నాలో ఈ లోపం ఉందని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు?" అనే భయాన్ని 'Break' చేయండి. మీ లోపాలు మిమ్మల్ని తక్కువ మనిషిని చేయవు, అవి మిమ్మల్ని ఒక 'మనిషి'గా చూపిస్తాయి.Step 2: నిజాయితీ గల పునాదిమీ బలహీనతలను ఒక పేపర్ మీద రాయండి. వాటిని చూసి బాధపడకండి. "అవును, ఇవి నాలో ఉన్నాయి" అని గట్టిగా చదవండి. ఎప్పుడైతే మీరు వాటిని వెలుగులోకి తెస్తారో, వాటికి మిమ్మల్ని భయపెట్టే శక్తి పోతుంది. ఇక్కడే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది 'Build' అవుతుంది.Step 3: పరిపూర్ణతకు ఆవలపరిపూర్ణత (Perfection) అనేది ఒక భ్రమ. మనం మనుషులం, దేవుళ్ళం కాదు. మన లోపాలను అంగీకరిస్తూనే, వాటిని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే 'Beyond' స్టేజ్. ఇక్కడ మీరు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు.మీతో మీరు సంధి చేసుకోండిఈ రోజు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ చిన్న పని చేయండి.మీలో మీకు నచ్చని మూడు విషయాలను గుర్తించండి. ఉదా: బద్ధకం, అసూయ, ఫిజికల్ అప్పియరెన్స్.ఆ మూడు విషయాల వైపు చూస్తూ.. "నిన్ను నేను అంగీకరిస్తున్నాను, నిన్ను మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను" అని మనసులో అనుకోండి.ఈ అంగీకారం తర్వాత మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో గమనించండి.గాయాలే మీ గుర్తులు!బ్రో, ఒక పగిలిన కప్పును బంగారంతో అతికించినప్పుడు (Kintsugi Art), అది మామూలు కప్పు కంటే ఎక్కువ విలువను, అందాన్ని పొందుతుంది. మన లోపాలు కూడా అంతే. వాటిని దాచకండి, వాటిని అంగీకరించి గౌరవించండి. అప్పుడే మీరు మీ Real Personality ని ప్రపంచానికి చూపగలరు.గుర్తుంచుకోండి, "You can't heal what you don't reveal."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Inner Critic: మిమ్మల్ని నిరంతరం వెనక్కిలాగే శత్రువుని జయించాలంటే..!) -
యువతలో మానసిక అనారోగ్యం!
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో కుటుంబ బంధాలు బలహీనపడడం, జీవన శైలి మారిపోవడం, స్మార్ట్ఫోన్లు యువత మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కుంగుబాటుకు గురి చేస్తున్నాయి. ప్రపంచమంతటా ఈ పరిణామం నెలకొంది. భారత్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశంలో 18 నుంచి 34 ఏళ్లలోపు యువతలో మానసిక అనారోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. మానసిక ఆరోగ్య గణన(ఎంహెచ్క్యూ) ర్యాకింగ్లో 84 దేశాలకుగాను భారత్కు 60వ స్థానంలో నిలిచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా చెందిన సేపియన్ ల్యాబ్స్ ‘గ్లోబల్ మైండ్ హెల్త్’పేరిట ఈ అధ్యయనం నిర్వహించింది. తాజాగా తమ నివేదికను విడుదల చేసింది. భారతీయ యువతలో మానసిక ఆరోగ్యం దిగవ స్థాయిలో ఉన్నట్లు తేలి్చచెప్పింది. దేశంలో 55 ఏళ్లు దాటిన పెద్దలతో పోలిస్తే 18–34 ఏళ్ల యువతలోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. → సేపియన్ ల్యాబ్స్ అధ్యయనం ప్రకారం.. భారతీయ యువత సగటు ఎంహెచ్క్యూ స్కోర్ 33గా ఉంది. వారు ‘బాధల్లో ఉన్న, కష్టపడుతున్న’కేటగిరీలో నిలిచారు. → 55 ఏళ్లు దాటిన పెద్దల సగటు స్కోర్ దాదాపు 100గా ఉండడం గమనార్హం. వారు ‘జీవితాన్ని చక్కగా నిర్వహించుకుంటున్న, విజయవంతమైన’కేటగిరీలో ఉన్నారు. → కోవిడ్–19 మహమ్మారి మొదలైన తర్వాత యువతలో మానసిక అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయని, వారు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకోలేదని సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు, చీఫ్ సైంటిస్టు తార త్యాగరాజన్ చెప్పారు. 2019 నుంచి తాము అధ్యయనం కొనసాగిస్తున్నామని, 55 ఏళ్లు దాటినవారి మెంటల్ హెల్త్లో పెద్దగా మార్పులు లేవని వెల్లడించారు. వారి ఎంహెచ్క్యూ స్కోర్ స్థిరంగా ఉందని స్పష్టంచేశారు. → ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని దేశాల్లో పెద్దల కంటే 18–34 ఏళ్ల యువతే మానసిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటోంది. → చీకటి ఖండంగా భావించే ఆఫ్రికాలోని ఘన, నైజీరియా, జింబాబ్వే, కెన్యా, టాంజానియా తదితర దేశాల్లోని యువతలో మానసిక అనారోగ్య సమస్యలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అంటే వారిలో మెంటల్ హెల్త్ మెరుగ్గానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. → జపాన్, తైవాన్, హాంకాంగ్, యునైటెడ్ కింగ్డమ్(యూకే), చైనా యువతలో మెంటల్ హెల్త్ ఏమాత్రం బాగా లేదని అధ్యయనం తెలియజేసింది → రెండేళ్లపాటు ఈ సర్వే నిర్వహించారు. 84 దేశాల్లో 10 లక్షల మందికిపైగా ప్రజలను ప్రశ్నించారు. ఇంటర్నెట్ ద్వారా వారి అభిప్రాయాలు సేకరించారు. వీరిలో వేర్వేరు వయసులకు చెందినవారు ఉన్నారు. ఆధునిక జీవితం యువత మానసిక ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. → సంపన్న, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యువతలో కుంగుబాటు లక్షణాలు కనిపిస్తున్నాయి. వారి మానసిక ఆరోగ్యం క్రమంగా దిగజారుతోంది. → భారత్లో 18–34 ఏళ్ల యువతలో 64 శాతం మంది తాము కుటుంబ సభ్యులతో చక్కటి సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. 55 ఏళ్లు దాటివారిలో 78 శాతం మంది ఇదే మాట చెప్పారు. ఆధికంగా ఆదాయం ఆర్జిస్తున్నవారి కంటే కుటుంబంతో కలిసి ఉన్నవారే మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. → ప్రపంచవ్యాప్తంగా సగటున 14 ఏళ్లకు మొదటిసారిగా స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తుండగా, భారత్లో సగటున 16.5 ఏళ్లకు స్మార్ట్ఫోన్ వాడకం ప్రారంభిస్తున్నారు. → ఇండియాలో 55 ఏళ్లు దాటినవారిలో కేవలం 11 శాతం మంది అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకుంటున్నారు. యువతలో మాత్రం ఏకంగా 44 శాతం మంది ఇలాంటి హానికర ఆహారం స్వీకరిస్తున్నారు. → ప్రజల్లో మానసిక అనారోగ్య సమస్యలపై పశ్చిమ దేశాలు దృష్టి పెడుతున్నాయి. దీనిపై పరిశోధన, పరిష్కార మార్గాల కోసం ప్రతిఏటా నిధుల కేటాయింపులు పెంచుతున్నాయి. అమెరికా ప్రభుత్వం 2024లో ఇందుకోసం 2.2 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. యూకే సైతం భారీగానే నిధులు ఖర్చుచేస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. → మానసిక అనారోగ్యం విషయంలో కేవలం చికిత్సతో సరిపెట్టకుండా.. అందుకు మూల కారణం ఏమటన్నది పరిశోధిస్తున్నామని తార త్యాగరాజన్ తెలియజేశారు. కుటుంబ బంధాలు బలహీన పడడం, ఆధ్యాతి్మక అంశాలపై దృష్టి పెట్టకపోవడం, చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లకు బానిస కావడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించకుండా.. అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం వంటివి యువతకు ముప్పుగా పరిణమిస్తున్నాయ ని వివరించారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మానసిక ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుందని సూచించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అనుబంధం పెంచుకోవాలని చెప్పారు. -
ఐడియా అదుర్స్..! ఫ్యాషన్ని ఇలా కూడా చూపించొచ్చా..!?
సోషల్ మీడియా పుణ్యమా అని..చాలామంది ఓవర్నైట్ స్టార్లుగా, సెలబ్రిటీ హోదాను పొందుతున్నారు. ఆ జాబితాలోకి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు చేరి.. సక్సెస్ని అందుకోవడం విశేషం. అయితే ఫ్యాషన్ వద్దకు వచ్చేటప్పటకీ.. మనలోపల టాలెంట్ మొత్తం తీసి ..రీల్స్ చేసినా..క్లిక్ అవ్వడం కొంచెం కష్టమే. ముఖ్యంగా అందరికి చేరువవ్వాలంటే అంత సులభమైన టాస్క్ కాదు. ఫ్యాషన్ అనగానే బాగా డబ్బున్నవాళ్లకే చెల్లుతుందనే అభిప్రాయం బాగా ఎక్కువ జనాల్లో. కానీ దాన్ని సామాన్యుల చెంతకు చేర్చి..అది మన లైఫ్లో భాగమనిపించేలా అందంగా చూపించింది ఈ అమ్మాయి. ఈ ఒక్క రీల్తో సెన్సేషన్గా స్టార్గా మారి.. ప్రపంచ వేదికపై నిలిచింది. అంతేగాదు ఎవరా ఆ అమ్మాయి అంత కూల్గా, చాలా క్యాజువల్గా ఫ్యాషన్ని ఎంత బాగా పరిచయం చేసింది.. అని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరంటే ఆమె..ఆ అమ్మాయే దియా జౌకానీ. వృత్తిరీత్యా ఆమె హై-ఎండ్ ఫ్యాషన్ డిజైనర్. ఇన్స్టాగ్రామ్లో"కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" అనే క్యాప్షన్తో ఆమె షేర్ చేసిన ఫ్యాషన్ వీడియో నెట్టిం ప్రభంజనం సృష్టించింది. ఎవరీ కూల్గర్ల్ అని చర్చలకు తెరతీసేలా..హాట్టాపిక్గా మారిందామె. ఆ రీల్లో ఆమె ధరించిన దుస్తులు కూడా స్వయంగా ఆమె డిజైన్ చేసినవేనట. సోషల్ మీడియాను ఆమె తన ఫ్యాషన్ ప్రదర్శనకు ఫ్లాట్ఫామ్గా ఉపయోగించుకుంటూ..తన డిజైన్లను ఇలా రీల్స్ ద్వారా నిశబ్దంగా ప్రదర్శించింది. తన డిజైనర్వేర్లతో చాలా స్మార్ట్గా మార్కెటింగ్ చేస్తోందామె. ఆ వీడియోలో దియా హై ఫ్యాషన్ను సరదాగా ధరించగలిగేలా ఆకర్షించింది. అంతేగాదు దియా ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఆమె ఫ్యాషన్ ప్రపంచాన్ని చూడొచ్చు. తన కంటెంట్ మొత్తం చాలా నిరాడంబరంగా ప్రజెంట్ చేస్తుండటంతో..ప్రజలు ఒక్క క్షణం వేచి వీక్షించగలిగేలా ఆకట్టుకుంటున్నాయి ఆ వీడియోలు. ప్రస్తుతం దియా చేసిన "కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" ఎంత ట్రెండీగా మారిందంటే..అందురు ఆమెలా అనుకరించే యత్నం చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు..ఆ వీడియో ఎంతగా నెటిజన్ల మనసులను తాకిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోల బ్యాగ్రౌండ్లో క్లాసిక్ ఫ్రాంక్ ఓషన్స్ నైట్స్ ప్లే అవుతూ ఉంటే.. దియా చక్కటి ఫ్యాషన్వేర్లో చాయ్ తాగుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత నగర వీధుల గుండా నడవడం ప్రారంభిస్తుంది. కొద్ది సెకన్లలో గుర్రపు స్వారీ చేస్తూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండటం లేదా ఆమె వ్యక్తిగత రైడ్ లాగా JCB పారపై కూర్చోవడం..ఇలా విలక్షణంగా కనబడుతుంది ఆయా వీడియోలలో. అయితే వాటి అన్నింటిలోనూ దియా వివరణాత్మక, హై-ఫ్యాషన్ దుస్తులను ధరించడం స్పష్టంగా చూడొచ్చు. View this post on Instagram A post shared by 🪔 (@diyajoukani)ఈ వీడియో ఇంతలా క్లిక్ అవడానికి కేవలం ప్రజెంటేషన్ చేసిన విధానమే ఆమెను ఐకానిక్గా మార్చేసింది. ఇక్కడ దియా విలాసవంతమైన దుస్తులను ధరించింది కానీ..స్టూడియో లేదా లగ్జరీ నేపథ్యం ఎంచుకోకుండా..ఇలా సాధారణ వీధుల గుండా వెళ్తూ..హై ఫ్యాషన్ మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ఎలాగో నేర్పుతున్నట్లుగా ఉంది. అందుకే ఇది ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అయ్యి..అంతలా వ్యూస్, లైక్లు వచ్చాయి ఆ వీడియోకి. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అన్నట్లుగా ఒక్క రీల్తో దియా సెన్సేషన్గా మారింది కదూ..!. View this post on Instagram A post shared by 🪔 (@diyajoukani) (చదవండి: అరుదైన పెళ్లి: ట్విన్ సిస్టర్స్ని పెళ్లాడిన ట్విన్ బ్రదర్స్..!) -
జస్ట్ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..
బరువు తగ్గడం అందరికీ ఒకలా ఉండదు. కొందరికి చాలా కష్టమైనదిగా..మరికొందరికి చాలా తేలికైన వాటితో సులభంగా తగ్గే టాస్క్లా ఉంటుంది. అయితే ఇక్కడ స్థిరత్వాన్ని బ్రేక్ చేయకపోతేనే..లక్ష్యానికి చేరుకోగలం. ఇక్కడ ట్యునిషియాకు చెందిన హిబా అల్లా వెయిట్లాస్ స్టోరీ ఆ విధంగానే సాగింది. ఆమె ఓర్పుతో స్థిరత్వంతో బరువు తగ్గే ప్రయాణాన్ని మొదలు పెట్టి ఏకంగా 133 కిలోల బరువు నుంచి 52 కిలోలకు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదికూడా జస్ట్ 11 నెలల్లో ఈ ఫలితాన్ని అందుకుని స్ఫూర్తిగా నిలిచిందామె. ఇంతకీ ఆమె ఎలాంటి ట్రిక్స్ అనుసరించిందంటే..ట్యునీషియాలోని ట్యునీస్కు చెందని 22 ఏళ్ల హిబా అల్లా అయాది ఒక స్టూడెంట్. ఆమె ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, బరువు ఏకంగా 133.3 కిలోలు ఉండేది. ఆమె రూపం భారీగా ఉండి..కనీసం నాలుగు అడుగులు వేయాలన్నా..ఆయాసంతో ఇబ్బందిపడేది. శ్వాస తీసుకోవడంలో నిరంతరం అలసటను ఎదుర్కొనేది. ఆరోగ్యం రోజు రోజుకి భారంగా మారిపోవడం మొదలైంది. ఇక తనకు తానుగా బరువు తగ్గేందుకు ఉపక్రమించకపోతే..ఉనికే కష్టమవుతుందని అర్థమైంది హిబాకు. దాంతో వెయిట్లాస్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే ఆమె అందరు అనుక్నుట్లుగా బరువు తగ్గడం అంటే..తినడం తగ్గించడం, నోరు కట్టేసుకోవడం కాదంటోంది. ఆమె తింటూనే బరువు తగ్గే ప్రయత్నం చేసిందంటే. అయితే తినే వాటిలో ఆరోగ్యకరమైనవి, ప్రోటీన్,ఫైబర్ ఉండేవి ఎంచుకున్నట్లు తెలిపింది. ముందుగా ఆకలి తీరి సంతృప్తిని కలిగించేలా భోజనం ఉండేలా చూసుకునేదాన్ని. అప్పుడు బరువు తగ్గడం భారంగా..భయానకంగా ఉండదట. పైగా తరుచుగా అద్దంలో చూసుకోవడం..స్లిమ్గా మారాలనే లక్ష్యాన్ని నిరంతరం గుర్తుచేస్తుంది. నోరు ఆటోమేటిగ్గా అదుపులో ఉండేలా ఆహారం తీసుకునేలా మైండ్సెట్ అవుతుందట. ఆమెకు అధిక బరువు కారణంగా జిమ్ సభ్యత్వం లభించలేదట. అందుకని హిబా వర్కౌట్లకు బదులుగా నడకను ఎంచుకుందట. నెమ్మదిగా చిన్న అడుగులతో మొదలు పెట్టి..కిలోమీటర్ల కొద్ది నడకను పెంచుకుంటూ పోయేదాన్ని అంటోంది. అధికంగా నీటిని తీసుకోవడం, తాజా పండ్లను తీసుకోవడం వంటివి చేసేదట. అలేగు ఉప్పు, చక్కెరలను మితంగా తీసుకునేదట. ఇక బరువు తగ్గడం శారీరకం భావోద్వేగ పోరాటంగా అభివర్ణించింది. మొదట్లో అంత తొందరగా తన బాడీలో మార్పులు సంతరించుకోలేదని, అయినా..ఎక్కడ అసహనం చెందకుండా ఓర్పుతో తన దినచర్యను కొనసాగించానని చెప్పుకొచ్చింది. ఏం తీసుకున్నా..ఆరోగ్యకరమైన విధంగా ఎంచుకోవడం, వాకింగ్ని స్కిప్ చేయకపోవడం వంటి అలవాట్లతో బరువు తగ్గడం ప్రారంభమవ్వడం మొదలైంది. అయితే తాను ఆ ఉత్సాహంతో అలసిపోతున్నప్పుడూ కూడా ఓపికతో తన డైలీ యాక్టివిటీని కొనసాగించేదాన్ని అంటోంది. అలా ఇవాళ 52.45 కిలోలు బరువుతగ్గి 52 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా అని నవ్వతూ చెప్పింది హిబా. అంతేగాదు బరువు తగ్గడం అనేది శిక్ష కాదని, శరీరం, జీవితానికి ఇచ్చే గౌరవప్రదమైన చర్యగా అభిర్ణించింది. ఈ రోజు తాను ఆరోగ్యంగా, హాయిగా శ్వాస తీసుకునే ఆహ్లాదభరితమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని ఆనందంగా చెబుతోంది. దయచేసి బరువు తగ్గడం అంటే..విపరీతమైన వర్కౌట్లు, కఠినమైన ఆహారంగా భావించొద్దు..సంతృప్తికరంగా తింటూ..ఎంజాయ్ చేస్తూ తగ్గాలి..అప్పుడే మంచి ఫలితాలు అందుకోగలం అని నమ్మకంగా చెబుతోంది హిబా.(చదవండి: బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..) -
అద్దంలో కనిపించని అసలు రూపం
మనం ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి జుట్టు సర్దుకుంటాం, మేకప్ వేసుకుంటాం. కానీ మన కంటికి కనిపించని మరొక అద్దం మన మనసులో ఉంది. అక్కడ మన గురించి మనం ఒక చిత్రాన్ని గీసి ఉంచాం. సైకాలజీలో దీన్నే 'Self-Image' (స్వీయ ప్రతిబింబం) అంటారు. ఇదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.ఎస్, ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుంది అనేది కాదు, మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు అనేదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.మాక్స్వెల్ మాల్ట్జ్ పరిశోధన...డాక్టర్ మాక్స్వెల్ మాల్ట్జ్ ఒక ప్లాస్టిక్ సర్జన్. ప్రమాదాల్లో ముఖం దెబ్బతిన్న వారికి లేదా పుట్టుకతో లోపాలు ఉన్నవారికి ఆయన ఆపరేషన్ చేసేవారు. చాలామంది ఆపరేషన్ తర్వాత కొత్త ముఖంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. కానీ కొంతమంది మాత్రం, ముఖం పర్ఫెక్ట్గా మారినా, "డాక్టర్, నా ముఖం ఇంకా అలాగే ఉంది, నేను ఇంకా వికారంగానే కనిపిస్తున్నాను" అని చెప్పేవారు.మనం బయట ఎన్ని మార్పులు చేసినా, మన మనసులోని అద్దంలో ఉన్న చిత్రం (Mental Blueprint) మారకపోతే ఏదీ మారదని ఆయనకు అర్థమైంది. దీన్నే ఆయన 'Psychocybernetics' అన్నారు. అంటే మన మెదడు ఒక ఆటో-పైలట్ మెకానిజం లాంటిది; మన అంతరంగంలో మన గురించి మనం ఎలాంటి చిత్రం గీసుకుంటే, మన జీవితం అటువైపే ప్రయాణిస్తుంది.సెల్ఫ్-ఇమేజ్: మీ జీవితపు థర్మోస్టాట్మీ ఇంట్లోని ఏసీ 24 డిగ్రీల దగ్గర ఉందనుకోండి, బయట ఎండ ఎంత ఉన్నా అది గదిని 24 దగ్గరే ఉంచుతుంది. మీ సెల్ఫ్-ఇమేజ్ కూడా మీ జీవితానికి ఒక థర్మోస్టాట్ లాంటిది.ఒక విద్యార్థి "నేను యావరేజ్ స్టూడెంట్ని" అని నమ్మితే, అతను ఎంత బాగా చదివినా చివరికి యావరేజ్ మార్కులే తెచ్చుకుంటాడు. ఎందుకంటే, అతని సబ్-కాన్షియస్ మైండ్ అతన్ని అంతకు మించి వెళ్లనివ్వదు.ఒక వ్యక్తి "నాకు అదృష్టం లేదు" అని నమ్మితే, అద్భుతమైన అవకాశం తలుపు తట్టినా దాన్ని అతను చేజేతులా వదిలేస్తాడు.పాజిటివ్ థింకింగ్ ఎందుకు విఫలమవుతుంది?పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, మోటివేషనల్ స్పీకర్స్ మనకు "నువ్వు గొప్పవాడివి అని గట్టిగా అరువు" అని చెప్తారు. కానీ "నేను దేనికీ పనికిరాను" అని మీ అంతరంగంలో మీరు నమ్ముతున్నంత కాలం, ఆ అరుపులు కేవలం శబ్దాలుగానే మిగిలిపోతాయి. మార్కెట్ విల్ పవర్ వాడమంటుంది. సైకాలజీ ఇమాజినేషన్ వాడమంటుంది.మన సెల్ఫ్-ఇమేజ్ లోపల ఎంత బలంగా ఉంటుందంటే, దానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రయత్నాలన్నీ నీటి మీద గీతలు లాంటివే. మనల్ని మనం మార్చుకోవాలంటే మన విల్ పవర్ ని కాదు, మన సెల్ఫ్-ఇమేజ్ ని మార్చాలి.మీ లోపలి అద్దాన్ని క్లీన్ చేసుకోండిGenius Matrix మోడల్ బ్రేక్, బిల్డ్, బియాండ్ ఉపయోగించి ఈ సెల్ఫ్-ఇమేజ్ ని ఎలా రీ-డిజైన్ చేయాలో చూద్దాం.Step 1: Break (పాత ముద్రను గుర్తించడం)ముందుగా అద్దంలో మీకు కనిపించని ఆ 'నెగటివ్ ఇమేజ్' ను గుర్తించండి."నేను ఒక పిరికివాడిని," "నేను ఎప్పుడూ ఫెయిల్ అవుతాను" వంటి వాక్యాలు మీ మైండ్ లో ఎప్పుడు పడ్డాయి?మనసులో ఉన్న ఆ పాత గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. పాత ముద్రను 'Break' చేయడమే మొదటి మెట్టు.Step 2: Build (మెంటల్ రిహార్సల్)మాక్స్వెల్ మాల్ట్జ్ ఒక గొప్ప టెక్నిక్ చెప్పారు—'Creative Visualization'.ప్రతిరోజూ 10 నిమిషాలు కళ్ళు మూసుకుని, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి.మీ మెదడుకు వాస్తవానికి, ఊహకు మధ్య తేడా తెలియదు. మీరు పదే పదే ఒక కొత్త చిత్రాన్ని ఇస్తే, అది పాత సెల్ఫ్-ఇమేజ్ ని తుడిచేసి కొత్తదాన్ని 'Build' చేస్తుంది.Step 3: Beyond (కొత్త అస్తిత్వం)ఒక్కసారి మీ సెల్ఫ్-ఇమేజ్ మారితే, మీరు మీ పరిమితులను దాటి ప్రయాణిస్తారు. మీరు ఎవరికో ఏదో నిరూపించాల్సిన అవసరం ఉండదు. మీరు మీ మనసు లోపలి అద్దంలో ఒక 'విన్నర్' గా కనిపిస్తారు. ఇదే 'Beyond' స్టేజ్.అద్దం అబద్ధం చెప్పదు!ఈ రోజు మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి:కళ్ళు మూసుకుని, ఒక వ్యక్తిగా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక వాక్యంలో రాసుకోండి. (అది మీ సెల్ఫ్-ఇమేజ్).ఆ వాక్యం నిజమేనా? దానికి ఆధారాలు ఏంటి?మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఆ కొత్త ఇమేజ్ ని ఇప్పుడే డిజైన్ చేయండి. దాన్ని రోజూ ప్రాక్టీస్ చేయండి.లోపలి అందమే అసలైన శక్తి!బ్రో, ముఖానికి వేసుకునే రంగులు వర్షం వస్తే పోతాయి. కానీ మనసులో వేసుకునే ఈ 'సెల్ఫ్-ఇమేజ్' రంగులు జీవితాంతం ఉంటాయి. మీ మనసు లోపలి అద్దంలో ఉన్న మలినాలను తుడిచేయండి. మీరు ఒక అద్భుతమైన సృష్టి అని ముందు మీరు నమ్మండి.. ప్రపంచం దానంతట అదే నమ్ముతుంది. గుర్తుంచుకోండి, "You cannot outperform your own self-image."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
కోకిలాబెన్ అంబానీ 92వ పుట్టినరోజు వేడుకలు..! ఆమె మార్క్ ఉండేలా..
వ్యాపార ప్రపంచంలో అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన శక్తిమంతమైన మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా.. దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్. ఇవాళ కోకిల్ బెన్ 92వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ఆమె సంపన్న మహిళ వలే గ్రాండ్గా కాకుండా చాలా సాదాసీదాగా జరుపుకుంటూ..సింపుల్సిటీకీ కేరాఫ్గా నిలిచారామె. ఆఖరికి ధరించిన చీర సైతం సాధారణమైన నిమ్మపండు రంగు షిఫాన్ చీరలో కాలాతీత సౌందర్యానికి కట్టుబడి ఉన్నట్లుగా.. తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారామె. అంబానీ అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేశాడరు. భారీ అలంకరణలు, ఖరీదైన ఆభరణాలుగానీ ధరించకుండా..ఆహ్లాదకరమైన పసుపు రంగు చీరతో నవ్వుతూ కనిపించారామె. ఒక సాధారణ గొలుసు, సున్నితమైన చెవుపోగులు, సాంప్రదాయ ఎరుపు బిండితో తన లుక్ని పూర్తిచేసింది. సహజ అలంకరణకు మించిన బ్యూటీ మరొకటి ఉండదని చెప్పకనే చెప్పారు కోకిలాబెన్. ఇక ఈ వేడుకలో ఆమె ఉనికిని తెలియజేసేలా చేతులు, కాళ్ల గుర్తుల ఫ్రేమ్తో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కోకిలాబెన్ నేపథ్యం..1934లో గుజరాత్లోని జామ్నగర్లో జన్మించిన కోకిలాబెన్ అంబానీ, అంబానీ కుటుంబానికి మాతృమూర్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ భార్య. 1955లో ధీరూభాయ్ను వివాహం చేసుకుని కొంతకాలం యెమెన్లోని ఆడెన్లో నివశించారు. ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యం అభివృద్ధి చెందడంలో ఆమె కీలక సహాయక పాత్ర పోషించారామె. అలాగే 2002లో ఆయన మరణం తర్వాత, కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య జరిగిన హై ప్రొఫైల్ వివాదానికి ఆమె మధ్యవర్తిత్వం వహించారు. అలా 2005లో రిలయన్స్ గ్రూప్ విభజనకు దారితీసింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్తో సహా పలు దాతృత్వ కార్యక్రమాల్లో ఆమె పాత్ర కూడా ఉంది. సంప్రదాయాలకు కట్టుబడి ఉండే గౌరవనీయమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు కోకిలాబెన్. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..!
భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి సుధాచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగానూ, నృత్యకారిణిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని, గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బుల్లితెరపై విలక్షణమైన నటతో అశేష ప్రేక్షక ఆదరాభిమానాలు పొందారామె. అలాంటి సుధాచంద్రన్ ఆరు పదుల వయసులో కూడా అంతే అందం, ఫిట్నెస్తో యాక్టివ్గా ఉండే ఆమె..అందం, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారామె. ప్రస్తుతం ఉన్న హెల్త్ అండ్ బ్యూటీ ట్రెండ్లకు విరుద్ధంగా పూర్వకాల నాటి ఆయుర్వేద ఆచారాలే తన అందం, ఆరోగ్యం వెనుక సీక్రెట్ అంటోందామె. వాటి గొప్పతనం గురించి సుధా మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) ప్రస్తుతం బ్యూటీ అనగానే సీరమ్లు, షీట్ మాస్క్లు ట్రెండ్ల హవా ఎక్కువగా ఉంది. పైగా చాలామంది సీనియర్ సెలబ్రిటీలు ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా ఉన్న ట్రెండ్లే అనుసరిస్తే..ఆమె పాతకాలం నాటి ఆయుర్వేదం, నాటి ఆచార సంప్రదాయలకే జై కొడుతోంది సుధాచంద్రన్. అంతేగాదు ఆరోగ్యం, చర్మ సంరక్షణ అనేవి దినచర్యలు కావని, అవి మన అమ్మమ్మల నాటి జ్ఞాపకాతో ముడిపడి ఉన్నావి, తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినవిగా పేర్కొన్నారామె. తాను దక్షిణి భారత్లోని కేరళ నుంచి వచ్చానని, అందువల్ల దేశీ ఆచారాలకే ప్రాముఖ్యత ఇస్తానని అన్నారామె. తనకు ఆయుర్వేదం ఒక ట్రెండ్ కాదని, అదొక జీవన విధానమని అన్నారు. చిన్ననాటి నుంచి చూసినవే ఈనాటికి తూ.చా తప్పకుండా ఆచరిస్తున్నానని అన్నారామె. దక్షిణ భారత దేశం నుంచి రావడంతో మంగళ, శుఖ్రవారాల్లో తలస్నానం తప్పనిసరి అని చెప్పారు. కొబ్బరి నూనె రాసుకుని మరి స్నానం చేయడం అలవాటని కూడా చెప్పారామె. తన అమ్మమ్మ జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలంటే కొబ్బరినూనె తప్పనిసరి అని చెబుతూ తాను పాఠశాలకి వెళ్తున్నప్పుడూ అమ్మమ్మ ఎంతలా తన జుట్టుకి శ్రద్ధగా నూనె రాసేవారో గుర్తు తెచ్చుకున్నారామె. అలాగే 15 రోజులకొకసారి కడుపుని శుభ్రపరుచుకోవడం అంటే..సాఫీగా విరేచనాలు అయ్యేలా కేటాయించడం. మన పురాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదన్నే గట్టిగా విశ్వసిస్తానని చెప్పారామె. కనీసం జలుబు చేసినప్పుడు కూడా దశములారాష్టాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తానని చెప్పారామె. దశములారాష్టం అనేది సాంప్రదాయ ఆయుర్వేద టానిక్. ఇది పది వేర్లు, ఇతర మూలిక మిశ్రమాలతో తయారు చేస్తారని తెలిపారు. శ్వాసకోశ ఆరోగ్యానికి చాలామంచిదని చెప్పారు. అలాగే కళ్లకు పెట్టుకునే కాజల్ కూడా ఇంట్లో తయారుచేసినదే వాడతానని, ఇది తన అమ్మమ్మ నుంచి అమ్మకు..అలా తనకు సంక్రమించిన ఆచారమని. అదే తాను ఇప్పటికీ ఫాలో అవుతానని అన్నారామె. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఆముదం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారామె. అలాగే మాయిశ్చరైజింగ్ కొబ్బరి నూనెని ఉపయోగిస్తానని, ఆఖరికి మేకప్ని తొలగించేందుకు కూడా వెట్ వైప్స్ వాడనని, కొబ్బరినూనెతోనే తొలగిస్తానని అన్నారామె. తాను కేరళ నుంచి వచ్చి ముంబైలో స్థిరపడ్డా తన మూలాలను, ఇంటి ఆచారాలనే అనుసరిస్తానని చెప్పారామె. అంతేగాదు కేరళ మసాజ్లు తీసుకుంటానని కూడా అన్నారు. శరీరంలోని అదనపు నీటి నిలుపుదలను తొలగించేందు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. తాను కొత్తగా ఎలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడనని, తరతరాల సంప్రదాయాలు, ఆచారాలనే పాటిస్తానని చెప్పారామె. అప్పుడే జీవితం చాలా సులభంగా తేలికగా ఉంటుందన్నారామె. కానీ నేటితరం మార్కెట్లో వచ్చేప్రతి ట్రెండ్ ఫాలో అయ్యి జీవితాన్ని క్లిష్టతరంగా మార్చుకుని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారంటూ..తన పోస్ట్ని ముగించారు సుధాచంద్రన్. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) (చదవండి: The 'Ideal Self' Trap: ఎదుటివారిలా ఉండాలనుకోవడమే సమస్య!) -
ఫేక్ పర్సనాలిటీ వద్దు..మీరు మీలా ఉండండి..!
మనం రోజూ ఉదయం లేవగానే ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఒకరు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారు, ఇంకొకరు ఖరీదైన కారులో తిరుగుతూ కనిపిస్తారు, మరొకరు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. వారిని చూడగానే "నేను కూడా వాళ్ళలాగే ఉండాలి" అనే ఆలోచన మొదలవుతుంది.మెల్లమెల్లగా మనం 'మనం'లా ఉండటం మానేసి, ఎవరోలా మారడానికి ప్రయత్నిస్తాం. సైకాలజీలో దీన్నే 'Ideal Self Trap' అంటారు. ఇది ఒక మానసిక జబ్బు లాంటిది, ఇది మీ అసలైన వ్యక్తిత్వాన్ని (Real Personality) చంపేస్తుంది.1. Real Self vs. Ideal Self: అసలు గొడవ ఎక్కడ?కార్ల్ రోజర్స్ సిద్ధాంతం ప్రకారం, ప్రతి వ్యక్తిలో రెండు రూపాలు ఉంటాయి. ఒకటి మనం ప్రస్తుతం ఉన్న రూపం (Real Self), రెండోది మనం ఎలా ఉండాలని కోరుకుంటామో ఆ రూపం (Ideal Self).Real Self (నిజమైన నేను): ప్రస్తుతం మీరు ఎవరు? మీ బలాలు ఏంటి? మీ బలహీనతలు ఏంటి? మీ సహజమైన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది ఇది.Ideal Self (ఆదర్శవంతమైన నేను): మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సమాజం మిమ్మల్ని ఎలా చూడాలని మీరు ఆశపడుతున్నారు? అనేది ఇది.ఈ రెండింటి మధ్య దూరం పెరిగినప్పుడు మనిషిలో 'Anxiety' (ఆందోళన) మరియు 'Self-Hatred' (తన్ను తాను అసహ్యించుకోవడం) మొదలవుతాయి.ఉదాహరణకు, మీరు సహజంగా మితభాషి (Introvert) అనుకుందాం. కానీ మీరు ఒక పాపులర్ మోటివేషనల్ స్పీకర్ను చూసి, అతనిలాగా గలగలా మాట్లాడాలని (Extrovert) ప్రయత్నిస్తే.. మీరు మీ 'Real Self'ను మోసం చేస్తున్నట్లే. ఈ గ్యాప్ పెరిగే కొద్దీ మీ పర్సనాలిటీ విచ్ఛిన్నమవుతుంది.2. మార్కెట్ మోటివేషన్ ఎలా ట్రాప్ చేస్తుంది?పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు, motivation స్పీకర్లు ఈ 'Ideal Self' ట్రాప్ను క్యాష్ చేసుకుంటారు. "నువ్వు వారిలా తయారవ్వచ్చు, వీరిలా గెలవొచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే నువ్వు ఒక సూపర్ హ్యూమన్ అవుతావు" అని చెప్తారు. అంటే వారు మీకు ఒక 'అద్దె వ్యక్తిత్వాన్ని' (Borrowed Personality) అమ్ముతున్నారు.సైకాలజీ ఏం చెప్తుందంటే.. "నువ్వు ఎవరిలాగో అవ్వాల్సిన అవసరం లేదు. నీలోని ఉత్తమ వెర్షన్గా మారితే చాలు."వేరొకరిని కాపీ కొట్టడం అంటే మీ ఒరిజినాలిటీని ఖననం చేయడమే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా, మార్కెట్ ఇచ్చే 'సక్సెస్ టిప్స్' మిమ్మల్ని ఒక ఫేక్ పర్సనాలిటీగా మారుస్తాయి.3. ఎదుటివారిలా ఉండాలనుకోవడం 'జబ్బు' ఎందుకు?ఇది జబ్బు అని ఎందుకు అంటున్నానంటే, దీనివల్ల మూడు ప్రమాదాలు ఉన్నాయి:Constant Comparison (నిరంతర పోలిక): మీరు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ దగ్గర ఉన్నవి మీకు తక్కువగా అనిపిస్తాయి.Loss of Identity (గుర్తింపు కోల్పోవడం): మీకంటూ సొంత ఆలోచనలు ఉండవు. ఎదుటివారు దేన్ని సక్సెస్ అంటే దాన్నే మీరు కూడా సక్సెస్ అనుకుంటారు.Low Self-Esteem: మీరు 'Ideal Self'ను అందుకోలేనప్పుడు.. "నేను దేనికీ పనికిరాను" అనే భావన బలపడుతుంది.4. Real Personality Development: ట్రాప్ నుండి బయటపడటం ఎలా?Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, ఈ ట్రాప్ నుండి బయటపడి మీ లెగసీని ఎలా నిర్మించుకోవాలి?STEP 1: BREAK (ముసుగును తొలగించండి)ముందుగా మీరు ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో గుర్తించండి."నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నది నా అవసరం కోసమా? లేక పక్కింటి వ్యక్తిని చూసి గొప్పలు పోవడానికా?""నేను ఈ బట్టలు వేసుకుంటున్నది నాకు నచ్చిందా? లేక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడానికా?"ఈ విశ్లేషణ మీలోని 'ఫేక్ ఐడియల్ సెల్ఫ్'ని బ్రేక్ చేస్తుంది.STEP 2: BUILD (కంగ్రూయెన్స్ - ఏకీకరణ)మీ 'Real Self'కు మరియు 'Ideal Self'కు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి. అంటే, అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకోకుండా.. మీ సహజ సిద్ధమైన నైపుణ్యాలను (Natural Talents) పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.* మీరు మంచి రచయిత అయితే, బలవంతంగా స్పీకర్ అవ్వాలని ట్రై చేయకండి. మీ రైటింగ్లోనే మీ పర్సనాలిటీని బిల్డ్ చేయండి.* Self-Acceptance (నిన్ను నీవు అంగీకరించడం) లేనిదే వికాసం మొదలవ్వదు.STEP 3: BEYOND (అథెంటిసిటీ)ఒక్కసారి మీరు ఎదుటివారిలా ఉండాలనే తాపత్రయం వదిలేస్తే, మీలో ఒక వింతైన ధైర్యం వస్తుంది. అదే అథెంటిసిటీ (Authenticity). ప్రపంచం ఎప్పుడూ 'ఒరిజినల్'కే విలువ ఇస్తుంది, 'కాపీ'కి కాదు. మీరు మీలా ఉంటూనే ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే 'Beyond' స్టేజ్.5. మీ కోసం చిన్న పరీక్షఈ రోజు మీరు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి:నేను ఏ విషయంలో ఇతరులను చూసి అసూయ పడుతున్నాను? ఆ లక్షణం నిజంగా నా వ్యక్తిత్వానికి అవసరమా?నేను ఎవరి ముందైనా నటించకుండా ఉండగలుగుతున్నానా?నన్ను నేను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నది నా ఆనందం కోసమా? లేక లోకానికి నిరూపించుకోవడానికా?మీ సీటులో మీరు కూర్చోండి!బ్రో, ప్రపంచం ఒక పెద్ద నాటక రంగం అయితే, ఇక్కడ అందరూ హీరోలే అవ్వాలని చూస్తున్నారు. కానీ నిజమైన సక్సెస్ ఎక్కడ ఉందంటే.. మీకు కేటాయించిన పాత్రను (మీ రియల్ సెల్ఫ్) అద్భుతంగా పండించడంలోనే ఉంది.ఎదుటివారిలా ఉండాలనుకోవడం ఒక జబ్బు అయితే, దానికి మందు "మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం". మీలోని లోపాలను కూడా గౌరవించండి, అవే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి."Be a first-rate version of yourself, instead of a second-rate version of somebody else."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?) -
ఖర్చులకు కళ్లెం వేద్దాం!
ఒకప్పుడు విలాసం అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాలైపోయాయి. స్మార్ట్ఫోన్లు, కార్లు, లాప్టాప్లు, ఏటా ఒకటిరెండు సార్లు వైద్య పరీక్షలు, విహార యాత్రలు... ఇవన్నీ ఇపుడు జీవితంలో భాగమైపోయాయి. ఇక కొంచెం ఆదాయం పెరిగిందంటే వీటన్నిట్లోనూ ‘బెటర్మెంట్’ తప్పదనిపిస్తుంది. మెరుగైన ఫోన్లు, ఆధునిక ల్యాప్టాప్లు, సురక్షితమైన కార్లు, నాణ్యమైన చదువు, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ సబ్స్క్రిప్షన్లు, విదేశీ విహారాలు ఇవన్నీ అప్గ్రేడెడ్ వెర్షన్లతో అవసరాలుగా మారి మనముందు కూర్చుంటున్నాయి. ఆదాయం పెరిగినప్పుడు సరే!!. కానీ ఆదాయం తక్కువ ఉన్నా కూడా వీటికోసం పరుగులుపెట్టి ఖర్చులు చేస్తేనే సమస్య. ఈ సమస్య ఇపుడు పెరుగుతోంది. పెద్దదవుతోంది. కుటుంబాలను ఒత్తిడిలోకి నెడుతోంది. మరేం చేయాలి? ఇదిగో ఈ వెల్త్ స్టోరీ చూడండి...మనకు, మన ఆదాయానికి తగ్గట్లుగా జీవన శైలిని పెంచుకోవటం తప్పు కాదు. కానీ పరిమితు లు లేకుండా పెంచుకుంటూ పోతేనే సమస్య. అందుకే లైఫ్స్టయిల్ను తెలివిగా నియంత్రించుకోవటం తప్పనిసరి. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటం... అవసరాలను స్పష్టంగా వర్గీకరించుకోవటం... స్వీయ పరిమితులు విధించుకోవటం ఎలాగో చూద్దాం. ద్రవ్యోల్బణం.. సైలెంట్ కిల్లర్ ఆదాయం పెరుగుతున్నప్పుడు లైఫ్స్టయిల్పరమైన ద్రవ్యోల్బణం పెరుగుతుంటుంది. ఖర్చు చేయడమనేది నిశ్శబ్దంగా, చాలా వేగంగా పెరిగిపోతుంది. జీతం పెరగ్గానే ఆటోమేటిక్గా పెంచుకునేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే.. → మరింత పెద్ద ఇల్లు, మరింత ఎక్కువ అద్దె → కారును అప్గ్రేడ్ చేసుకోవడం లేదా ఈఎంఐలపై గ్యాడ్జెట్లు కొనుగోలు చేయటం. → మరింత తరచుగా బయట తినటం, ఫుడ్ డెలివరీ సరీ్వసులను ఆశ్రయించటం. → జిమ్తో పాటు అనేక ఓటీటీలు, యాప్లు సబ్స్క్రయిబ్ చెయ్యటం. వాస్తవానికి వీటిని విడివిడిగా చూస్తే ఒక్కో దానిపై చేసే ఖర్చు సముచితమైనదిగానే అనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ కలిపి చూస్తే మాత్రం మనకు తెలియకుండానే పొదుపు సామర్థ్యం తగ్గిపోతున్న విషయం అర్థమవుతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగానే సంపాదిస్తున్నప్పటికీ చాలా కుటుంబాలు, తక్కువగా పొదుపు చేస్తుండటానికి ప్రధాన కారణం ఇదే. ‘అవసర ఖర్చుల’ భ్రమ .. అవసరమనే పేరుతో ఇప్పుడు చేసే చాలా మటుకు ఖర్చులు, నిజంగా అవసరమైనవేనా అంటే సరైన సమాధానం దొరకదు. ఉదాహరణకు స్మార్ట్ఫోన్ అనేది అవసరం. కానీ ప్రతి సంవత్సరం వేలకు వేలు పోసి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం అవసరమేనా? అలాగే అప్పుడప్పుడు బయట హోటళ్లలో తినడం సాధారణమే. కానీ అది ఎంత తరచుగా జరుగుతోందనేది ముఖ్యం. విహారయాత్రలు ము ఖ్యమే. కానీ ఎంత తరచుగా వెళ్తున్నాం? ఎంత ఖర్చు పెడుతున్నాం? అనేది అత్యంత ప్రధానం. ఖర్చులనేవి సమస్య కాదు. హద్దులు లేకపోవడమే అసలు సవాలు. ఏం చేయాలంటే.. జీవన విధానానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఖర్చులను అదుపు చేసుకునేందుకు కొన్ని మార్గాలు ఉంటాయి. అవేంటంటే.. → పరిమితి విధించుకోవడం జీవన వ్యయాలనేవి ఆదాయానికి మించిన వేగంతో పెరగకూడదు. పాటించాల్సిన సింపుల్ రూల్ ఏమిటంటే, ఆదాయం 10 శాతం పెరిగితే, లైఫ్స్టయిల్ ఖర్చులు 5–6 శాతానికి మించి పెరగకుండా చూసుకోవాలి. → పొదుపును ఆటోమేట్ చేయాలి ఖర్చు చేయడానికి ముందు పొదుపు చేయాలి. దీనితో లైఫ్స్టయిల్ ఖర్చులు ఆటోమేటిక్గా దానికి తగ్గట్లు సర్దుకుంటాయి. → ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ ఇల్లు, కారు, గ్యాడ్జెట్లు ఇలాంటి వాటన్నింటినీ ఒకేసారి అప్గ్రేడ్ చేయడం పెట్టుకోవద్దు. ఒక్కొక్కటిగా చేసుకుంటే కాస్త వెసులుబాటు లభిస్తుంది. → సబ్్రస్కిప్షన్లను సరిచూసుకోవాలి.. ఉపయోగించని వాటిని క్యాన్సిల్ చేసేయాలి. దీనివల్ల గణనీయంగా ఆదా అవుతుంది. మూడు కేటగిరీలు.. వృధా ఎక్కడవుతోందో గ్రహించాలంటే మనం చేసే ఖర్చులను తప్పనిసరైనవి, లైఫ్స్టయిల్ని బట్టి ఉండేవి, లీకేజీలనే మూడు కేటగిరీల కింద విడగొట్టుకోవాలి. వాటిని ఒకసారి విశ్లేషించి చూసుకుంటే, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ కట్టడి చేసుకోవాలనే దానిపై అవగాహన వస్తుంది. లైఫ్స్టయిల్ని బట్టి సరిదిద్దుకునేవి కాస్త స్మార్ట్గా వ్యవహరిస్తే ఈ కింది వాటిని కొంత కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. → బయట హోటళ్లలో తినడం → విహార యాత్రలు → సబ్స్క్రిప్షన్లు→ అప్గ్రేడెడ్ గ్యాడ్జెట్లు → తరచుగా వాహనాలను అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండటంతప్పనిసరైన ఖర్చులు ఇలాంటివి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటి విషయంలో రాజీపడే పరిస్థితి ఉండదు. → విద్య → ఆరోగ్య సంరక్షణ → ప్రాథమిక హౌసింగ్ → బీమా → నిత్యావసరాలులీకేజీలు అదనంగా ఎలాంటి ప్రయోజనం లభించకుండా చేసే ఖర్చులు ఈ బకెట్ కిందికి వస్తాయి. → ఉపయోగించని సబ్స్క్రిప్షన్లు, అడ్డదిడ్డంగా ఆన్లైన్లో షాపింగ్ → క్రెడిట్ కార్డ్ బాకీలను రోలోవర్ చేస్తుండటం. → ఖర్చు చేస్తున్నామని గ్రహించకుండానే కన్వీనియెంట్గా చేసే వ్యయాలురియాలిటీ చెక్ లైఫ్స్టయిల్కి సంబంధించి అప్గ్రేడ్స్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కోరుకున్నట్లుగా, బాగా జీవించాలనుకోవడమేమీ తప్పిదం కూడా కాదు. కాకపోతే, అడ్డూ అదుపూ లేకుండా లైఫ్స్టయిల్ ఖర్చులను పెంచుకోవడమే తప్పు. రేపటి రోజున వచ్చే ఆదాయాన్ని నేడే ఖర్చు చేసేయకుండా జాగ్రత్తపడితేనే ఆర్థికంగా నిశ్చింతగా ఉంటుంది. ఇందుకోసం ఆదాయంలో ఖర్చులకు చేసే కేటాయింపుల విషయంలో పాటించతగిన సింపుల్ సూత్రం ఒకటి ఉంది. → 50%– తప్పనిసరి అవసరాలు → 30% – లైఫ్స్టయిల్, కోరికలు → 20% – పొదుపు, పెట్టుబడులు. లైఫ్స్టయిల్ ఖర్చులు 40 శాతాన్ని దాటాయంటే, పొదుపు కేటాయింపులు ఆటోమేటిక్గా పడిపోతాయి. -
డెంటల్ యాబ్సెస్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
ఎప్పుడైనా మీ పంటిచిగురు దగ్గర తెల్లగా... చిన్న ఉండలాంటి సంచిలో కాస్త చీము నిండినట్టుగా చిన్న తిత్తి మాదిరిగా కనిపించిందా? కొద్దిగా వాచినట్టుగా, నొప్పిగా, బాధగా ఏదో చిగుర్లకు వచ్చిన సమస్యగా అనిపించిందా? దాన్ని ‘డెంటల్ యాబ్సెస్’ అంటారు. అంటే నోటి పుండు. ఒక్కసారి అది బాగా పొడుస్తున్నట్టుగా తీవ్రమైన నొప్పి రావచ్చు. జ్వరం కూడా కనిపించవచ్చు. కారణం అదో బ్యాక్టీరియల్ సమస్య. ఈ డెంటల్ యాబ్సెస్ అంటే ఏమిటీ, అదెందుకు వస్తుంది, చికిత్స ఏమిటన్న అనేక విషయాలను తెలుసుకుందాం...పంటి చిగురుకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్నిండా చీము చేరడం వల్ల వచ్చే సమస్యే ‘పంటి యాబ్సెస్’. నిజానికి పంటిచిగురు దగ్గర చీము చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తెల్లరక్తకణాలు రంగంలోకి దిగడం తెలిసిందే. ఇలా యుద్ధానికి సన్నద్ధమైన ఈ తెల్లరక్తకణాలు... బ్యాక్టీరియాతో జరిగిన పోరాటంలో నశించాక... ఆ తెల్లరక్తకణాల తాలూకు మృతకణాలన్నీ చీము రూపంలో అక్కడ ఓ తిత్తి (పాకెట్)లాగా ఉండి΄ోతాయి. దాంతో నోరు తెరచి చూసుకున్నప్పుడు ఓ తెల్లటి చీము ఉండ కనిపిస్తుంది.తగ్గినట్టు ఉన్నా ఉపేక్షించడం సరికాదు... పంటి చిగురు దగ్గర కనిపించిన ఆ ఇన్ఫెక్షన్ చిగురుకు పాకే అవకాశముంది. అంతేకాదు... అది పంటిని వదులు చేసేందుకూ ఛాన్స్ ఉంది. ఒక్కోసారి ఆ గడ్డ చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి కాస్తా అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. మొదట ఉన్న తీవ్రమైన నొప్పి అకస్మాత్తుగా లేకుండా పోయి, నొప్పి లేదంటే సమస్య తగ్గిపోయిందని కాదు. సాధారణంగా డెంటల్ యాబ్సెస్ అన్నది దానంతట తగ్గి΄ోవడం కాస్త అరుదే. అందుకే అలా పంటి చిరుగురు ప్రాంతంలో తెల్లటి చీము ఉండ కనిపించిందంటే తప్పక చికిత్స తీసుకోవడం అవసరం. ఇతర అవయవాలకూ పాకవచ్చుడెంటల్ యాబ్సెస్కు తగిన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఒక్కోసారి ఆ సూక్ష్మజీవులు రక్తప్రవాహంలో కలిసి ఇతరచోట్లకూ పాకే అవకాశముంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ దవడకూ, తలకూ, మెడకు కూడా పాకితే ఆ ప్రాంతాల్లోనూ తీవ్రమైన నొప్పి రావచ్చు. ఒక్కోసారి భరించలేనంత నొప్పిగా కూడా ఉండవచ్చు. లక్షణాలుసాధారణంగా నోట్లో పేరుకు΄ోయే బ్యాక్టీరియా సంఖ్య చాలా ఎక్కువ. దీన్నే ఓరల్ బ్యాక్టీరియా, ఓరో–ఫ్యారింజియల్ బ్యాక్టీరియా అంటారు. వీటిలో చాలావరకు నిరపాయకరమైనవే ఎక్కువ. అయితే హానికరమైన బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నోరు బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదంచేసే భాగం అయినందున అవి వేగంగా పెరుగుతాయి. పలువరసలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే అక్కడ బ్యాక్టీరియా విస్తరించేందుకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దాంతో చీముగడ్డ (పస్ పాకెట్) ఏర్పడటంతో మరికొన్ని లక్షణాలూ కనిపిస్తుంటాయి. అవి... ∙ మాటిమాటికీ పొడిచినట్లుగా తీవ్రమైన నొప్పి ∙ చల్లటి లేదా వేడి ప్రదార్థాలు తీసుకున్నప్పుడు జిల్లుమనడం. ∙ఏదైనా వస్తువు నమలగానే పొడుచుకువచ్చినట్టుగా నొప్పి కలగడం. గొంతులోని గ్రంథులు వాచడం. నోటిలో దుర్వాసన వస్తున్న భావన లేదా దుర్వాసన రావడం. ఏదైనా తినేపదార్థం నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపించడం. (ఇలా అనిపిస్తుందంటే అది చీముగడ్డ పగిలినందుకు సూచన. అయితే అప్పటికీ ఇన్ఫెక్షన్ మాత్రం శరీరంలోనే ఉంటుంది. కాబట్టి అది శరీరంలోని ఇతర ప్రాంతాలకు పాకే అవకాశమున్నందున... అలా జరగడం మరింత ప్రమాదానికి దారితీసే ముప్పున్నందున... తప్పనిసరిగా డెంటల్ డాక్టర్ను కలిసి తగిన సూచనలూ, చికిత్స తీసుకోవాలి. నివారణప్రతిరోజూ క్రమంతప్పకుండా ఉదయం, రాత్రి బ్రషింగ్ చేసుకోవడం. ∙బ్రషింగ్ కోసం మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్నే వాడంటం. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు గుండ్రంగా బ్రష్ చేసుకోవడం. పంటికి బయటివైపే కాకుండా లోపలి వైపునా బ్రష్ చేసుకోవడంతో పాటు నమిలే ప్రదేశాలల్లో... అంటే పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ చక్కగా బ్రష్ చేసుకోవడం. బ్రషింగ్ టైమ్ రెండు లేదా మూడు నిమిషాలకు మించకుండా చూసుకోవడం. నాలుకపైనున్న బక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేసుకోవడం. చిగుర్ల ఆరోగ్యం కోసం బ్రషింగ్ తర్వాత చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసుకోవడం. ప్రతి ఆర్నెల్లకోసారి క్రమంతప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం. చికిత్సపంటి యాబ్సెస్కు డాక్టర్లు సాధారణ యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తారు. మరీఅవసరమైన వారికి ఆ చీముపాకెట్ను తొలగించడంతోటు రూట్కెనాల్ అవసరం పడవచ్చు. డాక్టర్ ప్రత్యూష, సీనియర్ కన్సల్టెంట్ డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ (చదవండి: అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!) -
అతనంటే విపరీతమైన క్రష్!
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అమాయకపు ఆకాంక్షగా, ‘సరైనోడు’లో పవర్ఫుల్ ఎమ్మెల్యేగా మనల్ని మెప్పించిన ఈ మలయాళ కుట్టి, తన వ్యక్తిగత జీవితం, కెరీర్ రహస్యాలను ఇప్పుడు మనతో పంచుకుంటోంది క్యాథరిన్ ట్రెసా. ఆ విశేషాలు...⇒ చిన్నప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అంటే విపరీతమైన క్రష్. ఆయన టీవీలో కనిపిస్తేనే అన్నం తినేదాన్నని అమ్మ ఇప్పటికీ ఆటపట్టిస్తుంది. అలా ఎందుకు చేసేదాన్నో ఇప్పటికీ నాకు మిస్టరీనే.⇒ నేను మలయాళీ క్రిస్టియన్ . పుట్టి పెరిగింది దుబాయ్లో. కాలేజీ రోజుల్లో బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాను. అక్కడే నా మోడలింగ్ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కన్నడ సినిమా ‘శంకర్ ఐపీఎస్’ అవకాశం నా కెరీర్కు కొత్త మలుపును ఇచ్చింది.⇒ సినిమాల్లోకి రాకముందు నేను ప్రొఫెషనల్ స్థాయిలో ఐస్ స్కేటింగ్ చేసేదాన్ని. మంచు మీద వేగంగా బ్యాలెన్ ్స చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ వెకేషన్ కు వెళ్తే స్కేటింగ్ షూస్ నా బకెట్లిస్ట్లో తప్పకుండా ఉంటాయి.⇒ సంగీతం నాకు మెడిటేషన్ లాంటిది. మనసు బాగాలేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పియానో వాయిస్తాను. నేను క్వాలిఫైడ్ పియానిస్ట్ని.⇒ తెలుగులో ‘చమ్మక్ చల్లో’తో ఎంట్రీ ఇచ్చాను. కాని, నిజమైన బ్రేక్ ఇచ్చింది ‘ఇద్దరమ్మాయిలతో’. ‘సరైనోడు’లో ఎమ్మెల్యే పాత్ర నా ఆల్టైమ్ ఫేవరెట్.⇒ కేరళలో ఒక సినిమా షూటింగ్ సమయంలో నేను ఏనుగుపై నుంచి కింద పడిపోయాను. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అప్పటి నుంచి ఏనుగులంటే ప్రేమ ఉన్నా, వాటి దగ్గరికి వెళ్లాలంటే భయం.⇒ ఒక గంట ఖాళీ దొరికినా బిజినెస్ మ్యాగజైన్స్ చదువుతాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సక్సెస్ఫుల్ బిజినెస్ వుమన్ గా మారేదాన్ని. నా ఆర్థిక నిర్ణయాలు అన్నీ నేనే తీసుకుంటాను.⇒ పాత ఫొటోలను ఆల్బమ్స్గా చేసి దాచుకోవడం నా అలవాటు. డిజిటల్ యుగంలో ఉన్నా, ప్రింట్ ఫొటోలే నా సెంటిమెంట్.⇒ నా జీవితంలో అతిపెద్ద బాధ నా తమ్ముడు క్రిస్టోఫర్ మరణం. ఎనిమిదేళ్ల క్రితం తను సూసైడ్ చేసుకున్నాడు. ఆ లోటు తీరనిది.⇒ స్వీట్స్ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా తాపేశ్వరం మడతకాజా, మైసూర్ పాక్. అలాగే ‘లిక్విడ్ డైట్’ మీద నాకు మంచి కంట్రోల్ ఉంది. బాడీని డీటాక్స్ చేయడానికి వారంలో ఒకరోజు కేవలం కొబ్బరి నీళ్లు, గ్రీన్ జ్యూస్లతోనే ఉంటాను. అదే నా గ్లామర్ రహస్యం.⇒ నా డ్రీమ్ మ్యాన్ పొడవుగా, ఫిట్గా ఉండాలి. ముఖ్యంగా మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి.⇒ గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకుంటాను. అందుకే అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంది. నా కెరీర్లో ఇంకా మంచి కామెడీ సినిమాలు చేయాలని ఉంది. -
సోలో లైఫే సో బెటరూ
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి వరకు కూడా ఈ లోకం అంతా ‘జంట’లమయమే! హోటల్ కువెళ్తే ఎదురెదురుగా రెండు కుర్చీలు, ట్రావెల్ ప్యాకేజీలంటే తప్పనిసరిగా కపుల్ ఆఫర్లు, వీకెండ్స్ అంటే ఫ్యామిలీ హడావిడి. కానీ ఈ ‘నిండైన’ దృశ్యం మెల్లిగా మార్పు చెందుతోంది. ఎక్కడ చూసినా సోలో ‘రాజా సాబ్’లు, ఏకాంతవాస రాణీ రత్నమాలలు దర్శనం ఇవ్వటం మామూలైపోయింది.సింగిల్ రిజర్వేషన్రెస్టారెంట్లలో సింగిల్ టేబుల్ రిజర్వేషన్తో మొదలైన ఈ ధోరణి, ఎవరో తోడు లేని వారు చేస్తున్న పని కాదు. ఎవరి తోడూ అవసరం లేదని అనుకుంటున్న వారు ఎంచుకుంటున్న మార్గం. మునుపటిలా, ‘‘ఎవరైనా కలిసి వస్తే వెళ్దాంలే..’’ అని వేచి ఉండే రోజులు పోయాయి! ఇప్పుడు తినటానికైనా ఒక్కరే,విహరించటానికైనా ఒక్కరే.ఎవరూ లేక కాదుఇదేమీ ఒంటరితనం కాదు. ఒక స్వీయ చికిత్స. తనకి నచ్చినట్టు తాను ఉండటం మాత్రమే. ఎవరితోనూ సంబంధం ఉండదు. ఎవరితోనూ సర్దుబాటు ఉండదు. తనకు నచ్చిన దారి, తనకు నచ్చిన వేగం, తనకు నచ్చిన స్థలం! సింపుల్గా చెప్పాలంటే ఇదొక స్వేచ్ఛ.వింత అసలే కాదుభోజనం, ప్రయాణం, వినోదం.. ఇప్పుడు సోలో జీవన శైలికి సంకేతంగా మారింది. లైవ్ ఈవెంట్లకు ఒక్కరే వెళ్లేవారు ఎక్కువయ్యారు. ఉదయ్పూర్, కూర్గ్, సిక్కిం వంటి సురక్షిత మైన ప్రాంతాలకు మహిళలు ఒంటరి ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. డిమ్ లైట్ల డైనింగ్ హాళ్లలో టేబుల్కు ఒకరే కూర్చొని భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది ఖర్చు తగ్గించుకోవటం కాదు, ఎంతైనా ఖర్చుపెట్టి ఏకాంతాన్ని కొనుక్కోవటం.మార్కెట్ పసిగట్టేసింది!ఇదేదో చిన్న మార్పు కాదని బిజినెస్ లోకానికి అర్థమైపోయింది. రాబోయే కాలంలో సమాజాన్ని ముంచెత్తనున్న ఒక పెద్ద ‘వేవ్’ అని కనిపెట్టేసింది. ఇకనేం, కంపెనీల ఆలోచనా విధానమే మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ‘ఫ్యామిలీ’ చుట్టూ తిరిగిన మార్కెట్ ఇప్పుడు లైట్ హౌస్లా తన ఫోకస్ను ఒంటరి కెరటాల మీదకు మళ్లించింది.ఇండియాలో ‘ఒంటరి’ డేటా⇒ 2020నాటికి ఉన్న ఒంటరి వ్యక్తుల గృహాల సంఖ్య 1 కోటి 74 లక్షలు⇒ 2030కి ఒంటరి గృహాల సంఖ్యలో అంచనా పెరుగుదల 5.5 శాతం⇒ సోలో దేశీయ ప్రయాణాల బుకింగ్లలో పెరుగుదల : ఏటా 20–35 శాతం⇒ గత ఏడాది ఒంటరిగా ఈవెంట్లకు, సినిమాలకు వెళ్లినవారు : 18 లక్షలకు పైగా⇒ 2025–2030 మధ్య పెరగనున్న సోలో ట్రావెల్ మార్కెట్ విలువ సుమారు : రూ. 359 కోట్ల 36 లక్షల 50 వేలు -
అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!
మహమ్మారి కేన్సర్ ఎంతటి బలవంతుడినైన బలహీనుడిగా మార్చేస్తుంది. అంతలా మానసికంగా, శారీరకంగా ఢీలా పడేలా చేసే వ్యాధిని..19 ఏళ్ల అమ్మాయి అలుపెరగని పోరాటం చేసి..మట్టికరిపించింది. ఎందరో కేన్సర్ బాధితులకు స్ఫూర్తిగా నిలవడమే గాక..ప్లీజ్ పోరాడండి అని ధైర్యం చెబుతోంది. యువ కేన్సర్ వారియర్ అని అందరిచేత ప్రశంసలందుకుంటోంది. ఆ అమ్మాయే 19 ఏళ్ల లకితా ఫిద్రా..కెన్యాకు చెందిన ఆమెకు ఐదేళ్ల వయసులో ఉండగా తండ్రి కేన్సర్తో మరణించాడు. ఒంటరి తల్లి పెంపకంలో సాగుతున్న ఆమె జీవితం సరిగ్గా పదేళ్ల వయసులో ఊహించని మలుపు తిరిగింది. ఒకరోజు ఆటలు ఆడుకుంటుండగా, సడెన్గా కుడిమోకాలులో విపరీతమైన నొప్పి..అల్లాడిపోతోంది. తీరా వైద్యుల వద్దకు తీసుకువెళ్తే..వాళ్లు నార్మల్ సమస్యగానే భావించి చికిత్స అందిస్తున్నారు. ఎప్పుడైతే ఆమె కుటుంబ చరిత్రలో తండ్రి అత్త సార్కోమా కేన్సర్ బాధితులని తెలిసిందో..వెంటనే అనుమానంతో డాక్లర్లు వైద్య పరీక్షలు చేయగా..తీవ్రమైన ఆస్టియోసార్కోమా కేన్సర్ నిర్థారణ అయ్యింది. స్కానింగ్లో ఆమె కుడి తొడ ఎముకలో ఈ కేన్సర్ కణితిని గుర్తించారు. దాంతో వైద్యులు కీమోథెరపీ చేయించి, లింబ్ సాల్వేజ్ సర్జరీ చేశారు. ఈ ప్రక్రియలో మోకాలి కీలును టైటానియం ఇంప్లాంట్తో భర్తీ చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు హాయిగా స్కూల్కి వెళ్లి..యథావిధిగా చదువుకోడం ప్రారంభించింది. మళ్లీ ఆ మహమ్మారి 2020లో దాడి చేసింది. ఈసారి ఆమె కాలుని పూర్తిగా తొలగించక తప్పలేదు. అదే ఏడాది అదనపు కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి జరిగాయి. ఆమె సొంత స్టెమ్ సెల్స్ ఉపయోగించి మొట్టమొదిటి మార్పిడి చేశారు. దాదాపు వందరోజులపైనే ఆస్ప్రత్రిలో చికిత్స పొందింది. అక్కడితో ఆ కేన్సర్ విజృంభణ ఆగలేదు. ముచ్చటగా మూడోసారి 2022లో, ఆమెకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అభివృద్ధి చెందింది. ఇది అతి తీవ్రమైన ఎముక మజ్జ రుగ్మత.ఇది మళ్లీ దాడిచేసే అరుదైన కేన్సర్వ్యాధి. అయితే ఈసారి ఆమెకు అండగా తల్లి నిలబడింది. తల్లి ఎముకమజ్జ మార్పిడితో లకితాకి చికిత్స అందించారు. ఈప్రక్రియ విజయవంతమైంది. ఇక్కడ లకితా మూడోసారి ఎదుర్కొన్న తీవ్రమైన ఎముకమజ్జ మార్పడి..బహుళ కేన్సర్లకు దారితీసే జీవితకాల ప్రమాదం. కానీ ఆమె జన్యువులు దూకుడు లేకుండా చికిత్సా వ్యూహానికి అనుమతించి..తగ్గుముఖం పట్టడం విశేషం. అయితే ఆమెకు సదా వైద్యు పర్యవేక్షణ తప్పనిసరి. కనీసం రెండు మూడేళ్ల కొకసారి కేన్సర్ పరీక్షలు చేయిచుకోక తప్పదు. ఇన్ని కష్టాల మధ్య చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె ఇప్పుడు సైకాలజీ, సామాజిక శాస్త్రం, సాహిత్యం ఏ లెవెల్ను చదువుతోంది. పైగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉంది. తాను పరుగెత్తలేకపోయినా, జిమ్నాస్టిక్స్ చేయలేకపోతేనేం..డ్యాన్స్ చేయగలను, పేయింటింగ్ వేయగలను అంటోంది. పునరావృతమయ్యే బోన్ కేన్సర్, లి-ఫ్రామిని సిండ్రోమ్పై ధైర్యంగా పోరాడిని ధీరురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కేన్సర్ బాధితుల్లో స్థైర్యాన్ని నింపేలా గొప్ప సందేశాన్ని కూడా అందిస్తుంటుంది. మీరు కేన్సర్ రోగిగా ఆస్పత్రల్లో గడపడం కష్టమే అయినపపటికీ తెలియన ధైర్యంతో సాగుతారు. ఆ వ్యాధని చూసి భయపడినప్పటికీ స్ట్రాంగ్గా మారతారు. అప్పుడు తెలుస్తుంది మీరు రోగి కాదు..హీరో అనే సందేశాలతో వాళ్లను వీరోచితంగా కేన్సర్పై పోరాడేలా చేస్తుంది లకితా. (చదవండి: నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!) -
గుండెపోటు మరోసారి రాకూడదంటే..!
గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా. అందువల్ల గుండె పోటు నుంచి బయటపడ్డ రోగులు..మరోసారి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..తీసుకోవాల్సిన జాగ్రత్తలు..కొద్ది మోతాదులో వ్యాయామాలు చేయడంవేళకు భోజనం చేయాలిఅధిక కేలరీలు, కొలస్ట్రాల్తో కూడిన భోజనం నివారించాలి.డైట్ ఎలా ఉండాలంటే..1. తృణధాన్యాలు - ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్లు, గోధుమలు తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.2. తాజా కూరగాయలు, పండ్లు - ఆకుకూరలు, టమోటాలు, క్యారెట్లు, బెర్రీలు, ఆపిల్స్, సిట్రస్ పండ్లు తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గిస్తాయి ధమనుల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.3. ఆరోగ్యకరమైన కొవ్వులు మితంగా - నట్స్, ఆలివ్ నూనె, ఆవాల నూనె, కొద్ది మొత్తంలో తీసుకోవాలి. ఇవి మంచి HDL కొలెస్ట్రాల్ను అందించి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తాయి. 4. ప్రోటీన్ కంటెంట్ కోసం - పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, టోఫు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు, చేపలు, స్కిన్లెస్ చికెన్. సాల్మన్ వంటి కొవ్వు చేపలు గుండెకు రక్షణ కల్పించే ఒమేగా-3 కొవ్వులను అందిస్తాయి.5. ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి.రోగులు ఖచ్చితంగా నివారించాల్సినవి..1. అధిక ఉప్పు: ప్యాక్ చేసిన స్నాక్ ఫుడ్స్, ఊరగాయలు, పాపడ్లు, సాస్లు, తినడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు తదితరాలు సోడియం ప్రధానంగా ఉండే ఆహారాలు. ఇవి రక్తపోటును పెంచి, గుండెపై భారం పడేలా చేస్తాయి.2. డీప్-ఫ్రైడ్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్స్, నామ్కీన్లు, వేయించిన రుచికరమైన స్నాక్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి.3. శుద్ధి చేసిన చక్కెరలు, చక్కెర పానీయాలు - స్వీట్లు, డెజర్ట్లు, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్లు, తదితరాలు అధిక బరువుకి, గుండె జబ్బులకు కారణమవుతాయి.4. మటన్ వంటి ఎర్రటి మాంసం వినియోగాన్ని తగ్గించాలి5. ఆల్కహాల్ - మద్యం వినియోగాన్ని నివారించాలి లేదా పరిమితం చేయాలి. ఆల్కహాల్ రక్తపోటును పెంచుతుంది,పైగా గుండెకు నేరుగా విషపూరితమైనది కూడా.గుండె ఆరోగ్యం బాగుండాలంటే..కొద్దిపాటి వ్యాయామాలు, మందులు, ఒత్తిడి నిర్వహణ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు.డాక్టర్ గిరీష్ గాడ్బోల్, డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్,ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ -
ఆ తాతగారి లైఫ్స్టైల్కి ఫిదా అవ్వాల్సిందే..!
ఇటీవలకాలంలో అందరిలో ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. మంచి ఆహారపు అలవాట్లు,వర్కౌట్లతో హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు ప్రోటీన్ పౌడర్లు, జిమ్లు వంటి వాటితో ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఈ తాత అంతలా ఆరోగ్యం కోసం ఏమాత్రం ఖర్చు చేయకుండానే..చాలా చురుకుగా, దీర్ఘాయువుతో ఉండటం విశేషం. ఈ ఏజ్లో కూడా అన్ని పనులు తానే చాలా యాక్టివ్గా చేసుకుంటున్న తీరుకి ఫిదా అవ్వాల్సిందే. మరి అతడి ఆరోగ్య రహస్యం ఏంటో చూద్దామా..ఆ తాత గారి గురించి ఆయన మనవరాలు కంటెంట్ క్రియేటర్ 28 ఏళ్ల సింధూ ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో పోస్ట్ చేయడంతో అది నెట్టింట సంచలనంగా మారడమే కాదు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తన తాతగారికి దగ్గర దగ్గర 95 ఏళ్ల ఉంటాయని, ఆయన రిటైర్డ్ అనస్థీషియాలజిస్ట్ అని వీడియోలో వివరిస్తోంది సింధు. ఆమె తన తాతగారి రోజు ఉదయం 5.30 గంటలకు యోగాతో ప్రారంభమవుతుందని, పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలకు పైనే అవుతున్నా..ల్యాప్టాప్లో వైద్య సాహిత్యం గురించి చదవడం, కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. వీటి అన్నింటి తోపాటు అప్పుడప్పుడు షాపింగ్ ట్రిప్పులు, రోజువారీ పూజ, ధ్యానం, యాప్లు లేకుండా సాధన చేయడం తదితరాలు ఉన్నాయి. ఇవేగాక తన వంటను తానే చేసుకుంటారని, "మినీ ఇడ్లీలు" వండటంలో మంచి నిపుణుడని చమత్కరిస్తోంది. ఆయన రిటైర్ అయ్యాక కూడా వైద్యవృత్తిపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ వాటికి సంబంధించినవి చదవడం, ఆర్టికల్స్ రాయడం వంటివి చేస్తుంటారని చెబుతోంది. ఆయన తమిళనాడులోని మధురైలో చాలా ఏళ్లుగా అనస్థీషియాలజిస్ట్గా పనిచేసినట్లు పేర్కొంది. తన తాతగారి రోజువారీ దినచర్య దీర్ఘకాల ఆరోగ్యానికి ఖరీదైన ధోరణులతో పనిలేదని నిరూపించింది. ఇప్పటికీ ఆయన హ్యాపీగా వాక్ చేస్తారు, వంటకూడా చేసుకుంటారు, కొత్తకొత్త నైపుణ్యాలను నేర్చుకుంటుంటారు. పైగా ఆయన ఎలాంటి జిమ్ సభ్యుత్వం లేకుండా, కనీసం సప్లిమెంట్లపై ఆధారపడకుండా.. జస్ట్ శ్రద్ధ అనే రెండు అక్షరాల పదంపై ఫోకస్ పెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడని సింధు చెపుకొచ్చింది. దక్షిణాసియా హిందూ సంప్రదాయల్లో వందల ఏళ్ల నుంచి రోజువారీ కదలికలు, భావోద్వేగాలపై నియంత్రణ, మానసిక స్పష్టత తదితరాలు ఉన్నాయి. అయితే వాటిని కంటిన్యూ చేసేలా జీవన విధానంలో భాగమైతే తన తాతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితాన్ని గడపొచ్చని అంటోంది. చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే మనస్తత్వం ఉన్నవారికి ఎదురే ఉండదని, అది వారికి బలోపేతంగా ఉండేలా సామర్థ్యాన్ని అందిస్తుందని అంటోంది. View this post on Instagram A post shared by Sindhu 👩🏽🍳 (@sindhusfoodforthought) (చదవండి: అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్!) -
మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ..
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, కోటు వేసుకున్న ఒక వ్యక్తి స్టేజ్ మీద అరుస్తూ, "నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు", "నీలో ఒక సింహం ఉంది", "ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి నేను తోపు అని చెప్పుకో" అంటూ డైలాగులు కొడుతుంటారు. వీటిని చూసి జనం ఇన్స్టంట్గా ఉత్తేజానికి లోనవుతారు. కానీ, ఆ వీడియో ముగిసిన అరగంటకే మళ్ళీ పాత భయాలు, పాత బలహీనతలు చుట్టుముడతాయి.ఎందుకు?ఎందుకంటే, మార్కెట్ అమ్ముతున్నది 'మోటివేషనల్ డ్రగ్'. కానీ మనకు కావాల్సింది రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్.మోటివేషన్ అనేది ఒక కప్పు కాఫీ లాంటిది. తాగినప్పుడు కిక్ ఇస్తుంది, ఆ తర్వాత నీరసం వచ్చేస్తుంది. కానీ వ్యక్తిత్వ వికాసం అనేది మన మనసులోని సాఫ్ట్వేర్ను రీ-రైట్ చేసే ఒక సుదీర్ఘ ప్రక్రియ.సో-కాల్డ్ ట్రైనర్స్ చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే... అందరికీ ఒకే మందు (One size fits all) ఇవ్వాలని చూడటం."ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. నెగటివిటీని దరిచేరనీయకండి. అన్నీ మంచివే జరుగుతాయని నమ్మండి" అని చెప్తారు సో-కాల్డ్ ట్రైనర్స్. దీన్ని సైకాలజీలో 'Toxic Positivity' అంటారు.కోపం, భయం, అసూయ, బాధలాంటి నెగటివ్ ఎమోషన్స్ కూడా మనిషిలో ఒక భాగమే. వాటిని అణచివేస్తే అవి లోపల కుళ్ళిపోయి డిప్రెషన్ లేదా యాంగ్జైటీగా మారుతాయి.Real Personality Development అంటే నెగటివ్ ఎమోషన్స్ను అణచివేయడం కాదు, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి. నాకు భయం వేస్తోంది అని ఒప్పుకోవడం బలహీనత కాదు, ఆ భయాన్ని జయించడానికి అది మొదటి మెట్టు."నీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా ఉన్నట్టు నటించు. అది చూసి లోకం నమ్ముతుంది, మెల్లగా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది" అంటారు ట్రైనర్స్.కానీ, ఇది మిమ్మల్ని 'Imposter Syndrome' కి గురి చేస్తుంది. లోపల డొల్లతనం ఉండి పైన మేకప్ వేసుకుంటే, ఎక్కడో ఒకచోట ఆ ముసుగు జారిపోతుందనే భయం మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది.Real Personality Development అంటే నటించడం కాదు, 'అర్హత'ను (Competence) పెంచుకోవడం. మీరు ఒక పనిలో నిష్ణాతులు అయినప్పుడు, కాన్ఫిడెన్స్ అనేది ఒక బై-ప్రొడక్ట్లా దానంతట అదే వస్తుంది.సైకాలజీ ప్రకారం వ్యక్తిత్వం అంటే 'అలవాటు' కాదు, అది ఒక 'ఆర్గనైజేషన్'. వ్యక్తిత్వం అనేది కేవలం మనం నేర్చుకునే స్కిల్స్ కాదు. అది మన అనువంశికత (Heredity), పరిసరాల (Environment) సంక్లిష్టమైన కలయిక.మోటివేషనల్ స్పీకర్లు కేవలం ఈ క్షణం గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ సైకాలజీ మీ 'బాల్యం' (Childhood) గురించి మాట్లాడుతుంది.మీ పర్సనాలిటీకి పునాది మీ ఐదేళ్ల వయసులోనే పడిపోయింది. ఆ పునాదిలో ఉన్న పగుళ్లను (Trauma/Negative conditioning) పూడ్చకుండా పైన అంతస్తులు కడితే, ఆ భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చు.నేను డెవలప్ చేసిన నా "Genius Matrix" Break. Build. Beyond. మోడల్ ద్వారా ఈ సో-కాల్డ్ ట్రైనర్స్ ఎక్కడ విఫలమవుతున్నారో చూడండి:స్టెప్ 1: Break (పాత పునాదిని కూల్చడం)ట్రైనర్స్ డైరెక్ట్గా బిల్డింగ్ కట్టమంటారు. కానీ సైకాలజీ ప్రకారం, ముందు లోపల ఉన్న శిథిలాలను తొలగించాలి.చిన్నప్పుడు మీ నాన్న మిమ్మల్ని అందరిముందు తిట్టినప్పుడు "నేను దేనికీ పనికిరాను" అని మీ మనసులో పడ్డ ముద్రను చెరిపేయకుండా, పైన మీరు ఎన్ని "సక్సెస్ మంత్రాలు" చదివినా ఉపయోగం లేదు.మీ బలహీనతలు, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడ మొదలయ్యాయో గుర్తించి, ఆ పాత సెల్ఫ్-ఇమేజ్ను బ్రేక్ చేయడమే అసలైన వికాసం.స్టెప్ 2: Build (లోపలి నుంచి బయటికి)ఇక్కడ మనం బాహ్య ప్రదర్శనపై కాకుండా, అంతర్గత విలువలపై దృష్టి పెడతాం.ఒక వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు (Real Self) అనేది కీలకం. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక "సక్సెస్ ఫుల్ పర్సన్" కనిపించాల్సిన అవసరం లేదు, ఒక "నిజాయితీ గల మనిషి" కనిపిస్తే చాలు.గొడవ జరిగినప్పుడు అరవకుండా ఉండటం 'కమ్యూనికేషన్ ట్రిక్' కాదు, అది మనసును కంట్రోల్ చేసే 'మెంటల్ స్ట్రెంత్'.స్టెప్ 3: Beyond (పరిమితుల ఆవల - లెగసీ నిర్మించడం)మార్కెట్ కోరుకునేది 'సక్సెస్'. సైకాలజీ కోరుకునేది 'సాటిస్ఫాక్షన్', 'గ్రోత్'.ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం మానేసి, మీరు మీ కోసం బ్రతకడం మొదలుపెట్టినప్పుడు మీరు 'Beyond' స్టేజ్లోకి వెళ్తారు. ఇక్కడ మీ పర్సనాలిటీలో ఒక Depth ఉంటుంది. Abraham Maslow చెప్పిన 'Self-Actualization' అంటే ఇదే.ఉదాహరణకు ఒక వ్యక్తికి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం (Stage Fear). "నువ్వు పులివి.. నువ్వు వెళ్ళి స్టేజ్ మీద ఊగిపో.. కేకలు వేయ్.. జనం చప్పట్లు కొడతారు" అంటాడు మోటివేషనల్ స్పీకర్. ఇది ఒకసారి వర్కౌట్ అవ్వొచ్చు, కానీ భయం పోదు.మరేం చేయాలి?ఆ వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు? విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడా? (Perfectionism). ఎదుటివారు ఏమనుకుంటారో అనే Social Anxiety ఉందా? తన దగ్గర సరైన కంటెంట్ లేదా? అనే అంశాలను పరిశీలించాలి.ముందుగా ఆ వ్యక్తి తనలోని లోపాలను అంగీకరించేలా చేయడం.చిన్న చిన్న గ్రూప్స్ ముందు మాట్లాడించి 'ఎక్స్పోజర్' ఇవ్వడం.స్టేజ్ మీద మాట్లాడటం అంటే 'తన్ను తాను నిరూపించుకోవడం' కాదు, 'సమాచారాన్ని పంచడం' అనే మైండ్సెట్ మార్పు తేవడం.ఇది Real Personality Development.చివరగా నేను చెప్పేది ఒక్కటే... పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక మోడల్లా నడవడం కాదు, ఒక నాయకుడిలా మాట్లాడటం కాదు.మీ మనసులో ప్రశాంతత ఉందా?మీరు ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నారా?కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా నిలబడుతున్నారా?మీ తప్పులను మీరు ఒప్పుకోగలుగుతున్నారా?ఇవేవీ మార్కెట్లో లభించే రెండు రోజుల వర్క్షాప్లలో దొరకవు. వీటికి లోతైన ఆత్మపరిశీలన, శాస్త్రీయ దృక్పథం అవసరం.మనం ఈ Real Personality Development సిరీస్లో మాట్లాడబోయేది ఆ లోతైన సత్యాల గురించే.ఇక్కడ సో-కాల్డ్ మోటివేషన్ ఉండదు... కేవలం సైకలాజికల్ ట్రాన్స్ఫార్మేషన్ మాత్రమే ఉంటుంది.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!) -
91 ఏళ్ల వయసులో ఇంత ఫిట్గానా..!
ఏడుపదుల వయసుకు చేరుకోగానే ఎంతటి ఫిట్నెస్ కోచ్లు అయినా లేదా క్రమం తప్రకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహ ఉన్నా కూడా..యువకుల మాదిరిగా చురుకుగా ఫిట్గా ఉండటం కష్టమే. కానీ ఈ బామ్మ తొమ్మిది పదుల వయసులో యువతే విస్తుపోయాలే యాక్టివ్గా ఉండటమే కాదు..ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేస్తూ భళా అనిపించుకుంటోంది. ఎవరా ఆ సూపర్ బామ్మ అంటే..ఆ బామ్మే ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల జిల్. ఆమె కఠినమైన క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పేరుగాంచింది. ఆమె రోజుకు సగటున 12 వేల అడుగులు నడుస్తుందట. అంతేగాదు తరుచుగా సిడ్నీ హార్బర్ వంతెన మీదుగా ఒపెరా హౌస్కు వెళ్లే ఐకానిక్ ట్రెక్కు వెళ్తుందట. ఇది నిటారుగా ఉన్న కొండలు, అంతులేని మెట్లకు ప్రసిద్ధి చెందిన మార్గం. అలాగే వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, బలాన్ని కాపాడుకునేలా యోగ, పైలేట్స్ వంటి సెషన్లు తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. అలాగే అందరితోనూ సన్నిహితంగా ఉండేలా టచ్లో ఉంటానని, అది శారీరక వ్యాయామం వలే మనసుకోక ఆహ్లాదకరమైన వ్యాయామం అని అంటోంది. అంతేగాదు ఈ జిల్ బామ్మ దీర్ఘాయువు కోసం చురుగ్గా ఉండటమే మంచిదనేది తన అభిప్రాయామని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోని ఫిట్నెస్ కోచ్ థెరిసా మోలోనీ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. కాగా, శారీరక వ్యాయామం వలే దీర్ఘాయవు కోసం సామాజిక అనుసంధానం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నాయి అధ్యయనాలు. పైగా చురుకైన జీవనశైలి మంచి మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమను స్థిరంగా ఉంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది కూడా. నిజంగా ఈ బామ్మ సూపరో సూపర్ కదూ..!. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!) -
‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
కంటతడిపై ‘కన్నే’యండి!కొందరిలో కళ్లనిండా నీళ్లు ఉండటం... కళ్లు చెమ్మగిల్లినట్టుగా ఉండటం కనిపిస్తుండేదే. ఇందుకు చాలా అంశాలు కారణమవుతాయి. ఇలా కళ్లలో నీరు ఉన్నట్లు కనిపిస్తుండటం, చెమ్మగిల్లుతూ ఉండటానికికారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలు...కళ్లలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్తో కళ్లుమండుతూ ఉన్నప్పుడు దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి అంశాలతో అలర్జీ వల్ల కళ్లకలక (కంజంక్టివైటిస్) వంటి ఇన్ఫెక్షన్లతో కళ్లలో నీళ్లూరేందుకు ఉండే డక్ట్స్ మూసుకుపోవడంతో కన్నీళ్లు బలవంతంగా రావడానికి ప్రయత్నించడం ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ ఉన్నవాళ్లలో. ఇక్కడ ఒక సందేహం కలగడం సాధారణం. అంటే డ్రై ఐస్ సిండ్రోమ్లో కళ్లు పొడిబారాలి కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి ఈ సిండ్రోమ్లో కళ్లుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీన్నే ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కళ్లలో నీరు ఎక్కువగా ఊరుతుంది.నివారణ, చికిత్స...∙చిన్నపిల్లల కళ్లల్లో ఇలా నీరూరుతున్నప్పుడు లేదా కళ్లలోకి దుమ్మువెళ్లినప్పుడు పాతకాలపు పెద్దవాళ్లు ఓ మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను ఉండగా చేసి, దానిపై నోటితో గాలి ఊది దాన్ని కొద్దిగా వెచ్చబడేలా చేసి కంటిపై అద్దడం అన్నది కాస్తంత మధ్యవయస్కులకూ, పెద్దవాళ్లకు తెలిసిందే. అలా కాస్తంత గోరువెచ్చని ఆవిరితో గుడ్డను ఉండగా చేసి కళ్లపై అద్దడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది అలర్జీ వల్ల ఇలా జరిగినప్పుడు డాక్టర్ల సూచన మేరకు యాంటిహిస్టమైన్చుక్కల మందు వాడాలి. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరిగితే డాక్టర్లు యాంటీబయాటిక్ చుక్కల మందును సూచిస్తారు మాటిమాటికీ కళ్లను తాకకుండా ఉండాలి ∙ఇంతకు మించి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కళ్ల డాక్టర్ను సంప్రదించాలి.ఉబ్బు కళ్లు...కొందరిలో ఉబ్బుకళ్లు కనిపిస్తుంటాయి. పొద్దున్నే నిద్రలేవగానే కొద్దిసేపటి వరకు ఉబ్బుకళ్లు కనిపించడం మామూలే. కానీ కొందరిలో ఇవి చాలాసేపు అలాగే ఉండి΄ోతాయి. ఈ సమస్యను ఇంగ్లిష్లో ‘పఫ్ఫీ ఐస్’ అంటుంటారు. సాధారణంగా చాలామందిలో ఇది తాత్కాలిక సమస్యే. కళ్లు బాగా అలసి΄ోవడం (ఫెటీగ్) వల్ల కూడా ఇలా జరగవచ్చు.కారణాలు...∙రాత్రి ఎక్కువసేపు నిద్ర΄ోకుండా ఉండటం లేదా నిద్రలేమి కారణంగా ∙క్రితం రాత్రి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కొందరిలో ఉప్పుకారాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత ∙ఇక చాలామందిలో ఇలా కళ్లు ఉబ్బినట్టుగా ఉండటం లేదా కళ్ల కింద చర్మం జారినట్టుగా ఉండటమన్నది వయసు పెరుగుతుండటం (ఏజింగ్) వల్ల జరగవచ్చు ∙మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలోనూ, రక్తంలో ్ర΄ోటీన్ తక్కువగా ఉండటం వల్ల, అలాగే రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లలోనూ ఇలా ఉబ్బుకళ్లు కనిపిస్తాయి.నివారణ / చికిత్స...మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై అద్దడం (కోల్డ్ కంప్రెస్)ఆహారంలో ఉప్పుకారాల మోతాదును తగ్గించడం కంటినిండా గాఢంగా నిద్ర΄ోవడం.డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు ఈ సూచనలు పాటించండికళ్ల జాగ్రత్తల్లో 20 – 20 – 20 అనేది ఓ మంచి సూచన. అంటే... ప్రతి 20 నిమిషాలకోసారి మనం దృష్టిని కేంద్రీకరించి ఉన్న అంశంపైనుంచి (కంప్యూటర్ / ఫోన్) దృష్టి మరల్చి 20 ఫీట్ల దూరంలో ఉన్న మరో వస్తువును 20 సెకన్ల పాటు చూస్తుండటం. ఏకాగ్రతతో ఏదైనా పనిచేస్తున్నా లేదా వృత్తిరీత్యా కంప్యూటర్ స్క్రీన్ గానీ, టీవీ స్క్రీన్నుగానీ తదేకంగా చూస్తున్నప్పుడు ఇలా చేయడం మంచిది. టీవీ, కంప్యూటర్ లేదా మొబైల్ ఇలా ఏదైనప్పటికీ ఆ స్క్రీన్ టైమ్ను గణనీయంగా తగ్గించడం ∙తరచూ కన్రెప్పలను కదిలిస్తూ / మూస్తూ ఉండాలి. (అంటే బ్లింకింగ్ చేస్తూ ఉండాలి). ఫలితంగా కన్నీరు కంటిపైన సమంగా అలముకుని కంటిని పొడిబారకుండా కాపాడుతుంది ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీ చాలాసేపు నడుస్తుంటే అక్కడి వాతావరణంలోని గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇలా చాలాసేపు ఏసీలో ఉన్నవారు కాసేపు మామూలు వాతావరణంలోనూ కిసేపు గడపాలి కళ్లజోడు తాలూకు గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్సులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. పవర్ మారిందని తెలుసుకోగానే తగిన పవర్ ఉన్న అద్దాలను మార్చుకోవాలి. ఈ కొద్ది΄ాటి జాగ్రత్తల తర్వాత కూడా కంటికి సంబంధించిన అసౌకర్యం తగ్గక΄ోతే వెంటనే కంటి డాక్టర్ను తప్పక సంప్రదించాలి. నిర్వహణ యాసీన్ (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
స్మృతి బ్రాండింగ్ హవా..! ఏకంగా విరాట్ కోహ్లి రేంజ్లో..
అమ్మాయిల క్రికెట్లో ఇప్పుడు ఆమె అతి పెద్ద అద్భుతం...వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానం...ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా అగ్రస్థానం... అంతర్జాతీయ టి20ల్లో రెండో స్థానం...అన్నింటికి మించి తొలిసారి భారత జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర...రెండేళ్ల వ్యవధిలో కెప్టెన్గా సాధించిన రెండు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్స్ దీనికి అదనం. ఈ అన్ని ఘనతలూ సాధించిన ఒకే ఒక స్టార్ ప్లేయర్ ఎవరంటే నిస్సందేహంగా స్మృతి మంధాన పేరు చెప్పవచ్చు. ఒకప్పుడు మహిళల క్రికెట్ మాత్రమే కాదు...మహిళా ప్లేయర్లు సౌందర్య సాధనాలకు తప్ప మరో ఉత్పత్తికి ప్రచారం చేస్తే చూసేవారెవరు, కొనేవారెవరు అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు స్మృతి మంధాన క్రెడిట్ కార్డులు కొనమని చెప్పినా.... ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమన్నా...ఇంజిన్ ఆయిల్ అమ్మినా, ఎనర్జీ డ్రింక్లు తాగమని చెప్పినా జనం వింటున్నారు. ఆట ప్లస్ అందం కలగలిసిన ప్రచారకర్తగా అమాంతం స్థాయిని పెంచుకున్న స్మృతి బ్రాండింగ్ హవా ఇప్పుడు నడుస్తోంది....స్మృతి మంధాన బ్రాండింగ్ విలువ ఇప్పుడు భారీగా పెరిగినా... ఇది రాత్రికి రాత్రే జరిగేది కాదు. దశాబ్ద కాలానికి పైగా నిలకడైన ఆటతీరుతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కృషి దీని వెనక ఉంది. వరుసగా పలు రికార్డులు సృష్టిస్తూ అంచెలంచెలుగా ఆమె పెద్ద స్థాయిని అందుకుంది. 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఆమె కెరీర్ ఆరంభం నుంచే జోరుగా సాగింది.జట్టులో జూనియర్గానే ఉన్నా... ప్రదర్శనపరంగా అందరికంటే అగ్రభాగాన నిలుస్తూ తనదైన ముద్ర వేసింది. మిథాలీ రాజ్ తర్వాత భారత నంబర్వన్ బ్యాటర్గా ఆమె అన్ని ఘనతలు సాధిస్తూ వచ్చింది. ఈ పాపులారిటీ కారణంగానే మహారాష్ట్రలో తన సొంత పట్టణం సాంగ్లీలో ఎస్ఎం 18 పేరుతో స్మృతి ఒక రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం ఆమెలోని వ్యాపార కోణాన్ని చూపించింది.అన్ని వర్గాలు మెచ్చేలా...ఒక ప్లేయర్లో ప్రతిభను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో వారు ఎంత పెద్ద స్థాయికి చేరవచ్చో అంచనా వేయడంలోనే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీల విజయం దాగి ఉంటుంది. స్మృతి మంధాన విషయంలో బేస్లైన్ వెంచర్స్ అనే మేనేజ్మెంట్ కంపెనీ చూసిన భవిష్యత్తు ఆమె బ్రాండింగ్ స్థాయిని అమాంతం ఆకాశానికి తీసుకెళ్లింది. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఆమెకు బ్రాండింగ్ అవకాశాలు తెచ్చి పెట్టాయి. ‘హెల్త్, ఇన్సూరెన్స్, క్రీడా సామగ్రి, మొబైల్స్, ఫైనాన్స్... ఇలా ఒకటేమిటి... ఎన్నో భిన్న రంగాల్లో దాదాపు 15 రకాల ఉత్పత్తులకు స్మృతి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. క్రికెట్లోనే కాకుండా మైదానం బయట కూడా ఆమె వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అన్ని వర్గాలకు చేరువైనట్లుగా, అందరి మనిషి అనేలా అనిపించడమే స్మృతి బ్రాండింగ్ రహస్యం’ అని బేస్ లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహీన్ మిశ్రా తమ క్లయింట్ గురించి గర్వంగా చెబుతున్నాడు.‘సరిగ్గా చెప్పిలంటే పురుషుల జట్టులో విరాట్ కోహ్లి స్థాయిని ఇప్పుడు ఆమె మహిళల క్రికెట్లో అనుభవిస్తోంది. అందుకే ప్రీమియం, లైఫ్ స్టయిల్ బ్రాండ్లు, ఎనర్జీ డ్రింక్ ప్రకటనలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి’ అని మరో మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధి రూపేశ్ కశ్యప్ వివరించాడు. సరిగ్గా చెప్పాలంటే ప్రచారకర్తగా ప్రస్తుత పురుషుల క్రికెటర్లు ఎంతో మందికంటే స్మృతి చాలా ముందుంది.మెగా టోర్నీల్లో విజయంతో...మూడు నెలల వ్యవధిలో స్మృతి వన్డే వరల్డ్ కప్ విజయం, ఉమెన్ ప్రీమియర్ లీగ్ విజయాల్లో భాగంగా ఉంది. ఇందులో డబ్ల్యూపీఎల్ టీమ్కు ఆమె కెప్టెన్ కూడా. పైగా ఫ్యాన్స్పరంగా చూస్తే అత్యంత ప్రజాదరణ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇవన్నీ కలిసి సహజంగానే స్మృతి బ్రాండింగ్ విలువను అమాంతం పెంచేశాయి. బ్రాండింగ్ వ్యవహారాలను చూస్తే సంస్థ క్రోల్ అంచనా ప్రకారం... గత ఏడాది కాలంలో ఆమె విలువ దాదాపు 50 శాతం పెరగడం విశేషం. 2023లో తొలి డబ్ల్యూపీఎల్ సమయంలో స్మృతి బ్రాండింగ్ విలువ సుమారు 12 మిలియన్ డాలర్లు కాగా, 2024లో అది 17 మిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు అది ఏకంగా 25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 226 కోట్లు) వరకు వెళ్లడం విశేషం. ఇప్పుడు ఒక్కో ప్రకటనకు ఆమె రూ. 2 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ఆర్జనపరంగా భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (సుమారు రూ. 26 కోట్లు)తో పోలిస్తే స్మృతి (సుమారు రూ. 34 కోట్లు) చాలా ముందుంది. ఇన్స్టాగ్రామ్లో ఆమె ఫాలోయర్స్ సంఖ్య ఏకంగా 15 మిలియన్లకు చేరడం విశేషం. ఒక్క ఏడాదిలోనే ఇది రెట్టింపైంది. ఆటపరంగా స్మృతి తన కెరీర్లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉంది. ఇంకా 30 ఏళ్లు కూడా నిండని ఆమె త్వరలో హర్మన్ తప్పుకుంటే భారత కెప్టెన్గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి బ్రాండింగ్ విషయంలో మరికొంత కాలం స్మృతి హవా కొనసాగడం ఖాయం. ప్రస్తుతం స్మృతి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పటి వరకు పని చేసిన కొన్ని సంస్థలు చూస్తే... నైకీ, ఎస్బీఐ, హ్యుందాయ్ మోటార్స్, హావెల్స్, పీఎన్బీ మెట్లైఫ్, రెడ్బుల్, గల్ఫ్ ఆయిల్, హెర్బలైఫ్, రాంగ్లర్ జీన్స్, మాస్టర్ కార్డ్, నీమ్ ఆయు షాంపూ, నేచురల్స్, గవి ఎడ్టెక్, మ్యాడ్ ర్యాబిట్ ఆడియో ప్రొడక్ట్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ప్లేయర్స్ పాట్ ఆన్లైన్ గేమ్, రెక్సోనా.మొహమ్మద్ అబ్దుల్ హాది (చదవండి: అద్భుతమైన హోమ్ టూర్..! జీవితాన్ని ఆస్వాదించటం అంటే ఇదే..!) -
నీతా అంబానీ ధరించిన చానెల్ బ్లేజర్ ..అంత ఖరీదా!?
రిలయన్స్ ఫౌండేషన్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ లగ్జరీ దుసులకు, ఆభరణాలకు కేరాఫ్ ఆమె. నీతా ధరించి ప్రతి చీర ఓ అద్భుతం. కళ్లుచెదరిపోయే ఖరీదు చేసే ఆభరణాలతో తన ఫ్యాషన్ శైలిని చెబుతుంటారామె. భారతీయ వారసత్వానికి ప్రతీకగా నిలిచే సంప్రదాయ చేనేత చీరలు, అలానాటి రాజుల కాలం నాటి ఆభరణాలతో మన పూర్వవైభవాన్ని తెలుసుకునేలా లేదా గుర్తుచేసేలా అద్భుతమైన లుక్తో కనిపించే నీతా ఈసారి వెస్ట్రన్ వేర్లో అదుర్స్ అనిపించుకున్నారు. తను ఏది ధరించిన సెన్సెషన్గానే ఉంటుంది. ఎందుకంటే వాటి ధర, డిజైన్ కూడా ఊహకందనిది. ఇక నీతా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో భారత ప్రతినిధిగా మిలానో-కోర్టినా వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026కి ముందు 145వ IOC సెషన్కు హాజరయ్యారు. ఏ వేదికపై భారత సంప్రదాయం ఉట్టిపడేలా చీరలే ఎంచుకునే నీతా ఈసారి బాస్లా కనిపించే పవర్ బ్లేజర్, చిక్ కోట్తో ఎంటర్ అవ్వడం విశేషం. నీతా అంబానీ చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026 ప్రీ కలెక్షన్ స్టైలిష్ నేవి బ్లూ బ్లేజర్ ధరించింది. పైగా ఈ బ్లేజర్కి డబుల్ కాలర్లు, ఫుల్ స్లీవ్స్, నాచ్ లాపెల్స్, రెండు సైడ్ పాకెట్స్ ఉన్నాయి. అధునాతన నేవీ బ్లూ రంగులో ఉన్న బ్లేజర్పై కుడివైపు కాలర్పై ఎరుపు పూల డైమండ్ బ్రూచ ఆ బ్లేజర్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేసింది. దానికి నల్లటి ఫార్మల్ ప్యాంటుని జత చేసి..సింపుల్గా డైమండ్ ఆకారపు చెవిపోగులు ధరించి స్టైలిష్గా కనిపించారామె. ఇంతకీ ఈ బ్లేజర్ ఎంతో తెలిస్తే నోటమాటరాదు. ఇది అక్షరాలు రూ. 738,800/-. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ) -
సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు ..!
వెయిట్లాస్ కోసం ఎన్నో రకాల డైట్లు ఫాలో అవుతుంటాం. కానీ కొందరు సంప్రదాయ ఆహారాన్ని తింటూనే స్లిమ్గా మారతారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ ఫిట్నెస్కోచ్ కాగివన్ ప్రభాహరణ్. అమ్మలాంటి సాంప్రదాయ వంట తింటూనే బరువు తగ్గొచ్చని అంటున్నారు. తాను ఒకప్పుడు అధిక బరువుతో బానలాంటి పొట్టతో ఉండేవాడినని..కానీ ఇప్పుడు సిక్స్ప్యాక్ శరీరంతో స్మార్ట్గా మారానని చెప్పుకొచ్చాడు. అయితే రైస్కి దూరంగా ఉండలేదని..సంప్రదాయ వంటను ఆస్వాదిస్తూనే వెయిట్లాస్ అయ్యినట్లు తెలిపాడు. అందుకోసం డైట్ ఎలా ఫాలో అవ్వాలో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించాడు.తమిళులు చాలామంది సిక్స్ ప్యాక్ కోసం డైట్ వేరుగా ఉంటుందని భావిస్తారు. కానీ తాను తమిళ వారసత్వంలో పాతుకుపోయిన పప్పు వంటి వంటకాలను తింటూనే బరువు తగ్గానని అంటున్నాడు. వాటిని తీసుకుంటూనే సిక్స్ ప్యాక్ సాధించానని చెబుతున్నాడు. అమ్మలాంటి సంప్రదాయ వంటకాన్ని, రుచిని వదులుకుని వెయిట్లాస్ అవ్వాల్సిన పనిలేదని, కేవలం స్మార్ట్గా తింటే చాలట. వాస్తవానికి తమిళ భోజనాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. అందువల్ల అధిక కేలరీలు తీసుకోకుండానే శక్తిని ఇచ్చే వాటిని తీసుకునేవాడినని వీడియోలో తెలిపాడు. ఆ మూడు తప్పనిసరి..సంతృప్తికరమైన భోజనం ఆస్వాదిస్తూనే బరువు తగ్గేందుకు ఈ మూడు మార్పులు చాలా హెల్ప్ అయ్యాయని చెబుతున్నాడు. మొదటి ప్లేట్లో అన్నాన్ని తక్కువ పరిమాణంలో పెట్టుకోవడం. ఎందుకంటే కొలస్ట్రాల్ కరిగేలా..కండరాలను నిర్మించడానికి కార్మోహైడ్రేట్లు అవసరం అందువల్ల ఇలా తీసుకున్నట్లు తెలిపారు. రెండోది సాంప్రదాయ తమిళ ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ల నిమిత్తం..చికెన్, చేపలు, గ్రీకు పెరుగు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఇక మూడోది..వీటితోపాటు ఫైబర్ కోసం ఆకుకూరలను కూడా చేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ఫిట్నెస్ ప్రపంచంలో తెల్లబియ్యాన్ని దగ్గరకు రానీయరు, కానీ ఇది వెయిట్లాస్కి అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా వర్కౌట్ల సమయంలో కండరాలకు ఇంధనంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బియ్యం తక్కువగా ఉన్నా..కడుపు నిండిన అనుభూతి మిస్ చేసుకోవాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఎప్పుడైనా నచ్చిన ఆహారం ఆస్వాదిస్తూనే..తెలివిగా కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటే వెయిట్లాస్ అవుతామని చెబుతున్నాడు కాగివన్ View this post on Instagram A post shared by Kagivan Prabaharan | Tamil Transformation Coach (@kagsfit) (చదవండి: శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!) -
శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!
వ్యక్తిత్వ వికాసం అంటే... గెలుస్తూ ఉండటమే అనే భావన పూర్తిగా స్థిరపడింది. అయితే సైకిల్కు గాలి కొట్టినట్టుగా ఇలా ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటాన్ని ‘టాక్సిక్ పాజిటివిటి’ అంటారనీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ‘హెల్దీ ఆప్టిమిజమ్’ (వాస్తవిక ఆశావాదం) కలిగి ఉండి... నిరాశ, ఓటములను అంగీకరించే మానసిక పరిణితి ఉంటే మేలని వారు సూచిస్తున్నారు. ‘టాక్సిక్ పాజిటివిటీ’ ఎందుకు వద్దో చదవండి.మన దగ్గర ‘అంతా మన మంచికే’ అనే తాత్త్వికత ఉంది. అంటే మంచైనా చెడైనా మంచికే దారి తీస్తుందనే ఒక ఆశావాదాన్ని ఇది కలిగిస్తుంది. దీనిచుట్టూ ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే చైనాలో ‘ఇన్ యాంగ్’ అనే భావన ఉంది. అంటే దుఃఖం–సంతోషం, ఆశ–నిరాశ, గెలుపు–ఓటమి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఇంకా చె΄్పాలంటే ఒకదానిలోనే మరొకటి ఉంటాయని వారు నమ్ముతారు.జీవితంలో ముందుకు సాగాలంటే లక్ష్యం, గెలుపు మీద దృష్టి ఉండాల్సిందే. అయితే ఆ దారిలో కలిగి ఉండాల్సింది ‘వాస్తవిక ఆశావాదమే’ తప్ప ‘కేవల గెలుపువాదం’ మాత్రం కాదు. ఈ సృష్టిలో అంతా గెలుపునకే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తే అన్నివేళలా గెలుపు అందుకోవచ్చని, ఆ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ను కలిగి ఉండాలని ఆధునిక వ్యక్తిత్వ వికాసం ప్రబోధిస్తుంది. అయితే దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువని అంటున్నారు మానసిక నిపుణులు.హద్దుల్లేని ఆశావాదంఒక విద్యార్థి యావరేజ్ మార్కులతో ఉన్నా ‘నువ్వు జెఇఇలో ర్యాంకు సాధించగలవు’ అనే ΄ాజిటివ్ యాటిట్యూడ్ నూరి΄ోసినా, ఆ ΄ాజిటివ్ యాటిట్యూడ్తో ర్యాంకు వస్తుందని విద్యార్థి నమ్మినా చివరకు ఫలితాలు భంగపరిచే తీరుతాయి. అప్పుడు ఓటమి, నిరాశను తట్టుకోవడం కష్టమవుతుంది. సమయానికి చేరుకుంటే ఫ్లయిట్ అందుకుంటాం గానీ మనం లేటవుతూ ‘ఏం పర్లేదు.. ఫ్లయిట్ దొరుకుతుందిలే’ అనుకోవడం శ్రుతి మించిన ఆశావాదమే. మనల్ని మనం మోసం చేసుకోవడమే. లోకంలో గెలుపు, వెలుతురు ఉంటాయి. అలాగే మనం వద్దనుకున్నా ఓటమి, చీకటి కూడా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమని అంటున్నారు మానసిక నిపుణులు. టాక్సిక్ పాజిటివిటీ వల్ల నిరంతరం సంతోషంగా ఉండాలేమో, సంతోషంగా ఉంటే తప్ప జీవితానికి విలువ లేదేమో అనేది కండీషనింగ్గా మారి సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆరు రుచులు... అన్ని భావాలుఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరులతో కలిపిన పదార్థం. జీవితంలో కూడా అటువంటి అన్ని అంశాలు కలిసే ఉంటాయని చెప్పేందుకు ఉగాది పచ్చడి తినిపిస్తుంటారు. అయితే జీవితంలో పాజిటివిటీ ఎక్కువైపోతే కేవలం తీపిని తప్ప చేదుని రుచి చూడలేని పరిస్థితి తలెత్తుతుందని, దీని వల్ల చిన్న విషయాలకే మనసును తీవ్రంగా గాయపరుచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అన్ని రకాల భావాలకూ మనసులో చోటివ్వకుండా, కేవలం మంచి మాత్రమే జరగాలని కోరుకోవడం వల్ల భిన్న దృక్కోణాల్లో సమస్యను పరిశీలించి, పరిశోధించే అవకాశం దక్కడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే కొందరు తొందరగా డిప్రెషన్ బారిన పడుతున్నారంటున్నారు.పాజిటివ్గా ఆలోచించడం తప్పా?ఇదంతా విన్నాక ‘పాజిటివ్గా ఆలోచించడం తప్పా? అలా ఆలోచించడం ముప్పు తెస్తుందా?’ అనే సందేహం రావచ్చు. పాజిటివ్గా ఆలోచించడం తప్పు కాదు. అందులో దోషం లేదు. అయితే పాజిటివిటీతోపాటు జీవితంలో నెగిటివిటీ కూడా ఉంటుందని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు సమస్యలుగా పరిణమిస్తాయి. కొందరు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా ‘ఇంత బాగా ఆలోచించే నాకు ఎందుకీ కష్టం వచ్చింది? నాకెందుకు ఇలా జరిగింది?’ అని ఆలోచించి ఆలోచించి మరింత మధనపడుతుంటారు. రాన్రానూ ఇదొక తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆనందం శాశ్వతం కాదు...పాజిటివ్ థింకింగ్లో ఉన్న మరో ప్రధాన సమస్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం. మనిషికి సహజంగా ఆనందంతోపాటు దు:ఖం, కోపం, చిరాకు, అలసట వంటివి వస్తుంటాయి. అయితే పాజిటివ్ థింకింగ్ కారణంగా కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలని అనుకుంటే మిగిలిన భావాలు లోలోపలే పేరుకు΄ోయి మానసిక సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో భావోద్వేగాలు బయటకు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని మానసిక నిపుణులు అంటున్నారు. బలవంతంగా సంతోషాన్ని నటించడం వల్ల ఇబ్బందులు తప్ప ఫలితాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. నిర్వహణ: యాసీన్(చదవండి: ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు..! హెచ్చరిస్తున్న అధ్యయనాలు) -
ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు
ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ...దాంతో ముప్పు తప్పదంటూ ఇటీవలి తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలా కొద్దిమోతాదులో ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ నోటిలోని చర్మపు పొరల్లో (బక్కల్ మ్యూకోజల్) కేన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా బలంగా ఉంటాయని ఇటీవలి పరిశోధనల తాలూకు ఫలితాలను ‘బీఎమ్జే గ్లోబల్ హెల్త్’ జర్నల్ ప్రచురించింది. ఆ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం రోజూ కేవలం తొమ్మిది గ్రాముల ఆల్కహాల్ తీసుకున్నా నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు 50 శాతం పెరుగుతుందనీ, అయితే దీనికి తోడు పొగాకు నలమడం కూడా తోడైతే ఆ ముప్పు 62 శాతానికి చేరుకుంటుందని ఆ అధ్యయన వివరాలు తెలుపుతున్నాయి.అందరూ 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే...ఈ నోటి క్యాన్సర్లే వరకే తీసుకుంటే మన దేశంలో ప్రతి ఏడాదీ 1,43,759 కొత్త కేసులు నమోదువుతున్నాయి. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ క్యాన్సర్లతో 80,000 మంది మృత్యువాత పడుతున్నారని తేలింది. ఈ క్యాన్సర్ బాధితులందరిలోనూ 45 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని తెలిసింది.ఇక విదేశీమద్యం నాణ్యమైనదనీ, అది తాగేవారిలో ఈ ముప్పు తక్కువని అనుకో డానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాగేవారికి దాదాపు 72 శాతం ముప్పు ఉంటే... అదే దేశీ మద్యం తాగేవారిలో క్యాన్సర్ ముప్పు 82 శాతానికి పెరుగుతుంది.(చదవండి: రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..) -
చర్మ సౌందర్యం కోసం..!
చర్మ సౌందర్యం కోసం ఎన్నో మాయిశ్చరైజన్లు రాసి విసిగిపోయి ఉంటారు. అలాంటి వాళ్లు సహజసిద్ధంగా ముఖానికి తేమను అందించి కోమలంగా ఉంచే ఈ టిప్స్ని ఫోలో అయితే సరి. పొడిబారటం తగ్గుతుంది..అలాగే మేను ప్రకాశవంతంగా మెరుస్తుంది కూడా. మరి అవేంటో చూద్దామా..వేడినీటిలో కప్పు పాలను కలిపి స్నానం చేస్తే చర్మ లావణ్యం పెరుగుతుంది. చలికి పొడి బారిన చర్మానికి మాయిశ్చరైజింగ్ ట్రీట్మెంట్లు చేయడం సాధ్యం కానప్పుడు ఇలా చేయవచ్చు. ఇది అన్ని రకాల చర్మతత్త్వాలకు చక్కగా పనిచేస్తుంది. పొడి చర్మానికి ఈ కాలంలో సబ్బు కూడా శత్రువుగా మారుతుంది కాబట్టి సున్నిపిండి వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సున్నిపిండిలో పాలు పోసి పేస్టులా చేసుకుని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమను కోల్పోదు. అంతేకాకుండా సహజమైన నూనె అందడం వల్ల మృదువుగా మారుతుంది.తేనె, చక్కెర సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు అప్లయ్ చేసి వలయాకారంగా మర్దన చేయాలి (కళ్ల చుట్టూ మినహాయించాలి). ఇది నాచురల్ స్క్రబ్. చర్మానికి నునుపుదనం తీసుకురావడంతోపాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగాఈ ట్రీట్మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. -
బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..!
బరువు తగ్గడం అంటే వర్కౌట్లు మీద ఫోకస్ పెడతాం. అన్నిట్లంకంటే తగ్గాలనే సంకల్పం బలంగా ఉండాలి అప్పుడే అది సాధ్యమవుతుందని అంటోంది ఫిట్నెస్ కోచ్ కేట్ డేనియల్. ఇంతకుమునుపులా ఉండాలి అన్న ఆలోచనే ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత సులభంగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది అంటోందామె. తాను మూడేళ్లలో 70 కిలోల అదనపు బరువుని తగ్గించుకున్నానని..అందుకోసం తన జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేశారో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..బేరియాట్రిక్ కోచ్ కేట్ డేనియల్ బరువు తగ్గడం అన్నది ఓర్పుతో, అంకితభావంతో సాగించాల్సిన జర్నీ అంటుందామె. ఇక్కడ ఈ ఫిట్నెస్ కోచ్ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. బేరియాట్రిక్ సర్జరీ అంటే డైటింగ్/వ్యాయామం పనిచేయనప్పుడు పొట్ట పరిమాణాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడే సురక్షితమైన చికిత్స. అది డేనియల్ లైఫ్లో ఒక భాగం మాత్రమే. కానీ బరువు తగ్గడానికి ముందు తాను టీనేజ్లో ఉన్నట్లుగా తనలా మారాలని స్ట్రాంగ్ కోరుకుంది. ఆ తర్వాత తన జీవనశైలిలో మార్పులు చేసుకున్నారు. అవేంటంటే..ఉదయాన్నే మేల్కోవడం..ఆకలి హార్మోన్ల నియంత్రించే అలవాట్ల కోసం త్వరితగతిన మేల్కోవడం మంచిదని చెబుతోంది. ఇలా తొందరగా లేవడం వల్ల చక్కగా డైట్, వర్కౌట్ల ప్లాన్ సవ్యంగా ఉంటుందన్నారామె. శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండటం..చక్కెర, శుద్ధి చేసిన పిండిలతో చేసి ఆహార పదార్థాలను దగ్గరకు రానివ్వలేదట. ఇది శరీర కొవ్వుని తగ్గించేందుకు హెల్ఫ అయ్యిందట. వారానికొకసారి నచ్చిన ఆహారం..నచ్చిన ఫుడ్ని స్వయంగా తయారు చేసుకుంటూ..హాయిగా తిన్నాను. దానివల్ల త్యాగాలు చేస్తున్నా అన్న ఫీల్ ఉండదు. పైగా కడుపు నిండుగా తినొచ్చు కూడా.తనను తాను మెరుగ్గా ఉంచుకోవడంమొదట మనల్ని మనం ప్రేమించడం, ఆహారంతో సంబంధం లేకుండా ఎంతసేపు ఉండగలం వంటి చిన్న ప్రయత్నాలను రోజు రోజుకి పెంచడం. ఆరోగ్యకరమైన రిలేషన్స్..ఎందుకంటే మనకు నచ్చిన వాళ్లు ఇచ్చిన ఆహారాలను వాళ్లపై ప్రేమతో లాగించేస్తాం. కాబట్టి..బంధాలను బరువుని పెంచేవిగా మార్చుకోవద్దు. వాళ్లని మేలు కోరే వాళ్లుగా మార్చుకోవాలట. అంటే ఆ బంధాలు మనసుకి స్వాంతన ఇవ్వాలే గానీ శరీరాన్ని భారంగా మార్చకూడదని అంటోంది. విజువలైజేషన్కోరుకున్న విధంగా స్మార్ట్గా మారినట్లు ఊహించుకోవడం. పదే పదే ఆ దృశ్యమానం..మిమ్మల్ని జాగురకతతో ఉండేలా చేస్తుంది. తినాల్సిన వాటిపై ఫోకస్ పెట్టేలా చేస్తుంది. టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు.చలాకీగా ఉండటం..బరువు తగ్గిన వెంటనే 20ల వ్యక్తిలా ఎలా ఉషారుగా పనిచేయగలనో భావించడం. ప్రతి కదలికలో దీన్నిగుర్తించుకోవాలి.మానసికంగా స్ట్రాంగ్ ఉండటం..బరువు తగ్గలేకపోతున్న అన్న బాధ మెదుడులోకి ఎంటర్ అవ్వకూడదు. అది మిమ్మల్ని స్మార్ట్గా ఉండనివ్వదట. నిన్ను నువ్వు స్నేహితుడిగా, కేర్టేకర్గా మార్చుకుంటూ సాగితే బరువు తగ్గడం ఇష్టమైన ఆటలా మారి..సునాయాసంగా తగ్గేలా చేస్తుంది లేదా అదుపులో ఉంచుతుంది .ఇక్కడ చెప్పినవన్ని..మాయలు మంత్రల్లాంటివి కాదని, కేవలం బరువు తగ్గేందుకు మానసికంగా మనల్ని సన్నద్ధం చేసేవి. వీటికి మంచి ఆహారపు అలవాట్లు, వర్కౌట్లు తోడైతే..బరువు తగ్గడం సులభమవుతుందని అంటోంది ఫిట్నెస్ కోచ్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Kate Daniel (@bariatric_chic) (చదవండి: ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..) -
సత్సంబంధాల కోసం 50-30-20 రూల్..! ఎంత కేటాయించాలంటే..
యూట్యూబర్, అంకుర్ వారికు ఆర్థిక నిర్వహణకు చెప్పిన ఇదే రూల్ సత్సంబంధాలకు వర్తిస్తుందన్నారు. అందరు భావోద్వేగ శక్తిని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించేస్తుంటారిని అన్నారు. మన సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఇదే రూల్ పాటిస్తే..జీవితంలో మంచి రిలేషన్స్, అభ్యున్నతి రెండూ సునాయసంగా సాధించగలుగుతామని అన్నారు. మన ఎనర్జీని సరైన విధంగా వినయోగిస్తే..మంచి సంబంధాలను నెరపడమేగాక, అవి మన విజయానికి, ఎదుగదలకు ఉపకరిస్తాయని అన్నారు. మరి అదెలాగంటే..భావోద్వేగ శక్తిని ఇలా హ్యండిల్ చేయండి అంటూ ఆర్థిక నిపుణుడు అంకుర్ వారికు 50-30-20 రూల్ గురించి వివరించారు. ఆర్థిక శాస్త్రంలో సరైన ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఈ రూల్ భావోద్వేగ ప్రాధాన్యతను కూడా ఎలా మార్గనిర్దేశితం చేస్తుందో వివరించారు. మన ఎనర్జీలో సగం పని, కుటుంబం, కచ్చితంగా కేటాయించాలి. ఇక 30% మనకు సురక్షితంగా అనిపించే బంధాల కోసం ఎనర్జీని ఖర్చు చేయాలి. మిగిలిన 20% వ్యక్తిగత ఎదుగుదల, అభిరుచులు, స్వీయ పరిశీలనపై దృష్టిపెట్టాలని అన్నారు.ఈ విధంగా భావోద్వేగ శక్తిని విభజించడం ద్వారా అలసిపోకుండా బాధ్యతలు, అర్థవంతమైన సంబంధాలు, స్వీయ-సంరక్షణ తదితరాలను సమతుల్యం చేయడం సులభతరమవుతుంది. వ్యక్తిగతంగా ఎదుగుదల, బాధ్యతలను పోషిస్తూనే మానసిక, భావోద్వేగ స్థితిని బలోపేతం చేసుకోవడానికి ఈ రూల్ హెల్ప్ అవుతుంది. జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి వ్యక్తిగతం 20% ఎనర్జీని ఖర్చు చేయడం అనేది అత్యంత ముఖ్యమని అన్నారు. నెటిజన్లు కూడా అందుకు మద్దతిస్తూ..20% వ్యక్తిగత సంరక్షణకు అత్యవసరం అని..అందరూ దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారంటూ పోస్టులు పెట్టడం విశేషం.(చదవండి: రెండేళ్లకే రెండు గిన్నిస్ రికార్డులు..!) -
గాడిద చాకిరీ తప్ప ఏం లేదు..గిగ్ వర్కర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
బెంగళూరుకు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ చేసిన పోస్ట్, గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక శారీరక వెతల గురించి చెప్పకనే చెబుతుంది.అతని పోస్ట్లోని వివరాల ప్రకారం క్యాబ్ డ్రైవర్గా తాను గాడిద చాకిరీ చేస్తున్నా సంతృప్తికర జీవితం గడపలేకపోతున్నానని వాపోయాడు. వ్యాపారంలో నష్టపోయిన కారణంగా అప్పులు మిగిలాయి. దీంతో అందుకే ఖర్చుల నిమిత్తం యల్లో బోర్డు క్యాబ్ను అద్దెకు తీసుకుని, ఊబర్ . రాపిడోతో పనిచేయడం ప్రారంభించాడు. ప్రతిరోజూ దాదాపు 16 గంటలు డ్రైవ్ చేస్తాను. సుమారు 4 వేల రూపాయలు సంపాదిస్తాడు. అందులో 1.5 వేలు కారు అద్దెకు, 1.2 వేలు సీఎన్జీకి , ఫుడ్, వాటర్ కోసం 200 రూపాయలు ఖర్చవుతాయి. ఇక తనకు మిగిలిని రోజుకు దాదాపు 1000 రూపాయలు మిగులుతాయి. ఇలా బతకడం చాలా కష్టంగా ఉందని చెప్పుకొచ్చాడు.తనకు వచ్చే రాబడి పరిస్థితి ఇలా ఉంటే, శారీరక శ్రమ మరింత దారుణంగా ఉంటుందని తెలిపాడు. కాళ్లు నొప్పులు.. ఇక చాలు బాబోయ్.. అని మోకాళ్లు మొరాయిస్తుంటాయి. రోజులో కేవలం 6 గంటల నిద్ర. ఇక తనకు సమయం మిగిలడంలేదనీ, అందుకే సోషల్మీడియాలో మధ్య ఏ సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండటంలేదని చెప్పాడు. ఇక ఇంధన కోసం పొడవైన క్యూలలో వేచి ఉండాలి.. అసలు ఇది ఒక జీవితమేనా? అనిపిస్తుంటుంది. తమ లాంటి డ్రైవర్లు తాము పనిచేసే యాప్ల నుండి నిరంతర ఒత్తిడి గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకే దీన్ని'గాడిద చాకిరీ' అంటాం. “యాప్ 'ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్' లాగా పనిచేస్తుంది. వచ్చిన రైడ్ను త్వరగా, అంటే 5-6 సెకన్లలో అంగీకరించకపోతే, మరొకరు తీసుకుంటారు. రైడ్లనువెంటనే యాక్సెప్ట్ చేయకపోతే రేటింగ్ పడిపోతుంది అని వివరించాడు. ఇదీ చదవండి: స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!ట్రాఫిక్లో నానా కష్టాలుపడి ఇంటికి రాగానే, ఎంత అలిసిపోయినా కారు కడగాల్సిందే. ఇంతక చేసినా తమ కష్టానికి ఏమీ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వేలాదిమంది ఉద్యోగాల వాస్తవికత ఇదే. అయితే దోపిడీ చేసేవాడు.. లేదా దోపిడీకి గురయ్యేవారు. లేదా దోపిడీ చేసేవాడిగా ఉండాలి లేదా దోపిడీకి గురయ్యేవాడిగా ఉండాలి.చౌక శ్రమ వల్లే ఇతరులు ఈ సౌకర్యాలను అనుభవించగలుగుతున్నారు అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై సానుభూతిని ప్రకటించారు. ఏమీ చేయలేని పరిస్తితిలో ఉన్నాం. మీ ప్రతి మాటలో మీ మానసిక,శారీరక బాధను రెండూ అర్థం చేసుకోగలం అంటూ సానుభూతి వ్యక్తంచేశారు. అన్నీ సర్దుకుంటాయి. ధైర్యంగా ఉండండి అని మరికొందరు చెప్పారు. చాలామంది గిగ్ కార్మికులను గౌరవించాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు. -
'రాజా బేటా సిండ్రోమ్': 50 ఏళ్లు పైబడ్డ కూడా..
మనషుల ప్రవర్తనలు చాలామటుకు చుట్టూ ఉన్న మనుషులు లేదా అతడు పెరిగిన కుటుంబ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అది అతడి అభ్యున్నతికి ఉపకరించేలా ఉంటే పర్లేదు..తనేం చేసినా కరెక్ట్ అనే ధోరణిలో ఉంటే చాలా సమస్యలు ఎదురవ్వుతాయి. ముఖ్యంగా మగపిల్లలను తల్లులు ఎంతలా గారాబం చేస్తుంటారంటే..వాళ్లేం చేసినా కరెక్ట్, ఆడపిల్ల వరకు వచ్చేటప్పటికీ..పరాయి ఇంటికి వెళ్లాల్సింది బాధ్యతతో వ్యవహరించాలన్నట్లుగా పెంచుతారు. బాధ్యతల విషయంలో ఇద్దరు సమానం అన్న ఆలోచన లేమి..ఎంతటి పరిస్థితికి దారితీస్తుందంటే..కట్టుకున్న భార్యతోపాటు, చుట్టు ఉన్నవాళ్లకు, అలాగే తనకు సమస్యగా మారిపోతాడు. మొగ్గగా ఉన్నప్పుడే ఆ ధోరణి సరవ్వాలి లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందనేందుకు ఈ వృద్ధుడే ఉదాహరణ..ముంబై విమానాశ్రయంలో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా ఇలా వివరించింది. ఆ పోస్ట్లో ఎయిర్పోర్ట్లో ఓ 50 ఏళ్ల వ్యక్తి రెండు క్యూల వద్దకు వచ్చాడు. అవి ఎయిర్ ఇండియా, ఇండిగో కోసం ఉన్న క్యూలు. అయితే ఆ వ్యక్తి తప్పుగా క్యూలో నిలబడి ఉండటంతో..సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఇది ఆ క్యూ కాదు అని చెబుతున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..అరవడం మొదలుపెట్టాడు. దాంతో అక్కడున్న వాళ్లు ఏం మాట్లాడలేక అలా చూస్తుండిపోయారు. ఇంతలో అతడి కుటుంబం జోక్యం చేసుకుని అతడిని శాంత పరిచేంతవరకు అక్కడ గందరగోళ వాతావరణం సృష్టించాడు. అదంతా చూశాక.. సదరు మహిళ ఇలాంటి మానసిక ప్రవర్తనను రాజా బేటా సిండ్రోమ్గా పేర్కొంది. ఇదేమి మానసిక రోగం కాదని, చిన్నప్పటి నుంచి తానేం చేసిన కరెక్ట్ అనే ధోరణిలో పెరిగిన వాళ్లు ఇలా వింతగా ప్రవర్తిస్తుంటారని, దీని కారణంగా చుట్టూ ఉన్నవాళ్లకు, తనకు సమస్యలు సృష్టిస్తారని అన్నారామె. దక్షిణాది కుటుంబాలలో ముఖ్యంగా పురుషలలో ఈ ధోరణి ఉంటుందని, అందుకు తల్లులు, వారి కుటుంబ ఆలోచన విధానమేనని అన్నారామె. అబ్బాయి కాస్త ఎక్కువ, అమ్మాయిలు కాస్త తక్కువ అనే భావజాలంతో ఉండే కుటుంబాలలో పురుషల మనస్తత్వం ఇలానే ఉంటుందని అన్నారు. దయచేసి ఇలాంటి ప్రవర్తనను దూరం చేసుకోండి లేదంటే..నెమ్మదిగా ఒక సమయానికి మనుషులు దూరమైపోతారంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా తమ కుటుంబంలోని వ్యక్తులు గురించి వివరిస్తూ..తమ అనుభవాలను షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Snowy Rahi | Therapist (@sitwith_rahi) (చదవండి: రుద్ర హెలికాప్టర్ని నడిపిన తొలి మహిళా పైలట్..! ఒంటరి తల్లి..) -
ట్రెండీగా అక్షరాల అలంకరణ..
తెల్లని కాగితం మీద రాసే అక్షరమాల వేడుకలలో ఆధునిక మహిళల అలంకరణగా ఆకట్టుకుంటోంది.పెళ్లి, పుట్టినరోజు, సీమంతం.. వేడుకకు తగినట్టు తమ ప్రియమైన వారి పేర్లు హెయిర్ యాక్సెసరీస్లలోనూ, గాజులు, ఇతర ఆభరణాలలోనూ వచ్చేటట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా చిన్నపిల్లల కేశాలంకరణలో నేమ్ క్లిప్స్ చూస్తుంటాం. ఇప్పుడు వెస్ట్రన్ లేదా ఇండియన్ వేడుకలకు తగినట్టు అన్ని వయసుల వారు తమ కేశాలంకరణలోనూ, ఇతర ఆభరణాలలోనూ అక్షరమాలను అందంగా కూర్చుతున్నారు.నెక్లెస్... హ్యాంగింగ్స్ గానూ...చెవులకు జూకాలు, మెడన హారాలలో తమ ప్రియమైన వారి పేర్లు మెరుస్తూ కనిపిస్తున్నాయి. వేడుక అర్థం తెలిసేలా కూడా అక్షరాలమాలను ధరిస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, థ్రెడ్ జ్యువెలరీలలో సందర్భానికి తగిన అక్షరాలు కనిపిస్తుంటాయి. హల్దీ, మెహెందీ వివాహ వేడుకలలో వధూవరుల పేర్లు కలిసివచ్చేలా డిజైన్ చేసిన ఆభరణాలను కొత్త పెళ్లికూతురు ధరిస్తుండటం కనిపిస్తోంది.కేశాల అలంకరణలో...ఎ నుంచి జెడ్ వరకు ఇంగ్లిష్ అక్షరాలతో తయారు చేసిన వివిధ లోహపు, బీడ్స్ హెయిర్ జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. వరుడి పేరు వచ్చేలా లేదా సందర్భానికి తగిన అర్థం వచ్చేలా, ఫన్ని క్రియేట్ చేసే విధంగానూ అక్షరాలను తలకెక్కించుకుంటున్నారు. వీటిలో స్వరోస్కి, గోల్డ్, ఎంబ్రాయిడరీ, వివిధరకాల పూసల అందాలు అక్షరాల చుట్టూ చేరుతున్నాయి. జడ ΄÷డవును బట్టి కూడా లోహపు అక్షరాల క్లిప్స్ వేల రూ΄ాయల ధర పలుకుతున్నాయి.గాజుల్లో..డ్రెస్కు మ్యాచ్ అయ్యేలా రంగు రంగులతో ఉండే చిన్నా పెద్ద గాజుల ఎంపిక సాధారణమే. అయితే వేడుకలలో మాత్రం స్పెషల్గా కనిపించేలా అమ్మాయిలు తమ పేర్లతో తయారు చేయించుకున్న గాజులను ధరిస్తున్నారు. వీటి డిజైన్కి ఆర్డర్పై కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ చేయించుకోవడంపై బాగా ఆసక్తి చూపుతున్నారు.వివిధ భాషలలో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవాలి అంటే అందుకు తగిన జ్యువెలరీ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి ఆన్లైన్ ΄ోర్టల్స్ బాగా సహాయపడుతున్నాయి. అల్ఫాబెట్ అక్షరాల మాల క్లిప్పుల సెట్ వందల రూ΄ాయల నుంచి నాణ్యత, డిజైన్ను బట్టి వేల రూ΄ాయల వరకు ధర పలుకుతోంది. (చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్గా ఉంటోంది..!) -
పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి..
ఆరోగ్య స్పృహ బాగా ఉన్నవాళ్లు కూడా పండుగ సమయంలో ఫుడ్ విషయంలో తమ నియంత్రణలను కాస్త సడలించుకోవడం, పండుగ వంటల్నిఇ ఆస్వాదించడం సాధారణమే. ఇక భోజన ప్రియులైతే చెప్పనే అక్కర్లేదు. పైగా సంక్రాంతి అంటే 3రోజుల పాటు కొనసాగే పండుగ...పిండింటలకూ కొదవలేని పండుగ. అందుకే ఈ పండుగ సీజన్ తర్వాత,కొంచెం నిస్సత్తువగా అనిపించడం, ఉబ్బరం, తక్కువ శక్తి, నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పండుగ తర్వాత ఆహార విహారాల్లో కొన్ని మార్పు చేర్పులు అవసరం అని సూచిస్తున్నారు.రీహైడ్రేట్, టాక్సిక్స్ బయటకు...పండుగల సమయంలో, మనం తరచుగా అదనపు చక్కెర, నూనె పదార్ధాలు అలవాటున్నవాళ్లు ఆల్కహాల్ కూడా తీసుకుంటారు. ఇవన్నీ డీహైడ్రేషన్, అలసటలతో బాధపెడతాయి. కాబట్టి పండగ తర్వాత రోజుల్ని ఒక సాధారణ దినచర్యతో ప్రారంభించాలి. పుష్కలంగా నీరు త్రాగాలి. ఉదర వ్యవస్థను ఫ్లష్ చేసి హైడ్రేటెడ్గా ఉంచడానికి కనీసం 8–10 గ్లాసుల నీటిని లక్ష్యంగా పెట్టుకోవాలి. నీటిలో నిమ్మకాయ లేదా దోసకాయ ముక్కలను జోడించడం వల్ల మరింత రిఫ్రెష్గా ఉంటుంది తేలికపాటి డిటాక్స్ ఇస్తుంది. అల్లం, పుదీనా లేదా సోంపు వంటి హెర్బల్ టీలు జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి శరీరాన్ని లైట్గా మారుస్తాయి.సమతుల ఆహారం వైపు తిప్పు చూపు...పండుగలు అంటే స్వీట్లు, వేయించిన వంటలతో భారీ భోజనం. ఇక ఇప్పుడు భోజనంలో సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టాలి. జీర్ణక్రియను నియంత్రించడంలో ఉబ్బరం తొలగించడంలో ఫైబర్–రిచ్ ఫుడ్స్, తృణæధాన్యాలు, ఓట్స్ తాజా పండ్లు సహాయపడతాయి.బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను వంటలో చేర్చాలి. పండుగ తర్వాత పెరిగే ఫ్రీ రాడికల్స్ను ఎదుర్కోవడానికి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.కాయధాన్యాలు, పప్పు, కాటేజ్ చీజ్ గుడ్లు వంటి సాధారణ ప్రోటీన్లు కడుపు నిండినట్టు తృప్తికరమైన స్థితిలో ఉంచుతాయి, ఆయిల్ ఫుడ్స్ పట్ల ఇష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.గింజలు, విత్తనాలు తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన నూనెలు (ఆలివ్ లేదా కొబ్బరి నూనె వంటివి) చేర్చాలి.తేలికపాటి ఉపవాసం జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడానికి సులభమైన మార్గం. పూర్తి రోజు చేయలేకపోతే కనీసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే తినడం వంటి పద్ధతిని అనుసరించాలి. తద్వారా రాత్రిపూట 14 గంటల ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. ఈ విధానం శరీరపు పండుగ ఓవర్లోడ్ను ప్రాసెస్ చేయడానికి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది శక్తి స్థాయిలను రీసెట్ చేస్తుంది.పండుగ తర్వాత అలసటతో వ్యాయామాన్ని ఆపేయాలని అనుకోవచ్చు, కానీ సున్నితమైన కదలికలు అయినా తప్పనిసరి. దశలవారీగా 20–30 నిమిషాల నడక రక్త ప్రసరణను పెంచుతుంది, మరింత శక్తినిచ్చేలా చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. తేలికపాటి యోగా భంగిమలు, లోతైన శ్వాసపై దృష్టి సారించి చేసే స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఉబ్బరాన్ని కండరాల బిగుతు ను తగ్గిస్తాయి మానసిక స్పష్టతను మెరుగుపరుస్తాయి.పండుగ రోజుల రాత్రులు, తెల్లవారుఝాములు నిద్ర షెడ్యూల్లను దెబ్బతీస్తాయి. ఆరోగ్యం కోలుకోవడానికి ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడానికి మేల్కొలపడానికి ప్రయత్నించాలి. అలాగే నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్ వీక్షణను నివారించి బదులుగా, పుస్తకం చదవడం మంచిది. ప్రశాంతమైన సంగీతాన్ని వినడం కూడా మంచిదే. నిద్ర పోయే గది పూర్తి నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు ధ్యానం లేదా లోతైన శ్వాస మనస్సును ప్రశాంతపరుస్తుంది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.కొన్ని ఆయుర్వేద చిట్కాలు...డిటాక్స్ వాటర్: ఒక టీస్పూన్ పసుపు లేదా చిటికెడు దాల్చిన చెక్క కలిపిన గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి. రెండు సుగంధ ద్రవ్యాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి పేరుకున్న చెడు టాక్సిన్స్ను తొలగించడానికి సహాయపడతాయి.భోజనానికి చిటికెడు ఆసాఫోటిడా (హింగ్) జోడించడం లేదా సోంపు లేదా అజ్వైన్ నీటిని త్రాగడం అనేవి జీర్ణక్రియను సులభతరం చేయడానికి ఉబ్బరం తగ్గించడానికి సహాయపడతాయి.త్రిఫల పౌడర్: పడుకునే ముందు గోరువెచ్చని నీటితో ఒక టీస్పూన్ త్రిఫల పౌడర్ తీసుకోండి. ఈ ఆయుర్వేద మిశ్రమం ప్రేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.జీలకర్ర, కొత్తిమీర, సోంపు నీరు: ఒక లీటరు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర, కొత్తిమీర, సోంపు గింజలను ఉడకబెట్టండి. జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఉబ్బరం తగ్గించడానికి రోజంతా త్రాగండి.ఒక టీస్పూన్ పసుపు చిటికెడు నల్ల మిరియాలు కలిపిన గోరువెచ్చని పాలు టర్మరిక్ లాట్టే (గోల్డెన్ మిల్క్)ఉపశమనం కలిగించేవి శోథ నిరోధకమైనవి. రోజును ప్రారంభించడానికి వెచ్చని నీటిలో నిమ్మరసం, తురిమిన అల్లం తేనె కలిపితే... ఇది జీర్ణక్రియను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.(చదవండి: పొంగల్వేళ అద్భుతమైన సాంప్రదాయ పులినృత్యం..!) -
బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు..
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్ హెదరాబాద్ సేవలు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఈ విజయవంతమైన మెలురాయిని ఘనంగా జరుపుకుంటోంది. అత్యాధునిక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలను భాగ్యనగర ప్రజలకు అందిస్తూ , యూజెనిక్స్ హెదరాబాద్ కేంద్రంగా విశేష గుర్తింపు పొందింది. హెదరాబాద్లో ప్రారంభమెనప్పటి నుంచి యూజెనిక్స్ అంతరాతీయంగా ఉన్న రోగులకు సైతం ముఖ్యమైనదిగా మారింది. అమెరికా వంటి విదేశీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కేంద్రాలకు ప్రత్యాయమ్నాయంగా అనేక మంది హెదరాబాద్నున ఎంచుకోవడం విశేషం.క్లినికల్ ఖచితత్వం, వ్యక్తిగత చికిత్సా విధానం, నైతిక వౖద్య ప్రమాణాలు, సహజంగా కనిపించే ఉత్తమ ఫలితాల వల్ల హెదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేంద్రాలలో ఒకటిగా ఎదిగింది. ఈ రెండేళ్ల విజయాన్ని పురస్కరించుకొని, నూతన సంవత్సర నేపథ్యంలో యూజెన్స్ హెయిర్ సైన్సస్ హెదరాబాద్లో ‘ఉచిత కన్సల్టేషన్’ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. హెయిర్ లాస్ లేదా జుట్ట పలుచబడే సమస్యలను ఎదుర్కొంటున్న వారు తమ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే దిశగా తొలి అడుగు వేయాలనే ఉదేశంతో ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ ఉచిత కన్సల్టేషన్ లో భాగంగా, యూజెనిక్స్లోని అనుభవజులైన వైద్య నిపుణులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్పా సూచనలు అందిస్తారు. ఈ సందర్భంగా యూజెనిక్స్ హెయిర్ సైన్సస్ ఛైర్మన్ వ్యవస్థాపకుడు, AIIMS – న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ ప్రదీప్ సేథి ఎండి మాట్లాడుతూ…“హెదరాబాద్ లో రెండేళ్ల పూర్తి కావడంతో ఎంతో గర్వకారణం. కేవలం ఒక చికిత్స్ కేంద్రంగానే కాకుండా, ప్రతి రోగి తన సమస్యకు తగిన సంరక్షణ అందుతుందని పూర్తి నమ్మకంతో చికిత్స పొందగలిగే ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. హెదరాబాద్ ప్రజలు మాపై చూపిన నమ్మకాన్నినిలబెట్టుకునేందుకు, వారి జీవితాలలో నిజమెన మార్పు తీసుకొచే ఫలితాలను అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం.” అని అన్నారు. (చదవండి: హై-రైజ్ పెయింటర్..! ఇది కదా సంపాదన అంటే..) -
ట్రెండీగా పవర్ఫుల్ చీరకట్టు స్టైల్..!
చీరకట్టు ఆత్మవిశ్వాసానికి, హుందాతనానికి ప్రతీకగా చూపుతూ సెలబ్రిటీలు రోల్మోడల్స్గా నిలుస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగమైనా పార్టీలో ప్రత్యేకత కోరుకున్నాచీరకట్టుకు బిగ్ బెల్ట్ జత చేసి బ్రైట్గా వెలిగిపోతున్నారు. తమదైన మార్క్ను పవర్ఫుల్గా చూపుతున్నారు. ఇటీవల అంబానీ కుటుంబ సభ్యుల నివాసంలో జరిగిన ఓ వేడుకలో క్రికెట్ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ వేడుకలో డిజైనర్లు శంతను అండ్ నిఖిల్ చేసిన కస్టమైజ్డ్ శారీ డ్రేప్లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కొత్తగా మెరిశారు. చీర కట్టు కూడా ఆమెనో క్రీడాకారిణిగా ఆత్మవిశ్వాసం తొణికిసలాడేలా చూపుతోందా అనిపించేలా ఉంది. నారింజ, నలుపు రంగు కాంబినేషన్లో గల చీరను ఫిటెడ్, హైనెక్ మోడర్న్ బ్లౌజ్తో స్టైల్ చేసింది. నల్లని కార్సెట్ బెల్ట్తో లుక్ని శక్తిమంతంగా మార్చింది. జుట్టును బన్గా సెట్ చేసి, ఆభరణాలను తక్కువగా ధరించి లుక్ను పూర్తి చేసింది. ఈ లుక్ ఆధునిక పవర్ డ్రెస్సింగ్లో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. (చదవండి: అందానికే అందం ప్రియాంక చోప్రా బ్యూటీటిప్స్..!) -
అందానికే అందం ప్రియాంక చోప్రా బ్యూటీటిప్స్..!
బాలీవుడ్ ప్రముఖ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని గ్లోబల్స్టార్గా వెలుగొందుతోందామె. ఎప్పుడూ బిజీగా ఉండే ఆమె సరదా ఫన్నీ విషయాలు, బ్యూటీ అండ్ ఫిట్నెస్ టిప్స్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుంటారామె. అలానే ఈసారి ఓ చక్కటి బ్యూటీ టిప్తో మన ముందుకు వచ్చారు. ఏజ్ పెరిగే కొద్ది ముఖంపై ఏర్పడి రంధ్రాలను టైట్ చేసేలా ముఖం అందాన్ని కాపాడుకోవడటం ఎలాగో షేర్ చేశారామె. మరి ఆ అద్భుతమైన సౌందర్య చిట్కా ఏంటో చూద్దామా..!.ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్, అందానికి కేరాఫ్ అడ్రస్గా పేరుగాంచిన ప్రియంకా చోప్రా రెడ్కార్పెట్ ప్రదర్శనలో అయినా, మ్యాగ్జైన్ కవర్పైన సాధారణ సెల్ఫీలు అయినా..స్టన్నింగ్ లుక్తో మెరిపోతుంటుంది. చర్మ సంరక్షణ విషయంలో చాలా కేర్గా ఉంటుందామె. మేకప్ కంటే నేచురల్ అందానికే ప్రాధాన్యత ఇచ్చే ప్రియాంక చాలా సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలనే అనుసరిస్తుందామె. తాజాగా షేర్ చేసని టిప్ ఏంటంటే..చర్మంపై ఉండే రంధ్రాలు పెద్దగా కనిపంచకుండా..ముఖం వాపుని తగ్గించే చక్కటి కోల్డ్ ఫేషియల్ని పరిచయం చేస్తుంది. ఇది అందరికీ తెలిసందే గానీ ఆమె ఓ ప్రత్యేకమైన డివైజ్తో చాలా సులభంగా చేసుకోవచ్చంటూ సరికొత్తగా చూపించారామె. నిజానికి చల్లటి నీటిలో ముఖం డిప్ చేయడం కాస్త ఇబ్బందికరంగానూ..శ్వాసకు సంబంధించి ఊపిరాడనట్లుగా కూడా ఉంటుంది. అదే ప్రియంక షేర్ చేసిన వీడియోలో బీతింగ్ అటాట్మెంట్తో ఉన్న ఐస్ వాటర్ డింకింగ్ చక్కటి సౌకర్యవంతమైన శ్వాసకు అనుమతిస్తుంది. ముఖం పూర్తిగా మునిగిపోయేలా కొద్దిసేపు ఉంచగలుగుతాం. ఈ ఫేస్టబ్ కోల్డ్ఫ్లంజ్ అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి రూపొందించిన ప్రత్యేక సాధనం. కోల్డ్ ఫేషియల్గా ఇది అద్భుతమైన డివైజ్గా చెప్పొచ్చు. అలాగే ఇలా చేయడం వల్ల ముఖంపై మృతకణాలు తగ్గి ముఖం మంతా రక్తప్రసరణ జరుగుతుంది. ముఖం తాజాగా గ్లో గా ఉంటుందని సెలబ్రిటీలు తప్పకుండా పాటించే టిప్ ఇంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.(చదవండి: వలస వచ్చి.. ప్రేమ ‘నరకం’లో పడి.. ఇప్పుడు ‘కరోడ్పతి’గా..) -
శీతాకాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఆరు సూప్లు..!
శీతాకాలంలో చాలామంది చర్మం పొడిబారి నిగారింపు లేకుండా ఉంటుంది. ఎంత తెల్లటి ముఖమైన చలిగాలికి పెళుసుగా జీవం లేనట్టుగా అయిపోతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ల ముఖం సైతం కళాహీనంగా ఉంటుంది. అందుకోసం ముఖానికి పూసే మాయిశ్చర్లు, క్రీమ్ వంటింటి చిట్కాలే ఉయోగిస్తే సరిపోదు. ఈ వణికించే చలిలో చర్మం ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఈ ఆరు సూప్లను మన డైట్లో భాగం చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. వీటితో అందం, ఆరోగ్యం రెండిటిని సొంతం చేసుకోవచ్చు. చర్మం మెరిసేలా పోషకాలందించే ఆరోగ్యకరమైన ఆ సూప్లు ఏంటో సవివరంగా చూద్ధామా..!.హైడ్రేషన్ని తోడ్పడేలా చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేసే ఈ సూప్లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చట. మాయిశ్చరైజర్లు, సీరమ్లు వంటివి బాహ్యంగా చర్మానికి మద్దతు ఇవ్వగా అంతరంగంగా హెల్ప్ అయ్యే ఆ సూప్లు ఏంటంటే..క్యారెట్, అల్లం సూప్లు: క్యారెట్లో బీటా కెరోటిన్ తోపాటు, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మం మరమత్తుకు, హైడ్రేషన్కీ కీలకమైనది. అల్లం యాంటిబయోటిక్ల పనిచేసి..ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తంఉది. ఈ వింటర్ సీజన్లో ఆరోగ్యానికి శక్తిమంతమైన సూప్గా చెప్పుకోవచ్చు.టమోటా తులసి సూప్: టమోటాలలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మం పాడవ్వకుండా కాపాడుతుంది, మృదువుగా ఉంచుతుంది. తులసిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రిఫ్రెషింగ్ ట్విస్ట్ను అందిస్తుంది. ఇది రుచిగా ఉండటమే గాక చర్మానికి సహజ మెరుపుని అందిస్తుంది కూడా.పాలకూర, కాయధాన్యాల సూప్: పాలకూరలో ఉండే ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ, కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. ఇక కాయధాన్యాలలోని ప్రోటీన్ చర్మ మరమత్తుకు హెల్ఫ అవుతుంది. పైగా చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది.గుమ్మడికాయ సూప్: గుమ్మడికాయలో విటమిన్లు ఏ,సీలు ఉంటాయి. ఇవి తేమను పునురుద్ధరించి చర్మం పొడిబారకుండా చూస్తుంది.దీని క్రీమీ టెక్స్చర్ చర్మ ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. దీనిలోని గుమ్మడి గింజలను కూడా డైట్లో చేర్చుకుంటే..చర్మానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి.చికెన్ అండ్ వెజిటబుల్ సూప్: చర్మాన్ని ఆరోగ్యవంతంగా, తాజాగా ఉండేలా చేస్తుంది. అంతర్లీనంగా మంఇచ ఓదార్పుని, మృదుత్వాన్ని అందిస్తుంది.చిలగడదుంప, కొబ్బరి సూప్: చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి పాలు తేమను నిలుపుకునే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా ఉంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది. ఈ సూప్లు అంతర్లీనంగా చర్మ ఆరోగ్యాన్ని రిపేర్ చేసి అందంగా ఉండేలా చేయడమే కాకుండా ఆరోగ్యపరంగాను ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు డెర్మటాలజిస్ట్లు. -
సత్తు ప్లస్ దాల్చిన చెక్క నీటితో బెల్లీఫ్యాట్ మాయం..!
చాలామందికి బానపొట్ట పెద్దగా ఉండి ఏ డ్రెస్ లేదా చీర కట్టుకోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది. ఓపట్టాన తగ్గదు కూడా. బొడ్డుకొవ్వుతో ఉండే ఇబ్బంది అంత ఇంత కాదు. అలాంటి మొండి బొడ్డుకొవ్వుని ఈ పానీయం సులభంగా కరింగించేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మరి ఆ పానీయం ఏంటో పోషకాహార నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.అతిగా తినడం లేదా క్రమరహిత దినచర్యల కారణంగా అధికబరువు, బెల్లీఫ్యాట్ వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటాం. అలాంటి వారు దాల్చిన చెక్క పొడిని, సత్తు నీటికి జత చేసి తీసుకుంటే అద్భుత ఫలితం ఉంటుదని చెబుతున్నారు నిపుణులు. సత్తులో పుష్కలమైన ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. జీర్ణక్రియకు మద్దతిస్తుంది. పేగు ఆర్యోగం, రక్తంలోని చక్కెర నియంత్రణకు మద్దతిస్తుంది. ఇది బరువు తగ్గడానికే కాకుండా బొడ్డు కొవ్వుని కరిగించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పానీయం మలబద్ధకాన్ని తగ్గించగలదని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ఆకలి బాధను అదుపులో ఉంచగలదు, శక్తిస్థాయిలను పెంచుతుంది. మెక్కల ఆధారిత ప్రోటీన్, ఖనిజాలతో నిండి ఉన్న సత్తు శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది సంక్లిష్ట పదార్థాల మిశ్రమం కాబట్టి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. అలాగే దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను సులభంగా బయటకి పంపించగలదు. తయారీ విధానం.. సత్తు: 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీరు: 1 గ్లాసుదాల్చిన చెక్క పొడి: చిటికెడునిమ్మరసం: కొన్ని చక్కలుచేయు విధానం: సత్తుని గోరువెచ్చని నీటిలో బాగా కలిపి, దానిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి, నిమ్మచుక్కలు వేసి తాజాగా కలుపుకుని తాగితే సరి. అయితే దీనికి చక్కెర వంటి స్వీట్ని జోడించకపోవడమే మంచిది. ప్రయోజనాలు..ఈ పానీయంలో ఉండే అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను నెమ్మదించి, సంతృప్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మొత్తం కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే బొడ్డు చుట్టూ కొవ్వు నిల్వకు దోహదపడే చక్కెర స్పైక్లను నివారిస్తుంది.పైగా రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని సమర్థవంతంగా నిర్వహిస్తుంది.ఎవరికి మంచిది కాదంటే..కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఎందుకంటే సత్తులో అధికంగా ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ఇది తీసుకుంటే మూత్రపిండాలపై మరింత భారం పడుతుంది. కొన్ని రకాల పిండుల మిశ్రమం అయిన ఈ సత్తు కొందరికి ఆయా పప్పులు వల్ల ఎలర్జీ ఉంటే వారికి కూడా మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా ఉండేలా చేస్తుంది కాబట్టి కొందరిలో ఇది హైపోగ్లైసీమియాకు గురయ్యేలా చేసే ప్రమాదం ఉంది. అలాగే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది కాస్త అసౌకర్యాన్ని కలిగించవచ్చు. చివరగా ఈ పానీయం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిచినప్పటికీ..దానికి మన ఆరోగ్యకరమైన జీవనశైలి తోడైతేనే మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతామని అంటున్నారు నిపుణులు. ఇది ఒక్కటే బొడ్డుకొవ్వుని మాయం చేస్తుందనే అపోహలో ఉండొద్దని హచ్చరిస్తున్నారు నిపుణులు. దీనితోపాటు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం, అధిక శుద్ధి చేసిన చక్కెర పదార్థాలను నివారించడం, తగినంత ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం వంటివి చేయాలి. అలాగే తేలికపాటి వ్యాయమాలు కూడా జోడిస్తే..మరిన్ని ప్రయోజనాలను పొందగలమని చెబుతున్నారు నిపుణులు. అలాగే భోజనం చేసిన వెంటనే కాస్త నాలుగు అడుగులు వేయమని సూచిస్తున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నటుడు ఆర్నాల్డ్ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..) -
శాకాహారంతో సహజ సౌందర్యం: జాక్వెలిన్ ఫెర్నాండెజ్
శీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ..అక్కడ వేలాది అభిమానులను సొంతం చేసుకున్నారామె. అంతేగాదు ఫ్యాషన్, ఫిట్నెస్ విషయంలో ఐకాన్. ఎప్పటికప్పడూ సోషల్ మీడియాలో తన ఆహారం, వ్యాయామాల గురించి నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారామె. అలానే ఈ సారి ఆమె తాను శాకాహారిగా మారడంతో తన బాడీలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయంటూ షేరు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం గురించి స్వయంగా చెప్పారామె.తాను మొక్కల ఆధారిత భోజనం తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత తన శరీరంలో చాలా మార్పులు సంతరించుకున్నాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన ముఖంలో సహజసిద్ధమైన మెరుపు రావడమే గాక మొటిమలు కూడా మాయమైపోయాయని అన్నారామె. తన చర్మ సంరక్షణ విషయంలో అద్భుతంగా ఈ డైట్ పనిచేసిందన్నారు. తాను మొటిమలతో చాలా ఇబ్బంది పడ్డానని, ఎప్పుడైతే శాకాహారిగా మొక్కల ఆధారితో ఫుడ్ని తీసుకోవడం ప్రారంభించానో అప్పటి నుంచి మొటిమలు, మచ్చలు తగ్గి కాంతిమంతంగా ఉందని తెలిపింది. అలాగే బరువు సైతం అదుపులో ఉంది. ఇంతకుమునుపు తగ్గుతూ..పెరుగుతూ ఉండేది. కానీ ఈ శాకాహారం మన బరువుని అద్భుతంగా అదుపులో ఉంచుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నమ్మకంగా చెప్పుకొచ్చారామె. అందుకు శాస్త్రీయ నిర్థారణ లేకపోయినా..పొట్ట ఉబ్బరం, బరువు విషయంలో చాలా రిలీఫ్ పొందానంటోంది. శరీరాని అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు అందుతాయి. View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) ముఖ్యంగా మంచి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. మాంసకృత్తులు సైతం మొక్కల ఆధారిత ఆహారం నుంచే పొందవచ్చని అంటుందామె. అందుకోసం కూరగాయలు, బీన్స్, టోపు వంటి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవాటిని తీసుకుంటే చాలని చెబుతోంది. అలాగే నోటి శుభ్రత కోసం ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటానని, ఒక లీటరు డిటాక్స్నీరు తాగి హైడ్రేషన్గా ఉండేలా చూసుకుంటానని చెబుతోంది జాక్వెలిన్.(చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్ రీల్స్తో మొదటి సంపాదన..!) -
న్యూ ఇయర్ హ్యాంగోవర్: ఇలా చేస్తే క్షణాల్లో రిలీఫ్..!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో రాత్రంత ఆడిపాడి ఎంజాయ్ చేయడం కామన్. ముఖ్యంగా బిర్యానీలు, కూల్డ్రింక్స్తో చిల్ అవ్వుతూ..తెలియకుండానే ఎక్కువగా లాగించేస్తాం. దానికి తోడు లేటుగా ఏ అర్థరాత్రో బాగా పొద్దుపోయాక పడుకోవడంతో..తిన్న ఆహారమంతా అరగక పొద్దున్నంతా నరకరం చూస్తాం. తలంత పట్టేసి..అబ్బా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. ఆ హ్యాంగోవర్ని వదులించుకోవడం అంత ఈజీ కాదు కూడా. అలాంటి సమస్యను ఈ రిఫ్రెషింగ్ డిటాక్స్ పానీయాలతో సులభంగా చెక్ పెట్టేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందామా..!.రాత్రిపూట..అందులోనూ బాగా లేట్నైట్ వేపుళ్లు, అధిక నూనెతో కూడిన పదార్థాలు తినడం కారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, వికారం, పొట్ట ఉబ్బరం, అలసట, పార్టీ హ్యాంగోవర్ వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి వాళ్లు ఈ సమస్య నుంచి తర్విరతగతిన రిలీఫ్ పొందాలంటే సరైన డిటాక్స్ పానీయాలను తీసుకుంటే చాలు అని చెబుతున్నారు. ఇవి హైడ్రేటెడ్గా ఉండేలా చేసి, కాలేయ పనితీరు, జీర్ణక్రియకు మద్దతిస్తాయి. శరీరం వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయట. ముఖ్యంగా మద్యం సేవించినవారికి ఇవి మరింత హెల్ప్ అవుతాయని చెబుతున్నారు. ఇవి ఇంట్లోనే సులభంగా తయరు చేసుకోవచ్చట కూడా. గోరువెచ్చని నీళ్లు నిమ్మకాయ..ఇది హ్యాంగోవర్కు చాలా ప్రయోజనకరమైనది. గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు హైడ్రేటెడ్గా ఉండేలా చేసి, జీర్ణక్రియను ప్రేరేపిస్తుందట. విటమిన సీ మోతాదు..కాలేయ ఎంజైమ్లకు మద్దతిస్తుందట. వికారం, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. చిటికెడు ఉప్పు, కొబ్బరి నీరు.. కొబ్బరి నీరు, ఉప్పు శరీరాన్ని తిరిగా ఉత్సాహభరితంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని పొటాషియం, సహజ ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది హైడ్రేషన్కి అనువైనది. అలాగే శరీరంలోని సోడియం స్థాయిలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. కడుపుని తేలికగా చేస్తుంది. తలతిరగడం, నోరు పొడిబారడం, వంటి సాధారణ హ్యాంగోవర్ లక్షణాలను తగ్గిస్తుంది. అల్లం, తేనె నీరుఅల్లం, తేనె నీరు అనేది హ్యాంగోవర్ను సులభంగా నయం చేసే అద్భుతమై డీటాక్స్ వాటర్. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తుంది. వికారం తగ్గడమే కాకుండా ఇందులోని తేనే సహజ గ్లూకోజ్ని అందిస్తుంది.దోసకాయ, పుదీనా, నిమ్మకాయ డిటాక్స్ వాటర్ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి, హైడ్రేషన్కు మద్దతిస్తుంది. ముక్కలు చేసిన దోసకాయ, పుదీనా ఆకులు, నిమ్మకాయ ఒక బాటిల్ వాటర్లో వేసి రోజంతా త్రాగండి. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుదీనా జీర్ణక్రియకు మద్దతిస్తుంది. నిమ్మకాయ కాలేయ పనితీరుకు మద్దతిస్తుంది.ఉసిరి నీళ్లు..శీతాకాలంలో ఉసిరిని చేర్చుకోవడం ఎంతో మంచిది. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి మద్దతిస్తాయి. ఆల్కహాల్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. హ్యాంగోవర్ తర్వాత అద్భుతమైన రికవరీ పానీయంగా మారుతుంది. అలాగే జీర్ణక్రియకు, శక్తి స్థాయిలను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది,జీరా (జీలకర్ర) నీరుజీరా కలిపిన నీరు మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా నూతన సంవత్సరానంతర హ్యాంగోవర్ను నయం చేయడానికి కూడా గొప్ప నివారణి కూడా. జీరా నీటి ఆమ్లత్వం పొట్ట ఉబ్బరం నుంచి బయటపడేలా చేస్తుంది. బరువు, మలబద్దకం, కడుపు అసౌకర్యం వంటి వాటి నుంచి బయటపడేలా చేస్తుంది.నివారించాల్సినవి:హ్యాంగోవర్ సమయంలో వీటికి మాత్రం దూరంగా ఉండాలికాఫీ తీసుకోకుంటేనే మంచిది. ఆ సమయంలో కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్లు రక్తంలోని చక్కెరను పెంచుతాయి, అలాగే కాలేయంపై మరింత ఒత్తిడి ఏర్పడేలా చేస్తుంది. నొప్పి నివారణ మందులు దరిచేరనివ్వకుండా ఉండటం.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్కి..) -
అక్కడ కాఫీ షాప్కి వెళ్లాలంటే హెల్మెట్ ధరించాల్సిందే..! ఎందుకో తెలుసా?
సాహసమే చేయ్రా డింభకా. అన్నది కదరా పాతాళభైరవి. చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది అన్న పాట పాడుకుంటూ సాహసం చేయాల్సిందే అక్కడ కాఫీ కోసం. హాయిగా ఆస్వాదించే కమ్మటి కాఫీ కోసం అంత కష్టపడటం ఏంటి అనుకోకండి. ఎందకంటే ఇక్కడ కాఫీ షాపు వెళ్లడం అంటే డేరింగ్ టూర్ లాంటిది. నిజానికి ఇక్కడకు కాఫీ కోసం వెళ్తున్నట్లు ఉండదు..ఏదో పర్యాటకానికి వచ్చామా..అన్నట్లు ట్రెక్కింగ్లు, రకరకాల విన్యాసాలు చేసుకుంటూ పోవాలి. అలా అని వాళ్లేమి మనకు టాస్క్లు, సరదా గేమ్లు పెట్టడం లేదు. ఆ కాఫీ షాపుకు వెళ్లే వే అలా సాహసానికి కేరాఫ్గా ఉంటుంది. ఇంతకీ ఆ కాఫీ షాపు ఎక్కడుందంటే..చైనాలోని యాంగ్షువో కౌంటీలోఈ వింతైన షాపు ఉంది. దీనిని 'ఎర్త్కోర్ ఎక్స్ప్లోరేషన్' అని పిలుస్తారు. ఒక గుహ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలా అని అంత ఈజీగా అది మనకు కనిపించదు. సాహసాలంటే ఇష్టపడే పర్యాటక ఔత్సాహికులకు ఈ కాఫీ షాప్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడకు వెళ్లాలంటే అడుగడుగున ఓ సాహాసం చేయాలి, కొన్ని క్లిష్టమైన టాస్క్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వెళ్తునప్పుడూ మన కాఫీ కోసం వెళ్తున్నామా..లేక ఏదైనా ట్రెక్కింగ్ లేదా టూర్కి వచ్చామా అనే సందేహం కలుగకమానదు. అంతేకాదండోయ్ ఈ గుహ గుండా వెళ్లేటప్పుడూ హెల్మెట్, సురక్షితమైన బూట్లు తప్పనిసరి. గుహ గట్లు, ఇరుకైన మార్గాలు, లోతుగా ఉండే ప్రదేశాలు, కొన్నిచోట్ల తాళ్లు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరికొన్ని చోట్ల..నిర్జన చీకటి ప్రదేశం గుండా వెళ్లి..అక్కడ వంతెనలు ఎక్కాల్సి ఉంటుంది. అలా చివరికి కాఫీ కేఫ్కి చేరుకుంటాం. అక్కడ సున్నపురాయి నిర్మాణాలు, స్టాలక్టైట్లు(మంచులా కనిపించే కాల్షియం కార్బొనేట్ అవపాతం), పైకప్పులు, చక్కటి లైటింగ్తో మరో ప్రపంచంలోకి అగుడుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అరకరడ ఉన్న శ్వేత నేపథ్యానికి తగ్గట్టు ఉండే తెల్టి కుర్చీలు మొత్తం సెటప్ అదరహో అనిపిస్తుంది. భూగర్భ శాస్త్రాన్ని కాఫీ సంస్కృతితో కలుపుతున్నట్లుగా ఉంటుంది అక్కడి వాతావరణం. ఈ కాఫీ కోసం ఎంతో శ్రమపడి వెళ్లి హాయిగా టేస్టీ కాఫీని ఆస్వాదించాల్సి ఉంటుంది మరి. మాములుగా కాఫీ తాగేస్తే మజా ఏం ఉంది..ఇలా డేరింగ్ ఫీట్లు చేస్తూ వెళ్లి కాఫీ తాగడంలోని కిక్కే వేరబ్బా..!. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Jérôme Poirier (@jerometraveller) (చదవండి: Fast Track Immigration: ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే..? సుస్మితా, రాణి ముఖర్జీలు సైతం..) -
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి..రోమ్ టూర్లో రష్మిక ఫ్యాషన్ వైబ్..!
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ వారు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. తాజాగా ఇప్పుడు వారి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ జంట ఫిబ్రవరి 26, 2026న విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్. ఇదెంత వరకు వాస్తవం అన్నది తెలియదు కానీ రష్మిక, హీరో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఆమె స్నేహితులతో కలిసి రోమ్ టూర్లో ఉంది. ఆ యూరోపియన్ విహారయాత్రలో తన అభిమానులను ఫ్యాషన్ లుక్స్తో అలరిస్తోంది. లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్లో ఫ్యాషన్ ఐకానిక్గా..గోధుమ రంగు లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్లో వింటర్ ఫ్యాషన్ ఐకాన్గా మెరిసింది రష్మిక. ఆ కోట్ సరికొత్త ఫ్యాషన్ వైబ్స్ని సృష్టించింది. నిట్టెడ్ టాప్లో రష్మిక మందన్నరష్మిక మందన్న ధకించిన బూడిద రంగు అల్లిన టాప్లో సరికొత్తగా కనిపించింది. ముఖ్యంగా చేతిలో పువ్వుల గుత్తితో స్టన్నింగ్ లుక్తో ఆకట్టుకుంది. అందుకు తగ్గట్టు డార్క్ ఫ్రేమ్డ్ గ్లాసెస్, మెటల్ బ్యాండ్తో స్టైలిష్ రిస్ట్ వాచ్తో లుక్ను అలంకరించింది. బ్రౌన్ స్వెటర్లో వ్యాపారవేత్తలా..అల్లిన గోధుమ రంగు స్వెటర్, చంకీ బ్లాక్ గ్లాసెస్లో అదరహో అనిపించేలా ఉంది ఆమె ఆహార్యం.రష్మిక మందన్న రోమ్ వార్డ్రోబ్తో ఫ్యాషన్ ప్రియులను అలరించింది. నటి క్రీమ్ స్వెటర్, డెనిమ్ జీన్స్పై పొరలుగా ఉన్న మరొక నల్ల ట్రెంచ్ కోటును స్టైలిష్ ఐకాన్గా కనిపించింది. ఎక్కడ మేకప్ లేకుండా..చాలా సింపుల్గా సాదాసీదాగా నేచురల్ లుక్లో కనిపించి నేచరల్ స్టార్ అంటే సహజసిద్ధమైన అందం అని ఎలుగెత్తి చాటింది.(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..) -
మైగ్రేన్ తలనొప్పి ఎందుకొస్తుందంటే..!
మైగ్రేన్తో బాధపడేవారికి పనిదినాన్ని కోల్పోవడం లేదా అనారోగ్య సెలవు తీసుకోవడం సాధారణ అనుభవమే. అయితే, ఇది ఉత్పాదకత తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసు గల వారిలో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. క్రమరహిత పనివేళలు లేదా సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు సరైన భంగిమలో కూర్చోవడంలో పొరపాట్లు, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్కు కారణాలు. ఈ సవాళ్లను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం అని అంటున్నారు యశోదా హాస్పిటల్స్ డాక్టర్ జయదీప్ రే చౌదరి.మైగ్రేన్ సమయంలో ఏం జరుగుతుందంటే..ప్రపంచవ్యాప్తంగా, మైగ్రేన్ను కేవలం తలనొప్పిగా కాకుండా, ఒక నర సంబంధ వ్యాధిగా గుర్తిస్తున్నారు. గణాంకాల ప్రకారం, ప్రతి నలుగురిలో ఒకరు మైగ్రేన్తో బాధపడుతుండగా, భారతదేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారని అంచనా. ది లాన్సెట్ (2019) నివేదిక ప్రకారం, మైగ్రేన్లు ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధికంగా అంగవైకల్యాన్ని కలిగించే నర సంబంధ వ్యాధిగా పేర్కొంది.చాలా మంది రోగులు మైగ్రేన్తో జీవితాంతం పోరాడాల్సి వస్తుంది. దీనివల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన ప్రభావాలు ఎదురవుతాయి. మైగ్రేన్ సమయంలో, మెదడు తన చుట్టూ ఉన్న రక్షణ పొరలైన మెనింజెస్కు సంకేతాలను పంపుతుంది. దీనికి ప్రతిస్పందనగా, CGRP (కాల్సిటోనిన్ జన్యు-సంబంధిత పెప్టైడ్) వంటి రసాయనాలు విడుదలవుతాయి. ఈ CGRP నిర్దిష్ట గ్రాహకాలతో బంధించబడినప్పుడు, మెనింజెస్లోని రక్తనాళాలు విస్తరించి వాపుకు గురవుతాయి.ఈ నాళాల విస్తరణ, క్రిమిరహిత వాపు కలయిక మైగ్రేన్ లక్షణ నొప్పిని ఉత్పత్తి చేస్తుంది. నొప్పి సంకేతం అప్పుడు మెదడులోకి తిరిగి ప్రయాణిస్తుంది, అక్కడ అది ప్రాసెస్ చేయబడుతుంది, ఫలితంగా వికారం, కాంతికి సున్నితత్వం (ఫోటోఫోబియా), ధ్వనికి సున్నితత్వం (ఫోనోఫోబియా) వంటి లక్షణాలు ఏర్పడతాయి. పరిష్కారం ఎలాగంటే..యశోదా హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జయదీప్ రే చౌదరి, ఈ సమస్యను ఇలా పరిష్కారిస్తామని చెప్పుకొచ్చారు. లక్ష్యం కేవలం నొప్పిని లేదా ఒక్కో ఎపిసోడ్ను నియంత్రించడం మాత్రమే కాదు, మైగ్రేన్ నుంచి నిజమైన విముక్తిని సాధించడం. ఇందుకు మైగ్రేన్ వచ్చే పౌనఃపున్యాన్ని తగ్గించడం, దాని వ్యవధిని కుదించడం మరియు రోజువారీ జీవితంపై పడే ప్రభావాన్ని తగ్గించడం అవసరం. అలా చేయడం ద్వారా ప్రజలు తమ జీవన నాణ్యతను తిరిగి పొందగలుగుతారు, పనికి పూర్తి స్థాయిలో తిరిగి చేరగలుగుతారు. మైగ్రేన్ నుంచి స్వేచ్ఛను పొందడమే మా తుది ఆశయం.”పని రోజుల్లో మైగ్రేన్ ప్రభావంభారతదేశంలో మైగ్రేన్లు ఉత్పాదకతపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. మైగ్రేన్తో బాధపడే వ్యక్తులు నెలకు సగటున 5.9 పనిదినాలను కోల్పోతున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా ఇబ్బందులు పెరగడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారమైన ప్రభావం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆదాయ నష్టం, జీవన నాణ్యతతో బాధపడుతున్నారు. మైగ్రేన్ కారణంగా వారు ముఖ్యమైన పని, వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నారు, చివరి నిమిషంలో ప్లాన్లను రద్దు చేయాల్సి వస్తోంది లేదా శరీరం సహకరించకపోయినా పని చేయాల్సి వస్తోంది. దీని కారణంగా భారతదేశంలో ఒక్క వ్యక్తికి సంవత్సరానికి సగటు ఆర్థిక నష్టం రూ. 8,731గా అంచనా. అంటే దేశానికి మొత్తం ఆర్థిక నష్టం సుమారు రూ. 18,674 కోట్లకు పైగా నష్టంగా అంచనా.ఇది శారీరక నొప్పిని మించి, మైగ్రేన్లు తరచుగా ఏకాగ్రత లోపానికి, పని వేగం తగ్గడానికి, పనితీరు మందగించడానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇవి వ్యక్తులను తమ వృత్తి ఎంపికలు, కెరీర్ మార్గాలను మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితికి కూడా నెట్టేస్తాయి.ఈ సమస్య నుంచి బయటపడాలంటే..మైగ్రేన్ సంరక్షణకు సమగ్ర దృక్పథం అవసరం. రోగులు సూచించిన మందులు, వైద్య సలహాలను క్రమబద్ధంగా అనుసరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈ జోక్యాలు దీర్ఘకాలిక వ్యాధి భారాన్ని గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చికిత్స ప్రారంభ సమయం, సాధ్యమైన దుష్ప్రభావాలు, చికిత్సకు కట్టుబడి ఉండటం వంటి అంశాలపై వైద్యులు, న్యూరాలజిస్టులతో జరిగే స్పష్టమైన, నిరంతర కమ్యూనికేషన్ నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది.తలనొప్పి ప్రారంభమైన వెంటనే మైగ్రేన్ మందులు తీసుకుంటే అవి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే, నిర్మాణాత్మక పని విరామాలు తీసుకోవడం, సరిపడా నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన నిద్రా సమయాలను పాటించడం, స్క్రీన్ సమయం-తో పాటు స్క్రీన్ కాంతిని సమర్థంగా నిర్వహించడం వంటి జీవనశైలి చర్యలు మైగ్రేన్ దాడుల తరచుదనాన్ని గణనీయంగా తగ్గించగలవు. తలనొప్పి డైరీలో లక్షణాలు, ట్రిగ్గర్లను నమోదు చేయడం ప్రారంభ దశలోనే జోక్యం చేసుకోవడానికి, అలాగే వ్యక్తిగత ట్రిగ్గర్లను గుర్తించి నివారించడానికి ఒక ఉపయోగకరమైన అభ్యాసంగా పనిచేస్తుంది.ఇంటర్నేషనల్ హెడకే సొసైటీ తన క్లినికల్ థెరపీ దృక్కోణంలో ‘మైగ్రేన్ ఫ్రీడమ్’ అనే కొత్త లక్ష్యాన్ని ప్రతిపాదించింది. ఇకపై చికిత్స లక్ష్యం కేవలం నొప్పిని తగ్గించడం లేదా ఒక్కో ఎపిసోడ్ను నివారించడం మాత్రమే కాదు, మైగ్రేన్ నుంచి సంపూర్ణ విముక్తిని సాధించడమే. ఈ దృక్కోణం వ్యక్తులు తమ సాధారణ పనితీరును తిరిగి పొందేందుకు, వేగంగా పనికి పునరాగమనం చేసేందుకు, మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుచుకునేందుకు సహాయపడటంపై దృష్టి సారిస్తుంది. సరైన ఔషధ చికిత్స, వ్యక్తిగత ట్రిగ్గర్లను గుర్తించడం, లక్ష్యిత జీవనశైలి సర్దుబాట్ల సమన్వయంతో, ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది. మనస్సు స్పష్టంగా, పనిదినాలు ఉత్పాదకంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది.--డాక్టర్ జయదీప్ రే చౌదరి, న్యూరాలజిస్ట్, యశోదా హాస్పిటల్స్(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..) -
భావోద్వేగ మద్దతుకు పెరుగుతున్న డిమాండ్..! ఈ ఏడాదిలోనే ఏకంగా..
దేశవ్యాప్తంగా భావోద్వేగ మద్దతుకు డిమాండ్ పెరుగుతోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలు ఈ ఏడాది ఎక్కువగా వినిపించాయి. ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల సమస్యలు, చదువుపై ఒత్తిడి, ఉద్యోగ భారం, గుర్తింపు సంక్షోభం, సామాజిక ముద్ర వంటి అంశాలతో బాధపడుతున్నవారి నుంచి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మానసిక ఆరోగ్య అవగాహన, ఆత్మహత్య నివారణ హెల్ప్లైన్ 1లైఫ్ (www.1life.org.in – 7893078930)కు నిరంతరంగా, భారీగా కాల్స్ వచ్చాయి. మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన పెరగంతో పాటు భావోద్వేగ సమస్యల తీవ్రత, సంక్లిష్టత కూడా పెరిగినట్టు ఇది స్పష్టం చేసింది. 2025లో జనవరి నుంచి డిసెంబర్ మధ్య వరకు 1లైఫ్కు మొత్తం 38,437 కాల్స్ వచ్చాయి. ఈ సంఖ్య అవసరం ఎంత పెద్దదో తెలియజేయడమే కాకుండా, సాధారణ బాధలు సంక్షోభం స్థాయికి చేరకముందే వాటిని అడ్డుకునే విషయంలో అనుభూతితో వినడం, సమయానికి స్పందించడం ఎంత కీలకమో స్పష్టం చేసింది. సంవత్సరం మొత్తం కాల్స్ సంఖ్య క్రమంగా పెరిగింది. జనవరిలో 2,224గా ఉన్న నెలవారీ కాల్స్ సెప్టెంబరులో గరిష్ఠంగా 4,135కు చేరాయి. ఈ పెరుగుదల 86%. జులై నుంచి అక్టోబర్ వరకు నెలకు దాదాపు 4,000 కాల్స్ వచ్చాయి. ఈ పెరుగుదల సీజనల్ కాదని, భావోద్వేగ, మానసిక ఆరోగ్య సమస్యలు నిరంతరంగా పెరుగుతున్నాయని ఈ గణాంకాలు సూచించాయి. ఏడాది మొత్తం వాలంటీర్లు కాలర్లకు మద్దతు ఇవ్వడానికి 1,838 గంటలు కేటాయించారు. సగటు కాల్ వ్యవధి కూడా పెరిగింది. ఈ సేవల గురించి 1లైఫ్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ రెబెక్కా మారియా మాట్లాడుతూ, “ప్రతి కాల్ వెనుక బాధ, అయోమయం, ఒంటరితనం కథలుంటాయి. ఆ బాధను ఇతరులతో పంచుకోవడానికి చాలామందికి భద్రత అనిపించదు. మేము చూస్తున్నది సంఖ్యల పెరుగుదల కాదు, బాధ తీవ్రత పెరుగుదల. చాలామంది కాలర్లు సమయం, సహనం, తమ భావాలకు విలువ ఉందన్న భరోసా కోరుతున్నారు. సంక్షోభ తరుణం దాటిన తర్వాత కూడా మద్దతు ఉంటుందన్న నమ్మకాన్ని వారు ఆశిస్తున్నారు” అని తెలిపారు. 1లైఫ్కు వచ్చిన కాల్స్ స్వరూపం కాలర్ల సవాళ్ల విస్తృతి, లోతును ప్రతిబింబించింది. ఆర్థిక ఒత్తిడి, సంబంధాలు చెడిపోవడం, చదువు, పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, ర్యాగింగ్, వ్యాపార నష్టాలు తదితర కారణాలతో ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నవారి నుంచి భారీగా కాల్స్ వచ్చాయి. ఇటీవల దక్షిణ, ఉత్తర భారతదేశాల నుంచి కూడా కాల్స్ పెరిగాయి. “నేటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భావోద్వేగ సహాయానికి పెరుగుతున్న డిమాండ్ అదే విషయాన్ని తెలియజేస్తోంది. ఎవరికీ వినేవారు లేరన్న భావన రాకుండా చూడడానికే 1లైఫ్ పనిచేస్తోంది. కాల్స్ సంఖ్య పెరుగుతుండటం దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య అవగాహన, వాలంటీర్ శిక్షణ, అందుబాటులో ఉండే మద్దతు వ్యవస్థలపై మరింత పెట్టుబడి అవసరమని స్పష్టం చేస్తోంది” అని 1లైఫ్ డైరెక్టర్ టి.శ్రీకర్ రెడ్డి తెలిపారు. ఇటీవలి పలు సంఘటనలు ఈ గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాయి. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల యువకుడు ఆన్లైన్ పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో భారీగా నష్టపోయిన తర్వాత 1లైఫ్ను సంప్రదించాడు. అతడు ఇంటిని, భార్య ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితి అతడిని తీవ్ర నిరాశకు, ఆత్మహత్య ఆలోచనలకు నెట్టింది. 1లైఫ్ సానుభూతితో వినడం ద్వారా అతడికి తన బాధను చెప్పుకొనే అవకాశం కల్పించింది. సహాయం అందుబాటులో ఉందన్న భావనను అతడిలో మళ్లీ తీసుకొచ్చింది. మరో ఘటనలో ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల మహిళ ఆరేళ్ల బంధం ముగిసిన తర్వాత 1లైఫ్ను సంప్రదించారు. తామిద్దరం దూరంగా ఉన్నప్పుడు తన భాగస్వామి సహోద్యోగితో సంబంధం పెట్టుకున్నట్టు ఆమెకు తెలిసింది. ఆ మోసం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. మానసికంగా కుంగిపోయిన ఆ క్షణంలో ఆమె మద్దతు కోరారు. వివక్షను ఎదుర్కొంటున్నవారి నుంచి కూడా 1లైఫ్కు కాల్స్ వస్తున్నాయి. పశ్చిమబెంగాల్కు చెందిన 23 ఏళ్ల ట్రాన్స్జెండర్.. సమాజధోరణి తనను ఒంటరిగా, నిరుత్సాహంగా మార్చిందని చెప్పారు. ఎంబీఏ పూర్తిచేసి ఐటీ రంగంలో పనిచేస్తున్నా, తరచూ అవహేళన, దూరం పెట్టడం ఎదురయ్యాయి. అవి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. సంభాషణలో తీర్పు ఏమీ ఇవ్వకుండా ఆమె అనుభవాలను గుర్తించి, అంగీకరించారు. 2025 గణాంకాలు, అనుభవాలు దేశవ్యాప్తంగా వేలమందికి 1లైఫ్ కీలక జీవనాధారంగా నిలుస్తున్నట్టు స్పష్టం చేశాయి. అదే సమయంలో పెరుగుతున్న డిమాండ్ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అవి సూచించాయి. సామాజిక, ఆర్థిక, వృత్తిరంగాల్లో మానసిక ఆరోగ్య సవాళ్లు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో వాలంటీర్ల నియామకం, శిక్షణ, నిర్వహణ మద్దతుపై నిరంతర పెట్టుబడి అత్యవసరమని ఈ అనుభవాలు తెలియజేశాయి. (చదవండి: సెరిబ్రల్ పాల్సీ బాధితుడి సక్సెస్ స్టోరీ..తొలి ప్రయత్నంలోనే ఇంజనీరింగ్ సర్వీస్ సత్తా చాటి..) -
ఈ ఏడాది హెల్త్కేర్ ట్రెండ్స్ ఇవి..!
వైద్యరంగంలో ఏడాదికేడాదీ చాలా అభివృద్ధులను నమోదు చేస్తోంది. కొత్త కొత్త సాంకేతిక పరిణామాలను, సరికొత్త చికిత్స ప్రక్రియలను రూపొందించుకుంటోంది. కొన్ని పరిణామాలైతే మొత్తం హెల్త్ కేర్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక జబ్బుకు అందరికీ ఒకే రకరమైన స్టాండర్డ్ చికిత్స నుంచి... మెల్లగా ఆయా వ్యక్తుల తాలూకు జన్యుస్వభావాలను బట్టి వ్యక్తిగతమైన (పర్సనలైజ్డ్) చికిత్స వరకు ఇలా రకరకాల మార్పులను నమోదు చేసుకుంటోంది. కొద్దిరోజుల్లోనే 2025 వెళ్లిపోయి... మనమంతా 2026లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది హెల్త్ కేర్ రంగంలో నమోదైన కొన్ని మార్పులను పరిశీలిద్దాం...పర్సనల్ కేర్ కొల్హాపూర్ టు హిందుస్థాన్ యూనిలీవర్ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లగ్జరీ హౌజ్కు నాయకత్వం వహించడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. ఆ ఘనత సాధించి సత్తా చాటిన మహిళ...లీనా నాయర్. కొల్హాపూర్ నుండి లగ్జరీ హౌజ్ ‘చానల్’ నాయకత్వ బా«ధ్యతల వరకు లీనా నాయర్ ప్రయాణం స్ఫూర్తిదాయకమైనది. ఇంజినీర్ నుండి హెచ్ఆర్ ప్రొషనల్గా మారింది. హిందుస్థాన్ యూనిలీవర్లో ఎన్నో అడ్డంకులు బద్దలు కొట్టి ఆ ప్రసిద్ధ సంస్థలో మొదటి మహిళా చీఫ్ హ్యుమన్ రిసోర్స్ ఆఫీసర్ అయింది. ‘ఛానల్’ గ్లోబల్ సీయివోగా లీనా నాయర్ 36,000 మంది ఉద్యోగులకు మార్గనిర్దేశం చేస్తోంది. తన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా ఈ సంవత్సరం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(సిబిఇ) అవార్డ్ అందుకుంది.కోట్లాది హృదయాలను గెలిచిన... హార్ట్ ల్యాంప్తన కథల సంకలనం ‘హార్ట్ ల్యాంప్’తో ఈ సంవత్సరానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది బాను ముస్తాక్. ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి కన్నడ రచయిత్రిగా చరిత్ర సృష్టించింది. 1990–2023 మధ్య ముస్తాక్ రాసిన ఈ కథలు దక్షిణ భారత ముస్లింల కష్టాలను హృద్యంగా ఆవిష్కరిస్తాయి. ప్రాంతీయ కథలకు విశ్వజనీనత ఉంటుంది’ అనే ముస్తాక్ నమ్మకాన్ని ‘హార్ట్ ల్యాంప్’ నిజం చేసింది.ముస్తాక్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఎనిమిదేళ్ల వయసులో ఆమెను ఒక కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు. అక్కడ బోధనా మాధ్యమం రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ. కన్నడ భాషలో అనర్ఘళంగా మాట్లాడడానికి ముస్తాక్ చాలా కష్టపడింది. ఆ అపరిచిత భాషనే తన సాహిత్య వ్యక్తీకరణగా చేసుకుంది.అత్యంత నిశితమైన వైద్య చికిత్సలు (ప్రెసిషన్ మెడిసిన్)...ఒక జబ్బుకు అందరికీ టోకుగా ఒకేలాంటి చికిత్స అందించడానికి బదులుగా ఆయా వ్యక్తి భౌలిక, మానసిక, జన్యుపరమైన స్వరూప స్వభావాలను బట్టి అతడికి మాత్రమే ఉద్దేశించిన చికిత్స అందించడాన్ని పర్సనలైజ్డ్ మెడిసిన్గా చెప్పవచ్చు. అది ఆ వ్యక్తి జబ్బును బట్టి, దాని తీవ్రత ను బట్టి అలాగే అతడి జెనెటిక్స్, అతడుండే వాతావరణం (ఎన్విరాన్మెంట్), అతడి జీవనశైలి... ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తికే పూర్తిగా సరిపడేలా చికిత్స అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్నే అత్యంత నిశితమైన వైద్య చికిత్స అంటూ ద రాయల్ సొసైటీ ఆఫ్ థాయిల్యాండ్ పేర్కొంటోంది. ఈ రంగంలో ఈ ఏడాది గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది.టెలీహెల్త్...నిజానికి టెలీహెల్త్ అనే కాన్సెప్ట్ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే మునుపు దీని పరిధి చాలా తక్కువ. ఉదాహరణకు హైదరాబాద్లో అత్యంత నిపుణులైన, అనుభవజ్ఞులైన వైద్యులు ఉండవచ్చు. కానీ ఎక్కడో అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ఓ పల్లెలో ఒక తీవ్రమైన జబ్బు ఉన్న వ్యక్తికి అతడి సేవలు అవసరం. కేవలం టెలీహెల్త్ అనే కాన్సప్ట్లో మునుపు కేవలం బాధితులను టీవీ ద్వారా / తమ మొబైల్ ఫోన్లద్వారా లేదా పర్సనల్ కంప్యూటర్లకు అమర్చిన కెమెరాల ద్వారా చూడటం, వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్సకు అవసరమైన మందులను సూచించడం మాత్రమే జరిగేది. కోవిడ్–19 నేపథ్యంలో నేరుగా బాధితులను తాకడానికీ / లేదా వాళ్లను తరలించడానికి వీల్లేని పరిస్థితుల్లో ఈ తరహా టెలీమెడిసిన్ చికిత్సలు ఊపందుకున్నాయి. అటు తర్వాత ఇలా రిమోట్గా ఉన్నవారికి సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు... పెద్ద పెద్ద నగరాల్లోని నిపుణులైన సర్జన్లు ఎక్కడో సుదూరంగా ఉన్న చిన్న పట్టణాల్లోని పేషెంట్లకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన సర్జరీలు విజయవంతంగా చేయడం సాధ్యమైంది. అందునా ఇటీవల భారతదేశంలో రోబోటిక్ సర్జరీ సహాయాలతో ఇలాంటి సర్జరీలు చేయడం మొదలైంది. ఇదెంత వరప్రదయని అంటే... ఏవైనా కారణాల వల్ల ఒక చిన్న పట్టణంలోకి పేషెంట్ను సుదూరంలోని పెద్ద నగరానికి తరలించడానికి వీల్లేని పరిస్థితుల్లో నగరాల్లోని అత్యంత నిపుణులైన డాక్టర్లూ తమ శస్త్రచికిత్స నైపుణ్యాలను అంతదూరంలోని పేషెంట్లకు అందజేయడానికి ఇప్పుడు వీలవుతోంది.ఉంగరాల్లాంటి ఉపకరణాలతో స్వీయ పరిశీలన...స్మార్ట్ వాచీల సహాయంతో తమ గుండె స్పందనలూ, రక్త΄ోటూ, ఎంతసేపు నిద్ర΄ోయామనే సమాచారం, తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ మేరకు నిద్రలోపించిందీ లేదా ఎక్కువ సేపు నిద్ర΄ోయారా అన్న విషయాలూ... ఇలాంటి స్వీయ ఆరోగ్య విషయాలను తెలుసుకునే ‘ఫిట్నెస్ ట్రాకర్లు’ వచ్చాయి. ఈ ఏడాది ఇది మరింత ముందుకు వెళ్లి... చిన్న ఉంగరంలాంటిది తొడగడం ద్వారా తమ రక్తంలోని చక్కెర మోతాదులు మొదలుకొని అనేక విషయాల్లో ఆరోగ్యసమాచారాలు తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యపడుతోంది. ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ ఆరోగ్యస్పృహ బాగా పెరిగిన ఈ రోజుల్లో ట్రెండీగా ఉన్న ఈ ఉంగరాలను తొడగడం మామూలైంది. ఇవి... ఒకపక్క ఫ్యాషనబుల్గా ఉండటంతో పాటు ఇటు ఆరోగ్య సమాచారాలూ తెలుస్తుండటంతో ΄ాటు ఇంచుమించూ బంగారు ఉంగరం ధరతో సమానంగా ఉండటంతో ఇటీవల వీటిని ధరించి తమ ఆరోగ్య సమాచారాన్ని తామే తెలుసుకోవడం, అవసరమైనప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం వంటి సౌకర్యం ఉండటంతో వీటికి ప్రాచుర్యమూ పెరుగుతోంది.కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్తో వ్యాధి నిర్ధారణలు, చికిత్సలు...ఒక డాక్టర్ తన జీవితకాలంలో ఓ లక్ష కేసులు చూడగలడని అనుకుందాం. అంటే ఒక లక్షమంది పేషెంట్లను చూసిన చరిత్ర / దాఖలాను బట్టి అతడి అనుభవం ఆధారపడి ఉంటుంది. అయితే ఇలాంటి లక్షమంది అనుభవజ్ఞులైన డాక్టర్ల అనుభవాలన్నీ క్రోడీకరించి... ఆ అనుభవ సారాన్ని కృత్రిమమేధస్సుకు ఆపాదిస్తే? అలాగే ఆ అనుభవసారంతో విశ్లేషించాల్సిన విషయాలను ఓ యంత్రానికి (మెషిన్ లెర్నింగ్) నేర్పితే? ఇందువల్ల కోటానుకోట్ల కేసులను చూసిన అనుభవం ఒక యంత్రంలో నిక్షిప్తమై ఉంటుందనీ, దానివల్ల చాలా సంక్లిష్టమైన కేసులనూ సులువుగా విశ్లేషించగలగడం వల్ల పేషెంట్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందంటూ కొన్ని ప్రయోగ ఫలితాలు చెబుతున్నాయి. అయితే దీనికి చాలా పరిమితులు ఉంటాయనీ, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ఎప్పటికీ మానవ మేధస్సు తాలూకు విశ్లేషణలను సాధించలేదనేది చాలామంది అనుభవజ్ఞులైన డాక్టర్ల మాట. అయినప్పటికీ చాలాకేసుల్లో ఇప్పుడు పేషెంట్ తాలూకు ఆరోగ్య చర్రిత, రకరకాల రక్తపరీక్షలూ, మెడికల్ ఇమేజింగ్ పరిశీలనల ఆధారంగా రోగుల పరిస్థితిపై ఇప్పుడు ఏఐ, మెషిన్ లెర్నింగ్తో విశ్లేషణలు జరిపాక దాన్ని నిపుణులైన డాక్టర్లు తమ అనుభవంతో సరిపోల్చుకుని (కో రిలేట్ చేసుకుని) అత్యంత నిశితంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స ప్రక్రియల నిర్ధారణ జరుపుతున్నారు.హోలిస్టిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ అప్రోచ్... ఒక వ్యక్తికి గుండె జబ్బు వచ్చిందనుకుందాం. అది కేవలం గుండెకు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. ఇటు రక్తప్రసరణ వ్యవస్థలోనూ, అటు ఊపిరితిత్తుల విషయంలోనూ... ఈ రెండే కాకుండా బ్రెయిన్కు సరఫరా అయ్యే రక్తం కారణంగా మెదడును ఇలా రకరకాల వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చు. అందుకే ఇటీవల వైద్య చికిత్సలు చేస్తున్న వివిధ ఆరోగ్య వ్యవస్థలకు సంబంధించిన నిపుణులు... అంటే కార్డియాలజీ, పల్మునాలజీ, న్యూరాలజీ... ఇలాంటి నిపుణలంతా సంయుక్తంగా తాము నిర్వహించాల్సిన చికిత్సలను సమన్వయ పరచాల్సి ఉంటుంది. ఇలా వివిధ ఆరోగ్య వ్యవస్థలకే కాకుండా ఇటు శరీరక ఆరోగ్యం, అటు మానసిక ఆరోగ్యం, మరో వైపున ఆధ్యాత్మిక ఆరోగ్యం... ఇలా అన్ని రకాలుగా పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంటేనే ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చె΄్పాలనేది డబ్ల్యూహెచ్ఓ నిర్వచనం. అందువల్ల ఓ వ్యక్తి తాలూకు పూర్తి ఆరోగ్య పరిస్థితిని నిర్వహితమయ్యేలా చూడటమనే అంశం కూడా ఈ ఏడాది ప్రయత్నాల్లో ఒకటి.అడ్వాన్స్డ్ జీనోమిక్ రీసెర్చ్...ఒక వ్యక్తి తాలూకు జన్యుపరమైన అనారోగ్యాలకు అతడి జన్యువులు కూడా కారణమవుతాయి. కొందరిలో ఈ జన్యువుల్లో ఏదైనా తేడాలుంటే... చికిత్సకు సాధ్యం కాని సమస్యలూ, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలూ (కంజెనిటల్ డిసీజెస్), వైకల్యాలూ రావచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలకు చెడి΄ోయిన ఓ జన్యువు కారణమైనప్పుడు... నేరుగా ఆ జన్యువుకే చికిత్స అందించడం ద్వారా ఆ వైకల్యాన్ని తప్పించడం / నివారించడమనే అంశంపైన చికిత్స అందించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. ముందుగా పేర్కొన్న టోకు చికిత్స కాకుండా... వ్యక్తిగత (పర్సనలైజ్డ్) చికిత్సకూ ఈ అడ్వాన్స్డ్ జీనోమిక్ చికిత్సలు తోడ్పడతాయి. ఈ రంగంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.ఇవి విజయవంతమైతే గతంలో నిర్వహణ (మేనేజ్మెంట్) తప్ప చికిత్స లేని చాలా జబ్బులకు విజయవంతమైన పూర్తి చికిత్స అందే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఈ అంశంపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగాయి. పురోగతి కూడా చాలావరకు కనిపించింది.నైతికాంశాలు, సదస్సులు...ఈ ఏడాది చోటు చేసుకున్న విప్లవాత్మకమైన పరిశోధనలూ, వైద్య చికిత్సలో, అందులోని పురోగతితో వాస్తవంగా పేషెంట్ ఎలాంటి చికిత్సలు ఎంతవరకు అవసరమో అంతే అందేలా, పేషెంట్ తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా... అలాగే అతడు సమాచార లోపానికీ, ఆర్థికంగా దోపిడికి గురికాకుండా చూసే నైతికాంశాలపై అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహితమయ్యాయి. ఈ పురోగతి పేషెంట్కు భారం కాకుండా చూసేందుకు అవసరమైన చర్యలను ప్రస్తావిస్తూ... ఆ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా నైతికవేత్తలు అనేకానేక ప్రస్తావనలూ, ప్రతిపాదనలూ తీసుకువస్తున్నారు. స్థూలంగా... ఈ ఏడాది 2025లో వైద్యరంగంలో చోటుచేసుకున్న పురోగతి, ఇంకా ఓ అసిధారావ్రతంలా కొనసాగుతున్న పరిశోధనల , సంక్షిప్త వివరాలివి.డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: 91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..) -
మీ స్మార్ట్వాచ్.. బీమా ప్రీమియం డిసైడ్ చేస్తుందా?
ఉదయాన్నే లేచి పార్కులో వాకింగ్ చేస్తున్నారా? ఆఫీసులో లిఫ్ట్కు బదులు మెట్లు ఎక్కుతున్నారా? రాత్రికి సమయానికి నిద్రపోతున్నారా? అయితే, ఇవన్నీ కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మీ జేబును కూడా కాపాడబోతున్నాయి! ఇప్పటివరకు మీ వయసును బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించే బీమా కంపెనీలు ఇకపై మీరు ఎలా జీవిస్తున్నారు(Lifestyle) అనే అంశాన్ని బట్టి రేట్లను ఫిక్స్ చేయనున్నాయి.ఒకప్పుడు బీమా అంటే కేవలం పాలసీ పత్రాలు, క్లెయిమ్లకే పరిమితం. కానీ ఇప్పుడు ‘పే-హౌ-యు-లివ్’(Pay-How-You-Live) విధానంతో అడుగులు వేస్తోంది. కస్టమర్ల జీవనశైలి, ఆరోగ్య అలవాట్లు, రోజువారీ డేటా ఆధారంగా ప్రీమియంలను నిర్ణయించేదే ఈ విధానం. మీ స్మార్ట్ వాచ్ ఇచ్చే డేటా ఆధారంగా మీరు ఆరోగ్యంగా ఉంటే మీ బీమా ప్రీమియం తగ్గుతుంది. అంటే మీ ఆరోగ్యం ఇప్పుడు మీ ఆర్థిక ప్రణాళికలో ఒక భాగం కాబోతోంది. 2025లో ఐఆర్డీఏఐ తెచ్చిన సంస్కరణలతో ఈ డైనమిక్ ఇన్సూరెన్స్ మోడల్ ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువకానుంది.‘పే హౌ యు లివ్’ అంటే..సాధారణంగా బీమా పాలసీలు వయసు, జెండర్ వంటి ప్రాథమిక అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తాయి. కానీ, ‘పే-హౌ-యు-లివ్’ నమూనాలో రియల్ టైమ్ వెల్నెస్ డేటా కీలకం అవుతుంది. స్మార్ట్ వాచ్లు, ఫిట్నెస్ యాప్ల ద్వారా సేకరించిన సమాచారం (ఉదాహరణకు రోజువారీ నడక, నిద్ర సమయం, వ్యాయామం) ఆధారంగా అల్గారిథమ్లు బీమా ప్రీమియంలను సర్దుబాటు చేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునే ఆరోగ్యవంతులకు ప్రీమియం తగ్గుతుంది. మీ జీవనశైలి మెరుగుపడితే మీ ఇన్సూరెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.2025లో వచ్చిన మార్పులుఈ విధానం వేగవంతం కావడానికి ఐఆర్డీఏఐ (బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ) 2025లో ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలు ఈ మార్పులకు ప్రధాన కారణం.ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఉన్న గరిష్ట వయసు పరిమితులను తొలగించడం వల్ల వృద్ధులకు కూడా ఈ వెల్నెస్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.గతంలో 8 ఏళ్లుగా ఉన్న మోరటోరియం కాలాన్ని(పాలసీదారుడు తన పాలసీని నిర్దిష్ట కాలం పాటు కొనసాగించిన తర్వాత బీమా సంస్థ తన క్లెయిమ్ను తిరస్కరించడానికి వీలులేని కాలం) 5 ఏళ్లకు తగ్గించడం ద్వారా వినియోగదారులకు భరోసా పెరిగింది.వృద్ధులపై ప్రీమియం భారం పడకుండా, పెంపును 10% కి పరిమితం చేయడం వంటి చర్యలు ఈ మోడల్ను మరింత న్యాయబద్ధంగా మార్చాయి.స్మార్ట్ పరికరాల వాడకం పెరగడం వల్ల డేటా సేకరణ సులభమైంది.ప్రస్తుత మార్కెట్ స్థితిగతులుభారతదేశంలో ఈ ధోరణి ఇప్పటికే మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రారంభమైంది. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు ‘పే హౌ యు డ్రైవ్’ ద్వారా సురక్షితంగా వాహనం నడిపేవారికి రాయితీలు ఇస్తున్నాయి.ఆరోగ్య బీమా.. ప్రస్తుతం జిమ్ మెంబర్షిప్లు లేదా స్టెప్ కౌంట్ ఆధారంగా రివార్డ్ పాయింట్లు ఇచ్చే పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.జీవిత బీమా.. 2025 నాటికి టాప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వెల్నెస్ రైడర్లను జోడిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారికి పేఅవుట్లను పెంచేలా మార్పులు జరుగుతున్నాయి.సవాళ్లుఈ విధానం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షించడం వల్ల డేటా భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. జన్యుపరమైన లేదా అనివార్యమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మోడల్ వల్ల ప్రీమియం భారం పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఐఆర్డీఏఐ పారదర్శకత, సమ్మిళిత నిబంధనలను కఠినతరం చేస్తోంది.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఈ మోడల్కు మరింత ఆదరణ పెరుగుతోంది. దేశంలోని యువత సాంకేతికతను ఇష్టపడటం ఈ మార్పుకు కలిసివచ్చే అంశం. బీమా అనేది కేవలం ఆపదలో ఆదుకునే ఆర్థిక ఉత్పత్తిగానే కాకుండా, కస్టమర్లను ఆరోగ్యంగా ఉంచే ఒక వెల్నెస్ పార్టనర్గా రూపాంతరం చెందుతోంది.ఇదీ చదవండి: ‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్ ప్రాజెక్ట్.. ఎక్కడంటే.. -
ఇయర్ఫోన్ వాడకం ఇంత పరేషాన్ చేస్తుందా..?
హెడ్ఫోన్ ధరించడం కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరు ఏకాగ్రత, పనితీరు కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చుట్టూ గందరగోళంగా ఉంటే..ఈ హెడ్ఫోన్లు ఎంతో హెల్ప్ అవుతాయి. అదీగాక సౌకర్యవంతమైన స్థాయిలో వాల్యూమ్ని ఎడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే అవే హెడ్ఫోన్లు సుదీర్ఘకాలం లేదా గంటల తరబడి ఉపయోగిస్తే..చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు ..ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి హెగ్డే. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.వినికిడి నష్టం (NIHL)అధిక వాల్యూమ్లో ఎక్కువ సేపు హెడ్ఫోన్స్ పెట్టుకుని వింటే వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది పరిశోధనలు చెబుతున్నాయి. గంటల తరబడి వినయోగించకపోవటమే మేలని చెబుతున్నారు.టిన్నిటస్ఇలా ఎక్కువసేపు హెడ్ఫోన్ ఉపయోగించడం వల్ల చెవులో వింత వింత శబ్దాలు వినిపించే టిన్నిటిస్ లక్షణాలు ఎదుర్కొనాల్సి వస్తుందట.అలసటకు గురవ్వడంఎక్కువసేపు హెడ్ఫోన్ ఉపయోగించడం వల్ల చెవి, మెదడు అలసటకు గురై..దృష్టి కేంద్రీకరించడం, లేదా ప్రసంగించడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందట. ఇది వైద్య పరమైన రుగ్మత కానప్పటికీ..ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుందంటున్నారు.మిగతా శబ్దాలపై అవగాహన లోపం..అదేపనిగా హెడ్ఫోన్స్ ఉపయోగించటం వల్ల ఆ శబ్దాలకే అలవాటుపడి చుట్టుపక్కల పరిసరాల శబ్దాలను గ్రహించలేని పరిస్థితి ఎదురవ్వుతుందని ఆడియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మతిమరుపు వచ్చే అవకాశంఅతిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారిలో శ్రద్ధ లోపించి..జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలిందని హెచ్చరిస్తున్నారు.సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే..ఇయర్ ఫోన్ని సురక్షితమైన పద్ధతిలో వాడుకుంటూ..వినికిడి, జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యల బారిన పడకూడదంటే ఈ సింపుల్ చిట్కాలు అనుసరిస్తే చాలట.తక్కువ వాల్యూమ్తో వినడం.తప్పనిసరి అయితే తప్ప.. హెడ్ఫోన్ వినియోగాన్ని పరిమితంగా ఉపయోగించేలా చూడటం. సరైన హెడ్ఫోన్స్ని ఉపయోగించి..వాల్యూమ్ నేరుగా చెవిలోకి చొచ్చుకుపోనివ్వని సురక్షితమైనవి వాడటం మేలుఅంతేగాదు వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో లేదో గమనించుకోవడంచివరగా ఏ వస్తువైనా సరైన మార్గంలో పరిమితంగా వినియోగిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు..పైగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని బేషుగ్గా లీడ్ చేయగలుగుతామని చెబుతున్నారు ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయి. --డాక్టర్ జ్యోతిర్మయ్ ఎస్ హెగ్డే, ఈఎన్టి స్పెషలిస్ట్, ఆస్టర్ వైట్ఫీల్డ్ ఆస్పత్రి (చదవండి: Travel Trends 2026: కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?) -
ధ్యానం ఎందుకు చేయాలంటే..?
ధ్యానం ఇవాళ ఉరుకులు పరుగుల జీవితానికి అత్యంత అవసరం. పురాతన కాలంలో రుషులు ధ్యానాన్ని జ్ఞానోదయం కోసం ఒక సాధనంగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు జీవితంలో ఎదురవ్వుతున్న ఒత్తిడి, ఆందోళన వంటి సవాళ్లను అధిగమించి మనశ్శాంతిని పొందే మార్గంగా మారింది. సమయం తక్కువగా ఉండి, చేయవలిసిన పని చాలా ఎక్కువగా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. అటువంటి సమయంలో మన శరీరంలో శక్తి అంతా హరించుకుపోతుంది. ఒత్తిడిని ప్రేరేపించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు అమాంతం పెరగకుండా తగ్గించడానికి ధ్యానం సమర్ధవంతంగా ఉంటుంది. పైగా శక్తివంతంగా చేస్తుంది. ఇది మన మానసిస్థితిని మెరుగుపరిచి, జీవితాన్ని ఆనందమయంగా చేస్తుంది. జీవితంలో ఎంత ఎక్కువ బాధ్యతలు ఉంటే అంత ఎక్కువ ధ్యానం అవసరం ఉంటుందని ధ్యాన నిపుణులు చెబుతున్నారు. మన లక్ష్యాలు, ఆశయాలు ఎంత ఎక్కువ ఉంటే ధ్యానం చేయాల్సిన అవసరం అంత ఎక్కువగా ఉంటుందట. ఒత్తిడికి చక్కటి ఉపశమనం ధ్యానం. ధ్యానం అనేది శరీరానికి జీవననాడి, అలాగే మనసుకు మంచి శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా అప్రమత్తత, అవగాహన అంతగా మెరుగవ్వుతాయట. అంతేగాదు మనలో సృజనాత్మక శక్తి పెంచుతుందట. అందరిలోనూ నిస్తేజంగా ఉన్న ఈ క్రియేటివిటీ మేల్కోంటుందట. సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశం అందిస్తుందట. అంతరంగంలో శాంతి లేకపోతే బాహ్య ప్రపంచం ప్రశాంతంగా ఉండదు. ధ్యానం అంతర్గత శక్తిని సుస్థిరం చేస్తుంది. తత్ఫలితంగా మనం స్ట్రాంగ్గా తయావ్వడమే కాకుండా ప్రతి పనిలో విజయాన్ని సునాయాసంగా అందుకోగలుగుతామని నమ్మకంగా చెబుతున్నారుని నిపుణులు. ఇది మానవ సంబంధాలను కూడా మెరుగుపరస్తుందట. సమాయానుసారంగా ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పుతుందట. గందరగోళంతో సతమతమవుతున్న మనసుకు ఊరట, అలాగే దుఃఖాన్ని అధిమించగలిగే శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. మానసికంగా, శారీరకంగా బలోపేతం చేసే శక్తి ఒక్క ధ్యానంతోనే సాధ్యమని నొక్కి చెబుతున్నారు యోగా గురుశ్రీశ్రీ రవిశంకర్, పలువురు యోగా నిపుణులు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ అవసరంమని వక్కాణిస్తున్నారు.(చదవండి: ప్రపంచ శాంతి కోసం ధ్యానం..ఐక్యరాజ్యసమితిలో గురుదేవ్ ప్రసంగం) -
తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..!
ఓ అరవై ఏళ్లు రాగానే..మనలో శక్తి సన్నిగిల్లుతుంది, ఆటోమెటిగ్గా చేసే వ్యాయామాల జోరు తగ్గుతుంది. వయసులో ఉన్నంత సులభంగా వృధాప్యంలో వ్యాయమాలు చేయలేం. ఫిట్నెస్ నిపుణులు పర్యవేక్షణలో ఈజీగా చేయగలిగే వర్కౌట్లనే ఆశ్రయిస్తాం. అలాంటిది 92 ఏళ్ల తాత 20 ఏళ్ల యువకుడిలా ఎన్నిపుష్ అప్లు చేస్తాడో తెలిస్తే కంగుతింటారు. చెప్పాలంటే అతడు ముసలి తాతలా కనిపించే యువకుడిలా ఉంటుంది.. వ్యాయమాలు చేసే తీరు. అతనెవరు, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.బ్రిస్టల్లోని స్పైక్ ద్వీపంలో నివసించే కెన్ అనే తాతకు 92 ఏళ్లు. కానీ అతడు 20 ఏళ్ల యుకుడి మాదిరిగా ఎలాంటి ఆయాసం లేకుండా అలవోకగా పుష్ అప్లు చేస్తుంటాడు. మాజీ కాంకోర్డ్ ఇంజనీర్ అయిన ఈ తాత ఫిట్నెస్ పరంగా అందరికీ స్ఫూర్తి అని చెప్పొచ్చు. అతడు రోజుకి దగ్గర దగ్గర 400 నుంచి 600దాక పుష్ అప్లు చేయగలడట. అక్కడితో వర్కౌట్లు ఆపేయడు. దీని తర్వాత కోర్ వ్యాయామాలు చేస్తాడు, బరువుల ఎత్తుతాడు కూడా. దాంతోపాటు సుమారు 5 నుంచి 10 కి.మీ నడక కూడా తప్పనిసరిగా ఉంటుందట. చాలామంది ఇన్ని ఎందుకు చాలా తేలిగ్గా చేసే వాటిపై దృష్టిసారించమని హితబోధ చేసిన పట్టించుకోడట. ఎందుకిలా అంటే.. తాను చాలా ఏళ్ల నుంచి దినచర్యను ఇంట్రస్టింగ్ ఉండేలా చేసుకుంటానని చెబుతుంటాడు ఈ కెన్ తాత. ఎందుకంటే రొటీన్గా ఎప్పుడూ చేసే వ్యాయామాలు చేయడం అనేది చాలా బోరింగ్గా మారిపోతుందట. అందుకే..పుష్ అప్లు తర్వాత కడుపుని సాగదీసేలా హామ్ స్ట్రింగ్లు, పరుగు, తదితరాలు చేస్తూ..ఆసక్తికరంగా మార్చుకుంటాడట. కేవలం తాను క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలనే డెడీకేషన్, యాక్టివ్గా ఉండటంపై నిరంతర ఫోకసే ఇంతలా ఈ వయసులో ఫిట్నెస్గా ఉండటానికి కారణమని అంటాడు కెన్. మరి అతడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడంటే..డైట్..కెన్ తన రోజుని జంబో ఓట్స్, గోధుమలు, చియా గింజలతో కూడిన బ్రేక్ఫాస్ట్తో ప్రారంభిస్తాడట. వాటితోపాటు అరటిపండు, ఎండుద్రాక్ష, పాలు తదితరాలు కూడా తీసుకుంటానని చెబుతున్నాడు.కెన్లా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..పెద్దయ్యే కొద్ది సిక్స్ప్యాకలు, మంచి శరీరాకృతి వంటి వాటిపై ఫోకస్ తగ్గి..ఆరోగ్యంగా జీవించాలనే కాంక్ష పెరుగుతుందట. అలా అనుకునేవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారానికి పెద్ద పీటవేయడం వంటివి చేయాలట. ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యం బాగుండాలంటే..నడక, ఈత, సైక్లింగ్ తప్పనిసరి అట. ఇవి శరీరానికి తేలికపాటి శక్తి శక్షణ నిచ్చి..రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయట. అంతేగాదు మానసిక ఆరోగ్యం మెరుగగ్గా ఉండి.. ఒంటరితనం, ఆందోళన, నిరాశతో పోరాడగలిగేలా ఆరోగ్యకరమైన రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట.ఇ క్కడ కెన్లా అంతలా వ్యాయామాలు చేయలేకపోయినా..కనీసం నడక, చిన్నపాటి కండరాల కదలికల కోసం కాస్త తేలికపాటి వర్కౌట్లు చేసినా.. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా) -
గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా శోభితా ధూళిపాళ..!
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు నాగచైతన్య భార్య, అక్కినేని వారి కోడలు శోభిత ధూళలిపాళ బంగారు లుక్ అందర్నీ అబ్బురపిచింది. పెళ్లి దుస్తులను తలపించే ఆమె బంగారు రంగు లెహంగాలో కొత్త పెళ్లికూతురిలా మెరిసిపోయారామె. ఆ చీర తగ్గట్టు ధరించిన రూబి నెక్లెస్ ఆమె లుక్ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. లెహంగా మెరిసే సీక్వెన్స్, పూసల అలంకరణ తోపాటు ఎంబ్రాయిడరీ, మెర్మెడ్ సిల్హౌట్లు లెహంగాకి గ్రాండ్ లుక్ని తెప్పించాయి. నేలను తాకేలా పొడవుగా ఉన్న ఈ లెహంగా రాయల్టీ లుక్కి దర్పణంలా నిలిచింది. ఆ లెహంగాకి మ్యాచింగ్ సీక్విన్డ్ టల్లే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లెహంగాను మరింత హైలెట్గా కనిపించేలా చేసింది. అలాగే దానికి సీత్రూ దుపట్టా, దానిచుట్టూ ఉన్న మిర్రర్ బోర్డర్తో కూడిన ఎంబాలిష్మెంట్ శోభితాను బంగారంలా మెరిసిపోయేలా చేసింది. పుత్తడి లెహంగా శోభిత ధగధగ మెరిపోతూ.. అందరి చూపులు ఆమె వైపుకే తిప్పుకునేలా చేసింది. ఇక్కడ శోభితా దరించిన ఆభరణాలు, జుమ్కీలు, స్టేట్మెంట్రింగులు, బ్యాంగిల్స్ తదితరాలన్ని శోభిత ఫ్యాషన్ స్టైల్ని హైలెట్ చేశాయి. మొత్తంగా ఆ కార్యక్రమంలో శోభితా లుక్ ఎవర్గ్రీన్గా నిలవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by HT City (@htcity) (చదవండి: Meher Castelino: భారత్ తొలి మిస్ ఇండియా..!ఫ్యాషన్ జర్నలిజంకి ఐకాన్ కూడా..) -
ఆ దేశంలో న్యాప్ కేఫ్లు ఉంటాయి!
దక్షిణ కొరియాలో ‘న్యాప్ కేఫ్’ల పేరుతో కేఫ్లు ఉంటాయి. పగటి పూట పవర్ న్యాప్ తీసుకోవాలనుకునేవారు వీటికి వెళుతుంటారు. బొలీవియాలో ‘పలాసియో డి సాల్’ పేరుతో పూర్తిగా ఉప్పు దిమ్మలతో నిర్మించిన హోటల్ ఉంది. సిక్కింలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో టిబెటన్ నూతన సంవత్సర లోసర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను చూడడం అద్భుతమైన అనుభవం.ఫిబ్రవరి మాసంలో అరుణాచల్ప్రదేశ్లో ఆరు రోజుల పాటు క్రీడలు, సాంస్కతిక ఉత్సవాలు ‘తవాంగ్సు టైడ్స్ ఇంటర్నేషనల్’ పేరుతో ఘనంగా జరుగుతాయి. దేశ,విదేశాలకు చెందిన ఆటగాళ్లు, కళాకారులు ఈ క్రీడా, కళా ఉత్సవాలలో పాల్గొంటారు. తవాంగ్సు నది ఒడ్డున రాత్రులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో అందంగా వెలిగిపోతాయి. క్రీడా ప్రతిభను గుర్తించడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పేరులో ‘గ్రీన్’ మాట ఉన్నప్పటికీ....‘గీన్ల్యాండ్’తో పోల్చితే ‘ఐస్ల్యాండ్’లోనే పచ్చదనం ఎక్కువ. View this post on Instagram A post shared by Santosh Jha (@career_first_) (చదవండి: వన్స్ అపాన్ ఏ టైమ్... వండర్ఫుల్ పోస్టర్స్) -
సూపర్స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..
తమిళ సినిమా ఐకాన్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కుర్రహారోల మాదిరిగా అంతే ఫిట్గా ఉండటమే కాదు, స్టైలిష్గా డ్యాన్స్లు కూడా చేస్తుంటారు. ఏడు పదుల వయసులోనూ అంతే స్ట్రాంగ్ పర్సనాలిటి మెయింటైన్ చేస్తున్న సూపర్స్టార్ డైట్ సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు ఒక చెన్నై డాక్టర్ రజనీ డైట్ గురించి వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను కూడా ఇషేర్ చేశారు. మరి ఇవాళ (డిసెంబర్ 12) రజనీకాంత్ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆరోగ్య రహాస్యాలు, డైట్ ఎలా ఉంటుంది వంటి వాటి గురించి ఆ డాక్టర్ మాటల్లోనే తెలుసుకుందామా.చెన్నై బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళిని రజనీ ఆరోగ్య రహస్యం గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆయన ఐదు తెల్లటి ఆహారాలను నివారించడం వల్ల ఇంతలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నారని అన్నారామె. ఉప్పు, చక్కెర, మైదా, పాలు, పెరుగు అతిగా తీసుకుంటే వాపు, ఇన్సులిన్ స్పైక్లు, ఆమ్లత్వం, గట్ సమస్యలకు దోహదం చేస్తాయి. అలాగే ఆయన మంచి పోషకవంతమైన ఆహారం తోపాటు రోజువారీ వ్యాయామాలు, ధ్యానం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయని అన్నారు. అలాగే డాక్టర్ మృణాళిని రజనీ డ్యాన్సులు చేస్తున్న వీడియోలు పంచుకుంటూ..మన సూపర్ స్టార్ రజనీకాంత్ 74 సంవత్సరాల వయస్సులో కూడా చాలా అందంగా నృత్యం చేస్తున్నారు కదా..!. దానికి కారణం ఏంటో తెలుసా..అంటూ ఆయనే స్వయంగా తాను ఎలాంటి ఆహారం తీసుకుంటాననేది చెబుతున్న వీడియోని కూడా ఆమె జోడించారు. ఆ వీడియోలో రజనీకాంత్ స్వయంగా తాను తెల్లటి ఆహారాలకు దూరంగా ఉంటానని అన్నారు. అవేంటో కూడా ఆయనే చెప్పారు కూడా.ఆ ఐదు ఎందుకు నివారించాలంటే.1. ప్రాసెస్ చేసిన తెల్లటి చక్కెరడాక్టర్ మృణాళిని మాట్లాడుతూ.. "ఇది బొడ్డు కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, ఆకలి కోరికలను పెంచుతుంది. కాబట్టి, దీన్ని ఎంత త్వరగా నివారిస్తే అంత మంచిది." అని సూచించారు.2. తెల్ల ఉప్పుపరిమితంగా తీసుకోకపోతే పొట్ట ఉబ్బరం, అధిక బిపి (రక్తపోటు) కూడా రావొచ్చు3. తెల్ల బియ్యందీన్ని (తెల్ల బియ్యం) కూరగాయలతో కలిపి మితమైన పరిమాణంలో తీసుకుంటే పర్లేదు లేదంటే బరువు వేగంగా పెరిగిపోయేందుకు దారితీస్తుందని హెచ్చరించారు డాక్టర్ మృణాళిని. 4. మైదాబియ్యంలో కొద్దిగా ఫైబర్ ఉంటుంది, కానీ మైదాలో పూర్తిగా జీరో కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు పెరగడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు5. పాలు, పెరుగు వెన్న వంటి పాల ఉత్పత్తులుఇవి కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. కానీ, 40 ఏళ్ల తర్వాత, జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుందట. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. అప్పుడే పొట్ట ఉబ్బరం, అధిక బరువు సమస్య దరిచేరవని అంటున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini) చదవండి: డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్ రేంజ్కు! మనసును కదిలించే సక్సెస్ స్టోరీ.. -
తస్మాత్ జాగ్రత్త..! బాడీబిల్డర్లు కండలు ముఖ్యమే కానీ..
‘జిమ్కు వెళ్లేవారు స్టెరాయిడ్లు వాడుతున్నారు’ అనే మాట వినిపించినప్పుడు కళ్ల ముందు కండలు తిరిగిన పురుషుడి చిత్రం ఆవిష్కృతం అవుతుంది. అయితే సీన్ మారుతోంది. పురుషులే కాదు స్టెరాయిడ్లు వాడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి...ప్రపంచవ్యాప్తంగా మహిళలలో అనబాలిక్ స్టెరాయిడ్ల వాడకం పెరిగిందని చెబుతోంది ఇంటర్నేషనల్ స్టడీస్ సిస్టమేటిక్ రివ్యూ. 2014లో స్టెరాయిడ్లు వాడిన మహిళలు 1.6 శాతం ఉండగా, 2024 రివ్యూ ప్రకారం 4 శాతం మంది మహిళలు స్టెరాయిడ్లు ఉపయోగిస్తున్నారు. మహిళా బాడీబిల్డర్లలో దాదాపు 17 శాతం మంది, ప్రతి ఆరుగురిలో ఒకరు స్టెరాయిడ్లను ఉపయోగిస్తున్నారని నివేదిక చెబుతోంది. ఈ పెరుగుదలకు సోషల్ మీడియాలోని ‘ఫిట్ఫ్లూయెన్సర్స్’ ప్రభావమే కారణం అనే విమర్శ ఉంది.స్టెరాయిడ్లు వాడుతున్న వారిలో ఎక్కువమంది మహిళలకు దీర్ఘకాలంలో వాటి దుష్ప్రభావం గురించి అవగాహన లేదు. వీటిని వాడుతున్న క్రమంలో అనారోగ్య సమస్యలు ఎదురైనా వైద్యులను సంప్రదించడం లేదు.గతంతో పోల్చితే పవర్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీబిల్డింగ్లలో మహిళల సంఖ్య వేగంగా పెరిగింది. ‘ఆటతీరు మెరుగు పడాలి. ప్రత్యర్థిపై పైచేయి ఉండాలంటే మాదకద్రవ్యాలు వాడాలి’ అనే భావన వల్ల కొందరు వాటికి దగ్గరవుతున్నారు.ఆస్ట్రేలియా, స్కాండినేవియాలలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం...పురుష స్నేహితులు, కోచ్ల వల్ల స్టెరాయిడ్లను ఉపయోగించడం మొదలుపెడతారు. ఇవి హానికరం అనే భావన కంటే పోటీకి అనివార్యమనే భావనే వారిలో ఉంటుంది. స్టెరాయిడ్లు ఆటకు ఎంత మేలు చేస్తాయనేది పక్కన పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయి.వాటిలో కొన్ని...ముఖంపై వెంట్రుకలు పెరగడం స్వరంలో మార్పులు రుతుక్రమంలో మార్పులు, సంతానలేమి రొమ్ము కణజాలం తగ్గడం మొటిమలు రావడం, వెంట్రుకలు రాలడం ఆందోళన, చిరాకు, తీవ్రమైన మానసిక స్థితిస్టెరాయిడ్లలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియంలాంటి ప్రమాదకరమైన విషపూరితాలు ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులకు కారణమయ్యే విషాలు.‘ఈ ప్రమాదాలను నివారించాలంటే స్టెరాయిడ్ల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి సోషల్ మీడియా వేదికగా ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయడమే మార్గం’ అంటున్నారు నిపుణులు. (చదవండి: అయోర్టిక్ స్టెనోసిస్ అంటే..? తొమ్మిది పదుల వయసులో ఇది తప్పదా..?) -
అయోర్టిక్ స్టెనోసిస్ అంటే..? తొమ్మిది పదుల వయసులో ఇది తప్పదా..?
90 ఏళ్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రేమ్ చోప్రాకు తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయనకు ట్రాన్స్కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (TAVI) ప్రక్రియ జరిగింది. దీన్ని గుండె సంబంధిత పరిస్థితిగా పేర్కొన్నారు వైద్యులు. గుండె కవాటాలు పనిచయకపోవడం వల్లే వచ్చే సమస్యగా పేర్కొన్నారు. అంటే గుండె, శరీరంలోని వివిధ భాగాల మధ్య ప్రధాన రక్త వాహక ధమని అయిన అయోర్టాకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అల్లుడు షర్మాన్ జోషి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా..!.అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏమిటి?అయోర్టిక్ స్టెనోసిస్ (AS) అనేది అయోర్టిక్ వాల్వ్ తీవ్రమైన పరిస్థితి. ఈ స్థితిలో, బృహద్ధమని కవాటం ఇరుకుగా మారి పూర్తిగా తెరుచుకోదు. ఈ సంకుచితం గుండె నుంచి బృహద్ధమనిలోకి, తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుందని కార్డియాలజిస్ట్లు చెబుతున్నారు.ఎందువల్ల ఇలా అంటే.."రక్త ప్రవాహం తగ్గినప్పుడు, గుండె కండరం బలహీనపడవచ్చు. నిజానికి ఇది తీవ్రమైన సమస్య సకాలంలో సమస్యను నిర్థారించి చికిత్స అందించకపోతే తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్ గుండె వైఫల్యంతో తీవ్ర సమస్యలకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు.వయసు పెరిగే కొద్దీ, గుండె కవాటాల కాల్సిఫికేషన్ కారణంగా ఈ పరిస్థితి తరచుగా అభివృద్ధి చెందుతుంది. కాలక్రమేణా, కాల్షియం నిక్షేపాలు గట్టిపడతాయి వాల్వ్ కరపత్రాలను గట్టిపరుస్తాయి. దాంతో వాల్వ్ పూర్తిగా తెరవడం కష్టతరం చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే.. ఇది ఇరుక్కుపోయిన తలుపును తెరవడానికి ప్రయత్నించడం లాంటిది. అంటే ఊపిరిరాడని పరిస్థితి ఎదురవ్వుతుంది. బలవంతంగా ప్రయత్నిస్తే మరో సమస్య ఎదురుకావొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.లక్షణాలు ఎలా ఉంటాయంటే..ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి లేదా మూర్ఛపోవడం వంటి లక్షణాలను అనుభవిస్తే.. ఇరుకైన వాల్వ్ గుండెపై ఒత్తిడి తెస్తుందని అర్థం. ఇది గుండె వైఫల్య అవకాశాలను పెంచుతుంది. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.ముందస్తుగా గుర్తించగలమా..?బృహద్ధమని స్టెనోసిస్ గమ్మత్తైనది. ఎందుకంటే ప్రారంభ దశల్లో గుర్తించడ కష్టం. ఇరుకైన బృహద్ధమని కవాటం ఉన్న చాలా మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఇది ప్రారంభ రోగ నిర్ధారణలను కోల్పోవడానికి దారితీస్తుంది. మితమైన బృహద్ధమని స్టెనోసిస్ ఉన్న చాలా మందికి లక్షణాలు ఉండవని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా పేర్కొంది. మరి ఎలా నిర్ధారిస్తారు?లక్షణాలు వెంటనే స్పష్టంగా కనిపించకపోవచ్చు కాబట్టి బృహద్ధమని స్టెనోసిస్ను గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిని నిర్ధారించడానికి, ఇమేజింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. బృహద్ధమని స్టెనోసిస్ తీవ్రతను విశ్లేషించడానికి, అంచనా వేయడానికి ఉత్తమ ప్రారంభ పరీక్ష ట్రాన్స్థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (TTE) ఈ పరీక్ష వాల్వ్ ప్రాంతం, రక్త ప్రవాహ వేగం, అలాగే వాల్వ్ అంతటా పీడన ప్రవణతలతో సహా సమాచారాన్ని అందిస్తుంది.వాటి తోపాటు ఎలక్ట్రో కార్డియోగ్రామ్లు (ECGలు), ఛాతీ ఎక్స్-కిరణాలు వంటి పరీక్షలు గుండె ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి.TAVI ఒక్కటే ప్రత్యామ్నాయమా..ప్రేమ్ చోప్రా వంటి వృద్ధాప్య రోగులకు, TAVI నిజమైన ఆశను అందిస్తుంది. సాంప్రదాయకంగా, తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్కు చికిత్స చేయడం అంటే ఓపెన్-హార్ట్ సర్జరీ కిందకు వస్తుంది. దానికంటే ఈ TAVI తక్కువ ప్రమాదంతో సులభంగా బయటపడతారు. ఈ చికిత్సలో తక్కువ రోజులో ఆస్పత్రిలో ఉంటే వెసులుబాటు తోపాటు తొందరగా కోలుకోగలం కూడా. అలాగే ఇది జీవన నాణ్యతను కొనసాగించే అవకాశాన్ని కూడా అందిస్తుంది.(చదవండి: -
ముంబైలో లైఫ్ స్టైల్ ఆసియా అవార్డ్స్ 2025.. సందడిగా సినీ తారలు (ఫోటోలు)
-
పుతిన్ రాష్ట్రపతి భవన్ విందులో గుచ్చి పుట్టగొడుగుల రెసిపీ..!
భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. డిసెంబర్ 2021 అనంతరం తొలిసారిగా ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశంలో ఉన్నారు పుతిన్. ప్రధాని మోదీ ఆయనకు రష్యన్ ఎడిషన్తో కూడిన భగవద్గీతను గిఫ్ట్గా ఇచ్చారు కూడా. అలాగే గత శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలకు గ్రాండ్గా విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సమావేశ ముగిసింది. అయితే ఆ విందు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది కూడా. ఈ నేపథ్యంలో మెనూలో వడ్డించిన వంటకాలేంటి..వాటి ప్రత్యేకతలు గురించి తెలుసుకుందామా..!.మోనూ మొత్తం శాకాహార వంటకాలే ఉన్నాయి.భారతదేశం అంతటా ఉన్న ప్రాంతీయ వంటకాల జాబితాను అందించారు. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్ నుంచి గుర్సందేశ్, ఉత్తర భారతదేశం నుంచి పసుపు పప్పు తడ్కా, దక్షిణ ప్రాంతాల నుంచి మురుక్కు టిబెట్, నేపాల్ సరిహద్దుల నుంచి జోల్ మోమో, జమ్మూ కశ్మీర్ నుంచి గుచ్చిడూన్ చెటిన్(వాల్నట్ చట్నీతో వడ్డించే స్టఫ్డ్ మోరెల్ పుట్టగొడుగులు) ఉన్నాయి. ఈ రెసిపీలో గుచ్చి పుట్టగొడుగుల వంటకం అత్యంత స్పెషల్. అంత సులభంగా వండుకునే అవకాశం ఉండదే. అలాగే ఎప్పుడు పడితే అప్పుడ తినలేం కూడా. ఎందువల్ల అంటే..ఈ కాశ్మీరీ వంటకం దాని మూలం కారణంగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో అరుదుగా లభించే పుట్టగొడుగులివి. అందువల్లే ఇది కిలో దాదాపు రూ. 35 వేలు నుంచి రూ. 40 వేలు వరకు పలుకుతుంది. ఇవి అడవిలోనే లభిస్తాయి. వీటిని ప్రత్యేకంగా పెంచడం సాధ్యం కాదు. వీటికి ఒక విధమైన నేల రకం, నిర్ధిష్ట ఉష్ణోగ్రత అవసరం. హిమపాతం సీజన్ ముగిసిన వెంటనే వసంతకాలం సమయానికి హిమాలయ ప్రాంతంలో ఇవి దర్శనమిస్తాయి. అనుకోని అటవీ మంటల తర్వాత కూడా వీటిన సాగు చేయొచ్చట. అదే దీనిలో స్పెషాలిటీ అట. ఈ ప్రత్యేకత కలిగిన గుచ్చి పుట్టగొడుగులను కనిపెట్టడం కూడా సవాలట. కొన్ని వారాలపాటు మాత్రమే సాగయ్యే ఈ పుట్టగొడుగును అన్వేషించడం ఓ టాస్క్లా ఉంటుందట. అదీగాక పాకశాస్త్రంలో వీటికి ఉన్న టేస్టే వేరేలెవెల్ అట. పైగా సంప్రదాయ వైద్యలో ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజలు విరివిగా వినయోగించడంతో వీటికి అధిక డిమాండ్ ఉందట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుట్టగొడుగులగా ఇవి ప్రసిద్ధిగాంచినవి. View this post on Instagram A post shared by NDTV (@ndtv) ఈ మష్రూమ్తో చేసే వంటకాలు..గుచ్చి పులావ్, యాఖ్ని, రోగంజోష్, వంటి శాకాహార వంటకాలను చేస్తారుట. పైగా మాంసానికి ప్రత్యామ్నాయ వంటకంగా ఆస్వాదిస్తారట ఆహారప్రియులు. అంత ప్రత్యేకతలు కలిగిన ఖరీదైన పుట్టగొడుగులు కావడంతోనే ఈ గుచ్చి డూన్ చెటిన్ రాష్ట్రపతి భవన్లో వ్లాదిమిర్ పుతిన్ విందు కోసం మెనూలో స్పెషల్గా ఏర్పాటు చేశారట. (చదవండి: దోసెల రెస్టారెంట్ కోసం..టెక్ ఉద్యోగాన్ని వదిలేశాడు! కట్చేస్తే..) -
మలబద్ధకం నివారణ కోసం...
మలబద్ధకం చాలామందిని బాధిస్తూ ఉంటుంది. ఫ్రీ మోషన్ కాకపోవడం వల్ల వచ్చే ఈ సమస్యతో దీర్ఘకాలంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఈ సమస్యను నివారించుకోవడం ఎంతోముఖ్యం. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలుఫైబర్ (పీచు) సమృద్ధిగా ఉండే ఆహారాలతో మలబద్ధకాన్ని నివారించుకోవడం తేలికే. వాటివల్ల జీర్ణాశయమార్గం శుభ్రమవ్వడమే కాకుండా తేలిగ్గా విరేచనం అయ్యేందుకు ఆ పీచు సహాయపడుతుంది. ఫైబర్ వల్ల దేహంలో మనం తీసుకున్న పిండిపదార్థాల నుంచి చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర మోతాదులు ఒకేసారి పెరగవు. పొట్టుతో కూడిన అన్ని రకాల ధాన్యాల్లోనూ ఈ పీచు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు మోతాదులు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. చిక్కుళ్లలో ప్రోటీన్ తోపాటు ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతోపాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతూ ఒకేసారి రెండు ప్రయోజనాలనిస్తాయి. తాజాపండ్లలోనూ పీచు ఎక్కువగానే ఉంటుంది. అందుకే అతిగా తీపి ఉండని తాజాపండ్లు డయాబెటిస్ ఉన్నవారికీ మేలు చేస్తాయి. బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లలో పీచు మోతాదు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. పండ్లను పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మంచిది. (చదవండి: డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం) -
ఊపిరితిత్తుల కేన్సర్కి విలన్..జస్ట్ స్మోకింగ్ మాత్రమే కాదు..!
ఊపిరితిత్తుల కేన్సర్ ఎందువల్ల వస్తుదంటే...అందరూ చెప్పేది బీడి,చుట్ట సిగరెట్ల వల్ల అనే ఠక్కున చెప్పేస్తారు. కానీ అదొక్కటే కారణం కాదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. మనచుట్టూ ఉన్న పరిసరాలే ప్రధాన ముప్పుగా పరిణమిస్తునన్నాయిని హెచ్చరిస్తున్నారు. మరి అదెలాగో సవివరింగా తెలుసుకుందాం. నిజానికి ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో ధూమపానం చేయని వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ చాలామంది ఈ మహమ్మారిని బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కనీసం సిగరెట్ వాసన కూడా చూడని వారిలో కూడా పీఎం2.5గా పిలిచే కణాలు ఊపిరితిత్తుల్లోనూ, రక్తప్రవాహంలో ప్రవహించి కణాలను దెబ్బతీసి, ఊపిరితిత్తుల కేన్సర్కు దారితీసే ఉత్పరివర్తనాలను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఇది కేవలం నగరాల్లోనూ కాదు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితని చెబుతున్నారు. ఎందుకంటే..డీజిల్, పంట అవశేషాలను కాల్చడం వల్ల ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అదీగాక గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిమీద వంట చేస్తారు. దాన్నుంచి వచ్చే పొగ, ఒకవేళ కిచెన్లో సరైన వెంటిలేషన్ లేకపోతే.. ఆ పొగాకు ఎక్కువసేపు గురవ్వాల్సి వస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు. అలాగే రాడాన్ వాయువు, సహజంగా సంభవించే రేడియో ధార్మిక వాయువుకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా..ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అలాగే మైనింగ్, సిలికా దుమ్మ లేదా డీజిల్తో నడిచే కర్మాగారాల్లో వర్క్చేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతుంటారని చెప్పుకొచ్చారు. ధూమపానం చేయనివారు ఎందుకు సేఫ్గా లేరు...ధూమపానం చేయనివారిలో, ముఖ్యంగా యువకులు, మహిళల్లో ఊపిరితిత్తుల కేన్సర్ ఉపరకం అయినా అడెనోకార్సినోమా పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు. అలాగే పర్యావరణం తోపాటు జన్యుపరమైన కారకాలు కూడా పెద్దపాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాయకాలుష్యం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..రోజువారీ AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలను పర్యవేక్షించడంకాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో, బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయడంట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కిటికీలు మూసి ఉంచడం.ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు లేదా సహజంగా గాలిని ఫిల్టర్ చేసే పీస్ లిల్లీస్, స్పైడర్ ప్లాంట్లు వంటి మొక్కలను ఉపయోగించండి.పొగ రహిత గృహాలు, కార్యాలయాల ఉండేలా మెయింటైన్ చేయడంవర్కింగ్లో దుమ్ము లేదా రసాయనాలకు గురికాకుండా ఉండటం. చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మెరుగైన ఫలితాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బెడ్షీట్స్ మార్చి ఎంత కాలమైంది?) -
బెడ్షీట్స్ మార్చి ఎంత కాలమైంది?
ప్రతి రోజూ రాత్రంతా చర్మానికి నేరుగా తగులుతూ, చెమట, నూనెలు, మన నుంచి వేరయిన డెడ్సెల్స్ అన్నీ బెడ్షీట్స్ మీదే కదా పడేది! వీటిని సరిగ్గా పట్టించుకోకపోతే, అవి మొటిమలు, అలర్జీలు, అశాంతికరమైన నిద్రకు కారణం అవుతాయి. అందువల్ల మీ బెడ్షీట్స్ని క్రమం తప్పకుండా మార్చడం అవసరం!ఏమేం పేరుకుపోతాయంటే..?ప్రతి రాత్రి, చర్మం లక్షలాది చనిపోయిన కణాలను వదిలివేస్తుంది. వీటితోపాటు సహజ నూనెలు, చెమట కూడా ఉంటాయి. మీరు రాసుకునే లోషన్లు లేదా కాస్మెటిక్ అవశేషాలు కూడా ఈ మిశ్రమానికి తోడవుతాయి. డస్ట్ మైట్స్ అనే సూక్ష్మ కీటకాలు ఈ చిన్న పొలుసులను తినడానికి ఇష్టపడతాయి. ఇవన్నీ మీరు గంటల తరబడి విశ్రాంతి తీసుకునే మీ మంచంపై పేరుకుపోతాయి! ఇవి కొంతమందిలో తుమ్ములు, కళ్లు దురద పెట్టడం, చివరకు ఆస్తమాను కూడా ప్రేరేపించగలవు. అందుకే, శుభ్రమైన బెడ్షీట్స్ అనేవి సౌకర్యానికే కాక, మీ ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనవి.ఎప్పుడు మార్చాలి?.. చాలా మందికి, ప్రతి ఒకటి నుంచి రెండు వారాలకు ఒకసారి బెడ్షీట్స్ మార్చడం సరిపోతుంది. ఫ్రెష్గా ఉండే బెడ్షీట్స్ మీ నిద్ర మరింత గాఢంగా ఉండటానికి సహాయపడతాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.వారానికోసారి... మీకు వీపు, ఛాతీ లేదా ముఖంపై మొటిమల సమస్య ఉంటే, వారానికోసారి బెడ్షీట్స్ని మార్చడం ముఖ్యం. దిండు కవర్లను ఇంకా తరచుగా ఉతకాల్సి ఉంటుంది! చర్మంపై నూనెలు, బ్యాక్టీరియా ఒత్తిడికి గురైనప్పుడు రంధ్రాలను అడ్డుకుని, మొటిమలను మరింత తీవ్రతరం చేస్తాయి. బెడ్షీట్స్పై పేరుకునే డస్ట్మైట్స్ వల్ల దగ్గు, దురదలు వస్తాయి. అందువల్ల అలర్జీలు లేదా ఆస్తమా ఉన్నవారు కూడా వారానికోసారి ఉతకడం ద్వారా డస్ట్ మైట్స్, అలర్జీ కారకాలను తగ్గించుకోవచ్చు.బెడ్షీట్స్ పరిశుభ్రతకు ఏం చేయాలి?క్రిములు, డస్ట్ మైట్స్ను నిర్మూలించడానికి బెడ్షీట్స్ను 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడినీటిలో ఉతకాలి. దిండు కవర్లను వారానికి రెండు సార్లు మార్చండి. అంతేకాదు, బూజు రాకుండా పరుపులు పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోండి. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు, వాతావరణం వేడిగా, తేమగా ఉన్నప్పుడు లేదా మీ మంచంపై మీతోపాటు మీ పెంపుడు జంతువులు లేదా పిల్లలు కూడా పడుకునేటప్పుడు బెడ్షీట్స్ వీలైనంత తరచుగా ఉతకడం అవసరమని గుర్తించండి. (చదవండి: పరిణీతి చోప్రా చేసిన టేస్టీ... మష్రూమ్ టోస్ట్! -
పుతిన్ ఇష్టపడే వంటకాలివే..!
భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, అధికారిక విందులో ఆయ ఇష్టంగా ఆస్వాదించే వంటకాలేవి, ముఖ్యంగా ఇలాంటి పర్యాటనలలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు తదితరాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.పుతిన్ భారత్ వంటకాలను రుచి చూస్తారేమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ పుతిన్ క్రమశిక్షణ, కఠినమైన భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి. ఆయన ఆహారానికి సంబంధించి.. ఫుల్ సెక్యూరిటీ మధ్య సైనిక పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సాధారణంగా హోటల్ లేదా ఇతర దేశాల ఆతిథ్యంలో తయారు చేసిన భోజనాన్ని చాలా అరుదుగా తీసుకుంటారట పుతిన్. మాములుగా అయితే శిక్షణ పొందిన రష్యన్ చెఫ్లు, సహాయక సిబ్బంది పుతిన్ వెంట వస్తుంటారు. కాబట్టి వారే ఆయన భోజనం గురించి స్వయంగా చూసుకుంటారు. అందువల్ల ఆయన ఎలాంటి ఆహారం తీసుకుంటారనేది చాలా సీక్రెట్గా ఉంది. అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం..ఆయన ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధ్యానత ఇస్తారట. ప్రతి ఉదయం తేనె లేదా గంజితో ట్వోరోగ్(రష్యన్ కాటేజ్ చీజ్)తో ప్రారంభమవుతుందట. తాజా జ్యూస్, కౌజు పిట్ట గుడ్లతో చేసిన ఆమ్లెట్, తక్కువ చక్కెర కలిగిన ఆహారాలు వంటి వాటినే తీసుకుంటారట.ఆయన ఎర్ర మాంసం కంటే తాజా చేపలు అది కూడా కాల్చినవి ఇష్టంగా తింటారట. లేత గొర్రెపిల్ల మాంసం కూడా అప్పడప్పుడూ తీసుకుంటారట. ఇక ఆయన భోజనంలో ఎక్కువుగా టమోటాలు, దోసకాయలు, ఇతర ప్రాథమిక కూరగాయల సలాడ్లు తప్పనిసరిగా ఉంటుందట.ఇక జ్యూస్లలో కూడా మూలికా పానీయాలు, కేఫీర్, బీట్రూట్-ముల్లంగి జ్యూస్ వంటివి తీసుకుంటారట. ఇక పుతిన్కు పిస్తా ఐస్ క్రీం మహా ఫేవరెట్ డిజర్ట్ అట. చివరగా ఆయన క్రమశిక్షణతో కూడిన సంప్రదాయ ఆహారానికే కట్టుబడి ఉంటారట. చాలామటుకు ప్రోటీన్ కంటెంట ఉన్నవి, పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు పుతిన్ సన్నిహితులు.(చదవండి: అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..) -
దేశంలోనే తొలిసారి ఎనిమిదేళ్ల పాపకు పాంక్రియాస్ శస్త్రచికిత్స
మన శరీరంలో క్లోమం (పాంక్రియాస్) అత్యంత కీలకం, అదే సమయంలో బాగా సున్నితం. అలాంటి పాంక్రియస్లో కణితి ఏర్పడితే చాలా ప్రమాదకరం. కేవలం ఎనిమిదేళ్ల వయసులో అలాంటి ఇబ్బంది వచ్చిన ఒక పాపకు.. సీతమ్మధారలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యంత అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్స చేసి, ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన చీఫ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్, హెపటో-బైలియరీ, పాంక్రియాటిక్ సర్జన్ డాక్టర్ మురళీధర్ నంబాడ తెలిపారు."విశాఖ నగరానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చింది. ఈ చిన్న పాపను గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ ఆచంట చలపతి రావు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా అరుదైన సాలిడ్ సూడోపాపిలరీ ఎపితెలియల్ నియోప్లాజమ్ (స్పెన్) అనే పాంక్రియాటిక్ కణితి ఉన్నట్లు గుర్తించారు. భారత దేశంలో ఈ తరహా సమస్యకు శస్త్రచికిత్స జరిగిన అత్యంత చిన్నవయసు రోగిగా ఈ పాప చరిత్ర సృష్టించింది. పాపకు పాంక్రియాస్లో కణితి ఉండడం, అది అత్యంత అరుదైనది కావడంతో దాంట్లో క్యాన్సర్ లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నా, తర్వాత ఎలాంటి సంక్లిష్ట సమస్యలు రాకూడదంటే శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాలని నిర్ణయించాం.మూడు గంటల పాటు అత్యంత కచ్చితత్వంతో కీహోల్ సర్జరీ (లాప్రోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రియాటెక్టమీ)మొదలుపెట్టాం వీలైనంత వరకు రక్తస్రావం లేకుండా చూడడంతో పాటు, పాంక్రియస్ కణజాలాన్ని కూడా వీలైనంత వరకు కాపాడుకుంటూ కణితి మొత్తాన్ని తొలగించగలిగాం. ఈ శస్త్రచికిత్స తర్వాత బాలిక చాలా త్వరగా కోలుకుంది. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఐదు రోజుల్లోనే పాపను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఇప్పుడు ఆమె స్కూలుకు కూడా వెళ్తూ చదువులో, ఆట లో చక్కగా రాణిస్తోంది. ఇలాంటి అత్యంత అరుదైన పాంక్రియాటిక్ కణితులను తొలగించడంలో ఉన్న నైపుణ్యాలకు ఈ శస్త్రచికిత్సే నిదర్శనం. ఇలాంటి కణుతులు చాలా అరుదైనప్పటికీ, తమ అనుభవంలో గత పదేళ్ళలో 12 గుర్తించి వైద్యం చేశాం". అని శస్త్ర చికిత్స నిపుణులు డా. మురళీధర్ నంబాడ వివరించారు. (చదవండి: అక్కడ కాన్పు కోసం గర్భిణిని అంగడికి తీసుకువెళ్తారట..?) -
హెల్త్ మాట 'వింటరు' కదా..?
చలికాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలు సాధారణంగా కాస్తంత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు ఈ సీజన్లో కీళ్లకు సంబంధించిన నొప్పులు పెరుగుతుంటాయి. కండరాల నొప్పులు కనిపిస్తుంటాయి. ఇక ఒళ్లంతా పగుళ్లతో, ముఖం, పెదవులూ, మడమలపై పగుళ్లు కనిపిస్తూ బాధిస్తుంటాయి. ఇలా చర్మసంబంధిత సమస్యలూ వస్తాయి. ఇక వైరస్ల వ్యాప్తికి అనువైన కాలం కావడంతో జలుబుతో ముక్కుకారడం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు పెరగడమూ కనిపిస్తుంది. ఈ చలికాలంలో కనిపించే సాధారణసమస్యలూ, వాటి పరిష్కారాలకుఅనుసరించాల్సిన సూచనలేమిటో చూద్దాం...చలికాలంలో అన్నిటికంటే ఎక్కువగా బాధించే సమస్య కండరాలూ, కీళ్లనొప్పులు. పైగామామూలుగానే ఈ సమస్యతో బాధపడేవాళ్లలో ఈ సీజన్లో ఆ బాధలు కాస్తంత ఎక్కువగా బాధిస్తూ వేధిస్తాయి. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.చలికాలంలో కండరాలూ, కీళ్లనొప్పులు పెరగడం ఎందుకంటే... ఈ సీజన్లో చలివల్ల చర్మం చాలా త్వరగా తన వేడిని కోల్పోతుంది. దాంతో చర్మం పైభాగంలో ఉండే రక్తనాళాలు కొద్దిగా కుంచించుకు΄ోతాయి. ఇలా కుంచించుకుపోవడాన్ని ‘వాసో కన్స్ట్రిక్షన్’ అంటారు. ఇలా కుంచించుకు΄ోవడంతో ఆ ప్రాంతాలకు రక్తప్రసరణ కూడా కాస్త తగ్గుతుంది. దాంతో చర్మంలోని నొప్పిని గ్రహించే భాగాలైన ‘పెయిన్ సెన్సార్స్’ మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఈ పెయిన్ సెన్సర్స్ ఈ సీజన్లో ఇంకాస్త చురుగ్గా పనిచేయాల్సిరావడంతో చిన్న దెబ్బకే ఎక్కువ నొప్పి తెలుస్తుంటుంది. అందుకే చలికాలంలో ఒంటికి గాయాలైతే... దెబ్బ చిన్నదే అయినా, నొప్పి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ సీజన్లో కండరాలూ, కీళ్ల నొప్పులు పెరగడానికి దోహదం చేసే ఒక అంశం. ఇక మరో అంశమేమిటంటే... చాలామందిలో ఈ సీజన్లో నొప్పిని భరించే సామర్థ్యం (పెయిన్ టాలరెన్స్) తగ్గుతుంది. అందుకే బాధితులు మామూలు రోజుల్లోని నొప్పులూ కూడా ఈ కాలంలో మరింత పెరిగినట్లుగా అనిపిస్తాయి. ఈ సీజన్లో చలికి కీళ్లు బిగుసుకు΄ోతుంటాయి. దాంతో వాటిలో మామూలుగా ఉండాల్సిన కదలికలు కూడా బాగా తగ్గిపోతాయి. కీళ్లలో ఈ కదలికల తగ్గుదల కారణంగా మన రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసే ఒళ్లు కదల్చడం, నడక వంటివి తగ్గిపోవడంతో దేహానికి ఒనగూరే వ్యాయామమూ, శారీరక శ్రమ కూడా తగ్గుతాయి. ఈ కారణం చేత కూడా కీళ్ల నొప్పులు బాగా పెరిగిపోతాయి. సాధారణంగా ఎముకలకు అందాల్సిన పోషకాలు దేహపు కదలికల వల్లనే వాటికి అందుతుంటాయి. ఈ కదలికలు తగినంతగా లేక΄ోవడంతో కీళ్లూ, ఎముకలకు అందాల్సిన పోషకాలూ సరిగా అందవు. మామూలుగా ఇతర సీజన్లలో కంటే... వింటర్ సీజన్లో సూర్యుడు చాలా తక్కువ సేపు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే చలికాలంలో పగటి నిడివి బాగా తక్కువగా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. ఫలితంగా మన దేహాలు, చర్మం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి కూడా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్లో మన ఎముకలకు అవసరమైన విటమిన్–డి పాళ్లూ తగ్గుతాయి. అంతేకాదు... ఈ కారణం వల్ల మరో అనర్థమూ పొంచి ఉంటుంది. అదేమిటంటే... ఏవైనా కారణాలతో ఈ సీజన్లో ఎముకలు ఫ్రాక్చర్ అయితే అవి అతుక్కోడానికి పట్టే వ్యవధి మిగతా కాలాలలో ΄ోలిస్తే ఈ సీజన్లో మరింత ఎక్కువగా ఉంటుంది.ఒళ్లూ, కండరాల నొప్పులు తగ్గుదల కోసం ఇవీ కొన్ని పరిష్కారాలూ, సూచనలుఈ సీజన్లో వీలైనంత మేరకు గాయాల΄ాలు కాకుండా అలాగే వాహనాలు నడిపేటప్పుడు లేదా వ్యాయామాల సమయంలో దెబ్బలు తగలకుండా తమను తాము జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఆరుబయట నడుస్తున్నప్పుడు తాకుడురాళ్లు / ఎదుర్రాళ్లు తగలకుండా పాదం అంతా కప్పి ఉంచేలా మంచి షూస్ ధరించాలి. వేళ్లు బయటకు కనపడేలా ఉండే పూర్తిగా కవర్ చేయని చెప్పులూ, స్లిప్పర్స్ ధరించినప్పుడు కాలివేళ్లకు ఎదుర్రాయి తగిలి, చిన్న దెబ్బ తగిలినా, జివ్వుమనడం, చాలా బాధగా అనిపించడం, నొప్పి బాగా తెలుస్తుండటం జరుగుతుంది. షూస్ వల్ల కాళ్ల నుంచి వేడిమి కోల్పోకుండా ఉండటంతోపాటు, పాదాలకూ, కాలివేళ్ల చివరలకు పూర్తి రక్షణ కలుగుతుంది. అలాగే... వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ–ప్యాడ్స్, నీ క్యాప్స్ వంటివి ధరించడం వల్ల గాయాలను / దెబ్బలను వీలైనంతగా నివారించుకోవచ్చు. ఆరుబయట చలిగా ఉన్నప్పుడు దేహానికి తగినంత వేడిని ఇచ్చేలా ఫుల్ స్లీవ్స్ ఉండే దుస్తులూ, ఊలు దుస్తులూ, ఉన్ని దుస్తుల వంటివి ధరించాలి. ఇవి దేహం నుంచి ఉష్ణోగ్రత బయటకు వెళ్లనివ్వకుండా దేహం వెచ్చగా ఉండేలా చూస్తాయి. అలాగే చేతులకు గ్లౌవ్స్ వేసుకోవడం, కాళ్లకు సాక్స్ ధరించడం వంటి జాగ్రత్తలూ మేలు చేస్తాయి. ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు మోకాళ్లు, మోచేతుల వద్ద మరింత మందంగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. ఈ సీజన్లో ఆరుబయట కాకుండా వీలైనంత మేరకు ఇన్డోర్ ఎక్సర్సైజ్లు చేయాలి. ఈ వ్యాయామాల ఫలితంగా ఈ సీజన్లో మామూలుగానే కాస్తంత మందకొడిగా జరిగే రక్త సరఫరా ఉత్తేజితమై నార్మల్ స్థాయికి వస్తుంది. దాంతో నొప్పిని తెలిపే సెన్సర్స్ కూడా మామూలుగానే పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. చాలామంది చలి కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కాఫీ, టీ వంటి పానియాలను ఎక్కువగా తాగుతారు. దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీటిని కోల్పోతాం. వాటిని భర్తీ చేసేంతగా నీళ్లు తాగం. ఇలా నీరు తక్కువ తాగడం, చెమట కారణంగా మనకు తెలియకుండానే దేహం డీహైడ్రేషన్కు లోనయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ఈ కారణాలన్నింటి వల్ల శరీరంలో నీళ్లు, లవణాల మోతాదులు బాగా తగ్గి΄ోతాయి. అందుకే ఈ సీజన్లో తరచూ నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్కు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్లు విటమిన్–డి సప్లిమెంట్స్ వాడాలని సూచించినవారు ఆ మేరకు వాటిని వాడాలి. సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులకు ఈ సీజన్లో వారి నొప్పుల బాధలు మరింత పెరుగుతాయి. అందుకే ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులు ఈ సీజన్లో తమ డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్లు తప్పక వాడాల్సిందే. చలికాలంలో ఈ సూచనలూ, జాగ్రత్తలతో కీళ్ల, కండరాల నొప్పులను చాలావరకు నివారించుకోవచ్చు. తమ ఒళ్లునొప్పుల వంటి బాధల నుంచి చాలావరకు రక్షణ పొందవచ్చు. ఈ సూచనలు పాటించాక కూడా కండరాల నొప్పులూ, కీళ్ల నొప్పులూ, ఒళ్లునొప్పులూ తగ్గకపోతే ఒకసారి డాక్టర్ను కలిసి తగిన పరీక్షలు, వాటి ఫలితాలను బట్టి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.జలుబులూ... ఇతర వైరల్ జ్వరాలు మనలో జలుబు రావడానికి రెండువందల రకాలకు వైరస్లు కారణమవుతాయి. ఈ రెండు వందలకు పైగా వైరస్లనూ, వాటిలో కనిపించే కొన్ని సమాన లక్షణాలను బట్టి గ్రూపులుగా విభజిస్తే... అందులో ఆరు రకాల గ్రూపులతో జలుబు వస్తుంటుందన్నది వైద్య నిపుణుల మాట. ఆ వైరస్లు ఏమిటంటే... 1) ఇన్ఫ్లుయెంజా, 2) పారాఇన్ఫ్లుయెంజా, 3) రైనోవైరస్, 4) ఎడినో వైరస్, 5) హ్యూమన్ రెస్పిరేటరీ నిన్సీషియల్ వైరస్ 6) బీఎఫ్–7 వేరియెంట్ అనేవి. గత కొన్నేళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ బాధించిన కరోనా వైరస్ కూడా ఈ బీఎఫ్ వేరియెంట్ కిందకే వస్తుంది. కాక΄ోతే ఇప్పుడు కరోనా వైరస్ మునపటి తీవ్రత కోల్పోయిన కారణంగా అప్పుడప్పుడు అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ జలుబులో ఉండే మామూలు లక్షణాలనే ప్రదర్శిస్తోంది. లక్షణాలు... జలుబు వచ్చినప్పుడు కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి, గొంతులో గరగర, ముక్కు నుంచి లేదా ముక్కుతోపాటు కళ్ల నుంచి నీరు కారుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వైరస్ సోకిన 5 నుంచి 7 రోజుల్లో ఈ లక్షణాలన్నీ తగ్గి΄ోతాయి. అయితే అరుదుగా కొన్ని సార్లు మాత్రం ఈ వైరస్లు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి నిమోనియా అనే ప్రమాకరమైన కండిషన్కు కారణమవుతాయి. మామూలు నిమోనియాతో పోలిస్తే... ఇలా ఒక వైరస్ కారణంగా వచ్చే సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారిగా పరిణమిస్తుంది. జలుబుగానీ లేదా ఇతరత్రా వైరస్ల వల్లగానీ సమస్య శ్వాసవ్యవస్థలోని పైభాగంలో అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉంటే... అది చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ ఒకవేళ పైన పేర్కొన్న వైరస్లు శ్వాస వ్యవస్థలో మరికాస్త లోతుకు వెళ్లి... అక్కడి కింది భాగాలకు అంటే... లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు వ్యాపిస్తే అది నిమోనియాకు దారితీస్తుంది. అప్పుడు సమస్య ఇంకాస్త తీవ్రమవుతుంది. కొన్నిసార్లు ముక్కు, శ్వాసకోశ వ్యవస్థల్లోని సన్నని ఎపిథీలియల్ పొర దెబ్బతినడం వల్ల అక్కడికి బ్యాక్టీరియా చేరి సైనుసైటిస్, ఫ్యారింజైటిస్ వంటి ఇతర సమస్యలూ వచ్చే అవకాశాలూ ఉంటాయి. నివారణ... మంచి పుష్టికరమైన సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ సీజన్లో ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తల వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఇమ్యూన్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. దీనివల్ల జలుబుతోపాటు... ఇతరత్రా జబ్బులనుంచీ దేహానికి మంచి రక్షణ దొరుకుతుంది జలుబు వచ్చినవారు నేరుగా ఇతర వ్యక్తులపై తుమ్మడం, దగ్గడం చేయకూడదు. తుమ్మే సమయంలో లేదా దగ్గేటప్పుడు చేతిరుమాళ్లు, టిష్యుపేపర్లు వంటివాటిని అడ్డు పెట్టుకోవడం అవసరం. అవి లేనప్పుడు కనీసం మోచేతి మడతలో తుమ్మడం, దగ్గడం చేయాలి. ఇక తరచూ చేతులు కడుక్కోవడం లేదా శానిటైజ్ చేసుకోవడం, ఇతరులనుంచి భౌతిక దూరాన్ని పాటించడం, గుంపుల్లోకి (క్రౌడ్స్లోకి) వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సీజన్లో జలుబు మాత్రమే కాకుండా అనేక ఇతర వైరస్ల కారణంగా వచ్చే వైరస్ జబ్బులను నివారించుకోవచ్చు. ఆస్తమా వంటి సీజనల్ సమస్యలు...ఇక ఈ సీజన్లోని చలి వాతావరణంలో ఆస్తమా వంటి సీజనల్ సమస్యలూ పెచ్చరిల్లుతాయి. మందకొడి వాతావరణంలోని అలర్జెన్స్ వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకుపోయే గాలిగొట్టాలు కుంచించుకుపోవడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే ఈ సీజన్లో మనకు సరిపడని అలర్జెన్స్నుంచి దూరంగా ఉంటూ ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యను నివారించుకోవాలి. తమకు ఈ సమస్య ఉందని తెలిసినవారు ఇన్హేలర్స్ వంటి ఫస్ట్లైన్ చికిత్సలతో సమస్య తీవ్రతరం కాకుండా నివారించుకోవాలి. అప్పటికీ తగ్గక΄ోతే డాక్టర్ను సంప్రదించి... ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్ల వంటి మందులు, ఇన్హేలర్లు వాడటం మంచిది.చికిత్స:జలుబు లేదా జలుబు వంటి వైరస్లతో వచ్చే సమస్యలన్నీ తమంతట తామే (సెల్ఫ్ లిమిటింగ్) సమస్యలు. వీటికి చికిత్స అందుబాటులో లేదు. కేవలం ఉపశమనం కోసమే లక్షణాలను బట్టి (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్గా) కొన్ని మందులు ఇస్తుంటారు. లక్షణాలను తగ్గించడం కోసం జ్వరానికి పారాసిటమాల్, ముక్కులు పట్టేసినప్పుడు నాసల్ డీ–కంజెస్టెంట్స్ వంటి వాటిని డాక్టర్లు సూచిస్తారు. వాటితో తగినంత ఉపశమనం కలుగుతుంది.గొంతునొప్పి, గొంతులో గరగర ఉన్నవారు లోజెంజెస్ వాడవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గరగరా పుక్కిలించడం (థ్రోట్ గార్గలింగ్) చేయవచ్చు.జలుబు, దాని వల్ల వచ్చే జ్వరం తగ్గిపోయాక కూడా చాలామందిలో నీరసం, నిస్సత్తువ, అలసట వంటివి కనిపిస్తూ ఉంటాయి. దాన్నే పోస్ట్ పైరెక్సియల్ డెబిలిటీ’ అంటారు. ఇది తగ్గడానికి అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉండే పుష్టికరమైన సమతులాహారం; జింక్ వంటి న్యూట్రియెంట్స్తోపాటు విటమిన్–సి పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.చల్లగా ఉండే వాతావరణం కారణంగా చాలామంది చలికాలంలో ఎక్కువగా నీళ్లు తాగరు. జలుబు చేసినప్పుడు నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. దాంతో వ్యాధినిరోధక శక్తి పెరిగి... దేహానికి జలుబును ఎదుర్కొనే సామర్థ్యం కలుగుతుంది.డాక్టర్ వెంకట్ నాని కుమార్ .బి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ (చదవండి: పెళ్లిపై నటి జయ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు..! అది పాతబడిన వ్యవస్థ) -
'వివాహానికి కాలం చెల్లింది'..! అందుకే మనవరాలికి కూడా..: జయ బచ్చన్
ప్రస్తుతం వివాహం అనే పదం ఎలా విలువలేని బంధంగా మారుతోందో చూస్తున్నాం. అదీగాక నేటి యువత వివాహం అనే బంధంలో చాలా చకచక నిర్ణయాలు తీసుకుని ఎలా విచ్ఛినన్న చేసుకుంటున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఈ జనరేషన్ తీరు భవిష్యత్తుకి భరోసా నిచ్చేలా వెల్ సెటిల్మెంట్ తర్వాతే పెళ్లి అని అంటున్నారే గానీ బంధాన్ని పదిలంగా కలకాలం నిలిచేలా మైండ్ని స్ట్రాంగ్ ప్రిపేర్ చేసుకోవడంలో ఫెయిలవ్వుతున్నారనేది నిపుణుల వాదన. ఇలాంటి సమయంలో బాలీవుడ్ నటి జయబచ్చన్ వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారాయి. పైగా ఆమె వివాహాన్ని కాలం చెల్లిందిగా పేర్కొనడం సర్వత్ర చర్చనీయాంశమైంది. అందులోనూ ఎంపీ, సీనియర్ నటి జయబచ్చన్ ఇలా మాట్లాడటంపై సంప్రదాయవాదులు వ్యతిరేకించగా, స్వేచ్ఛ కోరుకునే మహిళామణులు మాత్రం ఆమెకు మద్దతు పలకడం విశేషం. ఇంతకీ ఆమె ఏం అన్నారు. అది కరెక్టేనా అంటే..ప్రముఖ నటి జయా బచ్చన్ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వివాహాన్ని కాలం చెల్లినది(Outdated Institution)గా పేర్కొన్నారు. అందుకే తన మనవరాలు నవేలి నందా వివాహం చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని అన్నారు. తన మనవరాలు జనరేషన్లో ఉన్న యువత నమ్ముతుందే చెబుతున్నానని అన్నారామె. ఎందుకంటే వివాహ వ్యవస్థ చాలా వేగంగా మారిపోతోందని అన్నారు. ఇది అభ్యంతరంగా అనిపించినా..అదే నిజం!నవ్య గనుక తన కెరీర్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇంటి బాధ్యతలకు పరిమితమవ్వడం మీకు ఓకేనా అని అడిగినప్పుడూ జయ ఈ విధంగా వ్యాఖ్యానిచ్చారామె. ఏమాత్రం సంకోచం లేకుండా నవ్య వివాహం చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. ఆధునిక సంబంధాలకు చట్టపరమైన ముద్ర అవసరం లేదని, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి కలిసి ఉంటే సరిపోతుందని ఆమె నొక్కి చెప్పారు. ముందుగా యువత జీవితాన్ని ఆస్వాదించమని సలహా ఇచ్చారు. మాతరంలోని సంబంధాలతో ఈ తరం అనుభవిస్తున్నది చాల భిన్నంగా ఉంది. ఇది అభ్యంతరంగా అనిపించినా..నిజానికి దీర్ఘాకాలిక సంబంధాలను నిలబెట్టుకోవాలంటే శారీర ఆకర్షణ, అనుకూలత చాలా ముఖ్యం కానీ ఈ తరం అది నిజమేనా కాదా అని ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే ప్రేమ కలకాలం కొనసాగాలంటే కొంత సర్ధుబాటు కూడా అవసరం. అది లేకపోతే బంధాన్ని నిలబెట్టుకోలేరని చెప్పుకొచ్చారు జయ. అలాగే ఈ రోజుల్లో చిన్నపిల్లలు చాలా తెలివైనవారు. వారు మనల్ని మించిపోయేలా ఉంటారు అని ఆమె తెలిపారు. తరాల మధ్య ఆలోచనా విధానంలో వచ్చిన అపారమైన మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు . గతంలో ఉన్న సాంప్రదాయ పద్ధతులు, సామాజిక కట్టుబాట్లు నేటి యువతకు సరిపోవని, ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితాలను, సంబంధాలను తమకు నచ్చిన విధంగా నిర్వచించుకునే స్వేచ్ఛ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.పెళ్లిపై ఆలోచనలు నిజంగా మారుతున్నాయా? నివేదికల ప్రకారం..భారతదేశంలో మహిళ సగటు వివాహ వయసు 2023లో 22.9 సంవత్సరాలకు పెరిగింది. ఇది మునుపటి కంటే కొంచెం ఎక్కువ. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో విద్య, కెరీర్ లేదా వ్యక్తిగత వృద్ధి కోసం వివాహాన్ని ఆలస్యం చేస్తోంది యువత. అదే విధంగా ఒకప్పుడూ ఎక్కువమంది మహిళలు 18 ఏళ్లకు ముందే వివాహం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక స్వాతంత్ర్యంపై పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా వివాహంపై యువత ధోరణిలో పెనుమార్పులు వచ్చినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక జయబచ్చన్ వ్యాఖ్యలు చాలా బోల్డ్గా ఉన్నా..ఇప్పటికే జరుగుతున్న మార్పునే ప్రతిబింబించారని చెప్పొచ్చు అని అంటున్నారు నిపుణులు. ఇక జయ ఉద్దేశ్యం వివాహ తప్పనిసరి కాదు, కానీ శారీరక అనుకూలత, స్నేహం,సామాజిక బాధ్యత కంటే ముఖ్యమైనది. అలాగే పిల్లలను పెంచడానికి తప్పనిసరిగా సాంప్రదాయ నిర్మాణాలు అవసరం లేదనేది ఆమె అభిప్రాయం. దీన్ని చాలామంచి మహిళామణులు స్వాగతించగా, చాలామంది సంప్రదాయవాదులు ఇది సరైనది కాదని మండిపడుతున్నారు.(చదవండి: రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి స్క్రాబుల్ గ్రాండ్మాస్టర్ టైటిల్! అసలేంటి గేమ్..) -
యోధుడా.. నీకు సెల్యూట్ ..!
మిలట్రీ వాళ్లను చూసినా, మిలట్రీ డ్రెస్ను చూసినా సెల్యూట్ కొట్టాలని అనిపించేంతగా భావావేశానికి లోనవుతాం. అదీ మిలట్రీ పవర్! సాధ్యం కాదు కానీ, అందరికీ దేశ రక్షణ దళాలలో పని చేయాలనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్యాషన్లన్నీ మిలట్రీ నుంచి వచ్చినవే. దేశాధి నేతలు మొదలు సామాన్య పౌరుల వరకు ఏదో ఒక సందర్భంలోమిలట్రీ దుస్తులు మన ఒంటిపై కవాతు చేస్తూ కనిపిస్తాయి. అంతగా స్ఫూర్తిని ఇస్తున్న సైనిక వస్త్ర, శస్త్ర విశేషాలు.. క్లుప్తంగా మీ కోసం!కార్గో ప్యాంట్లు1930లలో, బ్రిటిష్ సైన్యం కార్గో ప్యాంట్లను యుద్ధ దుస్తులలో భాగంగా ప్రవేశపెట్టింది. తూటాలు, ఇతర మందుగుండు సామగ్రి అమర్చుకోవటానికి సదుపాయంగా ఆ ప్యాంట్లకు ఇరువైపు ‘పక్క తొడ’ల పైన, నడుముకు ముందువైపు రెండు వైపులా జేబులు ఉండేలా డిజైన్ చేశారు. బ్రిటన్ తర్వాత కార్గో ప్యాంట్లను క్రమంగా యూఎస్ సైన్యం కూడా ఉపయోగించటం మొదలుపెట్టింది. 1990ల నాటికి ఇది సాధారణ పౌరుల ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారింది. యువతీ యువకులు స్టెయిల్ కోసం వీటిని ధరించటం మొదలు పెట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తరచు కార్గో ప్యాంట్స్లో కనిపిస్తుంటారు. మూడేళ్లుగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ ఘర్షణల సమయంలో జెలెన్స్కీ వస్త్రధారణ కూడా ఒక ప్రతీకగా మారింది! త్రిశూలం గుర్తు ఉన్న నల్లటి, లేదా ఆలివ్ ఆకుపచ్చ టాప్తో, కార్గో ప్యాంట్స్ ధరించే జెలెన్స్కీ, ఉక్రెయిన్పై రష్యా దాడులను ఆపించే విషయమై ప్రపంచ దేశాధినేతలతో చర్చిస్తున్నప్పుడు దేశాధ్యక్షుడిగా కాక, కార్గో ప్యాంట్లలో ఒక సైనిక యోధుడిని తలపిస్తుంటారు. మన దగ్గర బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కార్గో ప్యాంట్స్ని ఎక్కువగా ధరిస్తుంటారు.ఏవియేటర్ సన్గ్లాసెస్హాలీవుడ్లోకి ఏవియేటర్ సన్గ్లాసెస్ రావటానికి ముందే, యూఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు వాటిని ధరించారు. అంతకుముందు వరకు పైలట్లు పాతకాలపు బరువైన గాగుల్స్ వాడేవారు. ఆ తర్వాత వాటికి బదులుగా ఏవియేటర్ సన్గ్లాసెస్ను కనిపెట్టారు. ‘పైలట్’ను ‘ఏవియేటర్’ అని కూడా అంటారు. ఆ పేరు మీదే ఏవియేటర్ సన్గ్లాసెస్ వాడుకలోకి వచ్చాయి. ఎండ తాకిడి నుంచి అవి బలమైన రక్షణను ఇస్తాయి.ఏవియేటర్ సన్గ్లాసెస్కు అధునాతన రూపమే ‘రే–బాన్’ కళ్లద్దాలు. ‘రే’ అంటే సూర్యకిరణాలు. ‘బ్యాన్’ అంటే తెలిసిందే, నిషేధం అని. సూర్యకిరణాలు పడకుండా అడ్డుకుంటాయి కనుక అవి రే–బాన్ సన్గ్లాసెస్ అయ్యాయి. సంపన్నుల ఫ్యాషన్లో ఇప్పుడు ముఖ్య భాగం అయ్యాయి. అమెరికా పూర్వపు అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ, రెండో ప్రపంచ యుద్ధపు అమెరికన్ టాప్ కమాండర్ జనరల్ డగ్లస్ మాక్ఆర్థర్, వియత్నాం విప్లవ నాయకుడు హో చి మిన్.. రే–బాన్ గ్లాసులు ధరించేవారు. ప్రస్తుత నాయకులలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అప్పుడప్పుడు రే–బాన్లో దర్శనం ఇస్తుంటారు టీ–షర్ట్టీ–షర్ట్ నమూనాను తొలిసారిగా అమెరికా నావికాదళం డిజైన్ చేసినట్లు చరిత్ర చెబుతోంది. బహుశా 1898 స్పెయిన్–అమెరికా యుద్ధ సమయంలో షర్ట్ కింద వేసుకునే అండర్ షర్ట్గా దీనికి రూపకల్పన చేశారని అంటారు. టీ షర్ట్ క్రమేణా సైన్యంలో తప్పనిసరి ధారణగా మారింది. అక్కడి నుండి 1950ల నాటికి పాప్ సంస్కృతిలో భాగమైంది. ఆ తర్వాత దాదాపు ప్రతి వార్డ్రోబ్లోకీ ప్రవేశించింది. దేశాధినేతలు అధికారిక కార్యక్రమాలలో టీ షర్ట్ను ధరించటం ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించదు. అదే విధంగా, దాదాపు అన్ని కార్యాలయాలలో టీ షర్ట్పై అనధికార నిషేధం ఉంటుంది. విధి నిర్వహణలో కాకుండా ఉల్లాసంగా గడిపే సమయాలలోనే సాధారణంగా ఎవరైనా టీ షర్ట్ను ధరించి ఉండటం కనిపిస్తుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా మాజీ ప్రధాని ఇప్పుడంటే టీ–షర్ట్లో దర్శనం ఇస్తున్నారు కానీ, పదవిలో ఉండగా వాళ్లేనాడూ టీ షర్ట్లో అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు. గ్రీకు రాజ్యమైన మేసిడోనియా రాజు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ (క్రీ.పూ.356–323) టీ షర్ట్లను పోలిన పై వస్త్రాన్ని ధరించేవారని అనుకోవటానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం అంతటా నావికులు, కార్మికులు, సౌకర్యవంతమైన లోదుస్తులుగా టీ షర్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. దేశాధినేతలు అధికారిక కార్యక్రమాలలో టీ షర్ట్ను ధరించటం ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించదు. అదే విధంగా, దాదాపు అన్ని కార్యాలయాలలో టీ షర్ట్పై అనధికార నిషేధం ఉంటుంది. విధి నిర్వహణలో కాకుండా ఉల్లాసంగా గడిపే సమయాలలోనే సాధారణంగా ఎవరైనా టీ షర్ట్ను ధరించి ఉండటం కనిపిస్తుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా మాజీ ప్రధాని ఇప్పుడంటే టీ–షర్ట్లో దర్శనం ఇస్తున్నారు కానీ, పదవిలో ఉండగా వాళ్లేనాడూ టీ షర్ట్లో అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు. గ్రీకు రాజ్యమైన మేసిడోనియా రాజు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ (క్రీ.పూ.356–323) టీ షర్ట్లను పోలిన పై వస్త్రాన్ని ధరించేవారని అనుకోవటానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం అంతటా నావికులు, కార్మికులు, సౌకర్యవంతమైన లోదుస్తులుగా టీ షర్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. కార్డిగన్కార్డిగన్ ధరించినప్పుడు హాయిగా, సౌఖ్యంగా ఉండే కార్డిగన్ దుస్తులను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధంలో రష్యన్లపై దాడి చేసిన సమయంలో బ్రిటిష్ సైన్యం ధరించింది. నిజానికి ‘కార్డిగన్’ అనేది ఒక బిరుదు. ‘ఎర్ల్ ఆఫ్ కార్డిగన్’ అంటే కార్డిగన్ అనే బిరుదు కలిగిన గొప్ప వంశానికి చెందిన వ్యక్తి. అప్పటి బ్రిటిష్ అశ్విక దళానికి నాయకత్వం వహించిన 7వ ‘ఎర్ల్ ఆఫ్ కార్డిగన్’ జేమ్స్ థామస్ బ్రూడెనెల్ ఆనాటి క్రిమియన్ యుద్ధానికి ఈ దుస్తులను ధరించి సారథ్యం వహించారు కనుక ఆ దుస్తులకు కార్డిగన్ అని పేరు పెట్టారు. కార్డిగన్ డిజైన్, దానిని ధరించిన వారి కార్యాచరణలు బ్రిటిషర్ల దేశభక్తికి ప్రతీకలుగా నిలిచిపోయాయి. కాలర్ లేని స్వెట్టర్ లేదా జాకెట్ను ‘కార్డిగన్’ అంటారు. ఫ్రెంచి ఫ్యాషన్ డిజైనర్ కోకో చానల్ 1920లలో మహిళలు ధరించే కార్డిగన్లను ప్రాచుర్యంలోకి తెచ్చారు. పురుషుల కార్డిగన్లను ధరించేటప్పుడు తన జుట్టు చెదిరిపోతుండటం నచ్చకపోవటంతో ఫ్రంట్ ఓపన్ కార్డిగాన్లను మహిళల కోసమే ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒక బల్గేరియన్ రేడియో ఎడిటర్నైతే కార్డిగన్ ఏకంగా ఒక హత్యాయత్నం నుండే కాపాడింది! అతను ధరించిన మందపాటి ఉన్ని కార్డిగన్.. రహస్య ఏజెంటు ఆ ఎడిటర్పై పేల్చిన విషపు గుళిక శరీరంలోకి చొచ్చుకొని పోకుండా నిరోధించింది. హై – హీల్స్అశ్విక దళంలోని సైనికులు గుర్రాలను ఎక్కి రెండు వైపుల బూటు కాలు ఉంచే రింగులలో (అంకేలు) పాదాలకు మరింతగా కుదురును ఇవ్వటం కోసం మొదట పర్షియన్ సైనికులు 10వ శతాబ్దంలో హై హీల్స్ను కనిపెట్టారు. యుద్ధ సమయంలో గుర్రాన్ని దౌడు తీయించటంలో ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉండే ఈ హై హీల్స్ కాల క్రమంలో హోదాకు చిహ్నంగా మారాయి. చివరికి గ్లామర్కు పర్యాయపదం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళల మనసు దోచుకున్నాయి. మహిళా దేశాధినేతలు హైహీల్స్ ధరించటం సర్వ సాధారణమే కానీ, చరిత్రలో హై హీల్స్ను ఇష్టపడిన పురుష నాయకులూ ఉన్నారు. ఫ్రాన్స్ రాజు 14వ లూయీ తన హోదాకు చిహ్నంగా హై హీల్స్ ధరించేవారు. ఐక్యరాజ్య సమితిలో ఓసారి అమెరికా మాజీ రాయబారి (ఐరాసకు) నిక్కీ హేలీ హై హీల్స్ ధరించటం గురించి గళం విప్పారు! ‘‘హై హీల్స్ శక్తిని, సాధికారతను ఇస్తాయి. యథాతథ స్థితిని సవాలు చేస్తాయి. అందువల్లనే నేను హై హీల్స్ ధరిస్తాను’’ అని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో వంటి వారు పొడవుగా కనిపించటానికి హై హీల్స్ ధరిస్తారన్న పుకార్లు ఉన్నాయి. 2023లో, మహిళలపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెంచటానికి ‘హోప్ ఇన్ హై హీల్స్’ ప్రచారంలో కెనడా పురుష ఎంపీలు హై హీల్స్ ధరించారు. బాంబర్ జాకెట్బాంబర్ జాకెట్ను మొదటి ప్రపంచ యుద్ధ పైలట్ల కోసం ‘యూఎస్ ఆర్మీ ఏవియేషన్ క్లోతింగ్ బోర్డ్’ సృష్టించింది. ఎ–1 అని వ్యవహరించిన ఆ బాంబర్ జాకెట్ను తొలిసారి 1917లో అమెరికన్ పైలట్లు ధరించారు. పైలట్లను వెచ్చగా ఉంచడానికి బోర్డు రూపొందించిన మొదటి ఫ్లయిట్ జాకెట్ అది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్పై ప్రమాదకరమైన ఎత్తైన ప్రదేశాలలో బాంబు దాడులను నిర్వహించిన యువ అమెరికన్ వైమానిక దళ సభ్యులను ‘బాంబర్ బాయ్స్’ అనే వారు. ఆ పేరు నుంచే బాంబర్ జాకెట్ వాడుకలోకి వచ్చింది.అమెరికన్ మిలిటరీ 1950లలో ఎం.ఎ.–1 అనే బాంబర్ జాకెట్ను వృద్ధి చేసింది. అది ప్రకాశవంతమైన నారింజ రంగు లైనింగ్తో ఉండేది. ఒకవేళ విమానం కూలిపోతే, రక్షణ బృందాలకు సజీవంగా ఉన్న పైలట్ తేలిగ్గా కనిపించటానికి జాకెట్ను తిప్పి వేసుకోవచ్చు. లోపలి లైనింగ్ నారింజ రంగులో ఉంటుంది కనుక క్షతగాత్రుడైన పైలట్ జాడ కనిపెట్టటం వారికి తేలికవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిపోయిన బాంబర్ జాకెట్లను అమెరికన్ సైన్యం పౌరులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాతి నుంచి వాటిని సామాన్యులూ వాడటం మొదలు పెట్టారు. ముఖ్యంగా హిప్–హాప్ కళాకారులు. 1980లో బాంబర్ జాకెట్కు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. దానికి కారణం టామ్ క్రూజ్ హిట్ చిత్రం ‘టాప్ గన్’లో ఆయన జి1 మోడల్ బాంబర్ జాకెట్ను ధరించటమే. ప్రారంభంలో బాంబర్ జాకెట్లు బరువైన తోలుతో తయారైనప్పటికీ తర్వాత్తర్వాత తేలికపాటి నైలాన్, సిల్క్, రీసైకిల్ చేసిన సముద్రపు ప్లాస్టిక్ల వంటి వాటితో విస్తృతంగా తయారై, ఏ సీజన్కైనా అనుకూలంగా ఉండేలా మారాయి. డాగ్ ట్యాగ్లుయుద్ధ సమయంలో సైనికులు మరణించినా, గాయపడినా.. వారిని సేవా దళ సభ్యులు గుర్తించటానికి వీలుగా వారి దుస్తులకు తగిలించి ఉండేవే డాగ్ ట్యాగ్లు. ఇవి అండాకారంలో ఉండే రేకు ముక్కలు. వాటిపై ఆ సైనికుల వివరాలు ముద్రించి ఉంటాయి. అమెరికా అంతర్యుద్ధ సమయంలో తొలిసారిగా ఈ డాగ్ ట్యాగ్లను అనధికారికంగా ప్రవేశపెట్టారు. గుర్తు తెలియని సమాధులలో శత్రువులు కనుక తమ వారిని సమాధి చేస్తే వారిని కనిపెట్టేందుకు డాగ్ ట్యాగ్లను తగిలించారు.డాక్ ట్యాగ్లను ఇప్పుడు సైనికులతో పాటుగా, పౌరులు కూడా తగిలించుకుంటున్నారు. కార్పొరేట్ కార్యాలయాలలో ఉద్యోగుల మెడలో కనిపించే ఐడీ కార్డులకు ప్రేరణ డాగ్ ట్యాగ్ల నుండి వచ్చిందేనని అంటారు.ట్రెంచ్ కోట్నీటితో తడవని, బరువు ఉండని తేలికపాటి ‘గ్రేట్ కోట్’లకు సమానమైన ట్రెంచ్ కోట్ను తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం ఉపయోగించింది. సైనికులను కందకాలలో పొడిగా ఉంచే ఈ కోటు కాల క్రమేణా పౌరుల దైనందిన జీవితంలో భాగం అయింది.గ్రేట్ కోట్ పొడవుగా, బరువుగా, వెచ్చని ఓవర్ కోట్లా, ఉన్నితో తయారై ఉంటుంది. మొదట్లో సైనిక సిబ్బంది వీటినే ధరించేవారు. తీవ్రమైన చలి గాలుల నుంచి ఈ గ్రేట్ కోట్లు వారికి రక్షణ కల్పించేవి. వీటి పొడవు సాధారణంగా మోకాలి కింది వరకు ఉంటుంది. ట్రెంచ్ కోట్... గ్రేట్ కోట్కు అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పాలి. వాటర్ ప్రూఫ్ వస్త్రంతో తయారౌతుంది. అదనపు రక్షణను కల్పిస్తుంది. సైనిక చిహ్నాలను తగిలించటానికి భుజం పట్టీలు ఉంటాయి. ట్రెంచ్ కోట్ కూడా మోకాలి కింది వరకు ఉంటుంది. క్రమంగా ఇందులోకీ ఫ్యాషన్ వచ్చి చేరింది. మహిళలకు ప్రత్యేకంగా ట్రెంచ్ కోట్లు వచ్చాయి. ఫ్యాషన్ షోలలో ఎక్కువ మంది మోడళ్లు ట్రెంచ్ కోట్లను పోలిన వస్త్రాలను ధరించటం మీరు చూసే ఉంటారు. ట్రెంచ్ అంటే కందకం. కందకాల్లో ఉండి పోరాడే సైనికుల కోసం తయారైన కోట్ కనుక వీటికి ట్రెంచ్ కోట్ అనే పేరు వచ్చింది. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: పొలాల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి..ఇవాళ 400 మందికి పైగా యువతకు..!) -
మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్ళై వెయిట్లాస్ కష్టాలు..!
బరువు తగ్గడం కొందరికి అతి పెద్ద సవాలు. పైగా అదొక భారమైన సమస్యగా మారిపోతుంటుంది. ఎందుకంటే వారికి సాధారణ ఆహార మార్పులు ఓ పట్టాన పనిచేయవు. అలా.. బరువు తగ్గినట్టే తగ్గి ..ఇట్టే పెరిగిపోతుంటా. దాంతో విసుగు పుట్టుకొచ్చేస్తుంటుంది కూడా. అలానే ఇబ్బంది పడింది మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్ళై. ఆమెకు బరువు తగ్గడం శారీరకంగా, మాససికంగా పెను సమస్యగా మారింది. ఏ డైట్ ఫాలో అయిన ఫలితం శూన్యం. తగ్గినట్టు తగ్గి పెరిగిపోతోంది. చివరికి ఆమె ఏం చేసి బరువు తగ్గగలిగిందంటే..రక్తపోటు సమస్యల కారణంగా అంబికాను కార్డియాలజిస్ట్లు బరువు తగ్గేందుకు ప్రయత్నించమని సూచించారు. బరువు తగ్గితే ఆమె వాడే అన్ని మందులు ఆపేయొచ్చట. అందుకే తాను చాలామందిని వెయిట్లాస్ జర్నీలో తనతో కలిసి జాయిన్ అవ్వమని పిలునిస్తుందట కూడా. ఈ బరువుని నిర్లక్ష్యం చేస్తే భారీకాయంతో మూల్యం చెల్లించుకుంటామంటోంది. అధిక బరువు.. అన్ని అనారోగ్య సమస్యలకు మూలం కాబట్టి పట్టుదలతో దానిపై యుద్ధం చేయాలని అంటోంది. డైట్ మార్పులు.. తగ్గినట్టు తగ్గి..కొన్ని నెలలో బరువు పెరిగిపోవడంతో విసిగిపోయి..డైట్లోనే మార్పులు చేసింది. నో బ్రెడ్, చపాతీ, రైస్, పరాఠా, మాల్వా పరాఠా అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. అందుకు బదులుగా కూరగాయలు, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకునేదాన్ని అని అంటోంది. చాలామటుకు ఆవిరిలో లేదా రోస్ట్ చేసినవి తీసుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది. అప్పుడే తన బరువులో స్వల్ప మార్పులు సంభవించాయని అంటోంది. పిండి పదార్థాలకు దూరంగా ఉండటం తోపాటు డీప్ ఫ్రై చేసిన ఆహారాలను కూడా దరిచేరనిచ్చేదికాదు. సాధ్యమైనంతవరకు ఆవిరిలో ఉడికించిన వాటికి ప్రాధాన్యత ఇచ్చి..సుమారు ఐదు కిలోల బరువు తగ్గిందట. అంతేగాదు బరువు తగ్గడంలో తనలా హెచ్చు తగ్గులతో ఇబ్బంది పడుతుంటే గనుక అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తే..సత్వర మార్పుల తోపాటు బరువు తగ్గడం కూడా తథ్యం అని నమ్మకంగా చెబుతోంది. అందుకు సంబంధంచిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ambika Pillai (@ambika_pillai) (చదవండి: పొలాల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి..ఇవాళ 400 మందికి పైగా యువతకు..!) -
వెల్వెట్ విలాసం..!
ఒకనాడు కోట గోడలలో విలాసంగా వెలిగింది నేడు, అతివల వస్త్ర సంపదలో సుసంపన్నంగా మెరుస్తోంది.పట్టుకుచ్చులాంటి మెత్తదనం, మది దోచే మెరుపుతో మఖమల్ పేరున్న వెల్వెట్ ఈ వింటర్ సీజన్లో రారాజులా విరాజిల్లుతుంది. బాలీవుడ్ తారలు వింటర్ సీజన్లో వెల్వెట్ను ధరించడంలో ముందుంటారు. అందుకు ముందుగా టబు వెల్వెట్ అనార్కలీలో రాచరికపు హుందాతనంతో కనిపించగా ఇప్పుడు యామి గౌతమ్ ఆకుపచ్చని వెల్వెట్ శారీలో గాంభీర్యంగా కనివిందు చేస్తుంది.సల్వార్ సూట్లు, లాంగ్ ఓవర్కోటులు, సంక్లిష్టమైన ఎంబ్రాయిడరీతో వెల్వెట్ ఎప్పుడూ ఎవర్గ్రీన్ మార్కులు కొట్టేస్తూనే ఉంది. ఈ శీతాకాలపు వివాహాలు, పండగ వేడుకలలో అత్యంత ఇష్టమైన ఎంపికగా అతివల మనసును ఆకట్టుకుంటోంది. పచ్చ, ఆకుపచ్చ, నెమలిపింఛం రంగు, రిచ్ బ్రౌన్, బ్లాక్.. వంటి టోన్ షేడ్స్ సెలబ్రిటీ వార్డ్రోబ్లను రిచ్గా మెరిపిస్తున్నాయి.వెల్వెట్కి ఈ సీజన్లో మళ్లీ ఊపిరిపోస్తున్నాం అంటే ఒక్క విలాసం గురించే కాదు. మనలోని భావోద్వేగ ప్రతిధ్వనిని కూడా బయటకు వెదజల్లుతుంది. ప్రాచీన ప్రపంచ చక్కదనాన్ని చూపెడుతుంది. చలికాలం మూడ్ను ఉత్తేజపరుస్తుంది. ఇండోర్ లైటింగ్లో అందమైన ఫొటోలకు మంచి లుక్ ఇస్తుంది. ఎంబ్రాయిడరీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్యాషన్ మళ్లీ గొప్పగా వెల్వెట్ ఫ్యాబ్రిక్ వెలుగులో నిలిచిపోతుంది.ఈ ఏడాది వింటర్ సీజన్కి హీనా కొచ్చర్ రూపొందించిన వెల్వెట్ కలెక్షన్ రాయంచలా వచ్చేసింది. బ్రౌన్ అనార్కలీలో టబు ధరించిన వెల్వెట్ రాయల్టీకి ప్రతిరూపంగా నిలిచింది. ధరించిన డ్రెస్కు తగినట్టు ఇయర్ హ్యాంగింగ్స్, పాట్లి బ్యాగ్తో మ్యాచ్ చేసింది. డ్రెస్ మరింత వైభవంగా వెలిగేలా జుట్టును స్టైల్ చేసింది. యామి గౌతమి ఈ ట్రెండ్కు రీఫ్రెషింగ్ మినిమలిజాన్ని తీసుకువచ్చింది. దేవనాగరి సెట్ చేసిన ఈ అద్భుతమైన ఆకుపచ్చ వెల్వెట్ చీర సుతిమెత్తని అలలకు నిదర్శంగా నిలిచింది. తక్కువ మేకప్, ఆభరణాలతో అలంకరించింది. ఆమె స్టైలింగ్ అంతా ఫ్యాబ్రిక్ గొప్పదనాన్ని చెప్పకనే చెబుతోంది. డిజైనర్ నూరి తయారు చేసిన వెల్వెట్ కఫ్తాన్లో శోభిత ధూళిపాళ మెరిసిపోయారు. అందుకు తగినట్టుగా ఉండే మేకప్, హెయిర్ స్టైల్ కంఫర్ట్ని సూచిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. (చదవండి: నానోతో పాత ఫొటోలు కొత్తగా!) -
ఎనిమిదేళ్ల బాలుడికి కిడ్నీ నిండా రాళ్లు
ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో, ఇంకా చెప్పాలంటే చివరకు నవజాత శిశువుల్లో కూడా కిడ్నీ రాళ్ల సమస్య కనిపిస్తోంది. ప్రధానంగా కొంత పెద్ద పిల్లలు తగినంత నీళ్లు తాగకపోవడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకోవడం లాంటివి ఇందుకు కారణాలవుతున్నాయి. మరీ చిన్నపిల్లల్లో అయితే మెటబాలిక్ కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, ఊబకాయం, పర్యావరణ కారణాల వల్ల కూడా ఇవి ఏర్పడుతున్నాయి. ఆహారంలో ఉప్పు వాడకం, తీపి పానీయాలు తగ్గించాలి. తాజాగా వరంగల్ ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి ఎడమవైపు కిడ్నీ నిండా రాళ్లు ఏర్పడడంతో అతడిని హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)కు ఆ బాలుడిని తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు విజయవంతంగా మొత్తం రాళ్లన్నింటినీ తొలగించి, బాలుడికి ఊరట కల్పించారు. తొలుత ఆ అబ్బాయికి విపరీతమైన కడుపునొప్పి, జ్వరం ఉండడంతో అది కిడ్నీలో రాళ్ల సమస్యేనని గుర్తించి ఈ చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు, పిల్లల్లో కిడ్నీ రాళ్ల సమస్యల గురించి ఏఐఎన్యూకు చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్, ట్రాన్సిషనల్ యూరాలజిస్ట్ డాక్టర్ పి.అశ్విన్ శేఖర్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “బాలుడిని ఇక్కడకు తీసుకురాగానే సమస్యను గుర్తించి, పెర్క్యుటేనియస్ నెఫ్రో లితోటమీ (పీసీఎన్ఎల్) చేయాలని నిర్ణయించాం. ఇందులోభాగంగా వీపు భాగంలో చిన్న రంధ్రం చేసి, నెఫ్రోస్కోప్ ద్వారా కిడ్నీలోకి వెళ్లి ఎక్కువ నొప్పి లేకుండా రాళ్లను తొలగించాం. సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే ఇందులో త్వరగా కోలుకుంటారు. దీనివల్ల ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గుతుంది.కిడ్నీలో రాళ్ల సమస్య ఇంతకుముందు పెద్దవారిలోనే కనిపించేది. ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తోంది. ఎవరైనా సరే రోజూ తగినంత నీళ్లు తాగాలి. ఎన్ని తాగాం అన్నదాని కంటే, ఎంత మూత్రం వస్తోందన్నది ముఖ్యం. రోజుకు కనీసం లీటరున్నర మూత్రం పోయేలా నీళ్లు తాగాలి. అలా తాగకపోతే మూత్రం చిక్కబడుతుంది. అదే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి సూచిక. పిల్లల్లో కిడ్నీరాళ్ల తొలగింపు చాలా జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాలి. అత్యాధునిక టెక్నిక్లు ఉపయోగించడం ద్వారా ఈ కేసులో విజయం సాధించాం. ఇందులో ఒక పెద్దరాయి, మరికొన్ని చిన్నరాళ్లు అన్నింటినీ ఒకే సిటింగ్లో తొలగించాం. సాధారణంగా పెద్దరాళ్ల తొలగింపునకు 2-3 సిటింగ్లు అవసరం అవుతాయి. కానీ పీసీఎన్ఎల్ తరహాలో అయితే పెద్ద, సంక్లిష్టమైన రాళ్లనూ తొలగించగలం.తెలంగాణలో కిడ్నీ రాళ్లు, కిడ్నీ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఇది ప్రమాదకరంగా పెరుగుతోంది. ముఖ్యంగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, నీళ్లు తాగినా చెమటరూపంలో పోవడంతో తగినంత మూత్రం విడుదల కాక ఈ సమస్య వస్తోంది. మన దేశంలోనే అత్యధికంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) కేసులు తెలంగాణలో 6.2% ఉన్నాయి. గడిచిన 15-20 ఏళ్లలో పిల్లలకు కిడ్నీల్లో రాళ్ల సమస్య రెట్టింపు నుంచి నాలుగు రెట్లు అయ్యింది. పిల్లల్లో కిడ్నీ రాళ్లు ఏర్పడినప్పుడు.. నెల, రెండు నెలల తర్వాత మెటబాలిక్ సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించాలి. ఇందుకు 24 గంటల యూరిన్ మెటబాలిక్ పరీక్షలు, సీరం కెమిస్ట్రీలు చూసుకోవాలి. కొన్ని కేసుల్లో జన్యుపరమైన సమస్యల వల్ల ఇవి వస్తున్నాయి. చాలా వరకు మాత్రం నివారించదగ్గ కారణాలే ఉంటున్నందున మన జాగ్రత్తలు చాలాముఖ్యం” అని డాక్టర్ అశ్విన్ శేఖర్ వివరించారు.(చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు) -
అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే..!
ప్రకృతి ప్రసాదించిన సహజ పదార్థాలను ఉపయోగించి చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు.ఫేషియల్ స్క్రబ్: ఒక టేబుల్ స్పూను చక్కెరలో ఆరు చుక్కల ఆలివ్ అయిల్ కాని కొబ్బరినూనె కాని కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. శీతకాలంలో మోచేతుల దగ్గర చర్మం గట్టిపడుతూంటుంది, ఇలాంటిచోట్ల కూడా ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. పాదాలకు కూడా ఇదే పద్ధతి.ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో అంతే మోతాదులో ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి మర్దన చేయాలి. చక్కెరకు బదులుగా ఉప్పు వాడినట్లయితే కొన్ని రకాల చర్మ సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి.నైట్ క్రీమ్ఒక నిమ్మచెక్క రసం తీసి అందులో ఒక కప్పు పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి రాత్రంతా ఉంచుకోవాలి. (చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు) -
తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు
ఓ పెద్ద మార్పు కోసం పెద్దపెద్ద సమావేశాలు అవసరం లేదు. మన ఇంట్లోనే చిన్న చిన్న పనులతో ప్రారంభమవుతుందని ఈ ఇస్రో మాజీ శాస్త్రవేత్త నిరూపించారు. అందుకు కావాల్సిందల్లా ఆసక్తి, జిజ్ఞాస మాత్రమే. తన ఇంట్లోనే వచ్చే ఇన్ని వ్యర్థాలను తగ్గించడం ఎలా అనే చేసిన సరదా పరిశోధన..ఇంత పెనుమార్పుకి దారితీస్తుందని ఊహించలేదామె. పైగా మొత్తం దేశమే మెచ్చేలా ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటానని కూడా అనుకోలేదు. ఆమె ప్రయత్నాలు తక్కువ వ్యర్థాలతో జీవించేందుకు బీజం పడటమే కాకుండా ఎంతోమంది భారతీయులను ఆ దిశగా నడిపించేందుకు దారితీసింది.ఆ ఇస్రో మాజీ శాస్త్రవేత్తే పంక్తి పాండే. తన ఇంట్లో ఉన్న సాధారణ వ్యర్థాలను తగ్గించేందుకు పూనకోవడమే ఆమె జీవిత గమనాన్ని మార్చేసింది. కిరాణ సంచులు, షాంపూ సీసాలు, వంటగది స్క్రాప్లు వంటి రోజూవారి వ్యర్థాలను ఎలా నివారించొచ్చు అనేది అర్థమైంది ఆమెకు. అలా మొదలైన ప్రయాణం 'జీరోవేస్ట్ అడ్డా'కి అంకురార్పణ చేసింది. అలా తన జీరో వేస్ట్ ఆచరణాత్మక పద్ధతులు భారతదేశం అంతటా ప్రజలకు తెలిసేలా చేసింది ఈ జీరోవేస్ట్ అడ్డా. ఆ వ్యర్థాలు మానవులకు ఏవిధంగా ప్రయోజనకారిగా మారతాయా అన్నది ఈ అడ్డా క్లియర్గా అర్థమయ్యేలా చేయడమే కాదు, దాదాపు నాలుగు లక్షల మంది భారతీయలును ఆ దిశగా నడిచేలా మార్పుకు శ్రీకారం చుట్టింది. అంతేగాదు ఆము సోషల్ మీడియా కంటెంట్గా అవతారం ఎత్తి..రోజువారీ వ్యర్థాలను ఎలా పునర్వినియోగ పరుచుకుంటూ.. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చు వంటివి చాలా చిన్న చిన్న ఆచర్ణాత్మక పద్ధుతులతో చెప్పడం నెటిజన్లను ఆకర్షించడమే కాదు, వేలకొద్ది ఫాలోవర్స్ని తెచ్చిపెట్టింది. వ్యర్థాలతో ఆరోగ్యకరమైన జీవనానికి మార్గం వేసుకునేలా ప్రేరణ కల్పించింది. అంతేగాదు అలా నెమ్మదిగా దాన్ని ఫ్యాషన్, మిల్లెట్, వంటి స్థానిక ఆహారాలు, బుద్ధిపూర్వకంగా తినడం వరకు అన్ని కూడా చివరికి జీరో వేస్ట్ లివింగ్ ప్రాధాన్యతనే హైలెట్ చేయడం విశేషం. వాతావరణ మార్పులపై చర్య తీసుకోవడానికి ఆమె ఇంట్లో సోలార్ ప్యానెల్స్ వాడటం వంటి వాటితో ఆన్లైన్వేదికగా ప్రజలను ప్రోత్సహించింది.అంతేగాదు సోషల్మీడియా శక్తిని మంచికోసం వినయోగించి పెద్ద మార్పుకి బీజం ఎలా వేయొచ్చో చెప్పి స్ఫూర్తిగా నిలిచింది పంక్తి పాండే. అంతేగాదు పర్యావరణ సెలవుల నుంచి సెకండ్ హ్యాండ్ హోమ్ ఫర్నిచర్, ప్లాస్టిక్ రహిత జర్నీ వరకు అన్నింటి గురించి ఆకర్షణీయమైన కంటెంట్ని అందించి..ఆచరించేలా ప్రేరేపిస్తుందామె. మన దైనందిన జీవితంలో సరళమైన, స్థిరమైన అలవాట్లను స్వీకరిస్తే..కాలుష్యం కోరల్లో చిక్కుకుండా భూమిని భద్రంగా ఉంచుకోవచ్చు అని చెబుతోందామె. ఈ ప్రయత్నాలకు గానూ 2024లో పంక్తిని గ్రీన్ ఛాంపియన్గా కీర్తించి మరీ నేషనల్ క్రియేటర్స్ అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం. అలాగే పంక్తి జీరోవేస్ట్ అడ్డాకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Pankti Pandey (@zerowasteadda) (చదవండి: ప్రియమైన కుమారుడికి మీ అమ్మ వ్రాయునది...) -
ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు !
యాంటీబయాటిక్ మందులు వేసినా కూడా సూక్ష్మజీవులు చనిపోవడానికి బదులు ఇంకా పెరుగుతూనే ఉండే పరిస్థితిని యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. దీని గురించి ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన ఇన్ఫెక్షన్ నియంత్రణ నిపుణురాలు, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఆర్సీ బిలోరియా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరల్డ్ ఏఎంఆర్ అవగాహన వారోత్సవాన్ని (వావ్) ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా నవంబర్ 18 నుంచి 24 వరకు జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ “ఇప్పుడే స్పందించండి: మన వర్తమానాన్ని రక్షించి, భవిష్యత్తును కాపాడుకోండి’’. ఈ థీమ్ ఏఎంఆర్ను ఎదుర్కొనేందుకు ధైర్యవంతమైన, సమన్వయపూర్వక, విభాగాల వ్యాప్తంగా చర్యల అవసరాన్ని చెబుతోంది. ఏఎంఆర్ అనేది ఇప్పటికే మన ఆరోగ్యం, ఆహార వ్యవస్థలు, పరిసరాలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న ఒక ప్రపంచవ్యాప్త ముప్పు.యాంటీబయాటిక్స్ అనేవి ప్రాణాధార మందులు. కానీ, అవి ఇన్ఫెక్షన్ కలగజేసే సూక్ష్మజీవుల మీద పనిచేస్తేనే ప్రాణాలను కాపాడతాయి. యాంటీబయాటిక్స్ మందులు సమర్థంగా ఇన్ఫెక్షన్లను నియంత్రించలేకపోతే ప్రాణాధార చికిత్సలైన కేన్సర్ చికిత్స, అవయవ మార్పిడి లాంటి వాటిపై ఏఎంఆర్ ప్రభావం చూపుతుంది. యాంటీబయాటిక్స్ మందులను చెప్పిన డోస్ కంటే తక్కువ కాలం వాడడం, లేదా తగిన డోసేజిలో వాడకపోవడం, ఒక వ్యాధికి సరిపడని మందు వాడడం లాంటివే వాటిని సరిగా వాడకపోవడం అవుతుంది. వైద్యులు చెప్పినట్లే వీటిని వాడాలి. మన సమస్యకు వైద్యులు యాంటీబయాటిక్స్ రాయకపోతే, అవి కావాలని వారిపై ఒత్తిడి చేయకూడదు . వేరేవారికి రాసిన మందులు వాడితే నయమైపోతుందని అనుకోకూడదు. ఆయా వ్యక్తులు ఆరోగ్యరీత్యా తగిన మందులను సరైన డోసులోనే తీసుకోవాలి. మన దేశంలో నేరుగా దుకాణాలకు వెళ్లి ఏదిపడితే ఆ యాంటీబయాటిక్ కొనుక్కునే అవకాశం ఉండడం కూడా వీటి దుర్వినియోగానికి కారణం అవుతోంది. కొత్త యాంటీబయాటిక్స్ తయారీ చాలా సమస్యాత్మకం, ఖర్చుతో కూడుకున్నది. మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల కొత్త యాంటీబయాటిక్స్ తగ్గుతున్నాయి. అందుకని ఉన్నవాటినే జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలావరకు టీకాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి కాబట్టి ఏఎంఆర్ సమస్య పరిష్కారానికి పిల్లలు, పెద్దలు, వృద్ధులందరూ టీకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎవరికైనా ఇన్ఫెక్షన్ రాకపోతే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరమే ఉండదు. ఏఎంఆర్ నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషిచేయగలరు. ఈ కింది పద్ధతుల ద్వారా మీ వంతు ప్రయత్నించండి.వైద్యులు సూచించకపోతే యాంటీబయాటిక్స్ కావాలని ఒత్తిడిచేయకండి.మందుల దుకాణం నుంచి యాంటీబయాటిక్స్ కొనాలంటే వైద్యుల ప్రిస్క్రిప్షన్తోనే వెళ్లండి. నేరుగా వెళ్లి కొనొద్దు. యాంటీబయాటిక్స్ వాడడానికి ఎప్పుడూ వైద్యుల సలహా పాటించండి. వాడాల్సినంత కాలం వాడాలి తప్ప మధ్యలో ఆపకూడదు.మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ వాడద్దు, ఎవరికీ ఇవ్వద్దు.రోజూ చేతులు కడుక్కోవడం, ఆహారాన్ని శుభ్రంగా వండడం, అనారోగ్య బాధితులకు దగ్గరగా ఉండకపోవడం, దగ్గువచ్చినప్పుడు నోరు చేత్తో మూసుకోవడం, ఎప్పటికప్పుడు టీకాలు వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను నియంత్రించండి. చదవండి: లోపం ఐరన్.. అదే సైరన్..వైద్యులు సరైన యాంటీబయాటిక్, సరైన డోసులో, సరైన కాలం పాటు, సరైన సమయంలో ఇవ్వాలి. వీలైనంత తక్కువకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడడమే సరైన వ్యూహం. ఇన్ఫెక్షన్లకు సరైన చికిత్స చేయడం వల్ల యాంటీబయాటిక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రాదు.- డాక్టర్ ఆర్సీ బిలోరియా -
రన్.. ప్రీమిథాన్..! ఇది పరుగు మాత్రమే కాదు..
బలహీనమైన, తీవ్ర అనారోగ్యంతో ఉన్న అకాల నవజాత శిశువులకు మద్దతుగా వేలాది మందిని ఒక చోట చేరారు. ప్రపంచ అకాల నవజాత శిశువుల వారోత్సవాన్ని గుర్తు చేస్తూ.. వార్షిక రన్ ఆదివారం జరిగింది. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ వర్క్స్ వద్ద జరిగిన ప్రీమిథాన్–2025లో ఈ ఏడాది 2,500 మందికి పైగా ఔత్సాహికులు రన్లో పాల్గొనడం విశేషం. ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నితాషా బగ్గా, ఫీనిక్స్ గ్రూప్ సీఎండీ సురేష్ చుక్కపల్లి, రేయిన్బో చి్రల్డన్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ దినేష్ చిర్లా, సుఖి బిల్డర్స్ సీఎండీ సంతోష్ కెన్నడీ, బీనా కెన్నెడీ, ఎనర్జీస్ ప్రీమియర్ సీఎండీ సురేందర్పాల్ సలూజా, నీరస్ సీఎండీ అవ్నిష్ కుమార్, ఫ్రీడమ్ ఆయిల్ గ్రూప్ ఎండీ అక్షయ్చౌదరి రన్ని జెండా ఊపి ప్రారంభించారు. భారీ సంఖ్యలో పాల్గొన్న రన్నర్లు 3కే, 5కే, 10కే విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రీమిథాన్ కేవలం పరుగు మాత్రమేకాదని, నియోనాటల్ కేర్కు మద్దతునిచ్చే ఉద్యమం. యేటా పెరుగుతున్న భాగస్వామ్యం, అకాల శిశువుల పట్ల పెరుగుతున్న అవగాహన, ప్రజల కరుణ వంటి లక్ష్యాలను ప్రతిబింబిస్తుందన్నారు. సమాజంలోని అనేక సమస్యలతో పాటు ఆరోగ్యం, కార్పొరేట్ సమూహాలు, నాయకులు, కుటుంబాలను ఒకే లక్ష్యం వైపు సమీకరించడమే మా ముఖ్య ఉద్దేశం. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. – డాక్టర్ నితాషాబగ్గా, ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు (చదవండి: ఫ్రీలాన్స్ ఈతరం ఎంపిక..!) -
ఫ్రీలాన్స్ ఈతరం ఎంపిక..!
గతంతో పోలిస్తే నగరంలోని యువత కెరీర్ ఎంపికలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఒకప్పుడు పార్ట్టైమ్ పనిగా భావించిన ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు హైదరాబాద్లో నూతన తరం యువతకు ప్రధాన కెరీర్ ఎంపికగా మారుతోంది. సిటీ లైఫ్స్టైల్, స్టార్టప్ కల్చర్, డిజిటల్ ప్లాట్ఫారమ్ల విస్తృతి.. ఇలాంటి అంశాలతో ఫ్రీలాన్సింగ్ కొత్త వృత్తి ప్రమాణంగా మారింది. ఓ వైపు ఐటీ, సాఫ్ట్వేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రొఫెషనల్ జాబ్స్ చేస్తున్న వారి సంఖ్య ఎప్పటిలానే పెరుగుతున్నప్పటికీ.. విభిన్నంగా ఆలోచిస్తూ తమ కెరీర్ను కొత్త పంథాల్లో రూపొందించుకుంటున్న వారూ ఉన్నారు. ఇలాంటి వారికి ఫ్రీలాన్సింగ్ అనువైన వేదికగా మారింది. గచి్చ»ౌలి నుంచి కూకట్పల్లి వరకు.., జిమ్ ట్రైనర్లు, ఆర్టిస్టులు మొదలు., చెఫ్లు, రైటర్లు, డ్రైవర్లు, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్లు, డైటీషియన్లు, డిజైనర్లు వరకు అనేక రంగాల ఉద్యోగులు పూర్తిస్థాయిలో ఫ్రీలాన్స్ వైపు మళ్లుతున్నారు. ‘‘నాకు టైమ్ ఫ్రీడం కావాలనే నిర్ణయంతోనే ఫ్రీలాన్స్ మోడ్ ఎంచుకున్నా అని చెబుతున్న వారి సంఖ్య ఎక్కవగా పెరుగుతోంది. ఇలా వ్యక్తిగత సమయానికి కట్టుబడి ఉండే ఈ జనరేషన్కు ఫ్రీలాన్సింగ్ సూట్ అవుతోంది. ఫ్రీలాన్సింగ్ అనేది కేవలం ఐటీ లేదా మీడియా రంగాలకు పరిమితం కాదు. ఫిట్నెస్ వెల్నెస్ రంగంలో జిమ్ ట్రైనర్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు, స్పోర్ట్స్ థెరపిస్ట్లు భారీగా అవకాశాలు చూస్తున్నారు. హోమ్ ట్రైనింగ్, కార్పొరేట్ వెల్నెస్ వర్క్షాప్లు వీరి డిమాండ్ను పెంచాయి. ఫుడ్ రంగంలో ప్రైవేట్ చెఫ్లు, హోమ్ బేకర్లు, డైటీషన్లు వ్యక్తిగత కన్సల్టెన్సీ, పార్టీ క్యాటరింగ్, స్టార్టప్ ఫుడ్ ప్లానింగ్లో పనిచేస్తున్నారు. క్రియేటివ్ రంగంతో గ్రాఫిక్ డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, వీడియో ఎడిటర్లు, బ్రాండ్ స్ట్రాటజిస్టులు, సోషల్ మీడియా మేనేజర్లు.. వంటివి ప్రస్తుతం హాట్ డిమాండ్లో ఉన్న వృత్తులు. రీల్స్ కల్చర్, చిన్న బ్రాండ్ల పెరుగుదల, ఈకామర్స్ షూట్స్ ఈ రంగానికి బలం చేకూరుస్తున్నాయి. వీరితో పాటు టెక్ రంగంలో యూఐ/యూఎక్స్ డిజైనర్లు, వెబ్ డెవలపర్లు, యాప్ బిల్డర్లు, టెక్నికల్ సపోర్ట్ అసిస్టెంట్లు, స్టార్టప్లు, అంతర్జాతీయ క్లయింట్లతో ప్రాజెక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. హోమ్, లైఫ్స్టైల్ సరీ్వసుల్లో ఇంటీరియర్ డిజైనర్లు, బాల్కనీ గార్డెన్ స్పెషలిస్టులు, టెక్నీషియన్లు కూడా ఈ సరీ్వస్ ప్లాట్ఫారమ్ల ద్వారా అవకాశాలు పొందుతున్నారు. ఫ్రీలాన్సింగ్ బూస్ట్కి ప్రధాన కారణాలు.. నగర యువత ఈ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకోవడానికి కీలక కారణాల్లో ఒకటి టైమ్ ఫ్లెక్సిబిలిటీ. రాత్రిళ్లు పని చేయాలనుకున్నా, ఉదయమే ప్రాజెక్ట్లను పూర్తి చేయాలనుకున్నా.. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సౌలభ్యం వీరికి ప్రధాన ఆకర్షణ. అలాగే క్రియేటివ్, స్కిల్బేస్డ్ కమ్యూనిటీలు హైదరాబాద్లో వేగంగా పెరుగుతున్నాయి. కో వర్కింగ్ స్పేసెస్, ప్రొఫెషనల్ స్టూడియోలు, స్కిల్ మీట్అప్స్ వంటివి నెట్వర్కింగ్ అవకాశాలను పెంచుతున్నాయి. స్టార్టప్లు కూడా తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనిని పొందేందుకు ఫ్రీలాన్సర్లకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. చిన్న ప్రాజెక్ట్లు, క్యాంపెయిన్లు, తాత్కాలిక పనుల కోసం ఫ్రీలాన్స్ మోడల్ సరిగ్గా సరిపోతుంది. చాలా మంది యువత ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం కోసం ఫ్రీలాన్స్ చేస్తూ నెలకు రూ.20–రూ.50 వేలు అదనంగా సంపాదిస్తున్నారు. ఇది కూడా ట్రెండ్ వేగంగా విస్తరించడానికి ముఖ్య కారణంగా మారింది. తక్కువగా ఉన్న రంగాలు.. ప్రతి రంగంలో ఫ్రీలాన్స్ ఒకే విధంగా పనిచేయదు. హెల్త్కేర్ రంగంలో డాక్టర్లు, నర్సులు, థెరపిస్ట్లు చట్టపరమైన నియమాల కారణంగా స్వతంత్రంగా పనిచేయడం కష్టం. బ్యాంకింగ్ ఫైనాన్స్, బ్యాంక్ అధికారులుగా, ఆడిట్ విభాగాల్లో పనిచేసే వారికి ఫ్రీలాన్స్ అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఎయిర్లైన్ పరిశ్రమలో కేబిన్ క్రూ, టెక్నికల్ గ్రౌండ్ సిబ్బంది తదితరాలు సంస్థాధారిత ఉద్యోగాలే. మెయిన్స్ట్రీమ్ ఇంజనీరింగ్లో.. సివిల్, కెమికల్, మెటీరియల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు కంపెనీ ఆధారితంగానే నడుస్తాయి. సిటీ లైఫ్స్టైల్లో ఫ్రీలాన్స్ ప్రభావం.. ఫ్రీలాన్సర్లు నగర ఆర్థిక వ్యవస్థలో సరికొత్త వర్గంగా నిలుస్తున్నారు. ఈవెంట్లు, బ్రాండింగ్ క్యాంపెయిన్లు, హోమ్ సరీ్వసులు, షార్ట్ ఫిల్మ్లు, స్టార్టప్ ఆపరేషన్స్.. ఇన్నింటిలో ఫ్రీలాన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. డిగ్రీ కంటే స్కిల్కు విలువ పెరుగుతున్న తరం ఇది. అందువల్ల యువత త్వరగా నూతన నైపుణ్యాలు నేర్చుకుని మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఫ్రీలాన్సింగ్ హైదరాబాద్ యువతకు కేవలం ప్రత్యామ్నాయ మార్గం కాదు.. స్వేచ్ఛ, స్కిల్స్, క్రియేటివిటీ, ఆధునిక సిటీ లైఫ్స్టైల్కి అద్దం పట్టే కొత్త కెరీర్ పంథా. విభిన్న రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ రాబోయే సంవత్సరాల్లో నగర ఉద్యోగ సంస్కృతిని మరింతగా మార్చే అవకాశం ఉంది. -
ఇది నవంబర్ కాదు మోవంబర్!
ఈ నెల నవంబర్ కదా మరి ఇదేంటి మోవంబర్ అని అంటున్నారేంటి అనుకోకండి. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఇవాళ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నేపథ్యంలో ఆ గమ్మత్తైన తమాషా స్టోరీ ఏంటో చూసేద్దామా..!నవంబర్ నెలలో మీసాలను పెంచే కార్యక్రమమే... మోవంబర్. ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్లో మీసాలకు సంక్షిప్త నామం... మో. దీనికి నవంబర్ నెలను జత చేసి ‘మోవంబర్’ ను సృష్టించారు. ‘మోవంబర్’ సరదా కార్యక్రమేమీ కాదు. దీనికి సామాజిక ప్రయోజనం ఉంది. పురుషుల ఆరోగ్య సమస్యలైన ప్రోస్టేట్ కేన్సర్పై అవగాహన కలిగించడం, పురుషుల ఆత్మహత్యలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం... మొదలైనవి ‘మోవంబర్’లో భాగం. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కేంద్రంగా మోవంబర్ ఫౌండేషన్ దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.(చదవండి: నేటి పురుషుడికి 10 సవాళ్లు) -
శిఖరాలపై సింహనాదం..!
పంచభూతాల్లో భాగమైన నింగి, నేల, నీరు, వాయువులను ఎదురీది సాహసోపేతమైన ప్రయాణం చేయడం మనుషులకు సాధ్యమేనా అంటే.., ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం, మనో సంకల్పం ఉంటే సాధ్యమేనని నిరూపిస్తున్నాడు ‘ఐన్ మ్యాన్’ చాలెంజ్ పూర్తి చేసిన సాహసికుడు కళాలి జై సింహ గౌడ్. ప్రపంచంలోని వివిధ ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించడం, మహాసముద్రాలను ఈదడం, అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఫుల్ మారథాన్లు పూర్తి చేయడం, బాడీ బిల్డింగ్లో సత్తా చాటడం.. అన్నింటికీ మించి ‘మేక్ ఫిట్ ఇండియా’లో భాగంగా ఫిట్నెస్పై అందరికీ అవగాహన కల్పించడం తన వృత్తి, ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఎవరెస్ట్ అధిరోహణం వంటి లక్ష్యాలతో తన భవిష్యత్ ప్రణాళికలు నిర్దేశించుకుంటూనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఫిట్నెస్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. యూరప్లోనే అత్యంత ఎత్తైన మంచు శిఖరం మౌంట్ ఎల్బ్రస్.. 18,600 అడుగుల ఎత్తులో ఎముకలు కొరికే 14 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రతల్లో ఈ మహా పర్వతాన్ని గతంలోనే అధిరోహించి జాతీయ జెండాతో పాటు జై తెలంగాణ పతాకాన్ని సగర్వంగా ఎగరేశారు నగరానికి చెందిన జై సింహ. అంతేకాకుండా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వత శిఖరాల్లో ప్రసిద్ధి చెందిన కిలిమంజారో పర్వతాన్ని సైతం అధిరోహించారు. అంతేకాకుండా లద్దాక్లోని కాంగ్ యాట్సే 1, 2 పర్వతాలను సైతం ఈ లిస్ట్లో చేరిపోయాయి. పర్వతారోహణతో పాటు.. లద్దాక్ వేదికగా 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, హైదరాబాద్ నగరంలో ఎన్ఎండీసీ ఫుల్ మారథాన్.. వీటితో పాటు పలు ప్రతిష్టాత్మక మారథాన్లు పూర్తిచేశారు. ఇదే నెల ప్రారంభంలో గోవా వేదికగా మిరామర్ బీచ్లో నిర్వహించిన 5వ ఎడిషన్ ఐరన్ మ్యాన్ 70.3లో ఏకకాలంలో 1.9 కిలో మీటర్ల స్విమ్మింగ్, 90 కిలో మీటర్ల సైక్లింగ్, 21.1 కిలో మీటర్ల రన్నింగ్ పూర్తిచేసి సత్తాచాటారు. 46 ఏళ్ల ఈ పర్వతారోహకుడు, బాడీబిల్డర్, ఫిట్నెస్ ట్రైనర్.. రంగాల్లో రాణిస్తూ.. మొత్తంగా ఐరన్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. ఈ స్ఫూర్తితో మరిన్ని పర్వతాలు అధిరోహించడానికి సన్నద్ధమవుతున్నారు. ఫిట్నెస్ అవగాహనే లక్ష్యం.. ఓవైపు వ్యక్తిగతంగా ప్రపంచ రికార్టులు తన ఖాతాలో వేసుకుంటన్నారు. మరోవైపు విభిన్న కార్యక్రమాలతో సామాజికంగా అందరికీ శారీరక ఆరోగ్యం అవసరమని అవగాహన కలి్పస్తున్నారు. మారథాన్లు, ఫిట్నెస్ అవేర్నెస్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నగరంలో ‘సిమ్ లయన్ ఫిట్నెస్’ సెంటర్లు ప్రారంభించి ఔత్సాహికులకు ఫిట్నెస్, జిమ్ సేవలు అందిస్తున్నారు. ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్ వంటి ప్రాంతాల్లో జిమ్ సేవలతో పాటు బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహిస్తూ సామాజిక దృఢత్వానికి తానొక పునాదిలా నిలుస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా, మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్గా సుదీర్ఘ కాలం పనిచేసిన జై సింహ.. ఫిట్నెస్ రంగాన్ని విస్తృతం చేయాలనే లక్ష్యంతో వాటన్నింటికీ స్వస్తిపలికానని తెలిపారు. వచ్చే ఏడాది అర్జెంటీనాలోని అకాన్గువా పర్వతంతో పాటు ప్రపంచంలో మరో ఎత్తైన పర్వతం ఎవరెస్టును సైతం అధిరోహించనున్నారు. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తున్న నగరవాసి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి నగరానికి వచి్చన నేను.. ఫిట్నెస్ను జీవిత లక్ష్యంగా మార్చుకుని ఖండాంతరాల్లోని ఎత్తైన శిఖరాలపై దేశ ఖ్యాతిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా. వచ్చే ఏడాది జనవరి 9న అర్జెంటీనాలోని అకాన్గువా పర్వతాన్ని, తదుపరి మార్చ్ నెలలో ఎవరెస్ట్ పర్వతారోహణకు సన్నద్ధమవుతున్నా. అంతేకాకుండా ఓషన్మ్యాన్గా రికార్డు సృష్టించేందుకు మహాసముద్రంలో 10 కిలోమీటర్ల స్విమ్మింగ్కు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఈ తరం యువతలో శారీరక క్రమశిక్షణ, వ్యాయామ అభిరుచి పెంచడం, అరోగ్య సంరక్షణలో ఫిట్నెస్ ప్రాధాన్యతను తెలియజేయడం,శారీరక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం సంకల్పంగా ముందుకు సాగుతున్నా. ఫిట్ ఇండియా భవిష్యత్ కార్యాచరణ, ఇప్పటి వరకూ చేసిన పర్వతారోహణలన్నీ సిమ్ లయన్ ఫిట్నెస్ ప్రయత్నంలో సొంత ఖర్చులతోనే పూర్తి చేశాను. తదుపరి తలపెట్టిన పర్వతారోహణకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తుల నుంచి స్పాన్సర్షిప్ లభిస్తే దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. గోవాలో జరిగిన ఐరన్ మ్యాన్ 70.3 నేపథ్యంలో పోటీదారులను మోదీ అభినందించిన విధానం నాలో మరింత స్ఫూర్తి నింపింది. – కళాలి జై సింహ గౌడ్, ఫట్నెస్ నిపుణుడు (చదవండి: Cancer Fighting Foods: ఏయే కూరగాయలు, పండ్లు కేన్సర్కి చెక్పెడతాయంటే..!) -
షేక్ హసీనా 'జమ్దానీ' చీరల వెనక ఇంత స్టోరీ ఉందా..!
బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపు అన్న అంశం చిలికి చిలికి గాలివానలా మారి..మాజీ ప్రధాని షేక్ హసినా ప్రభుత్వం కూలి, పదవిని కోల్పోవడం తోపాటు మరణశిక్ష పడేందుకు దారితీసింది. ఉక్కు మహిళగా కీర్తిగడించిన ఆమెను ఒక్కసారిగా నేరస్తురాలిలా నిలబెట్టి మరణశిక్ష విధించింది అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్. ఆ తీర్పుపై తనదైన శైలిలో షేక్ హసీనా స్పదించారు కూడా . దీన్ని ఆమె రాజకీయ ప్రేరేపిత తీర్పుగా అభివర్ణించారు కూడా. కాలం అనుకూలించకపోతే ఎంతటి శక్తిమంతమైన వాళ్లైనా నిర్వీర్యం అయిపోతారనేందుకు ఉదాహరణగా నిలిచిన షేక్ హాసినా దౌత్యపరమైన సంబంధాలను నెరిపేందుకు ఏం చేసేవారో తెలిస్తే విస్తుపోతారు. మరి ఆ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసినా..తన స్టైలిష్ లుక్తోనే ఆకట్టుకుంటారామె. ముఖ్యంగా ఆమె ధరించే జమ్దానీ చీరలు.. యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆ నేపథ్యంలోనే ఆమె ఈ చీరలను ధరించేవారా అని అంతా ఆశ్చర్యపోయేలా రాజకీయాలను ఫ్యాషన్ని మిళితం చేసిందామె. అంతేగాదు ఆమె కృషి ఫలితంగా చేతివృత్తుల వారికి ఉపాధి లభించడం తోపాటు పురాతన సాంస్కృతికి వారసత్వాన్ని పదిలపర్చుకునేలా.. ప్రపంచ దేశాలు దాని విశిష్టతను గుర్తించేందుకు దోహదపడింది.జమ్దానీ చీరలను బెంగాల్లో అత్యంత అద్భుతమైన వస్త్ర సంప్రదాయాలలో ఒకటిగాగా చెబుతుంటారు. చేతితోమాత్రమే నేసే గొప్ప కళాఖండంగా అలరారే ఈ చీరలు అంతర్జాతీయ దృష్టిని సైతం అమితంగా ఆకర్షించాయి. అందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణం. ఆమె చేసిన సాంస్కృతిక దౌత్య ప్రయత్నలేనని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. హసీనా మనం ధరించే దుస్తులే సంభాషిస్తాయి అని ప్రగాఢంగా విశ్వసించేవారామె. ఆ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సాంస్కృతిక కళా నైపుణ్యం, జాతీయ గర్వాన్ని ప్రతిబింబించేలా ఇలాంటి సాంప్రదాయ దుస్తులనే ఎంచుకునేవారామె. అంతర్జాతీయ వేదికపై జమ్దానీ మెరిసిన క్షణాలు..2014లో భారతదేశంలో సంబంధాలను బలోపేతం చేసే విషయమై ఈ చీరలోనే కనిపించారు. అంతేగాదు జూన్ 2014లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా హసీనాకు దక్షిణ భారత పట్టు చీరను బహూకరించగా, హసీనా జమ్దానీ చీరను బహూకరించింది.2015 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ను సందర్శించినప్పుడు హసీనా తెలుపు-బూడిద రంగుతో మిళితమైన జమ్దానీని ధరించింది. అజర్బైజాన్లో జరిగిన NAM సమ్మిట్లో హసీనా జమ్దానీ-ప్రేరేపిత బృందం బంగ్లాదేశ్ నేత సంప్రదాయాన్ని ప్రపంచ దౌత్య వేదికపై ఉంచింది.2021లో గ్లాస్గోలో జరిగిన COP26 వాతావరణ సదస్సులో నీలం బూడిదర రంగుతో కలగలసిన చీరలో మెరిసింది. అంతేగాదు అది నెట్టింట విపరీతంగా వైరల్ అయిన ఫోటోగా నిలిచింది.సెప్టెంబర్ 2022లో హసీనా నాలుగు రోజుల భారతదేశ పర్యటన ఒక శిఖరాగ్ర క్షణం అని చెప్పొచ్చు. ఆమె ఆ సమయంలో కూడా ఆ చీరలనే ఎంచుకోవడం అనేది వ్యాపార నాయకులల్లో చర్చనీయాంశంగా హైలెట్ అయ్యింది. G20 సమ్మిట్లో, హసీనా తిలక్ రంగు ధకై జమ్దానీని ధరించింది. ఇది భారతదేశంతో బంగ్లాదేశ్కి ఉన్న సంబంధాలను సూక్ష్మంగా నొక్కి చెబుతూనే ప్రపంచ వేదికపై ఈ కళను హైలైట్ చేసింది.న్యూ ఢిల్లీ, లండన్, బ్రస్సెల్స్, మ్యూనిచ్లోని నాయకులతో జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాలలో జమ్దానీ చీరలోనే కనిపించారు హసీనా. జమ్దానీ చరిత్రజమ్దానీ మూలాలు రెండు వేల సంవత్సరాల క్రితం పురాతన ఢాకా మగ్గాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ పేరు పర్షియన్ పదాలైన "జామ్" (పువ్వు) "డాని" (కుండీ) నుంచి వచ్చింది. చీరలలో ఉపయోగించే నేత నమూనాలు వాటి నుంచి తీసుకోవడంతోనే ఈ చీరకు ఆ పేరు వచ్చింది.జమ్దానిని ప్రత్యేకంగా నిలబెట్టేది శ్రమతో కూడిన "పారదర్శక నేత" సాంకేతికత. దీన్ని యాంత్రిక మద్దతు లేకుండా చేతితోనే తయారు చేస్తారు. అందువల్ల ఒక చీర తయారైందుకు నెలల తరబడి సమయం పడుతుంది. ఈ ప్రక్రియ చూసేందుకు తేలికగా కనిపించినా..చాలా క్లిష్టతరమైన చేతి పని. అయితే ఇదే జమ్దాని చీర పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విభిన్న వెర్షన్లు ఉన్నాయి. అయితే ప్రతి చీర వెనుక అపారమైన నైపుణ్యం, గంటల తరబడి శ్రమ తప్పక ఉంటుంది. అంతేగాదు ఇది ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన విలువైన చేసేత వస్త్రాల్లో ఒకటిగా పేరొందింది. అలాంటి చేనేత చీరను మాజీ ప్రధాని షేక్ హసీనా ధరించడంతో అంతర్జాతీయ ఆకర్షణ తోపాటు బంగ్లాదేశ్ స్వదేశీ నేత కార్మికులకు నేరుగా మద్దతు లభించినట్లయ్యింది కూడా. అలాగే ఈ చీరలకు భౌగోలిక(GI) గుర్తింపు సైతం లభించడం విశేషం. గతేడాది నిరసనల టైంలో కూడా..ఆగస్టు 2024లో, హసీనా రాజీనామా, బహిష్కరణకు దారితీసిన సందర్భంలో కూడా ఈ చీరలు వార్తల్లో హాట్టాపిక్గా మారాయి. ఎందుకంటే ఆ ఘటనలో సాముహిక నిరసనకారులు ఢాకాలోని ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించి ఆమె వార్డ్రోబ్లోని జమ్దానీ చీరలను ఎత్తకుపోవడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..) -
డిజిటల్ ప్రేమలు... డిస్కనెక్టెడ్ మనసులు...
సమయం రాత్రి 10:47 గంటలు. అనూష ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చుంది. స్క్రీన్ మీద ‘‘సీన్’’ అని కనిపిస్తోంది కానీ రిప్లై లేదు. ఆ నిశ్శబ్దం ఆమె మనసులో తుఫాను రేపుతోంది.తల్లి పిలిచినా వినిపించడం లేదు. కళ్ళలో తడి, మనసులో ఆందోళన, గుండెలో నొప్పి. మెదడులో ఒకే ఆలోచన – ‘ఆకాశ్కు నేను అంత ముఖ్యం కాదా?’ ఇది అనూష ఒక్కరి సమస్య మాత్రమే కాదు, వేలాది యువ హృదయాల్లో ప్రతి రాత్రి జరుగుతున్న డిజిటల్ డ్రామా. ఈ తరంలో ప్రేమ ఫోన్లో మొదలవుతోంది, ఫోన్లోనే ముగుస్తోంది. ప్రేమలో ఓపిక పోయింది, అర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు బంధాలు షార్ట్ వీడియోస్లా మారాయి. చూసి, వెంటనే మరచిపోతున్నారు. కాని, సున్నిత మనస్కులు ఆందోళనలో, డిప్రెషన్లో చిక్కుకుపోతున్నారు. వాంఛగా మారిన ప్రేమఒకప్పుడు ప్రేమంటే మనసుల కలయిక. ఇప్పుడది బాడీ ఇమేజ్ల కలయిక అయింది. స్మార్ట్ఫోన్లు పిల్లలకు 13 ఏళ్ల వయసులోనే అశ్లీల కంటెంట్ను అందిస్తున్నాయి. ప్రేమంటే శరీరాన్ని సంతృప్తిపరచడమే అని పోర్నోగ్రఫీ వారి మెదడుకు చెబుతోంది. కాని, ప్రేమంటే శాంతి అని మనసు హెచ్చరిస్తోంది. ఈ గందరగోళమే వారిలో అపరాధభావం, అభద్రత, ఒంటరితనాలకు కారణమవుతోంది. అందుకు వారిని తప్పుపట్టకుండా, సరైన మార్గంలో నడిపేందుకు ప్రాధాన్యమివ్వాలి. డోపమైన్ అడిక్షన్... ప్రేమంటే మెదడులో జరిగే రసాయన అద్భుతం. ఆక్సిటోసిన్, డోపమైన్, సెరటోనిన్ – ఇవే మనం ప్రేమగా అనుభవించే హార్మోన్లు. కానీ స్మార్ట్ఫోన్ వాటిని హైజాక్ చేస్తోంది. ప్రతి నోటిఫికేషన్కు డోపమైన్ విడుదలవుతోంది. ఇప్పుడు ప్రేమలోని ఆనందానికి కాదు, ఫోన్ వల్ల విడుదలయ్యే డోపమైన్ ఇచ్చే ఆనందానికి బానిస అవుతున్నారు. ప్రేమ కంటే రెస్పాన్స్ టైమ్ ముఖ్యమైపోయింది. ఇప్పుడీ డిజిటల్ యుగం కొత్త మానసిక వ్యాధి – డోపమైన్ అడిక్షన్. ఎందుకింత గాఢత?టీనేజ్ వయస్సులో మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (తర్కం, నియంత్రణ కేంద్రం) ఇంకా ఎదగలేదు. కాని, అమిగ్డాలా (భావోద్వేగ కేంద్రం) చాలా చురుకుగా ఉంటుంది. అందుకే టీనేజ్ ప్రేమలు విపరీతంగా అనిపిస్తాయి, కనిపిస్తాయి. వాళ్లు ప్రేమను కాకుండా, ప్రేమ ఇచ్చే ఫీలింగ్ ను ప్రేమిస్తారు. స్మార్ట్ఫోన్ ఆ ఫీలింగ్ను 24 గంటలూ ఇస్తుంది. అందుకే ఫోన్ లేకపోతే విరక్తి, సైలెన్స్ అంటే తట్టుకోలేని ఆందోళన. ఇది నిజానికి ఫీలింగ్ అడిక్షన్. ప్రేమంటే చాట్ విండో... ఇప్పుడు ప్రేమంటే కవిత్వం కాదు, చాట్ విండో. ‘టైపింగ్’... అని కనిపిస్తే గుండెల్లో ఉత్సాహం. ‘లాస్ట్ సీన్’ అని కనబడితే బాధ. లైక్స్, హార్ట్ ఎమోజీలు, ఫోటోలు – ఇవే కొత్త అఫెక్షన్ సింబల్స్. ఈ ప్రేమలో ముఖాలు కనెక్ట్ అవుతున్నాయి కాని, మనసులు డిస్కనెక్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు ప్రేమ అంటే రెండు హృదయాల కలయిక. ఇప్పుడు రెండు స్క్రీన్ల కలయిక. ఒకప్పుడు బ్రేకప్ అంటే కన్నీళ్లు, ఉత్తరాలు, జ్ఞాపకాలు. ఇప్పుడు బ్రేకప్ అంటే – ‘బ్లాక్డ్’. ఒక క్లిక్తో మనిషిని జీవితంలో నుంచి తొలగించవచ్చు. కాని, మనసులోంచి? అసాధ్యం.పెరుగుతున్న ఒంటరితనం...ఇప్పుడు పిల్లలు ఎప్పుడూ ఆన్లైన్లో ఉంటారు కాని, మనసు లోపల మాత్రం ఖాళీగా ఉంటారు. వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నా, వారిని అర్థం చేసుకునే ఒక్క మనసు కూడా ఉండదు. జర్నల్ ఆఫ్ అడాల్సెంట్ హెల్త్ (2024) ప్రకారం రోజుకు ఐదు గంటలకు పైగా సోషల్ మీడియా వాడే టీనేజ్లో డిప్రెషన్ రేటు27 శాతం ఎక్కువగా ఉంది. వారు ఫోన్లో కనెక్ట్ అవుతున్నారు కాని, మనసుతో కనెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు.ఎలా రక్షించాలి ఈ తరం మనసును1. ప్రేమలో కూడా ఫోన్కు ఒక సమయం ఉండాలి. ప్రతిరోజూ ప్రతి నిమిషం కనెక్ట్ కావడం కాదు,కొంచెం దూరంగా ఉండటం, వేచి ఉండటం నేర్చుకోవాలి. దూరం బంధాలను బలపరుస్తుంది. 2. మీ ప్రేమకు ‘నో’ చెప్పారంటే మీరు ఓడిపోయినట్లు కాదు. ప్రేమలో ‘లేదు’ కూడా ఒక జవాబు అని అర్థం చేసుకోవాలి. భావోద్వేగ అవగాహన నేర్పాలి.3. చాట్లో ఉన్న ఎమోజీల కంటే కళ్లలో కనిపించే భావం గొప్పది. ముఖాముఖి సంభాషణ మీ ప్రేమను బలపరుస్తుంది.4. పిల్లలతో ప్రేమ, శరీరం, భావోద్వేగాల గురించి మాట్లాడాలి. సిగ్గు పడకుండా సెక్స్ ఎడ్యుకేషన్ అందించాలి. ఎందుకంటే తెలియకపోవడం కంటే తప్పుగా తెలుసుకోవడం ప్రమాదం.5. ‘‘ఏం చూస్తున్నావు?’’ అని అడగడం కాదు,‘‘ఏం ఫీలవుతున్నావు?’’ అని అడగాలి. పిల్లల మనసులను ఫోన్తో కాకుండా మన ప్రేమతో నింపాలి. సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి) -
నటి అనుపమ అందం వెనకున్న రహస్యం ఇదే..!
చిన్న చిన్న వాటితోనే!అందం అంటే కేవలం మేకప్ కాదు, మన వ్యక్తిత్వం అని చెప్పే అనుపమ సినిమాల్లోనే కాదు, ఆఫ్ స్క్రీన్లోనూ సింపుల్, క్లాసీ లుక్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ అందం వెనక ఉన్న చిన్న చిన్న రహస్యాలు మీకోసం.. జ్యూవెలరీలో నాకు సిల్వర్ ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చిన్న నెక్పీస్లు అంటే చాలా ఇష్టం! డ్రెస్ ఏదైనా, ఇలాంటి చిన్న చిన్న వాటితోనే లుక్ పూర్తవుతుంది. ఇక చర్మం కాంతిమంతంగా ఉండాలంటే నిద్ర, ఆహారం రెండూ సమతౌల్యంగా ఉండాలి. ఈ నియమాలనే నేను ఫాలో అవుతానని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. గోల్డ్ గ్రేస్!చిన్న చైన్ అయినా, లుక్కి రాయల్టీ టచ్! అదే ఈ సింగిల్ లైన్ గోల్డ్ నెక్పీస్ మ్యాజిక్. ఈ సున్నితమైన గోల్డ్ చై నెక్లైన్పై మెరుస్తూ, మీ మొత్తం లుక్కి టైమ్లెస్ ఎలిగెన్స్ జోడిస్తుంది. ట్రెడిషనల్ చార్మ్తో పాటు, మోడర్న్ టచ్ ఉండటమే దీని ప్రత్యేకత. ప్యూర్ గోల్డ్ ఫినిష్, సాఫ్ట్ షైన్ , మినిమల్ డిజైన్తో ఏ డ్రెస్సుకైనా ఈ నెక్పీస్ సహజంగా బ్లెండ్ అవుతుంది. దీనిని ఓపెన్ హెయిర్, లైట్ మేకప్ కాంబినేషన్తో పెయిర్ అప్ చేస్తే ఈ చైన్ లుక్కి రిచ్నెస్, సాఫ్ట్ గ్లామ్ టచ్ గ్యారంటీ! చిన్న డీటైల్, కానీ పెద్ద ఇంపాక్ట్. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఓవర్ కాకుండా, పర్ఫెక్ట్గా మెరిసిపోతుంది! దీపిక కొండి (చదవండి: చిలుకలు భాషలు కూడా నేర్చుకుంటాయా..?) -
గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..?
నేను రెండు నెలల గర్భవతిని. కొంతమంది ‘ఫ్లూ వ్యాక్సిన్’ తప్పకుండా వేయించుకోవాలంటున్నారు. కాని, నేను గత సంవత్సరం వేయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ అవసరమా? ఈ వ్యాక్సిన్ గర్భధారణలో మంచిదేనా?– రమ్య, చిత్తూరు. గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అందుకే ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫ్లూ వల్ల దగ్గు, జలుబు మాత్రమే కాకుండా కొన్నిసార్లు న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఫ్లూ వైరస్ ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. కాబట్టి మీరు గత సంవత్సరం తీసుకున్నా, ఈ ఏడాది కూడా కొత్త స్ట్రెయిన్కి అనుగుణంగా వ్యాక్సిన్ మళ్లీ వేయించుకోవాలి. సాధారణంగా అక్టోబర్ నుంచి మే మధ్యకాలం వరకు ఫ్లూ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే గర్భిణులు నవంబర్ సమయానికి ఫ్లూ షాట్ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా సురక్షితమైన వ్యాక్సిన్. మీకు మాత్రమే కాకుండా మీ బిడ్డకూ ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరతాయి. ఆ రక్షణ వల్ల పుట్టిన తరువాత కూడా ఆరు నెలల పాటు బిడ్డకు ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి సహజమైన రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవదు. ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ రాదు, వైరస్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు వారాల లోపే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. తేలికపాటి జ్వరం, చేతి నొప్పి, బలహీనత వంటి చిన్న దుష్ప్రభావాలు రావచ్చు కాని, అవి తాత్కాలికం. మొత్తం మీద, ప్రతి గర్భిణీ మహిళ ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ఇది తల్లీ బిడ్డలిద్దరికీ రక్షణ కలిగించే సురక్షితమైన, అవసరమైన టీకా. మీరు ఇప్పటికే వేసుకున్నా, ఈ సంవత్సరం మళ్లీ వేయించుకోవడం ఉత్తమం. డెలివరీ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది సాధారణ జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. కొందరికి తేలికపాటి తలనొప్పి, కండరాల నొప్పి ఒకటి రెండు రోజులు ఉండొచ్చు, కాని, అది సాధారణం. గర్భిణులు లేదా తాజాగా డెలివరీ అయిన తల్లులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది తల్లికి, పాలిచ్చే శిశువుకి ఎటువంటి హాని చేయదు.నాకు ఇది మూడవ ప్రెగ్నెన్సీ, మూడవనెల. ముందు రెండు నార్మల్ డెలివరీలు అయ్యాయి. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందనుకుంటున్నాను. కాని, డెలివరీ అయిన వెంటనే పిల్లలు కలగకుండా చేసే పద్ధతులు ఉన్నాయని విన్నాను. అవి నిజంగా పనిచేస్తాయా? ఎంతవరకు సేఫ్గా ఉంటాయి?– బింధు, హైదరాబాద్. ఇప్పుడున్న ‘ఎల్ఏఆర్సీ’ అంటే (లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్షన్) అనే పద్ధతులు చాలా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ కాలంలో జీవితం బిజీగా ఉండటంతో, చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత త్వరగా గర్భం రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే డెలివరీ సమయంలోనే ఈ పద్ధతుల గురించి మాట్లాడి, వాటిని అమలు చేయడం ఉత్తమం. మీరు ఇప్పటికే మూడో నెల దాటారు కాబట్టి, ఈసారి డెలివరీ రూమ్లోనే ఎల్ఏఆర్సీ ఆప్షన్ గురించి చర్చించుకోవచ్చు. నార్మల్ డెలివరీలో, ప్లాసెంటా బయటికి వచ్చిన పది నిమిషాల లోపలే ‘ఐయూసీడీ’ అంటే ‘ఇంట్రా యూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్’ అనే పరికరాన్ని గర్భసంచిలో ఉంచవచ్చు. అది ఆ సమయానికే సులభంగా వేయవచ్చు. ఏదైనా కారణం వలన ఆ సమయంలో వేయలేకపోతే, వారం రోజుల్లో కూడా సులభంగా చేయవచ్చు. ఇది అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు డెలివరీ రూమ్లోనే సురక్షితంగా చేస్తారు. ఇది పేషెంట్కి చాలా ఈజీగా, సౌకర్యంగా ఉంటుంది. డిశ్చార్జ్ అయ్యేలోపే చెక్ చేసి, సరిగా ఉన్నదని నిర్ధారిస్తారు. పైగా ఇది చాలా ఖర్చు తక్కువగా ఉంటుంది. తర్వాత వేరే సమయంలో మళ్లీ వచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. డెలివరీ రూమ్లోనే ఇది పూర్తవడం వల్ల, మహిళకు భవిష్యత్తులో అవాంఛిత గర్భాలు రాకుండా నిరోధించవచ్చు. ఈ పద్ధతి సురక్షితమైనదే కాకుండా, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే, ప్రతి మెథడ్కి చిన్నచిన్న జాగ్రత్తలు ఉండేలా, కొన్ని చిన్న ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఐయూసీడీ వేసిన తర్వాత కొందరికి కొంచెం ఎక్కువ బ్లీడింగ్ రావచ్చు, కొద్దిగా నొప్పి ఉండొచ్చు. అరుదుగా డివైస్ ఊడిపోవచ్చు లేదా దాని దారాలు లోపలికి ఎక్కువగా వెళ్లిపోవచ్చు. అప్పుడు చెక్ చేయడం కాస్త కష్టమవుతుంది. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే పరిస్థితులు మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐయూసీడీ వేసుకున్న తర్వాత ఆరు వారాల లోపు మళ్లీ డాక్టర్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కొందరు ‘వేసుకున్నాం కదా’ అని నిర్లక్ష్యం చేస్తే, కొద్ది శాతం పేషెంట్లకు అవాంఛిత గర్భం రావచ్చును. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు రెగ్యులర్ ఫాలోఅప్ చాలా అవసరం. ఇంకా, సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కూడా ఐయూసీడీ లేదా బర్త్ కంట్రోల్ ఇంప్లాంట్ వేయించుకోవచ్చు. ఈ ఇంప్లాంట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, దాని ఫెయిల్యూర్ ఛాన్స్ 1% కన్నా తక్కువ. ఈ పద్ధతులు పాలిచ్చే తల్లులకు కూడా సేఫ్గానే ఉంటాయి. మొత్తం మీద, ఐయూసీడీ లేదా ఇంప్లాంట్ రెండూ గర్భనిరోధంలో విశ్వసనీయమైన పద్ధతులు. కొద్ది తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే, ఇవి మహిళల ఆరోగ్యానికి సురక్షితం. కాబట్టి డెలివరీ సమయంలోనే మీ గైనకాలజిస్టుతో చర్చించి, మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమం. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..) -
HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
సాధారణ రొమ్ము కేన్సర్ గురించి అందరికీ తెలిసింది. కానీ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ గురించి చాలామంది మహిళలకి తెలియదు. ఇది సాధారణ రొమ్ము కేన్సర్ కంటే ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ చాలా దూకుడుగా ఉంటుంది, పైగా శరీరంలోని ఇతర భాగాలకు చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇటీవల కాలంలో ఈ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన తోపాటు ఎలాంటి చర్యలతో ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు వంటి వాటి గురించి హైదరాబాద్కి చెందిన ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వింధ్య వాసిని మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.1 ప్రశ్న: హైదరాబాద్లో HER2-పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా? ఎందుకు?డాక్టర్: దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు మనం HER2-పాజిటివ్ నిర్ధారణలను ఎక్కువగా ఉన్నాయనే చెప్పారు. బహుశా దీనిపై అవగాహన పెరగడం, ఎక్కువమంది మహిళలు ముదుగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వంటివి అయ్యిండొచ్చని అన్నారు. అలాగే జీవనశైలి మార్పులు కూడా ఈ కేసులు అధికమవ్వడానికి కారణం కావొచ్చని ఆమె అన్నారు. 2 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ ఇతర వాటికంటే ఎలా భిన్నంగా ఉంటుంది?డాక్టర్: HER2-పాజిటివ్ రొమ్ము కేన్స ర్అనేది కణాల ఉపరితలంపై కణ పెరుగుదల, విభజనను ప్రోత్సహించే గ్రాహకమైన HER2 (హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 కి సంక్షిప్తంగా) ప్రోటీన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుందని అన్నారు. అందువల్ల ఈ కేన్సర్ ఇతర రకాల కేన్సర్ల కంటే మరింత దూకుడు స్వభావం కలది. అయితే దీన్ని HER2ను లక్ష్యంగా చేసుకుని మందులతో రోగులకు చికిత్స అందించవచ్చు. గత రెండు దశాబ్దాలుగా ఈ చికిత్సలు HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ దృక్పథాన్నే మార్చేశాయి. ఒకప్పడు ఈ కేన్సర్ అధిక ప్రమాదకరమైనదిగా పరిగణించేవారని, ఇప్పుడూ మందులతో నిర్వహించేలా చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.3 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్పై హైదరాబాద్లో ఏవైనా శాస్త్రీయ ఆవిష్కరణలు జరుగుతున్నాయా?డాక్టర్: అవును. హైదరాబాద్లోని అనేక ఆసుపత్రులు ఇప్పుడు కొత్త చికిత్సా పద్ధతులను అందిస్తున్నాయి.ఉదాహరణకు సబ్కటానియస్ ఫార్ములేషన్స్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీలు. ఇవి మందులతో వేగవంతంగా తగ్గించడమే కాకుండా రోగికి సౌకర్యవంతంగా కూడా ఉంటున్నాయి.4 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్కు ఏయే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?డాక్టర్: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్కు అనేక చికిత్సా ఎంపికలు ఉన్నాయి - కేన్సర్ర్ ఎంత అభివృద్ధి చెందింది, అది వ్యాపించిందా, ఎంత వేగంగా పెరుగుతోంది వంటి వాటికి సంబంధించిన మొత్తం రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అదృష్టం ఏంటంటే..HER2 ప్రమేయం ఉందని మనకు తెలుసు కాబట్టి, సాధారణమైన వాటికి అదనంగా ప్రభావవంతమైన "టార్గెటెడ్" చికిత్సలు ఉన్నాయి. అవేంటంటే..a. టార్గెటెడ్ థెరపీలు: ఈ మందులు ప్రత్యేకంగా కేన్సర్ కణాల పెరుగుదలను ఆపడానికి HER2 ప్రోటీన్ను నిరోధిస్తాయి.b. కీమోథెరపీ: ప్రభావాన్ని పెంచడానికి తరచుగా టార్గెటెడ్ థెరపీలతో కలిపి ఉపయోగిస్తారు.c. శస్త్రచికిత్స: కేసును బట్టి కణితి లేదా రొమ్ము కణజాలాన్ని తొలగించడం.d. రేడియేషన్ థెరపీ: పునరావృత ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక సందర్భాల్లో శస్త్రచికిత్స తర్వాత ఉపయోగిస్తారు.e. హార్మోన్ల చికిత్స: కణితి కూడా హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్ అయితే సిఫార్సు చేయవచ్చు.ఇప్పుడు లక్ష్యంగా చేసుకున్న చికిత్సలు చర్మం కింద ఇంజెక్ట్ చేసేలా సబ్కటానియస్ ఫార్ములేషన్లుగా అందుబాటులో ఉన్నాయి. అలాగే దీర్ఘ IV ఇన్ఫ్యూషన్లతో (సుమారు 4-6 గంటలు) పోలిస్తే వేగంగా (సుమారు 8 నిమిషాలు) చికిత్సను పూర్తి చేయొచ్చు. రోగి సౌకర్యంగా ఉండేలా చికిత్సా కేంద్రాల్లో గడిపే సమయం కూడా తగ్గేలా పలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 5 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ జర్నీలో రోగులు, సంరక్షకులు తప్పక తెలుసుకోవాల్సినవి ఏవి?డాక్టర్: a. HER2 స్థితిని నిర్ణయించడానికి తగిన చికిత్సను ప్లాన్ చేయడానికి ముందుగా సరైన సమయంలో రోగ నిర్ధారణ చేయడం అనేది ముఖ్యంb. చికిత్సకు కట్టుబడి ఉండటం కీలకం. మోతాదులను కోల్పోవడం లేదా చికిత్సను మధ్యలో ఆపడం వల్ల ప్రభావం తగ్గుతుంది.c. రోగులు,వారి సంరక్షకులకు భావోద్వేగ మద్దతు చాలా ముఖ్యమైనది. ఇది ఒకరకంగా మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడం, స్థితిస్థాపకతను పెంపొందించడంలో సహాయపడుతుంది.d. సంరక్షణ బృందంతో సకాలంలో కమ్యూనికేషన్ ద్వారా దుష్ప్రభావాలను నిర్వహించడం జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది.e. భారతదేశంలో ప్రస్తుతం రోగి సౌకర్యార్థం మెరుగైనా సబ్కటానియస్ థెరపీలు అనే కొత్త చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఇవి రోగి చికిత్సా సమయాన్ని తగ్గించడమే కాకుండా ఆస్పత్రి సందర్శన కూడా తగ్గుతుంది. చివరగా రోగి సంరక్షకులు ఇలాంటి చికిత్సా విధానాలు, మంచి ప్రత్యామ్నాయాల గురించి వైద్యులతో సంభాషించి, సవివరంగా తెలుసుకోవాలి, సత్వరమే కోలుకునే చికిత్సా విధానాల గురించి క్షణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారామె.ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వింధ్య వాసిని -
మ్యాడ్ హనీ: ఒక్క చుక్క సిప్ చేశారో..ప్రాణాలకే ముప్పు!
పూలమకరందాన్ని సేవించి తేనెటీగలు ఉత్పత్తి చేసే తియ్యటి తేనె ఎన్ని ఔషధ ప్రయోజనాలు కలిగి ఉందో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పబోయే తేనె మాత్రం అత్యంత విషపూరితమైనది. అయితే దీన్ని కూడా పలు చికిత్సల్లో ఉపయోగిస్తారు. అలాగని నేరుగా సిప్ చేశారో అంతే పరిస్థితి. ఆ మధువే..మ్యాడ్ తేనే. ఇది మాదకద్రవ్య ప్రభావాలు కలిగిన తేనె అట. ఇది కేవలం నేపాల్, టర్కీలలో ఉత్పత్తి అవుతుందట. హిమాలయ ప్రాంతాలలో జెయింట్ అనే తేనెటీగలు రోడోడెండ్రాన్ అనే పువ్వుల నుంచి ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయట. ఇందులో మాదక ద్రవ్య ప్రభావం తోపాటు, విషపూరితమైన గ్రేయానోటాక్సిన్లను కూడా కలిగి ఉంటుందట. ప్రాచీన గ్రీసులు ఈ మ్యాడ్ హానీని బయో వెపన్గా ఉపయోగించేవారట. పురాతన గ్రీకు గ్రంథాల్లో గ్రీకు సైనిక నాయకుడు జెనోఫోన్ దీని గురించి రాశాడని చెబుతున్నాయి. అంతేగాదు క్రీస్తూ పూర్వం జనరల్ పాంపే ఆధ్వర్యంలో రోమన్ సైనికులపై జరిగిన మూడవ మిథ్రిడాటిక్ యుద్ధంలో రాజు మిథ్రిడేట్స్ మ్యాడ్ హనీని బయో వెపన్గా ఉపయోగించినట్లు గ్రంథాలు చెబుతున్నాయి. ఈ తేనె కామోద్దీపన కోరికలను పెంచుతుందట కూడా.ఎలా సేకరిస్తారంటే..మధ్య నేపాల్, ఉత్తర భారతదేశంతో సహా హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో వసంతకాలంలో లోయలలో రోడోడెండ్రాన్లు వికసించినప్పుడు తేనెటీగగలు ఈ బంగారు రంగు తేనెను ఉత్పత్తి చేస్తాయట. చెట్టుకొమ్మలపై సుమారు 1200 నుంచి, 4 వేల మీటర్ల ఎత్తులో కనిపిస్తాయట. నేపాల్లోని గురుంగ్ అనే తెగ వారు ఈ మ్యాడ్ తేనెని సేకరిస్తారట. ఒకప్పడూ ఎక్కడపడితే అక్కడ దర్శనమిచ్చే ఈ తేనెతుట్టలు..ఇప్పుడు ఆనకట్ట నిర్మాణాల కారణంగా కనుమరుగవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు.ప్రయోజనం, ప్రమాదం రెండూ ఉన్నాయి..దీన్ని కామోద్దీపనంగా, జీర్ణశయాంతర రుగ్మతలకు(పెప్టిక్ అల్సర్ వ్యాధి, డిస్స్పెప్సియా, గ్యాస్ట్రిటిస్, రక్తపోటు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేగాదు గొంతునొప్పి, ఫ్లూ, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు. అలాగని ఆ తేనెని సిప్ చేశారో ఇక అంతే..టెక్సాస్ ఇన్స్టిట్యూట్ జర్నల్లో ప్రచురితమైన ఒక కేసులో.. ఓ భార్యభర్తలు తమ దాంపత్యం మరింత బాగుండాలని ఈ తేనెని ఒక వారం పాటు తీసుకున్నారు. ఫలితంగా రెండు గంటల్లోనే తీవ్రమైన ఇన్ఫీరియర్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (రక్త ప్రవాహంలో ఆకస్మిక అడ్డంకి వల్ల కలిగే గుండెపోటు)తో ఎమర్జెన్సీ వార్డులో చేరారు. ఇది రక్తపోటుని పడిపోయేలా చేసి, శాసకోశ సమస్యలు, తలతిరగడం, వంటి ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కోసారి కండరాల పక్షవాతం, అట్రియోవెంట్రిక్యులర్ బ్లాక్లు, స్పృహ కోల్పోవడం వంటివి సంభవిస్తాయి కూడా. అందువల్లే ఈ తేనెని టేస్ట్ చేయాలంటే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో, వారి సలహాలు సూచనల మేరకు ట్రై చేయాలే తప్ప..నేరుగా సిప్ చేసే సాహసం చేశారో.. ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే. View this post on Instagram A post shared by Medicinal Mad Honey® | Mad Honey Nepal (@medicinal.madhoney) (చదవండి: మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..) -
అత్యంత అరుదైన వ్యాధి: కంటి రెప్పల్లో పేలు..!
తల్లో పేలు గురించి విన్నాం కానీ, కనురెప్పల్లో పేలు ఉండటం గురించి వినలేదు కదా..!. కనురెప్పల్లో చుండ్రు ఉంటుందని తెలుసగానీ ఇదేంటీ..పేలు ఉండటం అని విస్తుపోకండి. ఎందుకంటే..నిజంగానే ఓ మహిళ కంట్లో ఏకంగా 250 పేలను గుర్తించారు వైద్యులు. తొలుత వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు. ఆ తర్వాత ఈ వ్యాధి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మరి చికిత్స అందించి ఆమెకు చక్కటి ఉపశమనం అందించారు. అసలేంటి ఈ సమస్య? ఎందుకు వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!గుజరాత్లోని ఆమ్రేలి జిల్లా సావర్ కుండ్ల ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 66 ఏల్ల గీతాబెన్ కంటిలో తీవ్రమైన దురద, నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. సూరత్కు చెందిన గీతాబెన్కు ఈ సమస్య గత రెండున్నర నెలలుగా వేధిస్తోంది. కళ్లు ఎర్రబారిపోవడం, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమైంది. దీంతో కంటి డాక్టర్ మృగాంక్ పటేల్ ఆమె కళ్లను పరీక్షించగా.. రెప్పల్లో ఏకంగా పేలు ఉన్నట్లు గుర్తించారు. మొదట ఆయన కూడా ఇదేంటని విస్తుపోయారు. ఆ తర్వాత వివిధ అధ్యయన పత్రాలను శోధించి.. ఇలాంటి వింత కేసు గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. దీన్ని వైద్య పరిభాషలో ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటారని చెప్పారు. తాము మాగ్నిఫికేషన్ కింద కనురెప్పల్ని పరిశీలించినప్పుడు, పేలు కదులుతున్నట్లు గుర్తించామని అన్నారు. వాటి తోపాటు గుండ్రని పేను గుడ్లను కూడా కనిపించాయని వెల్లడించారు. వీటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుందని ముందుగానే బాధిత మహిళకు తెలియజేసి మరి ఆపరేషన్కి సిద్ధం చేశారామెను. అయితే ఆమెకున్నవైద్య పరిస్థితుల రీత్యా ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వకుండా ఒక్కొక్కపేనుని ఓపికగా తొలగించారు వైద్యులు. ఈ పరాన్న జీవి కంటి రెప్ప మూయగానే అమాంతం రక్తం తాగేస్తుందట. ఎందుకంటే అక్కడ కణజాలాం చాలా పల్చగా ఉండి, సులభంగా రక్తాన్ని పీల్చేయగలదని అన్నారు. పైగా అక్కడ కనురెప్పలకు అతుక్కుపోయి ఉంటాయట. దీని కారణంగా పేషెంట్కి దురద, మంట వస్తుందట. అదీగాక ఇవి తొలగించాలనుకున్నా..అంత తేలిగ్గా రావట కూడా. ప్రత్యేక పరికరంతో తొలగింపు ప్రక్రియ..ఈ పేలు వెలుతురు పడినప్పుడూ కదులుతుంటాయట. కాబట్టి వాటిని తొలగించడానికి మెక్ఫర్సన్ అనే ప్రత్యేక పరికరం ఉపయోగించి ప్రతీ పేనుని పట్టుకుని బయటకు తీసినట్లు వివరించారు. అలాగే ఆ మహిళకు నొప్పి తెలియకుండా అనస్థీషియా ఇచ్చాం అని వైద్యుడు మృగాంక్ వెల్లడించారు. తన 21 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కేసు మొట్టమొదటిదని, అస్సలు ఎప్పుడూ ఇలాంటి కేసు ఎదురవ్వలేదని అన్నారు. బాధిత మహిళ కంటి రెప్పల్లోంచి ఏకంగా 250 పేలు, 85 గుడ్లు(లార్వా)లు తొలగించినట్లు తెలిపారు.ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటే..యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అనేది అరుదైన వైద్య పరిస్థితి. దీనివల్ల పేలు, వాటి గుడ్లు కనురెప్పలలో చేరుతాయి. దాంతో తీవ్రమైన దురద, కళ్లు ఎర్రబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. అయితే ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్కానందున నిర్థారించడం కష్టమని అన్నారు. వీటి లార్వాలు అచ్చం దోమ లార్వాలనే ఉంటాయని చెప్పారు.ఈ పరిస్థితి ఎందుకొస్తుందంటే..ఇన్ఫెక్షన్ కారణంగా లేదా పరిశుభ్రత లోపించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు వైద్యులు. పేలు రావడానికి కొన్ని రకాల వాతావరణాలు, ఇంట్లోని దిండ్లు కారణం కావొచ్చని అన్నారు. ఈ వ్యాధి మనుషులతోపాటు పశువుల్లో కూడా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా అడవుల్లో తిరిగే వాళ్లకు, పశువులకు దగ్గరగా ఉండేవాళ్లకు ఇవి వెంటనే అటాక్ అవుతాయట. వెంటనే కనురెప్పలకు చేరి అక్కడ తిష్టవేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి కాంతి పడినప్పుడూ పారిపోతాయి కాబట్టి లైట్ లేకుండా తొలగించాలని చెబుతున్నారు వైద్యులు. పైగా ఈ పరాన్నజీవి లార్వాలను ఏ ఔషధం చంపలేదని అన్నారు. వాటిని ఒక్కొక్కటిగా పట్టుకుని కంటి నుంచి తొలగించడం ఒక్కటే మార్గం అని అన్నారు.'తలలో ఉండే పేలు కంటి పేలు భిన్నంగా ఉంటాయి. కంటి పేలు, కంట్లోని తెల్లటి భాగంలో తిరుగుతూ వెలుతురు నుంచి పారిపోతాయి. అవి కంటి రెప్ప లోపల, చీకటిగా ఉండే భాగంలో జీవిస్తాయి. అక్కడే ఉంటాయి' అని చెప్పుకొచ్చారు డాక్టర్ మృగాంక్. లక్షణాలు కంటి నొప్పి, కళ్ళలో ఎప్పుడూ దురద, నిద్రలేమి కనురెప్పల వాపు, నీరు కారడం వంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు. చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, యువతలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.(చదవండి: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?) -
కాలు మీద కాలు దర్జా కాదు ... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?
‘‘ఇది నా కాలు ఈ కాలు కూడా నాదే. నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేంటి?’’అని అడుగుతాడు పుష్ప సినిమాలో హీరో. ఈ డైలాగ్ ఎంత పాప్యులరో.. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనే అంశం కూడా ఇప్పుడు అంతకు మించి పాప్యులర్గా మారింది. ఆ మధ్య టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ దగ్గర నుంచి తాజాగా ప్రధానితో మహిళా క్రికెటర్ల సమావేశం దాకా...అనేక సందర్భాల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. మన సంప్రదాయాల ప్రకారం... ఎవరి ముందైనా మనం కాళ్ల మీద కాలు వేసుకుని కూర్చోవడం అంటే అవతలి వ్యక్తికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని మనం భావిస్తున్నట్టు. తరాల నుంచీ కొనసాగుతున్న ఈ నమ్మకమే ఆధునిక సమాజంలో తరచుగా వివాదస్పదం అవుతోంది. ఆ వివాదాలు అలా ఉంచితే... అసలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అనారోగ్యకరం కూడా అంటున్నాయి అధ్యయనాలు కొన్ని అభిప్రాయాలు. చాలా మందికి ఒక కాలు మీద మరొక కాలు వేసుకుని కూర్చోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. పాదం అప్పుడప్పుడు తిమ్మిరిగా అనిపించడం ఉన్నా అది సౌకర్యవంతంగా ఉంటుంది అని అదే ఫాలో అవుతారు. కానీ అది మీకు మంచి చేస్తుందా? హాని చేస్తుందా? చేస్తే ఎవరికి? ఎలా? ఎందుకు?గర్భిణీలకు...గర్భధారణ సమయంలో, శరీరం వివిధ రకాల మార్పులకు లోనవుతుంది. గర్భాశయం విస్తరించినప్పుడు, గురుత్వాకర్షణ కేంద్రం ముందుకు మారుతుంది. తద్వారా సాధారణానికి భిన్నంగా నడుస్తున్నట్లు, నిలబడి, కూర్చోవడం జరుగుతుంది. గర్భధారణ సమయంలో కండరాల ఒత్తిడి, వెన్నునొప్పి తిమ్మిర్లు అన్నీ సాధారణం. కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల బిడ్డకు ఎటువంటి హాని జరగకున్నా గర్భిణికి చీలమండ వాపు లేదా కాళ్ళ తిమ్మిరి కలిగేందుకు ఇది దోహదం చేస్తుంది.రక్తపోటు...ఎవరికైనా రక్తపోటును పరీక్షించే సమయంలో సాధారణంగా రెండు పాదాలను నేలపై ఉంచమని అడుగుతారు. ఎందుకంటే కాళ్లు ఒకదానిపై మరొకటి వేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది కాబట్టి. జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్ ట్రస్టెడ్ సోర్స్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో కాళ్లను ఒకదానిపై ఒకటి వేసి కూర్చోవడం వల్ల రక్తపోటులో కలిగే మార్పులను స్పష్టంగా గమనించారు. అదే విధంగా జర్నల్ ఆఫ్ హైపర్టెన్షన్ లో ప్రచురించిన మరొక అధ్యయనంలో, తమ చీలమండను మోకాలిపై ఉంచడం ద్వారా రక్తపోటు పెరిగినట్లు కనుగొన్నారు.వెరికోస్వెయిన్స్...కాళ్ళ నుంచి బయటకు వచ్చే ఉబ్బిన, మెలితిరిగిన, త్రాడు లాంటి సిరలు యవెరికోస్ వెయిన్్స. సాధారణంగా తొడల వెనుక లోపలి కాలుపై ఎక్కువగా కనిపిస్తాయి. సిరల్లోని కవాటాల సమస్య కారణంగా వెరికోస్ వెయిన్ ్స ఏర్పడతాయి, ఇవి గుండె వైపు రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడి పనిచేస్తాయి. రక్తం పైకి కదులుతున్నప్పుడు, వన్–వే వాల్వ్లు తెరుచుకుంటాయి, మూసుకుపోతాయి, రక్తం తిరిగి క్రిందికి లీక్ అవ్వకుండా నిరోధిస్తాయి. అయితే, ఈ కవాటాలు బలహీనమైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, గురుత్వాకర్షణ శక్తి రక్తాన్ని వెనక్కి లాగుతుంది. దీనిని సిరల లోపం అంటారు. ఆ రక్తం వెనక్కి వచ్చి, సేకరించి, ఉబ్బినప్పుడు సిరలు వెరికోస్ వెయిన్స్గా మారతాయి. చాలా సేపు నిలబడటం కూర్చోవడం వల్ల వెరికోస్ వెయిన్ ్స ప్రమాదం పెరుగుతుంది,అయితే కాలు మీద కాలు వేసుకోవడం వల్ల ఈ ప్రభావం ఉంటుందని ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారించే ఆధారాలు లేవు.భంగిమలో మార్పు...కాలు మోకాలిపై ఎక్కువసేపు ఉంచడం వల్ల కటి తిప్పడానికి వంగడానికి కారణమవుతుంది. ఇది దిగువ వీపులో నొప్పిని కలిగిస్తుంది. ఇది కాలక్రమేణా వెన్నెముక తప్పు అమరికకు కూడా దారితీస్తుంది. కూర్చోవడంలో సరైన భంగిమ లేనప్పుడు, ఆ పరిస్థితిని కండరాలు సరి చేయవలసి వస్తుంది. దీని అర్థం అవి అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి, ఇది నొప్పికి దారితీస్తుంది. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది పూర్తిగా మానేయాలని దీని అర్థం కాదు. కొన్ని సమస్యలైతే ఉన్నాయి.. కాబట్టి వీలైనంత వరకూ ఎక్కువసేపు అదే భంగిమలో కూర్చోవడాన్ని నివారించడం మంచిది.(చదవండి: భారతీయుల వివాహ వేడుకను చూసి..కొరియన్ కోడియా ఫిదా!) -
అందంగా, క్యూట్గా కనిపించాలంటే..!
ముఖం నీట్గా ఉంటే మేకప్తో ఆ అందాన్ని మరింత పెంచుకోవచ్చు. కానీ, అదే ముఖం మొటిమలు, బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్తో నిండిపోతే, ముందు వాటిని తొలగించుకోవడమే సమస్యగా మారుతుంది! అలాంటి వాటికి చెక్ పెడుతుంది ఈ ప్రొఫెషనల్ కిట్. మేకప్ లేకున్నా ముఖాన్ని అందంగా, క్యూట్గా మారుస్తుంది. ఈ కిట్లోని ప్రతి టూల్ వినియోగదారుల సౌలభ్యం మేరకు రూపొందింది. ఈ కిట్లోని టూల్స్– గడ్డం, బుగ్గలు, నుదురు, ముక్కుపై నుంచి సులభంగా బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్, మొటిమలను తొలగించడానికి సహాయపడతాయి.స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో ఇవి తయారయ్యాయి. ఈ కిట్లో ప్రొఫెషనల్ రిమూవర్ హెడ్, స్ప్రే కోటింగ్ బాడీ ఉంటాయి. ఈ మెటీరియల్ ఎటువంటి సెన్సిటివిటీ సమస్యలను కలిగించదు, దాంతో ఇది అన్ని రకాల చర్మాలకు సురక్షితంగా పని చేస్తుంది.టూల్స్పై ఉన్న యాంటీ–స్లిప్ హ్యాండిల్ డిజైన్ వల్ల ఉపయోగించడం సులభంగా ఉంటుంది. అలాగే చర్మానికి నష్టం కలగకుండా ఉంటుంది. ఈ స్కిన్ కేర్ టూల్స్ సురక్షితంగా, శుభ్రంగా, సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి పోర్టబుల్ టిన్ కేస్ కూడా లభిస్తాయి. అయితే ఈ టూల్స్ను ఉపయోగించే ముందు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. అయితే మొటిమ పూర్తిగా రాకుండానే ఈ రిమూవర్ టూల్ ఉపయోగించకూడదు. అలా చేస్తే చర్మానికి గాయాలు లేదా మచ్చలు ఏర్పడవచ్చు. ఈ ఉత్పత్తిని పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవాలి. మొత్తానికి ఈ కిట్తో ముఖాన్ని శుభ్రంగా, మృదువుగా ఉంచుకోవచ్చు.డార్క్నెస్కి చెక్చాలామంది స్త్రీలకు మోచేతులు, మోకాళ్లు, అండర్ ఆర్మ్స్ వంటివి డార్క్ స్పాట్స్తో నల్లగా, పైకి చూపడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే! పిగ్మంటేషన్కి బెస్ట్ రెమిడీ ఆలుగడ్డ అంటున్నారు నిపుణులు. ఆలుగడ్డ తొక్క తీసి, ఆలూని గుండ్రంగా కట్ చేసుకుని నల్లగా ఉన్న చోట రుద్దుకుంటే సరిపోతుంది. ఇంకా మంచి ఫలితం కావాలంటే ఆ చక్రాలను నిమ్మరసంలో ముంచి సమస్య ఉన్న చోట రబ్ చేసుకోవాలి. లేదంటే పసుపు, పాలు కలిపిన మిశ్రమంలో కూడా ఆ ముక్కలను ముంచి రుద్దుకోవచ్చు. ఆలుగడ్డలో నేచురల్ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దాంతో ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే– చర్మానికి ఉన్న నలుపుదనం తగ్గి, ప్రత్యేకమైన మెరుపు వస్తుంది. (చదవండి: Alzheimers Risk: మంచి కొలెస్ట్రాల్తో తగ్గే అల్జైమర్స్ ముప్పు!) -
‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’: ఇంటి హింస ఇంతింతై..
బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ అనేది మహిళలు తమ గృహహింస కారణంగా ఎదుర్కొనే మనోవేదన. ఒకరకంగా చూస్తే తీవ్రమైన వేదన కారణంగా అంటే రేప్కు గురైనవాళ్లూ, యుద్ధాల్లో సర్వం పోగొట్టుకున్నవాళ్లూ అనుభవించే అత్యంత వేదనాభరితమైన కండిషన్తో వచ్చే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)లో ఇదో రకం అని చెప్పవచ్చు. మహిళలు తమ పార్ట్నర్ చేతుల్లో అనుభవించిన గృహహింస కారణంగా ఇది తమ ఖర్మ అంటూ సమాధానపడుతూ నిత్యం అనుభవించే రంపపుకోత కారణంగా వాళ్లు అనుభవించే మానసిక సమస్యే ఈ ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’. ఈ మానసిక సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...పెళ్లి తర్వాత భర్త లేదా జీవిత భాగస్వామి పెట్టే వేదనలను అనుభవించే భార్యల్లో కొందరికి ఇది తమ ఖర్మ అనే ఫీలింగ్ తప్ప... దీన్ని ఎదుర్కోవాలనిపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించడం కూడా ఉండదు. అలా మొదలయ్యే ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’లో ఆ మహిళ... తన భర్త అలా హింసిస్తుండటాన్ని కూడా తన తప్పుగానే అనుకుంటూ ‘అపరాధభావన’తో బాధపడుతుంటుంది.సిండ్రోమ్ తాలూకు నాలుగు దశలివి... బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు దారితీసే వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితులు ప్రతి మహిళకూ వేర్వేరుగా ఉన్నప్పటికీ... వారు అనుభవించే కొన్ని కామన్ దశలను బట్టి చూసినప్పుడు వారి మానసిక స్థితి ఈ కింద పేర్కొన్న నాలుగు దశల్లో కొనసాగుతుంది. మొదటి రెండు దశల్లో మహిళలు నిశ్శబ్దంగా తమ వేదనలు అనుభవించినప్పటికీ... ఈ వేదనల నుంచి బయటకు వచ్చేందుకు తాము చేసే ప్రయత్నాలు ఈ చివరి రెండు దశల్లో కొంతమేర జరుగుతాయి. 1. డీనియల్ : తాము వేదన అనుభవిస్తున్న సంగతి తెలియని పరిస్థితి ఇది. భర్త తమను వేధిస్తున్నారని కూడా వాళ్లు అంగీకరించరు. అదేదో ఈసారికి అలా జరిగింది తప్ప భర్త తమను హింసిస్తున్నట్టు గుర్తించడానికి నిరాకరించే దశే ఈ ‘డీనియల్’. 2. గిల్టీ (అపరాధభావన) : భర్త తనను హింసించడానికి లేదా కొట్టడానికి ఒక రకంగా తాను చేసిన తప్పే అని సర్దిచెప్పుకునే ధోరణే ఈ అపరాధభావనకు కారణం. 3. ఎన్లైట్మెంట్ : భర్త చేతుల్లో ఇలా తరచూ హింసకు గురికావడం తమకు తగదనీ, దాన్నుంచి బయటకు రావాలనే భావన కలగడం ఈ ఎన్లైట్మెంట్ దశలో జరుగుతుంది. 4. రెస్పాన్సిబిలిటీ : ఈ దశలో వారు తామీ హింస నుంచి బయటపడటం అన్నది తమ చేతుల్లోనే ఉందనీ, అది తమ బాధ్యత అని గ్రహిస్తారు. అవసరమైతే బంధం నుంచి బయటపడైనా ఈ హింసనుంచి విముక్తి పొందవచ్చని అనుకునే దశ ఇది. బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ మొదలయ్యేదిలా... మొదట్లో ఏదో మనస్పర్థల కారణంగా భర్త ఆగ్రహానికి గురైనప్పుడు మహిళ అంతగా ప్రతిఘటించక΄ోవచ్చు. ఇది పెళ్లయిన కొత్తలో ఇలా జరగడానికి అవకాశముంది. భర్త తొలుత శారీరకంగానో లేదా మానసికంగానో బాధపెట్టాక ఎందుకో అలా జరిగి΄ోయిందనీ, ఇకపై అలా జరగదంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు. ఆమె ఆమోదం పొందడం కోసం అవసరమైనదానికంటే ఎక్కువ రొమాంటిక్గా వ్యవహరిస్తూ ఆమెను నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ హింస అక్కడితో ఆగకుండా అదేపనిగా మాటిమాటికీ కొనసాగుతూ ఉంటుంది. దాంతో తొలుత అతడు చెప్పే (కన్వీన్స్ చేసే) అంశాలకు లొంగి΄ోయిన మహిళ ఆ తర్వాత అదో రొటీన్ తంతు అని గ్రహించి, పెద్దగా స్పందించడమూ మానేస్తుంది. అలా గృహహింస వేదనలకు గురవుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి ఆర్థిక సమస్యలూ, విడి΄ోతామేమోనన్న భయం, తనను తాను సముదాయించుకునే సర్దుబాటు ధోరణీ... ఇలాంటి కారణాలు చాలానే ఉండవచ్చు.నిర్వహణ: యాసీన్ప్రభావాలు... స్వల్పకాలిక ప్రభావాలివి... జీవితం వృథా అనుకోవడం, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్) ఆత్మవిశ్వాసం లోపించడం (లో సెల్ఫ్ ఎస్టీమ్) తీవ్రమైన ఉద్విగ్నత (సివియర్ యాంగ్జైటీ).దీర్ఘకాలిక ప్రభావాలివి... తరచూ గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లడం, తానేమిటో మరచి΄ోయి వేరేగా ప్రవర్తించడం (డిసోసియేటివ్ స్టేట్), తీవ్రంగా ప్రతిస్పందించడం (వయొలెంట్ ఔట్బరస్ట్... ఇది సుదీర్ఘకాలం తర్వాత వచ్చే పరిణామం) హైబీపీ, గుండెజబ్బుల వంటివి కనిపించడం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ దీర్ఘకాలికం (క్రానిక్)గా వచ్చే వెన్నునొప్పి, తలనొప్పి.బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు ఇవే గుర్తులు... హింసించే తన భర్తకు అన్నీ తెలుసు... తనకేమీ తెలియనందువల్ల తనవల్లనే తప్పు జరిగిందేమోననే అపరాధభావన ∙జరిగిందానికి తామే బాధ్యురాలినేమో అనే భావనతో కలిగే వేదన ∙జరిగిందీ, తాను అనుభవించిన వేదనను తమ ఇంటివాళ్లకూ, ఫ్రెండ్స్కూ చెప్పక΄ోవడం ∙పిల్లల జీవితం ఏమై΄ోతుందోనన్న తీవ్రమైన ఆందోళన. -
ఖరము పాలతో కాస్మెటిక్..!
ఓ చిన్న ఆసక్తి ఓ కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. ఫలితంగా ‘... కడివెడైననేమి ఖరము పాలు’ అనే పద్యాన్ని కొత్తగా రాసుకోవాల్సిన రోజులొచ్చాయి. పూజా కౌల్ ప్రయోగాలు గాడిద పాలకు మహర్దశ నిచ్చాయి. మహారాష్ట్రలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది పూజా కౌల్. స్నేహితులతో కలిసి ఓ రోజు షోలాపూర్కు బస్లో వెళ్లింది. విండో సీట్లో నుంచి బయటకు చూస్తున్నదల్లా ఒక్కసారిగా ఆలోచనల్లోనుంచి బయటకొచ్చింది. గాడిదలు గుంపుగా వెళ్తున్నాయి. డ్రైవర్ని అడిగి బస్సాపించి వెళ్లి గాడిదల యజమానితో మాట్లాడింది. కుటుంబం అంతా పనుల కోసం వలస వెళ్తోంది. తమతోపాటు భవన నిర్మాణంలో బరువులు మోయడానికి గాడిదలను కూడా తోలుకెళ్తున్నారు. గాడిదలను పోషించుకుని జీవనం సాగించే లష్కర్ సామాజిక వర్గానికి ఇలా ఏటా పనుల కోసం వలస వెళ్లడం అలవాటే.తన ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడి నుంచే మొదలు పెట్టవచ్చనే ఆలోచన వచ్చిందామెకి. గాడిద పాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు, చర్మానికి చక్కటి పోషణనిస్తాయని, నిర్జీవంగా మారిన చర్మాన్ని ఆరోగ్యవంతం చేసి తేమగా ఉంచుతాయని తెలుసుకుంది. యాక్నే, ఇన్ఫ్లమేషన్ తగ్గించే లక్షణాలు కూడా ఈ పాలలో ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత సౌందర్యపోషణ ఉత్పత్తుల ఆలోచనకు దారి తీసింది. వెంటనే ముంబయిలో హ్యాండ్మేడ్ సోప్ మేకింగ్ స్వల్పకాలిక కోర్సు చేసింది. ఇక ప్రయోగాలు మొదలుపెట్టాలి.సబ్బుల తయారీతో మొదలుగాడిద పాల కోసం వారితో మరింత స్నేహం పెంచుకోవడానికి పూజ రోజూ సాయంత్రం ఓ గంటసేపు వారు నివసించే ప్రదేశానికి వచ్చేది. ఆమె ఆలోచనను అర్థం చేసుకున్న తర్వాత లష్కరులు గాడిద పాలను ఇవ్వసాగారు. వెంటనే పూజకాలేజ్కు దగ్గరలో ఓ గది అద్దెకు తీసుకుంది. ఆమె దగ్గర గోవా టూర్ కోసం దాచుకున్న 26 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మరో 34 వేలు స్నేహితులు, బంధువుల నుంచి సేకరించింది. కోర్సులో తెలుసుకున్న విషయాలకు తన పరిజ్ఞానాన్ని జోడించి సబ్బుల తయారీకి ప్రయోగాలు చేసింది. చేతుల మీద బొబ్బలు తేలాయి. చివరికి తొలి ప్రయత్నంగా 250 హ్యాండ్మేడ్ సబ్బులు తయారయ్యాయి. ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపి ఢిల్లీకి వెళ్లి ఎగ్జిబిషన్లో ఒక టేబుల్ వేసుకుని వచ్చిన వారికి వాటిని పరిచయం చేయడం ప్రారంభించింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆర్గానికా పేరుతో స్టార్టప్ను రిజిస్టర్ చేసి పూర్తిస్థాయిలో ప్రాజెక్టును విస్తరించింది. హ్యాండ్మేడ్ సబ్బుల నుంచి ఫేస్ప్యాక్లకు ప్రయోగాలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం సన్స్క్రీన్, క్రీమ్లు, సీరమ్ల తయారీ కోసం ప్రయోగాలు చేస్తోంది. ఆమె ఉత్పత్తులకు కస్టమర్లు ఢిల్లీ నుంచి తమిళనాడు, కేరళ, కటకలకు విస్తరించారు. ఇది పూజ సక్సెస్ జర్నీ.కడివెడు కాదు ఉగ్గుగిన్నెడు చాలు!ఇక గాడిదల పోషణలో ఉపాధి పొందుతున్న వారి విషయానికి వస్తే... ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్లో ఉన్న 150 కుటుంబాలు ఇప్పుడు ఎటూ వలసపోకుండా పూజ ఇండస్ట్రీకి పాలను సరఫరా చేస్తూ దాదాపుగా నెలకు 15 వేల రూపాలయలను సంపాదిస్తున్నాయి. ఇంతకీ గాడిదపాల ధర ఎంతో తెలుసా? లీటరు 13 వందల రూపాయలు.(చదవండి: Mumbai orthopaedic surgeon Reveals : ఒక సమోసా... యాభై నిమిషాల వాక్) -
క్రికెట్ గాళ్స్ ...స్టైలిష్ స్టార్స్...
భారత మహిళా క్రికెట్ జట్టు విజయాల పరుగును ఆస్వాదిస్తోంది. ఇటీవలి ప్రపంచ కప్ విజయం కేవలం క్రీడా మైలురాయి మాత్రమే కాదు శక్తి సామర్ధ్యాలున్న మహిళల భవితకు స్ఫూర్తి. క్రీడల్లో మాత్రమే కాదు ఈ మహిళలు మైదానంలో వెలుపల కూడా నవ యువతికి ప్రేరణ అందిస్తున్నారు.ఈ ఆధునిక క్రీడాకారులు సంప్రదాయ నియమాలను తిరిగి వ్రాస్తున్నారు: నైపుణ్యానికి అత్యాధునిక జీవనశైలిని జోడిస్తున్నారు. వరల్డ్ కప్ విజయం తర్వాత ఒక్కసారిగా వారి లైఫ్ స్టైల్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వారి ఫ్యాషన్ ఎంపికలపై నవయువ తరం దృష్టి సారించింది. అంతేకాదు పలు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ బ్రాండ్స్ సైతం వీరితో ఒప్పందాలకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపధ్యంలో అనుసరించే ఫ్యాషన్స్, స్టైల్స్ ఆధారంగా చూస్తే... స్మృతి మందాన...భారతీయ మహిళా క్రికెట్లో స్మృతి మంధానకు తిరుగులేని గుర్తింపు ఉంది. ఆమె బ్యాటింగ్ స్టైల్ లాగే ఆమె ఫ్యాషన్ ఎంపికలు కూడా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రయాణ రోజులకు రిలాక్సడ్ కుర్తా అయినా లేదా స్నీకర్లతో జత చేసిన భారీ చొక్కా అయినా, తన లుక్ను ఎలా చిక్గా చూపించాలో స్మృతికి తెలుసు. ఆమె పండుగ సమయంలో పాస్టెల్ షరారాస్ లేదా పూల చీరలలో నిజమైన భారతీయతను ప్రతిబింబిస్తుంది. ప్రసరింపజేస్తుంది. కానీ బిజీ వర్క్ లేని రోజుల్లో ఆమె సాధారణ కో–ఆర్డ్లు, డెనిమ్లు, సిల్హౌట్లను ఇష్టపడుతుంది. ఆత్మవిశ్వాసంతో కదిలే ఆమె తీరు ఆమె దుస్తులు ధరించే విధానం బాగా కనిపించడానికి భారీ స్టైలింగ్ అవసరం లేదని రుజువు చేస్తుంది.చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?జెమీమా రోడ్రిగ్స్ప్రశాంతమైన స్మృతికి భిన్నంగా జెమీమా రోడ్రిగ్స్ మెరుపులా ఉంటుంది. ఆమెను ప్రస్తుత భారత జట్టులో జెన్–జెడ్ శక్తిగా పేర్కొంటున్నారు. ఎల్లప్పుడూ తన లుక్తో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. స్పోర్టి జాకెట్లు, రంగురంగుల స్నీకర్లు, ప్రింటెడ్ టీస్ స్ట్రీట్వేర్ గ్లామ్ టచ్ తో ఆమె వార్డ్రోబ్ నవ యవ్వన ఉత్సాహంతో తొణికిసలాడుతుంటుంది .జెమీమా వ్యక్తిత్వం ఆమె ఫ్యాషన్ ద్వారా ప్రకాశిస్తుంది. ఆమె ట్రెండ్తో కంఫర్ట్ను కలపడం, రోజువారీ దుస్తులను స్టైల్ స్టేట్మెంట్లుగా మార్చడాన్ని ఇష్టపడుతుంది. డెనిమ్–ఆన్–డెనిమ్ సెట్ల నుంచి స్నీకర్ల, కుర్తాల వరకు, ఆమె ఫ్యాషన్ ఆకట్టుకుంటుంది. కెమెరాల కోసం కాదు, ఆమె తనకోసం తాను దుస్తులు ధరిస్తుంది. అణువణువూ కనిపించే ఆత్మవిశ్వాసమే జెమీమాను ఇన్ స్ట్రాగామ్లో నిజ జీవితంలో నిజమైన ట్రెండ్సెట్టర్గా మార్చింది.హర్మన్ ప్రీత్ కౌర్జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వ లక్షణాల్లానే ఆమె వార్డ్రోబ్ కూడా అదే శక్తిని ప్రతిబింబిస్తుంది. టైలర్డ్ బ్లేజర్ అయినా, స్మార్ట్ ప్యాంట్సూట్ అయినా, లేదా మట్టి టోన్లలో సొగసైన కుర్తా అయినా, డ్రెస్సింగ్లో ఆమె ఒక మాస్టర్ క్లాస్. హర్మన్ ప్రీత్ లుక్ నాటకీయతను కాకుండా ఆమె బలాన్ని ప్రదర్శిస్తుంది.ఆమె వస్త్రధారణ శైలి ఆధునికంగా అనిపించే భారతీయతను కలిగి ఉంటుంది, తరచుగా లినెన్ లేదా చేనేత పట్టు వంటి ఫ్యాబ్రిక్స్లో కనిపిస్తుంది. ఆమె ఎంపికలలో ఒక పరిపక్వత ఉంటుంది, ఆమె ట్రెండ్ల వెంట పడదు.చదవండి: జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకియాస్టికా భాటియాకొత్త తరం క్రికెటర్లలో, యాస్టికా భాటియా సొగసైన సౌందర్యానికి కేరాఫ్గా నిలుస్తుంది. ఆమె లుక్స్ అన్నీ క్లీన్ కట్స్, మ్యూట్ ప్యాలెట్లతో ఉంటాయి. యాస్టికా ఫ్యాషన్ సెన్స్లో భారీ ఉపకరణాలు లేదా రంగులు ఉండవు. ఆమె తరచుగా మోనోక్రోమ్ సెట్లు, తెల్ల చొక్కాలు లేత పాస్టెల్ కుర్తాలలో కనిపిస్తుంది, అవి మీరు ఎక్కడైనా ధరించవచ్చు ఓవర్స్టైల్డ్ సెలబ్రిటీ ఫ్యాషన్ యుగంలో ఆమె ఎంపికలో సరళత రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది.హర్లీన్ డియోల్స్పోర్టీ గ్లామర్ల పరిపూర్ణ సమ్మేళనం హర్లీన్ డియోల్ . మైదానంలో అద్భుతమైన క్యాచ్లు గొప్ప శక్తి ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ఆమె తన ఫ్యాషన్ కు అదే స్పార్క్ను తెస్తుంది. ఆమె బోల్డ్ లుక్లను ఇష్టపడుతుంది – స్టేట్మెంట్ డ్రెస్సులు, సొగసైన పోనీ టెయిల్స్, ట్రెండీ స్నీకర్లు ఆమె అథ్లెటిక్ ఫ్రేమ్ను హైలైట్ చేసే బాగా సరిపోయే అథ్లెటిజర్ సెట్లు. జిమ్ గేర్ నుంచి గ్లామర్కు సులభంగా మారే కొద్దిమంది క్రీడాకారిణులలో ఒకరు. ఆమె ఒక రోజు చిక్ స్ట్రీట్వేర్తో మరోక రోజు మరో స్టైల్తో రోజుకో ప్రయోగం చేస్తుంది. ఉపకరణాల పట్ల ఆమెకున్న ప్రేమ, మేకప్ సమన్వయంతో కూడిన లుక్స్ ఆమెకు బలమైన వ్యక్తిగత బ్రాండ్ను సృష్టించాయి.స్టేడియంల నుంచి ఫోటో షూట్ల వరకు వీరి ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరమే. వీరిలో ఎవరూ సెలబ్రిటీ అనే కిరీటంతో తమ స్టైల్స్ను పంచుకోవాలని ప్రయత్నించడం లేదు, వారి ఫ్యాషన్ వారి సహజమైన తీరుతెన్నులకు ఒక పొడిగింపుగా మాత్రమే చూస్తున్నారు. అందుకే ఈ అథ్లెట్లు ఇప్పుడు ఫ్యాషన్ ప్రేరణలు, బ్రాండ్ అంబాసిడర్లు మాత్రమే కాదు అత్యున్నతమైన కలలు కనే ధైర్యం ఉన్న భారతీయ యువతులకు రోల్ మోడల్స్ కూడా. -
వేగన్ వేవ్..! సస్టైనబుల్ లైఫ్స్టైల్గా వేగనిజం!
నగరంలో ఇటీవల వేగన్ ప్లీ మార్కెట్, వేగన్ ఫుడ్ డొనేషన్, వేగన్ వాక్స్ వంటి వినూత్న కార్యక్రమాలు జరుగుతుండడం విధితమే. అంతేకాకుండా రానున్న రోజుల్లో నగరంలో వేగన్ కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పదేళ్ల క్రితం నగరంలోని కొద్దిమంది మాత్రమే పాటించే ‘వేగన్ జీవనశైలి’ ప్రస్తుతం హైదరాబాద్ యువత, ఫిట్నెస్ ప్రేమికులు, జంతు ప్రేమికులు, పర్యావరణ హిత జీవనశైలిని ఆచరించే వారందరి మధ్య వేగంగా విస్తరిస్తోంది. రెస్టారెంట్ల మెనూలో ‘వేగన్ ఆప్షన్’లు కొత్తగా చేరడం, షాపింగ్ మాల్స్లో ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్కు ప్రత్యేక కౌంటర్లు రావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వేగన్ ఫుడ్ను ప్రమోట్ చేయడం ఈ మార్పుకు ప్రతికూలంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు దేశంలో వేగన్ హబ్గా ఎదుగుతున్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. స్థానిక ఫుడ్ బ్రాండ్లు, క్లౌడ్ కిచెన్లు, ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ప్లాంట్ బేస్డ్ సెగ్మెంట్ విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. హైదరాబాద్లో వేగనిజం ఇప్పుడు ఒక ట్రెండ్ కాదు, ఒక చైతన్యం. జంతువుల పట్ల మమకారం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, భూమి పట్ల బాధ్యత కలిపి ఏర్పడిన ఈ వేగన్ వేవ్ నగర జీవనశైలిని కొత్త దిశలో నడిపిస్తోంది. ఈ మార్పు కేవలం ఫ్యాషన్ కోసం కాదు.., పర్యావరణం, జంతు సంరక్షణ, ఆరోగ్యానికి దోహదపడే విలువలపై ఆధారపడి ఉంది. వేగనిజం అనేది కేవలం స్వచ్ఛమైన శాకాహారం స్వీకరించే పద్ధతి మాత్రమే కాదు.. ఇది ఒక జీవన తత్వం. జంతువులకు హానికరమైన ఏ (ఎనిమల్ బెస్ట్ ప్రొడక్ట్స్) ఉత్పత్తినీ ఉపయోగించకుండా జీవించడమే దీని మంత్రం. అంటే పాలు, మాంసం, గుడ్లు, తేనె వంటి ఉత్పత్తులు తినకుండా, లెదర్, సిల్క్ వూల్ వంటి జంతు ఆధారిత వ్రస్తాలను వాడకుండా జీవించడం. పచ్చి ఆహారం, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలూ పొందడమే దీని లక్ష్యం.నగరంలో వేగన్ కల్చర్.. దశాబ్దం క్రితం హైదరాబాద్లో వేగన్ రెస్టారెంట్లు అరుదు. కానీ ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచి్చ»ౌలి, హైట్టెక్ సిటీ ప్రాంతాల్లో అనేక వేగన్ కేఫేలు తెరుచుకున్నాయి. ఈ స్పాట్స్ వేగన్ ఫుడ్ ప్రేమికుల అడ్డాగా మారాయి. వీటిలో సోయా మిల్క్ లాటేలు, టోఫూ బర్గర్లు, క్వినోవా బౌల్స్, ప్లాంట్–బేస్డ్ పిజ్జాలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. సోషల్ మీడియా, ఎన్జీవోల ప్రభావం.. జంతు హక్కుల కోసం పనిచేసే పీపుల్ ఫర్ యానిమల్స్ ( పీఎఫ్ఏ), బ్లూ క్రాస్ హైదరాబాద్, వేగన్ ఇండియా మూమెంట్ వంటి సంస్థలు వేగన్ లైఫ్స్టైల్పై విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో స్థానిక వేగనిస్టులు తమ రోజువారీ ఫుడ్ హ్యాబిట్స్, రెసిపీలు, షాపింగ్ టిప్స్ పంచుకుంటున్నారు. వేగన్ హైదరాబాద్ వంటి కమ్యూనిటీ గ్రూప్ సోషల్ మీడియాలో వేల మందికి పైగా సభ్యులను, ఫాలోవర్స్ను కలిగి ఉంది. వేగన్ ఫెస్టివల్స్, మార్కెట్లు.. హైదరాబాద్లో ప్రతి యేటా వేగన్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ స్టాల్స్, వేగన్ క్లాతింగ్, జీరో వేస్ట్ ప్రొడక్ట్స్, పర్యావరణ హిత జీవన పద్ధతులపై వర్క్షాప్స్ జరుగుతాయి. గచి్చ»ౌలి స్టేడియం, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకలు ప్రజల్లో భారీగా ఆదరణ పొందుతున్నాయి. తద్వారా వేగన్ పాప్ అప్ మార్కెట్లు కూడా కొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ స్థానిక బ్రాండ్లు హస్తకళలతో చేసిన ప్లాంట్ బేస్డ్ ఉత్పత్తులను అమ్ముతాయి.వేగన్ ఫుడ్ – హెల్తీ బెనిఫిట్స్.. ఫిట్నెస్ ప్రియులు, యోగా ప్రేమికులు ఈ జీవనశైలిని ఎక్కువగా అంగీకరిస్తున్నారు. రక్తపోటు, కొలె్రస్టాల్, మధుమేహం వంటి వ్యాధులను తగ్గించడంలో వేగన్ ఆహారం సహాయపడుతుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. వేగన్ డైట్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి డిటాక్సిఫై ప్రభావాన్ని ఇస్తుంది. కానీ సరైన మార్గదర్శకత్వంతో మాత్రమే దీని ప్రయోజనం పూర్తవుతుందని హైదరాబాద్ ఆధారిత న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాషన్ వైపు..వేగన్ ఫ్యాషన్ కూడా హైదరాబాద్ యువతలో కొత్త ట్రెండ్గా మారింది. లెదర్కు బదులుగా కార్క్, పైనాపిల్ ఫైబర్, రీసైకిల్ చేసిన కాటన్తో తయారు చేసిన బ్యాగులు, షూలు, బెల్టులు మార్కెట్లోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని బొటిక్ స్టోర్లలో వీటికి భారీ డిమాండ్ ఉంది. (చదవండి: సెన్స్లెస్ సెల్ఫీ..! ఆందోళన వ్యక్తం చేస్తున్న పోలీసులు, నిపుణులు) -
యోగ కోచ్గా ఐఐటీయన్..!
ఐఐటియన్గా పెద్ద కలలు, ఖరీదైన కలలేవీ కనలేదు సౌరభ్. ‘మార్పు తెచ్చే శక్తి యోగాలో ఉంది’ అని గ్రహించిన ఈ కుర్రాడు దేశవ్యాప్తంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నాడు. ‘హబిల్డ్’ గ్లోబల్ మూమెంట్ ప్లాట్ఫామ్ ప్రారంభించాడు. ఈ విశ్వవేదికలో 169 దేశాల నుంచి 1.2 కోట్ల మంది యోగాభ్యాసకులుఉన్నారు. ఇక వరల్డ్ రికార్డ్లు సరే సరి... ‘ఐఐటీ పూర్తి చేసి ఆరుసంవత్సరాలైనా సౌరభ్ ఏమీ సంపాదించలేదు’ అని కొద్దిమంది అనుకునేవారు. వారికి తెలియని విషయం ఏమిటంటే సౌరభ్ చాలా సంపాదించాడు. ఎంతో పేరు! ఎన్నో రికార్డ్లు!! మహారాష్ట్రలోని ధనజ్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు సౌరభ్. అతడి పూర్వీకులు రాజస్థాన్కు చెందిన వారు. తాత లక్ష్మీచంద్ 1955లో యంబీబీయస్ పూర్తి చేశాడు. బాగా డబ్బులు సంపాదించాలి, లగ్జరీగా బతకాలి, పట్టణాలలో మాత్రమే ఉండాలి అనుకోలేదు. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రోడ్లు కూడా సరిగ్గా లేని మారుమూల గ్రామంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. వైద్యుడిగా సేవలందించడమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఎంతో చేశాడు లక్ష్మీచంద్. చిన్నప్పటి నుంచి తాత గురించి ఎన్నో మంచి విషయాలు విన్నాడు సౌరభ్. అలా తనకు తెలియకుండానే తాత స్ఫూర్తిగా మారాడు. స్వామి వివేకానంద బోధనలు కూడా సౌరభ్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఉద్యోగం కాదు. సమాజం కోసం ఏదైనా చేయాలి’ అనుకున్నాడు. కాలేజి రోజుల్లో ఒకసారి బెనారస్ నుంచి నాగ్పూర్కు ప్రయాణిస్తున్న సౌరభ్కు ఒక ధ్యానకేంద్రానికి చెందిన సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారితో పరిచయం తన జీవనగమనాన్ని మార్చింది. యోగాపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. వారు నిర్వహించే ధ్యాన, యోగ తరగతులకు హాజరయ్యేవాడు. యోగ తరగతులకు హాజరుకావడం టర్నింగ్ పాయింట్గా మారింది. క్రమం తప్పకుండా ధ్యానం, యోగా చేసేవాడు. దీనివల్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్తమ సమస్య ఉపశమనం దొరికినట్లయింది.యోగాలో ప్రావీణ్యం సాధించిన సౌరభ్ ఆ విద్యను వీలైనంత ఎక్కువ మందికి నేర్పించాలనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించాడు. దేశం నలుమూలలా తిరుగుతూ ఎంతోమందికి యోగా నేర్పించాడు. ‘యోగా బోధించడం కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగాను. ఆ సమయంలో నా సంతోషం మాటలకు అందనిది. ప్రతిరోజూ కొత్తగా, ఉత్సాహంగా ఉండేది. రోజూ నిద్ర లేవగానే ఈరోజు క్లాస్లో ఎలా బోధించాలి అనేదాని గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజూ పండగ జరుపుకున్నంత ఉత్సాహంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సౌరభ్.కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా యోగా ఆన్లైన్ క్లాస్లు ప్రారంభించాడు. అయితే మొదట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఆన్లైన్ క్లాస్లకు హాజరయ్యేవారు. తాను నిర్వహించే తరగతులు ఉచితం కాబట్టి వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదని గ్రహించిన సౌరభ్ తన ఆన్లైన్ క్లాస్లకు నెలకు వంద రూపాయలు ఫీజుగా పెట్టాడు.ముగ్గురితో మొదలైన ఆన్లైన్ క్లాస్ విద్యార్థుల సంఖ్య వందకు చేరింది. ఆ తరువాత దేశదేశాలకు విస్తరించి, విద్యార్థుల సంఖ్య లక్షలు దాటింది. తాను నిర్వహించే ఆన్లైన్ తరతులకు ముగ్గురు మాత్రమే హాజరైనప్పుడు సౌరభ్ నిరాశకు గురికాలేదు. ఘనమైన రికార్డ్లు నెలకొల్పినప్పుడు అహంతో ప్రవర్తించడం లేదు. యోగా నేర్పిన సమ్యక్ దృష్టితోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.వావ్ అనిపించే వరల్డ్ రికార్డులుయూట్యూబ్లో యోగా లైవ్ స్ట్రీమ్ను అత్యధికంగా వీక్షించిన ప్లాట్ఫామ్గా హబిల్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. అదే సంవత్సరం ఈ ప్లాట్ఫామ్ రెండు వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించింది. అందులో ఒకటి...ఒకేరోజులో చాలామంది లైవ్ వ్యూయర్స్కు సంబంధించింది, రెండోది లార్జెస్ట్ వర్చువల్ మెడిటేషన్ క్లాస్కు సంబంధించింది. మొదటి దానిలో 5,99,162 మంది, రెండో దానిలో 2,87,711 మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం 169 దేశాలకు చెందిన 7,52,074 మందితో వర్చువల్ యోగా సెషన్ నిర్వహించి మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు సౌరభ్. (చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..) -
పూజా బాత్రా ఫిట్నెస్ సీక్రెట్..! టోన్డ్ బాడీ కోసం..
బాలీవుడ్ నటి పూజా బాత్రా తన గ్లామర్తో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. తన అందం అభినయంతో కుర్రాళ్ల మదిని కొల్లగొట్టిన ఈ బ్యూటీ..నాలుగు పదుల వయసు దాటినా..ఇంకా అంతే అందం, ఫిట్నెస్తో అలరించడమే కాదు. ఇప్పటకీ ఆమెకు అంతే క్రేజ్ ఉంది. పూజ అంతలా ఫిట్గా యంగ్ లుక్లో కనిపించడానికి గల సీక్రెట్ ఏంటో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా బయటపెట్టింది. మరి అవేంటో చూద్దామా..!.ఈ నెల అక్టోబర్ 27తో 49 ఏళ్లు నిండాయి. అయినా ఇప్పటికీ అంతే అందంగా గ్లామర్గా కనిపిస్తుంది పూజ బాత్రా. అందుకోసం ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటానని అంటోందామె. అంతేగాదు ఫిట్నెస్ అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా అని అంటోందామె. మన శరీరాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం, మాననసిక ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నాం అనే దానిపైనే మన లుక్ ఆధారపడి ఉంటుందని పూజా నొక్కి చెబుతోంది. మానసికంగా స్ట్రాంగ్ ఉండటమే అసలైన గేమ్ ఛేంజర్ అని అంటోంది. తాను ఆరేళ్లుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నానని, వారానికి మూడు రోజులు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. పైగా దాంట్లో తాను రెండు బ్రౌన్ బెల్ట్లు గెలుచుకున్నట్లు కూడా వెల్లడించిందామె. ఇది తనను చురుకుగా ఉండేలా చేసి, బరువుని నిర్వహించడం సులభమయ్యేలా చేస్తుందని చెబుతోంది. అన్నిట్లకంటే సంతోషంగా ఉండేందుకు ఫిట్నెస్ అనేది అందరికి అవసరం అని పూజా పేర్కొంది. అంతేగాదు ఆమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ హైకింగ్ కూడా చేసినట్లు తెలిపింది. హైకింగ్ పరంగా మౌంట్ ఎవరెస్ట్, మోంట్ బ్లాంక్,యోస్మైట్ బేస్ క్యాంప్లతో సహా పలు ఎత్తైన ప్రదేశాలను చుట్టొచ్చారామె. View this post on Instagram A post shared by Pooja Batra Shah (@poojabatra) లండన్లోని లాస్ ఏంజిల్స్లో ఉండే పూజా యోగా టీచర్ కూడా. మార్షల్ ఆర్ట్స్తోపాటు యోగా అంటే కూడా మహా ఇష్టమని పూజ చెప్పుకొచ్చింది. ఇది సమతుల్య జీవితాన్ని గడపడానికి హెల్ప్ అవుతుందని అంటోంది. చివరగా ఆమె మానవవులు అభివృద్ధి చెందాలంటే సత్వ అనే సంస్కృపదానికి ప్రాధాన్యత ఇవ్వాలంటుంది. అంటే సమతుల్యత అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతలా హాయిగా జీవితాన్ని గడిపేలా అవకాశం లభిస్తుందని అంటోంది పూజా బాత్రా.(చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
'కలిసి చేస్తే కలదు ఆరోగ్యం'..! క్రేజీగా పార్ట్నర్ యోగా
కలిసి చేస్తే కలదు ఆరోగ్యం అంటున్నారు యోగా శిక్షకులు. ఆసనాలు సాధన చేసేటప్పుడు మరొకరితో కలిసి చేసే పార్ట్నర్ యోగా వల్ల అదనపు ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో నగరంలో ఈ పార్ట్నర్ యోగా క్రేజీగా మారుతోంది. మరీ ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఆసనాల సాధనపై ఆసక్తికనబరుస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఈ తరహా పార్ట్నర్ యోగా సాధన చేసే ఔత్సాహికులు హైదరాబాద్ సిటీలోని ఫిట్నెస్ స్టూడియోల్లో, యోగా సెంటర్లలో బాగా కనిపిస్తున్నారు. దీనిని కపుల్ యోగా అనే పేరుతో ప్రత్యేకంగా జంటల కోసం కూడా సాధన చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ప్రముఖ యోగా శిక్షకురాలు రీనా హిందోచా దీని గురించిన విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. యోగా భంగిమలను సాధన చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మద్దతు అందించే శైలినే పార్ట్నర్ యోగా అని పేర్కొంటున్నారు. యోగాసనాలు వేసే సమయంలో పరస్పరం సహకరించుకునే క్రమంలో.. సమతుల్యతను కాపాడుకోవడం, శరీరం మరింత బాగా సాగేందుకు, భంగిమను సరిగ్గా అనుసరించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఆసనాలు వేయడం సులభం అవుతుంది. ఇది ఫిట్నెస్తో పాటు నమ్మకం, పరస్పర విశ్వాసం కల్పించడంతో పాటు.. అనుబంధాలను బలోపేతం చేస్తుంది. భాగస్వామితో సాధన చేయడం వల్ల యోగా మరింత ఆహ్లాదకరంగా ప్రేరణ కలిగించేదిగా మారుతుంది. ప్రత్యేకించి కొన్ని భంగిమలు ఒంటరిగా కష్టంగా భావించే వ్యక్తులు కూడా భాగస్వామితో చేసినప్పుడు వాటిని సులభంగా వేయగలుగుతారు. తమ జీవిత భాగస్వామి, సహోద్యోగి లేదా అప్పుడే పరిచయం అయిన యోగా స్నేహితులతో కలిసి భాగస్వామి సాధన చేయవచ్చు. ఇది యోగాను కలిసి ఆస్వాదించడానికి ఒక అందమైన మార్గం. ప్రయోజనాలెన్నో.. ఈ తరహాలో యోగా సాధన శరీరంలోని ఫ్లెక్సిబులిటీని, అదే విధంగా బలాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆసనాలను సరైన విధంగా సాధన చేసేందుకు సహాయపడుతుంది. ఆసనాలు వేసే సమయంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ నైపుణ్యంతో పాటు భావోద్వేగ బంధాన్ని కూడా పెంచుతుంది.ఆరోగ్యకరం..‘భాగ’స్వామ్యం.. ఒకరు బాగా అనుభవజ్ఞులై మరొకరు కొత్తగా యోగసాధన చేస్తున్నవారైతే.. ఆ వ్యత్యాసానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ‘భాగస్వామి యోగా భంగిమలు శారీరక శ్రేయస్సును పెంచడమే కాకుండా నమ్మకాన్ని, కమ్యూనికేషన్ని కూడా పెంపొందిస్తాయి. ఇవి ఆయా వ్యక్తులు తమ భాగస్వామితో పరస్పర అవగాహన కలిగి ఉండడానికి, ఆ సమయంలో ఏకాగ్రతతో ఉండటానికి ప్రోత్సహిస్తాయి అని అక్షర యోగా కేంద్ర వ్యవస్థాపకురాలు హిమాలయన్ సిద్ధా అక్షర్ అంటున్నారు. నగరవాసులకు క్రేజీగా మారిన పార్ట్నర్ యోగా ఏ వ్యాయామం అయినా ప్రారంభించే ముందు తప్పనిసరిగా వార్మప్ వ్యాయామాలు చేయాలి. మీ భాగస్వామితో అనువుగా ఉండేలా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామి లేదా సన్నిహిత మిత్రులనో ఎంచుకోవడం మంచిది. వ్యక్తుల శారీరక సామర్థ్యాలు, శరీర కదలికలు ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని పార్ట్నర్ని ఎంచుకోవాలి. అలాగే ఆసనాల సమయంలో కదలికలు నిదానంగా ఉండాలి. భాగస్వామి బలంతో పాటు పరిమితులను కూడా సరిగా అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడూ బలవంతంగా లేదా అతిగా సాగదీయకూడదు. ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. శ్వాస క్రియ కూడా ఒకే క్రమంలో ఉండేలా చూసుకోవాలి. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
సాంకేతికత అను..బంధం
టీవీ వచ్చి ఆడవాళ్లు .. ఇంట్లోవాళ్లకు తిండి పెట్టకుండా చేసింది.. స్మార్ట్ ఫోన్ వచ్చి.. ఇంట్లోవాళ్లు ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేసింది.. టెక్నాలజీ మీద సంప్రదాయం చేస్తున్న కామెంటూ.. విడుస్తున్న నిట్టూర్పూనూ!అయ్యో సాంకేతికతతో సౌకర్యాలే కాదు.. సాఫల్య అనుబంధాలూ ఉన్నాయని చెబుతున్నాయి కొన్ని అనుభవాలు!జనార్థన్, రాధ (పేర్లు మార్చాం)కి కొడుకు, కూతురు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అమ్మాయి ఆస్ట్రేలియాలో, అబ్బాయి అమెరికాలో ఉంటున్నారు. జనార్దన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగి. రాధ గృహిణి. ఇద్దరూ డెబ్భైల్లో ఉన్నారు. బీపీతో జనార్ధన్, షుగర్, థైరాయిడ్తో రాధ సహజీవనం చేస్తున్నారు. ఓ మూడేళ్ల కిందటిదాకా ఇద్దరి జీవనశైలి వేరుగా ఉండేది. ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ పెట్టేవారు కాదు. చిన్నిపాటి వ్యాయామానిక్కూడా బద్ధకించేవారు రాధ. కూర్చున్న చోటికే ఆమెకు అన్నీ తెచ్చిపెట్టేది వాళ్ల పనమ్మాయి. నిద్రపోయినప్పుడు తప్ప మిగిలిన సమయమంతా యూట్యూబ్లోనే గడిపేవారు. జనార్దన్ వాకింగ్ క్లబ్ ఫ్రెండ్స్తో వాకింగ్కి వెళ్లినా.. పార్క్లోని చెట్లకింద కూర్చుని కబుర్లతోనే కాలక్షేపం చేసేవారు కానీ నడిచేవారు కాదు. ఆహారం మీద అదుపు ఉండేదికాదు. అమెరికాలో ఉన్న పిల్లలు పోరగా పోరగా మెడికల్ టెస్ట్లకి వెళ్లేవారు. ఆ రిపోర్ట్స్లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు కనపడేవి. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో వాళ్లు బాధపడుతూ, విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు ఆందోళన కలిగించేవారు. తల్లిదండ్రుల కోసం కెరీర్ను వదులుకుని పిల్లలు వచ్చే పరిస్థితి లేదు. అలాగని వీళ్లే అక్కడికి వెళ్లినా, అక్కడ అడ్జస్ట్ అయ్యే ముచ్చట అసలే లేదు. అమ్మా నాన్నను హెల్త్లైన్లో పెట్టడమెలాగా? వాళ్లకు ఓ యాక్టివిటీ కల్పించడమెలాగా అని పిల్లలిద్దరూ తలలు పట్టుకున్నారు. అప్పుడు కోడలు రంగంలోకి దిగింది.ఇలా సీన్ మార్చేసింది.. ఆ అమ్మాయి వృత్తిరీత్యా బిజినెస్ ఎనలిస్ట్. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ఇండోర్ డెకరేషన్ ఆమె ఇష్టంగా చేసే పనులు. అందుకే తన అత్తమామల జీవనశైలిని ఓ గాడిలో పెట్టేవరకు ఉద్యోగానికి సెలవుపెట్టి.. హాబీల మీద దృష్టి పెట్టింది. అలా దొరికిన సమయం, వెసులుబాటును పూర్తిగా ఇండియాలో ఉన్న ఇన్లాస్ మీదే వెచ్చించింది. అందులో భాగంగా ముందు వాళ్ల దైనందిన జీవనసరళిని పరిశిలీంచింది. వాళ్ల బాధ్యతలను చూస్తున్న కన్సల్టెంట్స్తో మాట్లాడింది. ఆ రిపోర్ట్స్, వాళ్ల లైఫ్స్టయిల్ గురించి సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ న్యూట్రిషనిస్ట్తోనూ చర్చించింది. ఇవన్నీ కూడా అమెరికాలో ఉండే షెడ్యూల్ చేసుకుంది. ఈ స్టడీతో ఆమె వాళ్ల దైనందిన కార్యక్రమాల టైమ్టేబుల్ ఒకటి తయారు చేసి వాట్సాప్లో పంపింది. ప్రింట్ అవుట్స్ తీసుకొమ్మని చెప్పింది. డైట్కి సంబంధించిన పట్టీని ఫ్రిజ్కి అతికించమంది. వ్యాయామానికి సంబంధించి డ్రెసింగ్ టేబుల్కి అతికించమంది. సాయంకాలం వాళ్లు చేయాల్సిన పనుల పట్టికను టీవీ కేస్కి అతికించమంది. రోజూ ఉదయాన్నే (ఇండియన్ కాలమానం ప్రకారం) అయిదింటికల్లా ఆ ఇద్దరినీ ఫోన్ చేసి నిద్రలేపేది. వాకింగ్కి వెళ్లమని పోరేది. వాళ్లకు కావాల్సిన సరకులు, కూరగాయలు, డాక్టర్ అపాయింట్మెంట్స్ వగైరా సమస్తం తానే చూసుకోవడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే యాప్స్ ద్వారా తనిచ్చిన జాబితా ప్రకారం అన్నీ ఆర్డర్ చేసేది. మూడు నెలలకు ఒకసారి వాళ్లకు టూర్స్నీ ΄్లాన్ చేయడం.. టికెట్స్, అకామడేషన్ బుక్ చేయడం అన్నీ చూసేది. ప్రతివారం ఏడు రోజులకు సరిపడా వాళ్లకు సుడోకు, వర్డ్ పజిల్ లాంటి ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చేది. వీటన్నిటితో.. ఆరు నెలల గడిచేసరికి ఇద్దరిలో చాలామార్పు వచ్చింది. ఇద్దరూ చెరో రెండు కేజీల వెయిట్ తగ్గారు. షుగర్, బీపీ, థైరాయిడ్ అన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇద్దరికీ కొత్త సర్కిల్ ఏర్పడింది. దాంతో ఇద్దరిలో జీవనాసక్తి, జీవనోత్సాహం పెరిగాయి. ట్రావెల్ చేయడం వల్ల ఉల్లాసంగా కనపడసాగారు. ఈ మార్పుకి ఇరుగు పొరుగు, చుట్టాలే కాదు వాళ్ల కన్సల్టెంట్ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇంట్లో పళ్లు, కూరగాయలు, సరకులు వృథా అవట్లేదు. మురిగిపోయి చెత్త బుట్ట దాఖలు కావట్లేదు. ఎప్పటికప్పుడు తాజా వాటినే వినియోగిస్తున్నారు. కారణం.. తానిచ్చిన టైమ్టేబుల్ తప్పితే ఆ వారం మనవరాలితో గానీ.. తమతో గానీ ఫోన్ ఇన్ ఉండదని, తామెవరమూ మాట్లాడమని హెచ్చరించింది కోడలు. ఈ హెచ్చరిక వాళ్ల జీవనశైలిని దిద్దడమే కాదు.. తమ కుటుంబ అనుబంధాన్నీ బలపరచింది అంటారు జనార్ధన్.‘తొలుత.. చిన్నపిల్లల్లా మాతో మా కోడలు అవన్నీ చేయిస్తుంటే చిరాకు, కోపం వచ్చేవి. మా అబ్బాయికి, అమ్మాయికి కంప్లయింట్ కూడా చేశాను. మా అమ్మాయి మా కోడలితో ‘పోనీలే వదినా.. పెద్దవాళ్లయిపోయారు వాళ్ల మానాన వాళ్లను ఉండనివ్వండ’ని చెప్పింది. పెద్దవాళ్లయ్యారు కాబట్టే.. ఈ జాగ్రత్తలు. ఒక్క ఏడాది ఓపికపట్టండి.. నా మీద నమ్మకం ఉంచండి’ అని అందరికీ చెప్పింది మా కోడలు. ఏడాది కాదు.. ఆర్నెలు తిరిగేసరికే మా కోడలు కోరుకున్నదేంటో మాకు తెలిసింది. ఆ మార్పు మా ఆరోగ్యాన్నే కాదు మా కుటుంబ బంధాలనూ గట్టిపరిచింది’ అంటారు రాధ. తాను చేసిన ఈ ప్రయోగం తన అత్తమామల ఆరోగ్యాన్ని మెరుగుపరచేసరికి దాన్ని వాళ్ల అమ్మకూ అప్లయ్ చేసింది. అంతేకాదు రాధ వాళ్లమ్మాయి తన అత్తమామల విషయంలోనూ ఆ ఎక్స్పరిమెంట్ను అమలు చేసి అద్భుతమైన ఫలితాలను సాధించింది.విదేశాలలో ఉన్నా కూడా...విదేశాల్లో ఉన్న చాలామంది పిల్లలు ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులు, ఇన్ లాస్ ఆరోగ్యం విషయంలో డాక్టర్ల అపాయింట్మెంట్స్ తీసుకోవడం, ట్రావెల్ ΄్లాన్ చేయడం, మందులు, నిత్యావసర సరుకులు ఆర్డర్ పెట్టడం పరిపాటే. కానీ ఇలా ఫిజీషియన్ ఇచ్చిన రిపోర్ట్స్ను సైకియాట్రి, సైకాలజీ నిపుణులు, ΄ûష్టికాహార నిపుణులతో చర్చించి.. భవిష్యత్లో రానున్న రిస్క్లను నియంత్రించడానికి చేయాల్సిన పనులతో పెద్దవాళ్లకు ఓ ఎక్సర్సైజ్లాంటిది ఇచ్చి.. అందులో వాళ్లను తలమునకలు చేయడం మాత్రం కొత్తే. అంతేకాదు ఆరోగ్యకరమైన ప్రయోగం కూడా. దీంతో పెద్దలు రోజుకు సరిపడా కావల్సినంత యాక్టివిటీలో ఉండి.. పిల్లలు దగ్గరలేరన్న బెంగకు గురికాకుండా మానసిక ఉల్లాసాన్ని పెం పొందించుకున్నారు. అలాగే గాడ్జెట్స్ వల్ల బంధాలు బలహీనమైపోయి ఒంటరితనంతో కునారిల్లిపోతారన్న అపోహకూ చెక్ పెట్టింది ఈ కుటుంబం. ఏదైనా ఉపయోగించుకునే తీరులో ఉంటుందని నిరూపించింది. ఆ గాడ్జెట్.. వాట్సాప్ నెట్వర్క్తోనే తన ఇన్లాస్, పేరెంట్స్కి దగ్గరై.. లాంగ్ డిస్టెన్స్లో కూడా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పింది.గాడ్జెట్స్ వల్ల బంధాలు బలహీనమైపోయి ఒంటరితనంతో కునారిల్లిపోతారన్న అపోహకూ చెక్ పెట్టింది ఈ కుటుంబం. ఏదైనా ఉపయోగించుకునే తీరులో ఉంటుందని నిరూపించింది. -
డయాబెటిస్ని తిప్పికొట్టి.. 30 కిలోల బరువు తగ్గింది!
బరువు తగ్గడం అందరూ చాలా కష్టమనే భావిస్తారు. ఎందుకంటే అంత ఈజీగా కొలెస్ట్రాల్ని తగ్గించుకుని స్లిమ్గా మారడం సాధ్యం కాదు. కానీ ఈ అమ్మాయి అధిక బరువుతో మధుమేహం బారినపడ్డప్పటికీ అధైర్యపడకుండా బరువు తగ్గింది. డయాబెటిస్ నుంచి కూడా బయటపడింది. అలాగని కఠినమైన ఆహారనియమాలేం పాటించలేదు, చిన్ని చిన్న ఆహారపు అలవాట్లతోనే ఇదంతా సాధ్యం చేసిందామె. మరి అదెలాగో ఆమె మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!.డైటీషియన్ జాకీ(Dietitian Jackie) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇలా రాశారు. తనకు 20 ఏళ్ల వయసులో ఉండగా ప్రీ డయాబెటిక్(pre-diabetic) నిర్థారణ అయ్యిందని తెలిపింది. దాంతో ఇక ఇప్పుడైనా ఆరోగ్యంపై దృష్టిసారించక తప్పదని ఫిక్స్ అయ్యానని చెప్పింది. అదీగాక పేరెంట్స్ కూడా బరువు తగ్గేలా ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోమని సూచించడంతో..తన ఆరోగ్యాన్ని కాపాడుకునేలా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. 30 కిలోలు ఎలా తగ్గిందంటే..సరైన ఆహారం: తన డైట్లో మంచి పుడ్ని తీసుకునేలా పోషకాహార నిపుణుడి సలహాలను తీసుకున్నట్లు తెలిపారు. నారింజ రసం వంటి చక్కెర పానీయాలను, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలను దూరంగా ఉంచి, గోధుమ రొట్టెలను ఆహారంలో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించి, పోషకవంతమైన ఆహారాన్ని ఎక్కువగా తినేలా చూసుకునేదట.ఫుడ్ తయారైన విధానం: వ్యాయామాలు చేసినంత మాత్రమే బరువు తగ్గరు. తీసుకునే అల్పాహారం, ఆరోగ్యకరమైనదా లేదా అని నిర్థారించుకునేదట. ముఖ్యంగా పోషకాహారం ఎంత మేర ఉందో తెలసుకుని మరి తీసుకునేదట. అలానే సమతుల్య ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది. వ్యాయామం..చిన్న వామ్-అప్ వ్యాయామాలతో మొదలు పెట్టి..ట్రెడ్మిల్, ఆరు నుంచి ఏడు మైళ్లు పరుగుపెట్టడం వంటి వ్యాయామాలని పట్టుదలతో చేసి లక్ష్యానికి చేరుకున్నట్లు తెలిపారామె. అలా బరువు తగ్గడమే కాదు, డయాబెటిస్ని క్యూర్ చేసుకున్నట్లు కూడా వివరించింది. అయితే తనకు వెయిట్లాస్ అవ్వడం కష్టమైన పని కాదని, అదొక నిర్వహణ దశ అని అంటోందామె. ఇప్పటికీ తాను ఆ అలవాట్లను కొనసాగిస్తున్నట్లు వివరించింది. తగ్గిన ఆ బరువుని నిర్వహిస్తే హెల్దీగా ఉంటామని..కేవలం జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలని చెబుతోంది డైటీషియన్ జాకీ. (చదవండి: Idli For Breakfast: ప్రయోజనాలేమిటి? సాంబార్,చట్నీతో తింటే లాభమా? నష్టమా?) View this post on Instagram A post shared by Jackie, MS, RD | Weight Loss Coach & Mindful Eating Dietitian (@the.mindful.nutritionist) -
హీరో ప్రభాస్ అన్ని గుడ్లు తినేవాడా? బాహుబలి డైట్ అలా ఉండేదా..?
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యధిక బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీస్ రికార్డులు, అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ నటుడు. ప్రతి సినిమా కోసం తన ఆకృతిని చాల సునాయాసంగా మార్చుకుంటాడు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా నిబద్ధతను చూపిస్తారు. అయితే ప్రబాస్ ఇలా సినిమా కోసం ఇంతలా తన బాడీలో వేరియేషన్ చూపించాలంటే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా బాహుబలిలో రాజులా ఆ పాత్రలో లీనమైపోయేలా కనిపించిన అతడి ఆహార్యం.. ఆ తర్వాత సాహో సినిమాకు చాలా స్లిమ్గా మారిపోయింది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎలా డైట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రూపురేఖల్ని మార్చుకుంటుంటారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా. బాహుబలి మూవీలో కండలు తిరిగిన దేహంతో కనిపించాలి కాబట్టి ప్రతి ఉదయం చాలా గుడ్లు తినేవారట. ఆ విషయమై ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ని అడగగా..ఆయన అవునని చెప్పారు. ఎందుకంటే కండలు తిరిగిన దేహంతో రాజసం ఉట్టిపడేలా కనిపించాలి కాబట్టి తప్పలేదన్నారు. అయితే అన్ని గుడ్లు తినడం చాల కష్టమని అన్నారు. చెప్పాలంటే ఒక రోజులో 20 నుంచి 30 గుడ్లు దాక తిని ఉంటానని అన్నారు. అయితే ఉడకబెట్టినవి తినడం కష్టమని అందుకని వాటిని ప్రోటీన్తో మిక్స్ చేసి ఒక జ్యూస్ మాదిరిగా తాగాల్సి ఉంటుందట. అలా అయితేనే.. గుడ్డు పచ్చి వాసన అంతగా ఉండదు కాబట్టి, అన్ని తినగలమని చెప్పారు. ఆ తర్వాత 2019లో సాహో మూవీని ప్రమోట్ చేశారు. అప్పుడాయన ఇదివరకటి ప్రభాస్లా చాలా స్లిమ్గా కనిపించారు. అప్పడు కూడా ప్రభాస్ బాహుబలి మాదిరిగానే అలాంటి ట్రిక్ ఏదైనా ఫాలో అయ్యారా అని మీడియా అడగగా..అదేం లేదన్నారు. అయినా బహుబలి పూర్తి అయ్యిన వెంటనే సన్నబడాలని అనుకున్నానని, అందుకోసం స్ట్రిక్ట్గా శాకాహారం తీసుకున్నట్లు వివరించారు. శాకాహారంలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది బరువు తగ్గడానికి సహయపడుతుందని చెప్పుకొచ్చాడు ప్రభాస్. బాహుబలి మూవీ టైంలో నెలల తరబడి కండరాలు పెంచేందుకు చాలా ఎక్కువగా తినాల్సి వచ్చింది, కాబట్టి దాన్ని తగ్గించాలంటే ప్యూర్ వెజిటేరియన్గా మారక తప్పదని అన్నారు ప్రభాస్. ఏ డైట్ని అనుసరించినా.. నిపుణులు పర్యవేక్షణలో ఆరోగ్యంగానే అమలు చేస్తానని అన్నారు. చివరగా ఏ డైట్ అయినా హెల్దీగా సరైన పద్ధతిలో అనుసరిస్తే మంచిగా బరువు తగ్గుతారని, అదేమంతా కష్టం కాదని అన్నారు ప్రభాస్.అంతలా గుడ్లు తీసుకోవచ్చా అంటే..గుడ్లు ఎప్పడు అద్భుతమైన ప్రోటీన మూలం. అని దాన్ని పలు రూపాల్లో తీసుకోవడం మంచిదేనని అన్నారు. అలాగే మరి అంతలా అంటే.. జీర్ణక్రియపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. అచ్చం గుడ్డులో లభించే ప్రోటీన్ మన శాకాహారంలో 20 రకాల ఆహారాల్లో కనిపిస్తుందని చెప్పారు. వాటిని తీసుకున్నా.. సమృద్ధిగా ప్రోటీన్ లభిస్తుందిన చెప్పారు. View this post on Instagram A post shared by Prabhas cults (@prabhascults_) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సమంత హైప్రోటీన్ డైట్..ఆ మూడింటితో ఫుల్ఫిల్..!) -
మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉన్నాయా?
కొందరు శరీరమంతా తెల్లగానే ఉన్నా, మోచేతులు, మోకాళ్లలో నలుపుతో బాధపడుతుంటారు. వీటి నివారణకు క్రీముల కన్నా సహజసిద్ధమైన చిట్కాలే బాగా పని చేస్తాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో అలోవెరా జెల్ ముందుంటుంది. ఎందుకంటే, ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మెరిపించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా దురద, చర్మం పొడి బారడం లాంటి ఇబ్బందులను తగ్గిస్తాయి. పిగ్మెంటేషన్ ని తగ్గించడంలోనూ సహకరిస్తాయి. ఇందుకోసం అలోవెరా జెల్ని నేరుగా మోచేతులు, మోకాళ్లపై ఎక్కడైతే నలుపుదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ అప్లై చేసి కనీసం అరగంట టు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలకు బాగా తేమ అంది, నల్లబడిన స్కిన్ టోన్ మారుతుంది. నలుపు సమస్య ఇక రానే రాదు.కురులకు ఆముదం, రోజ్మేరీ ఆయిల్రకరకాల కారణాల వల్ల ఈ మధ్యకాలంలో ఆడ, మగ తేడా లేకుండా అందరికీ జుట్టు సమస్యలు ఎక్కువ అయి΄ోతున్నాయి. అలాంటి వాళ్లు కొబ్బరినూనెలో ఆముదం, రోజ్మేరీ ఆయిల్ రెండూ కలిపి రాయడం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. అంతేకాకుండా, జుట్టుకి పోషణ అంది జుట్టు రాలి΄ోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఇందులో ఒక్కో నూనెలో ఒక్కో పోషకం ఉంటుంది. ఇవి జుట్టుకి సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తాయి. జుట్టు చిట్లడం, డ్రై హెయిర్ వంటి సమస్యలుంటే మీరు కొబ్బరినూనె మాత్రమే కాకుండా కొబ్బరినూనెలో కొద్దిగా రోజ్మేరీ ఆయిల్, ఆముదం కలిపి రాసి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. (చదవండి: ప్రాజెక్టులు వస్తాయి కానీ... పోయిన ఆరోగ్యం తిరిగి రాదు!) -
15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..
అధిక బరువు తగ్గడం అతిపెద్ద సమస్య కాదు అని నిరూపిస్తున్నారు పలువురు. మెరుగైన ఫలితాలు రావాలంటే సరైన విధంగా, మంచి నిపుణుల సలహాల సూచనలు పాటించాలి. ఈ అధిక బరువుకి చెక్పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించేది కేవలం డైట్ మాత్రమే కాదు, వర్కౌట్లుదే అగ్రస్థానం. ఎందుకంటే శారీరక శ్రమతో ఫ్యాట్ని కరిగించడమే గాక బరువులో మార్పులు కూడా సంభవిస్తాయి. కొందరికి చేతులు, కాళ్లు, పిరుదులు బాగా లావుగా కనిపిస్తాయి. ఆ ప్రదేశాల్లోని కొలెస్ట్రాల్ తగ్గి..ఫ్లాట్గా అవ్వడమేగాక చెక్కిన శిల్పంలా ఆకృతి మారాలంటే ఈ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా చూద్దామా..!. టొరంటోకు చెందిన ఈ ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్(Saachi Pai) జస్ట్ 15 నెలల్లో 40కిలోలు పైనే బరువు తగ్గింది. అంతలా బరువు తగ్గడంలో తనకు హెల్ప్ అయిన వ్యాయామాలు, ఆహారాలు గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బరువు తగ్గడంలో మార్పులు బాహ్యంగా కనిపించాలంటే..కాళ్లు, చేతులు, పిరుదుల సైజ్ తగ్గితేనే..బరువు తగ్గినట్లు తెలుస్తుంది. అందుకోసం ఈ ఐదు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయలంటోంది సాచి పాయ్. సైడ్ రైజెస్ఈ వ్యాయామం కోసం నిటారుగా నిలబడి ప్రారంభించాలి. ఒక కాలును పక్కకు ఎత్తి, దానిని నిటారుగా ఉంచండి. కాలును నెమ్మదిగా క్రిందికి తీసుకురండి ..ఇలా పునరావృతం చేయాలి.ముందు, వెనుక కిక్స్ఎత్తుగా నిలబడి, ఒక కాలును ముందుకు తన్నండి, ప్రారంభానికి తిరిగి వెళ్లి, ఆపై దానిని వెనుకకు తన్నండి. ఆ తర్వాత యథాస్థానానికి వచ్చి..కదలికలను నియంత్రించాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేయండి. సింగిల్ ఇన్నర్ లెగ్ రైజెస్మీ దిగువ కాలును నిటారుగా ఉంచి, పై కాలును దానిపై వంచి సైడ్కు పడుకోండి. ఇది, లోపలి తొడలపై ఒత్తిడి కలుగుజేసేలా దిగువ కాలును పైకి ఎత్తండి. ఇలా మీ కాలును నెమ్మదిగా తగ్గించి.. పునరావృతం చేయండి. నిర్దిష్ట సంఖ్యలో ప్రాక్టీస్ అయ్యాక..మరోవైపకి తిరిగి ఇలానే పునరావృతం చేయాలి..ఫైర్ హైడ్రాంట్స్నాలుగు కాళ్లపై ప్రారంభించండి, ఒక మోకాలిని పక్కకు ఎత్తండి, దానిని వంచి ఉంచండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ తుంటిని తిప్పవద్దు. ఇప్పుడు, వీపును క్రిందికి తగ్గించి రెండో కాలికి ఇలానే వ్యాయామం రిపీట్ చేయండి.డాంకీ కిక్స్నాలుగు కాళ్లపై నిలబడి, ఒక మోకాలిని వంచి, మడమను పైకప్పు వైపుకు ఎత్తాలి. ఈ వ్యాయామాలు కొవ్వును కాల్చడానికి, టోన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. పలితంగా శిల్పంలా శరీరాకృతి మారేందుకు దోహదపడుతుంది. ఈ వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలో సరిగా చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారని, అదే తప్పుగా చేస్తే లేనిపోని శారీరక సమస్యలు తప్పవని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంతవరకు నిపుణుడైన ఫిట్నోస్ పర్వవేక్షకుడి సమక్షంలో నేర్చుకోవడమే మంచిదని సూచిస్తున్నారు సాచిపాయ్. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..) -
పిగ్మెంటేషన్ పీడిస్తోందా?
వయసు పెరిగే కొద్ది శారీరక మార్పులు కారణంగా పిగ్మెంటేషన్ వేధిస్తుంటుంది. ముఖం మంతా నల్లటి మచ్చలతో ముఖం కళ తప్పినట్లుగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో లభించే వాటితోనే సులభంగా చెక్పెట్టొచ్చు. అదెలాగో చూద్దామా..!.ఒక బంగాళ దుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. ఈ మాస్క్ ని పిగ్మెంటేషన్ బాగా ఉన్న ప్రదేశాలలో అప్లై చేసి అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయండి. ఇలా నెల రోజుల పాటు రోజుకి రెండుసార్లు చేయవచ్చు.నిమ్మరసం, తేనె..రెండు టేబుల్ స్పూన్ల తేనెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసి కలపండి. అవసరమున్నచోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేసి ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్ చేసినట్లుగా వేయండి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒక సారి మీకు ఫలితం కనిపించే వరకూ చేయవచ్చు. టేబుల్స్పూన్ చొప్పున సోయా పాలు, నిమ్మరసం, టొమాటో గుజ్జు తీసుకొని ఈ మూడింటినీ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసి పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆరాక కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.టేబుల్స్పూన్ చొప్పున తేనె, కలబంద గుజ్జు తీసుకొని అందులో రెండు టేబుల్స్పూన్ల బొప్పాయి గుజ్జు వేసి ప్యాక్లాగా తయారుచేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్పై రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు అక్కడ చర్మంపై ఏర్పడిన మృతకణాలు సైతం తొలగిపోయి చర్మం కాంతివంతమవుతుందట. -
గర్భం కోస్ల ప్లాన్ చేస్తే..ఆ మందులు వాడాల్సిందేనా..?
నా వయసు 32 సంవత్సరాలు. నేను ప్రస్తుతం గర్భం కోసం ప్లాన్ చేస్తున్నాను. డాక్టర్ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు వాడమన్నారు. ఇవి నిజంగా అవసరమా? ఎప్పుడు మొదలు పెట్టాలి? దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?– దీప్తి, హైదరాబాద్ . గర్భం కోసం ప్లాన్ చేస్తున్న ప్రతి మహిళ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. గర్భధారణ మొదటి కొన్ని వారాల్లోనే బిడ్డ మెదడు, వెన్నెముక వంటి ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సమయంలో శరీరంలో ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే, బిడ్డలో ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్’ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి వెన్నెముక లేదా మెదడు అభివృద్ధి సరిగా జరగకపోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. గర్భధారణకు ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఈ లోపాలను చాలా వరకు నివారించవచ్చు. ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ గ్రూపుకు చెందిన నీటిలో కరిగే విటమిన్లు. సాధారణంగా శరీరానికి అవసరమైన మోతాదులో తీసుకోవడం పూర్తిగా సురక్షితం. అదనంగా తీసుకున్న ఫోలిక్ యాసిడ్ శరీరంలో నిల్వ కాకుండా మూత్రం ద్వారా బయటకు వెళుతుంది కాబట్టి, ఎక్కువ మోతాదులో తీసుకున్నా హానికరం కాదు. రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ గర్భధారణకు ముందు నుంచే మొదలు పెట్టి, గర్భం వచ్చిన తర్వాత కనీసం మొదటి మూడు నెలలు వాడటం ఉత్తమం. ఫోలిక్ యాసిడ్తో పాటు ఐరన్ , విటమిన్ బి12, విటమిన్ డీ, క్యాల్షియం వంటి పోషకాలు కలిగిన మల్టీవిటమిన్ మాత్రలు కూడా వాడితే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. ఇవి సాధారణంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఇవ్వవు. కొందరికి స్వల్పంగా వాంతులు లేదా మలబద్ధకం అనిపించవచ్చు, అలాంటప్పుడు వైద్యుడి సలహాతో మాత్రలను మార్చుకోవచ్చు. మొత్తానికి, మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఇప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ వాడడం ప్రారంభించండి.నా వయసు 38 సంవత్సరాలు. ఇటీవలి కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా వింటున్నాను. ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు?– శ్వేత, విజయనగరం. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్. బ్రెస్ట్ కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరగడం వల్ల ట్యూమర్ ఏర్పడుతుంది. ఇది చికిత్స చేయకపోతే ఇతర అవయవాలకు వ్యాపించవచ్చు. అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు, అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. దీని లక్ష్యం మహిళల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేయడం. వయసు పెరగడం, వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు, అధిక బరువు, శారీరక వ్యాయామం తగ్గడం, మద్యం సేవించడం, హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తల్లి, అక్క, చెల్లెలు లేదా పిన్ని వంటి బంధువులలో ఎవరికైనా బ్రెస్ట్ లేదా ఓవరీ క్యాన్సర్ ఉన్నట్లయితే, మీకు కూడా ఆ ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వైద్యుల సూచనతో హెరిడిటరీ జీన్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇవి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి మహిళా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. మొదట అల్ట్రాసౌండ్, తర్వాత మామోగ్రఫీ చేయించడం ఉత్తమం. ఇంట్లో నెలకు ఒకసారి స్వయంగా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే బ్రెస్ట్లో ఏదైనా గడ్డ, చర్మం మార్పు, నిపుల్ నుంచి స్రావం, నొప్పి లాంటివి ఉన్నాయా అని గమనించడం. ఏ మార్పు గమనించినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్ లేదా సర్జన్ను సంప్రదించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామం, బరువు నియంత్రణ, ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, పాలిచ్చే తల్లిగా ఉండటం. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ముందస్తు జాగ్రత్తలే ఆరోగ్యానికి ఉత్తమ రక్షణ.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: జిలేబీ, సమోసా, గులాబ్ జామూన్ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!) -
ఆన్లైన్ ఒత్తిడికి విరుగుడుగా..
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం(అక్టోబర్ 10)ని పురస్కరించుకుని యువజన మీడియా ప్లాట్ఫామ్ ‘యువ’ భాగస్వామ్యంతో ‘స్నాప్ ఇంక్’ ఆధ్వర్యంలో ‘కేర్ నాట్ కంట్రోల్’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సోషల్ మీడియా, అభద్రత, ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడం టీనేజర్ల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణలను పెంపొందించడమే ప్రధానంగా దీని ఉద్ధేశ్యమన్నారు. భారతీయ స్నాప్చాటర్ల డిజిటల్ శ్రేయస్సుకు ఇది మద్దతు అందిస్తుందని వివరించారు. ఈ వీడియో ప్రచారం ఈ నెల 10 వరకూ కొనసాగుతుందన్నారు. చిన్నపాటి చిట్కాలు..అలాగే బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడువెంటనే అమ్మకు ఫోన్ చేసి ఆమె గొంతు వినండి... చిన్నప్పుడు అమ్మ పాడే జోలపాట వింటూ హాయిగా నిద్దురలోకి జారినంత తేలిగ్గా మీరు ఒత్తిడి నుంచి బయట పడతారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. (చదవండి: Custard Apple: సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'! జ్యూస్, ఐస్క్రీమ్స్, స్వీట్స్ నుంచి..) -
యువ డిజైనర్లతో ఫ్యాషన్ బ్రాండ్స్ భేటీ
హైదరాబాద్ నగరంలో డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులను పలు ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రతినిధులు బుధవారం కలిశారు. నగరానికి చెందిన ప్రముఖ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ హామ్స్ టెక్ ఆధ్వర్యంలో నాగార్జునహిల్స్లో నిర్వహించిన కెరీర్ కనెక్ట్ కార్యక్రమానికి హాజరైన వందలాది విద్యార్థులకు దేశవ్యాప్తంగా పేరొందిన పలు ఫ్యాషన్ బ్రాండ్స్కు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. డిజైనర్లలో సృజనాత్మక శక్తిని, ఇప్పటి వరకూ చేసిన వర్క్స్ను బేరీజు వేసుకుని వారికి అవకాశాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ విధానంలో ఇప్పటికే పలువురు విద్యార్థులు అరవింద్ ఫ్యాషన్స్, షాపర్స్ స్టాప్, లేబొల్ ది స్టోరీ, సింఘానియా, ఐశారావు, మై పర్ఫెక్ట్ ఫిట్ తదితర బ్రాండ్లతో కలిసి పనిచేసేందుకు ఎంపికయ్యారని వివరించారు.పట్నంలో.. గ్రామీణభారత్ మహోత్సవంచేనేత కార్మికులు, హస్తకళ కళాకారులు, ఇతర మహిళా సంఘాలు సృష్టించిన చేనేత–హస్తకళా ఉత్పత్తులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా అమీర్పేట్లోని కమ్మ సంఘం వేదికగా ఏర్పాటు చేసిన ‘గ్రామీణ భారత్ మహోత్సవం’ బుధవారం ప్రారంభమైంది. నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గ్రామీణ భారత్ మహోత్సవాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ప్రారంభించారు. 15వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 21 రాష్ట్రాలకు చెందిన 53 స్టాల్స్లో చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. ఇందులో మన రాష్ట్రం నుంచి 14 స్టాల్స్ ఉన్నాయి. (చదవండి: అంతరిక్ష వేదికపై హైదరాబాద్..!) -
సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'
మామిడి, స్ట్రాబెర్రీ ఇలా ఏదైనా కావొచ్చు.. ప్రతి సీజనల్ పండుని పండుగలా ఎలా జరుపుకోవాలో నగరవాసులకు తెలుసు. ప్రస్తుతం సీతాఫల్(కస్టర్డ్ ఆపిల్) సీజన్ ప్రారంభమైంది. దాంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్ డెజర్ట్ మెనూలకు ఈ క్రీమీ ఫ్రూట్ కొత్త రుచులను అద్దుతోంది. సీతాఫలం సీజన్లో నేరుగా పండ్లను తీసుకోవడం మాత్రమే కాకుండా భాగ్యనగరవాసులు దానిని అనేక రూపాల్లో ఆస్వాదిస్తున్నారు. అన్ని పండ్ల మాదిరిగానే సీతాఫల్ జ్యూస్లు సరే.. అయితే.. కూలింగ్ మిల్క్షేక్ల నుంచి రుచికరమైన ఐస్క్రీముల వరకు, స్వీట్లు, పేస్ట్రీలు.. వివిధ రకాల వంటకాలలో ఇవి మేళవించడం విశేషం. వీలైనన్ని రూపాల్లో వెరైటీ డిష్లను తయారు చేసేందుకు ఉపయోగించ గల ఏకైక పండుగా సీతాఫలాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా సీతాఫల్ రబ్డీ అనేది సిటీ రెస్టారెంట్స్లో బాగా ఫేమస్. ఈ నేపథ్యంలో నగరంలో సీతాఫల్ రుచులు అందుబాటులో ఉన్న కొన్ని ప్రదేశాల గురించి.. అబిడ్స్లోని సుల్తాన్ బజార్లో ఉన్న మయూర్ జ్యూస్ సెంటర్ సీతాఫలం రుచులకు ఫేమస్. ముఖ్యంగా నిండుగా గుజ్జుతో ఉన్న సీతాఫల్ జ్యూస్ ఇక్కడ క్రీమీగా రుచికరంగా ఉంటుందనేది ఫ్రూట్ లవర్స్ మాట. సికింద్రాబాద్, బండ్లగూడ, టోలిచౌకిలలో ఉన్న నైస్ జ్యూస్ సెంటర్ కూడా సీతాఫల వెరైటీలకు పేరొందింది. భిన్న రకాల పండ్ల పేరిట మలాయ్లను అందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ సెంటర్ సీతాఫల్ మలైని కూడా అందిస్తోంది.సీతాఫల్.. వైరల్.. ఇటీవలే సీతాఫలం రుచి, దాని ఆకారంలో రుచికరమైన వంటకాన్ని ప్రముఖ భారతీయ పేస్ట్రీ చెఫ్ తేజస్వి చందేలా రూపొందించారు. ఈ వంటకం తయారీ వీడియో ఇన్స్ట్రాగామ్ రీల్ ఆన్లైన్లో అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ విషయంలో తనకు ఫ్రెంచ్ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ ప్రేరణగా పేర్కొంది. అతడు పండ్లను పోలి ఉండే డెజర్ట్ల తయారీకి ప్రసిద్ధి చెందాడు. పలువురు హోమ్ మేడ్ సీతాఫల్ బర్ఫీ, హల్వా, ఖలాఖండ్ కూడా తయారు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్లపై అందిస్తున్నారు. జూబ్లీహిల్స్తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న నేచురల్ ఐస్క్రీమ్స్ కూడా చవులూరించే కస్టర్డ్ యాపిల్ రుచులకు కేరాఫ్. సీజనల్ స్పెషల్ సీతాఫల్ ఐస్ క్రీం ఇక్కడ ఫేమస్. బంజారాహిల్స్లోని రోడ్ నెం.13లో ఉన్న లె టెసోరోలో ఓ ప్రత్యేక సీతాఫల్ రుచి అందుబాటులో ఉంది. సీతాఫల్ సోఫుల్ జార్ పేరిట అందించే ఈ డిసర్ట్.. వావ్ అనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో రోడ్ నం.36లో ఉన్న కృష్ణపట్నం రెస్టారెంట్కి సీతాఫల్ లవర్స్ ఓ రౌండ్ కొట్టొచ్చు. ఇక్కడి కస్టర్డ్ యాపిల్ డిలైట్ కృష్ణపట్నం డిలైట్గా పేరొందింది. కొండాపూర్ లోని తారా– సౌత్ ఇండియన్ కిచెన్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్ని వడ్డిస్తోంది. ఈ సీజన్లో తారాస్ సీతాఫల్ రబ్డీని రుచి చూడటం సిటీలోని ఫుడ్ లవర్స్కి ఓ అలవాటు. బంజారాహిల్స్లో ఉన్న సీతాఫల్ ఫ్రెష్ జ్యూస్ తన పేరులోనే ఈ ఫలాన్ని ఇముడ్చుకోవడంతో పాటు పలు రకాల మిల్క్ షేక్స్లోనూ మేళవిస్తోంది. సీతాఫలాన్ని ఇష్టపడేవారి కోసం మిల్క్ షేక్లతో సహా వివిధ రకాల కస్టర్డ్ యాపిల్ డెజర్ట్లను అందిస్తోంది. -
సరికొత్త ట్రెండ్ క్యాండిల్ లైట్ ఈవెంట్స్... జెన్జీ సందడి
ఇటీవలి కాలంలో నగరం కేవలం ఐటీ హబ్గానే కాకుండా లైఫ్స్టైల్, కల్చరల్ ఈవెంట్స్కి అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఈ నూతన ఒరవడిలో ఈ మధ్య ప్రధానంగా ఆదరణ పొందుతున్న సరికొత్త ట్రెండ్ క్యాండిల్ లైట్ ఈవెంట్స్. వాణిజ్య నగరంగా పేరుపొందిన హైదరాబాద్ ఇప్పుడు రాత్రి వేళల్లో మెరిసే మైనపు వెలుగుల్లో కొత్త మాయాజాలాన్ని సృష్టించిన అనుభూతిని కల్పిస్తుంది. చిమ్మ చీకటిలో చిరు వెలుగు అందించే క్యాండిల్ లైట్ ప్రత్యేక ఆకర్షణగా.. విభిన్నమైన వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రొటీన్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్కు భిన్నంగా క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఈ తరం ట్రెండ్గా నిలుస్తోంది. ట్రెండీ నైట్.. క్యాండిల్ లైట్ అన్న రీతిలో పలు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రస్తుత అధునాతన జీవనశైలితో పాటు ట్రెండింగ్ ఈవెంట్స్కు హైదరాబాద్ నగరం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఇందులో భాగంగానే క్యాడిల్ లైట్ ఈవెంట్స్ తెరపైకి వచ్చాయి. ఈ కొత్త ట్రెండ్ మన జీవనశైలి మార్పును మాత్రమే కాదు, మన మానసిక అవసరాలను కూడా ప్రతిబింబిస్తోంది. శాంతి, ప్రేమ, కళలకు వేదికగా ఈ ట్రెండ్ రూపాంతరం చెందుతోంది. ఈ క్యాండిల్ లైట్ ట్రెండ్కి నగరంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు మరింత క్రియేటివ్ ఐడియాలతో ముందుకు వస్తున్నాయి. క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్, థీమ్ బేస్డ్ క్యాండిల్ లైట్ పోయెట్రీ ఈవెనింగ్స్, మెడిటేషన్ సెషన్లు, క్యాండిల్ లైట్ డిన్నర్, క్యాండిల్ లైట్ ఆర్ట్ షోస్ వంటి కాన్సెప్ట్లు సరికొత్త అనుభూతులను అందిస్తున్నాయి. డార్క్ బీట్స్.. ఒక వైపు మ్యూజిక్ లవర్స్కి క్లబ్ల శబ్దాలు, ఈడీఎం బీట్స్ విసుగుతెస్తుంటే, మరోవైపు క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ వారికి ఓ కొత్త అనుభూతి అందిస్తున్నాయి. పియానో, వయోలిన్, ఫ్లూట్ వంటి సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రశాంతంగా కొనసాగే ఈ లైవ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఈవెంట్స్లో పాల్గొనడమంటే.. సంగీతంతో మనసు నిండిపోవడమే కాదు, ఆ మైనపు వెలుగుల్లో మన మనసు కూడా ప్రశాంతతను పొందుతుంది. ఇటీవల కూకట్పల్లి, బంజారాహిల్స్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో జరిగే ఈవెంట్స్కి యువత నుంచి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్లోని క్యాండిల్లైట్ సంగీత కచేరీలలో బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్, తారామతి బరాదరి రిసార్ట్స్ వంటి వేదికల్లో శాస్త్రీయ, ఆధునిక సంగీతంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సీసం కొవ్వొత్తులతో అలంకరించబడి సంగీతకారులు వాయించే సంగీతంతో ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి. ఈ కచేరీల్లో అర్జిత్ సింగ్, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖ మ్యూజిక్ సెలబ్రిటీలు భాగం కావడం విశేషం. ఉత్తమ మూవీ సౌండ్ట్రాక్స్, కోల్డ్ప్లే, ఎడ్ షీరాన్ మిక్స్ వంటి థీమ్లు ఇందులో ఉంటాయి. చదవండి: కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!నగరంలో సరికొత్త ట్రెండ్గా క్యాండిల్ లైట్ ఈవెంట్స్చీకటి వెలుగుల సందడి.. : గోల గోలతో హంగామా చేసే పార్టీలు కాకుండా.. బంధువులు, స్నేహితులతో ఒక మధురమైన వేడుక జరుపుకోవాల నుకుంటున్నవారికి క్యాండిల్ లైట్ బర్త్డే పార్టీలు సరైన ఎంపికగా మారుతున్నాయి. చిన్న చిన్న డెకరేషన్, ఫెయిరీ లైట్స్, సున్నితమైన మ్యూజిక్, సొగసైన కేక్ కటింగ్.. ఇవన్నీ కలిపి ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలు, టీనేజ్ యువత ఈ స్టైల్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.క్యాండిల్ నైట్ డిన్నర్.. : ప్రేమికుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న మరో ట్రెండ్.. క్యాండిల్ నైట్ డిన్నర్. ఒక టేబుల్, రెండు హృదయాలు, నెమ్మదిగా వెలిగే మైనపు వెలుగు, వెనకనుంచి వినిపించే ఓ మెలోడీ పాట.. ఇది కేవలం డిన్నర్ కాదు, ఒక జ్ఞాపకం. హైదరాబాద్లోని పలు హై ఎండ్ రెస్టారెంట్లు, రూఫ్టాప్ కెఫేలు, ప్రైవేట్ విల్లాస్, రిసార్టులు ఈ రకమైన డిన్నర్ అనుభూతికి ప్రత్యేక ప్యాకేజీలతో అందిస్తున్నాయి. పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీ వంటి సందర్భాల్లో ఈ డిన్నర్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి.మెంటల్ పీస్: ఉరుకుల పరుగుల బీజీ నగర జీవనశైలిలో కాసింత ప్రశాంతత కోసం వినూత్నమైన అనుభూతి కోసం ఈ క్యాండిల్ లైట్ ఈవెంట్స్ అద్భుతమైన వేదికలుగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్: ఈ జెన్జీ బ్యాచ్ సోషల్ మీడియా యాప్స్లో తమను ప్రత్యేకంగా ప్రదర్శించు కోవడం ఇష్టపడుతుంటారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయదగిన అందమైన ఫొటోలు తీసుకోవాలంటే క్యాండిల్ లైట్ సెట్టింగ్స్ వైరల్గా నిలుస్తున్నాయి. అరుదైనఅనుభూతి: ప్రతి ఈవెంట్ వ్యక్తిగతంగా ప్లాన్ చేయబడటం ఈ క్యాండిల్ లైట్ ఈవెంట్స్ ప్రత్యేకత. ఇష్టమైన వారి కోసం, వారికి నచ్చే సెట్టింగ్స్తో ఈ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే!
ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే అనేక అంశాలు పనిచేస్తాయి. సమతులం ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సరియైన నిద్ర చాలా అవసరం. దీంతోపాటు మన శరీరంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని అవయవం ఒకటి ఉంది. ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ దీనికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ ప్రకారం, ఆరోగ్యం విషయంలో చాలామంది చేసే అతి పెద్ద తప్పు వారి బ్రెయిన్ గురించి పట్టుకోకవడం. మెదడు ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం మనిషి ఆయుష్షుమీద ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిర్ణయాలు , దీర్ఘాయువును కూడా నియంత్రించే అవయవం అయినా , మెదడు ఆరోగ్యం తరచుగా రోజువారీ జీవితంలో దాని గురించి విస్మరిస్తున్నారు అంటారాయన. తాజాగా దీర్ఘాయువు పరిశోధకుడు డాన్ బ్యూట్నర్తో ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాడ్కాస్ట్ లైవ్ టు 100 లో మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. తన కెరీర్లో 2 లక్షలకు పైగా మెదడు స్కాన్లను అధ్యయనం చేసిన డాక్టర్ అమెన్, మెదడుతో సంబంధాన్ని పెంచుకోవడం దాని కనుగుణంగా మలుచుకోవడం చాలా ముఖ్యం అన్నారు.తన సొంత మెదడు స్కాన్ నుండి మేల్కొలుపు కాల్డాక్టర్ అమెన్ ఒక అగ్రశ్రేణి న్యూరోసైన్స్ విద్యార్థిగా మరియు బోర్డు-సర్టిఫైడ్ మనోరోగ వైద్యుడిగా కూడా, 1990ల ప్రారంభం వరకు తాను మెదడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని ఒప్పుకున్నారు. తన క్లినిక్లలో బ్రెయిన్ ఇమేజింగ్ను ప్రవేశపెట్టి, 1991లో తన సొంత మెదడును స్కాన్ చేసినప్పుడు, దిగ్భ్రాంతికర ఫలితాలు చూశానని చెప్పుకొచ్చారు.1990 కి ముందు తనకు అధిక బరువు రాత్రిపూట నాలుగు గంటలు మాత్రమే నిద్రపోవడం లాంటి చెడు అలవాట్లు ఉండేవని , తన బ్రెయన్ హెల్త్ గురించి ఎపుడూ ఆలోచించలేదని గుర్తు చేసుకున్నారు. కానీ పరిశోధనలకు ఒక మేల్కొలుపుగా పనిచేశాయని, తన జీవనశైలిని కరెక్ట్ నిద్ర, ఆహారం,రోజువారీ అలవాట్లను మార్చుకున్నట్టు వెల్లడించారు.మెదడు ఆరోగ్యం- దీర్ఘాయువు, "బ్లూ జోన్స్" (ప్రజలు అసాధారణంగా ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలు) ఆలోచనను ప్రాచుర్యంలోకి తెచ్చిన డాన్ బ్యూట్నర్, మంచి జీవనశైలి అనేది గుండె, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినట్టుగానే, మెదడు ఆరోగ్యం అనేది దీర్ఘాయువులో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. రోజువారీ అలవాట్లు అభిజ్ఞా క్షీణత, చిత్తవైకల్యం,మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, అలాగే మెదడును ముందుగానే రక్షించడం అనేది దీర్ఘకాలిక శ్రేయస్సులో చాలా కీలకమన్నారు. దీనికి సంబంధించి డాక్టర్ అమెన్ రాసిన "చేంజ్ యువర్ బ్రెయిన్, చేంజ్ యువర్ పెయిన్" అనే పుస్తకంలో మరిన్ని విషయాలను పొందుపర్చారు.మెదడు ఆరోగ్యం, డా. అమెన్ సలహాలుక్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ను సరఫరాను పెంచుతుంది. వ్యాయామంలో పట్టిన చెమట హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందిమెదడు చురుగ్గా ఉండేలా, చాలెంజింగ్ ఫజిల్స్ పరిష్కరించాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు, వాల్నట్లు, అవిసె గింజలు . కొవ్వు చేపలు మెదడు కణాలకు మేలు ఇస్తాయిచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. కుటుంబంలో అల్జీమర్స్ వంటి పరిస్థితులు ఉంటే ముందుగానే అప్రమత్తం కావాలి.7–8 గంటలు ల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెదడు తనను తాను శుభ్రపరుచుకునే సమయం నిద్ర.తల గాయాల నుండి రక్షించుకోవడం.మద్యం ,మాదకద్రవ్యాలకు దూరండా ఉండాలి.ఘీ టాక్సిన్స్ న్యూరాన్లను దెబ్బతీస్తాయినెగిటివ్ ఆలోచనలు మెడదుకు హాని చేస్తాయి. విటమిన్ డి , హార్మోన్ స్థాయిలను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మెదడు పట్ల లవ్ అండ్ కేర్ గా ఉండాలి. దానికి కీడు చేసే పనులు మానుకోవాలి అంటారు డా. అమెన్. -
యంగ్ ఇండియా! ఒక్క బీట్ మిస్ అయినా.. బీ(ట్) కేర్ఫుల్
ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అందునా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తన విశృంఖల ప్రతాపం చూపాక గుండెజబ్బుల కేసులు మరింత ఎక్కువయ్యాయి. అందుకే ప్రతి ఏడాదీ సెప్టెంబరు 29న నిర్వహించే వరల్డ్ హార్ట్ డే తాలూకు థీమ్ ఏమిటంటే... ‘‘ఒక్క స్పందననూ మిస్ కావద్దు’’ (డోంట్ మిస్ ఏ బీట్). దీని అర్థం ఏమిటంటే... ఒక్క గుండె కూడా తన స్పందనలను కోల్పోయే పరిస్థితి రాకూడదనే. గతంలో కనీసం 50, 40లలో కనిపించే ఈ గుండెజబ్బులు ఇప్పుడు ఎందుకిలా యుక్త వయసు లోనే వచ్చేస్తున్నాయో చెప్పే కారణాలూ, వాటిని నివారిస్తూ మన యువతను గుండెజబ్బుల నుంచి రక్షించుకునేందుకు తగిన అవగాహనను కల్పించేందుకే ఈ కథనం.గుండెజబ్బుల తీవ్రతనూ, విస్తృతినీ తెలిపే కొన్ని గణాంకాలను చూద్దాం. ఢీల్లీ, ముంబై, హైదరాబాద్లలోని కొన్ని పెద్ద హాస్పిటల్స్ తాలూకు ఎమర్జెన్సీ కేసులను పరిశీలిస్తే సగానికిపైగా కేసులు... అంటే 50% కేసుల్లో బాధితులు కేవలం 40 ఏళ్లలోపు వాళ్లే. మానసిక ఒత్తిడి, ఎటూ కదలకుండా (శారీరక శ్రమ లేకుండా) ఉండే వృత్తులూ పెరగడంతో గుండె జబ్బులతో బాధపడే యువత కూడా పెరుగుతోంది. అందుకే ఇటీవల కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ 45 ఏళ్ల లోపే అక్యూట్ కరోనరీ సిండ్రోమ్తో బాధపడేవారిపై పరిశోధనల కోసం ఓ అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలి పరిశీలనల ప్రకారం ప్రతి ఐదు గుండె΄ోటు కేసులను పరిశీలిస్తే అందులో ఒకరు తప్పనిసరిగా 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. గుండెజబ్బుల పరంగా ప్రపంచవ్యాప్తంగా 20 – 30 ఏళ్ల యువతలో ఏడాదికి 2% పెరుగుదల ఉండగా... మన దేశంలో సైతం గుండెజబ్బులకు లోనైన వాళ్లలో 40 ఏళ్ల లోపు వారు కనీసం 25% వరకు ఉండటం మరింతగా బెంబేలెత్తిస్తున్న అంశం. హైబీపీ, హైకొలెస్ట్రాల్ వంటివి యువతలో పెరుగుతుండటమే దీనికి కారణం. దాంతో క్రమంగా, నిశ్శబ్దంగా చాపకింద నీరులా గుండెజబ్బుల కేసులు భారత్లోనూ పెరుగుతున్నాయి.లక్షణాలు... సాధారణంగా చాలామందిలో ఛాతీనొప్పితో గుండె పోటు కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించే వారు 97.3 శాతం మంది, చెమటలు పట్టడం 11 శాతం మందిలో, వాంతులు లేదా వికారం 8.2 శాతం కేసుల్లో, శ్వాస ఆడకపోవడం 6.8 శాతం మందిలో కనిపిస్తాయి. ఈ వయసులో చాలా మందిలో వచ్చే గుండెపోటుకు కారణమైన నొప్పిని గ్యాస్, అజీర్ణం, అసిడిటీ కారణంగా భావిస్తుంటారు. ఈ అంశం కూడా చికిత్స ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తోంది.గుండె జబ్బుల పెరుగుదలకు కారణాలు...వయసు పెరుగుతుండటం: ఇది నివారించలేని అంశం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్ అంటారు. గతంలో సాధారణంగా 40 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవిస్తుండేది. ఇప్పుడు ఈ వయసు కంటే ముందే.. అంటే 20 నుంచి 30 ఏళ్లలోపే ఇలా రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది.కొందరిలో కొలెస్ట్రాల్ నిల్వలు చాలా నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. కానీ కొందరిలో చాలా వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లాక్’గా వ్యవహరి స్తుంటారు. ఈ ప్లాక్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు/రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లాక్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్ (అడ్డంకులు) గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు.ఆహారపు అలవాట్లు: హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వంటి మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు చిన్న వయసులోనే గుండెజబ్బులు / గుండెపోటుకు దారితీసే ముప్పును పెంచుతున్నాయి. మన దేశంలో దిగువ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉండే దేశాల్లో పెరుగుతున్న పట్టణీకరణ / నగరీకరణ కారణంగా అన్ని పోషకాలు ఉండే మంచి ఆహారంతో పోలిస్తే అధిక క్యాలరీలు ఉండే ఆహారం చవగ్గా దొరుకుతుండటంతో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది.తగినంత వ్యాయామం లేకపోవడం : కుదురుగా కూర్చుని చేసే వృత్తులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అంశమే అయినప్పటికీ... మన దేశ యువతలో కూడా వ్యాయామం లేక΄ోవడమూ, పైగా మన దేశ సాంస్కృతిక, సామాజిక నేపథ్యం కారణంగా మహిళలు, అమ్మాయిల్లో వ్యాయామ సంస్కృతి తక్కువగా ఉండటం కూడా గుండెజబ్బులు / గుండెపోటు ముప్పునకు కారణమవుతోంది.పొగతాగడం : ఇటీవల భారత్, రష్యా, కొన్ని మధ్య ఆసియా దేశాల్లో పొగాకు వినియోగం బాగా పెరుగుతుండటం అథెరోస్కిర్లోసిస్కూ, గుండెపోటుకు మరో ప్రధాన కారణం. 60 ఏళ్ల వ్యక్తులతో పోలిస్తే 40 ఏళ్లలోపు వారికి పొగ దుష్ప్రభావం మరింత ఎక్కువ. అయితే ఏ వయసులోనైనా పొగతాగడం అంతే ప్రమాదకరం అని గుర్తించాలి. స్థూలకాయం కారణంగా : మన దేశవాసుల్లో ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. మన జీవనశైలి (లైఫ్ స్టైల్) కారణంగా ఇలా స్థూలకాయం రావడం, పొట్ట దగ్గర కొవ్వు పెరగడం కూడా గుండెజబ్బుల ముప్పును మరింత పెరిగేలా చేస్తోంది. హైబీపీ, డయాబెటిస్ : లైఫ్స్టైల్ జబ్బులైన హైబీపీ, డయాబెటిస్ వంటి అనారోగ్యాల విషయంలో అవగాహన అంతగా లేని మనలాంటి దేశాలలో నియంత్రణలో లేని హైబీపీ, మధుమేహం వంటివి గుండెపోటుకు కారణమవు తున్నాయి.జెండర్ అంశం : ఒక వయసు వరకు మహిళలతో పోలిస్తే గుండెప్లాక్టు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగి΄ోయే వరకు మహిళల్లోని ఈస్ట్రోజెన్ వారికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగాక మహిళలతో పాటు... ఏ జెండర్ వారికైనా గుండెపోటు అవకాశాలు సమానం. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు: పై అంశాలకు తోడుగా ఒక సమాజం లోని విద్య, ఆదాయ వనరులు, ఆరోగ్య సంరక్షణకు గల అవకాశాలు, సాంస్కృతిక నేపథ్యాల వంటి అంశాలు కూడా గుండెజబ్బుల కేసులను ప్రభావితం చేస్తుంటాయి. ఫ్యామిలీ హిస్టరీ : మిగతావారితో పోలిస్తే గుండెజబ్బులు / గుండెపోటు లాంటివి వచ్చిన వారి కుటుంబాల తాలూకు కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) కూడా గుండెజబ్బుల ముప్పునకు ఒక ప్రధాన కారణం. మిగతావాళ్లతో పోలిస్తే దాదాపు 25 శాతం మంది రోగుల్లో గుంపోటుకు ఈ ఫ్యామిలీ హిస్టరీనే కీలకాంశ మవుతుంది. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్లబ్... డబ్...లయ తప్పొద్దు!నివారణ ఇలా... కార్డియో వాస్క్యులార్ హెల్త్ స్కోరుకు దగ్గరగా ఉండే జీవనశైలి: సాధారణంగా పాశ్చాత్యదేశాల్లో... మరీ ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్దేశించిన కొన్ని జీవనశైలి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటినే ‘లైఫ్ ఎసెన్షియల్స్ 8 (ఎల్ఈ 8); లైఫ్ ఎసెన్షియల్స్ 7 (ఎల్ఈ 7) గా వ్యవహరిస్తుంటారు. అంటే... ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా అనుసరించే మార్గదర్శకాలైన... రక్త΄ోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవడం; రక్తంలో చక్కెరమోతాదులనూ, కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడం; ఆరోగ్యకరమైన ఆహారాన్ని,పోషకాహారాన్ని తీసుకోవడం; తగినంత వ్యాయామం చేయడం; ఎత్తుకు తగినంత బరువు ఉండేలా బాడీ మాస్ ఇండెక్స్– (బీఎమ్ఐ)ను మెయింటెయిన్ చేయడంస్మోకింగ్ / నికోటిన్కు దూరంగా ఉండటం; కంటినిండా నిద్రపోవడం... అలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ఈ లైఫ్ ఎసెన్షియల్ స్కోరును ఎంతగా పెంచుకుంటే గుండెజబ్బులను అంతగా నివారించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ద్వారా : చాలామందిలో గుండెజబ్బులుగానీ లేదా గుండెపోటుగానీ ఆకస్మికంగా రాకముందే కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతాయి. ఉదాహరణకు ఛాతీలో ఇబ్బందిగా ఉండటం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట, గుండెదడ (పాల్పిటేషన్) వంటివి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయంలో గుర్తించి డాక్టర్లను సంప్రదించడం వల్ల. స్క్రీనింగ్ పరీక్షలతో : హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, మధుమేహంతో బాదపడేవారు తగిన పరీక్షలు చేయించు కోవడం, ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనరీ సీటీ యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెజబ్బులు నివారించవచ్చు. ఇదీ చదవండి:Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లి-డాక్టర్ అంజని,ద్వారంపూడి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
దసరాని ఈ పసందైన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుందాం ఇలా..!
మిరియాల పులిహోరకావలసినవి: బియ్యం– ఒక కప్పు, నీళ్లు– 2 కప్పులుచింతపండు– పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకోవచ్చుపచ్చిమిర్చి– 3 (సన్నగా తరగాలి), ఎండుమిర్చి– 4 (ముక్కలు చేసుకోవాలి), మిరియాలు– ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ (పొడి చేసుకోవాలి), ఆవాలు– ఒక టీ స్పూన్, మినపపప్పు, శనగపప్పు– ఒక టేబుల్ స్పూన్ చొప్పున, నూనె, పల్లీలు– 3 టేబుల్ స్పూన్లు చొప్పున, బెల్లం కోరు– ఒక టీ స్పూన్, పసుపు– అర టీ స్పూన్, ఇంగువ– చిటికెడు, కరివేపాకు– 2 రెమ్మలు, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి కుకర్లో ఉడికించుకోవాలి. అన్నం మరీ మెత్తగా అవ్వకూడదు. ఈలోపు చింతపండును నీటిలో 10 నిమిషాలు నానబెట్టి, గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మిరియాలను నూనె లేకుండా వేయించి చల్లార్చి, మెత్తని పొడిలా చేసుకోవాలి. ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంతలో ఒక పాన్లో నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినపపప్పు, పల్లీలు వేసి వేగించాలి. అనంతరం అందులో తరిగిన పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిసేపు వేగించాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, బెల్లం తురుము, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నంలో తగినంత ఉప్పుతో పాటు ఈ చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా కలిపితే సరిపోతుంది.పనీర్ జిలేబీకావలసినవి: పనీర్ తురుము– 250 గ్రాములు, మైదా పిండి– ఒక కప్పుఏలకుల పొడి– అర టీస్పూన్, బేకింగ్ పౌడర్– పావు టీస్పూన్పంచదార– 2 కప్పులు, నీళ్లు– ఒక కప్పు (పాకం కోసం), నెయ్యి– సరిపడాపిస్తా, జీడిపప్పు ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా పనీర్ తురుమును బాగా మెత్తగా చేతితో నలుపుకోవాలి. ఇందులో ఎటువంటి గడ్డలు లేకుండా చూసుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో ఈ మెత్తని పనీర్, మైదా పిండి, ఏలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, జిలేబీ పిండి మాదిరిగా గట్టిగా, మందంగా ఉండేలా కలుపుకోవాలి. పిండి చాలా పల్చగా ఉండకూడదు. ఈ పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో పంచదార, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పంచదార కరిగి పాకం కొంచెం చిక్కబడిన తర్వాత, దానిని స్టవ్ నుంచి దింపెయ్యాలి. ఈలోపు ఒక వెడల్పాటి పా¯Œ లో నెయ్యి వేడి చేసుకోవాలి. జిలేబీ మేకర్లో మైదా మిశ్రమాన్ని నింపుకుని, నచ్చిన విధంగా నేతిలో జిలేబీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేడిగా ఉన్నçప్పుడే గోరువెచ్చగా ఉన్న పంచదార పాకంలో ముంచాలి. ఐదు లేదా పది నిమిషాలు పాకంలో జిలేబీలు మునిగేలా ఉంచి ఆ తర్వాత వాటిపైన జీడిపప్పు, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.కేసర్ పెడాకావలసినవి: పాల పొడి– 2 కప్పులు, నెయ్యి– 4 చెంచాలు, కండెన్స్డ్ మిల్క్– ఒక కప్పు, ఏలకుల పొడి– ఒక టీ స్పూన్, ఫుడ్ కలర్– కొద్దిగా, కొన్ని పిస్తా పప్పులు– గార్నిష్ కోసం, కుంకుమ పువ్వు– కొద్దిగా, (వెచ్చని పాలలో నానబెట్టుకోవాలి)తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న మంట మీద, ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి, గరిటెతో కలుపుతూనే పాల పొడి, కండెన్స్డ్ మిల్క్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు వడకట్టి, వాటిని వేసి బాగా కలిపి మళ్ళీ ఒక నిమిషం పాటు స్టవ్ మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాసేపు స్టవ్ మీద నుంచి గిన్నె పక్కకు దించి గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా స్టవ్ మీద కాసేపు మామూలుగా కాసేపు గరిటెతో కలిపితే ఆ మిశ్రమం పాత్రకు అంటకుండా ముద్దలా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని 15 నుంచి 20 నిమిషాలు చల్లారనివ్వాలి. అనంతరం 15 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచాలి. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, దాన్ని మృదువుగా చేసుకోవాలి. అనంతరం పిస్తా పప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: రుచి.. శుచి... వెంకన్న నైవేద్యం) -
హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..
కొన్నిసార్లు సైన్స్ కన్నా, కవిత్వమే ఎక్కువ లాజికల్గా అనిపిస్తుంది! అందుకు ఒక ఉదాహరణ... బహుముఖసృజనశీలి అయిన ఇటాలియన్ చిత్రకారుడు, ఇంజినీరు లియోనార్డో డా విన్సీ నదుల్ని మానవ శరీరంలోని ధమనులు, సిరలతో పోల్చటం! నదులు, ఉపనదులు భూగోళానికిజీవ ప్రవాహ నాళాలు అని వాటి ప్రాముఖ్యాన్ని ఈ ఒక్కమాటతోచక్కగా అర్థం చేయించారు డా విన్సీ. 51 కోట్ల, 72 వేల చ.కి. మీ. విస్తీర్ణంలో ఉన్న మన భూమిపై లక్షన్నరకు పైగా నదులు ఉన్నాయని ఒకఅంచనా. ఈ నదుల ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేందుకని గత ఇరవై ఏళ్లుగా ఏటా మనం సెప్టెంబరు నాల్గవ ఆదివారాన్ని (నేడు)‘ప్రపంచనదుల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పురాణాల్లో, సాహిత్యంలో, సినీ గీతాల్లో ఉన్న నదుల మననాలు కొన్ని.. మీ కోసం! ప్రవాహమే నది రూపంనదుల గురించి అల మాత్రంగానైనా మాట్లాడుకోవటం అంటే మహా సముద్రంలో ఈత కొట్టటమే! మొదలు–తుది; అంతము– ఆరంభమూ లేని ప్రవాహం... సమస్త మానవాళి జీవితాన్ని పెనవేసుకుని ఉన్న ఈ నదీ ప్రస్థానం. గ్రీకు తత్వవేత్త హెరాహ్లిటస్ అన్న మాట ఈ నదీ ప్రస్థానానికి, నదీ ప్రస్తావనకు చక్కగా సరిపోతుంది. ‘‘ఒకే మనిషి ఒకే నదిలో రెండోసారి అడుగు పెట్టడు. ఎందుకంటే– ఆ నది ఒకేలా ఉండదు. ఆ మనిషీ ఒకేలా ఉండడు’’ అంటారాయన. అంటే ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనిషి కూడా నదీ ప్రవాహంలా ఒకేలా ఉండడు అని అంతరార్థం.సాగిపోయే జీవిత నౌకనదుల పోలికతో పాశ్చాత్యులవే మరికొన్ని అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి. లెబనీస్–అమెరికన్ కవి ఖలీల్ జిబ్రాన్ ఏమంటారో చూడండి, ‘‘నది వెళ్లి సముద్రంలో కలిసినట్లే జననం వెళ్లి మరణంలో కలుస్తుంద’’ట! ఇక దివంగత బ్రిటన్ రాజనీతిజ్ఞుడు ఎనోచ్ పావెల్, ‘‘నా ఓడ కనిపించకుండాపోతే, నా ప్రయాణం ముగిసిందని కాదు. నది వంపు తిరిగిందని..’’ అని అంటారు! ఎంత చక్కగా చెప్పారు. ‘కొండగాలి తిరిగింది’ అని ఆరుద్ర అన్నట్లు – కొండగాలి మాత్రమే కాదు, నది కూడా తిరుగుతుంది. ప్రాప్తమున్న తీరానికి జీవిత నౌక సాగిపోతుంది. ఇదీ ఆరుద్ర మాటే. వయ్యారి గోదారమ్మ..!ఒక అమ్మాయికి యుక్త వయస్సు అనేది విశాలమైన నది నుండి సముద్రంలోకి తేలుతున్నట్లుగా ఉంటుంది అంటారు జి.స్టాన్లీ హాల్. 19వ శతాబ్దపు మనో వైజ్ఞానిక నిపుణుడు ఈయన. నదిలా నూత్న యవ్వనం పరవళ్లు తొక్కుతుందని చెప్పటం స్టాన్లీ ఉద్దేశం. ‘వయ్యారి గోదారమ్మ ఒళ్లంత ఎందుకమ్మ కలవరం..’ అని వేటూరి అడిగిన ప్రశ్నకు స్టాన్లీ ఆల్రెడీ సమాధానం చెప్పేసే ఉంచారన్న మాట! అమెరికన్ సంగీతకారుడు జాన్ విలియమ్స్, నదిని సంగీతంలో పోల్చారు. ‘‘సంగీతంలో నేను ఎక్కువ తక్కువల్ని చూడను. సంగీతం అన్నది మనమందరం కప్పులతో ముంచుకుని తాగ గల అమృతవాహిని అయిన నది’’ అన్నారు విలియమ్స్. ఇళయ రాజా దృష్టిలో సంగీతం అంటే ఏ ఉద్దేశమూ లేనిది! ‘‘నది ప్రవాహంలా సంగీతం సహజంగా, ఉద్దేశరహితంగా ఉండాలి’’ అంటారు ఇళయరాజా.స్వర్గలోక వెండి ప్రవాహంప్రాచీన కాలపు చైనా దేశీయులు పాలపుంతను కూడా ఒక ప్రకాశవంతమైన నదిగానే ఊహించారు. ఆ నదిని స్వర్గంగా, ఆ ప్రవాహాన్ని వెండిగా భావించారు. బౌద్ధ దార్శనికుడైన ఆచార్య నాగార్జునుడు మానవ జీవితంలోని దుఃఖం గురించి మాట్లాడుతూ, ‘‘నదిలో కలిసి, కదిలే చెక్క దుంగలు ప్రతి అల చేత విడిపోతాయి. అనివార్యంగా అలా వేరు అవటం దుఃఖానికి కారణం కాకూడదు’’ అంటారు. ప్రసిద్ధ బ్రెజిల్ నవలా రచయిత పాలో కోయెలో మరికాస్త లోతుకు వెళ్లి, ‘‘మీరు నదిలో పడటం వల్ల మునిగిపోరు, కానీ దానిలో మునిగిపోవటం వల్ల మునిగిపోతారు’’ అంటారు. జీవితాన్ని భయంతో ఈదలేమని చెప్పటం కావచ్చు. ఇంగ్లిష్ నటి జూలీ ఆండ్రుస్ (89)కు నది వాసన అంటే ఇష్టం. నది సౌమ్యత ఇష్టం. ఆమె చిన్నతనం అంతా నదితోనే గడిచింది. నది ఆమెను ప్రశాంతపరచింది. ఆమెకు ఓదార్పునిచ్చింది. ఈ విషయాన్ని జూలీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. గంగా తీరాన రిషికేశ్హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్కు భారతదేశంలోని సాయంత్రాలు అంటే చాలా ఇష్టమట. ఎందుకు ఇష్టమో ఆయన మాటల్లోనే విందాం. ‘‘సూర్యుడు ప్రపంచం అంచుకు చేరుకుంటాడు. శబ్దాలు అస్తమిస్తుంటాయి. పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సైకిళ్లపై నదీ ప్రవాహంలా ఇంటికి చేరుకుని, శ్రీకృష్ణుడి గురించి, జీవన వ్యయం గురించి ఆలోచిస్తూ ఉండే మాయా క్షణాలవి’’ అంటాడు కామెరాన్. సైకిళ్లపై ఒక ఒరవడిగా వెళ్లే శ్రామికులను ఆయన ఒక నదీ ప్రవాహంగా ఊహించుకున్నారు. మైకేల్ ఎడ్వర్డ్ లవ్ కూడా భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. ఆ గొప్పకు కారణం గంగా నది. మైకేల్ అమెరికన్ సింగర్, సాంగ్రైటర్. ‘‘1968 వసంతకాలంలో, ‘ది బీటిల్స్’ బ్యాండ్కు, నాకు మహర్షి మహేష్ యోగి నుండి భారతదేశంలోని రిషికేశ్కు రమ్మని ఆహ్వానం అందింది. రిషికేశ్ అనేక సంవత్సరాలుగా లక్షలాది మందికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది హిమాలయాల నుండి గంగా నది ప్రవహించే ప్రదేశంలో ఉంది. ఆ వాతావరణంలో ఉండటం చాలా ప్రత్యేకమైనది’’ అంటారు మైకేల్. పురుష నది.. బ్రహ్మపుత్ర!భారతీయ పురాణాలలో అనేక నదులు ప్రవహించాయి. అయితే అవి కేవలం భౌతిక ప్రవాహాలు కావు. దైవత్వం పొందినవి. దేవతలతో సమానంగా గౌరవాన్ని పొందినవి. పూజలను అందుకున్నవి. గంగా, యమునా, సరస్వతి, గోదావరి నదులను స్త్రీ దేవతలుగా పూజిస్తారు. ఆ పవిత్ర జలాలలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి పురుష నదులే లేవా? లేనట్లున్నాయి. బ్రహ్మపుత్ర నదిని మాత్రం ‘పురుష నది’గా పరిగణిస్తారు. మన నదులన్నీ కూడా రుగ్వేదం, మహాభారతం, రామాయణం వంటి పురాణ, ఇతిహాసాలలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. ‘గంగావతరణ’ ఘట్టందశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిందీ, శ్రీరాముడి అవతార పరిసమాప్తి అయిందీ ‘సరయూ’ సమీపంలోనే. రామాయణంలోని ‘గంగావతరణ’ ఘట్టం అయితే ఒక అద్భుతమైన చిత్రణ. సీతను వెదకి రమ్మని వానరులను పంపేటప్పుడు ఆమెను ఎక్కడెక్కడ వెతకాలో చెబుతూ శరావతి, కావేరి, తామ్రపర్ణి, నర్మద, కౌశికీ, యమునా నదులను ప్రస్తావిస్తాడు సుగ్రీవుడు. ఇక కవుల గురించి చెప్పక్కర్లేదు. నది ఊసు లేనిదే వారి కలాలు పరవళ్లు తొక్కవు. ‘కవుల కవిత్వంలో పొంగిన నదులు’ అంటూ రాజన్ పి.టి.ఎస్.కె. అనే రచయిత తెలుగులో ఒక పుస్తకమే రాశారు. కృష్ణవేణి.. విరిబోణి.. అలివేణినది పేరుతో అనేక తెలుగు నవలలు, కథలు వచ్చాయి. అదొక అంతే లేని జాబితా. అలాగే తెలుగు సినిమా పాటలు వందలు, వేలు! పూర్తిగా ఒక నదిపైనే వచ్చిన పాట మాత్రం బహుశా డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణి / కృష్ణవేణి నా ఇంటి అలివేణి’ కావచ్చు. ఆ పాటలో కృష్ణానది విశేషాలన్నిటినీ సినారె పొందుపర1చారు. భక్తిగీతంలా మొదలై పరవళ్లు తొక్కుతూ వెళ్లి సాగర హృదయాన సంగమిస్తుంది. ఈ పాట ‘కృష్ణవేణి’ (1974) చిత్రం లోనిది.వేదంలా ఘోషించే గోదావరికృష్ణవేణికి దీటైన ఇంకో తెలుగు సినిమా పాట.. ‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి’. 1983 నాటి ‘ఆంధ్ర కేసరి’ సినిమా కోసం ఆరుద్ర ఈ పాటను రాశారు. అయితే ఆ పాట పూర్తిగా గోదావరి విశేషాల మీద కాకుండా, గోదావరికి అనుసంధానమై ఉన్న సుందర నగరాలు, కవులు–కావ్యాలు, ఏలిన రాజులు మీద సాగుతుంది. గోదావరి మీదే వేటూరి గారు రాసిన పాట ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’. ఇంకా.. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందీ’ (ఆత్రేయ–‘చక్రవాకం’), ‘నవ్వుల నదిలో పువ్వుల పడవ’ (ఆరుద్ర–‘మర్మయోగి’), ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ’ (శేషేంద్ర శర్మ–‘ముత్యాల ముగ్గు’) ‘చినుకులా రాలి.. నదులుగా సాగి’ (వేటూరి–నాలుగు స్తంభాలాట), ‘గోదారి గట్టుంది.. గట్టు మీద సెట్టుంది..’ (దాశరథి కృష్ణమాచార్య–‘మూగ మనసులు’)... వంటి పాటలు పూర్తిగా నది చుట్టూ తిరిగినవి కాకపోయినా, దోసెడు నది నీళ్లను పట్టి ప్రేక్షకుల తలపులపై చిలకరించినవి. నదులపై మంచి మంచి సినిమా పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి కొన్ని రేణువులు మాత్రమే. నదులు కేవలం నీళ్లు కాదు, కేవలం ప్రవాహాలు కాదు, కేవలం ప్రయాణ మార్గాలు అంతకన్నా కాదు. మనిషిని బతికించే సంజీవినులు మాత్రమే కాదు. డా విన్సీ అన్నట్లు – భూగోళానికే జీవాన్ని, చేవను ఇచ్చే సిరలు, ధమనులు.శ్రీశ్రీ అనుసంధానం!‘మరో ప్రపంచం’ (1970) సినిమాలో శ్రీశ్రీ ‘అణగారిన బ్రతుకులలో..’ అనే పాట రాశారు. అందులోని ఒక చరణంలో... ‘గంగా, కావేరీ – నదులను కలుపుదాం..’ అన్నారు ఆయన. ఆ చరణం ఇలా ఉంటుంది : ‘ఈ దేశం నీదీ నాదని / ఇది ఒక్కరికే సొంతం కాదని / గంగా, కావేరి నదులు కలుపుదాం / కలిపి, సరిహద్దు చెరిపి, చెలిమి నిలుపుదాం..’ అని. యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1972లో అప్పటి కేంద్ర మంత్రి కె.ఎల్.రావు గంగ–కావేరి నదులను అనుసంధానించాలని ప్రతిపాదించారు. అంటే, శ్రీశ్రీ తన పాట ద్వారా అంతకు రెండేళ్లకు ముందే గంగ, కావేరీలను అనుసంధానించారు! అందుకే, సృజనశీలులను కాలజ్ఞానులు అని కూడా అంటారు. నదుల అనుసంధానం గురించి 1974లో కెప్టెన్ దిన్షా జె.దస్తూర్ మరో ప్రతిపాదన తెచ్చారు. హిమాలయ నదులైన గంగ, సింధు, బ్రహ్మపుత్రలను... ద్వీపకల్ప నదులైన గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, నర్మద, తపతి, పంబ వంటి వాటితో కలపొచ్చని! ఆ తర్వాత కేంద్ర జల వనరుల శాఖ ఇంకో ప్రతిపాదన తెచ్చింది. ఇవేవీ ఆచరణకు రాలేదు. సాక్షి, స్పెషల్ డెస్క్ -
మస్క్ కుమార్తె వద్ద డబ్బు లేదంటా..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కుమార్తె అంటే వెంటనే గుర్తొచ్చేది.. ఆమె విలాసాలు, లగ్జరీ కార్లు, హంగులు, ఆర్భాటాలు, పార్టీలు.. కానీ అలాంటివేవీ లేకుండా ముగ్గురు స్నేహితులతో ఓ చిన్న అపార్ట్మెంట్లో కాలం వెళ్లదీస్తున్నారు వివియన్ జెన్నా విల్సన్. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్మస్క్ కుమార్తె జెన్నా విల్సన్(జేవియర్ మస్క్) ఇటీవల న్యూయార్క్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఇంటర్వ్యూలో జెన్నా విల్సన్(21) తెలిపిన వివరాల ప్రకారం..‘నా వద్ద వందలు, వేల డాలర్లు లేవు. లాస్ ఏంజిల్స్లోని ఒక షేరింగ్ అపార్ట్మెంట్లో ముగ్గురు రూమ్మేట్స్తో ఉంటున్నాను. ఈ పరిస్థితులను నేను భరించగలను. నాకు జన్మనిచ్చిన తండ్రితో ఏ విధంగానూ సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడను’ అని చెప్పుకొచ్చారు. విల్సన్ 16 ఏళ్ల వయస్సులో ట్రాన్స్జెండర్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. 2022లో చట్టబద్ధంగా తన పేరును, జెండర్ను మార్చుకుంది. ఈ సందర్భంగా కోర్టు ద్వారా తన తండ్రితో బహిరంగంగా సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగానే ఉంటోంది.ఎవరి సాయం అవసరం లేదు..కోర్టు ద్వారా తండ్రి, కుటుంబం నుంచి విడిపోతున్న సమయంలో మస్క్ నుంచి లభించే ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని ఆమె తిరస్కరించారు. తనను తాను పోషించుకోవడానికి సరళంగా జీవించేందుకు ఎవరి సహాయం అవసరం లేదని తేల్చిచెప్పారు. మస్క్ భార్యలకు పుట్టినవారిలో వివియన్ తొలి సంతానం.ఇదీ చదవండి: సమస్యగా కాదు... సదవకాశంగా చూద్దాం! -
ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను!
నా వయసు 32 సంవత్సరాలు. నేను ఒక ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాను. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు పని ఉంటుంది. ఇంటికి వచ్చాక వంట, పిల్లాడి హోంవర్కు, ఇల్లు చూసుకోవడం అన్నీ నామీదే పడతాయి. నా భర్త కూడా ఇంకో ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగి. ఇంటి పనుల్లో అసలు సహాయం చేయడు. దీనివల్ల నాకు ఎప్పుడూ అలసటగా, చిరాకుగా అనిపిస్తుంటుంది. దీనికితోడు నాభర్త, అత్తమామలు ఇప్పుడు ఇంకో బిడ్డ కావాలని ఒత్తిడి చేస్తున్నారు. బ్యాంక్ పనిలో వత్తిడి, అత్త మామల విమర్శలు, భర్త సపోర్ట్ లేకపోవడం... ఇలా వీటన్నిటి మధ్య చాలా అశాంతికి లోనవుతున్నాను. మీరే ఏదైనా మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను. – దీపిక, నిజామాబాద్ మీది మన సమాజంలో చాలామంది మహిళలు ఎదుర్కొనే పరిస్థితే! పని, ఇల్లు రెండూ ఒంటరిగా మేనేజ్ చేయడం వల్ల అలసట, చిరాకు రావడం సహజం. అందుకే ముందుగా మీ భర్తతో ఓపిగ్గా మాట్లాడి అతను కూడా ఇంటి పనులు పంచుకోవడం అవసరమని చెప్పండి. చిన్న చిన్న పనులలో అయినా సరే అతను చేసే సహాయం మీ అలసటను తగ్గించడమే కాకుండా మీ మధ్య బంధాన్ని మరింత దృఢం చేస్తుందని అతనికి అర్థం అయ్యేలా వివరించండి. మీ అత్తమామలు, భర్త, ఇంకో పిల్లాడు కావాలని వత్తిడి తెస్తున్నారని చెప్పారు. పిల్లల విషయం అనేది మీరు, మీ భర్త కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప మీ అత్తమామలు నిర్ణయించే విషయం కాదని మీ ఆయనకి నచ్చ చెప్పండి. మీరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా సిద్దం కాకతే కేవలం వాళ్ళ వత్తిడి మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కాలం మీ అత్త మామలని మీ ఇంట్లోనే ఉండమని మీ బాబును చూసుకోవడంలో, ఇంట్లో పనుల్లో సహాయం చేయమని అడగండి. వాళ్ళు అందుకు ఒప్పుకుంటే అప్పుడు రెండో పిల్లాడి గురించి ఆలోచించవచ్చు. ఉద్యోగం, కుటుంబం రెండూ కలిపి నడపడం కష్టం అయినా, అసాధ్యం అయితే కాదు! ఇంట్లో పనుల కోసం పని వాళ్ళని ఏర్పాటు చేసుకోండి. ఆఫీస్ లో కూడా అన్ని పనులు మీ నెత్తిమీద వేసుకోకుండా మిగిలిన మీ వారికి కూడా డెలిగేట్ చేయడం నేర్చుకోండి. అలాగే మీకోసం రోజుకు కొంచెం సమయం కేటాయించండి.. కాసేపు నడక, ధ్యానం, సంగీతం, లేదా మీకు ఇష్టమైన పనులు చేస్తూ రిలాక్స్ అవ్వండి. వర్క్, పర్సనల్, ఫ్యామిలీ లైఫ్ను, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే, మీ వత్తిడి క్రమేణా తగ్గుతుంది. కావాలంటే మీ దంపతులు ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఒకసారి కౌన్సెలింగ్కి వెళ్తే కౌన్సిలర్స్ మీకు సరైన నిర్ణయం తీసుకునేందుకు సహాయం చేస్తారు. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: డిప్యూటీ కలెక్టర్గా స్విగ్గీ డెలివరీ బాయ్..! తండ్రి మేస్త్రీ, డ్రీమ్ ఆకాశమంత..) -
అగరుబత్తీలు వెలిగించడం..సిగరెట్లు కాల్చడం లాంటిదా..?
భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంటూ టీవీలో వచ్చే అగరుబత్తీల యాడ్లు మనల్ని ఎంతలా ప్రేరేపిస్తాయంటే..అవి తెచ్చుకున్న వెంటనే ఉపయోగించాలనే ఆత్రుతను పెంచేస్తాయి. అదీగాక వాటి గుబాళింపు మనకు దేవాలయంలో ఉన్న అనుభూతిని అందిస్తాయి. పైగా ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ప్లేవర్ల అగరుబత్తీలు వచ్చేశాయి కూడా. ముఖ్యంగా భారతీయ గృహాల్లో ఇవి తప్పనిసరిగా ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక ఆనందాన్ని, మానసిక స్వాంతనను అందించడంలో ముందుంటాయి. అలాంటి అగరబత్తీలు వెలిగించడం, అచ్చం సిగరెట్లు కాల్చడం లాంటి అనారోగ్యానికి దారితీస్తుందా..?.ఔనని చెబుతున్నారు వైద్య నిపుణులు. సిగరెట్లు ఏవిధంగా ఊపిరితిత్తులకు హానికరమో అలానే అగరుబత్తీలు కూడా ప్రమాదమని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.ఇవి ఊపరితిత్తులకు ఎలా హానికరమో డెహ్రాడూన్కి చెందిన పల్మోనాలజిస్ట్ డాక్టర్ సోనియా గోయెల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ అగరుబత్తీలు ఊపిరితిత్తులకు హాని కలిగించే కాలుష్య కారకాలను విడుదల చేస్తాయని, అవి అచ్చం పొగాకు మాదిరిగా ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. వీటి నుంచి వచ్చే పొగ ఊపరితిత్తులకు నెమ్మది నెమ్మదిగా విషంలా మారుతుందని అన్నారు. ఏవిధంగా అంటే..అగర్బత్తీలు సూక్ష్మ కణ పదార్థం (PM2.5), కార్బన్ మోనాక్సైడ్, అస్థిర సేంద్రీయ సమ్మేళనాలను విడుదల చేస్తుందని చెప్పుకొచ్చారామె. ఈ కాలుష్య కారకాలు మన ఇండోర్ గాలిని కలుషితం చేస్తాయని, ముఖ్యంగా మూసి ఉన్న ప్రదేశాల్లో శ్వాస తీసుకోవడం సురక్షితం కాదని తెలిపారామె. అంతేగాదు ఒక అగరబత్తిని ాకాల్చడం అంటే ఒక సిగరెట్ని కాల్చినంత ప్రమాదమని సోనియా అన్నారు. అంటే ధూమపాన అలవాటు లేకపోయినా..ఈ విధంగా పొగాకు సంబంధింత అనారోగ్యాల బారినపడతామని వెల్లడించారు.అధిక ప్రమాదం ఎవరికంటే..పిల్లలు, వృద్ధ కుటుంబ సభ్యులు, ఉబ్బసం లేదా ఊపరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ అగరబత్తులను కాల్చడం ప్రాణాంతకమవుతుందని అన్నారు. ఒక్కోసారి అలెర్జీలు, దీర్ఘకాలిక దగ్గు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తుతాయి. అలాగే సరైన వెంటిలేషన్ ఇంటిలో ఈ అగరబత్తీలు వెలిగిస్తే.. సంత్సరాల బడి ఆ పొగాకు బహిర్గతమైన ఆ ఇంటి సభ్యులకు బ్రోన్కైటిస్, ఉబ్బసం, COPD, ఊపరితిత్తుల కేన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని అన్నారు. సరైన వెంటిలేషన్ ఉన్న ఇంటిలో వీటని ఉపయోగించినట్లయితే సమస్య ఉండదని అన్నారు. అలాగే ఆ సమయంలో కిటికీలు, ఫ్యాన్లు ఆన్ చేయడం వంటివి నష్టాన్ని చాలామటుకు తగ్గిస్తాయని అన్నారు. ఇంటిలో చక్కటి గాలి ప్రవాహం ఉంటే ఎలాంటి సమస్య ఉండదని అన్నారామె. ప్రత్యామ్నాయాలు..ఈ అగరుబత్తీలు లేకుండా ఆచారాలు అసంపూర్ణం అనిపిస్తే..నూనె డిఫ్యూజర్లు, ఎలక్ట్రిక్ డయాలు ఉపయోగించండి. లేదా సహజ సూర్యకాంతి వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం వంటి వాటితో ఊరితిత్తుల సమస్యల బారిన పడకుండా ఉండటమే గాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందగలుగుతామని అన్నారు డాక్టర్ సోనియా. View this post on Instagram A post shared by Dr.Sonia Goel | Pulmonologist 🫁 (@dr.soniagoel) -
మీరు ఆట్రోవర్టా? యాంబివర్ట్కీ ఆట్రోవర్ట్కీ ఏంటి తేడా
అంతర్ముఖత్వం.. బహిర్ముఖత్వం.. ఈ రెండూ ఉండే ఉభయముఖత్వం.. మొత్తం ఈ మూడింటి గురించీ, ఈ తరహా వ్యక్తుల గురించీ అందరూ వినే ఉంటారు. సమాజంలో ఉండే వాళ్లంతా ఈ మూడు కేటగిరీల్లో ఏదో ఒక దాన్లో ఉంటారు అని అందరూ అనుకుంటారు. కానీ, కాదట. కొత్త తరహా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారట. ఈ వ్యక్తులకు ‘ఆట్రోవర్ట్’ అనే పేరును ఖరారు చేశారు అమెరికాకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రామి కమిన్స్కి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి మేధావులు ఈ కోవకు చెందుతారట. -సాక్షి నేషనల్ డెస్క్ లండన్కు చెందిన ప్రసిద్ధ సైన్స్ మ్యాగజైన్ ‘న్యూ సైంటిస్ట్’లో ప్రముఖ సైకియాట్రిస్ట్ రామి కమిన్స్కి ‘ఆట్రోవర్ట్’ గురించి ప్రస్తావించారు. అంతేకాదు, దీనిపై ఏకంగా ‘ద గిఫ్ట్ ఆఫ్ నాట్ బిలాంగింగ్’ అనే పుస్తకమే రాశారు. ‘మనలో కొంతమంది అంతర్ముఖులు ఉంటే, మరికొందరు బహిర్ముఖత్వంతో ఉంటారు. ఈ రెండు వ్యక్తిత్వ లక్షణాలూ ఉన్నవాళ్లూ ఉంటారు. కానీ, ఆట్రోవర్ట్లు అలా కాదు, వీరు చాలా ప్రత్యేకం’ అంటారు కమిన్స్కి.చదవండి: World Rose Day.. నేపథ్యం ఇదీ!ఈ మూడూ తెలిసినవేఇంట్రావర్టులు లేదా అంతర్ముఖులు.. నలుగురితో కలవడానికి ఇష్టపడరు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలాసేపు ఆలోచిస్తారు. బయటి వ్యక్తుల నుంచి ప్రేరణ పొందరు. తమకు తామే ప్రేరణ. ఎక్స్ట్రావర్టులు లేదా బహిర్ముఖులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. నలుగురితో కలివిడిగా ఉంటారు. ఎక్కువగా మాట్లాడతారు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. యాంబివర్ట్ లేదా ఉభయముఖత్వం ఉన్నవాళ్లు. ఈ రెండు లక్షణాలూ కలిసి ఉంటాయి. కొన్నిసార్లు ఒంటరితనాన్ని, మరికొన్నిసార్లు నలుగురితో కలవడాన్ని ఇష్టపడతారు.భిన్నమైన ఆలోచనా విధానం‘నలుగురికీ నచ్చినది.. నాకసలే ఇక నచ్చదులే’ అనే టైపు ఈ ఆట్రోవర్ట్లు. వీరు నలుగురూ ఆలోచించే పద్ధతికి భిన్నంగా, స్వతంత్రంగా ఆలోచిస్తారు.భావోద్వేగాల నియంత్రణ : ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరుల మీద ఆధారపడరు. తమ సమస్యను నలుగురిలో పెట్టరు. అలాగని ఒక్కళ్లూ కూర్చుని మథనమూ చేయరు. వ్యక్తిగతంగా తాము నమ్మినవాళ్లతో లోతుగా చర్చించి విశ్లేషణ చేయడానికి, సమస్య పరిష్కారానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు.ఏంటి తేడా? యాంబివర్ట్కీ ఆట్రోవర్ట్కీ ఏంటి తేడా అని చాలామందికి అనిపించ వచ్చు. చాలా తేడా ఉంది. సమయం, సందర్భాన్ని బట్టి యాంబివర్ట్లు అంతర్ముఖులుగానో, బహిర్ముఖులుగానో ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు నలుగురితో కలిసినప్పుడు చురుగ్గా ఉంటే.. కొన్నిసార్లు ఎవ్వరూ లేకపోయినా ఉత్సాహంగా పనిచేసుకుపోతారు. కానీ ఆట్రోవర్ట్లు అలాకాదు. సమయం, సందర్భం బట్టి మారిపోయే వ్యక్తిత్వం కాదు వీళ్లది.సామాజిక సంబంధాలు : వీళ్లు పార్టీల వంటి వేడుకలకు హాజరవుతారు. కానీ, అందరి దగ్గరకూ వెళ్లిపోరు. వచ్చిన ప్రతి ఒక్కరితోనూ అంత వేగంగా కలిసిపోరు. వ్యక్తులను అంచనావేసి, కొద్దిమందితోనే మాట్లాడతారు.ఏదో ఒక సమూహానికి చెందిన వ్యక్తులుగా ముద్ర వేయించుకోవడానికంటే వ్యక్తిగత సంబంధాలు, పనితీరును ఇష్టపడతారు.వ్యక్తులతో సంభాషణల్లో పాలుపంచుకోవడానికంటే వాటిని పరిశీలించడానికి ఆసక్తి చూపుతారు.సమూహంలో ఉంటేనే మెదడు యాక్టివ్గా పనిచేయడం, శక్తిని పొందడం ఉండదు.నాయకత్వ లక్షణాలుస్థిరత్వం, ధైర్యానికి వీరు ప్రతీకలు. ఎలాంటి దెబ్బ తగిలినా లేదా సమస్య వచ్చి కిందపడినా తమంతట తామే తొందరగా పైకి లేవగలరు.వీళ్ల దృష్టిలో నాయకత్వం అంటే అజమాయిషీ కాదు. ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఎదుటివారి పరిస్థితినీ అర్థం చేసుకుంటారు.బలమైన, నమ్మకమైన బంధాలుప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్ వంటి వాళ్లు ఈ ఆట్రోవర్ట్ వ్యక్తిత్వం ఉన్నవాళ్లు. వీళ్లు స్వతంత్ర భావాలతో ఉంటారు. సృజనాత్మకత వీరి సొంతం. సంప్రదాయ ధోరణిలో పోరు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలరు. నా దగ్గరకు వచ్చే వారిలో ఇంట్రావర్ట్లు, ఎక్స్ట్రావర్ట్లు, యాంబివర్ట్లు.. ఈ మూడు రకాల వ్యక్తిత్వాలూ కానివారిని నేను గమనించాను. వీళ్ల దృష్టిలో ఎక్కువమందితో సంబంధాలు ముఖ్యం కాదు. ఉన్నవి కొన్నయినా.. అవి బలంగా, నమ్మకంగా ఉండేలా చూసుకుంటారు. సామాజిక సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఎలాంటి పరిస్థితులనైనా ఇట్టే ఆకళింపు చేసుకుంటారు. తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు, ఎదుటివారి భావోద్వేగాలనూ అర్థం చేసుకోవడం వీరి ప్రత్యేకత. – రామి కమిన్స్కి, సైకియాట్రిస్ట్ -
కార్చే కన్నీరు సైతం... క్వాలిటీ కోల్పోతోంది...
నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తాయి ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసుకో అన్నారో సినీకవి. అయితే నగరవాసుల కంట్లో నీరున్నా...ఆ కన్నీరెనకాల క్వాలిటీ సున్నా అంటున్నారు నేత్ర వైద్యులు. అదేంటీ నవ్వలేక ఏడుస్తుంటే అందులో నాణ్యత కూడా ఉండాలా? అంటే...అవును ఉండాల్సిందే అని వైద్యులు అంటున్నారు. నవ్వే మనిషిని చూసి శభాష్ అంటాం...ఏడ్చే మనిషిని చూసి పాపం అనుకుంటాం... మానవ శరీరంలో కలిగే ప్రతీ మార్పూ భావోద్వేగాల ప్రతిరూపమే. మనం మంచిదని, చెడ్డదని మరొకటని అనుకున్నా..అవన్నీ మనకు అవసరమైనవే... అప్రధానం కానివే... ఈ నేపధ్యంలోనే కొన్ని రకాల భావోద్వేగాల ఫలితంగా పుట్టే కన్నీరు కూడా చాలా ముఖ్యమైనదే. అంత ముఖ్యమైన కన్నీటిలో ఇప్పుడు నాణ్యత లోపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలే దీనికి కారణమని స్పష్టం చేస్తున్నారు.టియర్స్...వండర్స్...ఆపుకోలేక ఏడుస్తామేమో గానీ ఎవరూ చూడకూడదనుకుని తుడిచేస్తాం...ఎవరైనా చూస్తే సిగ్గుపడతాం.. కానీ తేలిగ్గా తీసుకోవద్దు... కన్నీటి తయారీ వెనుక పెద్ద తతంగమే ఉంది. కన్నీళ్లు కంటిలోపలి మూడు పొరల నుంచి తయారవుతాయి. అందులో బయట ఉండేది ఆయిలీ పొర, మధ్యలో ఉండేది నీటి పొర, లోపల ఉండే మ్యూకస్ పొర...ఈ మూడింటిని కలిపి టియర్ ఫిల్మ్గా పేర్కొంటారు. కంట్లో ఉబికే కన్నీరు ఈ 3 పొరలు సక్రమంగా పనిచేసినప్పుడే ఆరోగ్యకరంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కపొర దెబ్బతిన్నా కన్నీరు నాణ్యత కోల్పోతుంది.పొరను కాటేస్తున్న తెర...కంటి నీటి క్వాలిటిని దెబ్బతీస్తున్నవాటిలో స్క్రీన్ టైమ్ ప్రధానమైంది. కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ లేదా మొబైల్... ఏదైనా సరే అతిగా అదే పనిగా చూడడం వల్ల కళ్లు పొడిబారుతాయి అనేది తెలిసిందే.. కళ్లు పొడిబారడం వల్ల వచ్చే సమస్యే కన్నీటి క్వాలిటీని దెబ్బ తీస్తోంది. అందుకే కళ్లు ఎర్రబారినా ఇంకే సమస్య వచ్చినా తొలుత కన్నీటి నాణ్యతను కూడా పరీక్షిస్తారు. స్కాన్ చేసి టియర్ క్వాలిటీని నిర్ధారిస్తారు. ఈ సమస్య పరిష్కారంగా లిపి ఫ్లో ట్రీట్మెంట్ వంటివి చేస్తారు తద్వారా కంటి నీటి క్వాలిటీ పెరుగుతుంది. కన్నీటి క్వాలిటీ తగ్గినప్పుడు నీటిలో ఉప్పు శాతం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. దాన్ని శరీరం అంగీకరించదు. దాని వల్ల కళ్లు మరింత ఎర్రబారడం...వంటి సమస్యలు వస్తాయి. లాక్రిమల్ గ్రంథి అనుబంధ గ్రంథుల పనిచేయకపోవడం వల్ల తగినంత కన్నీటి ఉత్పత్తి సైతం జరగదు.కన్నీటి క్వాలిటీ కోసం...టియర్ ఫిల్మ్ క్వాలిటీ తగ్గడం అనేది గతంలో పెద్ద వయసు లక్షణంగా భావంచేవాళ్లం. అయితే వయసులకు అతీతంగా ప్రస్తుతం సిటిజనుల్లో చాలా మందిలో కనపడుతున్న సమస్య. దీని చికిత్సలో భాగంగా స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా కళ్లు శుభ్రం చేసుకోవడం, గోరువెచ్చని నీటితో కంటిపై కాపడం పెట్టుకోవడం...వంటి చిట్కాలతో పాటు కొన్ని మందులు కూడా పనిచేస్తాయి. మరికొన్ని జాగ్రత్తలు...తగినంత నీరు తాగుతుండాలి..కంప్యూటర్స్, మొబైల్స్ తదితర డిజిటల్ స్క్రీన్స్ను చూస్తున్నప్పుడు తరచుగా కనురెప్పలు మూసి తెరుస్తుండాలి.ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ మిషన్లులతో పాటు కంటిని పొడిబార్చే గాలులకు దూరంగా ఉండాలి.కన్నీటి ఉత్పత్తిని పెంచేందుకు తరచుగా సుతిమెత్తని వెచ్చని ఒత్తిడి వాటిపై కలిగిస్తుండాలి.ఒమెగా–3 పుష్కలంగా కలిగి ఉన్న వాల్నట్స్, సాల్మన్ చేప, ఫ్లాక్స్ సీడ్స్ ఆహారంలో జత చేయాలి.కళ్లను సున్నితంగా మాత్రమే తాకాలి..కార్నియాకు ఒత్తిడి కలిగించేలా రఫ్గా, తరచుగా నులమడం వంటివి చేయకూడదు.రోజుకి తగినంత అంటే 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.స్మోకింగ్, ఆల్కహాల్ వినియోగం కన్నీటి ఉత్పత్తిని దెబ్బతీయడంతో పాటు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి.కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం వల్ల పొడి కన్నీటి పొర ఉన్న రోగులలో దృష్టి నాణ్యత కాంట్రాస్ట్ సున్నితత్వం మెరుగుపడతాయి,అధునాతన నాన్–ఇన్వాసివ్ టియర్ ఫిల్మ్ ఇమేజర్స్ వంటి కొత్త సాంకేతికతలు, కన్నీటి పొర సబ్లేయర్ల వివరణాత్మక దృశ్యాన్ని అందిస్తాయి, నేత్ర వైద్యులు పరిస్థితిని నిర్ధారించడానికి పర్యవేక్షించడంలో సహాయపడతాయి.కన్నీరు కూడా విలువైనదే...తప్పకుండా ఉండాల్సిన శరీరధర్మాల్లో కన్నీరు కూడా ఒకటి. ఆ కన్నీరులో కూడా విభిన్న రకాలు మిళితమై ఉంటాయి. కంటి పనితీరు బాగుండడానికి అవన్నీ నాణ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. వాటి నాణ్యత లోపం ఏర్పడినప్పుడు తప్పకుండా కంటి పనితీరు కూడా దెబ్బతింటుంది. సో.. చాలా సార్లు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడంలో భాగంగా కన్నీరు కూడా పరీక్షించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి కృత్రిమ మార్గాల ద్వారా కూడా కన్నీటిని రప్పించి మరీ నాణ్యతా పరీక్షలు జరుపుతాం. పరీక్ష ఫలితాన్ని బట్టి కంటి సమస్యల పరిష్కారానికి చికిత్స అందిస్తాం.–డా.రూపక్కుమార్ రెడ్డి, నేత్రవైద్య నిపుణులు(చదవండి: యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం) -
ఏటా రూ.120 కోట్ల పెట్టుబడులు
ఫ్యాషన్ దుస్తులు తదితర ఉత్పత్తుల విక్రయ సంస్థ లైఫ్స్టయిల్ ఇంటర్నేషనల్ తమ కార్యకలాపాల విస్తరణపై ఏటా రూ. 100–120 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 స్టోర్స్ ప్రారంభిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా సుమారు 125 స్టోర్స్ ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో 14 ఉన్నాయి. శుక్రవారమిక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ సీఈవో దేవ్ అయ్యర్ ఈ విషయాలు తెలిపారు.తమ ఆదాయాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 11–12 శాతం ఉంటుందని ఆయన చెప్పారు. జీఎస్టీలో మార్పులతో ధరలపరంగా 6–8 శాతం మేర ప్రభావం ఉంటుందని అయ్యర్ చెప్పారు. జీఎస్టీ సంస్కరణలతో దేశీయంగా వినియోగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, డిజిటల్, కొత్త స్టోర్స్, ప్రైవేట్ బ్రాండ్లు మొదలైన అయిదు అంశాలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యాపారంలో సుమారు ఆరు శాతంగా ఉన్న డిజిటల్ వాటాను వచ్చే ఏడాది, రెండేళ్లలో 10–12 శాతానికి పెంచుకోనున్నామని అయ్యర్ చెప్పారు.గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 5,000 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈసారి రెండంకెల స్థాయి వృద్ధి అంచనా వేస్తున్నామన్నారు. ప్రధానంగా మెట్రోల్లో స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది 10–12 స్టోర్స్ ప్రారంభించనున్నామని అయ్యర్ వివరించారు. పండుగ సీజన్ సందర్భంగా లైఫ్స్టయిల్ ఎక్స్క్లూజివ్ దసరా కలెక్షన్ను సినీ నటి పూజా హెగ్డే ఆవిష్కరించారు.ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్! -
స్పేస్లో వ్యోమగాములు ఫిట్నెస్ను ఎలా నిర్వహిస్తారంటే..!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కాలుమోపి చరిత్ర సృష్టించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష వ్యాయామ పద్ధతుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మెక్రోగ్రావిటీలో శారీరక శ్రమ ఎంత ప్రధానమైనదో వివరించారు. వాళ్లు ఫిట్నెస్పై ఉంచే దృష్టి మొత్తం మిషన్ సక్సెస్కి అత్యంత కీలకమని చెప్పారు. అయితే ఇక్కడ భూమ్మీద ఉన్నట్లుగా జిమ్ సభ్యత్వం ఉండదు. అక్కడ చేసిన సౌలభ్యకరమైన పరికరాలతో చేసే ఛాన్సే ఉండదు. మరి ఎలా చేస్తారంటే..అలాంటప్పుడూ ప్రత్యేక శిక్షణతో కూడిన వ్యాయామాలను వ్యోమగాములు అనుసరిస్తారని చెబుతున్నారు శుభాంశు. జీరో గ్రావిటీలో చాలా రకాల శారీరక మార్పులు ఉంటాయి. శరీరం జీరో గురుత్వాకర్షణ వద్ద మొత్తం బాడీ బద్ధకంగా ఉంటుందట. కండరాలు కుచించుకుపోయి, ఎముకలు బలహీనంగా అయిపోతాయట. దాంతోపాటు శరీరంలోని శక్తి కూడా సహకరించేందుకు ఇష్టపడదట. మన కార్డియో, బలం రెండూ దెబ్బతింటాయట. అందువల్ల అంతరిక్షంలో వ్యాయామం అనేది ఒక ఆప్షన్ కాదు. వ్యోమగాములకు అది తప్పనిసరిగా చేయాల్సిన శారీరక శ్రమ. స్పేస్ బైక్..అందుకోసం స్పేస్ స్టేషన్లోని వ్యోమగాములు CEVIS (వైబ్రేషన్ ఐసోలేషన్ సిస్టమ్తో సైకిల్ ఎర్గోమీటర్) వంటి పరికరాలను ఉపయోగిస్తారని చెప్పారు శుభాంశు. ఇది ప్రాథమికంగా షాక్ అబ్జార్బర్కు బోల్ట్ చేయబడిన స్పేస్ బైక్ లాంటిదని అన్నారు. CEVIS వ్యవస్థ వ్యాయామం ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలను గ్రహిస్తుంది. ఫలితంగా అంతరిక్ష కేంద్రం అనాలోచిత కదలికలను నిరోధిస్తుంది. ఈ స్పేస్ బైక్లో సీటు ఉండదు ఎందుకంటే తేలుతున్నట్లు ఉంటుంది ాకాబట్టి ీసీటుతో పని ఉండదట. దానిపై కూర్చొన్న భంగిమలో పాదాలను లాక్ చేసి పెడలింగ్ చేస్తారట. అంతేగాదు పాదాలను పట్టీల సాయంతో నియంత్రణలో సురక్షితంగా ఉంచుకుంటారట. ఈ వ్యాయామం సమగ్ర హృదయనాళ వ్యవస్థను మెరుగ్గా ఉంచి, కండరాల క్షీణత, ఎముక సాంద్రత నష్టాన్ని నివారిస్తుందని చెప్పుకొచ్చారు వ్యోమగామి జీపీ కెప్టెన్. ఇక్కడ స్పేస్ వాతావరణానికి తగ్గట్టుగా ఫిట్నెస్ పరంగా "జీరో గ్రావిటీ, జీరో సాకులు." అని చమత్కరించారు శుభాంశు. చివరగా అంతరిక్షంలో జీవిత సవాళ్లకు అనుగుణంగా ఆరోగ్యంగా ఉండేలా పనితీరును నిర్వహించడానికి అంకితభావంతో కూడిన నిబద్ధత అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. (చదవండి: హ్యాట్సాఫ్ గుత్తా జ్వాలా..! అమ్మతనానికి ఆదర్శంగా..) -
ఫిష్ ఫ్యాషన్..!
చేపలను తలచుకోగానే చాలామందికి నోరూరే వంటకాలు గుర్తు రావడం సహజమే! కాని, ఇకపై న్యూ ఫ్యాషన్ గుర్తొస్తుంది. అదెలా అనుకుంటున్నారా? త్వరలోనే చేపల చర్మంతో తయారైన అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ సామగ్రి అందుబాటులోకి రానున్నాయి!అమెరికాలోని ‘కోస్టా డి పజారోస్’ అనే గ్రామానికి చేపల వేట ప్రధాన జీవనాధారం. ఈ గ్రామం పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉంది. ఈ గ్రామస్థులు చేపల వేటకు అనుసరించే ‘బాటమ్ ట్రాలింగ్’ పద్ధతి కారణంగా వీరిపై ఆంక్షలు మొదలయ్యాయి. బాటమ్ ట్రాలింగ్ అంటే పడవ అడుగుభాగంలో ఒక బరువైన వలను కట్టి, అన్ని రకాల చేపలను, సముద్ర జీవులను బయటికి లాగేస్తారు. ఈ పద్ధతి వల్ల సముద్ర ఆవాసాలు తీవ్రంగా దెబ్బతిని, సముద్ర జలాల్లోని జీవవైవిధ్యం నాశనం అవుతోంది. అందుకే ‘బాటమ్ ట్రాలింగ్’పై ఆంక్షలు పెరిగాయి. దీంతో ఆ గ్రామస్థులు ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యకలాపాలను అన్వేషించడం మొదలుపెట్టారు. అందులో భాగమే ఈ ఫిష్ ఫ్యాషన్!చేపల చర్మాన్ని ఉపయోగించి వినూత్న ఫ్యాషన్ ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ గ్రామస్థులు. చేపల చర్మాన్ని శుభ్రం చేసి, ఆకర్షణీయమైన తోలుగా మార్చి, దానితో చెవి పోగులు, నెక్లెస్లు, బ్యాగులు వంటి చాలా రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇది సరికొత్త ఫ్యాషన్గానే కాదు, స్థానికులకు జీవనోపాధిగా కూడా మారిపోయింది. ‘పీల్ మెరీనా’ అనే సహకార సంస్థ, స్థానిక మహిళలతో కలిసి చేపల చర్మాన్ని పలు ఉత్పత్తులుగా మారుస్తుంది. చేపల వేట ప్రధాన వృత్తిగా ఉన్న ఈ గ్రామస్థులు చేపల చర్మాన్ని పారవేయకుండా ఉపయోగించుకోవడం పర్యావరణానికి కూడా మేలు చేస్తోందంటున్నారు నిపుణులు. చేపల చర్మాన్ని తోలుగా మార్చే ప్రక్రియలో అనేక దశలుంటాయి. మొదట చేప చర్మాన్ని చేతులతో సున్నితంగా రుద్ది పొలుసులు, చర్మానికి అతుక్కున్న మాంసాన్ని తొలగిస్తారు. ఆ తరువాత, బట్టలు ఉతికినట్లు సబ్బుతో బాగా ఆ చర్మాన్ని కడుగుతారు. అనంతరం, గ్లిజరిన్, ఆల్కహాల్, సహజ రంగులను ఉపయోగించి ఆ చర్మానికి రంగులద్దుతారు. ఈ ప్రక్రియకు నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల పాటు ఆ చర్మాన్ని ఎండలో ఆరబెడతారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, చేప చర్మం మృదువుగా, బలమైన తోలులా మారుతుంది. అలాగే వాటికి చేపల వాసన పూర్తిగా పోతుంది.ఇలా తయారు చేసిన చేపతోలుతో తయారు చేసిన వాటిలో బటర్ఫ్లై ఆకారంలో ఉండే చెవిపోగుల జత ధర సుమారు ఏడు డాలర్లు పలుకుతోందంటే, ఈ ఫిష్ ఫ్యాషన్ గిరాకీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేప తోలుతో తయారు చేసిన ఈ ఉత్పత్తులను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయిస్తున్నారు. అంతేకాకుండా, పంటారెనాస్లోని చిన్న తరహా వస్త్ర ఉత్పత్తిదారులకు కూడా ఈ తోలును అందిస్తున్నారు. భవిష్యత్తులో బ్యాగులు, పర్సులు, షూలను కూడా తయారుచేయాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు.చేపల చర్మాన్ని తోలుగా మార్చే ఈ సంప్రదాయం కొత్తది కాదు. అలాస్కా నుంచి స్కాండినేవియా, ఆసియా వరకు అనేక స్థానిక మత్స్యకార తెగలు వేల సంవత్సరాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. ఆన్లైన్లో కూడా ఈ ఉత్పత్తుల అమ్మకం సాగుతోంది. కోస్టా రికా కూడా ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరించి, పర్యావరణ పరిరక్షణ ఉత్పత్తులను తయారుచేయడంలో ముందు వరుసలో నిలుస్తోంది. దీంతో అక్కడి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించడమే కాకుండా, వారి సృజనాత్మకతకు ఒక వేదిక దొరికింది. ఇంటి పనుల నుంచి బయటపడి, చక్కటి ఉపాధిని పొందుతున్న ఈ మహిళలు, తమ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో చూడాలని ఆశిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా చక్కని మార్గం. -
ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..!
పోటీలు అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది యువతే.. అండర్ 14, అండర్ 17.. ఇలా పలు విభాగాల్లో యువతకు పోటీలు నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే మరి వయసు మళ్లిన వారి పరిస్థితి ఏంటి? వారికేమీ ఆటలు ఉండవా? వారిలో ఎలాంటి ప్రతిభా ఉండదా? అంటే ఉంటుందనే చెబుతున్నారు ముంబయికి చెందిన ‘ఖ్యాల్’ నిర్వాహకులు. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసినా పెద్దగా పట్టించుకోము.. సరిగ్గా దీని కోసమే ఏర్పాటైన వేదికే ఖ్యాల్. అప్పటి వరకూ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగల బాధ్యతలతో తలమునకలై.. వయసు మళ్లిన తర్వాత తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకే ఖ్యాల్ ఏర్పాటు చేశారు. ఖ్యాల్ అంటే తమలోని సృజనాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించడానికి, మెరుగుపరచడానికి కల్పించే అవకాశం.. అంటున్నారు నిర్వాహకులు.. వయసు మళ్లిన వారు అంటే చాలా మందికి ఓ చులకన భావం.. వారు ఏమీ చేయలేరు.. సాధించలేరు.. మరి అలాంటి భావాన్ని చెరిపేశారు కొందరు ప్రముఖులు.. సాధించాలనే తపన ఉంటే వయసుతో పనేంటి అను నిరూపించారు. ‘హార్లాండ్ సాండర్స్ 62 సంవత్సరాల వయసులో కేఎఫ్సీని ప్రారంభించారు. ఫల్గుణి నాయర్ 49 సంవత్సరాల వయసులో నైకాను స్థాపించారు. హెన్రీ ఫోర్డ్ 45 సంవత్సరాల వయసులో మొదటి ఫోర్డ్ మోటార్ కారును ప్రజలకు పరిచయం చేశారు..’ ఇవన్నీ కథలు కావు విజయాలకు ప్రేరకాలు అంటారు ఖ్యాల్ నిర్వాహకులు హేమాన్షు జైన్, ప్రీతిష్ నెల్లెరి. యువత కోసమేనా కాంటెస్ట్స్?ఏ పోటీ చూసినా అండర్ 25, అండర్ 30 ఇలా యువత, మధ్యవయసు వారికోసమే ఉంటున్నాయి. కానీ సిసలైన జీవితం 50 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, ఆర్థిక స్థిరత్వం, జ్ఞానం, అభిరుచిని ఆస్వాదించే స్వేచ్ఛ అన్నీ ఉండేది అప్పుడే. వర్గీకరించబడేది వయసు మాత్రమే.. టాలెంట్ కాదు.. అందుకే ఖ్యాల్ 50 అబోవ్ 50ని ప్రారంభించింది. ఇందులో సింగర్ ఆఫ్ ది ఇయర్, చెఫ్ ఆఫ్ ది ఇయర్, మాస్టర్ గార్డెనర్ ఆఫ్ ది ఇయర్, పొయెట్ ఆఫ్ ది ఇయర్, క్రాస్ వర్డ్ చాంపియన్ ఆఫ్ ది ఇయర్... ఇలా ఏ రకమైన టాలెంట్ ఉన్నా సరే పాల్గొనేలా రూపొందించాం. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ పోటీ ప్రపంచానికి గుర్తు చేయనుంది.50 విభాగాల్లో 50మంది విజేతలు..వయసు 50 ఏళ్లు దాటిన దగ్గర నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్లోనో, ఆధ్యాతి్మక యాత్రల షెడ్యూల్ ఖరారులోనో బిజీగా ఉండే వారి ఆలోచనల్ని సమూలంగా మార్చడమే తమ ధ్యేయం అంటున్నారు ఈ కాంటెస్ట్స్ నిర్వాహకులు. ఫిఫ్టీ ప్లస్ వయసు వారి కోసం 50 అబోవ్ 50 పేరుతో ఏకంగా 50 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ దీనికి సంబంధించిన ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా గత నెలాఖరున నగరంలోనూ ఆడిషన్స్ నిర్వహించిన సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే..ఇకిగై.. భావనకు అనుగుణంగా..జపనీయుల దీర్ఘకాల, సంతోషకర జీవనానికి దోహదం చేస్తున్న ‘ఇకిగై’ కాన్సెప్ట్కు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ‘ఉద్యోగ విరమణ తర్వాత జీవితం పూర్తిగా కొత్తగా నిర్మించడం’ దీని లక్ష్యం. గత 2020లో స్థాపించిన మా ఖ్యాల్, సీనియర్ సిటిజన్లకు సబ్స్కిప్షన్ ప్రాతిపదికన సేవలను అందిస్తుంది. వారి శారీరక, మానసిక, భావోద్వేగ సామాజిక శ్రేయస్సును పరిరక్షిస్తుంది. మా యాప్కు మూడు మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ‘సీనియర్లు వివిధ రకాల కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడే ధోరణిని గమనించాం, ప్రోత్సహిస్తున్నాం, అంతిమంగా విభిన్న ఆసక్తులు కలిగిన సమూహాలను సృష్టించాలన్నదే మా తాపత్రయం.. అదే నేటి ఆడిషన్స్కు దారితీసింది. ఈవెంట్ జరిగే తీరిది.. 50 అబోవ్ 50 కోసం ఈ స్టార్టప్ ఆన్న్లైన్ వీడియో ఆడిషన్న్లను కూడా నిర్వహిస్తోంది. మే 1 నుంచి ప్రారంభమయ్యే పోటీల్లో హైదరాబాద్ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె, లక్నో, జైపూర్, కొచ్చి, ఇండోర్ వంటి 20 నగరాలు పాల్గొంటాయి. ఇందులో భాగంగా పోటీదారులను ఒకచోట చేర్చడానికి కారి్నవాల్ నిర్వహిస్తారు. సరదా నిండిన కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం వ్యక్తిగత ఆడిషన్స్ సైతం ఉంటాయి. వడపోత తర్వాత, ప్రతి విభాగం నుంచి టాప్–10 ఫైనలిస్టులను సంబంధిత కేటగిరీ నిపుణులు షార్ట్లిస్ట్ చేస్తారు. చివరకు ప్రతి కేటగిరీ కింద బెస్ట్ని ఎంపిక చేయడానికి పబ్లిక్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ జ్యూరీ సభ్యుల్లో ప్రముఖ ఇంద్రజాలికుడు నకుల్ షెనాయ్, రచయిత్రి గీతా రామానుజం, విజువల్ ఆర్టిస్ట్ సెల్వప్రకాష్ లక్ష్మణన్, కవి–ఎడిటర్ వినితా అగర్వాల్, కర్ణాటక న్యూమిస్మాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర మరుధర్ తదితరులు ఉన్నారు. ఖ్యాల్ విజేతలకు మొత్తం కలిపి రూ.1 కోటి నగదు బహుమతిని అందజేస్తారు. గ్రాండ్ ఫినాలే నవంబర్లో ముంబైలోని నెస్కో మైదానంలో జరుగుతుంది.నగరంలో ముగిసిన తొలి దశ ఆడిషన్స్.. నగరంలోని హిమాయత్నగర్లో ఇటీవలే ఈ పోటీ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. పదుల సంఖ్యలో హాజరైన అభ్యర్థులు తమ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా పరీక్షించారు. వీరిలో ఎంపికైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (చదవండి: మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..! ఓ ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ) -
మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..!
కలలకు ఆకాశమే హద్దు అనడానికి ఉదాహరణ డిజైనర్ సౌరభ్ పాండే. ఉత్తర్ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన అతని పేరు ఈరోజు ప్రపంచ ఫ్యాషన్ వేదికలపై వినిపిస్తోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు, తన కలలకోసం కష్టపడుతూ, పట్టుదలతో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ ప్రత్యేకతను చూపుతున్నాడు.స్కూల్ కెళ్లే సమయంలోనే సౌరభ్కి డ్రాయింగ్, డిజైన్స్ పై ప్రత్యేక ఆసక్తి. పాత బట్టలను కొత్తగా కట్ చేసి, రంగులు కలిపి, తన గ్రామంలోనే చిన్న చిన్న డిజైన్స్ చేస్తూ, ‘ఫ్యాషనః అంటే ఏంటి?’ అనే ప్రశ్నకు తన స్టైల్లో సమాధానం చెప్పేవాడు.సవాళ్లే అవకాశాలకు మార్గంఉన్న ఆ చిన్న ఊళ్లో అవకాశాలు లేవు. ఫ్యాషన్ కోర్సులు, స్టడీ మెటీరియల్, ఫ్యాబ్రిక్ అందనంత దూరంలో ఉన్నాయి. అయినా అతని కృషి ఆగలేదు. నీరసపడలేదు. పేపర్పైన స్కెచ్లు వేసి, సోషల్ మీడియాలో తన టాలెంట్ను ప్రదర్శించాడు. అదే అతనికి పెద్ద అవకాశాలు తెచ్పిపెట్టింది.అంతర్జాతీయ బ్రాండ్ల దృష్టిసౌరభ్ పనిని గమనించిన ప్రతిభావంతులు అతన్ని మొదట స్థానిక ఈవెంట్లలో ΄ాల్గొనమని ఆహ్వానించారు. అటు నుంచి 17 ఏళ్ళ వయసులో అతన్ని ముంబై వైపుగా నడిపించింది. ఆ మహా నగరంలో మనుగడ కష్టమే. ఒక చిన్న ఇల్లు లాంటి గదిలో తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉండేవాడు. ఇల్లు గడవడం కోసం ఒక మాల్లో 12 గంటలు షిఫ్టులో పనిచేస్తూ, రాత్రిళ్లు ఫ్యాషన్ డిజైన్లు గీస్తూ వాటిని సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను తన పరిస్థితుల కంటే పెద్ద లక్ష్యాన్ని చాలా ఏకాగ్రతతో నడిపించాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సౌరభ్ పనిని గమనించినప్పుడు అతని జీవితం గొప్ప మలుపు తిప్పింది. ఒక అవకాశం మరికొన్ని మార్గాలను చూపించింది. అక్కడి నుంచి అతని డిజైన్లు గూచీ, డియోర్, ప్రాడా వంటి ప్రపంచ లగ్జరీ బ్రాండ్ల దృష్టికి వచ్చాయి. ఇప్పుడు అతను ఈ ఫ్యాషన్ హౌస్లతో కలసి ప్రత్యేక కలెక్షన్లు రూపొందిస్తున్నాడు.స్టైల్ ప్రత్యేకతభారతీయ సంప్రదాయ బట్టల టెక్స్చర్స్కి ఆధునిక డిజైన్ల కలయిక, నేచురల్ కలర్స్, ఎకో–ఫ్రెండ్లీ ఫాబ్రిక్ల వాడకం, సింపుల్ కట్లు, గ్లోబల్ లుక్ .. ఈ ప్రత్యేకతలు అతన్ని అందరిలో ముందుంచుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీద అతని డిజైన్స్ ప్రదర్శించేంతగా వెళ్లింది. సోషల్ మీడియాలో అతని విచిత్రమైన వీడియోలకు ఎగతాళి చేసిన జనమే, ఆ తర్వాత అవే వీడియోలకు కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. తిరస్కరణ, ఎగతాళి నుండి ఇప్పుడు అతను కోట్లు సంపాదించేంతగా ఎదిగాడు. తన కథను తానే తిరగ రాసుకున్నాడు. అతన్ని సక్సెస్ గురించి అడిగితే ‘ఎవ్వరు ఏమనుకున్నా నేను నాలా ఉండటమే నాకు ఇష్టం. అదే నా నిజమైన ఫ్యాషన్ స్టేట్మెంట్’ అంటాడు. మారుమూల గ్రామాల యువతకు సౌరభ్ ఒక స్ఫూర్తి. ‘కల అంటే పెద్దది కావాలి. మన దగ్గర వనరులు లేకపోయినా, కష్టపడితే ప్రపంచమే మన దారికి రావచ్చు’ అని అతను చెప్పే సందేశం ప్రతి యువకుడిలో కొత్త ఆశను నింపుతోంది. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?)


