breaking news
Politics
-
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కీలక బాధ్యత అప్పగిస్తారా?సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు.రాజకీయ వర్గాల్లో ఉత్కంఠఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు! -
మేం కొత్తగా పెట్టిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత 22ఏ జాబితాలో పెట్టిన భూములేవీ లేవు. మేం అధికారంలోకి వచ్చాక ఈ జాబితాను కొత్తగా తయారు చేయలేదు. 1999లో ఘట్కేసర్ రైల్వే స్టేషన్ను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ జాబితా అవసరం వచ్చింది. అప్పటి నుంచి కొనసాగుతోంది. 2009లో కోర్టు ఆదేశానుసారం ఈ జాబితా తయారు చేశారు. 2009–15 వరకు ఈ జాబితాపై హైకోర్టులో రెండువేల కేసులు పడ్డాయి. ఆ సమయంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 22ఏ జాబితా భూములను ఐదు కేటగిరీల్లో వర్గీకరించాలని చెప్పింది. కానీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో 2017–25 వరకు హైకోర్టులో 28,611 కేసులు పడ్డాయి. దీంతో 45 రోజుల్లో ఈ జాబితా పబ్లిక్డొమైన్లో పెట్టాలని, కోర్టుకు కూడా కాపీ ఇవ్వాలని, అన్ని జిల్లాల్లో ఇవ్వాలని, 22ఏ జాబితా నుంచి భూములను తొలగించాలంటే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. దీంతో కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా డిసెంబర్ 3, 2025న ఈ జాబితాను పబ్లిక్ డొమైన్లో పెట్టాం. అయితే, తక్కువ సమయం ఉన్నందున జీవో 121, ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన సమయంలో ఏ భూములు ఈ జాబితాలో ఉన్నాయో వాటిని అప్డేట్ చేయకుండా అదే కాపీని అప్లోడ్ చేశాం. స్వార్థం, స్వలాభం కోసం చేసింది కాదు. తప్పు జరిగిన మాట వాస్తవం. దీనిపై నేను విచారం వ్యక్తం చేశాను. అయితే, యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుతున్నాం’ అని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. శనివారం అసెంబ్లీలో 22ఏ భూములపై స్వల్పకాలిక చర్చను పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడున్నర గంటల పాటు ప్రసంగించారు. చేయాల్సింది చేసి, కొల్లగొట్టాల్సింది కొల్లగొట్టి నంగనాచిల్లా మాట్లాడుతున్నారని, దొంగే పోలీసును దొంగా దొంగా అన్నట్టుగా బీఆర్ఎస్ వైఖరి ఉందని ధ్వజమెత్తారు. 47,400 ఎకరాలు తగ్గింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి 220 జాబితాలో 1,02,52,690 ఎకరాల భూమి ఉంటే, 2026 ఆగస్టు 31 నాటికి 1,02,05,250 ఎకరాలు ఉందని చెప్పారు. అంటే 47,400 ఎకరాలు తగ్గిందని, ఇంకా తాము లక్షల ఎకరాలు కొత్తగా ఈ జాబితాలో చేర్చింది ఎక్కడని నిలదీశారు. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 1,95,812 ఎకరాల వ్యవసాయేతర భూములు 22ఏ జాబితాలో ఉంటే ఇప్పుడు 1,94,543 ఎకరాలున్నాయని, దాదాపు 800 ఎకరాలు తగ్గితే తాము కొత్తగా ఏం చేరుస్తామని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రతి అంగుళం భూమికి కాగితాలున్నాయని, టీఎం–15 మాడ్యూల్ ద్వారా ప్రజల పట్టా భూములైన 23వేల ఎకరాలను వారికి ఇచ్చేశామని, జీవోలు, మెమోల లద్వారా మరో 20వేల ఎకరాలు ప్రజలకే ఇచ్చామన్నారు. అయితే, బీఆర్ఎస్ హయాంలో ఈ జాబితా నుంచి తొలగించిన 23వేల ఎకరాల భూమికి కాగితాల్లేవని కమిటీ చెప్పిందన్నారు. 22ఏ జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గాయని అనడంలో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఇక్కడ పలికే చిలుకలు మాత్రమే వేరని, కానీ పలుకులు మాత్రం ఒకటేనన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు, ఏలేటి మహేశ్వర్రెడ్డిలు ఒకే తరహాలో మాట్లాడిన మాటలను స్పీకర్ అనుమతితో సభకు వీడియో ద్వారా వినిపించారు. శకుని మామ చేసి ఉంటే.. ‘అగిపెట్టెల అబద్ధాల రావు, శకుని మామ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నారు. అప్పుడే వారు ఈ జాబితాను సరిచేసి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదు. వారు తెచ్చిన ధరణి కారణంగా ఎంతో మంది ఆత్మహత్యల పాలయ్యారు. ఇప్పుడేదో మాట్లాడుతున్నారు. మనిషి రక్తం మరిగిన పులి మళ్లీ మళ్లీ తిరిగినట్టు అధికారం కోసం దోచుకోవడం కోసం నోరు తెరిస్తే అబద్ధాలాడుతున్నారు. కానీ ఆ పులికి తెలియదు.. వచ్చి రేవంత్రెడ్డి అనే బోనులో పడతాడని. ముక్కుతాడు వేసి కట్టేస్తాడని తెలియదు. నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ రోడ్డెక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. 22ఏ జాబితాతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నప్పుడు పిల్లకాకులు అరవడమెందుకు? ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి మాట్లాడొచ్చు కదా? సలహాలు ఇవ్వచ్చు కదా? వసతులు, ఏర్పాట్లు కావాలి కానీ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు కనుచూపు మేరలో కనిపించవా? నువ్వున్నప్పుడు నేను మాట్లాడాలనే కోరిక అలానే మిగిలిపోయేట్టుంది’ అని పొంగులేటి చెప్పారు. మొహం చాటేయడం అలవాటే.. 22ఏ జాబితాలో ఉన్న భూములను చూపెట్టి పేదల కడుపుకొట్టారని, అందుకే సమాధానం చెప్పాల్సి వస్తుందని సభలో గందరగోళం సృష్టించి ప్లాన్ ప్రకారం పారిపోయారని పొంగులేటి అన్నారు. అయితే, చర్చకు మొహం చాటేయడం వారికి అలవాటేనని, సభ నుంచి వారు పారిపోయినా ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇప్పుడు 22ఏ జాబితా కారణంగా అక్కడక్కడా ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అని, కానీ ధరణిని అమల్లోకి తెచ్చినప్పుడు మూడు నెలల పాటు అసలు రిజిస్ట్రేషన్లనే నిలిపివేశారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి 387 గ్రామాలకు నక్షాల్లేవని, ఆయా గ్రామాల్లో సర్వే చేసి భూముల సమస్యలు తీరుస్తున్నామని చెప్పారు. ఇందుకోసం మొదటి దశలో భాగంగా 70 రోవర్లు కొనుగోలు చేశామని, 32 జిల్లాల్లోని 70 చొప్పున గ్రామాల్లో తొలిదశలో పైలట్ సర్వే చేస్తున్నామన్నారు. నవంబర్ చివరికల్లా ఈ సర్వే పూర్తవుతుందని అన్నారు. 23వేల ఎకరాలు అక్రమంగా బదిలీ ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని వారు చేసిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తే అనేక భయంకర విషయాలు వెలుగులోనికి వచ్చాయని పొంగులేటి చెప్పారు. పైలట్లో భాగంగా సిద్ధిపేట, సిరిసిల్లలో ఆడిట్ చేస్తే 23వేల ఎకరాల భూమిని 13వేల ఖాతాలకు బదిలీ చేసినట్టు తేలిందన్నారు. ఏ భూమి ఎవరి ఖాతాలోకి వెళ్లింది.. విదేశాల్లో జరిగిన లావాదేవీలేంటి? అక్కడ కట్టుకున్న హోటళ్ల వివరాలను ప్రత్యేక విచారణ బృందం (సెట్)కు పంపామని తెలిపారు. అధికారం పోయిన తర్వాత కూడా అధికారంలోనే ఉన్నామని భ్రమపడుతూ, పాత వ్యవస్థలను ఉపయోగించుకుని పేదల భూములను కొల్లగొట్టాలనే ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. అసలు 22ఏ భూముల విషయంలో కొన్ని సమస్యలను గుర్తించామని, వాటిపై సభ సూచన మేరకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పొంగులేటి వెల్లడించారు. యూఎల్సీ భూములు, జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ, డీటీసీపీలు అనుమతిలిచ్చిన లేఅవుట్లు, జీవో 59, జీవో 118, అసైన్డ్ భూముల్లో కట్టుకున్న ఇళ్లు, ఇందిరమ్మ హౌసింగ్ కింద కేటాయించిన ఇంటి స్థలాలు, నాలా మార్పిడి కాని భూములు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లేఅవుట్ల విషయంలో సమస్యలున్నాయని, వీటిని సభ నిర్ణయం మేరకు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని పొంగులేటి స్పష్టం చేశారు. ధరణి దందాతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారు... –ఎన్నికల్లో ఖర్చుకు వాడారు –హరీశ్రావు సొంత మామకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టించారు –ఇలా పొందినవారిలో పల్లా రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్ ఉన్నారు ధరణి పోర్టల్ను అట్టుపెట్టుకుని బీఆర్ఎస్ పెద్దలు రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అలా వచ్చిన డబ్బును గత ఎన్నికల్లో ఖర్చు కోసం వాడుకున్నారన్నారు. ఎకరాల కొద్దీ భూమిని నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టా భూములుగా మార్చి విక్రయించి భారీగా డబ్బు పోగు చేసుకున్నారన్నారు. అలాంటి లావాదేవీలకు సంబంధించి తమ ప్రభుత్వం గుర్తించిన భూములను తిరిగి నిషేధిత జాబితాలోకి చేరుస్తూ, అవి పేదలకు దక్కేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 22ఏకు సంబంధించి శాసనససభలో జరిగిన స్వల్పకాలిక చర్చను ప్రారంభిస్తూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్రావులను ప్రధాన పాత్రధారులుగా పేర్కొంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ను శకుని మామ అని, హరీశ్రావును అగ్గిపెట్టెల అబద్ధాల రావు, అని కేటీఆర్ను డ్రామాల వ్యక్తి అంటూ పదేపదే సంబోధించారు. ఉదాహరణలతో సభ ముందు... ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని అసైన్మెంట్, భూదాన్ భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టా భూములుగా మార్చి ప్రైవేట్ పరం చేశారంటూ మచ్చుకు కొన్ని ఉదంతాలుగా సభ దృష్టికి తెచ్చారు. పొంగులేటి మాటల్లోనే... ⇒ ‘సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సర్వే నెం.271లో 327.09 ఎకరాల ప్రభుత్వం భూమిని గతంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల కోసం కేటాయించింది. ఇందులో 6.18 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీశ్రావు తన సొంత మామ (భార్య తండ్రి) హన్మంతరావుకు కట్టబెట్టించారు. ఇందులో కొంత భూమికి సంబంధించి మిషన్ భగీరథ పరిహారం కూడా పొందారు. ⇒ మెదక్ జిల్లా శివంపేట మండలం సిక్లిందాపూర్ గ్రామంలో సర్వే నెం.33 నుంచి 87 వరకు ఉన్న 569.05 ప్రభుత్వ భూమిలో 2023 అక్టోబరు 5న 372.32 ఎకరాలకు సంబంధించి ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) జారీ చేశారు. దాన్ని మొత్తంగా స్వాహా చేశారు. ఆ రూపంలో పోగుచేసుకున్న రూ.కోట్ల మొత్తాన్ని ఎన్నికల ఖర్చుగా వినియోగించారు. ⇒ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామ సర్వే నం.58, 59లో ఉన్న 476.30 ఎకరాలు ప్రభుత్వం భూమిలో.... 112.21 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుంచి తప్పించి ఓ కుటుంబంలోని సభ్యుల పేర్లతో ఓఆర్సీ జారీ చేశారు. ఇక్కడే 195.25 ఎకరాలను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు జారీ చేసే సమయంలో కొందరు పసిగట్టి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాగోతం వికటించి తిరిగి ఆ భూములు నిషేధిత జాబితాలోకి చేరాయి. ⇒ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగుల పల్లి గ్రామంలో సర్వే నం. 186 నుంచి 189లో ఉన్న 29.27 ఎకరాల భూదాన్ భూమి ఉండగా, దాన్ని పట్టా భూమిగా కన్వర్ట్ చేయించారు. ఇందులో 24.27 ఎకరాలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మరో ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూమి ప్రస్తుత విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మేము తిరిగి నిషేధిత జాబితాలో చేర్చాం. ⇒ ఇదే గ్రామం శంకర్హిల్స్ ఏరియాలోని సర్వే నం. 111–191 లోని 460 ఎకరాల భూమికి పట్టాదారులు గతంలో ఓ ప్రైవేటు సంస్థకు జీపీఏ ఇచ్చారు. దాన్ని ఆ సంస్థ 3,333 ప్లాట్లుగా విడదీసి విక్రయిస్తోంది. మరోవైపు ఆ భూమిని మరో సంస్థకు మరోసారి జీపీఏ చేశారు. ఆ సంస్థ ఎకరాల రూపంలో విక్రయిస్తోంది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా స్టేటస్కో జారీ అయింది. 2022లో నాటి ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టింది. తర్వాత 226.06 ఎకరాలను ఆ తర్వాత నిషేధిత జాబితా నుంచి తప్పించి ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. అలా పొందినవారిలో బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ కూడా ఉన్నారు’ -
దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారా? బండి సంజయ్
హైదరాబాద్: ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసుల వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తారా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన ఏబీవీపీ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని కారణంగానే ఏబీవీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన చేస్తే కాళ్ళు చేతులు విరగ్గొడతారా? అని నిలదీశారు. ‘కాంగ్రెస్ సర్కార్కు పోయే కాలం దాపురించింది. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నేతలను విడిచిపెట్టాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. జీవో నంబర్-9ను రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, విద్యార్థి సంఘాలపై అమానుషంగా ప్రవర్తించడం దుర్మార్గం. విద్యార్థులని చూడకుండా ఇష్టరీతిన గొడ్డున బాదినట్లు చావగొడతారా?, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల రాకేష్ తీవ్ర అస్వస్థత కాగా తోటి నాయకులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. విద్యార్థి నాయకుడు అస్వస్థకు గురికాడారానికి కారణం పోలీసులు కాదా?, ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది పోరాడే విద్యార్థులపై ఏ రకంగా దాడి చేస్తున్నారో అనే విషయం. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తే.. హైడ్రా కూలగొడుతుందా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే -
అందుకే కలెక్టర్లను చంద్రబాబు బెదిరిస్తున్నారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ లెవల్కు చేరిందని.. అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ సునీతను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని.. స్కిల్ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతో చంద్రబాబు ఉన్నారన్నారు.‘‘చంద్రబాబు ఒత్తిడి చేయటం వలనే తాను సంతకాలు చేసినట్టు సునీత చెప్పారు. అందుకే తాను స్కిల్ కేసులో ఇరుక్కున్నానని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతిసారీ సునీతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక దళిత ఐఏఎస్ అధికారిణిపై చంద్రబాబు నోరు పారేసుకోవటం సరికాదు. ఆమె తన బాధను మిగతా అధికారులతో చెప్పుకుంది. స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ తన మనుషులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఆధారాలన్నీ బయట పడినా.. చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేశారు. అందుకే చంద్రబాబు మాటలు నమ్మి సంతకాలు చేయవద్దని పదేపదే చెప్పాం. మా పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ జైలుకు వెళ్లటం ఖాయం. నీట్ పేపర్ లీక్తో కేంద్రమంత్రి రాజీనామా చేశారు. మరి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో అధికారులు బాధ్యులు కావద్దు. ఐఏఎస్ అధికారిని సునీత లాగా స్ట్రాంగ్గా నిలబడాలి...ఎల్నినో ఎఫెక్ట్తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు పడవని ముందే ప్రపంచమంతా తెలుసు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయటం సబబు కాదు. చంద్రబాబు చెప్పిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలన్నీ పచ్చి అబద్దాలు. రాష్ట్ర ప్రజలను దగా చేశారు. పెన్షనర్లను తాగుబోతులనటం దుర్మార్గం. వృద్దులు, వికలాంగులను తాగుబోతులు అంటూ అవహేళన చేయటం తగదు. ఆ మాటలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ టీజేఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్ -
కుటుంబాలను విడదీసే చరిత్ర చంద్రబాబుది: అమర్నాథ్
సాక్షి, విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుటుంబాలను విడదీసే చరిత్ర ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని ఎవరూ టచ్ చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వ విద్యాలయం అని ప్రశంసించారు.విజయనగరం జిల్లాలో నేడు వైఎస్సార్సీపీ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయనగరం జిల్లా కార్యకర్తలు బొత్స 2.O కోసం ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నాయకులను నమ్మి పార్టీ పెట్టలేదు. వైఎస్సార్ అభిమానులను, ప్రజలను నమ్మి పార్టీ పెట్టారు. చంద్రబాబుకి కుటుంబాలను విడదీసే చరిత్ర ఉంది. అన్ని కుటుంబాల్లో ఇది జరగొచ్చు.కానీ బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని టచ్ చేయలేరు. లోకేష్ చుట్టూ ఐఏఎస్ అధికారులు తిరుగుతున్నారని, చంద్రబాబు అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గాడిద కూడా గుర్రంలా కనిపిస్తుంది. ఇప్పుడు లోకేష్ చుట్టూ తిరిగిన అధికారులు, రేపు గాడిద చుట్టూ తిరిగాం అని అనుకునే రోజు వస్తుంది. బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వ విద్యాలయం. ఎంతో మందిని సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యేలను చేసిన చరిత్ర ఆయనది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, అమర్నాథ్.. చిన్న శ్రీను అంశం మాట్లాడుతుండగా బొత్స మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: ఆయన మనకెందుకు.. టీడీపీలో కొత్త చర్చ -
‘నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా’ : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం సంచలన ప్రకటన చేశారు. గోవాకు వెడుతున్నా.. పెద్ద ప్రకటన రానుంది అంటూ ట్వీట్ చేశారు. 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ చేయనున్న కీలక ప్రకటన ఏమిటా అన్నది పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా నిలిచింది. కేజ్రీవాల్ రాకకు ముందు, స్థానికంగా, ఆప్ గోవా ఫార్వార్డ్ పార్టీ (GFP)లకు సంబంధించిన హోర్డింగ్లు దర్శనమివ్వడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.తాను గోవా పర్యటనకు వెళ్తున్నట్లు వెల్లడిండిన కేజ్రీవాల్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. రానున్న గోవా ఎన్నికల నేపథ్యంలోఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా ఉంటే "మిమ్మల్ని మూడవసారి మోసం చేయనివ్వకండి" అనే స్లోగన్స్తో స్థానికంగా వెలసిన హోర్డింగ్లలో రెండు పార్టీల చిహ్నాలు ఉన్నాయి. 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, విజయ్ సర్దేశాయి నేతృత్వంలోని GFP మధ్య ఎన్నికల పూర్వ పొత్తు ఉండవచ్చనే చర్చకు ఇది ఆజ్యం పోసింది.ఆదివారం జరగనున్న విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగించనున్నారని, ఆ సందర్భంగా రెండు పార్టీల మధ్య పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెందిన ఒక సీనియర్ నేత తెలిపారు. అంతేకాదు ఈ పొత్తును బీజేపీ,కాంగ్రెస్ రెండింటికీ ప్రత్యామ్నాయంగా ఉండబోతోందని కూడా పేర్కొన్నారు.అలాగే శ్రీ గురుసాహిబ్ జీ సదా మనకు తోడుగా ఉంటూ, ప్రతి అడుగులోనూ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అంటూ మరో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. Am going to Goa today to make a very big announcement.— Arvind Kejriwal (@ArvindKejriwal) September 12, 2026ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్కాగా గోవా శాసనసభ ఎన్నికలు 2027 మార్చిలోపు జరగాల్సి ఉంది. ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన ఆప్ అధినేత గోవాలొ అధికారి పీఠాన్ని దక్కించుకోవాలని పథక రచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే కొన్ని హామీలను గుప్పించారు కూడా. గోవాలో ఆద్మీ పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోగా E20 పెట్రోల్ బ్యాన్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక వేళ తాము ఈ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైతే రాజికీయాలనుంచి తప్పుకుంటానని కూడా ప్రకటించారు. E20 పెట్రోల్ కారణంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనీ, E20 వల్లే చక్కెర ధరలూ పెరుగుతున్నాయని ఆరోపిస్తున్న ఆప్ E20పై జాతీయ ప్రచారాన్ని కూడా చేపట్టింది.ఇదీ చదవండి : నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్ -
ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీ మెగా డీఎస్సీ స్కామ్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి స్పందించారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.“వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే.. అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలిందని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho… pic.twitter.com/NShMVPrVmh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2026కేసు–1: మెరిట్ లిస్టులో పేర్లు పరిశీలిస్తే.. అసలు పేర్లే కనిపించ లేదు. కేసు–2: ఖో-ఖో అధికారులను సంప్రదిస్తే ఆ సర్టిఫికెట్ నకిలీదని చెబుతున్నారు. కేసు–3: నాగార్జున యూనివర్సిటీలో ఆరా తీస్తే అసలు ఆ స్పోర్ట్స్ ఈవెంటే జరగలేదని తేలింది. మరి 7 దశల్లో వెరిఫికేషన్ చేశామన్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారు?, ఏం తనిఖీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహించామని ఎలా చెప్పగలరు? అని అన్నారు. ఈ లోపాలే డీఎస్సీ అక్రమాలకు అవకాశం కల్పించలేదా? దీనికి నైతిక బాధ్యతను మీరు తీసుకోరా?” అంటూ చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రశ్నించారు. #MegaDSCScam హ్యాష్ట్యాగ్తో ఆయన ఈ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆ జీవోల మాయ ఏంటో అసలు! -
ఆయన మనకెందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నాళ్లనుంచో ఉన్న మాకే పదవుల్లేవు.. ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది... ఇంకా మా భవిష్యత్తే మాకు అర్థం కావడం లేదు.. ఇక్కడ ఉన్నవాళ్లకి ఏదీ అర్థం కాకపోతుంటే మళ్లా ఆయన, ఆయన కుమార్తె వచ్చి ఏం చేస్తారు..? మళ్లీ ఆయనను తెచ్చి మా మీద రుద్దడం ఎందుకు.. మా నియోజకవర్గాల్లో... గ్రామాల్లో.. మండలాల్లో మా పనులు మేము చేసుకోలేమా? ఆయనొచ్చి ఏం ఉద్ధరిస్తారు.. ఎందుకొచ్చిన లంపటం మాకు.. ఇదీ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని టీడీపీ కార్యకర్త్తల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. గత పదిహేనేళ్లుగా టీడీపీ కార్యకర్త దగ్గర్నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరుకు కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం గవర్నర్గా ఉన్న అశోక్ గజపతిరాజు సైతం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసినవారే. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఏ రకంగా తమ పార్టీలో ఇముడ్చుకోవాలన్నది టీడీపీ క్యాడర్కు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈయనను తెచ్చి ఎందుకు నెత్తిన ఎక్కించుకోవాలన్న ప్రశ్నలు టీడీపీ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి. అదెలా కుదురుతుంది: బేబీ నాయిన మరోవైపు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయిన కూడా జెడ్పీచైర్మన్ చేరికను వ్యతిరేకించినట్లు తెలిసింది. వాస్తవానికి తాము గతంలో వైఎస్సార్ కాంగ్రెస్లో ఉండేవాళ్లమని, అప్పట్లో బొత్స సత్యనారాయణ, ఆయనతో బాటు మజ్జి శ్రీనివాసరావు తదితరులు కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్లోకి చేరడాన్ని సహించలేకనే తాము టీడీపీలో చేరామని, అలాంటపుడు మళ్లీ ఇప్పుడు ఆయనను టీడీపీలో ఎలా చేర్చుకుంటారని బేబీ నాయిన అధిష్టానాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన టీడీపీలో చేరితే బొబ్బిలి రాజకీయాల్లో వేలుపెట్టి గ్రూపులు కట్టి తమకు ఇబ్బంది పెట్టడం.. పార్టీలో గ్రూపులు కట్టడం వంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయని బేబీనాయిన వాదించినట్లు తెలిసింది. కానీ, టీడీపీ అధిష్టానం ఆయనను ఊరడించి మజ్జి శ్రీనివాసరావును చేర్చుకున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తదితరులు కూడా చిన్న శ్రీను రాకను అయిష్టంగానే స్వాగతించినట్టు బోగట్టా. ఇదీ చదవండి: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టీడీపీ షాక్..! -
కాంగ్రెస్కు బిగ్ షాక్.. మాజీ సీఎం, సీనియర్ నేత రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ పార్టీకి చెందిన కీలక పదవులకు రాజీనామా చేశారు. తనతో ముడిపడిన ఏ అంశం కూడా.. అవినీతిపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని బలహీనపరచకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.అయితే, తన మాజీ ఓఎస్డీ, సన్నిహితుడు జీనా ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను రావత్ ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు. జీనా సౌమ్యుడు, కష్టపడి పనిచేసే వ్యక్తి అని పేర్కొంటూనే.. గ్రామీణాభివృద్ధి అధికారుల నియామకంలో ఓఎంఆర్ షీట్లతో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు బయటపడితే తాను చేసేదేమీ లేదన్నారు. అయితే ప్రస్తుత ఆరోపణలను తాను నమ్మడం లేదని స్పష్టం చేశారు.ఇక, నియామక పరీక్షల్లో అక్రమాలు అంటే యువత భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని రావత్ వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ హయాంలో నియామక వ్యవస్థను బలోపేతం చేశామని, మూడేళ్లలో 42 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఈ ప్రక్రియలో తనవైపు నుంచి తెలిసో తెలియకో తప్పులు జరిగి ఉంటే ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.తన ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు ఎవరి వద్ద ఉన్నా సీబీఐ, ఈడీ లేదా రాష్ట్ర పోలీసులకు అందించాలని రావత్ కోరారు. తాను తప్పు చేసి ఉంటే చట్టం తనను శిక్షించాలని, ప్రజా బాధ్యతల్లో ఉన్నవారు ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటాన్ని తన కారణంగా బలహీనపరచకూడదనే ఉద్దేశంతోనే ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యత్వంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది 2027లో ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
సీఎంగా తలసాని.. ఉత్తమ్గా పల్లా.. మాక్ అసెంబ్లీలో నవ్వులే నవ్వులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ వర్షాకాల సెషన్ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెన్షన్కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆ పార్టీ ప్రదాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించింది. బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో స్పీకర్ పాత్రను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్ పోషించారు. అలాగే సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర వేశారు. మంత్రి పొంగులేటి పాత్రలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మంత్రి ఉత్తమ్ పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అలరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కేటీఆర్, హరీష్రావు.. మిగతా ఎమ్మెల్యేలు కనిపించారు.ఈ చర్చలో మాజీ మంత్రి జగదీశ్ ప్రశ్నలు వేయగా.. అవతలి నుంచి సమాధానాలు వచ్చాయి. సీఎం, మంత్రుల్ని ఇమిటేట్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన సందడి నవ్వులు తెప్పించాయి. కాంగ్రెస్ సర్కార్కు సెటైరిక్గా చివరి వరకు నడిచింది మాక్ అసెంబ్లీ. LIVE: తెలంగాణ భవన్ లో ''మాక్ అసెంబ్లీ'' కార్యక్రమంhttps://t.co/2C1qZvGBQB— BRS Party (@BRSparty) September 12, 2026సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుపడుతున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుల్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అయితే కీలక హామీలు నెరవేర్చకపోవడం, ప్రజా సమస్యలు, పలు కీలక అంశాలపై చర్చకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తమను సభలో లేకుండా చేసిందని బీఆర్ఎస్ అంటోంది. ఈ క్రమంలోనే మాక్ అసెంబ్లీ నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: ఇంతకీ ఆమెకు ఏమైంది?.. ఎక్కడ? -
ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టీడీపీ షాక్..!
సాక్షి ప్రతినిధి, కడప: క్షేత్రస్థాయిలో విలువ దక్కకపోయినా అధిష్టానం వద్ద పరపతి తగ్గలేదు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కాదని, మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి సిఫార్సుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రతి చిన్న విషయానికి అటు ఎమ్మెల్యే వరద ఇటు ప్రవీణ్కుమార్ పోటీ పడుతున్నారు. పైచేయి సాధించేందుకు ఎత్తులు..పైఎత్తులు వేస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రవీణ్ పాత్ర అతిస్వల్పం అని చూపించేందుకు ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా అధిష్టానం వద్ద ప్రవీణ్కుమార్రెడ్డిదే అప్పర్ హ్యాండ్ అయ్యింది. ప్రొద్దుటూరు సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా (ఏజీపీ) వినోద్కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు ప్రొద్దుటూరు ఇన్చిర్జిగా ఉక్కు ప్రవీణ్కుమార్రెడ్డి చురుగ్గా ఉండేవారు. సమీకరణల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి తెరపైకి వచ్చారు. అప్పటి వరకు కలిసికట్టుగా ఉన్నట్లు అనిపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వరద అన్నింటా తనదే పైచేయి ఉండాలనే దిశగా అడుగులు వేశారు. ఈక్రమంలో పరస్పర దాడులు వరకు వెళ్లారు. ఎప్పటికప్పుడు ఎవరికి వారు చోటుచేసుకున్న పరిస్థితులను అధిష్టానానికి వివరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ నియామకాలపై కూడా ఎప్పటికప్పుడు ఆయా వర్గీయులు అభ్యర్థులను సిఫార్సు చేస్తూ వచ్చారు. ఏజీపీగా వినోద్కుమార్ నియామకం... ప్రొద్దుటూరు సివిల్ జడ్జి కోర్టు ఏజీపీగా అడ్వకేట్గా ఈ.వినోద్కుమార్ను నియమిస్తూ జీఓ ఆర్టీ నెం.259 ద్వారా సెప్టెంబర్ 11న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏజీపీ నియామకం కోసం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అడ్వకేట్ నిర్మలను నియమించాలని సూచించారు. ఈవిషయాన్ని ఇన్చార్జి మంత్రి సవిత, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి అడ్వకేట్ వినోద్కుమార్ను ఏజీపీగా నిమించాలని మంత్రి నారా లోకేష్కు విన్నవించినట్లు సమాచారం. ప్రవీణ్ అభ్యర్థన మేరకు సిఫార్సులు పంపాల్సిందిగా సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ కావడం, ఆమేరకు నియామకపు ఉత్తర్వులు వెలుబడినట్లు విశ్వసనీయ సమాచారం. కొండారెడ్డి చర్యలతోనే పలుచబడ్డ పరపతి.... ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అయినప్పటీకీ అనధికార పెత్తనమంతా తనయుడు నంద్యాల కొండారెడ్డి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకొని కోటరీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మట్కా, గుట్కా, జూదం లాంటివి విచ్చలవిడిగా ఉన్నాయని స్వయంగా ఎమ్మెల్యే వరద బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అలాంటి వ్యక్తులనే కొండారెడ్డి ప్రోత్సహిస్తూ వారి సిఫార్సులకు అనుగుణంగా నడుచుకుంటున్నారని విశ్లేషకులు సైతం వివరిస్తున్నారు. ఇసుక అక్రమదందా, సెటిల్మెంట్లు ఈమారు ప్రొద్దుటూరులో సైర్వవిహారం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో అధిష్టానం వద్ద ఎమ్మెల్యే వరద పరపతి పలుచబడినట్లు సమాచారం. ఆమేరకే ఎమ్మెల్యే సిఫార్సులను కాదనీ, ఉక్కు ప్రవీణ్ సిఫార్సులకు అనుగుణంగా ఏజీపీ నియామకం చోటుచేసుకున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఇచ్చింది రెండు.. మెలికెలు మెండు.. -
చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కొడాలి నాని దుయ్యబట్టారు. 16 ఏళ్ల బాబు పాలనలో ఒక్కసారే స్థానిక ఎన్నికలు పెట్టాడు. ఎన్నికలకు వైఎస్ జగన్ భయపడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. భయమంటే ఏంటో తెలియని నాయకుడు జగన్. చంద్రబాబు, లోకేష్ల అవినీతికి అంతులేకుండా పోయింది. డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్మేశారు. కొంతమంది దొంగల కోసం స్పోర్ట్స్ జీవోలను మార్చారు’’ అని కొడాలి నాని మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్ను చర్చకు రమ్మనడానికి లోకేష్కు ఉన్నస్థాయి ఏంటి?. పేర్ని నాని చర్చకు వస్తానంటేనే లోకేష్ పారిపోయాడు. తండ్రి పేరు నిలబెట్టేందుకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన మాటకోసం మడమతిప్పని నేత వైఎస్ జగన్. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారమే పరమావధిగా బతికే వ్యక్తి చంద్రబాబు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో పెద్ద లిస్ట్ పట్టుకొచ్చాడు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలతో ఎన్నికలకు వెళ్లనని ధైర్యంగా చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చాడా?. మోసంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.‘‘వెన్నుపోటు సామ్రాట్ను, వెన్నుపోటు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. పేర్ని నాని, ఆయన భార్య పై కేసులు పెట్టి వేధించారు. ఎన్ని కేసులు పెట్టినా పేర్ని నాని వెనక్కి తగ్గలేదు. వైఎస్ వెంట నిలిచి ఆయన గొంతును నిరంతరం వినిపిస్తున్నారు. వల్లభనేని వంశీని ఉద్ధేశపూర్వకంగా కేసులతో ఇబ్బంది పెట్టారు. వంశీకి హైదరాబాద్లో కోట్ల విలువైన ఆస్తులున్నాయ్. పేదల పట్టాలను అమ్ముకున్నాడని వంశీ పై దొంగ కేసులు పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టు రాకతో ప్రజల కళ్లల్లో ఆనందం చూశానని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ ఎలా ఉంటుందో కూడా చంద్రబాబుకు తెలియదు. నీళ్ల కోసం కొండను ఎలా తవ్వుతారని విమర్శించింది చంద్రబాబే. చంద్రబాబు చేలో మేస్తే.. లోకేష్ గట్టుమీద మేస్తాడా?’’ అంటూ కొడాలి నాని నిలదీశారు. -
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రామచంద్రపురం జనసేన విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ‘‘జనసేన గెలిచిన చోట టీడీపీ వాళ్లను గౌరవించినా.. టీడీపీ గెలిచిన చోట జనసేన కార్యకర్తలను తొక్కుతున్నారు. ఈ విషయం మన నాయకుడు పవన్ కళ్యాణ్కు కూడా తెలుసు’’ అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు.బొలిశెట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాస్తవాన్నే నేను చెప్తా.. ఎవరికీ భయపడనంటూ బొలిశెట్టి తేల్చి చెప్పారు. బొలిశెట్టి కామెంట్స్పై టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి. -
బూత్ల వారీగా సమగ్ర వివరాలు ఇవ్వండి: వైఎస్సార్సీపీ
తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి లేఖ రాశారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగించకుండా చూడాలని, అదే సమయంలో దొంగ ఓట్లను ఏరివేయాలని ఆ లేఖలో స్పష్టంగా కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను బూత్ స్థాయిలో బహిర్గతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశాఆరు. ఈ లేఖ ప్రతిని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపించారు.డౌన్ లోడ్ లింకులతో సరిపెట్టకుండా...ఎస్ఐఆర్లో భాగంగా కొత్తగా ఓటర్లను చేర్చడం, తొలగించడం, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం, మరణించిన వారి ఓట్ల తొలగింపు, ఇతర సవరణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నియోజకవర్గాల వారీగా, బూత్ల వారీగా సమగ్రంగా అందించాలని లేఖలో కోరారు. కేవలం డౌన్లోడ్ లింకులు ఇవ్వకుండా అధికారికంగా సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మ్యాప్ కాని ఓటర్లు, ఇతర కేటగిరీల కింద జారీ చేసిన నోటీసులపై కూడా పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎన్ని నోటీసులు జారీ చేశారు, ఎన్ని కేసులు పరిష్కరించారు, ఎన్ని ఓటర్లను తొలగించారు, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో బూత్, నియోజకవర్గాల వారీగా వెల్లడించాలని పేర్కొంది. దీనివల్ల బూత్ స్థాయి ఏజెంట్లు సంబంధిత ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అనుమానిత ఓటర్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిందని లేఖలో అప్పిరెడ్డి పేర్కొన్నారు. వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, చట్ట ప్రకారం డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కుటుంబ సభ్యులందరి ఓట్లూ ఒకే బూత్లో ఉండాలిపోలింగ్ కేంద్రాల పునర్విభజనలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు బూత్లకు, కొన్ని సందర్భాల్లో వేర్వేరు వార్డులకు కేటాయించబడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకే ఇంటి చిరునామాలో నివసించే కుటుంబ సభ్యులను సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉంచాలని కోరారు. ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్చినప్పుడు అనుసరించిన ప్రమాణాలను కూడా స్పష్టంగా వెల్లడించాలని కోరింది. భౌగోళిక ప్రాంతం, ఇంటి నంబర్, ఓటరు వరుస సంఖ్య లేదా ఇతర ఏ ప్రమాణం ఆధారంగా ఓటర్లను బదిలీ చేశారో స్పష్టం చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నందున, ఎస్ఐఆర్ అనంతరం వచ్చిన తాజా ఓటర్ల డేటా ఆధారంగా పోలింగ్ కేంద్రాల పునర్విభజనను మరోసారి సమీక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.బూత్ మ్యాపింగ్ను పార్టీలకు అందించాలికొత్తగా ఏర్పాటు చేసిన లేదా పునర్విభజించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పూర్తి బూత్ మ్యాపింగ్ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రతి బూత్కు అనుసంధానించిన ప్రాంతాలు, బూత్ స్థాయి అధికారుల వివరాలు, పాత బూత్ల నుంచి కొత్త బూత్లకు ఓటర్ల బదిలీల వివరాలను అందులో పొందుపరచాలని కోరారు. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసిన లేదా పునర్విభజించిన పోలింగ్ కేంద్రాలకు నియమించిన బూత్ స్థాయి అధికారుల పేర్లు, సంప్రదించాల్సిన నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ బూత్ స్థాయిలో పారదర్శకంగా జరగాలని, అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా చూడాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.ఇదీ చదవండి:‘అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం’ -
‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?’
సాక్షి, కృష్ణా జిల్లా: ‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?. తప్పులు చేసి అధికారుల మీద నెట్టేస్తున్నారు. జీవో ఇచ్చింది ఎవరు? అధికారులకు ఏంటి సంబంధం?. తండ్రి కొడుకుల వేషాలు చూడలేకపోతున్నామంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇవాళ మచిలీపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, పెడన వైఎస్సార్సీపీ ఇంఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి, జడ్పీచైర్ పర్సన్ ఉప్పాల హారిక, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మొద్దని.. ఎవరినైనా లోబరచుకుంటాడన్నారు. దొంగ తెలివితేటలున్న వ్యక్తి చంద్రబాబు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. అక్టోబర్ 2 నుంచి ఏ క్షణమైనా మున్సిపాల్టీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి చంద్రబాబు మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం లేదు. చంద్రబాబుకు కూటమి చీలిపోతుందనే భయం పట్టుకుంది. అందుకే పంచాయతీల కంటే ముందు మున్సిపాల్టీలకు ఎన్నికలు పెడుతున్నాడు. పోలీసులను అడ్డంపెట్టుకుని మున్సిపాల్టీలను గెలవాలనుకుంటున్నాడు’’ అని పేర్ని నాని మండిపడ్డారు. -
‘అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా ఫోన్ చేయండి’
విజయనగరం: కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 11వ తేదీ) విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో బొత్స సమావేశమయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా కార్యకర్తలకు బొత్స దిశా నిర్దేశం చేశారు. ‘ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి. చట్ట వ్యతిరేకమైన పోస్టులకు, అబద్ధపు ప్రచారాలకు దూరంగా ఉండాలి.ఇక మీదట ప్రతి కార్యకర్త నేరుగా జిల్లా పార్టీ కార్యాలయంలో అనుసంధానం కావాలి. నేను ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను.. ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత -
కొండా సురేఖ బర్తరఫ్పై కేటీఆర్ రియాక్షన్ ఇదే
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ కేబినెట్ బర్తరఫ్, రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన 22-ఏ (22-A) నిబంధన అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో అమలవుతున్న 22-ఏ నిబంధన కేవలం ఒక ఆంక్ష మాత్రమే కాదని, కోటి ఎకరాల భూమిని మాయం చేసే ఒక పెద్ద మహా కుంభకోణమని కేటీఆర్ ఆరోపించారు.22ఏ నిషేధిత భూముల స్కాం పేరుతో నిర్వహించిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ నాయకులు సామాన్యుల ఆస్తులను టార్గెట్ చేసి భూ దందాలకు పాల్పడుతున్నారు. మంత్రి పదవి నుంచి కొండా సురేఖ తొలగించడానికి 22-ఏ భూముల వివాదమే. ఈ భారీ భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాన సూత్రధారి అని, రెవెన్యూ శాఖ మంత్రి పాత్రధారిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ మంత్రి కేవలం సారీ చెబితే సరిపోదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.రాష్ట్రంలో సంక్షేమం పక్కనపెట్టి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ ఆక్రమణలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ఎండగడతామని’ స్పష్టం చేశారు. 👉ఇదీ చదవండి : మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ ఔట్ -
‘కూన రవి వందల నకిలీ సర్టిఫికెట్లు అమ్ముకున్నారు’
శ్రీకాకుళం: ఏపీలో జరిగిన డీఎస్సీ అక్రమాలు తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా బయటకొస్తూనే ఉన్నాయని ఆముదాలవలస వైఎస్సార్సీపీ సమన్వకర్త చింతాడ రవి విమర్శించారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చేసిన అక్రమాలే ఎన్నో ఉన్నాయన్నారు. తమ జిల్లాలోనే కూన రవికుమార్ వందల నకిలీ సర్టిఫికెట్లను అమ్ముకుని కోట్ల రూపాయలను సంపాదించడన్నారు. ఒకవేళ కూన రవి కుమార్ తాను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోవాలంటే తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తాము అడిగే ప్రశ్నలకు కూన రవికుమార్ సమాధానం చెప్పాలని చింతాడ రవి సవాల్ విసిరారు. డీఎస్సీలో ఈ వెన్నుపోటు పార్టీ చేసిన అక్రమాలు తవ్వే కొద్దే బయటకు వస్తూనే ఉన్నాయన్నారు. పరీక్షలు పెట్టకుండా ఉద్యోగం ఇవ్వడమనేది దేశంలోనే ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదని, కానీ ఏపీలో మాత్రం అందుకు అతీతంగా ఉందని విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టే సీబీఐ విచారణ అంటే ప్రభుత్వం పారిపోతుందని మండిపడ్డారు. ఇదీ చదవండి:అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం: వడ్డే -
మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?
సాక్షి ముంబై: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన వేదికను గుజరాత్లోని కెవాడియాకు తరలించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. 72 ఏళ్లుగా ఢిల్లీలో కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఇప్పుడు కొత్తగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి తరలించాలనుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ముంబైను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. గుజరాత్కు ప్రాధాన్యం ఎందుకు?ఈనెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా గుజరాత్లోని కెవాడియా (ఏక్తానగర్)లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 1954లో ప్రారంభమైన ఈ అవార్డుల వేడుక ఇన్నేళ్లుగా ఢిల్లీలోనే జరుగుతోంది. తొలిసారిగా రాజధాని వెలుపల కార్యక్రమాన్ని నిర్వహించనుండటంపై రాజ్ ఠాక్రే సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై విమర్శలు గుప్పించారు.దేశంలోని కీలక కార్యక్రమాలు, ప్రాజెక్టుల విషయంలో గుజరాత్కే వరుసగా ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దేశ అభివృద్ధికి గుజరాతే కేంద్రం అన్న భావనను కల్పించే ప్రయత్నం జరుగుతోందా? అని ప్రశ్నించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు పునాది వేసిన దాదాసాహెబ్ ఫాల్కే మహారాష్ట్రకు చెందినవారని రాజ్ ఠాక్రే గుర్తుచేశారు. దేశంలో అత్యధిక చిత్రాల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో మహారాష్ట్రతోపాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రాల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేయకుండా గుజరాత్నే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు.ఇదీ చదవండి: 'ఐడీ కార్డులు చెక్ చేయండి.. మతాన్ని కాదు''‘జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకను ఢిల్లీ నుంచి తరలించాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ అలా తరలించాలనుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్రను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. భారతదేశపు ప్రస్తుత స్థాయికి ఏ ఒక్క రాష్ట్రం మాత్రమే కారణం కాదని.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తరతరాలుగా చేసిన కృషి, త్యాగం, శ్రమ ఉన్నాయని పేర్కొన్నారు.కళాకారులు ప్రశ్నించాలిప్రస్తుత పాలకులకు కళలపై ఆసక్తి లేదని, ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా మారిందని రాజ్ ఠాక్రే విమర్శించారు. కళాకారులు అధికారాన్ని పొగడటానికే పరిమితం కాకుండా.. ప్రజలకు సంబంధించిన నిర్ణయాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్లో జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడి అధ్యక్షులు తమ సొంత రాష్ట్రానికి ఆ కార్యక్రమాన్ని తరలించేందుకు ప్రయత్నించలేదని వ్యాఖ్యానించారు.దక్షిణాది రాష్ట్రాలు గళమెత్తాలి జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక తరలింపు విషయంలో మహారాష్ట్రతోపాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గట్టిగా స్పందించాలని రాజ్ ఠాక్రే కోరారు. ఈ అంశంపై కళాకారులు కూడా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాలని పిలుపునిచ్చారు. కాగా, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన వేడుకలను ఢిల్లీ నుంచి గుజరాత్కు తరలించడాన్ని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా వ్యతిరేకించారు. -
బ్రిక్స్తో మనకు లాభాలున్నాయండోయ్..!
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో మన దేశానికి పెద్దగా ఒరిగేదేం లేదని.. ఒకవేళ నిజంగా ప్రయోజనం ఉంటే అదేంటో చెప్పాలని కేంద్రానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సవాల్ విసిరారు. అయితే దీనికి బీజేపీ తీవ్రంగా స్పందించింది. అదే టైంలో.. కాంగ్రెస్ నుంచే కౌంటర్ రియాక్షన్ వచ్చింది. చిదంబరం వేసిన ప్రశ్నలకు సొంత పార్టీకే చెందిన మరో సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బదులిచ్చారు. ఆ ప్రయోజనాలు ఇవేనంటూ వివరించారు. ఈ వేదిక భారత్ దౌత్యపరమైన ప్రభావాన్ని, ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురాగల సామర్థ్యాన్ని చాటుతుందని పేర్కొన్నారు.‘గ్లోబల్ సౌత్కు కీలక వేదిక’ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ముందు మాట్లాడిన థరూర్.. గ్లోబల్ సౌత్కు బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పారు. విస్తరించిన బ్రిక్స్లో 11 దేశాలు ఉన్నాయని, ఇవి ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. ఇలాంటి దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం చిన్న విషయం కాదన్నారు.‘ప్రపంచ వేదికపై భారత్ దౌత్య బలం’బ్రిక్స్ సదస్సుకు పలువురు దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు హాజరవుతుండటం భారత్కు ప్రతిష్టాత్మక విషయమని థరూర్ అన్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ ‘డిప్లొమాటిక్ కన్వీనింగ్ పవర్’ను చూపిస్తుందని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్లో అన్నీ సానుకూల అంశాలే లేవని కూడా స్పష్టం చేశారు.ఇదీ సవాల్.. ఏకాభిప్రాయం కష్టమే!విభిన్న దేశాలు, విభిన్న ప్రయోజనాలు ఉన్నందున కీలక అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయం సాధించడం బ్రిక్స్లో పెద్ద సవాలని థరూర్ అన్నారు. మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరాన్-యూఏఈ మధ్య విభేదాల కారణంగా ఉమ్మడి ప్రకటన వెలువడలేదని గుర్తుచేశారు. దీంతో భారత్ చైర్ ప్రకటనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా సదస్సులోనూ అలాంటి పరిస్థితి వస్తే అది బ్రిక్స్ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందన్నారు.చిదంబరం ఏమన్నారు?ఇటీవల చిదంబరం మాట్లాడుతూ.. గత రెండు, మూడు బ్రిక్స్ సదస్సుల నుంచి భారత్కు వచ్చిన స్పష్టమైన ప్రయోజనాలు తనకు కనిపించలేదన్నారు. బ్రిక్స్తో పాటు ఎస్సీఓ, జీ20, క్వాడ్లో భారత్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. వాటి నుంచి దేశానికి వస్తున్న స్పష్టమైన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.వాణిజ్య లోటుపైనా థరూర్ ఆందోళనమరోవైపు బ్రిక్స్ దేశాలతో భారత్ వాణిజ్యం పెరుగుతున్నప్పటికీ.. అది పూర్తిగా భారత్కు అనుకూలంగా లేదని థరూర్ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు తగ్గుతుండగా.. దిగుమతులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. అంటే బ్రిక్స్ వేదిక భారత్కు దౌత్యపరంగా ప్రాధాన్యమైనదే అయినప్పటికీ.. వాణిజ్యపరంగా మరింత సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నది థరూర్ వ్యాఖ్యల సారాంశం.ఇదీ చదవండి: పార్టీ కంటే పిల్లనిచ్చిన మామే ఎక్కువయ్యాడా? -
క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్కు అగ్నిపరీక్ష!
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు తన అనుభవ రాహిత్యం ఏమిటో ఇప్పటికైనా తెలిసి ఉండాలి. గాజు ఇంటిలో కూర్చుని ఎదుటివాళ్లపై రాళ్లు వేస్తే ఏమవుతుందో అర్దం అయి ఉండాలి. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి బుకాయింపులు, అసత్యాలు వల్లె వేయడం వంటివి నేర్చుకున్నారు కాని, ఆయన మాదిరి ఎదుటివారిపై నెట్టివేయడం అలవాటైనట్లు లేదు. అందువల్లే ఇప్పుడు లోకేష్ సవాళ్ల పర్వం నుంచి పనిచేసేవారికే రాళ్ల దెబ్బలు అంటూ సెంటిమెంట్ ప్రయోగించే యత్నం చేశారు. లేదంటే కోర్టుకు వెళ్లండని అంటున్నారు. కొందరు అభ్యర్దులు కోర్టులకు కూడా వెళ్లారు. కానీ అవి ఎప్పటికి విచారణకు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు.ఏపీలో టీచర్ల ఎంపికలో ఎన్ని గందరగోళాలు జరిగాయో రోజురోజుకు తేటతెల్లమవుతున్నప్పటికీ, చర్చకు సవాల్ అంటూ లోకేష్ డాంబికంగా మాట్లాడి దెబ్బతిన్నారు. పదిసార్లు తాను చర్చకు సవాల్ విసిరినా మాజీ సీఎం జగన్ సిద్దం కాలేదని ఒక అసత్యపు ప్రచారం చేయడం ద్వారా ఈ స్కామ్ నుంచి బయటపడవచ్చని తొలుత అనుకున్నట్లున్నారు. కానీ నిజం నిప్పులాంటిది అంటారు. అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. అలాగే క్రీడల కోటాలో నకిలీ సర్టిఫికెట్తో, పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందినవారి బాగోతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అక్కడితో ఆగకుండా ఇతర కేటగిరీలలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి టీచర్ ఉద్యోగాలు పొందినవారూ ఉన్నారు. తొలుత ఎస్ఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ మొదటి ర్యాంకు సాధించడం, ఆ తర్వాత అతనిని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా అక్కడ పరీక్ష పత్రం లీక్ అయిందన్న అనుమానంతో మొదలైన ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ, తిరుగు లేని ఆధారాలతో స్కామ్ బయటపడిందన్న విషయం బోదపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాని, ఆయన పార్టీ నేతలు వీటికి సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తున్నా వాటికి జవాబు ఇవ్వడంలో మంత్రి లోకేష్, టీడీపీ నేతలు విఫలం అయ్యారు. సవాళ్లు చేస్తూ టీడీపీ కేడర్లో ఒక నమ్మకం కలిగించడానికి లోకేష్ ప్రయత్నించారు. ఆయనను రక్షించడానికి చంద్రబాబు కృషి చేశారు. అందులో భాగంగానే లోకేష్ గురుపూజోత్యవం నాడు మాట్లాడుతూ పనిచేసే వాళ్లకే రాళ్ల దెబ్బలు అని అన్నారు. ఇక్కడ సమస్య ఏమిటి?.డీఎస్సీ పెట్టింనందుకు కాదు.. అక్రమాలు జరిగినందుకు.. ఆ విషయాన్ని కప్పిపుచ్చాలనుకుంటే ఎలా కుదురుతుంది?. సమాజంలో గౌరవంగా, నిజాయితీగా ఎలా బతకాలో నేర్పించింది తన తండ్రి చంద్రబాబు అని ఆయన అన్నారు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా, యువకుడిగా ఉన్న లోకేష్ అసత్యాలు చెప్పడం మాని, అహంకారంతో ప్రవర్తించడం మాని, హుందాగా రాజకీయాలు చేస్తే ఆయనకే పేరు వస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితం గురించి నిత్యం అంతా మాట్లాడుకునేదే. జగన్కు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని అనడం ద్వారా ఏదో ఆత్మ సంతృప్తి చెంది ఉండవచ్చు కానీ, ఆయన విసిరిన సవాల్ గురించి లోకేష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?. డీఎస్సీ అన్న పదం రెండుసార్లు వాడినందుకే తప్పుపడుతున్న లోకేష్ తెలుగులో ఎన్ని తప్పులు మాట్లాడతారో మర్చిపోతే ఎలా?. అదే జగన్ తన టైమ్ లో జరిగిన ఏపీపీఎస్సీపై చేస్తున్న అభియోగాలు, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరారే!. తాను పదిసార్లు సవాల్ చేసినా చర్చకు రాలేదని, అసందర్భ వ్యాఖ్యలు చేస్తే ఏం ప్రయోజనం?. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి.చంద్రబాబు నాయుడు తాను ప్రభుత్వపరంగా ఏ తప్పు చేసినా, తెలివిగా అధికారుల మీద తోసేసి తప్పించుకుంటారు. ఉదాహరణకు ఈ మధ్య ఆయా సభలలో అధికారులను నిలబెట్టి వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే యత్నం చేశారు. రోడ్లు బాగోలేదు కదా అని ప్రజలను ప్రశ్నించి అధికారులను నిందిస్తే ఏం లాభం. నిధులు ఇవ్వకుండా తమపై రుద్దడం ఏమిటా అని అధికారులు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏదైనా స్కామ్ జరిగితే, అందులో తనకు ఇబ్బంది వస్తుందనుకుంటే వ్యూహాత్మకంగా సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని డ్రామా నడిపిస్తారు. ఎవరో కొందరిని ఆ సమయానికి బలి చేసి కథ ముగిస్తారు. ఉదాహరణకు గాదె సాయికృష్ణ అనే నిందితుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టడం వల్ల మరణించిన ఘటనను కేవలం అక్కడి సీఐ, ఆ దిగువ ఉండే కానిస్టేబుళ్ల వద్దే ఆపేశారు తప్ప, పై అధికారుల దాకా వెళ్లకుండా సిట్ పేరుతో కధ నడిపించేశారు. ఎందుకంటే అది పై దాక వెళితే తనకు కూడా తలనొప్పి అవుతుందని తెలుసు కాబట్టి అన్నమాట.రాజమండ్రి పుష్కరాలలో పబ్లిసిటీ కారణంగా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారన్న అభియోగాలు వచ్చాయి. ఆ ఘటనలో తను చిక్కుకోకుండా ఎలా తప్పించుకున్నారో అందరికీ తెలుసు. పైగా రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? అని ఎదురుదాడి చేశారు. తిరుమలలో 20 మంది ఎన్కౌంటర్ అయితే దేశవ్యాప్తంగా అది సంచలన ఘటన. దానిని కూడా ఎలా ముగించారో చూశాం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లను చంపడం తప్పుకాదన్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. చంద్రబాబు ధోరణి అలా ఉంటుంది. వాగ్దానాలు చేయడం, వాటిని తుస్సు మనిపించడం, తాను అబద్దం ఆడుతున్నానని తెలిసినా, ప్రజలను నమ్మించడానికి వాటినే వల్లించడం వంటివి చంద్రబాబు చేయగలరన్న అభిప్రాయం వివిధ పక్షాల నేతలలో ఉంది. ఈ విషయం వరకు బాగానే నేర్చుకున్నట్లు కనిపించిన లోకేష్, తన అనుభవ రాహిత్యంతో డీఎస్సీ అక్రమాల కేసులో ఇరుకున్నట్లయిందన్న విశ్లేషణ వస్తుంది.వైఎస్ జగన్ ఈ అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా మీడియాకు వివరించిన వెంటనే, ఆధారాలు ఉన్నట్లయితే తప్పక చర్చ తీసుకుంటామని, ఇందులో తనకు పాత్ర లేదని, అధికారులదే తప్పేమైనా ఉందేమోనని అని ఉంటే కొంతైనా తప్పించుకోగలిగేవారేమో. కానీ లోకేష్ మొత్తం వ్యవహారాన్ని తన భుజాన వేసుకుని డీఎస్సీ క్రెడిట్ అంతా తనదేనని ప్రొజెక్టు చేసుకునే క్రమంలో అందులోని డెబిట్ మొత్తం తన ఖతాలో వేసుకోవలసి వచ్చింది. ఇదే సమయంలో యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు ఉన్నవారికి క్రీడా కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణను వైఎస్సార్సీపీ చేస్తోంది. అది నిజమైతే వారికి టీచర్ల ఉద్యోగాలు ఇప్పించానన్న సంతోషం కన్నా, అది స్కాంగా మారి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయన్న టెన్షన్ లోకేష్కు ఏర్పడుతుంది. జగన్ వీటన్నిటిపైన ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పలేక ఎదురుదాడి చేస్తూ మరిన్ని అనుమానాలను చంద్రబాబు, లోకేష్ కలిగించారు.చిత్రంగా ఉద్యోగాలు వచ్చిన టీచర్ల ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి మరిన్ని డౌట్లు క్రియేట్ చేసుకున్నారు. టీచర్ పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నేరుగా ఆరోపిస్తున్న అభ్యర్దుల ఇళ్లకు వెళ్లి వారి నుంచి ఆధారాలు తీసుకుని చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది కదా!. ఎంపికైన టీచర్లందరిని వైఎస్సార్సీపీ తప్పుపట్టకపోయినా వాళ్లతో కర్నూలు, విశాఖపట్నం తదితర చోట్ల ర్యాలీలు తీయిస్తే ఏం ప్రయోజనం?. చిత్తశుద్ది ఉంటే ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో కాని, ఇతరత్రా కాని కొందరు అభ్యర్దులు చెబుతున్న వాటిలో నిజానిజాలు ఏమిటో తేల్చడానికి ఎందుకు లోకేష్ సిద్దపడలేకపోయారు. తాము జవాబు ఇవ్వలేకపోతుండటం, సంబంధిత అధికారులతో మీడియా సమావేశాలు పెట్టించారు. వారు మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక సతమతమయ్యారు. కొన్ని అంశాలలో విచారణ జరుగుతోందని, పరిశీలిస్తున్నామని తప్పించుకునే ధోరణిలో అధికారులు చెప్పవలసి వచ్చింది.జగన్ టైమ్లో సుమారు లక్షన్నర మంది సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేస్తే ఒక్క అక్రమం జరిగినట్లు కూడా ఆరోపణలు రాలేదు. గతంలో ఏ అంశంపైన అయినా, ఏ ఆరోపణ వచ్చినా, ఎలాంటి విచారణకైనా జగన్ ఆదేశించేవారు కదా!. ఆ ధైర్యం చంద్రబాబు, లోకేష్లలో ఎందుకు కొరవడుతోంది?. దీనికి తోడు సుప్రీంకోర్టు తాజాగా వేరే రాష్ట్రంలో టీచర్ల ఎంపిక కేసులో చేసిన వ్యాఖ్యలు కూడా వీరికి మరింత ఆందోళన కలిగిస్తుండవచ్చు. కాగా, ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం కూడా ఆసక్తికరమే. చిత్రంగా పవన్తో కలిసి టీచర్ నియామక పత్రాలు అందించామని చంద్రబాబు ఒక స్పీచ్లో చెప్పారు. కానీ అసలు ఆ ప్రోగ్రాంలో తండ్రి, కొడుకులు తప్ప పవన్ లేరు కదా అని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. అంటే పవన్కు కూడా ఈ బురద అంటిస్తే బెటర్ అనుకున్నారా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్కామ్ నేపథ్యంలో పోలీసులను ప్రయోగించి అణచివేత చర్యలు, సోషల్ మీడియాలో పోస్టులు తొలగించడం వంటి చర్యలు చేస్తున్న కొద్దీ స్కామ్పై జనంలో మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
#80sTrend: హద్దులు దాటిన మీమ్ వార్
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. కానీ ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘మీమ్ వార్’ మరో స్థాయికి చేరింది. తాజాగా రెట్రో ట్రెండ్ ఏఐ ద్వారా దేశాన్ని ఊపేస్తోంది. తమ ఫొటోలను 70, 80 కాలం నాటి ఫొటోల్లా మార్చేసుకుని మురిసిపోతున్నారు చాలామంది. అయితే ఈ ట్రెండ్ వెనుక సైబర్ నేరాలకు అవకాశం ఉందనే హెచ్చరికలూ జారీ చేస్తున్నారు నిపుణులు. ఆ సంగతి పక్కన పెడితే.. పొలిటికల్గా ఇది మరో టర్న్ తీసుకుంది. ఒక పార్టీ పాతకాలం నాటి ఫొటోతో సెటైర్ వేస్తే.. మరో పార్టీ దానికి అంతకుమించిన వ్యంగ్య చిత్రంతో కౌంటర్ ఇచ్చింది. చివరకు ఈ పోస్టుల వ్యవహారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ టార్గెట్ చేసే వరకు వెళ్లింది. దీంతో ఇరు పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.కాంగ్రెస్ పోస్టుతో మొదలు..ఈ వివాదానికి కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చేసిన ఓ పోస్టు కారణమైంది. ‘1980ల నాటి గుజరాత్ వీధి’ అంటూ ఓ చిత్రాన్ని పోస్టు చేసింది. దీన్ని బీజేపీ తెలంగాణ కౌంటర్ చేసింది. 1970ల నాటి తరహాలో ఉన్న ఓ మహిళ బార్ కౌంటర్పై డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని ‘లుసియానా, ఇటలీ’ అనే క్యాప్షన్తో పోస్టు చేసింది. ఇక్కడితో ఆగని బీజేపీ కేరళ విభాగం మరో బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. పాతకాలం నాటి రాజకీయ పార్టీ కార్యాలయాన్ని తలపించేలా ఉన్న ఈ చిత్రంతో కాంగ్రెస్పై సెటైర్ వేసింది.అయితే ‘లుసియానా’ ప్రస్తావనతో పాటు వరుస పోస్టులను పరిశీలించిన పలువురు.. ఈ వ్యంగ్యానికి అసలు లక్ష్యం సోనియా గాంధీనేనని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఇటలీలోని లుసియానాలో జన్మించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ గుజరాత్ ఖాతా నుంచి చేసిన ఓ పోస్టును తర్వాత తొలగించినట్లు సమాచారం. దీంతో వివాదం మరింత ముదిరింది.దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పేజీలు గుజరాత్ గజదొంగ, చాయ్ పేరిట రైల్వే స్టేషన్లో చోరుడు, మొసలిని పట్టుకున్న మొనగాడు అంటూ రెట్రో స్టైల్లోనే పలు పోస్టులు చేసింది. దీంతో ఇది నరేంద్ర మోదీని ఉద్దేశించేనంటూ బీజేపీ భగ్గుమంది. ఇలా ఇరు పార్టీలు ఈ ట్రెండ్ను తమ మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు వేదికగా మార్చేశాయి.రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంపోస్టులపై ఇరు పార్టీల మద్దతుదారులు తీవ్రంగా స్పందించారు. బీజేపీ పోస్టుల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిని వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వాన్ని కించపర్చడంగా అభివర్ణించాయి. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సైతం ఈ విషయంలో బీజేపీపై మండిపడ్డారు. అయితే బీజేపీ మద్దతుదారులు తమ పోస్టులను రాజకీయ వ్యంగ్యంగా సమర్థిస్తూ.. ప్రత్యర్థి పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో కొందరు మాత్రం ‘రెండు పార్టీలు బురదలో కొట్టుకుంటున్నట్లుగా ఉంది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రాజకీయ అంశాలపై చర్చించాల్సిన సోషల్ మీడియా వేదికలు.. ఇలా పాత ఫొటోలు, మీమ్స్, వ్యక్తిగత విమర్శలకు వేదికలుగా మారడంపై కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.వైరల్ ట్రెండ్.. రాజకీయ పోరుకు ఆయుధంఇటీవల సోషల్ మీడియాలో పాతకాలం నాటి ఫొటోలు, మీమ్స్ను కొత్త క్యాప్షన్లతో వైరల్ చేయడం ట్రెండ్గా మారింది. రాజకీయ పార్టీలు కూడా ఇదే ట్రెండ్ను తమ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. ఈ ఘటనలోనూ ఓ పార్టీ పోస్టుకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడంతో మొదలైన వ్యవహారం.. చివరకు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. దీంతో రాజకీయాల్లో సోషల్ మీడియా మీమ్ సంస్కృతి ఎంతగా ప్రభావం చూపుతోందన్న చర్చ మరోసారి మొదలైంది.ఇదీ చదవండి: కోతులు అలా చేయడానికి మనమే కారణమా? -
యూపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మాయావతి మేనల్లుడిపై వేటు!
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్పై మరోసారి వేటు వేశారు. ఈసారి ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచే తొలగించారు. పార్టీ కంటే కుటుంబానికే ఆకాశ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని.. పైగా తాను చేసిన ట్వీట్ను అతను రీ-ట్వీట్ చేయలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారామె.బీఎస్పీ మాజీ రాజ్యసభ సభ్యుడు అశోక్ సిద్ధార్థ్ను మాయావతి ఆగస్టులో పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోవడం, పార్టీ నాయకత్వ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించడం వంటి కారణాలతో ఆయనపై మాయావతి చర్యలు తీసుకున్నట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 9న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.అశోక్ సిద్ధార్థ్ గనుక రాజకీయాల నుంచి తప్పుకుంటే.. ఆకాశ్ ఆనంద్ పార్టీ కోసం స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి వస్తుందని సూచించారు. ఆ వ్యాఖ్యల మరుసటి రోజే.. తన అల్లుడి రాజకీయ భవిష్యత్తు కోసం అశోక్ సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఇక ఆకాశ్కు మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు దక్కుతాయని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మాయావతి అతడినే పార్టీ నుంచి పూర్తిగా తొలగించారు.ఆ ఒక్క రీపోస్ట్ చేయలేదని..ఆకాశ్పై చర్యకు కారణాన్ని మాయావతి స్వయంగా వెల్లడించారు. తాను ఎక్స్లో పెట్టే పోస్టులను ఆకాశ్ గతంలో తరచూ రీపోస్ట్ చేసేవాడని చెప్పారు. కానీ అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని తాను చేసిన సూచనను మాత్రం ఆకాశ్ రీపోస్ట్ చేయలేదని పేర్కొన్నారు. అతని రాజకీయ భవిష్యత్తు కోసమే తాను ఆ పోస్టు పెట్టినా.. ఆకాశ్ దానిని పట్టించుకోకపోవడం తనకు ఆగ్రహం తెప్పించినట్లు మాయావతి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. పార్టీ ప్రయోజనాల కంటే కుటుంబ బంధానికే ప్రాధాన్యం ఇస్తున్నాడనే సంకేతంగా ఆమె దీనిని పరిగణించారు. ఇలా రెండు వైపులా ఆలోచించే వ్యక్తి బీఎస్పీ ప్రయోజనాల కోసం ఎలా పనిచేయగలడని మాయావతి ప్రశ్నించారు. పార్టీ, బహుజన ఉద్యమం కంటే కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చేవారితో ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.ఆకాశ్ ఆనంద్కు రాజకీయంగా ఇబ్బందులు రావడానికి అతనికి పిల్లనిచ్చిన అశోక్ సిద్ధార్థ్ ప్రధాన కారణంగా మాయావతి భావిస్తూ వచ్చారు. సెప్టెంబర్ 9న సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించిన తర్వాత.. గురువారం ఆయన సన్యాసం ప్రకటించారు. మాయావతిని తన రాజకీయ గురువుగా, అక్కగా పేర్కొన్న సిద్ధార్థ్.. ఆమె ఆదేశమే తనకు అన్నింటికంటే ముఖ్యమని చెప్పారు. తన వల్ల ఆకాశ్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతోనే రాజకీయాలకు దూరమవుతున్నట్లు తెలిపారు.అయితే ఆయన నిర్ణయం మాయావతిని సంతృప్తిపరచలేదు. సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం తీసుకున్నప్పటికీ అది చాలా ఆలస్యమైన నిర్ణయమని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ముందుగానే రాజకీయాల నుంచి తప్పుకుని ఉంటే బీఎస్పీ, బహుజన ఉద్యమం, ఆకాశ్ ఆనంద్ ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని అన్నారు. అంతేకాదు.. ఆకాశ్ రాజకీయ భవిష్యత్తు గురించి నిజంగా ఆలోచించి ఉంటే సిద్ధార్థ్ ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉండాల్సిందని మాయావతి వ్యాఖ్యానించారు.రెండేళ్లలో మూడోసారి..ఆకాశ్ ఆనంద్పై మాయావతి చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత రెండేళ్లలో ఆయనపై ఇది మూడో కీలక చర్య. వాస్తవానికి.. 2023 డిసెంబర్లో మాయావతి ఆకాశ్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బీఎస్పీ భవిష్యత్ నాయకుడిగా ఆయనకు ప్రాధాన్యం పెరిగింది. జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అప్పగించారు.2024 మేలో ఆకాశ్కు అప్పగించిన కీలక పార్టీ బాధ్యతలను మాయావతి తొలగించారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. 2025 మార్చిలో మరోసారి ఆయనపై చర్య తీసుకుని పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆకాశ్ క్షమాపణ చెప్పడంతో తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 3న జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో ఉండేందుకు మాత్రం అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వారం రోజులు కూడా తిరగకముందే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్నే రద్దు చేశారు.తమ్ముడికి కీలక బాధ్యతలు..ఆకాశ్పై వరుస చర్యలు జరుగుతున్న సమయంలోనే ఆయన తమ్ముడు ఇషాన్ ఆనంద్ బీఎస్పీలో కీలకంగా ఎదగడం ఆసక్తికరంగా మారింది. ఆకాశ్ను జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగించిన కొద్ది రోజులకే 27 ఏళ్ల ఇషాన్ ఆనంద్కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో బీఎస్పీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను ఆయనకు ఇచ్చారు. తన తండ్రి, బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్ కుమార్కు ఇషాన్ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఆకాశ్ నిర్వహించిన బాధ్యతల్లో కొంత భాగం ఇప్పుడు ఇషాన్ చేతికి వెళ్లడంతో.. ఆయన మాయావతికి రాజకీయ వారసుడిగా ఎదుగుతారా? అనే చర్చ మొదలైంది.ఎన్నికల ముందు బీఎస్పీలో కలకలంఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఎస్పీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీని బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి రావాలని మాయావతి లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 403 స్థానాల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్నీ గెలవలేకపోయింది. ఓటు శాతం కూడా 9.39 శాతానికి పడిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీ భవిష్యత్తుకు కీలకంగా భావించిన ఆకాశ్ ఆనంద్నే బయటకు పంపడం బీఎస్పీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇషాన్ ఆనంద్కు కీలక బాధ్యతలు అప్పగించడం మరింత ఆసక్తిని రేపుతోంది.2027 ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని మాయావతి ఇప్పటికే పిలుపునిచ్చారు. పూర్తి మెజార్టీతో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టాలని కోరారు.అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆకాశ్ ఆనంద్కు మళ్లీ బీఎస్పీలో కీలక స్థానం దక్కుతుందని భావించినా.. సీన్ పూర్తిగా మారిపోయింది. మామ రాజకీయ సన్యాసం తీసుకున్నా.. మేనల్లుడికి మాత్రం పార్టీ తలుపులు మూసుకుపోయాయి. అందుకు కుటుంబంపై ఉన్న అనుబంధమే కారణమని మాయావతి భావించడం ఇప్పుడు బీఎస్పీలో హాట్టాపిక్గా మారింది.ఇదీ చదవండి: టీవీకేకు తొలి పరీక్ష.. నెగ్గుతారా? -
కాక్రోచ్లు ఊరికే రావు..! మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే
అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం.– మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, చంద్రబాబు స్కామ్ల చరిత్రలో అదో ఆణిముత్యం.. చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో మరోసారి ఎండగట్టారు. ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని, వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు ఏడు సార్లు వెరిఫికేషన్ చేశామని అధికారులు చెబుతున్నారని.. మరి అన్ని నకిలీ (ఫేక్) సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవని అధికారులు చెప్పలేకపోయారన్నారు. జరగని పోటీలు, టోర్నీలతో సర్టిఫికెట్లు జారీ చేశారని.. అవి బోగస్ అని స్వయంగా అసోసియేషన్లు వెల్లడించినా వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా తమవారికి అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత గేట్లు మూసేసిందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అసలు ఏ పరీక్షా లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్ అని స్పష్టం చేశారు. ఇదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, అయితే మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్ వేయడమే కాకుండా, మిగిలిన పోస్టులకూ నియామకాలు చేపట్టలేదని వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు కల్పిస్తేనే కాక్రోచ్లు పుట్టుకొస్తాయని, తప్పు చేసిన వారి మెడలు వంచేందుకు తానూ కాక్రోచ్గా మారతానని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబుకు బీపీ పెరిగి బెదిరిస్తున్నారుడీఎస్సీ 2025 కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత కూడా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలరా? అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్కామ్ రూపాలన్నీ అనకొండలా అనిపిస్తున్నాయి. అందుకే ఇవి బయటకు వచ్చే కొద్దీ చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది. ఎవరైనా తప్పులు, ఆధారాలు బయటపెడితే వారిపై కేసులు పెడతాం, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. జర్నలిస్టుల మీద సైతం కేసులు పెడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిలదీయకూడదంటూ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?మెగా డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో సాక్ష్యాలు, ఆధారాలతో చూపించా. దీనిపై నేను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా చంద్రబాబుగానీ ఆయన సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రిగానీ సూటిగా సమాధానం చెప్పలేదు. అవన్నీ స్కామ్ పునాదులు. నేను అడిగిన ఆ నాలుగు ప్రశ్నలు చాలా సింపుల్. వాటిని మరోసారి గుర్తు చేస్తున్నా.1? రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ.. ఈ రెండిటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? పారదర్శకతకు ఎందుకు పాతరేశారు? ఇది స్కామ్కు ద్వారాలు తెరిచినట్లు కాదా? అని అడిగితే చంద్రబాబు నోరు విప్పలేదు.2? స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? అతడికి మొదటి ర్యాంకు వచ్చినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అతడి పేరును సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎందుకు తీసేశారు? అతడి డీఎస్సీ క్యాండిడేట్ లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు? అతడిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? తనను పిలవలేదని డీఎస్సీ కన్వీనర్కు నవీన్ లేఖ కూడా రాశాడు. నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? ఇదంతా స్కామ్ను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా? డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలను కూడా అమ్ముకున్నారని కొంతమంది అభ్యర్థులు చెప్పడం ఇటీవల సోషల్ మీడియాలో చూస్తున్నాం.. మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి ఇది మరింత బలాన్ని ఇవ్వడం లేదా?3? స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి గతంలో ఉన్న 2 శాతం కోటాను 3 శాతానికి పెంచడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ పరీక్షా రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా భర్తీ చేసుకోవడానికి జీవో నెం.4, జీవో నెం.47 ఎందుకు తీసుకువచ్చారు? ఈ జీవోలతో గేట్లు ఎత్తి 372 మందిని రిక్రూట్ చేసి, పనైపోయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.25, జీవో నెం.56తో గేట్లు మూసేశారు. ఎందుకు ఇంత అడ్డగోలు జీవోలు ఇచ్చారు? అసలు పరీక్షే లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఇష్టం వచ్చినట్లు ఇస్తారా? ఎందుకు జీవోలు ఇచ్చారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు?4? టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఏకంగా ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చిన తరువాత కూడా కేసును ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే వరకూ కేసును నీరుగార్చారు.అంత క్లియర్గా ఆడియో కాల్లో నెంబర్ కనిపిస్తుంటే ఆ వ్యక్తిని కనిపెట్టడం కష్టమా? కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం గుర్తు తెలియని (సస్పెక్ట్) వ్యక్తి అని రాశారు. కేసు నమోదుకు ఆలస్యం ఎందుకు అయ్యిందంటే..? ఉన్నతాధికారులతో సంప్రదించడం వల్ల అని రాసుకొచ్చారు. చంద్రబాబు, ఆయన తనయుడు మాత్రం.. అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించామని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో చూస్తే రిమాండ్కు పంపలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవన్నీ సింపుల్ ప్రశ్నలు. ఆరేళ్ల పిల్లాడికైనా అర్థం అవుతాయి. ఇవే మెగా డీఎస్సీ కుంభకోణానికి పునాదులు. ఇప్పుడు బయటకు వస్తున్న ఉదాహరణలన్నీ వీటికి సంబంధించిన కోణాలే. వెన్నుపోటు పార్టీ నాయకుడికి తనను, తన తనయుడిని కాపాడుకోవడమే ప్రధానం.అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం...! ఒక అక్రమాన్ని తవ్వుతుంటే, మరొకటి బయట పడుతోంది. బాబు కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ స్కామ్ ఆణిముత్యంగా నిలిచిపోతుంది. నిరుద్యోగ యువకులను నట్టేట ముంచిన స్కాం ఇది. స్పోర్ట్స్ కోటా పేరుతో చేసిన అక్రమాలు చూస్తే.. వీడు మనవాడా! డబ్బులు ముట్టాయా! అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం అన్నట్లుగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారు. జరగని పోటీలు జరిగినట్లుగా, ఆ పోటీల్లో పాల్గొని అద్భుతంగా ఆడినట్లుగా, తప్పుడు సర్టిఫికెట్లతో పోస్టులు ఇచ్చారు.పైస్థాయి నుంచి ఆదేశాలతో కింది స్థాయి వరకూ కుమ్మకై, ఒక పద్ధతి ప్రకారం (మోడస్ ఆపరాండీ) ఈ పోస్టులన్నిటినీ భర్తీ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రతి కేస్ స్టడీ చెబుతోంది.జూడోలో పరీక్ష లేకుండా పోస్టులు..మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అసలు పరీక్షలే లేకుండా 372 మందిని నియమిస్తే.. ఒక్క జూడో కింద 39 మందికి ఎలాంటి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చారు. వీరిలో కొందరు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్ 2013 ఖమ్మంలో జరిగినట్లుగా, అందులో పాల్గొని గెలిచినట్లుగా ధ్రువీకరిస్తూ ఏపీ జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లు పెట్టారు. తీరా చూస్తే అసలు ఆ తేదీల్లో (2013 అక్టోబర్ 19–21 మధ్య) ఆ ఛాంపియన్షిప్ ఖమ్మంలో జరగలేదని, తెలంగాణ జూడో అసోసియేషన్, ఖమ్మం జిల్లా జూడో అసోసియేషన్ చాలా స్పష్టంగా రాతపూర్వకంగా చెప్పాయి. ఇంతకీ ఈ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే.. చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు స్వయనా తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్. దీని అర్థం.. దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని, మళ్లీ ఆ దొంగ సర్టిఫికెట్లకు మన రాష్ట్రంలోని పెద్దలే ధృవీకరణ కూడా చేసి ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. సాఫ్ట్బాల్ పేరిట మరో 38 మందికి ఇలానే పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన సంతకం చేసిన 21 సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలిచ్చేశారు.పైనుంచి ఫోన్.. అంతా సెట్బసవేశ్వరరావు అనే మరో అభ్యర్థి 49వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ గుడివాడలో జరిగిందని, అందులో పాల్గొన్నానని సర్టిఫికెట్ పెట్టాడు. కానీ అతడి సర్టిఫికెట్ ఫేక్ అని ఆంధ్రా ఖోఖో అసోసియేషన్ అధికారికంగా శాప్కు లేఖ ఇచ్చింది. అయినా సరే దానిని పక్కన పడేసి, ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన వాడికి ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకంటే పైనుంచి ఫోన్.. అంతా సెట్ అయిపోయింది ఉద్యోగం ఇచ్చేయమని! ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థి కబడ్డీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ 2003 నాగార్జున యూనివర్శిటీలో ఆడినట్లుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో, పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆ యూనివర్శిటీలో ఆ గేమ్స్ జరగలేదని, సౌత్ వెస్ట్ జోన్ కబడ్డీ పోటీలు మాత్రమే జరిగాయని తేలింది. అయినా సరే 7 అంచెల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నారు! టెట్ క్వాలిఫై కాకున్నా ఉద్యోగాలు..మరికొన్ని కేసుల్లో అయితే టెట్ పాసవకుండానే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక కేటగిరీలో టెట్ మార్కులు చూపించి, మరో కేటగిరీ టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇంకొన్ని కేసుల్లో.. అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో ఉద్యోగం ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్ అనే అభ్యర్థికి ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు. అతడి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్లో 75 మార్కులు రావాలి. కానీ ఆయనకు 65 మాత్రమే వచ్చాయి. ఇదే విషయాన్ని కర్నూలు డీఈవో కూడా ఒప్పుకున్నారు. మరి ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఎవరు చెబితే ఇచ్చారు? దీనిని కవర్ చేసుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ప్రభాకర్కు టెట్లో 77 మార్కులు 2018లో వచ్చాయని అధికారులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ హాల్టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి టెట్ డేటా చూస్తే ఆ 77 మార్కులు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2 బీ కేటగిరీకి సంబంధించిన మార్కులని తేలింది. అవి చూపించి ఆయనకు టెట్ 1 ఏ కేటగిరీలో ఉన్న పోస్టు ఎలా ఇచ్చారు? సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్రువీకరించి ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ ఉద్యోగాలు పొందిన 21 మంది వివరాలు ‘ఈడబ్ల్యూఎస్’ మరో పెద్ద రాకెట్..ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్లు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి. ఇతర కులాలకు చెందిన వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉద్యోగాలిచ్చారు. కడప, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లాలో రసూల్ 2008, 2012, 2018లో బీసీ–ఈ కేటగిరీ కింద డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పుడు మాత్రం ఓసీ–ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉద్యోగం ఇచ్చారు. 1 : 1 రేషియోలో అధికారులు వెరిఫికేషన్ చేశాక కూడా పోస్టు ఎలా ఇచ్చారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7 సార్లు వెరిఫై చేశామని చెబుతున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎలా జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా ఎలా పోస్టులు ఇచ్చారు? ఎవరు చెబితే ఈ పని చేశారు? డీఎస్సీ స్కామ్ పునాదుల నుంచి ఈ కేస్ స్టడీస్ అన్నీ బయటకు వస్తున్నాయి. ‘ఏపీపీఎస్సీ’లోనూ ఇదే చేయాలనుకున్నారు!ఇంకా నిర్ఘాంతపోయే అంశం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఏపీపీఎస్సీలోనూ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలిచ్చేయాలని చూశారు. అటవీ శాఖలో 814 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అందులో 40 పోస్టులు స్పోర్ట్స్ కోటా పేరిట పరీక్ష లేకుండా, కేవలం ఇలాంటి సర్టిఫికెట్లతో భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4ను వీళ్లు వాడుకున్నారు. అంటే డీఎస్సీ కుంభకోణం బయటకు రాకపోయి ఉంటే ఏపీపీఎస్సీలోనూ ఈ 40 పోస్టులు ఇచ్చేసేవారు. డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో మిగతా 774 పోస్టుల భర్తీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. 40 మంది జాబితా బయటపెట్టాల్సి వస్తుందని కాదా? అని నేను అడుగుతున్నా. ప్రభుత్వం, వ్యవస్థలపై నమ్మకం ఎలా ఉంటుంది?పోటీ పరీక్షల కోసం లక్షల మంది పిల్లలు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు ఇంత కష్టపడుతుంటే చివరికి స్కామ్లు చేసి, లంచాలు తీసుకుని నచ్చిన వాళ్లకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఇక ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్చాలంటే ఎలా జరుగుతుంది? పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. లేదంటే కాక్రోచ్లు రాక తప్పదు. వీరి మెడలు కూడా వంచక తప్పదు. కచ్చితంగా అదే జరుగుతుంది.అందుకే సీబీఐ విచారణ అవసరంఅసలు పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడమే ఓ స్కామ్. జీవోలు ఇవ్వడం.. స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు నింపడం.. ఆ తరువాత జీవోలను రద్దు చేయడం ఇదంతా పెద్ద స్కామ్! అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం. కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను పాలకుడు ఇలా దగ్గరుండి చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు.తప్పులు ఒప్పుకోక తప్పలేదు..!తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారులతో మాట్లాడించారు. ఐఏఎస్అధికారుల ప్రెస్మీట్ తర్వాత అంతిమంగా తేలింది ఏమిటంటే...⇒ టెట్ పాస్ అర్హత లేకపోయినా, పోస్టులు ఇచ్చామని ఒప్పుకోక తప్పలేదు.⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవి అని చెప్పలేకపోయారు.⇒ వెరిఫికేషన్ ఒక బోగస్ అని చెప్పకనే చెప్పారు.⇒ టోర్నమెంట్లు జరగకుండానే సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.⇒ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు.⇒ లోకేశ్ తోడల్లుడు అధ్యక్షుడిగా ఉన్న జూడో అసోసియేషన్లో పోటీలు జరగకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు. ⇒ కులాలు మార్చి కూడా పోస్టులు ఇచ్చామని అంగీకరించక తప్పలేదు.చక్రం తిప్పిన శాప్..మరికొన్ని కేసుల్లో శాప్ స్వయంగా చక్రం తిప్పింది. విశాఖపట్నంలో ఏ పరీక్షా లేకుండా స్పోర్ట్స్ కోటాలో సీహెచ్ యోగేశ్వరరావు అనే అభ్యర్థికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగం ఇచ్చారు. ఆయన చెల్లికి కూడా ఇచ్చారు. కుటుంబం మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నట్లున్నారు! నల్గొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2009లో యోగేశ్వరరావుకు ఫస్ట్ ప్లేస్, ఆయన చెల్లి మోహినిదేవికి సెకండ్ ప్లేస్ వచ్చినట్లు సర్టిఫికెట్లు చూపించారు. అయితే విజేతల జాబితాలో వీళ్లు లేరని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ రోజు పోటీలో గెలుపొందిన క్రీడాకారుల వివరాలు, పేర్లతో కూడిన రికార్డులను కూడా బయటపెట్టింది. అంటే ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుని, ఆ మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని అర్థం అవుతోంది. కానీ ఇచ్చిన ఈ ఉద్యోగాలన్నీ ఏడు సార్లు వెరిఫికేషన్ అయిన తరువాత, ప్రతీ దానిని స్రూ్కటినీ చేసి, స్క్రీనింగ్ చేసి, తనిఖీ చేసి ఇచ్చామని అధికారుల చేత చంద్రబాబు చెప్పిస్తున్నారు. -
మీ కోసం.. ఎనీ టైమ్
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆఫీసు రచ్చబండ లాంటిది. నా కార్యాలయ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ఉద్యోగ సంఘాల నేతలు నన్ను ఎప్పుడైనా కలవచ్చు. ఉదయమే కాదు... రాత్రిపూట కూడా వచ్చి కలవచ్చు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది’అని సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితర ప్రతినిధి బృందం సీఎంతో సమావేశమైంది. ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలను టీజీఈజేఏసీ ప్రతినిధులు వివరించారు. ఇందుకు సంబంధించి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా ఆరు అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు. రెండవ పీఆర్సీ నివేదిక, 51% ఫిట్మెంట్, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, రూ.10,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు–ఓపీఎస్ అమలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఉద్యోగ సంఘాల గుర్తింపు తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఉద్యోగుల సమస్యలను ఆలకించిన అనంతరం సీఎం పైవిధంగా స్పందించారు. నివేదిక పరిశీలిస్తాం...తుది నిర్ణయం తీసుకుంటాం జేఏసీ ప్రతినిధులతో సీఎం మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక సమర్పించేందుకు ఇప్పటికే కమిషన్కు ప్రభుత్వం లేఖ పంపిందని, నివేదిక అందిన అనంతరం దానిని పరిశీలించి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి పీఆర్సీ, డీఏలపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ.10వేల కోట్లు విడుదల చేసిందని, ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని సీఎం తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అనేక అంశాలు తన ముందున్నాయని, వాటితో పాటు ఇతర పరిపాలనా కార్యక్రమాల వల్ల సమయం కేటాయించడం కష్టంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆర్థిక శాఖతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశమై అన్ని అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో జేఏసీ ప్రతినిధులు దామోదర్ రెడ్డి, చావ రవి, సదానంద గౌడ్, గౌతమ్ కుమార్, కటకం రమేష్, ముజీబ్ హుస్సేన్, బి.శ్యామ్, వెంకట్, రమణారెడ్డి, భిక్షం గౌడ్ తదితరులున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు, డిప్యూటీ కలెక్టర్ల సంఘంవ్యవస్థాపక అధ్యక్షులు వి.లచి్చరెడ్డి, జేఏసీ నేత వడ్నాల రాజశేఖర్ కూడా సీఎంను కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం టీజీఈజేఏసీ ప్రతినిధి బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. -
‘సర్’తో.. ఏదో ప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న ఆంతర్యాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు గ్రహించాలని చెప్పారు. ఎస్ఐఆర్ను చాలా సీరియస్గా తీసుకోవాలని అన్నారు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు చెప్పానని, ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలని, అర్హులైన వారి ఓటు హక్కును కాపాడాలని సూచించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిది నరసింహారెడ్డి, వంగా సుబ్బారావు, జి.సిద్ధయ్యల మృతికి సీఎల్పీ సంతాపం తెలిపింది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర ‘ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా చూపెడుతున్నారు. కానీ ఓటర్ల సంఖ్య మాత్రం 88 కోట్లే అంటున్నారు. అంటే దాదాపు 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ 15 కోట్ల ఓట్ల తొలగింపు కారణంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయగలగాలి. ఆ ప్రమాదం మన దరిదాపులకు రానీయకుండా మీరే జాగ్రత్త పడాలి. మీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుంది. మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. ఎస్ఐఆర్ కోసం నేను రెండు రోజులు కొడంగల్లోనే ఉన్నా. ఎమ్మెల్యేలందరూ అలానే ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో జరిగిన జనగణన దేశానికి రోల్మోడల్. రాష్ట్ర నమూనాను దేశ వ్యాప్తంగా జనగణనలో చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అధికారం పోయినా అహంకారం పోలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలి. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఫామ్హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన సభ జరగకుండా కుట్ర చేశారు. అధికారం పోయినా వారికి అహంకారం పోలేదు. పోలీసులు, ప్రజాప్రతినిధులను దూషించి మూడు రోజుల పాటు సభ సజావుగా జరగకుండా చేశారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించారు. మహిళా అధికారుల ముందు టీ షర్టులు విప్పి ఇబ్బంది కలిగించారు. సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. దళితులు నిరసన తెలిపేందుకు వెళ్లిన నేలను శుద్ధి చేసి అవమానపర్చారు. అయినా ప్రతిపక్షం కుట్రలను బలంగా తిప్పికొట్టడంతో పాటు ఆ కుట్రను ప్రజలకు తెలియజేయగలిగాం..’అని సీఎం అన్నారు. కుట్రను తిప్పికొట్టారంటూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అభినందించారు. సీఎల్పీ భేటీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, రాజనర్సింహ, ఉత్తమ్, మహేశ్ గౌడ్, శ్రీధర్బాబు, ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో పనితీరు ఆధారంగానే పదోన్నతులు ‘అసెంబ్లీలో జరిగిన ఘటనల గురించి ఫ్లాష్ సర్వే చేయించా. అందులో కాంగ్రెస్కు చాలా పాజిటివ్గా వచ్చింది. మనం ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తుంటారు. కాంగ్రెస్ సభ్యులు లాబీల్లో తిరగడం కాదు. అసెంబ్లీలో హాజరు తగ్గకుండా చూసుకోవాలి. సభ జరిగినన్ని రోజులు ఖచ్చితంగా హాజరు కావాలి. చర్చల్లో పాల్గొనాలి. నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించాలి. ప్రజలిచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా రాణించలేరు. అసెంబ్లీలో పనితీరు ఆధారంగానే పదోన్నతులు వస్తాయి. సభలో అందరికీ వెసులుబాటుగా ఉండడం కోసం అత్యంత చారిత్రక భవనంలో శాసనమండలి నిర్వహిస్తున్నాం. అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు పేరిట సెంట్రల్ హాల్ ఏర్పాటు చేశాం. 22ఏలో కోటి ఎకరాలు అవాస్తవం 22ఏ అనేది అభూత కల్పన మాత్రమే. ఈ జాబితాలో కోటి ఎకరాలు ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న భూములే ఇప్పుడూ ఉన్నాయి. ప్రైవేటు వివాదాలున్నవి కేవలం 3 లక్షల ఎకరాలు మాత్రమే. ధరణిలో భారీ ఎత్తున అరాచకాలు చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ నేత ఒకరి పేరిట వెయ్యి ఎకరాలు ఎక్కించుకున్నారు. వీటన్నింటిపైనా విచారణ చేయిస్తున్నాం. అన్నీ ఒకొక్కటిగా బయటకు వస్తాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎల్నినో కారణంగా వచ్చే 10 నెలలు కూడా ఇబ్బంది ఉంటుంది. కరువు వచ్చే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేలు సాగునీటిపై కాకుండా తాగునీటిపై ఫోకస్ చేయాలి. కొందరు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి అదే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగేవారా?’అని సీఎం ప్రశ్నించారు. వెయ్యి రోజుల పాలనకు సహకరించిన సీఎల్పీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికీ పథకాల ప్రచారం జరగాలి: భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరం కలిసి పనిచేస్తే కుట్రలను ఎలా ఛేదించగలమో చేసి చూపించామని అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు, వారి భాష, వివక్ష పూరిత కార్యకలాపాల గురించి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసి కట్టడి చేయగలిగామని అన్నారు. అందరం ఒకటే మాట, ఒకటే బాటగా ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడంలో వెనుకబడుతున్నామన్నారు. సరైన విధంగా ప్రచారం చేసుకుంటే ఆ ప్రవాహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేసిన పనులను ప్రతి గ్రామంలో ఇంటింటికీ ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణలోనే సామాజిక న్యాయం: పీసీసీ చీఫ్ సామాజిక న్యాయం తెలంగాణలోనే అమలవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ బీసీ కాకపోయినా బీసీలకు రిజర్వేషన్ల కోసం ముందుకొచ్చారని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. కాగా రాష్ట్రంలో పరిస్థితులను పలువురు మంత్రులు సీఎల్పీకి వివరించారు. ఎల్నినో ప్రభావం, నీటి సమస్యపై మంత్రి ఉత్తమ్, జనగణనలో బీసీ కాలమ్ గురించి పొన్నం, 22ఏ భూముల జాబితా గురించి పొంగులేటి, పాలిటెక్నిక్ విద్యార్థుల అంశంపై మంత్రి వివేక్లు వివరించారు. యాష్కీకి సీఎం శుభాకాంక్షలు ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్గా ఎంపికైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్కు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సీఎల్పీ సమావేశం అనంతరం.. అసెంబ్లీ కమిటీ హాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాష్కీకి శుభాకాంక్షలు తెలియజేశారు. -
రేవంత్ సర్కార్ ‘ఫ్లాష్ సర్వే’.. తేలింది ఇదే..!
సాక్షి, హైదరాబాద్: సీఎల్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల ఘటనలపై ఫ్లాష్ సర్వే చేయించానని.. బీఆర్ఎస్ గ్రాఫ్ చాలా పడిపోయిందన్నారు. ప్రజలు.. బీఆర్ఎస్ నేతల తీరునే తప్పుపట్టినట్లు సర్వేలో తేలిందన్న రేవంత్.. ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీకి అండగా నిలబడ్డారు. మొన్నటి ఘటనలో పోలీసులు చాలా ఓర్పుతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.‘‘కోటి ఎకరాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కానీ 3.06 లక్షల ఎకరాలు మాత్రమే 22ఏలో ఉంది. మిగతాది అంతా ప్రభుత్వ, అటవీ భూములే. నేను ‘సర్’ కోసం రెండు రోజులు కొడంగల్లో ఉన్నాను. అందరూ అదే విధంగా ఫోకస్ చేయాలి. ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సభను నిర్వహిస్తున్నాం’’ అని రేవంత్ చెప్పారు.శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టాం. సభ్యులు తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనండి. సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ పరిపాలనా వైఫల్యం’
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చేందుకు పవర్ లేదని, ప్రతి పక్షాల పీక నొక్కేందుకు మాత్రం కాంగ్రెస్కు పవర్ ఉందా? అని నిలదీశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు. రాష్ట్ర రైతులకు కనీసం ఇప్పుడు 7 నుంచి 8 గంటల కరెంట్ కూడా రావడం లేదని హరీష్రావు విమర్శించారు. ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 10వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మాట్లాడిన హరీష్రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో తెలంగాణ రైతాంగ కష్టాలు చూడాల్సి వస్తుందన్నారు. ‘ఒకవైపు నీళ్లు ఇవ్వలేవు.. కరెంట్ ఇవ్వలేవు.. ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా?’ అని ప్రశ్నించారు. అసలు రైతులకు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని సూటిగా నిలదీశారు. భద్రాద్రి, కొత్తగూడెం పవర్ ప్లాంట్ ఎందుకు బంద్ చేశావ్ రేవంత్ అని ప్రశ్నించారు. ఇక యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నడపలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ పరిపాలనా వైఫల్యమని హరీష్ మండిపడ్డారు. ఇదీ చదవండి: ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి -
‘లోకేష్కు మంత్రిగా కొనసాగే హక్కు లేదు’
గుంటూరు: డీఎస్సీ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన లోకేష్కు మంత్రిగా కొనసాగే హక్కు లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. డీఎస్సీ పరీక్షల్లో ఎన్నడూ జరగనంత అవినీతి జరిగిందని, లోకేష్ అడ్డంగా దొరికిపోయాడని మండిపడ్డారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సీబీఐ వ విచారణ జరిపించాలని అంబటి డిమాండ్ చేశారు.‘డీఎస్సీ పై ప్రభుత్వానికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. అందుకే చంద్రబాబు గానీ, లోకేష్ గానీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మాట్లాడలేదు. లోకేష్... లవ్ క్యాష్ అన్న సంగతి తెలుసు. లోకేష్ దొరికిపోయిన దొంగ. లోకేష్ రాజకీయాలకు పనికి రారు...మంత్రిగా కూడా పనికి రారు. లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారట ముఖ్యమంత్రిని చేస్తే దేశాన్నే అమ్మేస్తారు. లోకేష్ ఉద్యోగాలను బఠానీలు అమ్మినట్లు అమ్మేశారు. ఆయన రాజీనామా చేయాలి. లోకేష్తోనే టీడీపీ సర్వ నాశనం అవుతుంది. డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్ల చేత మాట్లాడిస్తున్నారు. ఇంకా రెండు డిఎస్సీలు పెడతామంటున్నారు. లోకేష్కు మంత్రి సీటులో కూర్చునే హక్కు లేదు’ అని ధ్వజమెత్తారు.ఇదీ చదవండి:చంద్రబాబుది టెన్షనా.. ఫ్రస్టేషనా? -
‘నమ్మినవాళ్లే మోసం చేశారు..’ ఏడ్చేసిన బొత్స
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలి పరిణామాలతో కలత చెందిన ఆయన.. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను అంటూ కంటతడి పెట్టారు. అయితే తండ్రి బొత్స సత్యనారాయణ కంటితడి పెట్టడంపై ఆయన కుమార్తె బొత్స అనూష చలించిపోయారు. తండ్రిని ఓదార్చారు. గురువారం గరివిడిలో చీపురుపల్లిలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమయంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్(చిన్న శ్రీను) ఇటీవలె పార్టీ మారడం.. పార్టీతో కలిసి నడిచిన రోజుల్ని, అనుబంధాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. ఆ ప్రసంగాల సమయంలో.. నమ్మినవాళ్లు మోసం చేశారంటూ బొత్స ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆపై తనను తాను సముదాయించుకుని.. ‘‘వ్యక్తులు రావొచ్చు.. పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం పని చేయాలి. వైఎస్ జగన్ ఆశయాల కోసం కలిసి పని చేద్దాం. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: నేనూ ఓ కాక్రోచ్గా మారొచ్చు: వైఎస్ జగన్ -
జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ జరగాలి.. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వినిపించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. స్కామ్కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెట్టారు.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారు?. టెట్ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ఒప్పుకున్నారు. స్పోర్ట్ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. లంచాలు తీసుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కూడా బోగస్సే. అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలివ్వడమే పెద్ద స్కాం....ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు. దొడ్డిదారిన జీవో నెంబర్ 4 తేవాలని చూశారు. మా హయాంలో క్లియరెన్స్ పొందిన 814 పోస్టుల్లో.. పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారు. డీఎస్సీ స్కాం బయటకు రావడంతో ఆగిపోయారుచంద్రబాబు, లోకేశ్లు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఆయన దగ్గర పని చేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. నిరుద్యోగ యువత కోసం కోర్టులోనూ పోరాడుతున్నాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యపైనా వైఎస్ జగన్ స్పందించారు. లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్కామ్పై ఇంతరాద్ధాంతం జరుగుతుంటే.. బీజేపీ, జనసేన మౌనంగా ఉండడంపై వైఎస్ జగన్ స్పందించారు. జగన్ అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన స్పందించకపోవడంపై వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నందుకు.. ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పుచేసుకున్నందుకు వాళ్లు సిగ్గుపడాలని వైఎస్ జగన్ అన్నారు. -
దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్లో వాస్తవాలు బయటపడుతున్నా.. దాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏడుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని అధికారుల ద్వారా చెప్పిస్తూ ఇప్పుడు కవర్అప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్ పాస్ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నంకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, కుటుంబం మొత్తానికీ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కీలకంగా వ్యవహరించిందన్నారు.యోగేశ్వరరావు, మోహినీదేవి పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టం చేసిందని జగన్ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరిగిందన్నారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో సౌత్జోన్ కబడ్డీ పోటీలు జరిగాయని, కాబట్టి ఆమె సమర్పించింది నకిలీ సర్టిఫికెట్గా తేలిందని ఆయన చెప్పారు.ఈడిగ ప్రభాకర్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆయన టెట్కు క్వాలిఫై కాలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.మరోవైపు ‘ఏడుసార్లు వెరిఫికేషన్ అయ్యాకే ఉద్యోగాలు ఇచ్చాం’ అని అధికారులు డీఎస్సీ స్కాం గురించి ప్రెస్మీట్ పెట్టి చెప్పారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. డీఎస్సీ స్కామ్పై ప్రశ్నలు తలెత్తిన తర్వాత.. కొందరు అభ్యర్థులు చాలాసార్లు టెట్ రాసి ఉండొచ్చని, అందువల్ల ఉద్యోగం వచ్చి ఉండొచ్చంటూ కవర్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు ఆ వెరిఫికేషన్ కూడా బోగస్ అని ఆయన అభివర్ణించారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలు, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.ఇదీ చదవండి: ఆధారాలు చూపిస్తే అక్రమ కేసులా? -
కాక్రోచ్లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో.. డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో డీఎస్సీ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.డీఎస్సీ స్కామ్ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. కొడుకు నారా లోకేశ్ను కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి స్కామ్ల వల్లే కాక్రోచ్లు(కాక్రోచ్ జనతా పార్టీ.. జెన్జీ ఉద్యమంను ఉద్దేశించి) పుట్టుకొస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు.వ్యవస్థలు చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. ఇలాంటి స్కామ్లతో కాక్రోచ్లు రాక తప్పదు. ఆఖరికి నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు అని వైఎస్ జగన్ కామెంట్ చేశారు.డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు అని ఖమ్మం(తెలంగాణ)లో జరగని ఈవెంట్లతో ఉద్యోగాలిచ్చిన కేసును ఆధారాలతో సహా చూపించారు. ఆ జూడో అసోషియేషన్ అధ్యక్షుడు ఎవరో కాదు.. చంద్రబాబు దగ్గరి బంధువు.. నారా లోకేశ్ తోడల్లుడు.. టీడీపీ ఎంపీ భరత్ అని చెప్పారు. సాఫ్ట్ బాల్ విషయంలోనూ ఇదే జరిగిందని.. దాని అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవి అని గుర్తు చేశారు. వీటి ఆధారంగా దొంగ సర్టిఫికెట్లు గుర్తించినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: డీఎస్సీ స్కాంతో బాబుకి హైబీపీ -
డీఎస్సీ స్కామ్తో చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. సుదీర్ఘంగా ఈ కుంభకోణంపై కొత్త విషయాలతో మాట్లాడారాయన.డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. స్కామ్ జరిగిందని ఎవరైనా ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. వాళ్లను జైల్లో పెడుతున్నారు. జర్నలిస్టులు కొందరు వాస్తవాలు బయటపెడితే.. వాళ్లపైనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించాం. నా ప్రశ్నలకు చంద్రబాబు, నారా లోకేశ్ దగ్గరి నుంచి సమాధానమే లేదు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ.. పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?. ఇక్కడే డీఎస్సీ స్కామ్కు ద్వారాలు తెరిచారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్లో ఫస్ట్ర్యాంకర్ పేరు ఎందుకు లేదు?. సెకండ్ లిస్ట్లో అతని పేరు ఎందుకు మాయమైంది?. అతని డీఎస్సీ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు. ఎందుకు అతన్ని వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు?. కోర్టుకు ఆ ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు?. స్కామ్ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అని వైఎస్ జగన్ అన్నారు. స్పోర్ట్ కోటాలో పరీక్షే లేకుండా 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అందుకోసం ప్రత్యేక జీవోలు రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ అయ్యాక ఆ జీవోలు మార్చేశారు. డీఎస్సీ ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాల ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి. తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది స్కామ్ను దాచిపెట్టే ప్రయత్నం కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపనుంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఎదురైన పరిణామాలను జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయించబోతోంది.సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ నుంచి 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గురువారం ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో వాళ్లంతా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు. అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేశారని.. తమతో అనుచితంగా ప్రవర్తించారని ఎన్హెచ్ఆర్సీతో పాటు జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయయనున్నారు. అలాగే హోం శాఖపైనా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. తెలంగాణ హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ పరిణామాలకు సంబంధించిన ఫొటో, వీడియో ఫుటేజీలను ఇప్పటికే ఆ పార్టీ బహిరంగంగా ప్రదర్శించింది. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫొటోలు నకిలీవంటూ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ సాయంత్రానికే సబిత, సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో మహిళా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్మార్ట్ రేషన్ కార్డ్లో అన్నీ తప్పులే! -
బెంగాల్ రాజకీయాల్లో కొత్త సస్పెన్స్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో దారుణ ఓటమి.. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం.. టీఎంసీలో చీలిక.. ఇలా వరుస ఎదురుదెబ్బలతో మమతా బెనర్జీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని అంతా భావిస్తున్న వేళ.. ఆమెకు అనూహ్యంగా మరో అవకాశం తలుపుతట్టింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు ఇప్పుడు బెంగాల్లో కొత్త సస్పెన్స్కు తెరతీశాయి. రెండు స్థానాల్లో ఏదైనా ఒకదాని నుంచి దీదీ బరిలోకి దిగి.. మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మమతా బెనర్జీ అసెంబ్లీలో ఉంటే బీజేపీ, ఇతర ప్రతిపక్షాలను నేరుగా ఎదుర్కోవడంతోపాటు ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెను నందిగ్రామ్ లేదంటే రిజినగర్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్రంలో బలపడటం, టీఎంసీలో చీలికలు–ఫిరాయింపులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మమత స్వయంగా అసెంబ్లీలోకి రావడం పార్టీకి రాజకీయంగా కీలకమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే..2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన సువేందు అధికారి, హుమాయున్ కబీర్ చెరో స్థానానికి రాజీనామా చేయడంతో నందిగ్రామ్, రిజినగర్ అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాల్లో నందిగ్రామ్ మమతకు కొంత అనుకూలమైన ఎంపికగా కనిపిస్తోంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ సువేందు అధికారి చేతిలో మమత 1,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ సువేందు అధికారి టీఎంసీ అభ్యర్థిపై 9,665 ఓట్ల మెజారిటీ సాధించారు. అయినప్పటికీ మమత స్వయంగా బరిలోకి దిగితే పోటీ స్వరూపం మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ముర్షిదాబాద్ జిల్లాలోని రిజినగర్లో ముస్లిం ఓటర్లు సుమారు 65 శాతం ఉన్నారు. ఈ సామాజిక సమీకరణం మమతకు అనుకూలంగా మారొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో కాంగ్రెస్కు ఉన్న పాత రాజకీయ బలం దృష్ట్యా రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని టీఎంసీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు.ఈసీ షెడ్యూల్ ప్రకారం బుధవారం (సెప్టెంబర్ 9) ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ కాగా.. సెప్టెంబర్ 17న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుగుతుంది. సెప్టెంబర్ 19 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 6న నందిగ్రామ్, రిజినగర్ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.మరో సస్పెన్స్!ఇదిలా ఉండగా, ఉప ఎన్నికల్లో టీఎంసీకి అసలైన గుర్తు(గడ్డి కాడపై రెండు పూలు) దక్కుతుందా? అన్నది మరో కీలక ప్రశ్నగా మారింది. పార్టీ నుంచి విడిపోయిన రితబ్రత బెనర్జీ వర్గం తామే అసలైన టీఎంసీ అని ఇప్పటికే కోర్టుకెక్కింది. అటు ఎన్నికల సంఘంలోనూ అభ్యర్థన దాఖలు చేసుకుంది. అంతేకాదు ఆ రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని, పార్టీ గుర్తు తమకే వస్తుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. అయితే మమతా బెనర్జీ ప్రజల్లోనే ఉన్నారని, ఆమె తరఫున అభ్యర్థి తప్పకుండా పోటీ చేస్తారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ కూడా రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. మమత రెండు చోట్ల పోటీ చేసినా మరోసారి ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత సజల్ ఘోష్ వ్యాఖ్యానించారు. దీంతో ఉప ఎన్నికలు కేవలం రెండు స్థానాల పోరుగా కాకుండా.. మమతా బెనర్జీ రాజకీయంగా మళ్లీ అసెంబ్లీలోకి వస్తారా? టీఎంసీపై ఆమె పట్టు ఎంతవరకు ఉంది? పార్టీ గుర్తు ఎవరికి దక్కుతుంది? అనే మూడు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పే ఎన్నికలుగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: పేరుతోనే అసలు విషయం చెప్పేసిన విజయ్ -
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
అసెంబ్లీ వేదికగా స్టాలిన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి విజయ్ చేసిన ‘అవినీతి’ ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. అలాగే స్టాలిన్పైనా విజయ్ బాడీ షేమింగ్ చేయడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో స్టాలిన్ వాటిపై స్పందించారు. తన తండ్రి, డీఎంకే మాజీ సీఎం కరుణానిధి హయాంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ.. ‘‘తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది నిజమే. అబద్ధం కాదు’’ అంటూ ఈ ఉదయం ఓ వీడియోను రిలీజ్ చేశారాయన. తన తండ్రి కరుణానిధి, తనను విజయ్ టార్గెట్గా చేసుకోవడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో తన దవడ వెనుక కథ ఇదేనంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారాయన. ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి మెరీనా బీచ్లో భారీ సభ నిర్వహించి మీసా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని స్టాలిన్ గుర్తుచేశారు. అనంతరం 1976 జనవరి 31న కేంద్ర ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిందన్నారు. ఆ వెంటనే గోపాలపురం ఇంటికి పోలీసులు వచ్చి తనను మీసా కింద అరెస్టు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.‘‘ఆ రోజు నేను ఇంట్లో లేను. నా కొడుకు ప్రచారానికి వెళ్లాడు.. రేపు వస్తాడు. వచ్చిన వెంటనే నేనే ఫోన్ చేస్తా.. వచ్చి అరెస్టు చేసుకోండి’’ అంటూ కరుణానిధి పోలీసులను వెనక్కి పంపారని తెలిపారు. మరుసటి రోజు తాను ఇంటికి వచ్చిన తర్వాత కరుణానిధే పోలీసులకు ఫోన్ చేసి తనను అరెస్టు చేయించారని చెప్పారు. జైల్లో తనను తీవ్రంగా హింసించారని స్టాలిన్ పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులను ఉంచే ప్రదేశంలో చిన్న గదిలో పది మందిని బంధించారని, అదే గదిలో ఒకే కుండను మూత్ర విసర్జనకు ఉపయోగించాల్సి వచ్చేదని వివరించారు. రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా పోలీసులు లాఠీలతో కొట్టేవారని, బూట్లతో తన్నేవారని చెప్పారు. ఖైదీల దాడిలో ఎంపీ చిట్టిబాబు మరణించారని, తన దవడ ఎముక విరిగిందని తెలిపారు. నాటి దాడుల గాయాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు.‘‘మా సిద్ధాంత నాయకుడినని చెబుతున్నావు. పెరరింజర్ అన్నా(సి.ఎన్. అన్నాదురై) కాలం నుంచి ఇదే డీఎంకే చరిత్ర. అందులో నేనూ భాగం కావడం గర్వంగా ఉంది. ఎవరెంత తక్కువ చేసి చూపించాలని చూసినా చరిత్రను మార్చలేరు’’ అని స్టాలిన్ అన్నారు.సర్కారియా కమిషన్.. విజయ్కు మరో కౌంటర్అదే సమయంలో సర్కారియా కమిషన్, అవినీతి ఆరోపణలపైనా విజయ్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సర్కారియా కమిషన్ ఏర్పడిన తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అనేక ప్రభుత్వాలు మారాయని గుర్తుచేశారు. ఆ ఆరోపణల్లో నిజం ఉంటే ఇన్నేళ్లలో తప్పకుండా చర్యలు జరిగేవని అన్నారు. ఈడీ కేసులను ప్రస్తావిస్తూ కూడా విజయ్పై స్టాలిన్ విమర్శలు చేశారు. ఈడీ నమోదు చేసిన అనేక కేసుల్లో ఆరోపణలు నిరూపితం కాలేదని, నిందితులు నిర్దోషులుగా బయటపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈడీని ఉపయోగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కాంగ్రెస్ నేతలపైనా ఈడీ కేసులు పెట్టిన విషయాన్ని విజయ్ ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు.అసెంబ్లీని వివాదాలకు వేదిక చేయొద్దుతమిళనాడు అసెంబ్లీకి ఎంతో గౌరవం, చరిత్ర ఉందని.. అక్కడ ప్రజా సమస్యలపై చర్చ జరగాలని స్టాలిన్ సూచించారు. శాంతిభద్రతలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, తమిళనాడు హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చించాలని కోరారు. అనవసర వివాదాలను అసెంబ్లీలోకి తీసుకురావద్దని విజయ్కు హితవు పలికారు.విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటికి వచ్చి కలిసిన విషయాన్ని కూడా స్టాలిన్ గుర్తుచేశారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో తనపై విజయ్ తీవ్ర విమర్శలు చేశానని ఆయన చెప్పగా.. ‘‘పర్లేదు తమ్ముడూ.. వాటిని మనసులో పెట్టుకోను’’ అని తాను చెప్పినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఆ పదవికి తగ్గ హుందాతనం కనిపించాలని సూచించారు.‘సినిమా షూటింగ్లా పాలన’విజయ్ ప్రభుత్వ పనితీరుపైనా స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. తాము నిర్మించిన వంతెనపై నిలబడి ఫొటోషూట్లు చేయడం, అసెంబ్లీని రీల్స్కు వేదికగా మార్చడం సరికాదన్నారు. సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో హత్యలు, దొంగతనాలు, మహిళలపై నేరాలు పెరిగాయని, శాంతిభద్రతలు దిగజారిపోయాయని విమర్శించారు. పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేసి తమిళనాడు అభివృద్ధిని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. రైతులకు పూర్తి రుణమాఫీ, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు రూ.2,500 సాయం వంటి హామీల విషయంలోనూ విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విమర్శించారు.‘‘అప్పుడు చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నది మరొకటి. మార్పు కావాలని ఓటేసిన యువత ఇప్పుడు నిజంగా ఎలాంటి మార్పు వచ్చిందో గమనిస్తోంది’’ అని స్టాలిన్ అన్నారు.అధికారం లేకున్నా ప్రజల కోసం పోరాటమేచివరగా డీఎంకే కార్యకర్తలకు స్టాలిన్ కీలక సందేశం ఇచ్చారు. ప్రజలు పూర్తిగా తమకు మద్దతు ఇవ్వకపోవడంతో అధికారంలోకి రాలేకపోయామని, కానీ ప్రభుత్వం చేసే తప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ‘‘మనకేం సంబంధం’’ అనే ధోరణి ఉండకూడదన్నారు. అధికారంలో ఉండటం, లేకపోవడం రెండూ ప్రజాసేవలో భాగమేనని పేర్కొన్నారు. తమిళనాడు హక్కులు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం డీఎంకే ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘‘వాళ్ల(ప్రజలను ఉద్దేశించి..) తాతల కోసం పోరాడాం. వాళ్ల తండ్రుల కోసం పోరాడాం. ఇప్పుడు వాళ్ల కోసం పోరాడతాం. ఇదే డీఎంకే చరిత్ర. ఆ చరిత్ర ఎప్పటికీ మారదు.. మారకూడదు’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు.வீட்ல என்னை meet பண்ணப்ப சொன்னதை மறந்துட்டீங்களா தம்பி விஜய்? pic.twitter.com/kzpwXi14L8— M.K.Stalin (@mkstalin) September 10, 2026సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీలో పోలీస్ శాఖపై చర్చకు సీఎం విజయ్ సమాధానం ఇస్తూ.. ఎమర్జెన్సీ–MISA అంశాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో దవడ దగ్గర చేతితో హావభావం చేశారు. ఈ సైగపై డీఎంకే నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాలిన్ ఎమర్జెన్సీ సమయంలో పోలీసుల దాడిలో దవడ విరిగిన విషయాన్ని విజయ్ ఎగతాళి చేశారని ఆరోపించారు. వామపక్షాలు కూడా విజయ్ తీరును తప్పుబట్టాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం.. స్టాలిన్ గాయాన్ని హేళన చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అయితే దీనిపై సెప్టెంబర్ 8న విజయ్ వివరణ ఇచ్చారు. తన బాడీ లాంగ్వేజ్ అనుకోకుండా వచ్చిందని, ఎవరినీ వ్యక్తిగతంగా బాధపెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీజేపీకి చెక్ పెట్టేందుకే విజయ్కు తోడుగా.. -
బీజేపీ ‘మిషన్ 115’.. స్పెషల్ ఆపరేషన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన స్థానాలతోపాటు తాము బలహీనంగా ఉన్న స్థానాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో కచ్చితంగా గెలుపు బావుట ఎగురవేయాలని నిశ్చయించుకుంది.ఇందుకోసం నేరుగా కేంద్ర నాయకత్వమే రంగంలోకి దిగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇన్చార్జి వినోద్ తావ్డేలు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సంస్థాగత పరిస్థితి, సామాజిక సమీకరణాలు, ఓడిన సీట్లలో గెలుపు వ్యూహాలపై గురువారం నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నారు.ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన వ్యూహరచన 2022 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీలు బలంగా నిలిచిన 115 అసెంబ్లీ నియోజక వర్గాలపై బీజేపీ గురిపెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ప్రజల్లో పార్టీ ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. పార్టీ అగ్రనాయకత్వం ఆయా స్థానాల్లో పర్యటించబోతోంది. ఇందులో భాగంగానే నితిన్ నబిన్ సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మీరట్ నుంచి పశ్చిమ యూపీ పర్యటనను ప్రారంభిస్తారు.రాష్ట్రంలోని ఆరు కీలక ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 71 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. తమ కూటమిలోని పార్టీల బలాబలాలను సైతం అంచనా వేయడం, జాట్ వర్గాన్ని కలుపుకునేలా వారితో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన వ్యూహరచన సాగించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. బలం పెంచుకోవడానికి ప్రత్యేక బృందాలు బీఎల్ సంతోష్ ఈ నెల 10, 11 తేదీల్లో లక్నోలో అవధ్, కాన్పూర్ ప్రాంతాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అవధ్లో 82, కాన్పూర్లో 52 అసెంబ్లీ స్థానాల పరిధిలో పార్టీ పరిస్థితిని ఆయన సమీక్షిస్తారు. ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. వినోద్ తావ్డే ఇప్పటికే యూపీలో ఒక పర్యాయం పర్యటించారు. పార్టీ స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించారు. ప్రాంతీయంగా బ లం పెంచుకోవడానికి నేతలు, కార్యకర్తలతో కొన్ని బృందాలు ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆయన మరోసారి రాష్ట్రంలో పర్యటించి సంస్థాగత ఏర్పాట్లను పరిశీలించనున్నారు.2022లో ఓడిన అసెంబ్లీ స్థానాలు, 2024లో బీజేపీ వెనుకబడిన లోక్సభ స్థానాల్లో పార్టీని తిరు గులేని శక్తిగా మార్చడం, బలహీనతలను సరిదిద్దడం, సామాజిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకోవడం బీజేపీ ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. 2027లో జరిగే ఎన్నికలకు ముందే పార్టీని పూర్తిస్థాయిలో ఎన్నికల వాతావరణంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర నాయకత్వం వరుసగా యూపీ పర్యటనలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: విజయ్ కూటమికి కొత్త పేరు.. తమిళనాట కొత్త లెక్కలు -
విజయ్ కూటమికి కొత్త పేరు.. వాళ్లు దూరం.. తమిళనాట కొత్త లెక్కలు!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటమి ఆవిర్భవించింది. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతృత్వంలోని కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’గా పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ అధ్యక్షతన బుధవారం చెన్నైలోని పనైయూర్లో జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ కూటమిలో టీవీకేతో పాటు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉన్నాయి. కూటమి పేరులోనే మత సామరస్యం, సామాజిక న్యాయం, విజయ్ రాజకీయ గుర్తింపు కనిపించేలా రూపొందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి నాయకత్వం విజయ్దే అని నేతలు స్పష్టం చేశారు.వీసీకే నేత ఎస్ఎస్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ పేరు విజయ్ ఆలోచన నుంచి వచ్చిందని తెలిపారు. బీజేపీ, ‘ఫాసిస్టు శక్తులకు’ వ్యతిరేకంగా కూటమి పనిచేస్తుందనే విషయాన్ని పేరు స్పష్టం చేస్తుందని చెప్పారు. టీవీకే బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలకు కూడా దీనితో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్తో విభేదాల్లేవ్..ఇటీవల ‘విజయ్ ఫర్ పీఎం’ అంటూ టీవీకే వర్గాల్లో వినిపిస్తున్న నినాదాలపై కాంగ్రెస్లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే టీఎన్సీసీ అధ్యక్షుడు బి.మాణిక్కం ఠాగూర్ మాత్రం టీవీకే, కాంగ్రెస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. సరైన సమయంలో కూటమి ప్రధానమంత్రి అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్లు పెరగడం కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కూటమి జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్లో చేరుతుందా? అనే ప్రశ్నకు వీసీకే నేత బాలాజీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. టీవీకేకు ప్రస్తుతం ఎంపీలు లేరని, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వచ్చిన తర్వాత ఇండియా కూటమిలో చేరే అంశం ఉంటుందని చెప్పారు. దీంతో రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో జాతీయ రాజకీయాల వైపు కూడా విజయ్ అడుగులు వేయనున్నారా? అన్న చర్చ మొదలైంది.వామపక్షాలు మాత్రం దూరం..కూటమి ఏర్పాటులో మరో కీలక అంశం వామపక్ష పార్టీల గైర్హాజరు. సీపీఐ, సీపీఎం నేతలు సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో టీవీకేకు వామపక్షాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. తాజా కూటమి సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నాయి. అయితే టీవీకే నేత ఆధవ్ అర్జునా కమ్యూనిస్టు పార్టీలు త్వరలోనే కూటమిలో చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే, కూటమి తన రాజకీయ ప్రయాణాన్ని రాబోయే ఉప ఎన్నికలతో ప్రారంభించనుంది. అభ్యర్థుల ప్రకటన త్వరలో ఉంటుందని నాయకులు తెలిపారు. కూటమి భవిష్యత్ నిర్మాణం, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, స్టీరింగ్ కమిటీ వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు.టీవీకే 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్తో కలిసి అధికార కూటమికి అధికారిక రూపం ఇచ్చింది. మరోవైపు డీఎంకే నేతృత్వంలోని కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటములకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త ఫ్రంట్ నిలవనుంది. రాబోయే ఉప ఎన్నికల్లో ఈ మూడు శక్తుల మధ్య పోటీకి ఇది వేదిక కానుంది. అయితే విజయ్ నేతృత్వంలోని ఈ కూటమి ఎన్నికల కూటమిగానే కొనసాగుతుందా? లేదంటే తమిళనాడు రాజకీయాల్లో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: గెట్ రెడీ ఫర్ సీబీఐ రైడ్స్! -
చంద్రబాబు హామీలు.. మోసాలు.. ఇంటింటా ఇదే చర్చ
వచ్చే సెప్టెంబర్లో పాదయాత్ర చూస్తుండగానే కళ్లు మూసి తెరిచేసరికి దాదాపు రెండున్నర ఏళ్లు గడిచాయి. ఇప్పుడు సెప్టెంబరు నెలలో ఉన్నాం. మళ్లీ కళ్లు మూసి తెరిచేలోగా ఏడాది గడిచి మళ్లీ సెప్టెంబరు వస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా యాత్ర జరుగుతుంది. చంద్రబాబు చేసిన మోసమే ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చనీయాంశమైంది. జగన్ మోసం చేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఆ టైంలో కనీసం నాలుగువేళ్లు నోట్లోకి పోయాయి. కానీ, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. ఇవాళ నోట్లోకి ఏదీ పోవడం లేదు. చంద్రబాబు పుణ్యాన మా బతుకులు బస్టాండ్ అయిపోయాయి అన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది.‘‘జగన్ ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. జగన్ ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు.’’‘‘చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్.’’‘‘స్థానిక ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం.’’‘‘ప్రజలకు మంచి చేసి.. ఫలాన మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి పాలకుడికి ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలు తోడుగా నిలబడతారు. కానీ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దౌర్జన్యాలు చేయడం, డైవర్షన్స్ చేస్తూ ఉండడాన్ని దేవుడు కరుణించడు. ప్రజలు హర్షించరు’’ – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని, ఇది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హామీలు, మోసాలపైనే ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని, వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడాలని, పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు నిజాయితీగా జరిగితే విజయం తప్పకుండా వైఎస్సార్సీపీదే అని స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గాదె మధుసూదన్రెడ్డి, పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..కార్యకర్తలు గర్వపడేలా మన పాలనమన 5 ఏళ్ల పాలన, బాబు రెండున్నర ఏళ్ల పాలనలో ఎంతో తేడా ఉంది. దీనిపైనే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదేళ్ల మన పరిపాలనలో ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ఫలానావాడు మా నాయకుడు, ఫలానా పార్టీ మా పార్టీ అని గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితి. మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలు ఇస్తారు. చంద్రబాబు లాంటి వాళ్లు అయితే ఏకంగా ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచిపెడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మ్యానిఫెస్టో, అందులో ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిని మార్చిన పాలన మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావిస్తూ, అందులో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే అని గర్వంగా చెప్పగలుగుతాం. అంతగా మాట ఇస్తే ఆ మాటపై నిలబడాలి అని తాపత్రయపడ్డాం. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఎప్పుడు ఇస్తాము అని ముందుగానే షెడ్యూల్ ప్రకటించి, ఒక్క పథకం కూడా మిస్ కాకుండా బటన్లు నొక్కి అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహాలను పటాపంచలు చేశాం. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతి 50, 60 ఇళ్లకు ఒక వలంటీర్ను తీసుకొచ్చి, ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. ఇది వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది.వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు.. మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా మారాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు, మూడో తరగతి నుంచి టోఫెల్ పీరియడ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ అమలు చేయడం, నాడు–నేడు మనబడితో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చడం, ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటలైజ్డ్ బోధన తీసుకొచ్చేలా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ చేయడం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయి. గోరుముద్ద అనే పేరుతో పిల్లలు ఏం తింటున్నారో, తినే ఆ తిండి బాగుందా లేదా అని పట్టించుకునే ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరైనా ఉంటారో లేదో తెలియదు కానీ జరిగింది ఒక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్బుక్స్.. ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషుతో బుక్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మనది. ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబ్లు పెట్టింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పేదవాడికి ఇంకా తోడుగా ఉండేలా చాలా మార్పు చేశాం. మనం రాకముందు ఆరోగ్యశ్రీ పరిధి 1,000 ప్రొసీజర్లు. మనం వచ్చిన తర్వాత 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ప్రతి పేదవాడికి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించాం. నాడు–నేడుతో హాస్పిటల్స్ రూపురేఖలు మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు అందుబాటులో ఉంచాం. అదీ మన చరిత్ర. ఇంకా ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత జాతీయస్థాయిలో 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే. ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టడం అన్నది కూడా గతంలో ఎప్పుడూ చూడని విషయం. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామస్థాయిలోనే ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ప్రతి డాక్టర్కు నాలుగైదు ఊళ్లు కేటాయింపు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు 104 అంబులెన్సులో పర్యటన. అలా ఆయా గ్రామాలు, అక్కడి వారితో డాక్టర్కు సాన్నిహిత్యం. అత్యుత్తమ వైద్య సేవలు. ఊరిలో పేషెంట్ను పేరు పెట్టి పిలవగలిగే పరిస్థితిలోకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇది కూడా గతంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. నష్టాల్లో ఉన్న రైతు. రైతు బ్రతుకంతా ఎప్పుడూ కష్టమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి నుంచి, రైతును పట్టించుకునే నాధుడు ఉండడు అన్న పరిస్థితి నుంచి, మొట్టమొదటిసారిగా రైతును చెయ్యి పట్టుకొని నడిపించాలని తపన పడింది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అందుకోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఆ ఆర్బీకేలో అసిస్టెంట్గా అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్. ప్రతి ఎకరా ఈ–క్రాపింగ్. వాటన్నింటి ద్వారా ప్రతి అడుగులోనూ రైతును చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం. ఆ ఆర్బీకేల్లో పంటల గిట్టుబాటు ధరల ప్రకటన. ఆ మేరకు పోస్టర్లు. ఏరోజైనా రైతుకు రేటు రాకపోతే వెంటనే ఆర్బీకేలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా యాక్టివేట్ చేస్తే, వెంటనే జాయింట్ కలెక్టర్, మార్క్ ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జోక్యం చేసుకోవడం, ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేయడం, అలా మార్కెట్లో పోటీని సృష్టించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడం అన్నది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సచివాలయంలో మన కళ్ళ ముందే దాదాపు పది మంది కళకళలాడుతూ సేవలు అందించే కార్యక్రమం. ప్రతి 50,60 ఇళ్లకు ఒక వలంటీర్. ఇళ్లకే వెళ్లి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు, ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్ప. వ్యవస్థలో కనీవిని ఎరుగని మార్పులు మన హయాంలోనే జరిగాయి.చంద్రబాబు పచ్చి దగామనం ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. మనం ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు. అప్పుడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఏమిటి? జగనైతే అమ్మఒడి కింద ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకరికే రూ.15 వేలు ఇస్తున్నాడు. మేమైతే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే, అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు ఇస్తామని చెప్పాడు. ఇంకా అంతటితో కూడా ఆగిపోలేదు. రైతు కనపడితే ఏమన్నాడు? జగన్ రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తే, తాను రూ.26 వేలు ఇస్తానన్నాడు. అంతటితో ఆగిపోలేదు. 45 ఏళ్ళు దాటిన మహిళలకు చేయూత కింద జగన్ ఇచ్చేది కేవలం రూ.18,750 అయితే, తాము 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. అలా నీకు రూ.48 వేలు, నీకు రూ.48 వేలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇంకా దాంతోనూ ఆగిపోలేదు. 20 ఏళ్ల పిల్లోడు కనపడితే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పాడు. అలా జగన్ కంటే అన్నీ ఎక్కువే ఇస్తానని నమ్మించాడు. ఆఖరికి వలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు.దౌర్జన్యంతో పాలకులు రాజ్యం చేయలేరుఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దౌర్జన్యంతో ఎప్పుడూ కూడా పాలకులు రాజ్యం చేయలేరు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో నా పాదయాత్రకు ముందు నంద్యాల ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికల్లో విపరీతంగా పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగం చేశారు. దాంతో నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 34 వేల ఓట్లతో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైంది? మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబునాయుడు తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? దాని తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏం జరిగింది? ఒక సునామీ వచ్చింది. దేవుడు చంద్రబాబుకి ఎలా మొట్టికాయలు వేశాడో చూశాం. అదే నంద్యాలలో దాదాపు 40 వేల ఓట్లతో మనం గెలిచాము. చంద్రబాబు మన పార్టీ నుంచి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు. సరిగ్గా ఆ సంఖ్యలోనే ఆ పార్టీ గెలిచింది. మన దగ్గర నుంచి వెళ్లిన వాడు ఎవడూ గెలవలేదు ఒకడు తప్ప. అందరూ ఓడిపోయినారు.’’జరగబోయేది కురుక్షేత్రంఇప్పటి ఈ ఎన్నికల కంటే కూడా రేపు పొద్దున జరగబోయే కురుక్షేత్రం ముఖ్యం. ఈ ఎన్నికల్లో చిన్న ప్రాణులను ఓడించడం కోసం చంద్రబాబు చేసిన అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి అన్నది ఆ ఎన్నికల్లో రావాలి. అలాంటి కసి కార్యకర్తలకు రావాలి. ఆ కార్యకర్తకు పార్టీ అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతుంది. ఇది కార్యకర్తల కోసం జరుగుతున్న ఎన్నికలు. మనం కార్యకర్తలకు తోడుగా ఉండాల్సిన ఎన్నికలు. ప్రజలకు తోడుగా కార్యకర్త నిలబడతాడు. కార్యకర్తకు తోడుగా పార్టీ నిలబడుతుంది అన్న సంకేతం ఈ ఎన్నికల ద్వారా మనం ఇవ్వాలి.స్థానిక ఎన్నికలపైనా చంద్రబాబు డ్రామా.. కుట్రఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే చంద్రబాబు ఆ ఎన్నికలు పెడతాడో లేదో తెలియదు. కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిజంగా స్థానిక ఎన్నికలు పెట్టే వాడే అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చే వాడు కాదు. దీనికి సంబంధించి నాడు మన హయాంలో ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేసింది. అయినా అంతకన్నా ఎక్కువ పదవులు మనం బీసీలకు ఇచ్చాం. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆ బీసీ రిజర్వేషన్లు తెలంగాణాలోనూ కొట్టేశారు. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవకాశం ఉందని తెలిసినా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగకూడదు. వాయిదా పడాలన్నదే ఆయన కుట్ర. మరొకటి ‘సర్’. (ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ) వీళ్ళే అంటున్నారు ఇక్కడ 44 లక్షల ఓట్లు లేవు అని. అయితే పాత జాబితాలతో ఎన్నికలు పెడతాడా? దానికి ఏ కోర్టయినా ఒప్పుకుంటుందా? మరి చంద్రబాబు ఎన్నికలు పెట్టాలని ఇవన్నీ చేస్తున్నాడా? పెట్టకూడదని చేస్తున్నాడా? ఇది మేకపోతు గాంభీర్యం కాకపోతే ఇదంతా ఏమిటి? సరే, ఏదైనా కానీ, చంద్రబాబుగారు స్థానిక ఎన్నికలు పెడతాడని అనుకుని, ముందుకు పోదాం.ఎన్నికలు సాఫీగా జరిగే వీలు లేదుచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు సాఫీగా జరుగుతాయని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. చంద్రబాబుని ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్. ఇది కాక రెడ్బుక్ రాజ్యాంగం. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు సాఫీగా జరుగుతాయని అనుకోవడం లేదు.సాఫీగా జరిగితే మనదే విజయంఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం. చంద్రబాబు ఒకవేళ ఓడించే కార్యక్రమం, అధికార దుర్వినియోగం చేసే కార్యక్రమం, పోలీసులు జులుంను ఉపయోగించే కార్యక్రమం చేస్తే ఎవరిని ఓడించడం కోసం? ఆ చిన్న ప్రాణాన్ని ఓడించడం కోసం. ఆ చిన్న ఎంపీటీసీ స్థానం, ఆ చిన్న సర్పంచ్ స్థానం, ఆ చిన్న వార్డ్ మెంబర్ స్థానంలో ఉన్న వ్యక్తులను ఓడించడం కోసం. అందుకే అటువంటి చిన్న ప్రాణాలకు తోడుగా ఉండాలి. -
అంతా ‘రాజకీయమే’!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు వరుసగా మూడోరోజు కూడా రాజకీయం కోణంలో కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. ఇటు అసెంబ్లీ, అటు కౌన్సిల్లో సోమవారం బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ గేటు బయట చేసిన ఆందోళన కేంద్రంగానే దుమారం కొనసాగింది. అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టగా, కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సెషన్ మాత్రమే జరిగింది. అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లకు చెందిన సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలు, సస్పెన్షన్లు జరగ్గా, అసెంబ్లీ బయట అధికార, విపక్ష సభ్యులు రాష్ట్ర గవర్నర్ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. సభ ప్రారంభం కాగానే.. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగా నే మళ్లీ గొడవ మొదలైంది. తమ ఆందోళన సందర్భంగా మహిళా సభ్యులపై పోలీసుల దురుసు ప్రవర్తన గురించి బీఆర్ఎస్ సభ్యు లు సభలో లేవనెత్తారు. శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో సహా పలువురు మంత్రులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ సభ్యుల వ్యవహరశైలిని తప్పుపట్టారు. గందరగోళం మధ్య సభకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులందరినీ సెషన్ మొతానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్భవన్కు వెళ్లి గవర్నర్ శివపత్రాప్ శుక్లాను కలిశారు. తమ హక్కులను పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. మంత్రులతో సీఎం భేటీ అసెంబ్లీలోని తన చాంబర్లో సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబుతో పాటు ఇతర మంత్రులతో బుధవారం నాటి పరిణామాలపై చర్చించారు. బీఆర్ఎస్ నేతల సస్పెన్షన్, సభ నిర్వహణపై మంత్రులతో సమాలోచనలు జరిపారు. సభ జరిగినన్ని రోజులు ప్రధానంగా ఏయే అంశాలపై చర్చించాలన్న దానిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విరామం తర్వాత కూడా అసెంబ్లీ రాజకీయ అంశాలపైనే కొనసాగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద దళిత సంఘాలు చావు డప్పు కార్యక్రమం నిర్వహించగా, ఆ ప్రదేశాన్ని బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి కూడా అటు కేసీఆర్, ఇటు బీఆర్ఎస్లను టార్గెట్ చేశారు. మండలిలో ప్రకంపనలు మండలిలోనూ రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. మండలి ప్రారంభం కాగానే సస్పెన్షన్కు గురైన తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలను సభకు అనుమతించి వారి వివరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ అనుమతించకపోవడంతో వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభలో ప్రశ్నోత్తరాలను ముగించిన తర్వాత ప్రత్యేక ప్రస్తావనలను ప్రవేశపెట్టిన అనంతరం గురువారం నాటికి వాయిదా వేశారు. కాగా తాతామధు, నవీన్రెడ్డిలపై ఎలాంటి చర్య లు తీసుకోవాలనే అంశాన్ని మండలి చైర్మన్ గుత్తా, మహేశ్గౌడ్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీకి పంపించారు. దళితులు, మహిళల గౌరవం కాపాడాలి బుధవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దళితులు, మహిళల గౌర వం, భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, అజహరుద్దీన్, వివేక్, లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు కవ్వంపల్లి సత్యనారాయణ, వెడ్మ»ొజ్జులు గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలు అసెంబ్లీ స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశా రని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తన చొక్కాను విప్పారని, తదితర సోమవారం జరిగిన ఘటనల గురించి గవర్నర్కు వారు వివరించారు. దళితులు నడిచిన రహదారులను పసుపు నీళ్లు, పాలతో శుద్ధి చేయడం ద్వారా నిషేధిత, చట్టవిరుద్ధమైన, అమానవీయమైన, అనై తికమైన అంటరానితన ఆచరణను బీఆర్ఎస్ ప్రదర్శించిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిపైనే కాకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులపై అ త్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్య లు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. -
మా హక్కులు పరిరక్షించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులు, కేసులు, వారి అరెస్టులు సస్పెన్షన్లపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఈ మేరకు 13 పేజీల వినతిపత్రాన్ని సమర్పించింది. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు జరిగాయి. పోలీసులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులపై పోలీసులు, మార్షల్స్ దాడి చేశారు. కేసీఆర్ ఇంటిపై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతృత్వం వహించారు. పోలీసులు వారికి ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు రోప్ పార్టీలు ఏర్పాటు చేసి వేలాది మందిని అక్కడికి అనుమతించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 167, 355 తదితర నిబంధనల మేరకు మా హక్కులు కాపాడండి. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి భద్రత కల్పించాలి..’అని ఆ వినతిపత్రంలో బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. గవర్నర్తో భేటీ అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లోక్భవన్ బయట మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని వివరించాం.. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గవర్నర్ను కలిసినట్లు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజలకు ఇ చ్చిన హామీల అమల్లో వైఫల్యంతో పాటు పాలనా వైఫల్యాన్ని గవర్నర్కు వివరించినట్లు తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, యువత, పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అసెంబ్లీ వద్ద తమపై జరిగిన దాడులు, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలను అందజేశామని చెప్పారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన ఘటనను కూడా వివరించామన్నారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ నివాసంపై దాడి యత్నం, తమపై దాడి చేసిన పోలీసులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని తీరును వివరించినట్లు కేటీఆర్ తెలిపారు.హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. అసెంబ్లీ, శాసనమండలిలోకి రానివ్వకుండా తమను ప్రభుత్వం అడ్డుకుందని, హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్కు వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. శాసనమండలి సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని వివరించామని, ప్రభుత్వం విడుదల చేసిన ఏఐ ఫొటోలు, వీడియోలపైనా ఫిర్యాదు చేశామని చెప్పారు. తప్పుడు చిత్రాలు, ఫిర్యాదులు ఉపయోగించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో న్యాయం జరగకుంటే జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయిస్తామని చెప్పారు. కాగా శాసనసభ వ్యవహారాలతో పాటు బయట జరిగిన అన్ని ఘటనలపై విచారణ జరిపిస్తామని, సీఎస్, డీజీపీని పిలిపించి వివరాలు తెలుసుకుంటానని గవర్నర్ తమకు హామీ ఇ చ్చినట్లు తెలిపారు. -
ఆ రెండూ కుట్రలే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను, ఆయన మాతృమూర్తిని కించపరిచి అవమానించటం, అనంతరం ఆయనకు మద్దతుగా నిరసన తెలిపిన దళితులు నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేయటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలను కుట్రలుగానే పరిగణిస్తున్నామని చెప్పారు. ఇందుకు వ్యూహకర్తలు, ప్రత్యక్షంగా అమలు చేసిన వారిపై ఆయా సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, విచారణ జరిపి జైలుకు పంపే ఏర్పాటు చేస్తామని అన్నారు. ముంబయిపై దాడి చేసిన కసబ్ లాంటి ఉగ్రవాదులకు కొన్ని అంశాలను నూరిపోసి ఉన్మాదులుగా మార్చి మన దేశంపైకి పంపిన తరహాలోనే, కేసీఆర్ కూడా తన అనుచరులకు ఇలాగే నూరిపోసి ఉన్మాదులుగా మార్చి ఉసిగొల్పారని ఆరోపించారు. దాంతో పేట్రేగిన నేతలు ఆ రోజు దళిత స్పీకర్ను కించపరచటమే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆ కార్యక్రమానికి ముందురోజు ఫామ్హౌస్లో జరిగిన భేటీలో చేసిన కుట్ర మొదలు ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న ఘటనలపై సంపూర్ణ విచారణ చేపడతామన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు జాయింట్ కమిషనర్ విజయకుమార్ను విచారణాధికారిగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం శాసనసభలో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. కేసీఆర్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన దళితులను అవమానించేలా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసినట్టుగా చెబుతున్న వ్యవహారంపై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చను ముగిస్తూ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. కోర్టులు బెయిల్ ఇచ్చినా ప్రజలు బెయిల్ ఇవ్వరు ‘చట్టాలు, సెక్షన్లను అడ్డుపెట్టుకుని కొంతమంది కోర్టుల నుంచి బెయిల్ పొందవచ్చు. కానీ తెలంగాణ సమాజం మాత్రం వారికి బెయిల్ ఇవ్వదు. జరిగిన తప్పును అంగీకరించి క్షమాపణ చెబితే కిరీటం ఊడిపోతుందా? స్థాయి తగ్గుతుందా? సభాపతిని అవమానించిన విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుంది. చట్టపరంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గబోదు. సభాపతి పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్కుమార్ మనసుకు గాయం చేసేలా ఉన్మాదంతో వ్యవహరించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. వ్యక్తినే కాకుండా తల్లిని కూడా అవమానించే స్థాయికి వెళ్లారు. మహిళలను శక్తిగా కొలిచే సమాజంలో ఇలాంటి చర్యలకు చోటుంటుందా? సభలో అధికారులపై దాడులు చేయడంతోపాటు స్పీకర్ కుర్చీని అవమానించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. దళితులపై అవమానకర చర్యలు స్పీకర్ను అవమానించిన ఘటనకు నిరసనగా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఫామ్హౌస్ వద్ద డప్పు దరువులతో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారే తప్ప ఎలాంటి ఉన్మాదానికీ పాల్పడలేదు. దళిత సోదరులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేసేందుకు డప్పును ఒక సాధనంగా ఉపయోగిస్తారు. నిరసన తెలిపిన దళిత ప్రతినిధులను పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉంది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించి, దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించడం ద్వారా దళితనులను తీవ్రంగా అవమానించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తే.. మరి దొరతనం, ఆహంకారంతో ఉన్న ఆ నేతల మనసుల్లో పేరుకుపోయిన అంటరానితన భావజాలాన్ని ఎలా శుద్ధి చేస్తారు? యాసిడ్తో కడగాలా? దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తేనే అందరి కడుపులు నిండుతున్నాయి. మనకు అన్నం పెడుతున్న వారిని ఇంతగా అవమానిస్తారా? దళితులను అవమానపరుస్తూ వారిని కించపరిచిన ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలి. అప్పుడే వారికి దళితులు ఎదుర్కొంటున్న వివక్ష ఎలాంటిదో తెలిసొస్తుంది. ఖర్గేనూ అవమానించారు.. సమాజంలో అశాంతిని ప్రోత్సహించి రెండు వర్గాల మధ్య వైరాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలని చూస్తున్నారు. మేము మాత్రం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దేశంలోని కోట్లాది ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించింది. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో పుట్టి, రజాకార్ల దాడుల్లో తల్లిని కోల్పోయి, కార్మిక నాయకుడిగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్న నేత మల్లికార్జున ఖర్గేను అవమానించడం బాధాకరం. ఉత్తరాఖండ్లోని ఓ మైదానంలో ఖర్గే సభలో పాల్గొన్న అనంతరం ఆగస్టు 10న బీజేపీ అనుబంధ సంస్థ అదే మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం హేయమైన చర్య. ఆ ఘటనను ఈ సభ ముక్తకంఠంతో ఖండిస్తోంది. తాజాగా తెలంగాణ వేదికగా బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వ్యవహారానికి తెరలేపింది. వారిని వదిలే ప్రసక్తే లేదు.. విద్యా రంగంలోని అక్రమాలు, ధరణి అక్రమాలు, 22ఏ రాద్ధాంతంపై శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం భావించింది. ఈ అంశాలపై చర్చ జరిగితే గత పదేళ్లలో జరిగిన దురాగతాలు, రాష్ట్రంపై పేరుకుపోయిన అప్పుల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుందనే భయంతోనే చర్చను అడ్డుకునేందుకు ఈ కుట్రలు పన్నారు. సభను అడ్డుకోవడమే కాకుండా స్పీకర్ను అవమానించే స్థాయికి వెళ్లడం అత్యంత దురదష్టకరం. కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి బాటలు వేసింది. కాంగ్రెస్ విధానం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడమే..’ అని సీఎం స్పష్టం చేశారు. స్పీకర్ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో ప్రభుత్వం స్పీకర్కు పూర్తిగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
తమిళనాడులో భగ్గుమన్న ‘దవడ’ రాజకీయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన ప్రజారంజక పరిపాలనతో దూసుకుపోతున్నారు. ప్రజాభిష్టమైన నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒకవైపు తన ధారాళమైన వాగ్ధాటితో టీవీకే శ్రేణుల్లో జోష్ నింపుతుండగా.. మరోవైపు తన హావభావాలతో ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుచేస్తూ ప్రత్యర్థులను ఇరుకున పెడుతున్నారు. తాజాగా సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష డీఎంకే అవినీతిపై ఆయన విమర్శలు గుప్పిస్తూ ఇచ్చిన ఓ ‘ఫోజు’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారి తీసింది.అసెంబ్లీ సమావేశంలో డీఎంకే అధినేత, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ గతంలో ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, నిర్బంధం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో విజయ్ తన దవడను తాకుతూ ఒక రకమైన సైగ చేశారు. విజయ్ చేసిన ఈ బాడీ లాంగ్వేజ్ సైగ.. ఎమర్జెన్సీ (1975-77) కాలంలో ‘మీసా’ చట్టం కింద అరెస్టై, పోలీస్ కస్టడీలో దాడికి గురై దవడ గాయపడిన ఎంకే స్టాలిన్ను అపహాస్యం చేసేలా ఉందని డీఎంకే పార్టీ తీవ్రంగా మండిపడింది. స్టాలిన్ ముఖంపై ఉన్న ఆ మచ్చ కేవలం ఒక గాయం కాదని, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన ఒక యోధుడి త్యాగానికి ప్రతీక అని డీఎంకే నేతలు అభివర్ణించారు.1976 జనవరి 31న నాటి సీఎం కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. ఆ సమయంలో యువ డీఎంకే నేతగా ఉన్న ఎంకే స్టాలిన్ను అరెస్ట్ చేసి చెన్నై సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో ఆయన అధికారుల దాడికి గురయ్యారని, ఆ దెబ్బల వల్లే ఆయన దవడ గాయపడిందని డీఎంకే వర్గాలు చెబుతుంటాయి. అప్పటి నుంచి ఆ సంఘటన స్టాలిన్ రాజకీయ జీవితంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది.ఈ వివాదం పెద్దది కావడంతో సీఎం విజయ్ స్పందించారు. అసెంబ్లీలో తాను చేసిన ఆ సైగ ఎవరినీ కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ప్రసంగంలో భాగంగా సాధారణంగా వచ్చిందే తప్ప అందులో ఎలాంటి దుర్బుద్ధి లేదని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ అంశంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం, డీఎంకే సభ్యులు నిరసన తెలపడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.మీసా చట్టం అంటేమీసా (MISA - Maintenance of Internal Security Act) దేశంలో అత్యంత వివాదాస్పదమైన చట్టం. దీన్ని భారత పార్లమెంటు 1971లో ఆమోదించింది. దేశంలో అంతర్గత భద్రతను కాపాడటం, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని కట్టడి చేయడం ఈ చట్టం ఉద్దేశం అని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. 1975 నుండి 1977 వరకు దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి కాలంలో ఈ చట్టాన్ని అత్యంత దారుణంగా దుర్వినియోగం చేశారు.ఈ చట్టం కింద ఎవరినైనా సరే, ఎలాంటి వారెంట్ లేకుండా, విచారణ లేకుండా, కోర్టులో ప్రవేశపెట్టకుండా నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధించవచ్చు. అరెస్టుకు అసలు కారణం కూడా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. దీనిపై కోర్టులను ఆశ్రయించే హక్కు కూడా అప్పట్లో ఉండేది కాదు.ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో భాగంగా అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి జాతీయ స్థాయి నాయకులతో పాటు, తమిళనాడులో ఎంకే స్టాలిన్ వంటి యువ రాజకీయ నాయకులు కూడా ఈ మీసా చట్టం కిందనే అరెస్టయి జైలు శిక్ష అనుభవించారు -
‘చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారు’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్ర బాబు, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బయటపడకుండా చంద్రబాబు, లోకేష్ పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహారం నడుపుతున్నారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి ప్రాణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిందే.. గెలవాల్సిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తే.. కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని ఆమె మండిపడ్డారు.మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. కూటమిలో ఉన్న పార్టీలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు సెమీ ఫైనల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు మిమ్మల్ని గెలిపిస్తారు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నాయకులను గెలిపించాలి. పార్టీ జెండా మోసిన ప్రతి వ్యక్తి మా మా బిడ్డ లాంటి వాళ్లే. -
‘‘సీబీఐ దాడులు చేయబోతుంది.. సిద్ధంగా ఉండండి’’
బెంగళూరు: కేంద్ర దర్యాప్తు సంస్థల (సీబీఐ, ఈడీ వంటివి) దాడులకు సిద్ధంగా ఉండాలని తమ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెచ్చరించారు. ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులను డీకే శివకుమార్ ‘‘లక్ష్యంగా చేసుకున్నవి’’, ‘‘రాజకీయ ప్రేరేపితమైనవి’’గా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం ఆయనకు 100 శాతం అండగా ఉంటాయని చెప్పారు.సతీశ్ జార్కిహోళిపై దాడులు జరుగుతాయని ముందే ఊహించినట్లు డీకే శివకుమార్ తెలిపారు. ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయవచ్చని నా మంత్రులు, ఎమ్మెల్యేలను సిద్ధంగా ఉండాలని హెచ్చరించాను. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై దాడులు జరుగుతాయని నేను భావిస్తున్నాను? దర్యాప్తునకు మేము భయపడము. అయితే తప్పుడు ఆరోపణలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.బీజేపీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దాడులు చేయడం లేదని శివకుమార్ ప్రశ్నించారు. ‘‘భోవి డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం లేదా బీజేపీ నేతలు ప్రమేయం ఉన్న ఇతర కుంభకోణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.దృష్టి మళ్లించేందుకేసెప్టెంబర్ 10న తమ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకోబోతున్న సమయంలో ఈ దాడులు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించే ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించేందుకే దాడులను స్పష్టంగా రాజకీయ ఉద్దేశంతో నిర్వహించారు అని ఆయన అన్నారు.‘‘మా పార్టీ, ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి లక్ష్యంగా చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం సాధించిన విజయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు జరిగాయి’’ అని ఆయన అన్నారు. సతీశ్ జార్కిహోళి కుటుంబ సభ్యులు, సహచరుల విషయంలో తాను హామీ ఇవ్వలేనని శివకుమార్ తెలిపారు. అయితే జార్కిహోళి నిజాయితీగల వ్యక్తి అని తనకు నమ్మకం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు ఆయన తనను తాను సమర్థించుకుంటారని చెప్పారు.‘‘ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. అవి విదేశాల్లో ఉన్నా కూడా అది చట్టవిరుద్ధం కాదు. ఆయన తగిన పత్రాలను సమర్పించి తనను తాను సమర్థించుకుంటారు’’ అని శివకుమార్ అన్నారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. -
మేనల్లుడికి మాయావతి పెట్టిన కండీషన్ ఇదే..
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను మళ్లీ పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే, ఆకాశ్ రాజకీయ భవిష్యత్పై కఠిన షరతు విధించారు. ఆకాశ్కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలంటే.. ఆయన మామ, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలంటూ కండీషన్ పెట్టారు.ఆయన రిటైర్మెంట్ తర్వాతే ఆకాష్ ఆనంద్కు బాధ్యతలు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామంటూ మాయావతి తేల్చి చెప్పారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను ఇటీవల కీలక పదవుల నుంచి తప్పించిన బీఎస్పీ అధినేత్రి.. ఆకాశ్ ఆనంద్ ఇంకా పరిణతి సాధించాల్సి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి పూర్తిగా సన్యాసం తీసుకోవాలి. అంటే కేవలం పదవీ విరమణ చేయడం కాదు.. రాజకీయాలకు పూర్తిగా దూరం కావాలంటూ మాయావతి ఎక్స్లో పోస్ట్ చేశారు.అశోక్ సిద్ధార్థ్ పార్టీ లక్యాల కంటే తన వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని.. దాని పరిణామాలను ఆయనతో పాటు ఆకాశ్ ఆనంద్ కూడా అనుభవించాల్సి వచ్చిందని మాయావతి అన్నారు. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ కుమారుడైన ఆకాశ్ ఆనంద్ను గతంలో ఆమె రాజకీయ వారసుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2024 నుంచి ఆయనను పలుమార్లు పార్టీ బాధ్యతల నుంచి తొలగించడం, మళ్లీ నియమించడం జరుగుతోంది. ఆయన మామ అశోక్ సిద్ధార్థ పరిస్థితి కూడా ఇంతే.. సిద్ధార్థ్ను 2025లో పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించారు. ఆ తర్వాత మళ్లీ చేర్చుకున్నారు. ఇటీవల మాయావతి మాట్లాడుతూ.. ఆకాశ్ ఆనంద్ పార్టీ నాయకుడిగా కాకుండా సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగవచ్చని తెలిపారు.అల్లుడు ఆకాశ్ ఆనంద్ భవిష్యత్తును కాపాడేందుకు అశోక్ సిద్ధార్థ్కు ఇంకా ఒక అవకాశం ఉంది. ఆయన తన రాజకీయ ఆకాంక్షలను వదులుకుని, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా నిలిచి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలి. అప్పుడే ఆకాశ్ ఆనంద్ పార్టీలో స్వేచ్ఛగా పనిచేయగలరు. ఆ తర్వాతే పార్టీ ఆయనకు తిరిగి బాధ్యతలు అప్పగించే విషయాన్ని పార్టీ పరిశీలిస్తుంది. దీనివల్ల ఆయన పార్టీలో చురుకైన పాత్ర పోషించగలుగుతారు. పార్టీలో అందరి అభిప్రాయం కూడా ఇదే" అని మాయావతి తన పోస్టులో రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ‘‘మీరంతా సల్లబడేటట్టు చేస్తా.. జాగ్రత్త’’ -
సీఎం విజయ్ నేతృత్వంలోని కూటమి పేరు ఖరారు
సాక్షి,చెన్నై: సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూటమి ప్రభుత్వానికి అధికారిక పేరు ఖరారైంది. ఈ కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ అనే పేరును నిర్ణయించారు. ఈ విషయాన్ని టీవీకే చీఫ్ విజయ్, వీసీకే చీఫ్ తోల్ తిరుమావళన్, ఎండీఎంకే చీఫ్ వైకో, ఐయూఎంఎల్ నాయకులు మీడియా ముఖంగా వెల్లడించారు. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్, వీసీకే,ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలోనే తమిళనాడు కూటమి ప్రభుత్వానికి ఈ పేరును ఖరారు చేశారు.అయితే,అనూహ్యంగా ఈ సమావేశానికి విజయ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన వామపక్ష (లెఫ్ట్) పార్టీల నేతలు గైర్హాజరయ్యారు.ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రెండవ కీలక సమావేశం ఇది. కూటమి నిర్మాణాన్ని అధికారికంగా ఖరారు చేయడంపై ఈ భేటీ ప్రధానంగా దృష్టి సారించింది. ఉమ్మడి కార్యక్రమంలో రూపకల్పన, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, కన్వీనర్ నియామకం,కూటమికి అధికారిక పేరును ఖరారు చేయడం వంటి ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం.వామపక్ష పార్టీలు గైర్హాజరకు కారణం ఇదేతమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి సమావేశానికి సీపీఐ,సీపీఎం వంటి వామపక్ష పార్టీలు గైర్హాజరు కావడానికి ప్రధానంగా కొన్ని రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో అధికారికంగా భాగస్వాములు కాకుండా, కేవలం బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని లెఫ్ట్ పార్టీలు మొదటినుంచీ స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వంలో కేబినెట్ హోదా లేనప్పుడు, కూటమికి సంబంధించిన అధికారిక కమిటీలు లేదా నిర్మాణాత్మక ఒప్పందాలలో లాంఛనంగా పాల్గొనడం ఇష్టం లేక వీరు దూరంగా ఉంటున్నారు.కార్మికులు, రైతులు, ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్ణయాలను స్వతంత్రంగా ప్రశ్నించే వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో లెఫ్ట్ పార్టీలు కూటమి పార్టీల సమావేశాలకు దూరంగా ఉంటున్నాయి. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు లేదా ఇతర పొత్తుల విషయంలో తమకంటూ ఒక స్వతంత్ర రాజకీయ వైఖరి ఉండాలని అవి కోరుకుంటున్నాయి. జూలై 1న జరిగిన తొలి సమావేశానికి కూడా లెఫ్ట్ పార్టీలు గైర్హాజరయ్యాయి. ఇప్పుడు జరిగిన రెండవ కీలక సమావేశానికి కూడా వారు దూరంగా ఉండటం ద్వారా తమ వైఖరిని మరింత స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వానికి అసెంబ్లీలో ఉన్న మెజారిటీ దృష్ట్యా లెఫ్ట్ పార్టీల మద్దతు చాలా కీలకం. కేవలం విధానపరమైన అంశాలు, కూటమి అధికారిక నిర్మాణాల విషయంలోనే వారు ఈ దూరం పాటిస్తున్నారు👉ఇదీ చదవండి : తమిళ రాజకీయంలో ‘ధనుష్’ వేడి -
అరెస్ట్ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని, వారి భాషలోనే అంతకన్నా బలంగా సమాధానం ఇస్తామని.. తమ హుందాతనాన్ని చేతకానితనంగా భావించవద్దని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహనం నశించేలా తమను రెచ్చగొడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు సంబంధించిన అంశాలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ వంటి అనేక స్కామ్లకు పాల్పడి, కోట్లు కొల్లగొట్టి, జైలుకు వెళ్లి మెడికల్ బెయిల్పై బయటికి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టస్ పేరుతో ఆ కేసులను కొట్టేయించుకున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మా సహనాన్ని తక్కువ అంచనా వేయొద్దు:వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం. మీరు బూతులు తిడితే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హుందాగా మాట్లాడుతున్నామంటే చేతకాక కాదు. మాపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై మాట్లాడాలి.కానీ చంద్రబాబు మాట్లాడటం మొదలుపెడితే బూతులు, అబద్ధ ప్రచారం, విషప్రచారం తప్ప మరేమీ కనిపించడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై వ్యక్తిగతంగా, నీచంగా మాట్లాడటం సరైంది కాదు. ముఖ్యమంత్రి అనే స్థాయిని చంద్రబాబు మర్చిపోకూడదు.2014 నుంచి 2019 మధ్య ఫైబర్నెట్, ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అమరావతి అసైన్డ్ భూములు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. స్కిల్ కేసులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు జైలుకు పంపింది. అలాంటిది కేసులు, అరెస్టులు, రిమాండ్లకు సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధమైన రాజకీయ సంస్కతి? తప్పు చేయకుండా ఒక సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లినవాళ్లు గొప్పగా చెప్పుకుంటారు.కానీ తన అరెస్టును చంద్రబాబు సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు. స్కిల్ కేసులో అరెస్టు కాబటి జైల్లో ఉండొచ్చిన చంద్రబాబు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు? ఆయన మెడికల్ గ్రౌండ్స్పై బెయిల్ వచ్చాడే కానీ కేసుల్లో నిజాయితీ పరుడిగా నిర్ధారణ కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో తొలగించేసుకుంటున్నాడు.ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తనపై ఉన్న కేసులను తొలగించుకోవడానికా? లేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి.లోకేశ్ బాగోతం బయట పెట్టమంటారా?వైఎస్ జగన్ చదువుల కోసం అమెరికా వెళ్లి హోమ్సిక్తో తిరిగి రావడం ఏమైనా పెద్ద తప్పా? చదువు కోసం అమెరికా వెళ్లి తల్లిదండ్రులను విడిచి ఉండలేక తిరిగి రావడాన్ని కూడా రాజకీయ విమర్శగా ఉపయోగించుకోవడం అన్యాయం. అప్పట్లో వైఎస్సార్.. చంద్రబాబు వ్యాఖ్యలకు ఇచ్చిన సమాధానం ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న చంద్రబాబు.. ముందుగా తన కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్కు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే ముందు తన కుటుంబంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనాలు అన్నీ మర్చిపోయారు, తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోవద్దు.దస్తగిరి టీడీపీ ఆఫీస్కు ఎందుకు వెళ్లారు?వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి టీడీపీ కార్యాలయంలో ఏం పని? ఆయనకు న్యాయ సహాయం ఎవరు అందించారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత వైఎస్ జగన్ గురించి మాట్లాడాలి. మేము హుందాగా మాట్లాడుతున్నాం. అంతే తప్ప, అది తమ బలహీనత కాదన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని వీరశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
పూనావాలా ‘అంకుల్’ నా జోలికి రావొద్దు.. రియా కౌంటర్
న్యూఢిల్లీ: నీట్ లీకేజీ ఆందోళనల్లో వర్షంలో పోలీస్ వ్యాన్ను అరచేతితో అడ్డుకుని రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన రియా అహిర్, ఇటీవల ‘బిగ్ బాస్ 20’షోలోకి అడుగుపెట్టలేకపోవడం చర్చాంశనీయంగా మారింది. షో నిర్వాహకులు రియా అహిర్, పంజాబీ నటి లవ్ గిల్ మధ్య నిర్వహించిన ఆడియన్స్ పోలింగ్లో లవ్ గిల్ విజయం సాధించడంతో రియా అవకాశాన్ని కోల్పోయారు.హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్ను చంపేసినట్లు.. ఒకవైపు పూనావాలా, రాహుల్ గాంధీల మధ్య రాజకీయం నడుస్తుంటే, ఈ గొడవలో బిగ్ బాస్ ఛాన్స్ మిస్సయ్యి రియా అహిర్ బలైపోయారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోందిఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆందోళనల ద్వారా రియా వైరల్ కావడం యాదృచ్ఛికం కాదని, దాని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ, రాజ్ థాకరే వంటి నేతల మద్దతుతో మోదీ వ్యతిరేక ఎజెండాను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్లాలని ఆమె ప్లాన్ చేశారు. అయితే, 99 ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్కు విజయం అందించలేని రాహుల్ గాంధీ మీకు ఆన్లైన్ మద్దతు ఎలా ఇవ్వగలరు?’ అని పూనావాలా ఎద్దేవా చేశారు.పూనావాలా విమర్శలపై రియా అహిర్ రెండు వీడియోల ద్వారా ఘాటుగా స్పందించారు. పూనావాలాను ‘అంకుల్’ అని సంబోధిస్తూ, తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. చిన్న వయసున్న అమ్మాయిలను టార్గెట్ చేయడం మాని, తన ఈడువారితో రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు వాడే పాత, డొల్ల స్క్రిప్ట్ లాంటివేనని ఎద్దేవా చేశారు.తాను భారత సైన్యాన్ని కానీ, ఏ ఇతర వ్యవస్థను కానీ ఎప్పుడూ అవమానించలేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ లాంటి ఎంటర్టైన్మెంట్ షోలలోకి రాజకీయాలు, మతాలను లాగడం సరైనది కాదని హితవు పలికారు. ప్రస్తుతం ఈ పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ వార్ నెట్టింట వైరల్ అవుతోంది.👉ఇదీ చదవండి : మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా? -
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ నుంచి డీఎస్సీ వరకు అవినీతి, అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా సంబరాలు చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్కు పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టింది వైఎస్ జగన్ కాదు.. ఈడీ పెట్టింది. కానీ తనపై వైఎస్ జగన్ కేసులు పెట్టించాడంటూ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అనారోగ్య సమస్యలు చూపించి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ నరేంద్ర మండిపడ్డారు.‘‘అధికారులను భయపెట్టి తనపై ఉన్న కేసులను వెనక్కి తీసుకునేలా చేసుకుంటున్నారు. తనపై కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు నేరం చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మారిన తరువాత వరుసగా కేసులు క్లోజ్ అవుతున్నాయి. స్కిల్ కేసులో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. స్కిల్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు. ఆ లెటర్ బయట పెట్టగలరా?.సిద్ధార్థ లూథ్రాకి ఏ అధికారంతో ఏపీ పోలీసు అధికారులతో సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబు అడ్డదారిలో అధికారంలోకి రాకుండా ఉంటే జీవిత కాలం జైల్లో ఉండే కేసులు ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ జైలుకి వెళ్ళడం ఖాయం’’ అని వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు. -
గవర్నర్ ఇవే అడిగారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాళ (బుధవారం) లోక్భవన్లో గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీ ఘటనలో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుందన్నారు.‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, యూరియా కొరత, రైతు బీమా, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు గవర్నర్కు ఫిర్యాదు చేశాం. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై ఫిర్యాదు చేశామని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాము. బ్లాక్ టీ షర్ట్ తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. దాడి చేసి మా పైనే ఉల్టా కేసులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరుకున్నారు. వేముల వీరేశం, కుంభం అనిల్రెడ్డి, నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారు. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫాం హౌస్పై దాడి చేసేందుకు ఉసిగొల్పారు. మేము అనని మాటలను అన్నట్టు స్పీకర్కు ఆపాదించారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్ను అవమానిస్తున్నారు...శాసన సభ కాదు.. దుశ్శాసన సభలా మార్చారు. చావు డప్పు ఎప్పుడు కొడతారో.. మనందరికీ తెలుసు. ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గర చావు డప్పు కొట్టారు. అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై సీఎస్ డీజీపీని పిలిపించి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మంచివి కాదని గవర్నర్ మాతో చెప్పారు.’’ అని కేటీఆర్ వివరించారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్ -
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదంటే అక్టోబర్లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.బుధవారం పర్చూర్ నియోజకవర్గ కేడర్తో జరిగిన భేటీలో.. పాదయాత్ర 2.0పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2027 సెప్టెంబర్లో లేదంటే అక్టోబర్లో యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారాయన. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2029లో ఏపీలో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ జగన్కు పాదయాత్రలు కొత్త కాదు. 2017లో ఆయన చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ వైఎస్సార్సీపీ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి యాత్రను ప్రారంభించారు. సుమారు 341 రోజులపాటు సాగిన ఆ యాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారు. ఆనాడు మొత్తం 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,516 గ్రామాల మీదుగా ప్రయాణిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. ప్రజా సమస్యలపై నేరుగా..పాదయాత్రలో భాగంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు, వివిధ సామాజిక వర్గాలతో జగన్ నేరుగా మమేకమయ్యారు. టీడీపీ ప్రభుత్వ పాలనలోని సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుంటూనే.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. యాత్ర ముగిసే సమయానికి దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో మమేకమైనట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. 2019లో అధికారంలోకి..ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన కొద్ది నెలలకే 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆయన రాజకీయ జీవితంలోనే కీలక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి పాదయాత్ర ప్రకటన చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. -
కాంగ్రెస్కు మిత్రపక్షం నుంచే ఘాటు కౌంటర్
ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇంతకాలం ఎన్నికలు.. సీట్ల పంపిణీ కారణం కాగా.. ఈసారి కాంగ్రెస్–నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య మరో కారణం మాటల యుద్ధానికి దారి తీసింది. ఇదే అదనుగా బీజేపీ రంగంలోకి దిగి కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘వందేమాతరం’ చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు కూటమి మిత్రపక్షాల మధ్య రాజకీయ పోరుగా మారింది.జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం జరిగిన తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో జాతీయ గీతం ‘జనగణమన’కు ముందు ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలు మొత్తం గీతం పూర్తయ్యే వరకు గౌరవంగా నిలబడ్డారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్–ఎన్సీ రెండూ ఇండియా కూటమిలో భాగస్వాములే కావడంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.‘పూర్తి గీతం మా వైఖరికి విరుద్ధం’శ్రీనగర్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘వందేమాతరం’ పూర్తి రూపం స్వాతంత్య్ర సమరయోధులు కోరుకున్నదానికి అనుగుణంగా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 1937లో ఆమోదించిన రూపాన్నే పాటించాలని, మిత్రపక్షాలు కూడా ఆ నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్ తదితర స్వాతంత్య్ర సమరయోధుల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వేణుగోపాల్ పేర్కొన్నారు. మతపరమైన విభేదాలకు తావులేకుండా ఉండేందుకే కాంగ్రెస్ రెండు చరణాల రూపాన్ని అనుసరిస్తోందని ఆయన గుర్తు చేశారు. అయితే దీనికి ఎన్సీ ఘాటుగా స్పందించింది.అంతమాత్రాన ఆదేశిస్తారా?కేసీ వేణుగోపాల్ ట్వీట్కు ఎన్సీ నేత బషీర్ అహ్మద్ బదులిచ్చారు. మిత్రపక్షంగా ఉన్న తమను ఏం పాడాలి, ఎంతవరకు పాడాలి అని కాంగ్రెస్ నిర్దేశించలేదని స్పష్టం చేశారు. ‘‘ఆయనకు తన అభిప్రాయాన్ని ‘ఎక్స్’లో వెల్లడించే హక్కు ఉంది. అయితే దాన్ని మిత్రపక్షాలపై విధించలేరు. ప్రజలపై ఏదైనా విషయాన్ని బలవంతంగా రుద్దడాన్ని మేం వ్యతిరేకిస్తాం అని స్పష్టం చేశారు.‘నాగ్పూర్ ఆదేశాలు పాటించొద్దు’ఎన్సీ స్పందనతో కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గలేదు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలు ఇండియా కూటమిలో భాగస్వాములని గుర్తుచేసిన కాంగ్రెస్ నేతలు.. కూటమి నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. నాగ్పూర్ అంటే ఆర్ఎస్ఎస్ నిర్ణయాలను అనుసరించవద్దంటూ ఎన్సీ నేతలపై విమర్శలు చేశారు.కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడిఈ వివాదాన్ని బీజేపీ కూడా అందిపుచ్చుకుంది. పూర్తి ‘వందేమాతరం’పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీని 21వ శతాబ్దపు ‘ముస్లిం లీగ్’గా మార్చిందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. కాంగ్రెస్ ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. మరో బీజేపీ నేత ఆర్ఎస్ పఠానియా కూడా కాంగ్రెస్పై మండిపడ్డారు. కశ్మీర్లో వేర్పాటువాదులు సైతం ‘వందేమాతరం’పై అభ్యంతరం వ్యక్తం చేయలేదని వ్యాఖ్యానించారు.కూటమిలో కొత్త రగడ?ఒకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ‘వందేమాతరం’ విషయంలో భిన్న వైఖరులు తీసుకోవడం ఇండియా కూటమి అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. శ్రీనగర్ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటుచేసుకున్న ఈ పరిణామం.. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది.రెండు చరణాలకే కాంగ్రెస్ కట్టుబాటు‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో రెండు చరణాల రూపాన్నే ఆలపించాలని గత నెలలో సీడబ్ల్యూసీ నిర్ణయించింది. పూర్తి గీతం విషయంలో బీజేపీ విమర్శలు పెరగడంతో ఈ నిర్ణయం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.మరోవైపు కేంద్రం కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, అధికారిక వేడుకల్లో పూర్తి ‘వందేమాతరం’ను ఆలపించే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉండగా.. అదే ఇండియా కూటమిలోని ఎన్సీ నేతలు శ్రీనగర్లో పూర్తి గీతానికి నిలబడటం చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సర్ప్రైజ్!! బీజేపీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? -
బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని ప్రకటించారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడడమే ఇందుకు కారణంగా ఆయన తెలిపారు.బుధవారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. సభా కార్యకలాపాలకు బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడ్డారు. మంత్రులు మాట్లాడుతున్న టైంలో.. స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు. నిన్న కేసీఆర్ ఫామ్హౌజ్ ముట్టడికి కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రయత్నించిన క్రమంలో.. తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ (We Want Justice) నినాదాలు చేశారు.ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్.. వెళ్లి సీట్లలో కూర్చోవాలని బీఆర్ఎస్ సభ్యుల్ని కోరారు. అయితే వాళ్లు ఆ మాట వినలేదు. దీంతో వాళ్లను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పీకర్ను కోరారు. ఆ వెంటనే వాళ్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. సస్పెండ్ అయిన వాళ్లలో.. కేటీఆర్, హరీష్రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, అనిల్ జాదవ్, కోవాలక్ష్మీ మాణిక్రావు, గంగుల కమలాకర్, సంజయ్ కుమార్, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని, చింత ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు 22 మంది ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత సభ కాసేపు వాయిదా పడింది. ఆ సమయంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఛాంబర్ వద్ద మార్షల్స్ కేటీఆర్, హరీశ్రావును అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మండలి నుంచి వాకౌట్ఇటు శాసనమండలిలో తమ ఇద్దరు సభ్యుల సస్పెన్షన్పై ఓటింగ్ నిర్వహించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని కోరింది. అందుకు ఆయన అనుమతించలేదు. తమను మాట్లాడేందుకు అనుమతించకపోవడం దారుణమంటూ మండలి విపక్ష నేత మధుసూధనాచారి నిరసన వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. సభ ఉన్నత విలువలు పాటించాలి. మా అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కోడతారట. ఎక్కడైనా ఇలా ఉంటుందా?. తెలంగాణకు అనేక సేవలు అందించిన మహానుభావుని చావు కోరుతారా?. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి...మా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు. నిన్న సభలోకి వస్తె వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలి. మా సభ్యులు సభలోకి వచ్చేవరకు మా నిరసన కొనసాగుతుంది. మా సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలి. మమల్ని ఎత్తివేస్తారా?. ఇది ప్రీ ప్లాన్డ్ కుట్ర. నిన్న పెట్టిన తీర్మానం పై చర్చ జరగాలి అని డిమాండ్ చేశారు. అయినా చైర్మన్ అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.ఇదీ చదవండి: ఇది ఫామ్హౌజ్లో జరిగిన కుట్రే! -
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులు, అరెస్టులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, దానిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలి’’ అని అన్నారు. ఓట్లపై కూడా అనుమానాలు..ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపైనా జగన్ ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం. సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం. స్థానిక ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రోజుకో డ్రామా.. డైవర్షన్ పాలిటిక్స్చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం జరుగుతోందని ఆరోపించారు. ‘‘రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.స్థానిక ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావని, అవి ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని జగన్ అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అండగా ఉంటారని, అలాంటి కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలవాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేస్తూ..పర్చూర్ కేడర్ వద్ద తన గత రాజకీయ అనుభవాలను కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. 2017లో తాను పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగిందని గుర్తుచేశారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైఎస్సార్సీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టానని, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. నాడు తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకే చంద్రబాబు పార్టీ పరిమితమైందని వ్యాఖ్యానించారు.మంచి చేసి ఓటు అడగాలి..పాలకులు ప్రజలకు మంచి చేసి, ఆ పనులను చూపించి ఓట్లు అడగాలని జగన్ అన్నారు. అలా చేసినప్పుడే దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభిస్తాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని అన్నారు. ‘‘జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ సంగ్రామంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి.. పోరాడాలి’’ అని వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: అర్హతే లేనివారికి టీచర్ పోస్టులా? -
లోక్భవన్కు బీఆర్ఎస్.. కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల వేడి కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. బీఆర్ఎస్ నేతలు నేడు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవాలని నిర్ణయించింది. గత రెండు రోజులుగా కొనసాగిన పరిణామాలపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటు అధికార కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్కు సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు లోక్భవన్కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లాల్సి ఉంది. అయితే అనుకున్న టైం కంటే అరగంట ముందుగానే గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేల బృందం ఆయన్ని కలవనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా పోలీసుల జులుం.. మహిళా ఎమ్మెల్యేలతో ప్రవర్తించిన తీరు, ఎమ్మెల్సీల అరెస్టులు.. నిన్న ఎర్రవల్లికి వెళ్తుండగా అడ్డగింతలు.. ఇలా ఇటీవల చోటుచేసుకున్న దాడుల ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్కు సిద్ధమవుతోంది. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారాన్ని రేవంత్ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. మధుతో పాటు నవీన్కుమార్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయించే దిశగా.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇటు ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే.. అప్పటిదాకా బీఆర్ఎస్ నేతలకు మైక్ ఇవ్వకూడదని స్పీకర్ను కోరాలని చూస్తోంది. నేడు మండలిలో కీలక చర్చమరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజుకు చేరుకోనున్నాయి. శాసనమండలిలో తాతామధు వ్యవహారంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన శాసనసభలో ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి.. తాతా మధు, నవీన్కుమార్ రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలిసి దాడుల ఘటనలపై ఫిర్యాదు చేయనుండగా.. మరోవైపు అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏం తమాషా చేస్తున్నారా? లోపలేస్తా.. -
కేటీఆర్ అరెస్టు.. ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఎర్రవల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను హకీంపేట వద్ద పోలీసులు అరెస్టు చేసి బోయిన్పల్లి పీఎస్కు తరలించడంతో బోయిన్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేటీఆర్ను బోయిన్పల్లికి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్లు పెద్ద సంఖ్యలో అనుచరులతో పీఎస్ వద్దకు చేరుకున్నారు. కేటీఆర్ను పోలీసు స్టేషన్లోపలికి తీసుకెళ్లకుండా వాహనాలకు అడ్డుపడ్డారు.సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు అసెంబ్లీ నుంచి నేరుగా బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఇంతలోనే స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడటంతోపాటు వారిని పోలీసు స్టేషన్ ఆవరణ నుంచి తరిమేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కేటీఆర్ను సాయంత్రం 4 గంటల వరకు పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. చివరకు ఆయనను సొంతపూచీకత్తుపై విడుదల చేయగా, అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీశ్రావుపై క్రిమినల్ కేసు సాక్షి, హైదరాబాద్: శాసనసభ గేట్ నంబర్–3 వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనభాపక్ష ఉప నేత టి.హరీశ్రావు సహా 14 మంది ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారు.పోలీసులపై తోపులాట, దాడి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సైఫాబాద్ పోలీసులకు ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. వీరిలో ఎవరిపాత్ర ఏమిటో తేల్చ డానికి వివిధ వీడియోలు, ఫొటోలు అధ్యయనం చేస్తున్నారు. గేట్–3 వద్ద జరిగిన మొత్తం ఘటన వీడియో ఫుటేజీలో నమోదై ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.సీసీ కెమెరా దృశ్యాలు, అసలు వీడియో రి కార్డింగుల ఆధారాలను సేకరించి ప్రతి ఒక్కరి పాత్ర ను నిర్ధారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్, హరీశ్రావుతోపాటు డి.సు«దీర్రెడ్డి, గంగుల, పాడి కౌశిక్రెడ్డి, జి.జగదీశ్వర్రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మీ, సబిత, సంజయ్, విజయు డు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తాతా మధు, నవీన్ కుమార్రెడ్డిని నిందితులుగా పేర్కొన్నారు.ఇవి కూడా చదవండి: తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి -
తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతామధుతోపాటు మరో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డిలపై కఠిన చర్యలు తీ సుకోవాలని పలువురు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. స్పీకర్ను అవమానించడం బీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని వారు ఆరోపించారు.మరోవైపు నల్లబ్యాడ్జీలతో మండలికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. సభ జరుగుతున్నంత సేపు వెల్లోకి దూసుకొచ్చి ‘వీ వాంట్ జస్టిస్.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. అక్రమ కేసులు ఎత్తివేయాలి’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మన్ పలుసార్లు వాయిదా వేశారు. మంగళవారం చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభను ప్రారంభిస్తూ..సోమవారం సభ బయట జరిగిన ఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసిన విషయాన్ని సభ్యుల దృష్టికి తెచ్చారు. అనంతరం ఈ అంశంపై చర్చను ప్రారంభించారు.కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘నిన్న జరిగిన సంఘటన బాధాకరం. స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైనదని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై కులపరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. తాతా మధు వ్యాఖ్యలతో ప్రజల్లో సభ పట్ల ఉన్న గౌరవం సన్నగిల్లే అవకాశం ఉంది’మహేశ్గౌడ్ అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా ప్రకటించారు.అనంతరం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, తాతా మధు, నవీన్కుమార్లు తనపై పుస్తకాలు చించి విసిరారని, ఆ పుస్తకాల్లోని పిన్నులు గుచ్చుకుంటే గాయం అయ్యేదని..పెద్దల సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని పదేపదే సూచిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చుంటే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు కొనసాగించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్పీకర్పై పరుషపదజాలం వాడడం నిమ్న జాతులను అవమానించడమేనని, ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ది దళిత వ్యతిరేక స్వభావమని విమర్శించారు. మహిళా పోలీసులపైనా బీఆర్ఎస్ సభ్యులు దాడి చేశారని, ఈ విషయంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల విషయంలో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, స్పీకర్పై అవమానకరమైన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్పీకర్ను ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలంతో దూషించడం దురదృష్టకరమన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, స్పీకర్ అంటే పారీ్టలకతీతంగా గౌరవం ఇవ్వాలని, అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ళీ అంతకు ముందు ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, శంకర్నాయక్, ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ దళితులపట్ల బీఆర్ఎస్ ఈ ధోరణి సరికాదన్నారు. అనంతరం టీ బ్రేక్ ఇస్తూ చైర్మన్ సభను వాయిదా వేశారు.ఇవి కూడా చదవండి: ఫామ్హౌస్లో జరిగిన కుట్రే -
ఫామ్హౌస్లో జరిగిన కుట్రే
సాక్షి, హైదరాబాద్: శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు యావత్ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, మొత్తం చట్టసభకు జరిగిన ఘోర అవమానమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో రచ్చ ఆషామాషీగా జరిగింది కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పారు. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే..ఒక రోజు ముందు 6వ తేదీన ఫామ్హౌస్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం పెట్టి కుట్రకు తెరలేపారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఉగ్రవాద సంస్థలు తమ భావజాలాన్ని నూరిపోసి పంపించిన తరహాలో బీఆర్ఎస్ సభ్యులను ప్రేరేపించి పంపించారని విమర్శించారు. కుట్రదారుల డైరెక్షన్లో కొందరు బీఆర్ఎస్ సభ్యులు పాత్రధారులుగా సభలో ప్రవర్తించారని, ప్రధాన సూత్రధారులు బీఆర్ఎస్ అత్యున్నత నాయకత్వమేనని విమర్శించారు. స్పీకర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదించిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ డిప్యూటీ సీఎం మాట్లాడారు. సభాపతి తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. తెలంగాణ సమాజం సంస్కారం, సంస్కృతి, మహిళల గౌరవానికి సంబంధించిన సమస్య అని భట్టి విక్రమార్క అన్నారు.రూపుమాపని మానసిక అస్పృశ్యత: దామోదర స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మానసిక అస్పృశ్యత రూపుమాపలేదని మంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాకు అవమానాలు, పోరాటాలు కొత్తకాదు. దళితుల చరిత్ర అంటే పోరాటాల చరిత్ర. ఆత్మగౌరవ చరిత్ర. ఆత్మగౌరవమే మా అలంకారం. ఆత్మగౌరవమే మా స్ఫూర్తి. ఆ ఆత్మగౌరవంతోనే ఈ స్థాయికి వచ్చాం’అని మంత్రి అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే యువత తిరగబడుతుందని, ముఖ్యంగా దళిత సమాజాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి, ఎన్నో కష్టాలను అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ స్పీకర్గా ఉన్నత స్థానానికి చేరుకున్న గడ్డం ప్రసాద్కుమార్ను అవమానించడం బాధాకరమన్నారు.ఇవీ చదవండి: తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు -
తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు
సాక్షి, హైదరాబాద్: రెండోరోజూ శాసనసభ అట్టుడికింది. మంగళవారం జరిగిన సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య, స్పీకర్–హరీశ్రావు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే సోమవారం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ.. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. అదే సమయంలో సభాపతి గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం సభను కుదిపేసింది.సభలో సభ్యులను ఉద్దేశించి అంతగా మాట్లాడని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై హరీశ్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. హరీశ్రావు లేచి సోమవారం జరిగిన ఘటనను ప్రస్తావించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. ‘మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. వారిపై కేసులు పెట్టారు. మరి వారిపై దాడి చేసిన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు.ఆగ్రహించిన స్పీకర్– హరీశ్పై ఆగ్రహంహరీశ్ మాటలపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ వెంటనే స్పందించారు. మహిళా సభ్యుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. జరిగిన ఘటనపై ఇప్పటికే పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. స్పీకర్ సమాధానంతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ బెదిరింపులకు నేను భయపడను. మీరు చేస్తున్నది తప్పు’అంటూ ప్రతిపక్ష సభ్యులను హెచ్చరించారు. అంతలోనే అసెంబ్లీ బయట తనపై, తన తల్లిపై చేసిన వ్యాఖ్యల అంశాన్ని స్పీకర్ ప్రస్తావించారు. ‘మీరెందుకు ఆవేశపడుతున్నారు హరీశ్ ? నా సంగతేంటో చెప్పు? మీ తల్లిని ఎవరూ తిట్టలేదు. నా తల్లిని తిట్టారు. మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆవేశపడాల్సింది నేను. బీఆర్ఎస్ నాయకులు మీ తల్లి గురించి మాట్లాడలేదు.. నా తల్లి గురించి మాట్లాడారు. దీనిపై ఏం చేద్దామో ముందు చెప్పండి’అని స్పీకర్ తీవ్ర భావోద్వేగానికి గురవడంతో సభలో కొద్దిసేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.స్పీకర్ను అవమానిస్తే ఊరుకుంటారా : మంత్రి శ్రీధర్బాబుఈ సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు జోక్యం చేసుకున్నారు. మహిళా ఎమ్మెల్యేల ఘటనపై ప్రభుత్వం కూడా నివేదిక కోరిందని, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. అదే సమయంలో సభాపతిని అవమానించేలా వ్యవహరించడం, బెదిరించడం సరికాదన్నారు. సభ్యుడు రాంచంద్ర నాయక్ కూడా బీఆర్ఎస్పై తీవ్రంగా మండిపడ్డారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ స్పీకర్ స్థానంలో దళితుడిని కూర్చోబెట్టడం ఇష్టం లేకనే కేసీఆర్ సభకు రావడం లేదని ధ్వజమెత్తారు. గతంలో దళితులను అవమానించిన చరిత్ర కేసీఆర్దని, స్పీకర్పై కాగితాలు విసిరారని దళితుడైన సంపత్కుమార్ను, కోమటిరెడ్డిని సభ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు.మహిళలను ముందు పెట్టి.. మీరు వెనుకా: సీతక్కఅసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. సబితా ఇంద్రారెడ్డిని ఎవరు తోశారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి మీరు వెనుక ఉండటం ఏమిటని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిపై బీఆర్ఎస్ నేతలు చేయిచేసుకున్నారని, దీనికి సంబంధించిన దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.వెల్లోకి బీఆర్ఎస్ సభ్యులుఇరువర్గాల వాదనలు కొనసాగుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా వెల్లోకి వెళ్లారు. కొందరు సభ్యుల చేతుల్లో ఉన్న ప్లకా ర్డులను చీఫ్ మార్షల్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడి యం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం మరింత పెరిగింది. బీఆర్ఎస్ మహిళా సభ్యులపై జరిగిన దౌర్జన్యం. అవమానంపై ప్లకార్డులు పెట్టుకొని పోడియంలోకి సభ్యులు మళ్లీ దూసుకెళ్లారు.22ఏపై బీజేపీ ఆందోళనబీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి 22ఏ నిషేధిత జాబితా అంశంపై చర్చకు పట్టుబట్టా రు. బీజేపీ సభ్యులు కూడా ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో సభలో ఒకవైపు బీఆర్ఎస్–కాంగ్రె స్ మధ్య వాగ్వాదం, మరోవైపు 22ఏ అంశంపై బీజే పీ నిరసనతో పరిస్థితి మరింత గందరగోళంగా మా రింది. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో సభను కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో స్పీకర్ సభను ఉదయం 10.45 గంటలకు వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పీకర్ చాంబర్కు వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత సభ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరిగి ప్రారంభమై కొనసాగింది. క్షమాపణ చెప్పాడు.. మళ్లీ ఎందుకు: హరీశ్రావుహరీశ్రావు మరోసారి జోక్యం చేసుకొని.. స్పీకర్ పట్ల తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఇప్పటికే క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలపై కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. ‘స్పీకర్ గారంటే మాకు గౌరవం ఉంది. వ్యక్తిగతంగా కూడా మీ పట్ల గౌరవం ఉంది. అయితే మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారు’అని ప్రశ్నించారు.ఇవి కూడా చదవండి: అసలు హరీశ్రావుకు మైక్ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా -
అసలు హరీశ్రావుకు మైక్ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మొదటిసారి మీడియా ముందుకొచ్చారు. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మంగళవారం సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్కు చెందిన హరీశ్రావుకు మైక్ ఇవ్వకూడదని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తుంది కాబట్టి మైక్ ఇచ్చానని చెప్పారు. అయితే, సోమవారం అసెంబ్లీ గేటు బయట జరిగింది అనుకోకుండా అయితే, హరీశ్రావు సభలో మాట్లాడింది మాత్రం తనను మనస్తాపానికి గురిచేసిందన్నారు. జరిగిన దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో క్షమాపణలు చెబుతారేమో అనుకున్నానని, కానీ హరీశ్రావు అందుకు విరుద్ధంగా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అందుకే మొదటిసారి కోపానికి వచ్చానని, మనస్తాపం చెందానని, సభలో కూర్చోవాలని అనిపించలేదని, మంగళవారం ఒక్కరోజు ప్యానెల్ స్పీకర్తో సభను నడిపించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పదేళ్లు మంత్రిగా హరీశ్రావు ఉన్నాడని, ఆయన కూడా ఇలా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. 1987 నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. తననుద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడిన మాటలకు రాష్ట్రమంతా ఊగిపోతోందని, దళిత సంఘాలు కోపంగా ఉన్నాయని చెప్పారు. తాతా మధు మాట్లాడిన ప్రదేశం అసెంబ్లీ పరిధిలోనే ఉంటుందని, ఆ విషయం బీఆర్ఎస్ వారికి తెలియదనుకుంటా అని వ్యాఖ్యానించారు. తాము కేసీఆర్లాగా చేయాలనుకుంటే అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లను చేసినట్టు తాతా మధు, కౌశిక్రెడ్డిలను కూడా సభ నుంచి బయటకు పంపించేవారమన్నారు. అక్కడ కనపడుతోంది అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ ప్రసాద్కుమార్ స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీ గేటు బయట కేటీఆర్, హరీశ్రావు, నవీన్రెడ్డిలు పోలీసులు కొట్లాడింది, తాతా మధు మాట్లాడింది ప్రత్యక్షంగా కనపడుతోందని చెప్పారు. కానీ, మహిళా ఎమ్మెల్యేల విషయంలో ఎప్పుడు ఏం జరిగిందో అర్థం కావడం లేదని, అందుకే విచారణ చేయమని చెప్పానన్నారు. బీఆర్ఎస్ సభ్యులు పైనుంచి కింది వరకు నల్ల దుస్తులు వేసుకొని వచ్చినా అభ్యంతరం లేదని, కానీ ఆ దుస్తులపై ఉన్న రాతలు అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమన్నారు. అయితే, 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో ఉన్న నిబంధనలను తొలగించి తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ కొత్తగా అసెంబ్లీ రూల్స్ తెచ్చాడని, ఆ నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని, ఆ నిబంధనల ప్రకారమే చెబుతున్నామన్నారు. రాహుల్గాంధీ నల్లటీషర్టుపై ఆదానీ అని రాసుకొని వెళ్లలేదని, కేవలం నల్ల టీషర్టు వేసుకొని మాత్రమే పార్లమెంటులోకి వెళ్లారని చెప్పారు. ప్రభుత్వమే అడిగింది తాజా పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని సభలో ప్రభుత్వమే డిమాండ్ చేసిందని స్పీకర్ చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో తనకు కేసీఆర్ ఫోన్ చేయలేదన్నారు. సభ ప్రారంభానికి ముందు తానే కేసీఆర్కు ఫోన్ చేశానని, సభకు రావాలని అడిగానని చెప్పారు. ఆరోగ్యం సహకరిస్తే వస్తానని కేసీఆర్ తనతో చెప్పారన్నారు. తాను ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేసి సభకు రావాలని కోరుతానని వెల్లడించారు. తాతా మధు, నవీన్రెడ్డిలు అసెంబ్లీలో సభ్యులు కానప్పటికీ చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని, కానీ అలా చేయడం లేదని, చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసి మండలి చైర్మన్కు పంపుతామని స్పీకర్ ప్రసాద్కుమార్ చెప్పారు. -
హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్ జగన్
తాడేపల్లి : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ’ఎక్స్’ వేదికగా కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు వైఎస్ జగన్. ‘కాకినాడలో మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులపై కక్షపూరితంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. శ్యామ్, టి.రాజా, ఎం.గంగా సూరిబాబు, రాజేష్తో పాటు 20 మంది పోలీస్ ఉద్యోగ అభ్యర్థులపై కేసులు నమోదు చేయడం దారుణం. ‘‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడం, ఉద్యోగాల భర్తీ కోరడమే వారు చేసిన నేరమా?, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా నేరంగా మారిందా?, అధికారంలోకి రావడానికి యువతకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు. . మూడేళ్లకు రూ.21,600 కోట్ల నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా..యువతను మోసం చేసిన ప్రభుత్వం..ఇప్పుడు ఉద్యోగాలు అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తోంది. మెగా డీఎస్సీ స్కాంలో రోజుకో కొత్త ఆధారం బయటపడుతున్నా..సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేష్ అణచివేత, సెన్సార్షిప్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ ఇస్తూ నిజమైన నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ అడిగితే మాత్రం కేసులా?, ఇది కూటమి ప్రభుత్వ యువత వ్యతిరేక, ప్రజాస్వామ్య విరుద్ధ వైఖరికి నిదర్శనం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రిక్రూట్మెంట్ స్కాంలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల్లో అక్రమాలు పరిపాటిగా మారుతున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలను గౌరవించడం టీడీపీకి ఎప్పుడూ చేతకాలేదు. పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించడం కంటే.. అవినీతి, రాజకీయ మాయాజాలానికే ప్రాధాన్యం ఇస్తోంది.నిరుద్యోగ యువతపై నమోదు చేసిన అన్ని కేసులను తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.Cases were…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 8, 2026 డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు -
‘స్థానిక’ ఎన్నికలకు మనమంతా సన్నద్ధంగా ఉండాలి: బొత్స
కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు మనమంతా సమాయత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ప్రతీ స్థానంలోనూ పోటీ చేయాలని, పోరాటం చేసి విజయం సాధించాలన్నారు. కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు. కూటమి పాలనలో జరుగుతున్న ఆకృత్యాలను ఎన్నడూ చూడలేదని, వారి ఆకృత్యాలన్నీ టీవీ, పేపర్లు చూస్తూ కనిపిస్తాయన్నారు. ‘ టెట్ ఎన్ని సార్లు అయిన రాసుకోవచ్చు అని చంద్రబాబు, లోకేష్ ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు. టెట్ రాయకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వొచ్చా లేదా అనే దాని పై చెప్పడం లేదు. డీఎస్సీ అక్రమాల పై ప్రశ్నించినందుకు మాపై కేసులు పెడితే తేల్చుకుంటాం. ఆంద్రాలో ప్రజలు తిండిలేకుండా ఉంటే...ఢిల్లీలో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశారు. పురుషోత్తపట్నం నుండి నీళ్లు తోడి పోలవరం కాలువలో వదులుతారా?, గ్రావెటీతో కాకుండా ఎన్నాళ్ళు నీళ్ళు ఇస్తారు. పోలవరం ప్రాజెక్టు నాణ్యత కోసం విదేశి నిపుణులు ఏం చెప్పారో చంద్రబాబు చెప్పాలి. అపర భగీరధుడు అంటే వైఎస్ఆర్. సున్నా వడ్డీ డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఎందుకు తీసేశాడు?, నిరుద్యోగ భృతి ఏది అని నిరుద్యోగులు అడిగితే వాళ్ళపై కేసుల పెడతారు.. అసలు సూపర్ సిక్స్ అమలు చేయకుండానే సూపర్హిట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు. ‘టెట్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ -
‘ధురంధర్’లా మోదీ ఎంట్రీ.. ‘ఆరీ ఆరీ’ పాటతో గ్రాండ్ వెల్కమ్
గాంధీనగర్: గుజరాత్లోని వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఆయన వడోదరలోని మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయంలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీ కార్యక్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టే సమయంలో ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరీ ఆరీ’ పాట వినిపించింది. అంతకుముందు క్వీన్ బృందానికి చెందిన ‘వీ విల్ రాక్ యూ’ పాటను కూడా వినిపించారు. యువత పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో మోదీ వారిని ఉద్దేశించి చేతులు ఊపుతూ ముందుకు సాగారు. ‘ఆరీ ఆరీ’ (Aari Aari) అనేది రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ ది రివెంజ్' సినిమాలోని సూపర్హిట్ పాట.#WATCH | Gujarat | PM Modi receives an enthusiastic welcome from the crowd attending the 'NaMo for Viksit Bharat' event in Vadodara(Video source: ANI/DD) pic.twitter.com/klrHAJri9T— ANI (@ANI) September 8, 2026 మోదీ రాక సందర్భంగా ప్రత్యేకంగా ‘వై’ ఆకారంలో వేదికను ఏర్పాటు చేశారు. దాని చుట్టూ యువత కూర్చొని ఉండగా, మోదీ ఆ వేదికపై నడుస్తూ వారిని పలకరించారు. వడోదర పర్యటనలో మోదీ రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రైల్వే, రహదారులకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.ఈ సందర్భంగా మోదీ సరుకు రవాణా రైలు సేవలను, టాండా రోడ్ నుంచి వడోదరలోని ప్రతాప్నగర్కు అనుసంధానించే కొత్త ప్రయాణికుల రైలును ప్రారంభించారు. పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా మార్గంలోని 3 కీలక విభాగాలు, రైల్వే, రహదారి మౌలిక వసతులతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. -
సీఎం వచ్చారు.. కానీ, సీఎంలా కాదు! హడావుడే లేదు..
బెంగళూరు: కర్ణాటకకు సీఎం అయినప్పటికీ సీఎంలా కాకుండా, ఏ హడావుడి లేకుండా ఓ సామాన్యుడిలా మార్కెట్ అంతా కలియతిరిగి చూశారు డీకే శివకుమార్. మార్కెట్లో స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు, కూలీలతో మాట్లాడారు. సామాన్యుడిలా కాకా హోటల్లో అల్పాహారం చేసి, కూలీలతో కలిసి చాయ్ తాగుతూ గడిపారు. సీఎం అయినప్పటికీ ఆయన ఏం మారలేదంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.డీకే శివకుమార్ మంగళవారం యశ్వంత్పూర్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) మార్కెట్ ప్రాంగణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ఉల్లిగడ్డ రైతులు, వ్యాపారులు, మహిళా కార్మికులతో మాట్లాడారు. మార్కెట్లో కలియతిరిగిన సీఎం.. రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ముఖ్యంగా ఉల్లిగడ్డల వ్యాపారానికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన పంటను తూకం వేసే సమయంలో ఏవైనా అక్రమాలు జరుగుతున్నాయా అని కూడా ప్రశ్నించారు.ఉల్లిగడ్డలను రవాణా చేసేందుకు పెరుగుతున్న ఖర్చులు తమ ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయని రైతులు శివకుమార్కు తెలిపారు. తమ సమస్యలను తెలుసుకునేందుకు వ్యవసాయ మంత్రి మార్కెట్కు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదులను సీఎం శ్రద్ధగా విన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్కెట్లో పనిచేస్తున్న మహిళా కార్మికులతోనూ మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.ఇటీవల ఉల్లిగడ్డ ధరలు పెరుగుతున్న సమయంలో సీఎం మార్కెట్ను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలను రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి మార్కెట్కు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఇకనైనా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ಯಶವಂತಪುರದ ಎಪಿಎಂಸಿ ಮಾರುಕಟ್ಟೆಯಲ್ಲಿ ಶ್ರಮಜೀವಿಗಳೊಂದಿಗೆ ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ @DKShivakumar ಅವರ ಆತ್ಮೀಯ ಮಾತುಕತೆ. ಬೆವರಿನ ಹನಿಯನ್ನೇ ಬಂಡವಾಳವಾಗಿಸಿಕೊಂಡು, ತಮ್ಮ ಪರಿಶ್ರಮದಿಂದ ಬದುಕು ಕಟ್ಟಿಕೊಳ್ಳುವ ಈ ಶ್ರಮಜೀವಿಗಳೇ ನಾಡಿನ ನಿಜವಾದ ಶಕ್ತಿ. pic.twitter.com/dUNAPI6n1D— CM of Karnataka (@CMofKarnataka) September 8, 2026 -
‘టెట్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’
తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై 3.30 లక్షల మంది నిరుద్యోగుల తరఫున జూన్ నెల నుంచే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసిన మోసాలు బయటపడటంతో సమాధానం చెప్పలేక ఇద్దరు ఐఏఎస్ అధికారులను ముందుకు నెట్టి అబద్ధాలు చెప్పిస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. స్పోర్ట్స్ కోటా అక్రమాలలో శాప్ పాత్ర ఉందని, అధికారుల ప్రెస్మీట్లో మీడియాను బెదిరించినట్లు ఉందన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, డీఎస్సీ కన్వీనర్, శాప్ చైర్మన్ చేసిన తప్పులను అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమాలన్నింటిపై విచారణ జరిపి తప్పులను తేల్చాల్సిన రోజు అధికారులకు వస్తుంది. స్పోర్ట్స్ డీఎస్సీ, మెగా డీఎస్సీల్లో టెట్ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. ఈడిగ ప్రభాకర్కు టెట్ అర్హత లేదని స్వయంగా అతనే ఒప్పుకున్నా, 2018లో 77 మార్కులు వచ్చాయని పీపీటీ ద్వారా అబద్ధపు ప్రచారం చేశారు. ఎస్జీటీ పోస్టుకు పేపర్ వన్-ఏ అవసరమైతే, స్పెషల్ స్కూల్స్కు వర్తించే పేపర్ టు-బి మార్కులను చూపించి కమిషనర్ ప్రజలను తప్పుదారి పట్టించారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ పరిశీలిస్తే ఎక్కడా ప్రభాకర్కు పేపర్ టు-బి రాసిన దాఖలాలు లేవు. డీఎస్సీ ప్రక్రియ ముగిసిన తర్వాత 2025లో జరిగిన టెట్ పరీక్షను ప్రభాకర్ ఎందుకు రాయాల్సి వచ్చిందో అధికారులు సమాధానం చెప్పాలి. జే ఉషా స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కు దరఖాస్తు చేసుకుంటే, ఆమెకు ఏకంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టు కేటాయించారు. 2017 తర్వాత లాంగ్వేజ్లకు ప్రత్యేకంగా టెట్ పాస్ కావాలన్న నోటిఫికేషన్ నిబంధనలను ఉల్లంఘించి ఉషాకు పోస్టు ఇచ్చారు. రాజ్ కుమార్ అనే వ్యక్తికి అర్హత లేకపోయినా, డీఎస్సీ రాయకపోయినా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉద్యోగం కట్టబెట్టారు. తప్పులను ప్రశ్నిస్తున్న మీడియాకు, అభ్యర్థులకు వార్నింగులు ఇస్తూ అక్రమ కేసులు పెడతామని శాప్ ఎండీ బెదిరిస్తున్నారు. జూడో క్రీడలో జరిగిన ఘోరమైన అవకతవకలను రెండు అసోసియేషన్ల మధ్య గొడవగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూస్తున్నారు. 2025 సెప్టెంబర్లోనే రిక్రూట్మెంట్ ముగిస్తే, 2026 జూన్లో వెబ్సైట్ ద్వారా సర్టిఫికెట్లను అక్రమంగా మార్చేశారు. పెద్దాడ అప్పలరాజుకు తన తమ్ముడి సర్టిఫికెట్తో ఉద్యోగం ఇచ్చిన విషయం అధికారిక వెబ్సైట్ ద్వారానే బట్టబయలైంది.ఆర్చరీ, కబడ్డీ అభ్యర్థుల సర్టిఫికెట్లు, విజయాల వివరాలను కూడా అధికారులు నిస్సిగ్గుగా ట్యాంపరింగ్ చేశారు. ఎమ్మెల్యే పూనా రవికుమార్ సంతకాలతో ఇచ్చిన సర్టిఫికెట్లను చెల్లుబాటు చేయడానికి నకిలీ ఆథరైజేషన్ లెటర్లను సృష్టిస్తున్నారు. జీవో నెంబర్ 4, 47 ప్రకారం సెక్రటరీ లేదా జనరల్ సెక్రటరీ మాత్రమే సంతకం చేయాలన్న రూల్ ఉంటే గౌరవ అధ్యక్షుడి సంతకాలను ఎలా ఆమోదిస్తారు. 2018 నోటిఫికేషన్ ప్రకారం స్పోర్ట్స్ పర్సన్లకు గ్రౌండ్ పెర్ఫార్మెన్స్కు 20 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చే నిబంధనను ఎందుకు రద్దు చేశారు. జిల్లా స్థాయిలో డీఎస్డీవోల ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే పద్ధతిని పూర్తిగా తొలగించి శాప్లో కూర్చుని అక్రమాలకు పాల్పడ్డారు. కలెక్టర్లు, డీఈవోల ఆధ్వర్యంలో జరగాల్సిన 1:1 సర్టిఫికెట్ వెరిఫికేషన్ను పూర్తిగా ఎత్తేసి నియామక పత్రాలు ఇచ్చారు. అభ్యర్థులు పెట్టుకున్న గ్రీవెన్స్లను కనీసం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా, శాప్ లేఖలు రాసినా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అర్హులకు న్యాయం చేయకుండా తొక్కిపెట్టింది. కోర్టు ఆదేశాలు ఉన్న 100 జెన్యూన్ కేసులను స్వయంగా తీసుకొస్తాం, గ్రీవెన్స్ ద్వారా బాధితులకు న్యాయం చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’ ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు -
తెలంగాణలో హీటెక్కిన రాజకీయ వాతావరణం
తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ఆందోళనలతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. మంగళవారం ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో వివాదం మరింత ముదిరింది. హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎర్రవల్లికి తరలిరావడంతో వాతావరణం మరింత హీటెక్కింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీ నిరసనలు కొనసాగుతున్నాయి. చెన్నూర్ పట్టణంలో హైటెన్షన్కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నిరసనలకు దిగడంతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్, కేటీఆర్, తాతా మధు చిత్ర పటాలకు చెప్పుల దండలు వేసి నిరసన తెల్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. ఒకే ప్రాంతంలో రెండు పార్టీల నిరసనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమై అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్- సిద్ధిపేట రహదారిలో ట్రాఫిక్ జామ్బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో హైదరాబాద్- సిద్ధిపేట రహదారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ కేత్రం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేయడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరదరాజ్పూర్లో పరస్పర దాడులుసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం వరదరాజ్ పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటీపోటా నిరసనలకు దిగారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ దగ్ధం చేయగా, మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణ చోటు చేసుకున్నాయి. చెప్పులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. జమ్మికుంటలో తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తాతా మధు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. నకిరేకల్లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీతమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో అసెంబ్లీ వద్ద వ్యవహరించిన తీరుకు నిరసనగా నల్లగొండ జిల్లా నకిరేకల్లో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. చదవండి: ఎర్రవల్లిలో టెన్షన్.. టెన్షన్ఐలయ్య నివాసం వద్ద డప్పు కొట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలుకేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట చావుడప్పు కొడతానన్న ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఆయన నివాసం వద్ద డప్పులు కొట్టి నిరసన తెలిపారు. బీర్ల ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలిజగిత్యాల జిల్లాలోని కోరుట్ల, కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన తెలిపారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా నాయకులపై అనుచిత ప్రవర్తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రోడుపై బైఠాయించి నిరసన తెలపడంతో వాహన రాకపోకలు అంతరాయం కలిగి, ట్రాఫిక్ స్తంభించింది. ఇదీ చదవండి: 'కేసీఆర్ ఇంటిని టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే'తాతా మధును బర్తరఫ్ చేయాలికామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే ఆ పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గంప గోవర్ధన్ అరెస్ట్కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే కమాన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వినతిపత్రం సమర్పించి రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రైల్వే కమాన్ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవరకొండలో కాంగ్రెస్ బైక్ ర్యాలీబీఆర్ఎస్ అధినేత పోకడలను వ్యతిరేకిస్తూ నల్లగొండ జిల్లా దేవరకొండలో ఎమ్మెల్యే బాలూ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా బాలూ నాయక్ మాట్లాడుతూ.. అసెంబ్లీకి రాకుండా ఫాంహౌస్కే పరిమితమైన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు మోసానికి గురయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్న సైకో రేవంత్! 😡🚨 రేవంత్ రెడ్డి ఆదేశాలతో..కాంగ్రెస్ గూండాలకు బందోబస్తు ఇస్తూ ఎర్రవెల్లిలో కేసీఆర్ గారి ఇంటి మీద దాడికి తీసుకెళ్తున్న పోలీసులు!శాంతిభద్రతలు కాపాడాల్సిన సీఎం, హోం మంత్రి.. రేవంత్ రెడ్డి స్వయంగా దాడులను ప్రోత్సహిస్తావా? ఇదేనా… pic.twitter.com/sO60gB1SWP— BRS Party (@BRSparty) September 8, 2026 -
లోకేశ్.. ఇది సిగ్గు చేటు: కొండా రాజీవ్
సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడా లేని విధంగా దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇవ్వటం ఏపీలోనే చూస్తున్నామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ అన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాలు బయటపడినా.. ఎదురు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారాయన. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీలో అక్రమాలు చేసి టీడీపీ నేతలు దొరికి పోయారు. సాక్ష్యాలు బయటపడినా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే వెళ్తారు. అక్రమాలు బయట పడినా లోకేష్ పై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఒకప్పుడు వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తే సీబీఐతో విచారణ జరిపించుకోమని వైఎస్ఆర్ సవాల్ చేశారు. మరి లోకేష్ పై ఆధారాలతో బయటపడినా ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?. చంద్రబాబు వెంటనే లోకేష్తో రాజీనామా చేయించాలి అని రాజీవ్ అన్నారు.. దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఉవ్వటం ఏపీలోనే చూస్తున్నాం. మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపై కూడా సీబీఐ విచారణకు మేం సిద్ధమంటున్నా కూడా వాళ్ల దగ్గరి నుంచి స్పందన లేదు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఉద్యోగం ఇచ్చే ముందు సర్టిఫికేట్ల విచారణ చేయాలి. కానీ ఇష్టానుసారం ఉద్యోగాలు అమ్మేసుకుని ఇప్పుడు సర్టిఫికేట్ల విచారణ చేస్తామంటారా?. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?. వారిపై చర్యలు తీసుకుబే దమ్ము ప్రభుత్వానికి లేదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఫేక్ వాళ్లు బయటకు వచ్చి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారో బయట పెడతారోనని భయం.. .. పైగా ప్రశ్నించిన మీడియాపై కేసులు పెడతున్నారు. నారా లోకేష్ సవాల్పై చర్చించటానికి మా మాజీ మంత్రులు సిద్ధమే. అది చూసి ఆయన భయంతో పారిపోయారు. సవాల్ చేసిన నారా లోకేష్ మహిళలను అడ్డం పెట్టి మాట్లాడించటం ఎందుకు?. ఇది సిగ్గుచేటు అని కొండా రాజీవ్ అన్నారు.ఇదీ చదవండి: జనసేనకు షాకిచ్చిన టీడీపీ -
‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్ను ఓదార్చిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభాపతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయించే దిశగానూ ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మంగళవారం అసెంబ్లీ సమావేశాల బ్రేక్ టైంలో.. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరూ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఆయన చాంబర్లో కలిశారు. నిన్నటి పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని స్పీకర్కు భరోసా ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని.. ఎవరినీ వదిలపెట్టబోమని స్పష్టం చేశారు.సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఈ పరిణామంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో నిన్న కంటతడి పెట్టారు. అయితే స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల తీరు అమానుషమని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది చీకటి రోజు అని.. బాధ్యులపై చర్యలు తప్పవంటూ సభలో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై ఈ ఉదయం సీఎం రేవంత్రెడ్డి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యవహారశైలిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న అంశంపై న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీలో తీర్మానం చేసి మండలికి పంపాలని.. ఇద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయించే అంశాల్ని ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిలను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. మరోవైపు.. అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఆందోళన సందర్భంగా మహిళా పోలీసులతో బీఆర్ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారితో అనుచితంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: తిట్టింది నీ తల్లిని కాదు.. హరీశ్రావుపై స్పీకర్ ఆగ్రహం -
‘డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు జరిగినట్టు అధికారులు అంగీకరించారు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని చెప్పారు.. అంటే అక్రమాలు జరిగినట్టు తేలిపోయింది. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి’’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజిలెన్స్తో కాకుండా సీబిఐతో విచారణ జరిపించాలన్నారు.‘‘ఈ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం ఉంది. 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలేవీ?. ఇప్పటికీ అక్రమాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?. పచ్చి అబద్దాలతో మంత్రి లోకేష్ అసెంబ్లీని సైతం అవమాన పరిచారు. వైఎస్ జగన్కు సవాల్ చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. డీఎస్సీ అక్రమాల వెనుక వ్యవస్తీకృత నేరం ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అక్రమాలు చేశారు...జూడో అసోసియేషన్ ఛైర్మన్ భరత్ సాక్షాత్తూ నారా లోకేష్ తోడల్లుడే. ఆ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇవన్నీ బయట పడాలంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైఎస్ జగన్కి సవాల్ చేసే స్థాయి లోకేష్కి లేదు. లోకేష్ ఎమ్మేల్యే కాకముందే నేను ఎంపీ అయ్యాను. లోకేష్తో చర్చకు నేను సిద్ధం. కరకట్ట ఇల్లయినా, హైదరాబాదు ఇంటికైనా చర్చకు వస్తా. డేటు, టైం లోకేష్ ప్రకటించాలి’’ అని మార్గాని భరత్ సవాల్ విసిరారు. -
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కోలీవుడ్ నటి త్రిష కృష్ణన్ బంధం గురించి చాలాకాలంగా అక్కడ చర్చ నడుస్తోంది. అయితే ఆమెను ఉద్దేశించి.. నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యవహారంపై సీఎం విజయ్ కూడా భగ్గుమన్నారు. మహిళల్ని కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఎపిసోడ్పై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళలను కించపరిచేందుకు.. వారి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ను లక్ష్యంగా చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ధోరణేనని ఆమె వ్యాఖ్యానించారు. హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం కంగనా మీడియాతో మాట్లాడారు. మహిళలు ఉద్యోగం చేస్తున్నా, విజయవంతమైనా, నాయకురాలిగా ఉన్నా, అధికార స్థానంలో ఉన్నా.. వారిని కిందకు లాగేందుకు.. ఆమె పరువు, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం మనకు కొత్తేం కాదు. అలాగని ఈ సమస్య భారత్కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచమంతటా ఉందని పేర్కొన్నారామె. ఈ క్రమంలోనే త్రిష ఎపిసోడ్ను ఆమె ప్రస్తావించారు. తమిళనాడులో మొన్న ఏం జరిగిందో అంతా చూశారు. ఎంతో గౌరవనీయమైన నటి ఒక వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆ వ్యవహారంలో సంబంధం ఇద్దరి మధ్య ఉంది. కానీ, దూషణలు, వ్యక్తిత్వాన్ని కించపర్చడం మాత్రం మహిళపైనే జరుగుతున్నాయి. ఎందుకలా?” అని కంగనా అన్నారు. ఆ ధోరణి ఇంకెప్పుడు ఆగుతుందని వ్యాఖ్యానించారామె. సమాజం తనను తాను ఈ విషయంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని.. మహిళలను మనం ఎలా చూస్తున్నాం? నిజంగా వారిని గౌరవిస్తున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలని వ్యాఖ్యానించారు.ఆగస్టు 3న కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు త్రిష పేరు ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీనికి ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. త్రిషను ఉద్దేశించే ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదవడంతో ఆగస్టు 4న ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు.అయితే తాను త్రిష పేరును ప్రస్తావించలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉదయనిధి చెప్పారు. కావేరీ నదిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్య చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. త్రిషకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు, మహిళా నేతలు స్పందించారు. కంగనా కూడా గతంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. బహిరంగంగా అసభ్యకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేయడం ఏ నాగరిక సమాజమూ అంగీకరించదని పేర్కొన్నారు. ఉదయనిధిపై తీసుకున్న చట్టపరమైన చర్యలు మంచి ఉదాహరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.ఇదే వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశరు. మహిళలపై వ్యక్తిగత దూషణలు, ద్వంద్వార్థ వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చని, కానీ మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు మాత్రం చోటు ఉండకూడదని హెచ్చరించారు. మహిళలపై దూషణలు, వ్యక్తిగత దాడులు కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంతా మా ఇష్టం అంటే కుదరదిక్కడ -
మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్’గా ఉంటున్నాయ్!
కూటమిలోని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా రగులుతున్న వివాదం పోనుపోను మరింత ముదురుతోంది. ముఖ్యంగా డీఎస్సీ వ్యవహారంపై ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం పోస్టులు.. ఒకనొక దశలో పెద్దల మీద మీమ్స్, ట్రోల్స్తో విరుచుకుపడే స్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో జనసేనను ఉద్దేశిస్తూ టీడీపీ డబుల్ మేసేజ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న కార్యకర్తలకు.. ఇరు పార్టీల అధిష్టానాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయనేది జరుగుతున్న ప్రచారం. అయితే ఈ విషయంలో జనసేనదే మొత్తం తప్పు అనే లైన్లో టీడీపీ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. దానిని కాస్త నిశీతంగా పరిశీలిస్తే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వైఫల్యాల్ని.. జనసేనకు ఆపాదిస్తూ ఐటీడీపీ తన సపోర్టింగ్ పేజీలతో కొన్ని పోస్టులు చేయించింది. దీనిపై జనసేన భగ్గుమంది. ‘మీ బురదలోకి మమ్మల్నెందుకు లాగుతారు?’ అంటూ కౌంటర్ పోస్టులతో నిలదీసింది. అంతటితో ఆగకుండా.. చంద్రబాబు, నారా లోకేశ్ను టార్గెట్ చేసుకుని మీమ్స్ ప్రచారం చేసింది. అయితే అప్పటికే.. ఓ సినిమా కోసం సీనియర్ ఎన్టీఆర్ అమెచ్యూరిష్ డైలాగ్పై ఉద్దేశపూర్వక ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం ఆ సినీ ఫ్యామిలీపై ఎన్టీఆర్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే దీనిని క్యాష్ చేసుకోవాలని భావించిన ఐటీడీపీ.. తన కౌంటర్లను మరింత పదును పెట్టింది. ఏకంగా పవన్ కల్యాణ్ సినీ, పొలిటికల్ కెరీర్ ఫెయిల్యూర్స్ను ప్రస్తావిస్తూ వరుస పోస్టులు చేసింది. అదే సమయంలో.. టీడీపీలోనే ఇంకో వర్గం నుంచి సీనియర్ నటుడు, పవన్ సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి పోస్టులు వచ్చాయి. అయితే టీడీపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేన కార్యకర్తలు మీమ్స్, ట్రోల్స్ చేయడం, ఇప్పుడు రాజకీయంగా ఇరకాటంలో పడేసిన డీఎస్సీ అంశంపైనా వరుసగా పోస్టులు పెట్టడంపై టీడీపీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో కూటమి పెద్దలు రంగంలోకి దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు, దూషణలకు దిగొద్దని సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఒకరిపై ఒకరు కామెంట్లు చేయొద్దని.. తద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ సందేశం ఇచ్చింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా.. జనసేన కార్యకర్తలు చేస్తున్న కొన్ని పోస్టులతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని టీడీపీ పేర్కొంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు కుటుంబంపై జనసేన కార్యకర్తలు చేసిన అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యల విషయాన్ని ఆ పార్టీతో మాట్లాడినట్లు తెలిపింది. ఇలాంటి అమెచ్యూరీష్ వ్యాఖ్యలు, పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది. ‘మన మధ్య మనమే సోషల్ మీడియాలో పోస్టులతో పోరాటం చేసుకోవడం సరికాదు’ అని టీడీపీ స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలు చేసుకోకుండా కూటమి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని సూచించింది.అదే సమయంలో టీడీపీ పార్టీకి, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించబోమని పార్టీ పేర్కొనడం గమనార్హం. ఇది జనసేనకు ఇండైరెక్ట్ వార్నింగేనన్న చర్చ జోరందుకుంది. ఇప్పటికే పదవులు, ప్రాధాన్యత విషయంలో జనసేన కేడర్ క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో.. కూటమిగా కలిసి పనిచేయాలంటూ ఒకవైపు బుజ్జగిస్తూనే.. టీడీపీ జోలికి వస్తే ఊరుకునేది లేదన్న సంకేతాన్ని మరోవైపు బహిరంగంగానే ఇవ్వడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు.దీంతో కూటమిలో అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ–జనసేన కార్యకర్తల మధ్య పోస్టుల యుద్ధం కొనసాగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: మేయర్ సీటు.. రచ్చ రాజేయడం ఖాయం! -
విజయ్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం
ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చేసిన ఆరోపణలు తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. గత డీఎంకే ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ విజయ్ ఆరోపణలు చేయడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఆరోపణలపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంగళవారం సభలో గందరగోళం నెలకొంది.డీఎంకే హయాంలో లోన్ ఈఎంఐ తరహాలో లంచాలు తీసుకున్నారంటూ నిన్న సీఎం విజయ్ ఆరోపించారు. పార్టీ ఫండ్ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని చెబుతూ.. ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్ నివేదికను ప్రస్తావించారు. అంతేకాదు మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తదితరుల పేర్లను కూడా విజయ్ ప్రస్తావించారు. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే విప్ ఈవీ వేలు.. ఈ అంశాన్ని లేవనెత్తారు. సీఎం విజయ్ తన ప్రసంగంలో ప్రస్తావించిన ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్ నివేదికకు సంబంధించిన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. అయితే విజయ్ ప్రస్తావించిన అంశాలు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న అధికారిక పత్రాల్లో ఉన్నవేనని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. అందువల్ల వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.డీఎంకే డిమాండ్ను న్యాయశాఖ మంత్రి ఆర్.ఎన్. నిర్మల్కుమార్ కూడా వ్యతిరేకించారు. విజయ్ చేసిన వ్యాఖ్యలు సర్కారియా కమిషన్ నివేదిక, ఈడీ అధికారిక పత్రాల ఆధారంగానే ఉన్నాయని పేర్కొన్నారు. గత డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ఆయన సమర్థించారు. దీంతో డీఎంకే సభ్యులు మరింత ఆందోళనకు దిగారు. తమకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలని కోరుతూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభలో నినాదాలు కొనసాగుతుండటంతో సభా నాయకుడు కేఏ సెంగొట్టయ్యన్ జోక్యం చేసుకున్నారు. స్పీకర్ నిర్ణయం తర్వాత కూడా డీఎంకే సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, అసెంబ్లీ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యులు తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని స్పీకర్ హెచ్చరించారు. ఒక నిమిషంలోపు సీట్లలో కూర్చుంటే కేఎన్ నెహ్రూ లేదా ఈవీ వేళుకు మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పారు. అయినప్పటికీ డీఎంకే సభ్యులు వెనక్కి తగ్గలేదు.సభలో గందరగోళం.. అలాగే అనుమతి లేకుండా పోస్టర్లను సభలోకి తీసుకురావడంపైనా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పట్టించుకోకుండా నిరసన కొనసాగించడంతో.. చివరకు మార్షల్స్ను రంగంలోకి దించారు. స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ డీఎంకే సభ్యులను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. కొందరు సభ్యులు ప్రతిఘటించడంతో వారిని మార్షల్స్ బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు కూడా కనిపించాయి.குழப்பவாதிகள் கூண்டோடு வெளியேற்றப்பட்டனர்‼️#TVK #Vijay pic.twitter.com/7saYzn4m3c— Vivek Rangasamy (@VivekRangasamy) September 8, 2026మరోవైపు, విజయ్ గత ప్రభుత్వంలోని అవినీతి అంశాలను ప్రస్తావించడంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా సీఎం గతాన్ని తవ్వుతున్నారని విమర్శించారు. విజయ్ చేసిన ఆరోపణలు కోర్టులో నిరూపితం కానివేనని పేర్కొంటూ.. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. -
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజు.. నిన్నటి పరిణామాల నేపథ్యంగా హాట్ హాట్గా మొదలైంది. నల్ల బ్యాడ్జీలతో సెషన్కు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం దారుణం. నిన్న మా పట్ల పోలీసులు దురుసుగా పవ్రర్తించారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు. సునీతా లక్ష్మారెడ్డి చీరలాగి అవమానించారు. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ వ్యవహరించారు. అసెంబ్లీ కౌరవసభగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నా తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులు నా తల్లిని అసభ్యంగా దూషించారు. సునీత, సబితా, కోవా లక్ష్మి అంటే నాకు గౌరవం. వాళ్లు నాకు తోబుట్టువులతో సమానం. సబితమ్మకు జరిగిన దానిపై నేనే విచారణ చేయమని చెప్పా. మీ తల్లిని అనలేదు హరీశ్.. నా సంగతి ఏంటి?. ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడూ.. అంటూ స్పీకర్ మాట్లాడారు. ఆ సమయంలో.. చర్చ జరగకుండా డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. దళిత స్పీకర్ పట్ల అమానుషంగా వ్యవహరించారని.. జరిగిన దానిపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని చూడకుండా.. చొక్కాలు విప్పి ముందుకు రావడం ఏంటని? సీతక్క మండిపడ్డారు. నిన్నటి పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని స్పీకర్ను కోరారామె. ఆ సమయంలో హరీశ్ రావు మరోసారి జోక్యం చేసుకుని.. స్పీకర్గా మీపై మాకు గౌరవం ఉంది. మీ పట్ల వ్యాఖ్యలపై మా ఎమ్మెల్సీ నిన్ననే విచారం వ్యక్తం చేశారు. మేం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విచారం వ్యక్తం చేశాక.. దీనిపై రాద్ధాంతం అవసరమే లేదు. కాంగ్రెస్కు నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే..ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ఎందుకు చేయలేదు?.. అని హరీశ్ రావు అన్నారు. అయితే హరీశ్రావు వైఖరి స్పీకర్నే బెదిరించినట్లు ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్పై జరిగిన దానిని పక్కన పెట్టాలట. స్పీకర్ను డిక్టేట్ చేయడం ఏంటి?. స్పీకర్ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెప్పడానికి వాళ్లెవరూ? అంటూ బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి పరిణామాలపై దర్యాప్తు జరుగుతోందని.. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారాయన. -
ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ‘డైవర్షన్’ రాజకీయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా సెంటిమెంట్ రాజకీయాలను పండించడానికి ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల కార్యక్రమాలను అమలు చేశారా అన్న అభిప్రాయం కలుగుతుంది. తొలుత వెలుగొండ ప్రాజెక్టు నుంచి , ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల నిర్వహించారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కాని ఆ సందర్భంగా ఆయన అనుసరించిన పద్దతులు, చేసిన ప్రసంగాలు చూస్తే , డైవర్షన్ రాజకీయాలలో భాగమేనా అన్న సందేహం కలుగుతుంది. స్థానిక ఎన్నికలు కూడా దృష్టిలో ఉండవచ్చు. కాగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు క్రెడిట్ చోరీ ఎలా చేశారో అంకెలతో సహా జగన్ వివరించారు. ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వకు గ్రావిటీ ద్వారా కాకుండా, అప్పటికే అమలులో ఉన్న పుష్కర లిఫ్ట్ ద్వారా నీటిని తోడి ఈ కాల్వలో పోసి అదేదో ప్రాజెక్టు పూర్తి అయినట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారని జగన్ విమర్శించారు. దీనిని గమనిస్తే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికి తంటాలు పడుతున్నట్లు అవుతుంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అరకొరగా నెరవేర్చి ,సూపర్ సిక్స్ అంటూ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దానిని ప్రజలు విశ్వసించడం లేదు. అంతా ఆశ్చర్యంగా ఇదేమిటి ఇలా చెబుతున్నారేమిటా అని చర్చించుకుంటున్నారు. మరో వైపు రెడ్ బుక్ పేరుతో పోలీసుల ద్వారా అరాచకాలు సాగుతున్న వైనం ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తోంది. ఉద్యోగులు తమను ప్రభుత్వం మోసం చేసిందన్న ఆగ్రహంతో ఉన్నారు.విశాఖలో డేటా సెంటర్ల పేరుతో జరిగే కాలుష్య విధ్వంసంపై మేదావులు గళమెత్తుతున్నారు. అమరావతిలో మాత్రం వేల కోట్ల అప్పులు తెచ్చి అదిక అంచనాలతో నిర్మాణాలు జరుగుతున్న తీరుపై ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. జగన్ మావిగన్ (విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం) కారిడార్ అభివృద్దిని ప్రతిపాదించడంతో ఇరుకున పడ్డ చంద్రబాబు దానిని ఆవిగన్గా (అమరావతి, విజయవాడ, గుంటూరు) మార్చుకున్నారు. అయినా ఖర్చు మాత్రం కేవలం 29 గ్రామాల పరిదిలోనే చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. డిఎస్సి అక్రమాలతో సహా ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు చికాకుగా మారాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతోందన్న భావన ఏర్పడింది. ఈ నేపధ్యంలో వాటిని కొంతమేర పక్కదారి పట్టించి ప్రజలలో ప్రాజెక్టులకు సంబందించి ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలిగించడమే లక్ష్యంగా ఈ నీటి విడుదల కార్యక్రమాలు పెట్టుకున్నారని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం వాస్తవం ఉన్నట్లు అనిపిస్తుంది. లేకుంటే వెలిగొండలో నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం చేయకుండా, హడావుడిగా నీటిని విడుదల చేశారు. ఆ ప్రాజెక్టు మొత్తం తన ఘనతేనని ఆయన చెప్పుకున్నారు. దానిపై జగన్ వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయారు.ఇక ఆ వెంటనే పోలవరం ఎడమ కాల్వకు నీరు అంటూ మరో ప్రోగ్రాం నిర్వహించారు. నిజంగానే పోలవరం ప్రాజెక్టు అందరూ ఆశించినట్లు పూర్తి చేసి,నీటి విడుదల జరిగి ఉంటే అంతా సంతోషిస్తారు. కాని గతంలో చంద్రబాబు హయాంలో పెట్టిన పుష్కర స్కీమ్ మోటార్లను వాడి కాల్వలో నీటిని పారించారట. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుకార్చినట్లు అవుతుందన్న భయం ప్రజలలో ఏర్పడుతోంది. మార్కాపురం వద్దకాని, అనకాపల్లి జిల్లా పాయకరావు పేట వద్ద కాని, ఆయన పంచెకట్టుతో రావడం, సాశ్టాంగ నమస్కారం చేయడం, సభికులతో గోదావరి నీళ్లు వచ్చాయి అంటూ గట్టిగా చెప్పించడం, రకరకాల సెంటిమెంట్లను చొప్పించడం వంటివి చేశారు. నిజంగా ఎడమ కాల్వను ఆయనే నిర్మాణం చేపట్టి ఉంటే చెప్పుకోవచ్చు. కాని ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాల్వలు తవ్వించడంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లనే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక దశకు చేరిందన్నది వాస్తవం. కాకపోతే చంద్రబాబుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తడం ఇష్టం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే ఎడమ కాల్వకు మోటార్ల ద్వారా నీరుఎత్తిపోయవలసిన అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వస్తుంది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అంటే అంతగా ఆసక్తి లేని చంద్రబాబు, గత టరమ్ లో పట్టిసీమ లిఫ్ట్ ను పెట్టి హడావుడి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వించిన కుడి కాల్వ ద్వారా నీటిని విజయవాడ వద్ద కృష్ణానదికి తీసుకువెళ్లారు. అప్పట్లోనే పట్టిసీమ కాకుండా పోలవరానికి ఆ డబ్బు ఖర్చు చేసి సత్వరమే ప్రాజెక్టును సిద్దం చేయాలని అనేక మంది సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదు.ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన లిఫ్ట్ ల ద్వారానే నీటిని తరలిస్తున్నానని చెప్పుకోవచ్చేమో కాని, దానివల్ల జరిగే నష్టం గురించి తెలుసుకోవాలి. ఈ సీజన్ లో పట్టిసీమ ద్వారా నీటిని తరలించి కృష్ణా డెల్టాకు సాగుకు అందిస్తున్నామని గొప్పగా ప్రకటించారు. పూజలు కూడా చేశారు.కాని ఆ తర్వాత గోదావరిలో నీరు తగ్గడంతో పట్టిసీమ నుంచి నీరు రావడం తగ్గిపోయింది. దాంతో కృష్ణా డెల్టాలో సైతం పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రస్తుతం పుష్కర మోటార్లను వాడి నీటిని విడుదల చేశారు. కాని ఈ నీరు పూర్తిగా రైతులకు అందడానికి ఇంకా సమయం పడుతుంది. మోటార్లపైనే ఎప్పటికీ ఆధారపడడం అంత మంచిది కాదని అనుభవం చెబుతోంది. అలాగే ఉత్తరాంద్ర సుజల స్రవంతికి నీరు ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. కాకపోతే జనాన్ని ప్రస్తుతానికి మభ్య పెట్టడానికి ఉపయోగపడవచ్చు. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ పోలవరంపై డ్రామాలు ఆపాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. పురుషోత్తపట్నం పంపులతో నీటిని ఎత్తిపోస్తే ప్రాజెక్టు నుంచి ఇచ్చినట్లు ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు. ఈ పంపులు కొత్తవి కావని, ఇప్పటికే ఉన్నవే కదా అని అంటూ, అయినా ఈ డ్రామా ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నీళ్లు పురుషోత్తమపట్నానివి అయితే, కాల్వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించినదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో చంద్రబాబు కొత్తగా చేసిందేమిటని అన్నారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లా? లేక 41.15 మీటర్లకే పరిమితమా? అని జగన్ సూఠిగా అడిగారు.ఈ అంశంపై చంద్రబాబు స్పందించగలిగితే బాగుంటుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పై ప్రేమ అంతా ప్రసంగాలకే పరిమితమా అని జగన్ ఎద్దేవ చేశారు. ఒక వేళ 41.15 మీటర్ల వద్దే పోలవరం ప్రాజెక్టు నిలిచిపోతే ఈ కాల్వల ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరడం కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.మరో వైపు పోలవరం నిర్వాసితుల కాలనీలలో అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కాగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎడమ కాల్వ నీటి విడుదలపై కామెంట్ చేస్తూ 26 నెలల్లో ఎడమ కాల్వ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన ఉంటే ఇలా వ్యాఖ్యానిస్తారా అని నిపుణులు అంటున్నారు. రెండేళ్లలో టైమ్ లో భూ సేకరణ, ఆ తర్వాత కాల్వ తవ్వకం, తదితర నిర్మాణాలు సాద్యమవుతాయా అని వారు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అమరావతి వ్యయం జనానికి కన్పించకుండా, ఉత్తరాంధ్ర, రాయలసీమలను నిర్లక్ష్యం చేయడం లేదని ప్రచారం చేసుకోవడానికి ఈ నీటి విడుదల కార్యక్రమాలు నిర్వహించారా అన్నది చర్చగా ఉంది. అదే లక్ష్యం అయితే ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే అవుతుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా? -
కేసీఆర్ ఫామ్హౌజ్ చుట్టూ పోలీసుల చక్కర్లు
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యల నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిరసనలకు దిగింది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌజ్ ముట్టడికి పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ విధించి.. పోలీసులు భారీగా భద్రతను మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో కేసీఆర్ ఫామ్హౌజ్ వైపు ఎవరినీ అనుమతించడం లేదు. అటు వైపు అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేసి, చుట్టుపక్కల పోలీసు వాహనాలతో నిరంతరం పహారా కాస్తున్నారు. ఇటు మర్కుక్ పోలీస్స్టేషన్ వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు డీసీఎంలను సైతం పోలీసులు సిద్ధంగా ఉంచారు. మరోవైపు ఎర్రవెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ధర్నా శిబిరాన్ని పోలీసులు ఎత్తివేయడంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.ఇదీ చదవండి: రేవంత్ సర్కార్పై హరీష్రావు ఫైర్ -
మండలి నుంచి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలు సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 8వ తేదీ) సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్- ప్రభుత్వ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ అంశంపై సభ హోరెత్తిపోయింది. దీనిలో భాగంగా స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలపై చర్యలకు సభలో తీర్మానం పెట్టారు. ఇందుకు సభలో ఆమోదం లభించింది. తెలంగాణ శాసనమండలి వద్ద ఉద్రిక్తతమండలి వాయిదా పడ్డా బీఆర్ఎస్ ఆందోళనబీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ నిరసనఅంతకుముందు మండలిలో సైతం బీఆర్ఎస్ ఆందోళనతాతా మధు, నవీన్రెడ్డిలు చైర్మన్ చాంబర్ ముందు బైఠాయించి నిరసనఎమ్మెల్సీలను బలవంతంగా లాక్కెళ్లిన మార్షల్స్ శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ నిరసన ఎమ్మెల్సీల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ నిరసనశాసనమండలి ఆవరణలో సభ్యుల ఆందోళన మండలి నుంచి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలు సస్పెన్షన్ఈ సెషన్ వరకూ ఇద్దరు ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ఎథిక్స్ కమిటీకి సిఫారుసుశాసనమండలి రేపటికి వాయిదాశాసన మండలికి సీఎం రేవంత్బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సభలో తీర్మానంతీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనరసింహ ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని తీర్మానంలో పేర్కొన్న శాసన సభ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ కు పంపాలని తీర్మానం ఆధారాలతో కౌన్సిల్ కు పంపాలని తీర్మానం దామోదర రాజనరసింహ సభలో పెట్టిన తీర్మానాన్ని బలపర్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఅదే సమయంలో శాసన మండలికి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి వచ్చారుమరోవైపు శాసన మండలికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి శాసస సభ రేపటికి వాయిదాఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలపై చర్యలకు సభలో తీర్మానం అసెంబ్లీ రేపటికి వాయిదాసభాపతిని అన్నారంటే సభ మొత్తాన్ని అన్నట్లే : భట్టితాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలకు సభలో తీర్మానం యావత్ చట్ట సభనే బీఆర్ఎస్ నేతలు అవమానించారుసభాపతిని అన్నారంటే సభ మొత్తాన్ని అన్నట్లే దళిత వర్గాల్లో పుట్టి స్పీకర్గా ఎదిగిన వ్యక్తి గడ్డ ప్రసాద్రాష్ట్రం ఏర్పడించే ఆత్మగౌరవం నినాదం మీద తీర్మానాన్ని ఏకగీవ్రంగా ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని మండలి చైర్మన్కు పంపాలని నిర్ణయం స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంస్పీకర్పై అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాంటి అంశాల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందిస్పీకర్పై అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంవ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందిఎప్పుడైనా ఆవేశంలో మాట్లాడినా క్షమాపణలు కోరాఎస్సీ,ఎస్టీ,ముస్లీంలు అత్యంత వెనకబడిన వర్గాలు ప్యానెల్ స్పీకర్గా కడియం శ్రీహరిశాసన సభ చైర్ను ప్యానల్ స్పీకర్ కు అప్పగించిన స్పీకర్ గడ్డం ప్రసాద్.ప్యానల్ స్పీకర్గా కడియం శ్రీహరినిన్న స్పీకర్ పై BRS MLC వ్యాఖ్యలకు మనస్థాపానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్ఈ రోజు సభకు దూరంగా ఉండాలని నిర్ణయంఈ నేపథ్యంలో సభను ప్రారంభించి - ప్యానల్ స్పీకర్ బాధ్యతలు శాసన సభ నుంచి బీజేపీ వాకౌట్ కనీస సమాచారం లేకుండా సభను గంటల కొద్ది వాయిదా వేసారని నిరసన వాయిదాకు నిరసనగా బీజేపీ వాకౌట్ 22A అంశాన్ని సభలో ఎప్పుడు చర్చ జరుపుతారో చెప్పకపోవడం పై నిరసనగా బీజేపీ వాకౌట్ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధంవాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీఇద్దరు ఎమ్మెల్సీలపై తీర్మాణం చేయనున్న శాసనసభతాతామధు, నవీన్లపై చర్యలకు రంగం సిద్ధంస్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసిన సీఎం రేవంత్బాధ్యులపై తగిన చర్యలు తీసకుంటాం: సీఎం రేవంత్సీఎం రేవంత్తో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, న్యాయశాఖ నిపుణుల భేటీబీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యవహార శైలి, చర్యలపై న్యాయ సలహా తీసుకుంటున్న సీఎంశాసనసభలో తీర్మానం చేసి మండలికి పంపించాలని ప్రభుత్వం ఆలోచనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే అవకాశంమీడియా పాయింట్:పిరికితనంతో ప్రభుత్వం వ్యవహారం చేస్తోంది: జగదీష్ రెడ్డిఅసెంబ్లీకి రాకుండా మమ్మల్ని అడ్డుకున్నారుకాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందిఅసెంబ్లీలో చర్చలు జరపడం ప్రభుత్వానికి ఇష్టం లేదుకాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉసిగొల్పి కేసీఆర్ ఫామ్ హౌస్కు పంపిస్తున్నారుసీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండి కాంగ్రెస్ వాళ్ళను ఫామ్ హౌస్కు పంపుతున్నారుపోలీసు ఎస్కార్ట్లు ఇచ్చి కేసీఆర్ ఇంటికి వద్దకు పంపుతున్నారుసీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారుపై స్థాయి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు14 మంది ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారుస్పీకర్ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలి: మంత్రి సీతక్కమహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టి వేశారుమహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాంమహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే.. విచారణ జరిపి చర్యలు తీసుకోండిఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలు ఎదిగితే ఓర్చుకోలేని భూస్వామ్య విధానం బీఆర్ఎస్దిమహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి రాజకీయం ఎందుకు చేస్తున్నారు?మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటాంకేటీఆర్ మహిళా పోలీసులపై చేతులు వేశారుఎస్సీ, ఎస్టీ వ్యక్తులను దూషిస్తే యాక్ట్ వర్తిస్తుందివీళ్లకు తల్లులు లేరా? లకారంతో ఎలా తిడతారు? గౌరవ సభ.. కౌరవ సభగా మారింది: హరీష్రావుసీనియర్ నాయకుఆలు సబిత గొంతు నొక్కారుదాడి జరిగిన సబితా ఇంద్రారెడ్డిపై కేసు పెట్టారుమహిళా ఎమ్మెల్యేపై కేసులు పెట్టడం సమంజసమా?తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదాబీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో 15 నిముషాల పాటు సభ వాయిదాఅసెంబ్లీలో స్పీకర్, హరీష్రావు మధ్య మాటల యుద్ధంబీఆర్ఎస్ సభ్యులు నా తల్లిని దూషించారు: స్పీకర్అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదుదళితులంటే బీఆర్ఎస్కు చిన్నచూపు: కాంగ్రెస్ సభ్యులుబీఆర్ఎస్ నేతలు తీరును తెలంగాణ సమాజం అంగీకరించదుచర్చ జరగకుండా బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారు అసెంబ్లీ ఆవరణలో మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరినవీన్ మిట్టల్ పీఎస్ రాజు అకస్మాత్తుగా కుప్పకూలడంతో వెంటనే స్పందించిన మంత్రిఆలస్యం చేయకుండా ఆయనకు సీపీఆర్ చేసి ప్రథమ చికిత్స అందించిన మంత్రివైద్య సిబ్బందిని పిలిపించి.. బాధితుడిని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించేలా చర్యలుమహిళల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గౌరవం లేదు: మంత్రి సీతక్కఎలాంటి కారణం లేకుండా కవితను సస్పెండ్ చేశారుహరీష్ రావును విమర్శించినందుకు కవితను సస్పెండ్ చేశారుమహిళా ఎమ్మెల్యేలను ముందుకు నెట్టిందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లుమహిళా పోలీసులపై కేటీఆర్ దురుసుగా ప్రవర్తించారుబీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహంనా సంగతి ఏంటో హరీష్ రావు చెప్పాలిమీ తల్లిని కాదు.. నా తల్లిని అన్నారుగడ్డం ప్రసాద్ పట్ల మాకు గౌరవం: హరీష్ రావువ్యక్తిగతంగా నాకు చైర్ పైన రెస్పెక్ట్ ఉందిస్పీకర్ను ఉద్దేశించి అనలేదని తాత మధు అన్నారులిఖిత పూర్వకంగా తన వివరణను మీడియా కూడా ఇచ్చారుఅలా భావించి ఉంటే విచారం వ్యక్తం చేశాడు.మేము విచారణ వ్యక్తం చేస్తున్నాంసీఎం రేవంత్కు కౌశిక్రెడ్డి సవాల్కొడంగల్లో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే.. నేను హుజూరాబాద్లో రాజీనామా చేస్తారేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తారేవంత్ రెడ్డి మాడ్లాడిన భాష.. ఉపయోగించిన పదజాలం తెలంగాణ సమాజం మొత్తం చూసిందిఅసెంబ్లీ సాక్షిగా సీఎం మాట్లాడిన భాష అభ్యంతరకరంమంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక పోస్ట్తల్లిని అవమానించిన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రితాత మధు వ్యాఖ్యలపై పొంగులేటి ట్వీట్బీజేపీ వాయిదా తీర్మానంఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చించాలని డిమాండ్వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి -
అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్టులపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులు చేసి, ఇప్పుడు వారినే అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆరోపించారు. హైకోర్టు చెప్పినా పట్టించుకోకుండా కేసులు పెట్టి అరెస్టు చేయడం చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.ప్రతిపక్షం అంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయడమే ప్రభుత్వ కుట్రా అని నిలదీశారు. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22ఏ భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థులు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే అరెస్టులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.“ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అంటే.. తప్పు చేసినవాడే ఎదుటివారిని నిందించడం అని హరీష్రావు పేర్కొన్నారు. పోలీసులు తమపై దాడి చేసి, ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్సీలనే అరెస్ట్ చేస్తున్నారని విమర్శిస్తూ.. “దొంగే పోలీసును మందలించినట్టుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తమ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, గొంతు పిసికిన వారిపై చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు, అరెస్టులు చేయడం ఏమిటని హరీష్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించడాన్ని కూడా తప్పుబట్టారు. ఖాకీలను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యమని వ్యాఖ్యానించారు. ‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం’ అంటూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ గొంతుకను అణచలేరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా , కర్కశంగా గౌరవ శాసన సభ్యుల ను, మండలి సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించిన పోలీసులే నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు గౌరవ మండలి సభ్యులు తాత మధు, నవీన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం…— Harish Rao Thanneeru (@BRSHarish) September 8, 2026 -
‘అందరం అరెస్ట్ అవుతాం!’.. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిల అరెస్ట్ పరిణామంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ చేశారు. ‘మేము సిద్ధం.. మీరు సిద్ధమా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై జరిగిన ఘటనలో బాధ్యులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.హైకోర్టు నిన్న స్పష్టమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తాతా మధు, నవీన్రెడ్డిపై కావాలనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి కోర్టులు, చట్టాల పట్ల ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ ‘డైవర్షన్ పాలిటిక్స్’ను గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. హామీలు అమలు అవుతాయి అంటే - బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా? అలానే…— KTR (@KTRBRS) September 8, 2026 ఇదీ చదవండి: నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: సాక్షితో తాతా మధు -
కూటమిలో మేయర్ పోరు
సాక్షి, అమరావతి: ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న రీతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం కూటమి పార్టీల్లో అప్పుడే కుమ్ములాటలు ముదిరిపోయాయి. ఇంకా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదు, ఎప్పుడు వెలువడుతుందో కూడా తెలియదు, రిజర్వేషన్లు ఖరారు కాలేదు.. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆ పదవుల కోసం విపరీతంగా లాబీయింగ్లు, ఎత్తులు పైఎత్తులు, బేరసారాలు మొదలుపెట్టేశారు. బెజవాడ టీడీపీలో నువ్వా, నేనా?విజయవాడ మేయర్ పీఠం కోసం టీడీపీలోని రెండు వర్గాల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. కాపు వర్గం నుంచి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు సిద్ధార్థను అందరి కంటే ముందు రేసులో నిలబెట్టారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి తన కుమారుడికి మేయర్ సీటు ఇచ్చి కాపు వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో మేయర్ పదవిని రెండుసార్లు కమ్మ వర్గానికి ఇచ్చారని, ఈసారి తమకు ఇవ్వాలని ఆయన పట్టుబట్టడమే కాదు చంద్రబాబు వద్దకు తన కొడుకును తీసుకెళ్లి కూడా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో ఉలిక్కిపడిన కమ్మ సామాజికవర్గం నేతలు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని రంగంలోకి దించి ఇంకా చాలామంది రేసులో ఉన్నారని చెప్పించారు. ఆయన కొమ్మారెడ్డి పట్టాభి, బొప్పన భవకుమార్ లేకపోతే తన వర్గానికి చెందిన ఎవరికైనా ఆ సీటు ఇప్పించాలని చూస్తున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి దేవినేని అపర్ణ గట్టి లాబీయింగ్ చేస్తున్నారు. లోకేశ్తో సన్నిహితంగా ఉండే ఆమె తనయుడు దేవినేని చందు.. అయితే తన తల్లికి లేకపోతే జెన్జెడ్ కోటాలో తన భార్యకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలివిగా పావులు కదుపుతూ తన వర్గం నుంచి ఒక మాజీ కార్పొరేటర్ పేరును తెరపైకి తెచ్చి చివరికి తన భార్య అనూరాధకు మేయర్ సీటు ఇప్పించుకునే యత్నాల్లో ఉన్నారు. మరికొందరూ రేసులో ఉండి చంద్రబాబు, లోకేశ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో బెజవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విశాఖ మేయర్ సీటు కోసం ఎమ్మెల్యేల హైరానా రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ సీటు కోసం టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ మేయర్ సీటు ఎలాగైనా సొంతం చేసుకోవాలని ముగ్గురు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జిలు తెరవెనుక ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ తనయులకు ఆ సీటు ఇప్పించాలని తాపత్రయపడుతుండగా మిగిలిన వాళ్లు తామే నేరుగా సీటు కోసం యత్నిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు తన తనయుడు రవితేజకి మేయర్ సీటు ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ను అడిగినట్లు సమాచారం. దీని గురించి ఆయనను ఇటీవల మీడియా ప్రశి్నంచగా తనకు ఆ సీటు ఇవ్వరా? అని ఎదురు ప్రశి్నంచడం విశేషం. మేయర్ రేసులో ఆయన చాలా సీరియస్ పోటీదారుగా పావులు కదుపుతున్నారు. అయితే ఎంపీగా ఉన్న లోకేశ్ తోడల్లుడు భరత్ ఇక్కడ కీలకం కావడంతో ఆయన మద్దతు కోసం చూస్తున్నట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు కుదిరితే తమ కుమారులు, మహిళా రిజర్వేషన్ అయితే తమ కుటుంబంలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. భరత్ మాత్రం తనకు అనుకూలంగా ఉండే వారికి మేయర్ సీటు ఇప్పించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. నెల్లూరులో వేమిరెడ్డి చెబితేనే మేయర్ నెల్లూరు మేయర్ సీటు కోసం టీడీపీలో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డిలు మేయర్ సీటును తమ అనుయాయుడు రూప్కుమార్ యాదవ్కి ఇప్పించాలని చూస్తుండడం మిగిలిన నేతలకు కంటగింపుగా మారింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి.. వేమిరెడ్డిని కాదంటే లోకేశ్తో ఇబ్బంది వస్తుందని నోరు మెదపడంలేదు. ఇదిలా ఉంటే మేయర్ ఎంపికలో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరుతున్నారు. పలువురు కీలక నేతలూ వేమిరెడ్డి తీరుపై అసహనంతో రగిలిపోతున్నారు.గోదావరి జిల్లాల్లో జనసేనతో ఫైట్ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, ఏలూరు మేయర్ సీట్లు, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర మున్సిపల్ చైర్మన్ సీట్ల కోసం జనసేన, టీడీపీ నేతలు నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నారు. ఇక్కడ తమకు బలం ఎక్కువగా ఉందంటూ జనసేన నేతలు ఎక్కువ మున్సిపాలిటీలు ఇవ్వాలని అడుగుతుండగా టీడీపీ నేతలు అందుకు అంగీకరించడంలేదు. కాకినాడ మేయర్ సీటుపై జనసేన, రాజమండ్రి మేయర్ సీటుపై బీజేపీ కన్నేసి చంద్రబాబు దగ్గర మంతనాలు జరుపుతుండడంతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. తమకు అవకాశాల్లేకుండా ఇక్కడ కూడా పొత్తు పేరుతో అన్యాయం చేస్తారా అని ముఖ్య నేతలను నిలదీస్తున్నారు. రాయలసీమలో తిరుపతి కార్పొరేషన్ తమకు ఇవ్వాలని జనసేన కోరుతుండడాన్ని టీడీపీ నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. గుంటూరు కార్పొరేషన్ కోసం టీడీపీ ముఖ్య నేతలు ఎత్తులకుపైఎత్తులు వేసుకుంటున్నారు. చిత్తూరు, మచిలీపట్నం, అనంతపురం కార్పొరేషన్లు తమకు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేయడం అక్కడి టీడీపీ నేతలకు ఇరకాటంగా మారి బహిరంగంగానే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఉండడం, ఎక్కువ బడ్జెట్, అపరిమితమైన అధికారాలు ఉండడంతో వాటి కోసం నేతలు పోటీపడుతున్నారు. ఒక్కసారి పదవి దక్కితే రెండు చేతులా సంపాదించుకోవచ్చని వాటిపై కన్నేసి తమ కుటుంబంలోని ఎవరో ఒకరికి ఇప్పించుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. లేనిపక్షంలో తమకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవాలని చూస్తూ రాజకీయాలు చేస్తున్నారు. -
కమ్యూనిస్టులు– కాంగ్రెస్ కలిసి పోరాడాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యంత ప్రమాదకరమైన మోదీని గద్దె దించేందుకు జాతీయస్థాయిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో మోదీ ఓటమికి ఇప్పటి నుంచే పునాది వేయాల్సిన అవసరం ఉందన్నారు. కమ్యూనిస్టులు లేవనెత్తే ప్రజా సమస్యలకు తమ ప్రభుత్వం సహేతుకమైన పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడు అక్రమ పద్ధతులను బీజేపీ అనుసరిస్తుందని, అందులో భాగంగానే ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తుందని ధ్వజమెత్తారు. సీపీఎం సీనియర్ నేత, రైతాంగ ఉద్యమ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరు ఓడాలో, గెలవాలో ఎన్నికల సంఘం నిర్ణయించే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన కొడంగల్లోనే వలస వెళ్లిన పేదల ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని, సుమారు 81 వేల ఓట్లను అనుమానాస్పద ఓట్ల జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బిహార్, పశ్చిమబెంగాల్లో గెలిచిన విధంగానే, ఓట్లను తొలగించిన విధానాన్ని తెలంగాణలో అమలు చేసి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలించి, తమకు అనుకూలంగా ఉండేందుకు ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. 33 శాతం ఓట్లను తొలగిస్తున్నప్పుడు మాట్లాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒక్కరు మాట్లాడడం లేదన్నారు. రైతాంగానికి ‘వాకింగ్ ఎన్సైక్లోపీడియా’సారంపల్లి మల్లారెడ్డి సారంపల్లి మల్లారెడ్డి రైతాంగ సమస్యలపై అపారమైన అవగాహన ఉన్న నాయకుడని రేవంత్రెడ్డి కొనియాడారు. భూసారం నుంచి విత్తనం, పెట్టుబడి, పంట, కౌలు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర వరకు వ్యవసాయ రంగంలోని ప్రతి అంశంపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో మల్లారెడ్డి ప్రత్యేకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. మల్లారెడ్డి పేరును చిరస్థాయిగా నిలిపేలా రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతానికి ఆయన పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గంలో చర్చిస్తానని సీఎం తెలిపారు. ప్రమాదంలో’లౌకికవాదం, ప్రజాస్వామ్యం : ప్రకాశ్ కారత్ దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్లు, ఆదివాసీలు లక్ష్యంగా ఎస్ఐఆర్ కింద ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణలో 73 లక్షల ఓట్లు తొలగించారని, మరో 92 లక్షల ఓట్లను సందేహాస్పద ఓట్లుగా మిగిలాయన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు తొత్తుగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఆరోపించారు. సారంపల్లి మల్లారెడ్డి జీవితాంతం రైతులు, పేదలు, కార్మికుల సమస్యల కోసం పోరాడిన నాయకుడని ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సభలో నేతలు పేర్కొన్నారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అధ్యక్షత వహించగా, మంత్రి అజహరుద్దీన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, తమ్మినేని వీరభద్రం, వీరయ్య, జ్యోతి, మల్లు లక్ష్మి, న్యూడెమోక్రసీ నేతలు పోటు రంగారావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి రచన ‘నాగేటి సాళ్లు’పుస్తకాన్ని ప్రకాశ్ కారత్ ఆవిష్కరించగా, మల్లారెడ్డిపై ప్రజానాట్యమండలి రూపొందించిన పాటల సీడీని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. -
తెలంగాణకు ఇది చీకటి రోజు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికే ఇది చీకటి రోజని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అవమానకర వ్యాఖ్యలు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా సభలోని ప్రతి సభ్యుడు ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వాన్ని శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలో తాతా మధు చేసిన వ్యాఖ్యలు సోమవారం తీవ్ర దుమారం రేపాయి. భోజన విరామం తర్వాత శాసనసభ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైంది. తాతా మధు వ్యాఖ్యలపై సుదీర్ఘ చర్చ జరగాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదించారు. అప్పటికే బీజేపీ సభ్యులు 22ఏ పై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. ప్లకార్డులతో బైఠాయించారు. బీఏసీలో చర్చ తర్వాత ఈ అంశాన్ని చేపడదామని, స్పీకర్కు జరిగిన అవమానంపై చర్చ అత్యంత ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు. బీఆర్ఎస్ను కాపాడుతున్నారనే అనుమానం కలిగించొద్దు ‘స్పీకర్ పదవి అంత అత్యున్నతమైనది. అన్ని పార్టీల మద్దతుతో ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తిని గౌరవించడం అందరి బాధ్యత. సభలో సీఎం అయినా, శాసనసభ్యుడైనా సభాపతికి ఒకే రకమైన అభిప్రాయం ఉంటుంది. అలాంటి స్పీకర్ మనసు ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యల వల్ల గాయపడింది. దీన్ని గడ్డం ప్రసాద్కుమార్కు జరిగిన అవమానంగానే చూడకూడదు. యావత్ తెలంగాణ సిగ్గుపడే ఘటన ఇది. మనుషులు ప్రయోగించలేని, సభ్య సమాజం సహించలేని భాష వాడి, అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత ఇంతకన్నా చర్చనీయాంశం మరొకటి ఉండదని బీజేపీ గుర్తించాలి. చర్చలో పాల్గొనకుండా బీఆర్ఎస్ దుర్మార్గాలను కాపాడుతున్నారనే అనుమానం ప్రజలకు కలిగేలా వ్యవహరించవద్దు. ఫాంహౌస్ నుంచి సభ్యులను పురిగొల్పారు.. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు బీఆర్ఎస్ నాయకుడు ఫాంహౌస్లో సమావేశం ఏర్పాటు చేసి తన సభ్యును పురిగొల్పారు. పోలీసులపై దాడి చేసి, సభాపతిని దూషించడమంటే క్షమించరాని నేరం. ఇది అనాలోచిత చర్య కాదు.. తీవ్రమైన నేరం. సభా ప్రాంగణంలో సభాపతితో పాటు కుటుంబ సభ్యులను అవమానించారు. బీఆర్ఎస్ పుట్టినప్పుడు, విజయం సాధించినప్పుడు దళితులనే ఆయుధంగా వాడారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎంను చేస్తానని, దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానని నమ్మించి, దళిత బంధు ఇస్తానని నమ్మించిన పార్టీ బీఆర్ఎస్. అధికారంలోకి వచ్చాక దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారు. నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపారు. ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని చేస్తే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. ఆ పార్టీది దళిత వ్యతిరేక ఆలోచన. తల్లిని దూషిస్తే ఏ కొడుక్కయినా రక్తం మరుగుతుంది ఇలాంటి సంఘటన స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇలాంటి పోకడలను నియంత్రించకపోతే రాబోయే తరాలు ఈ సభను కూడా క్షమించవు. తల్లిని అవమానించే విధంగా మాట్లాడితే ఏ కొడుక్కయినా రక్తం మరుగుతుంది. ఇలాంటి చర్యను ముక్త కంఠంతో ఖండించాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే కఠినంగా వ్యహరించాల్సిన అవసరం ఉంది. విశృంఖలత్వం, అడ్డగోలుతనం, ఏం మాట్లాడినా చెల్లుతుందనే అహంకారం, ఏం చేసినా చూసుకోవడానికి ఫాం హౌస్లో తమ నాయకుడు ఉన్నాడనుకునే వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. క్షమించి ఊరుకుంటే చట్టసభలకు విలువ ఉండదు. దీనిపై చర్చించి స్వయం నియంత్రణ విధానం తేవాలి..’అని ముఖ్యమంత్రి అన్నారు. -
రణరంగం.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డు కోవడం తోపులాటకు దారితీసింది. నేతలు కింద పడిపోవడం, అస్వస్థతకు గురికావడం, నిరసనలు, నినాదాలు, అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలకు దారి తీసింది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ మండిపడింది. సభలో అడుగు పెట్టక ముందే తమను అడ్డుకుని, తమ పార్టీ సభ్యులపై పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించింది. పోలీసులు తమపై అనుచితంగా ప్రవర్తించారని, మహిళా ఎమ్మెల్యేల గొంతు పిసికారని, చీరలు లాగారనే ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది. ఇది శాసనసభా? కౌరవసభా? అని బీఆర్ఎస్ నిలదీసింది. మరోవైపు పోలీసులతో జరిగిన వాగ్వాదం సందర్భంగా శాసనసభ స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార పక్షం మండిపడింది. సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. సదరు సభ్యుడితో రాజీనామా చేయించి, ప్రతిపక్ష నేత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తమపై జరిగిన దాడికి సీఎం రేవంత్రెడ్డే బాధ్యత వహించాలని, హోంమంత్రిగానూ వ్యవహరిస్తున్న ఆయనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశాన్ని ఆ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో చోటుచేసుకున్న ఘటనలు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నడుమ సభ లోపలా, బయటా ఆరోపణలు, విమర్శలు, పరస్పర సవాళ్లకు తెరతీశాయి. విలపిస్తున్న సునీతారెడ్డిని ఓదారుస్తున్న సబితారెడ్డి టీషర్టు విప్పి లోనికి అనుమతించాలన్న హరీశ్రావు సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ఎదురుగా గన్పార్కు వద్ద ఉన్న అమరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలకు హాజరయ్యేందుకు నల్లని టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ అసెంబ్లీ మెయిన్ గేటు వద్దకు చేరుకున్నారు. ‘హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం’ అంటూ టీషర్టులపై నినాదాలు ఉండటంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మెయిన్ గేటు వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్రావు వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో హరీశ్రావు, జగదీశ్రెడ్డి కిందపడిపోయారు. దీంతో ఆగ్రహించిన హరీశ్రావు తాను ధరించిన నల్ల టీ షర్టును విప్పి విసిరేశారు. ఎలాంటి నినాదాలు లేనందున తనను అసెంబ్లీలోకి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి కూడా టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పోలీసు వాహనంలో తెలంగాణ భవన్కు తరలించారు. మహిళా నేతల ఆవేదన అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో హరీశ్రావుతో పాటు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కిందపడిపోయారు. జగదీశ్రెడ్డి అస్వస్థతకు గురికాగా.. ఎమ్మెల్యేలు సుదీర్రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు సపర్యలు చేశారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కేటీఆర్ను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జుట్టు పట్టుకుని, గొంతు నొక్కారని సబిత ఆరోపించగా, తన చీర లాగారంటూ సునీత కన్నీటి పర్యంతమయ్యారు. సబిత, సునీత, కోవా లక్ష్మితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, మాధవరం కృష్ణారావు తదితరులు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించగా వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
‘వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే’
అనపర్తి(తూ.గో.జిల్లా): వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఏపీలో ఏ రంగం చూసినా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఏపీలో ఆక్వా రైతుల పొట్టకొడుతున్నారని, రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలని అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. లోకేష్ తానే ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నారని, అధికారం పోయిన తర్వాత లోకేష్కు తన పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలబద్రపురంలో వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ సంకేతాలు ఇస్తోంది. ఎన్నికలు జరిగినా జరగకపోయినా, పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని వైఎస్ జగన్ చెప్పారు. ఏ ఒక్క స్థాయిలోను అధికార పార్టీ ఏకగ్రీవం కాకూడదని విషయాన్నిస్పష్టం చెశారు. రానున్నది వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రభుత్వం. అధికారం పోయిన తర్వాత లోకేష్ తన పరిస్థితి ఏమిటో గుర్తిస్తాడు. తానే ముఖ్యమంత్రినన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు. డీఎస్సీపై సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధమా అన్న వైఎస్ జగన్ సవాలుకు మీ వద్ద నుంచి స్పందన లేదు. డిఎస్సీ పై సిబిఐ ఎంక్వయిరీ జరిగే వరకు ఊరుకునేది లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు నాయకులంతా భరోసా కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయాలి’ అని పేర్కొన్నారు.మరో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టాం. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీలో అన్ని స్థాయిలో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్ అందించాలి. అందరికీ పార్టీ సముచితమైన గౌరవం ఇస్తుంది పార్టీ అధినేత మాటగా చెబుతున్నాను. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కూడా ప్రస్తుత ప్రభుత్వం అందించలేకపోయింది. రెండున్నరేళ్ళ తర్వాత కొత్త పెన్షన్లు గుర్తుకొచ్చాయా. వితంతు పింఛన్లు కూడా ఇవ్వలేకపోయారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు, ప్రభుత్వం కుమ్మక్కై ఆక్వారైతుల పొట్టకొడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి... గెలవాలి.. ఇదే మన లక్ష్యం.’ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘‘కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా లోకేశే.. రాజీనామా చేయాల్సిందే’’ -
‘ఇది తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానం’
హైదరాబాద్: తాము నిరసన తెలిపే క్రమంలో పోలీసుల బలగం అత్యంత దుర్మార్గంగా వ్యహరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలంతా చూశారని మండిపడ్డారు. ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించారన్నారు. పోలీసు చర్యలతో సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారన్నారు.ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 7వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ ఇది శాసన సభ కాదు.. దుశ్శాసన సభ. లోక్సభకు రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని వెళ్తున్నారు. మేం టీ షర్ట్లు వేసుకుంటే తప్పేంటి.. ఏ రూల్ ప్రకారం అడ్డుకుంటున్నారు. పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ డిసైడ్ చేయడానికి డీసీపీ ఎవరు?, మహిళా నేతలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రజల తరఫున గొంతు వినిపించడం మా హక్కు. స్పీకర్ వివక్ష చూపడం తగదు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్పీకర్ అనడం ఏంటి?, ప్రజలపై చేసే దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలపై సభలో నిలదీస్తాం. ఈ రోజు జరిగిన ఘటనకు బాధ్యుడు సీఎం రేవంత్. సీఎం రేవంత్ బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ మహిళా లోకానికి ఇవాళ అవమానం జరిగింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఈ రోజు జరిగిన ఘటనపై హైకోర్టుకు వెళ్లాం. ఎన్హెచ్ఆర్సీ, మహిళా కమిషన్కు కూడా వెళ్తాం. బీజేపీ-కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై మమ్మల్ని అడ్డుకుంటున్నారు’ అని విమర్శించారు.ఇదీ చదవండి:నల్లదుస్తులతో వస్తే తప్పేంటి?: సబిత ఫైర్ -
జట్టు కడతారా.. గట్టునుంటారా!
అన్నమయ్య జిల్లా టీడీపీ నేతలు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగానే ముందుకు సాగుతున్నారా? పలు నియోజకవర్గాలకు ఇన్చార్జ్లు మార్చినా వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయా..? జిల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అధిష్టానానికి తలనొప్పులుగా మారాయా? అంటే..అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.అన్నమయ్య జిల్లా టీడీపీ రాజకీయాల్లో వర్గ విభేదాలు సమసిపోలేదు. నిన్నటిదాకా జిల్లా టీడీపీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు కొనసాగి.. బలాబలాలు సమానంగానే ఉన్నాయి. ఇటీవల తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్లను మార్చడంతో ఇప్పుడు అందరి దృష్టి కొత్త నేతలపై పడింది. వీరు మంత్రి మండిపల్లి శిబిరంలో చేరుతారా లేక నల్లారి కిశోర్ పక్షాన వెళ్తారా అన్నది జిల్లా టీడీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జిల్లా రాజకీయాల్లో కీలకమైన మంత్రి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారన్నది ఉత్కంఠగా కనిపిస్తోంది. మొన్నటిదాకా రెండు వర్గాలుజిల్లా టీడీపీ రాజకీయాల్లో జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ నియామకం కాక ముందు వరకు జిల్లా మంత్రి చుట్టూ రాజకీయాలు నడిచాయి. అప్పటివరకు పుంగనూరు ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఇన్చార్జి జయచంద్రారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, మాజీ ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు మండిపల్లి వర్గంగా ముద్రపడ్డారు. ఈ పరిస్థితుల్లో కొంతకాలం న్యూట్రల్ గా ఉన్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంత్రిపై అసంతృప్తితో పీలేరు ఎమ్మెల్యే కిశోర్ కుమార్ రెడ్డితో జతకట్టారు. తర్వాత కొంతకాలానికి ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు కావడంతో ఈ ముగ్గురు ఒక వర్గంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు. జిల్లాలో వీరంతా మంత్రితో కలిసి పాల్గొన్న సందర్భమే లేదు.చల్లా, దాసరిపల్లి తొలగింపుతంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఇరుక్కోవడంతో ఆయనను పార్టీ నుంచి అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. పుంగనూరు నియోజవర్గంలో చల్లాపై వచ్చిన ఆరోపణలతో ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. మంత్రి మండిపల్లికి రెండు నియోజకవర్గాల నుంచి అండగా ఉన్న ఇద్దరు నేతల బలం తగ్గిపోయింది.ఆ ఇద్దరు ఎవరి వైపు..కొత్తగా వచ్చిన ఇన్చార్జీలు ఏ వర్గం వైపు ఉంటారన్నది పార్టీ నేతల్లో అమితాసక్తి నెలకొంది. పుంగనూరు, తంబళ్లపల్లె గత ఇన్చార్జిలు ఉండగా రెండు వర్గాల బలం సమంగా ఉండేది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, మధుసూదన్ నాయుడు ఇన్చార్జిలు కావడంతో వీరు ఎవరి వైపు వెళ్తారన్నది చర్చనీయాంశమైంది.శంకర్ విషయానికి వస్తే..గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన ఆవేదనతో ఉన్న శంకర్ యాదవ్ తిరిగి ఇంచార్జ్ అయ్యారు. జయచంద్రారెడ్డి నకిలీ మద్యం తయారు కేసులో నిందితుడు కాకపోయి ఉంటే శంకర్కు తిరిగి అవకాశం వచ్చేది కాదు. కాగా గత పరిస్థితులను పరిశీలిస్తే శంకర్ కిశోర్ వైపు వెళ్తారన్నది అనుమానమే. ఎందుకంటే శంకర్ కాంగ్రెస్ పారీ్టలో చేరి రాజకీయాల్లోకి వచ్చాక అప్పటి కిరణ్ సర్కార్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొన్నారు. తాజాగా టీడీపీ ఇన్చార్జిగా శంకర్కి బాధ్యత అప్పగించే విషయంలో కిశోర్ పలు సందర్భాల్లో చంద్రబాబు ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారని పారీ్టలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శంకర్ కిశోర్తో జత కడతారా అన్నది అనుమానమే. అలాగే మంత్రి మండిపల్లి విషయంలోనూ శంకర్ సానుకూలంగా ఉండే అవకాశాలు లేవు. దాసరిపల్లి జయచంద్రారెడ్డిపై నియోజకవర్గ టిడిపిలో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ మంత్రి అండగా నిలిచారని శంకర్ వర్గం రెండేళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉంది.మధు ఎటు వైపు.. పుంగనూరు ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు ఇన్చార్జిగా నియమితులయ్యాక కిశోర్, చల్లాను కలవగా, మంత్రి మండిపల్లిని, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవలేదని తెలుస్తోంది. దాసరిపల్లి, చల్లా ఇద్దరూ మంత్రి వర్గీయులుగా కొనసాగిన కారణంతో శంకర్, మధులు మంత్రితో జత కట్టేందుకు మొగ్గచూపకపోతే..జిల్లాలోని ఐదు నియోజకవర్గ నేతల్లో నలుగురు ఓ వర్గమై, జిల్లాలో రాజకీయాల్లో మంత్రి ఒంటరిగా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు ఏ జట్టులో చేరుతారో.. గట్టునుండి చూస్తుండిపోతారో వేచిచూడాలి.చదవండి: ఏళ్లుగా కష్టపడ్డాం.. పదవి మాత్రం లంకకు! -
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. రాష్ట్రంలో వరుస హత్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై అధికార టీవీకే ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో సభలో వాగ్వాదం, నినాదాలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. దీనికి ముఖ్యమంత్రి విజయ్ ఘాటుగా బదులిస్తూ.. నేరస్తులు ఏ పార్టీకి చెందినవారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో డీఎంకేపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ‘పార్టీ ఫండ్స్’ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేశారని ఆరోపించడం సభలో మరింత వేడి పెంచింది.సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే సభ్యులు రాష్ట్రంలో పెరుగుతున్న హత్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, వరుసగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దీనిపై చర్చకు అనుమతించాలని స్పీకర్ను ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్ కోరారు. ఈ అంశంపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు డీఎంకే సభ్యులు ప్రయత్నించడంతో సభలో ఉద్రిక్తత మొదలైంది.దీనిపై ముఖ్యమంత్రి విజయ్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం నేరాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. పోలీసులు మంచివారికి మిత్రులుగా, నేరస్తులకు శత్రువులుగా ఉండాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. నేరస్తుడు ఏ పార్టీకి చెందినవాడైనా చట్టం ముందు సమానమేనని తెలిపారు.‘పోలీసులు పవర్ సెంటర్ కాకూడదు’పోలీసు వ్యవస్థ ప్రజలను భయపెట్టే పవర్సెంటర్గా మారకూడదని విజయ్ అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యతగా ఉండాలని చెప్పారు. గత మూడు నెలల్లో జరిగిన నేరాలను ఒకేసారి జరిగిన ఘటనలుగా చూడటం సరికాదని, వాటిలో అనేకం పాత కక్షలు, ప్రతీకారాల కారణంగా జరిగినవేనని వివరించారు.డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కోయంబత్తూరులో జరిగిన ఓ కాలేజీ విద్యార్థి హత్య కేసులో 36 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో యాంటీ డ్రగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, చెన్నైలో మూడు నెలల్లో ఎన్డీపీఎస్ చట్టం కింద 330 కేసులు నమోదు చేసి 556 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.డీఎంకేపై విజయ్ సంచలన ఆరోపణలుశాంతిభద్రతల అంశంతో మొదలైన అసెంబ్లీ రచ్చ.. ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో మరింత ముదిరింది. తమపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు చూపించాలని విపక్షాలు పదేపదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. విజయ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పత్రాన్ని ప్రస్తావించారు.గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల నుంచి కాంట్రాక్టు విలువలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు ‘పార్టీ ఫండ్స్’ పేరుతో వసూలు చేశారని** ఆయన ఆరోపించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ సప్లై (MAWS) శాఖ పరిధిలో ప్రభుత్వ పనులు చేపట్టే కాంట్రాక్టర్ల నుంచి ఈ మొత్తాలను లంచాల రూపంలో వసూలు చేశారని ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు విజయ్ సభలో చదివి వినిపించారు.‘లంచాలు.. లోన్ ఈఎంఐల్లా వసూలు’ఈ క్రమంలో పురుషోత్తం అనే వ్యక్తి పేరును ప్రస్తావించిన విజయ్.. ఆయన నుంచి రూ.29 లక్షలు లంచంగా వసూలు చేసినట్లు ఈడీ నివేదికలో ఉందన్నారు. అయితే ఆ మొత్తం ఒక్కసారిగా తీసుకోలేదని.. లోన్ ఈఎంఐలు చెల్లించినట్టుగా విడతల వారీగా వసూలు చేశారని విజయ్ ఆరోపించారు. అంతేకాదు.. ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు ‘పార్టీ ఫండ్స్’కు ప్రత్యక్ష లబ్ధిదారులుగా అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, అప్పటి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రవి ప్రసాద్తో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయని విజయ్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తనవి కావని, ఈడీ పత్రంలో ఉన్నవేనని ఆయన స్పష్టం చేశారు.సర్కారియా కమిషన్ నివేదిక ప్రస్తావనడీఎంకేపై అవినీతి ఆరోపణలకు చారిత్రక నేపథ్యం ఉందని చెప్పేందుకు విజయ్ సర్కారియా కమిషన్ నివేదికను కూడా ప్రస్తావించారు. వీరాణం నీటి సరఫరా పథకానికి సంబంధించిన వ్యవహారంలో ‘పార్టీ ఫండ్’ పేరుతో 2.5 శాతం డిమాండ్ చేశారన్న ఆరోపణలు కమిషన్ నివేదికలో ఉన్నాయని చెప్పారు. అప్పట్లో టెండర్ విలువ రూ.16 కోట్లుగా ఉందని తెలిపారు.2001లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ మంత్రి పొన్నయ్యన్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారని విజయ్ గుర్తుచేశారు. ‘కొంచెం లోతుగా పరిశీలిస్తే మరెన్నో విషయాలు బయటకు వచ్చాయి’ అంటూ డీఎంకేపై విమర్శలు గుప్పించారు.చివరకు వాకౌట్..విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుపడుతూ.. నినాదాలు చేశారు. పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పోడియం చుట్టూ చేరడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.ఇదీ చదవండి: డీ బాస్ ఫ్యాన్స్కు షాకిచ్చిన కాంగ్రెస్ నేత -
ఏళ్లుగా కష్టపడ్డాం.. పదవి మాత్రం లంకకు!
శ్రీకాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్.ఈశ్వరరావు కొనసాగుతుండగానే.. టీడీపీ కొత్త కుంపటి పెట్టింది. ఇక్కడ పార్టీని నడిపించే నాయకుడు లేడని టీడీపీ శ్రేణులు రెండేళ్లుగా మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎచ్చెర్ల టీడీపీ ఇన్చార్జి పదవిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి లేదంటే అతని కుటుంబ సభ్యులకే కేటాయించాలని తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. తదుపరి నియోజకవర్గంలో కీలకమైన నాయకులుగా ఉన్న చౌదరి బాబ్జి, ముప్పిడి సురేష్, పిన్నింటి భానోజీనాయుడులు తమకే ఇన్చార్జి కేటాయించాలని రాష్ట్ర స్థాయిలో పైరవీలు, లాబీయింగ్లు బలంగానే చేశారు. ఇటీవల భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర అంతా స్వాగత ఫ్లెక్సీలు, ఇతర ఏర్పాటు చేసి తమ ఉనికి చాటుకునే ప్రయత్నాలు గట్టిగానే చేశారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ పార్టీ అభిప్రాయ సేకరణలో ప్రధానంగా వీళ్ల పేర్లే వచ్చాయి. ఉహించని వ్యక్తికి అందలం కానీ ఎవరూ ఊహించని విధంగా లంక శ్యామల రావు పేరు చివరిలో తెరపైకి వచ్చింది. ఆయన నియామకం వెనుక ఎవరి హస్తం ఉందోనని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు అంతర్మథంలో పడ్డాయి. ‘లంక’ రణస్థలం మండల పార్టీ అధ్యక్ష పదవికే అనర్హుడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయనకు నియోజకవర్గ ఇన్చార్జి ఇవ్వడంపై ఆశావహులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కాపు సామాజిక వర్గం వ్యక్తులు తప్ప ఇతర సామాజిక వర్గాలైన కాళింగ, తెలగ, మత్స్యకార నాయ కులు పనికి రారా అంటూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈ సామాజిక వర్గ క్రేడర్ మదనపడుతున్నారు. లంక శ్యామలరావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఏడాదికే ప్రజారాజ్యం పార్టీలో చేరి మళ్లీ టీడీపీకి వచ్చి, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే జెడ్పీటీసీ అభ్యర్థిగా ఓడిపోయారు. ప్రతిపక్ష పార్టీ నాయకులతోనే ఎక్కువ సంబంధాలు ఉన్న శ్యామ్ ఈ పదవికి ఏవిధంగా అర్హుడంటూ బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం. మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఎప్పుడూ పార్టీ కోసం కష్టపడిన దాఖలాలు లేవని విమర్శలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ కోట్లు ఖర్చు చేసిన తెలగ, కాళింగ, ఇతర సామాజిక వర్గాల నేతలు తీవ్ర నిరాశతో అంతర్మథనంలో పడి మిన్నకుండిపోయారు. చదవండి: మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం -
సురేఖ ఎపిసోడ్.. కాంగ్రెస్లో రేవంత్ బలపరీక్ష నెగ్గినట్టేనా?
రాజకీయాలలో సరైన వ్యూహం లేకుండా పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన తీరు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ మొత్తం ఉదంతంలో ఆమె రాజకీయంగా నష్టపోయారు. అదే టైమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను కొంతవరకు దెబ్బతీశారు. విపక్షాలకు ఆమె కొన్ని ఆయుధాలు అందించారు. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు పార్టీలో పట్టు ఉందని నిరూపించడానికి శ్రమించాల్సి వచ్చింది.కొండా సురేఖతో గత కొన్ని నెలలుగా రేవంత్కు కారణం ఏమైనా విభేదాలు ఏర్పడ్డాయి. అయినా ఆమెను మంత్రిగా కొనసాగించవలసి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనను పదవి నుంచి తప్పించారని సురేఖ ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉందా, లేదా అన్నది పక్కనబెడితే దాదాపు రెండువారాల పాటు సాగిన ఈ డ్రామా వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పరపతి కొంత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే డైలాగులకు ఈ ఎపిసోడ్ ద్వారా ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ టీడీపీ వాసన వదలుకోలేకపోతున్నారన్న భావన పలువురిలో ఉంది. కాకపోతే పైకి అనడం లేదు.సురేఖ, ఆమె భర్త మురళీ ఉమ్మడి వరంగల్ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. అందువల్లే ఆయా పార్టీలు వారిని ఆదరించక తప్పలేదు. అంతవరకు ఓకే కాని కొండా దంపతులు దానిని సద్వినియోగం చేసుకోవడంలో సఫలం కాలేకపోతున్నారు. 1999లో తొలిసారి శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు వారిది ఘర్షణాత్మక రాజకీయమే. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డితో తప్ప, ఆయా పార్టీల నేతలు పలువురితో గొడవలు ఉండేవి. రెండున్నర దశాబ్దాల తర్వాత, లక్కీగా మంత్రి అయిన తర్వాత కూడా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సఖ్యత లేకపోవడం పెద్ద మైనస్గా కనిపిస్తుంది. పోనీ రాష్ట్ర స్థాయిలో ఎవరితోనైనా అవగాహనతో ఉన్నారా అంటే అదీ కనిపించదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తేడా వచ్చాక, తెలివిగా వేరే ముఖ్యమైన నేతలు, మంత్రుల మద్దతు పొందే యత్నం చేయాలి. కాని వీరు రేవంత్ సోదరులపైన, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితర నేతలు పలువురిపైన ఆరోపణలు గుప్పించారు. దాంతో ఈమెకు అండగా నిలవడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారనిపిస్తుంది. గతంలో కూడా వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్లో ఏర్పడిన పరిణామాలలో తొలుత వైఎస్సార్ కుమారుడు జగన్కు మద్దతుగా ఉన్నా, తదుపరి ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో అనవసర విమర్శలు చేశారు. రోశయ్య క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఆయనను వ్యతిరేకించారు. నిజానికి అప్పట్లో రఘువీరారెడ్డి వంటి వారు కూడా రోశయ్య క్యాబినెట్ లో చేరడానికే ఇష్టపడలేదు. కాని తదుపరి సర్దుకుపోయారు. కొండా సురేఖ మాత్రం అలా వ్యూహాత్మకంగా చేయలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా, మళ్లీ అక్కడే గొడవే అయింది. కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యే, మంత్రి అవ్వడం విశేషమే. రేవంత్తో మొదట సత్సంబంధాలు ఉన్నా, కారణం ఏమిటో కాని తేడా వచ్చింది. ఈమె భర్త కొండా మురళీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్న అసంతృప్తి ఉండవచ్చు. ఇంకేదైనా కావచ్చు. పరకాలలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి తిరిగి టిక్కెట్ ఇస్తామని రేవంత్ ప్రకటించడం వీరికి ఆగ్రహం తెప్పించింది. కొండా కుమార్తె సుస్మిత దానిపై ఒక సభలో తీవ్రమైన భాషలో ప్రసంగం చేయడం, రేవంత్పై ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది. దానికి ముందు ఒఎస్డి కేసులో మంత్రి ఇంటిని సోదా చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఈమె పరుష వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎలాగో రాజీ చేశారు. కాని ఈసారి రేవంత్ సీరియస్గా తీసుకున్నారు.నిజానికి తన కుమార్తె సీఎంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వెంటనే సురేఖ నిలువరించి ఉండాల్సింది. లేదా ఆ వెంటనే ఖండించి ఉండాల్సింది. ఎందువల్లో సురేఖ ఆ పని చేయలేదు. దాంతో వివాదం ముదిరింది. ఎంత కాదన్నా ముఖ్యమంత్రికి ఉండే పవర్ వేరు. ఆమె తన మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని, ఇతరత్రా విమర్శలు చేసినా, ప్రయోజనం ఉండదు. క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇచ్చినప్పుడు సారీ చెబితే అయిపోయేదానికి మంత్రి పదవి పోయేవరకు తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏఐసీసీకి ఇచ్చిన లేఖ బయటపెట్టినా పెద్దగా ప్రకంపన ఏమీ రాలేదు.బహుశా ఆమె భర్త మురళీ ఆమె రాజకీయ ఎదుగలకు, అలాగే పతనానికి కూడా కారణమా అన్న విశ్లేషణ వస్తుంది. దానికి తగినట్లే మురళీ ఇంత జరిగిన తర్వాత మీడియాకు కనిపించేలా మీసం మెలి తిప్పుతూ కన్పించారు. అంటే జనంలో తనకు అంత పట్టు ఉందని చెప్పదలిచి ఉండవచ్చు. కాని వర్తమాన రాజకీయాలలో ఎన్నికలు వచ్చేవరకు అధికారంలో ఉన్నవారిదే పెత్తనం అవుతుంది. ఇవన్ని వారికి అనుభవమే అయినా, ఏ ధైర్యంతో ఇలా చేశారో తెలియదు. వారి ప్లాన్ బి ఏమిటో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతామని సురేఖ ప్రకటించడం కాస్త తెలివైన చర్యగానే కనిపిస్తుంది. సమయం మించిపోయాక రక్షాబంధన్ రాఖీని రేవంత్కు కట్టినా ప్రయోజనం కలగలేదనుకోవాలి.ఇక రేవంత్ వైపు చూస్తే సురేఖ ఇష్యూ మొదలు కాగానే పదవి నుంచి తప్పించి ఉంటే ఆయన పవర్ పుల్ గా ఉన్నారన్న అభిప్రాయం కలిగేది. సురేఖపై కొంతమంది ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడంతో పార్టీలో వివాదాలు రచ్చకెక్కినట్లయింది. అధిష్టానం వద్దే పంచాయతీ జరగడం, ఆ పైన మరికొన్ని రోజులు జాప్యం జరగడంతో రేవంత్ కూడా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందేనన్న అభిప్రాయం కలుగుతుంది. అందువల్లే రేవంత్ హైకమాండ్ను బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ ఆరోపించగలిగారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. సురేఖ రాఖీ కట్టిన తర్వాత రాజీ కుదిరిందేమోనని అనుకున్నారు. కాని రేవంత్ అందుకు సిద్దపడలేదన్నమాట.బీసీ వర్గానికి చెందిన మహిళ సురేఖను పదవినుంచి తప్పించడంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే తుది నిర్ణయం జరిగి ఉంటుంది. ఈ వివాదం తొలుత రేవంత్ వ్యాఖ్యలతోనే ఆరంభమైన సంగతిని కూడా కాంగ్రెస్ క్యాడర్ గుర్తించి ఉంటారు. గతంలో పవర్ ఫుల్ ముఖ్యమంత్రులన్న పేరున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు సైతం బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేసేవారుకాదు. మరో బలమైన నేత చెన్నారెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి పదవి కోల్పోయారు. అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన ఒక మంత్రి విమర్శలు చేసిన వెంటనే పదవి నుంచి తప్పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాటికొండ రాజయ్య, ఈటెల రాజేందర్ లను బర్తరఫ్ చేశారు.కాగా తాను ఎవరికి భయపడనని, స్నేహంగా అడిగితే అన్నీ చేసి పెడతానని రేవంత్ అంటున్నారు. ఇది అచ్చంగా గతంలో కొన్నిసార్లు ఆయన గురువు చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం మాదిరే కనిపిస్తుంది. అయితే చంద్రబాబు ప్రాంతీయ పార్టీ అధినేత కాబట్టి కొంతవరకు చెల్లవచ్చు. అయినా ఆయన అన్నీ అంచనా వేసుకున్నాకే ధైర్యం చేసేవారు. కొన్నిసార్లు ఏమి జరగనట్లు రాజకీయం సాగించేవారు. కాంగ్రెస్లో అది అంత తేలికకాదు. ఎవరికి ఉండే బలం వారికి ఉంటుంది. ప్రస్తుతానికి కర్ణాటకలో మాదిరి ఒక నేత ఎవరూ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడే దశ తెలంగాణలో రాలేదు. అది ఆయనకు కలిసివచ్చే అంశం. అయితే తన కుటుంబ సభ్యులపైన, సన్నిహితులు కొందరిపైన సురేఖ చేసిన ఆరోపణల వల్ల కాంగ్రెస్కు కొంత నష్టం జరుగుతుంది. వాటిపై అసెంబ్లీలో చర్చ జరగాలని విపక్షం పట్టుపట్టవచ్చు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అదొక సమస్య అయ్యే అవకాశం ఉంది. కాగా సౌమ్యుడుగా పేరొందిన చిన్నారెడ్డి అనూహ్యంగా వివాదంలో చిక్కుకుని పదవి పోగొట్టుకోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. బీసీ నేత పదవినే తీసేశారన్న విమర్శ రాకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. ఓవరాల్గా ఈ పరిణామాలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలలో పలచన కావచ్చు. సురేఖ రాజకీయం ముళ్లబాటగా మారే అవకాశం ఉంటుంది. కాగా, రేవంత్ తన పరపతి నిలబెట్టుకున్నప్పటికీ, కొంత డామేజీని భరించక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: విజయసాయి మాట ఎందుకు మార్చారు? -
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్, హరీష్రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్ఎస్ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్ స్టేట్మెంట్గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..రాహుల్ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్ అయ్యే ఇమేజ్, సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్కు భిన్నంగా.. మరింత క్యాజువల్ లుక్ను ఆయన తన బ్రాండ్గా మార్చుకున్నారు. అదే రాహుల్ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.ఉదయనిధికి టీషర్టే బ్రాండ్!తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది. 2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆయనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారుటీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్ చుడాసమా టీషర్టు, జీన్స్తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.టీషర్టు.. ఇంత పవర్ఫుల్లా?దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్ బ్రాండింగ్. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్మెంట్. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్’కు మరో ఉదాహరణగా నిలిచింది.ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్ సాలిడ్ వార్నింగ్ -
కేసీఆర్పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నీళ్ల సమస్యకు కేసీఆర్ కూడా ఓ కారణమేనని, ఇరిగేషన్ను నాశనం చేసిందే ఆయనని అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా చిట్చాట్లో ఉత్తమ్ మాట్లాడుతూ..తెలంగాణలో నీటి సమస్యకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ అయితే.. రెండోది ఎల్నినో ప్రభావం. ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు. నీళ్ల పంపకాల విషయంలోనూ అన్యాయం చేశారు. ఆయన వల్లే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి. భారీగా ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును సరిగా నిర్మించి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. నేనే ఇంజనీర్ను అంటూ కాళేశ్వరం కట్టి మరీ కూల్చారు. ఇంజినీర్లు చెప్పినట్లు ఉంటే.. ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యి ఉండేది. ఆయన హయాంలో భారీగా నిధులు ఖర్చు చేసినా ఆశించిన మేర ఆయకట్టుకు నీరందలేదు. ఇదే కాదు.. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన ఇలాగే చేశారు. అసలు ఎస్ఎల్బీసీని పూర్తి కాకుండా గత ప్రభుత్వమే అడ్డుకుంది. ప్రస్తుతం మా ప్రభుత్వం దాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయితే మేమేం చేయగలం?’’ అని ఉత్తమ్ చెప్పారు.కేసీఆర్ గతంలో బూతులు మాట్లాడినప్పుడు కొందరు ఆయన్ను హీరోగా భావించారని, ఇప్పుడు అదే తరహా విమర్శలు ఆయనపై వస్తే మాత్రం నానాయాగీ చేస్తున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ వాడిన భాష తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ వాడలేదు. తెలంగాణ భాష ఇలా అవ్వడానికి కేసీఆర్ రే కారణం. కేసీఆర్ మాటలు అన్ని తెలిసినట్లే ఉంటాయి.. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం జీరో. నీళ్ల కోసం పాదయాత్ర చేస్తానన్న కేసీఆర్ ప్రకటనపైనా ఉత్తమ్ స్పందిస్తూ.. ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుకుంటారని, ఇరిగేషన్ విషయంలో ఆయన బయటకు రాకుండా ఫామ్హౌజ్లో ఉంటేనే బెటర్ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య సాగుతున్న ఈ నీటి రాజకీయ వివాదం మరింత వేడెక్కేలా కనిపిస్తోంది.ఇదీ చదవండి: ఇరిగేషన్పై బీఆర్ఎస్ది బోగస్ ప్రచారమే! -
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్షంపై పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. సోమవారం ఉదయం నల్ల టీషర్లుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ దుస్తులతో అనుమతించబోమని చెప్పారు. అయితే తమను లోపలికి అనుమతించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడంతో మెయిన్గేట్ వద్ద హైడ్రామా నడిచింది. తెలంగాణ అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో నేల మీద పడుకుని పలువురు నేతలు నిరసన తెలిపారు. తన టీ షర్ట్ తీసేసి.. ఇప్పుడైనా అనుమతించాలని హరీశ్రావు కోరారు. అయినా పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో వాగ్వాదం కాస్త.. తోపులాటగా మారింది. పోలీసులు నెట్టేయడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు కిందపడిపోయారు. కేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు తరలించిన పోలీసులు https://t.co/zHd2zxHm06 pic.twitter.com/kCuJ4jsztK— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026ఈ క్రమంలో సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు మెడ బట్టి నెట్టేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గాయాలయ్యాయి. కేటీఆర్ ముఖం, చేతులకు దెబ్బలు తగిలాయి. తన చీర లాగారంటూ సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టగా.. సబిత ఓదార్చారు. ఆపై హరీష్రావు, కేటీఆర్ సహా పలువురు నేతల్ని బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డినలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులుకౌరవ సభలా మారిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు https://t.co/0Nua3mziEr pic.twitter.com/Ada7X5MXwj— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026అసెంబ్లీ వద్ద తమకు అవమానం జరిగిందని.. పోలీసులు తమతో ప్రవర్తించిన తీరుకు పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.స్పీకర్ చెబితేనే: డీసీపీ శిల్పవల్లిఅసెంబ్లీ గేటు వద్ద పరిణామాలపై స్థానిక డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల దుస్తులతో లోపలికి అనుమతించొద్దని స్పీకర్ ఆదేశించారని.. అందుకే అడ్డుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణల్లో నిజం లేదని.. తామేం అమర్యాదగా నడుచుకోలేదన్నారు. అలాగే.. వద్దని చెబుతున్నా బలవంతంగా నిరసనలకు దిగడంతోనే అదుపులోకి తీసుకున్నామని వివరించారు.ఇదీ చదవండి: ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన రేవంత్రెడ్డి -
బీఆర్ఎస్ ప్లాన్కు రేవంత్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు 22ఏ భూములు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలను ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అయితే ప్రతిపక్షం దూకుడును ముందే పసిగట్టిన రేవంత్ ప్రభుత్వం కౌంటర్కు దిగింది.22ఏ భూముల వ్యవహారంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపైనా చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరఫున ఈ అంశాలపై చర్చకు ప్రతిపాదనను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పెట్టనున్నారు. సమావేశంలో చర్చించి వీటిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో బీఆర్ఎస్ లేవనెత్తాలనుకున్న అంశాలనే అధికార పక్షం చర్చకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.22ఏపై ఇప్పటికే రగడతెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం కొంతకాలంగా రాజకీయ దుమారం రేపుతోంది. ప్రైవేటు భూములు సైతం నిషేధిత జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని బాధితులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. 22ఏ జాబితాలో భూములు చేరడంలో అధికారుల తప్పిదాలపై మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పారు. రిజిస్ట్రేషన్ సాధ్యం కాని కేసుల్లో అందుకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ఇప్పటికే ఫీజు చెల్లించి ఉంటే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించారు.ఫీజు రీయింబర్స్మెంట్పైనా ఫోకస్మరోవైపు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావించనుంది. విద్యార్థులు, కళాశాలల సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంపైనా చర్చకు సిద్ధమని చెబుతోంది. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో నిధుల విడుదలపై హామీలు ఇచ్చారు. ఆగస్టులో ప్రభుత్వం రూ.2,400 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.నల్ల టీషర్ట్లతో బీఆర్ఎస్ నిరసనఅసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్లతో నిరసనకు సిద్ధమయ్యారు. 22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు రైతులు, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలనూ సభలో ప్రస్తావించాలని పార్టీ నిర్ణయించింది.మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ ప్రధానంగా నిలదీయాలనుకుంటున్న 22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపైనే ప్రభుత్వం చర్చకు సిద్ధమవుతుండటం ఆ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది.నేడు అసలు సమరం!సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను సీఎం ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల తర్వాత వివిధ నివేదికలను సభ ముందుంచనున్నారు.ఇదీ చదవండి: ప్రశ్నోత్తరాలు.. పలు నివేదికలు -
రాజీనామా చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్హౌస్కు పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు వెంటనే తన ప్రధాన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ డిమాండ్ చేశారు. అధికారం, ప్రభుత్వాలు, పదవులు శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు చాలా గౌరవం ఉంటుందని, అలాంటి పదవిని అపహాస్యం చేయవద్దని హితవు పలికారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, వివేక్లతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్రెడ్డి, అనిల్ కుమార్యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి అంజన్కుమార్ యాదవ్, పలువురు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్లీ కాంగ్రెస్దే అధికారం.. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. ‘మేం తప్పు చేస్తే ప్రతిపక్షాలు ఎత్తి చూపొచ్చు. కానీ అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదు. తప్పిదాలు జరిగితే సరిదిద్దుకుంటాం..’ అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం అమలు జరుగుతున్నాయని, మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారం ప్రజలు ఇచ్చే కానుక అని, దాన్ని మేం సది్వనియోగం చేసుకుంటుంటే, ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దుర్వినియోగం చేసుకుంటున్నాయన్నారు. మంత్రి అజహరుద్దీన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్ము తింటూ ఫామ్హౌస్లో పడుకుంటున్నాడని విమర్శించారు. అసెంబ్లీకి వస్తావా, రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ రాజీనామా చేయకపోతే స్పీకర్ తగిన చర్యలు తీసుకుని ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ బీఆర్ఎస్ సునామీ!
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే సాగునీటి కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి నేనే స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతా. సాగునీటి కోసం త్వరలో మరో యుద్ధానికి సిద్ధమవుదాం. –కేసీఆర్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా మళ్లీ బీఆర్ఎస్ సునామీ రాబోతోందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ఫ్లాప్ అయింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరికి బీఫాం ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంది. అలా అని పార్టీ నేతలు, కార్యకర్తలు రిలాక్స్ కావొద్దు. ప్రజల్లో ఉంటూ నిరంతరం పోరాడాలి..’ అని చెప్పారు. సోమవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సంయుక్త సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో.. అసెంబ్లీ, మండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. థర్డ్క్లాస్ పాలన..రైజింగ్ కాదు డౌన్ఫాల్ ‘కాంగ్రెస్ది థర్డ్క్లాస్ పాలన. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్ఫాల్ వైపు వెళ్లింది. కాంగ్రెస్కు నూకలు చెల్లాయని అర్థమైంది. అందుకే ఆ పార్టీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్ఫాల్ వైపు వెళ్లింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని అధికార పక్షం బూతు కూతలకు వేదికగా మార్చింది. పాలన చేతకాక చిల్లర మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా ప్రజల గొంతును ఉభయ సభల్లో బలంగా వినిపించే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉంది. ప్రజల జెండానే బీఆర్ఎస్ ఎజెండాగా ఉండాలి., ప్రతి చర్చలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా పాల్గొనాలి. శాసనమండలి కూడా పాత భవనంలోకి వచ్చిన నేపథ్యంలో రెండు సభల్లో పార్టీ సభ్యులు మరింత సమన్వయంతో వ్యవహరించాలి..’ అని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ చెప్పినా కాళేశ్వరంపై నిర్లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టులను వినియోగించుకోవచ్చని కోవచ్చని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మేడిగడ్డ వద్ద అవసరమైన చిన్నపాటి మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టులను వినియోగంలోకి తెస్తే దాదాపు 13 జిల్లాల రైతాంగానికి ప్రయోజనం కలుగుతుంది. అయినా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లున్నా తెలంగాణ పంటలకు విడుదల చేయడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 90 శాతం పూర్తి చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి అంశాలపై అవసరమైతే ఉభయ సభలను స్తంభింపజేయాలి. వీటి విషయంలో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే సాగునీటి కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి నేనే స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతా. సాగునీటి కోసం త్వరలో మరో యుద్ధానికి సిద్ధమవుదాం..’ అని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగాలపై సర్కారును నిలదీయాలి ‘పేద విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీనిపై విద్యార్థుల తరఫున అసెంబ్లీ వేదికగా గళం విప్పాలి. పాలిటెక్నిక్ విద్యను దెబ్బతీసేలా జీవో 97 తీసుకొచ్చిన ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలి. ఎన్నికలకు ముందు లక్షలాది ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఎందుకు విఫలమైందో నిలదీయాలి. ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే ప్రయత్నాలు, గురుకులాల నిర్వహణలో వైఫల్యాలు, విద్యార్థులు, బాలికల మరణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పేలా చేయాలి. పేదలు, మధ్యతరగతి ప్రజల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి అత్యవసర పరిస్థితుల్లోనూ విక్రయించుకోలేని పరిస్థితి కల్పించడంపైనా పోరాడాలి. ప్రభుత్వాన్ని ఎండగట్టాలి.. మిషన్ భగీరథ వ్యవస్థను నిర్వీర్యం చేసి తాగునీటి సమస్యను తీవ్రతరం చేశారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు ఉచిత విద్యుత్కు ముప్పుగా మారే ప్రమాదం ఉంది. వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ఏర్పాటు వెనుక కుట్ర ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్ వంటి బకాయిలు చెల్లించకపోవడం, పీఆర్సీ పెండింగ్, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం, సింగరేణిలో అవినీతి, ప్రభుత్వ భూముల విక్రయాలు, మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం, గోదావరి–కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలపై ఉభయ సభల్లో ప్రశ్నించాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, మహిళలపై దాడులు పెరగడం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వంటి అంశాలపైనా కాంగ్రెస్ను ఎండగట్టాలి..’ అని కేసీఅర్ స్పష్టం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు, హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయలేకపోయిన ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా నాయకత్వం, కార్యకర్తలను అభినందించారు. తాను అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను కేసీఆర్ కోరగా.. ప్రస్తుత సభ గౌరవ సభగా కాకుండా ‘కౌరవ సభ’గా మారిందని సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది. -
ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం: మల్లు రవి
హైదరాబాద్: పార్టీకి నష్టం కల్గించారనే కారణాలతో ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. వారిని వారంలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 6వ తేదీ) క్రమశిక్షణా కమిటీ సమావేశమైన అనంతరం మల్లు రవి ఈ విషయాల్ని వెల్లడించారు. పార్టీకి నష్టం కల్గించేలా వ్యహరించారడంతో ఆరుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం తన డిక్లరేషన్లో లేదని తెలిపారు మల్లు రవి. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, తాను ఏదైనా తప్పు చేస్తే ఏఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.షోకాజ్ నోటీసులు జారీ చేసిన వారిలో ఆదిలాబాద్ ఇంచార్జి కంది శ్రీనివాస్తో పాటు సంజీవ రెడ్డికి, గజ్వేల్ నర్సారెడ్డి, జూపల్లి మల్లారెడ్డిలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో పాదయాత్ర చేస్తా: కేసీఆర్ కీలక ప్రకటన -
‘ మా అసెంబ్లీ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నాం’
సిద్ధిపేట: రేపట్నుంచి(సోమవారం, సెప్టెంబర్ 07వ తేదీ) ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం హరీష్ మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ నష్టం చేసిందని, ఆ పార్టీ ప్రజలకు చేసిన ద్రోహాల మీద అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. ‘ఈ అసెంబ్లీ కనీసం నెల పెట్టాలని మేము బీఏసీలో డిమాండ్ చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ద్రోహాల మీద నిలదీస్తాం. 22a అంశం పై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాబోయే కొద్ది రోజుల్లో లక్షలాది మందితో కాళేశ్వరం ఎత్తిపోతల, రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. రాజీనామా చేయాల్సి వస్తే మీరే చేయాలి. అన్ని విషయాల్లో ఫెయిల్ అయిన మీరే రాజీనామా చేయాలి.ప్రధాన ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వడం లేదు. సీఎం బూతులు తిడుతున్న ఈ సభ కు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు అని అందరం ఎమ్మెల్యేం చెప్పాం. మీ తమ్ముడు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. ఆయనకు ఎందుకు గన్మెన్లను ఇచ్చి ఖర్చు పెడుతున్నారు. అసెంబ్లీ కనీసం నెలరోజులు జరగాలని మేము స్పీకర్ ను కోరుతాం.సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ను అడుగుతాం. మాకు తగిన సమయం ఇవ్వకపోతే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా వెనకాడం’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి:త్వరలో పాదయాత్ర చేస్తా: కేసీఆర్ కీలక ప్రకటన -
బీఆర్ఎస్ఎల్పీ భేటీలో ఊహించని మలుపు.. ఆ కీలక ఎమ్మెల్యే హాజరు
సాక్షి,సిద్దిపేట: బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి రెడ్డి హాజరయ్యారు. తనది బీఆర్ఎస్సేనని, కాంగ్రెస్ కాదని స్పష్టం చేశారు.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎర్రవల్లి ఫామ్హౌస్ కేంద్ర బిందువుగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్హౌస్కు చేరుకున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల వ్యూహం, అనుసరించాల్సిన విధానాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ డైరెక్షన్ కోసం ఫామ్హౌస్కు వచ్చాం. పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి ఈ సమావేశానికి హాజరవుతున్నాం. కేసీఆర్ ఈరోజు ఏ దిశానిర్దేశం చేస్తారో దాని ప్రకారం నడుచుకుంటాం. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే, అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ సభ్యుల వైపే కూర్చుంటాను’ అని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై కోర్టు తీర్పు కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.👉ఇదీ చదవండి: నా వల్లే ఇదంతా.. బోరున ఏడ్చేసిన కొండా సుష్మిత -
‘సర్’ ఒక సాకు మాత్రమే.. కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది: రాంచందర్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ చుట్టూ మాటల యుద్ధం ముదురుతోంది. ఓ వైపు ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ విమర్శలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ ఓటమి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.రాంగోపాల్పేట్ డివిజన్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్ఐఆర్, విద్యావ్యవస్థపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపిస్తున్నారని రాంచందర్రావు అన్నారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేరళలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు. దీంతో ఎస్ఐఆర్ కారణంగానే బీజేపీ గెలుస్తుందన్న కాంగ్రెస్ వాదనలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఆ ఓటమికి ముందుగానే ఎస్ఐఆర్ను కారణంగా చూపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని రాంచందర్రావు పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియను అడ్డుపెట్టుకుని బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించి, మజ్లిస్కు కాంగ్రెస్ ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విమర్శించారు.విద్యావ్యవస్థపై తీవ్ర అసంతృప్తిరాష్ట్రంలోని విద్యావ్యవస్థ పరిస్థితిపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. టీచర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ముందుగా విద్యావ్యవస్థను చక్కదిద్దడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడం ప్రభుత్వం వల్ల కాకపోతే.. ఆ శాఖను వేరే వారికి అప్పగించాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై బీజేపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వీధుల్లో పోరాటం చేయడంతో పాటు అవసరమైతే న్యాయస్థానాల్లోనూ పోరాడతామని తెలిపారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇవి కూడా చదవండి: అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం! -
‘అక్రమాలపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?’
సాక్షి, తాడేపల్లి: అక్రమాలను ప్రశ్నిస్తుంటే చంద్రబాబు సర్కార్కు భయం పట్టుకుందని.. అందుకే ప్రశ్నించే గొంతులను నులుముతున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అనధికార సెన్సార్ షిప్ దుర్మార్గం అన్నారు. సోషల్ మీడియా ఖాతాలను లేపేస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లను తొలగించారు. సాక్షి టీవీ, బిగ్ టీవీ ఖాతాలను కూడా లేపేశారు. ప్రశ్నించే గొంతులను చూసి చంద్రబాబుకు ఎందుకంత భయం?’’ అంటూ శివశంకర్ ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే నేరమా?. అందులో అబద్దాలు ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ఎక్కౌంట్లపై దాడి ఎందుకు?. తప్పులను కప్పి పుచ్చుకోవటానికే సోషల్ మీడియా ఖాతాలపై దాడి చేస్తున్నారు. ఇదే కొనసాగితే సోషల్ మీడియా వార్ తప్పదు. డీఎస్సీలో అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలి. పదవికి రాజీనామా చేసి సీబీఐతో విచారణ జరపాలి. సోషల్ మీడియా అకౌంట్లపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. న్యాయ పోరాటం చేసి మళ్ళీ ఆ అక్కౌంట్లను సాధిస్తాం’’ అని శివశంకర్ అన్నారు. -
‘పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: డీఎస్సీలో అక్రమాలు గురించి గతం నుంచి చెబుతూనే వచ్చామని.. మూడున్నర లక్షల మంది అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైతిక బాధ్యత వహించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వానికి రావటం లేదన్నారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలని డిమాండ్ చేశారు.‘‘దేశ చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో గత ప్రభుత్వ హయాంలో ఒకటిన్నర లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ నిర్వహించాం. హెరిటజ్లో పాలు, పెరుగు అమ్మినట్టు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రావటం విద్యార్థులకు శాపం. టెట్కి, డీఎస్సీకి ఒకరినే కన్వీనర్గా పెట్టడం దగ్గర నుంచి.. సంతలో బర్రెలు అమ్మినట్టు టీడీపీ నేతలు ఉద్యోగాలు అమ్మేసేంతవరకు ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాం. మీకు చిత్తశుద్ధి ఉంటే సీబిఐ విచారణ జరిపించండి’’ అని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ వ్యవహారంపై ఎందుకు సీబిఐ విచారణ జరపటం లేదు. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయి. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారో బయట పడుతుంది. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఉద్దేశంతోనే ధైర్యం చేయడం లేదు. కనీసం గ్రౌండ్లో అడుగుపెట్టని వారికి సైతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు.. డబ్బు కోసం అక్రమ సంపాదన కోసం ఎటువంటి నీచమైన పని చేయడానికైనా ప్రభుత్వం దిగజారి పోతుంది. ఆడియో టేపులు బయటకు వచ్చినా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు.డీఎస్సీ వ్యవహారంలో ఎందుకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేకపోయారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ నిలుపు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ సర్వీసెస్ పరీక్షలపై మీరు చేసిన ఆరోపణలపై, ప్రస్తుత డీఎస్సీపై సిబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వండి. మీరు చేసిన తప్పుడు నియామకాలు బయటపడతాయి. సాక్ష్యాలు ఉన్నా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడం దారుణం. లోకేష్ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదు. తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. ఈ వ్యవహారంలో కోర్టులు కూడా జోక్యం కల్పించుకోవాలి’’ అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. -
‘నా వల్లే ఇదంతా’.. బోరున ఏడ్చేసిన కొండా సుష్మిత!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం నుంచి తన తల్లి కొండా సురేఖను తప్పించడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తల్లికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ భోరున విలపిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉన్న కోపాన్ని తన తల్లిపై చూపించి బలిచేశారని ఆరోపించారు.మా అమ్మను ఇంతగా అవమానిస్తారని తెలిస్తే నేను ఆ రోజు ఆ విధంగా మాట్లాడేదాన్ని కాదు. నేను మాట్లాడిన దానికి మా అమ్మను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అన్న మాటల్లో తప్పులేదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి నాపై ఈ స్థాయిలో పగ పెంచుకుంటారని ఊహించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.మా అమ్మ చేసిన ఒక్క తప్పునైనా చూపించగలరా? 'పార్టీలో నేనైనా ఉండాలి, లేదా ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుతారా? అని రేవంత్ రెడ్డి తీరును నిలదీశారు. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొండా సురేఖ దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న తమ కుటుంబాన్ని ఇప్పుడు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తరుణంలో కొండా సుష్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని, ఆమె గొంతు నొక్కలేరని పేర్కొన్నారు. సీఎం రేవంత్ను శపిస్తున్నట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా, తన వ్యాఖ్యల వల్లే తల్లి పదవికి ముప్పు వచ్చిందనే భావనతో సుష్మిత భావోద్వేగానికి గురవుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. బోరున ఏడ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత నా వల్లే మా అమ్మకు ఇంత అవమానంనేను మాట్లాడిన మాటలకు మా అమ్మను ఇంతలా అవమానిస్తారా? –కొండా సుష్మిత pic.twitter.com/2njDtBF1G0— Mirror TV (@MirrorTvTelugu) September 6, 2026 -
బాబూ.. దేనికి భయం?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారానికి సంబంధించి రోజురోజుకూ మరిన్ని ఆధారాలు బయట పడుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. వాటన్నింటిపై వెల్లువలా తలెత్తే అన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. అంతా పారదర్శకంగా జరిగిందన్నప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీ కెందుకింక భయం? అని ప్రశ్నించారు. డీఎస్సీ స్కామ్పై ప్రతిపక్షంతో పాటు గళం విప్పిన కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను మెటా ద్వారా ఎందుకు బ్లాక్ చేయిస్తున్నారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయితీగా, పారదర్శకంగా జరిగాయని అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..వెలుగులోకి కొత్త ఆధారాలు, వాస్తవాలు ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ డీఎస్సీలో తీవ్ర అక్రమాలను బయట పెడుతూ, సీఎం చంద్రబాబు వెన్నుపోటు పార్టీ సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు అంగీకరించాల్సిన ప్రభుత్వం.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోంది. మరో వైపు ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసే మార్గాన్ని వెన్నుపోటు పార్టీ ఎంచుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై గొంతెత్తుతున్న ప్రతిపక్షంతో పాటు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన సామాజిక పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నియంత్రిస్తున్నారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ వాటిని తొలగించడం లేదా జియో బ్లాక్ చేయడం జరుగుతోంది. ఆ ఆంక్షల బారిన పడిన ఖాతాలు, పేజీలు, ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్స్టాగ్రామ్లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్తో పాటు డీఎస్సీ స్కామ్పై ప్రశ్నిస్తున్న ఇతర వ్యక్తిగత హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యవహారం కేవలం డీఎస్సీ స్కామ్తోనే ఆగిపోవడం లేదు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎన్నికల హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్! వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. ప్రశ్నలు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.ప్రజలకు సమాధానం చెప్పండిచంద్రబాబు గారూ.. మీరు భయపడుతున్నది ప్రశ్నలకా? లేక వాటి సమాధానాలకా? డీఎస్సీ నియామకాల్లో ప్రతిరోజూ కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఒకవేళ అవాస్తవమైతే.. ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. ఆ పని చేయడం లేదు. ఇంకా సీబీఐ విచారణను కూడా ఎందుకు తిరస్కరిస్తున్నారు? అక్రమాలను బయట పెడుతున్న వారి గొంతు ఎందుకు అణచి వేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు. ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి. రాజ్యాంగబద్ధంగా పాలించండి.ఉత్తీర్ణులు కాకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలా?డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ‘టెట్’లో ఉత్తీర్ణులు కాకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి.. మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా భర్తీ కోసం కొత్తగా జీవోలు జారీ చేశారు. ఆ నియామకాలు పూర్తి చేయగానే, ఆ జీవోలు రద్దు చేశారు. అయినప్పటికీ ఆ జీవోల ద్వారా నియమితులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అంటే అక్రమ నియామకాలకు ముందు గేట్లు తెరిచి.. ఆ నియామకాలు పూర్తయ్యాక వాటిని మూసివేశారు. ఇదంతా అవినీతిని సూచించడం లేదా? అందుకే నియంతృత్వ సెన్సార్షిప్లో భాగంగా నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్యమ ఖాతాను, పోస్టును, కంటెంట్ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే అందరూ లేవనెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పాలి.స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండిచంద్రబాబుకు.. ఆయన ప్రభుత్వానికి నేను ఒక సవాల్ చేస్తున్నా. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని మీరు అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించండి. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండి. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయట పడుతున్నందున, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలి. అంతే కాకుండా వెంటనే సామాజిక మాధ్యమాల ఖాతాలు పునరుద్ధరించండి. వాటి సెన్సార్షిప్ను ఆపండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సీబీఐ విచారణకు ఆదేశించండి. అంతా పారదర్శకంగా జరిగినప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీకెందుకింకా భయం?’ అని వైఎస్ జగన్ నిలదీశారు. -
ఎమ్మెల్సీ పేర్లు ‘అధిష్టానానికి’!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావహుల జాబితా ఢిల్లీకి చేరినట్టు తెలుస్తోంది. హైదరాబాద్–రంగారెడ్డి–పాలమూరు ఉమ్మడి జిల్లాల నియోజకవర్గానికి ఆరుపేర్లు, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గానికి ఏడు పేర్ల చొప్పున అధిష్టానానికి వెళ్లాయని, ఈ పేర్లపై పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపి ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రుల అభిప్రాయం మేరకు.. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉమ్మడి జిల్లా ఉన్న ఓ నియోజకవర్గం, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్టున్న మూడు జిల్లాల్లో రెండో నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో ఈ రెండు చోట్ల గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల కసరత్తును టీపీసీసీ నిర్వహించింది. ఇందులో ఆయా జిల్లాల్లో ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రుల అభిప్రాయం కీలకంగా తీసుకుంది. పాలమూరు స్థానంలో నేతల అభిప్రాయాలు సేకరించే బాధ్యతలు మంత్రి దామోదరకు, నల్లగొండ స్థానంలో మంత్రి ఉత్తమ్కు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఈ ఇరువురు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు, డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి వారి అభిప్రాయం మేరకు ఆరు పేర్లతో షార్ట్ లిస్టు చేసినట్టు తెలుస్తోంది. నల్లగొండ స్థానం నుంచి తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, మాజీ మంత్రి దామోదర్రెడ్డి కుమారుడు సరోత్తంరెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్నేత, యువ నాయకుడు డాక్టర్ లోకేశ్యాదవ్, చనగాని దయాకర్ల పేర్లను పంపినట్టు తెలుస్తోంది. ఓ ఆర్టీఐ కమిషనర్ పేరును కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. పాలమూరు స్థానం నుంచి టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, విద్యావేత్త గౌరి సతీశ్, టీïపీసీసీ నేత సామా రామ్మోహన్రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేత గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి భీంభరత్ల పేర్లను పంపినట్టు సమాచారం. ఈ పేర్ల నుంచి ఎవరో ఒకరి అభ్యర్థిత్వాలను ఖరారు చేసే అవకాశాలున్నాయని, ఢిల్లీలో జరిగే సమావేశంలోపు ఇతర పేర్ల ప్రతిపాదనలు ఏవైనా వస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఢిల్లీ పెద్దలతో సీఎంతో పాటు పార్టీ ముఖ్య నేతలు కలిసిన సందర్భంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై కూడా చర్చ జరుగుతుందని, వీలున్నంత త్వరలోనే ఓటరు నమోదు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈలోపే అభ్యర్థిత్వాలు ఖరారవుతాయని అంటున్నాయి. -
ఇక సిరిసిల్ల, సిద్ధిపేటలపై దండయాత్రే: సీఎం రేవంత్
నల్లగొండ: నకిరేకల్ సభలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్ధిపేట స్థానాలు కూడా తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో సిరిసిల్లకు పోదాం.. అక్కడ కదం తొక్కుదాం అని కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై దండయాత్ర చేస్తామన్నారు సీఎం రేవంత్. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరిగితే 110 స్థానాల్లో గెలుస్తామన్నారు. ఒక ఇవే స్థానాలకు ఎన్నికలు జరిగితే 90 స్థానాల్లో గెలుస్తామన్నారు. దీనిలో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్లకు రేవంత్ సవాల్ విసిరారు. ‘రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?, సిద్ధిపేట.. సిరిసిల్ల అయినా మేం చర్చకు రెడీ. బీఆర్ఎస్ పదేళ్లు.. మా రెండేళ్లు పాలనను బేరీజు వేసుకోండి.గతంలోని బీఆర్ఎస్ పథకాలనూ మేం కొనసాగిస్తాం. కొందరు దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారు. వచ్చేసారి కూడా తెలంగాణలో ఇందిరమ్మ పాలన వస్తుంది. గోదావరి, కృష్ణా కలిసి పారితే ఎలా ఉంటుందో నకిరేకల్ లో జనాలు అలా వచ్చారు. కొందరు దుర్మార్గులు, సన్నాసులు సీఎం రాజీనామా చేయాలని అంటున్నారు. గంగిరెద్దుల్లా కాంగ్రెస్ పాలనను విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను బేరీజు వేసుకోండిగతంలో బీఆర్ఎస్ ప్రకటించిన అన్ని పథకాలను కొనసాగించాం. గతంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుని ఏడున్నర వేల కోట్లు మింగారు. చివర్లో రైతు బంధు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ పేరుతో ఎగ్గొట్టారు. రెండు లక్షల రుణమాఫీ చేశాం. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని గతంలో అనలేదా?., సన్న ధాన్యం పండించిన వారికి బోనస్ ఇస్తున్నాం. రైతుల కోసం 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశాం. దమ్ముంటే తండ్రి కొడుకులు, మామా అల్లుళ్లు శాసన సభలో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.ఇదీ చదవండి: కొండా సురేఖ మా పార్టీలోకి కూడా వద్దు -
ఆ పక్కకు ఉండలేక.. ఈ పక్కకు రాలేక!
టీవీకే 2029లో లోక్సభ ఎన్నికల్లో ఇలాగే తమిళగ వెట్రి కళగం (టీవీకే)లో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెస్తే రాహుల్ గాంధీ, కాంగ్రెస్కు ‘ఇక్కడా కాదు.. అక్కడా కాదు’ అనే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వ్యూహకర్త అమితాబ్ తివారీ విశ్లేషించారు. అంటే, రాహుల్ గాంధీ మధ్యలో ఇరుక్కుపోయే పరిస్థితి వస్తుంది. విజయ్ 2029లో ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తే, రాహుల్ గాంధీకి ప్రతిపక్షాల తరఫున ప్రధాన నాయకుడిగా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకోవడం కష్టమయ్యే పరిస్థితి రావచ్చు. విజయ్ ఎదుగుదల వల్ల రాహుల్కు ప్రధాని రేసులో స్పష్టమైన ఆధిపత్యం లేకుండా, రాజకీయంగా మధ్యలో ఇరుక్కునే పరిస్థితి రావచ్చు. 2029 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా విజయ్ పనితీరు, టీవీకేకు లభించే ప్రజాదరణ, కాంగ్రెస్తో కొనసాగించే పొత్తు ఈ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారనున్నాయి.తమిళనాడులో అధికారంలో ఉన్న విజయ్ను 2029 లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఇప్పటికే బహిరంగ చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. ఇది తమిళనాడులో టీవీకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్లో అసౌకర్యానికి కారణమవుతున్నట్లు సమాచారం.విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని 2029 ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నానికి నేరుగా సవాల్గా మారే అవకాశం ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు టీవీకే తన మిత్రపక్షాలతో సెప్టెంబర్ 9న సమావేశం నిర్వహించనుంది.దక్షిణాది నుంచి ప్రధాని రావాలి టీవీకే ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సమయంలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విజయ్ను జాతీయ రాజకీయాల కోణంలో ప్రస్తావించడం ప్రారంభించారు. మంత్రి ఆధవ్ అర్జున దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావాలని తమిళనాడు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. మరో మంత్రి జగదీశ్వరి.. విజయ్ ఏదో ఒక రోజు ప్రధాని అవుతారని అన్నారు. ఎమ్మెల్యే కనిమొళి అయితే 2029 లోక్సభ ఎన్నికలకు విజయే టీవీకే ప్రధాని అభ్యర్థి అని ప్రకటించారు. “ఎవరు ప్రధాని కావాలో ఢిల్లీ నిర్ణయించదు. తమిళనాడు నిర్ణయిస్తుంది” అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ కూడా విజయ్ ప్రధానమంత్రి కావడానికి మద్దతు ఇస్తారని ఆమె పేర్కొన్నారు.తాజా ఇండియా టుడే సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో తదుపరి ప్రధానమంత్రిగా విజయ్కు 9 శాతం మద్దతు లభించింది. నరేంద్ర మోదీ 48.7 శాతంతో ముందుండగా, రాహుల్ గాంధీ 27.1 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ మాత్రం 543 స్థానాల లోక్సభలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 మంది సభ్యుల మద్దతు అవసరమని, ప్రస్తుతం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చూడటం తొందరపాటు, అత్యాశతో కూడిన లక్ష్యమని అన్నారు.కాంగ్రెస్ నేతలు మాత్రం విజయ్ ప్రధాని ప్రచారాన్ని తేలికగా తీసుకుంటున్నారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మాణికం ఠాగూర్ దీన్ని అభిమాన సంఘం తరహా ఆలోచనగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ ప్రధాని కావాలంటే 272 మంది ఎంపీల మద్దతు అవసరమని అన్నారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా రనౌత్.. దిమ్మతిరిగిపోయేలా కౌంటర్ -
‘కొండా సురేఖ మా పార్టీలోకి కూడా వద్దు’
హైదరాబాద్: ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ ఏ పార్టీలో చేరుతుంది అనే డైలమా కొనసాగుతున్న తరుణంలోనే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలు తమ స్వరం పెంచాయి. కొండా సురేఖ ఏ రాజకీయ పార్టీలో చేరతారు అనే దానిపై ఇంకా స్పష్టత రాకుండానే బీఆర్ఎస్, బీజేపీలు నేరుగానే దాడి ప్రారంభించాయి. కొండా సురేఖను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని, తెలంగాణ భవన్ గేట్ను కూడా ఆమె తాకలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్రెడ్డి ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు బీజేపీ నుంచి కూడా దాదాపు అదే స్వరం వినిస్తుంది. కొండా సురేఖ తమ పార్టీలోకి కూడా వద్దంటూ బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు తేల్చిచెప్పేశారు. కొండా సురేఖ బర్తరఫ్ అంశం తర్వాత బీజేపీలోకి చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత మురళీదర్రావు సంచలన ట్వీట్ చేశారు. BJP అంటే BIN అనుకుంటున్నారా? అంటూ ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి బహిష్కృతం అయిన నేతలను తీసుకునే రాజకీయ డంపింగ్ గ్రౌండ్గా బీజేపీ ఉండదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం కనిపిస్తున్న సమయంలోనే ప్రతి ఊహాగానానికి బీజేపీని లింక్ చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. బీజేపీని చర్చలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్లోని అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా? అనే అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించుకునే లోపే బీజేపీ పేరును తెరపైకి తెచ్చి రాజకీయ నరేటివ్ను ముందుగానే మార్చే ప్రయత్నం జరుగుతోందా?, తెలంగాణ బీజేపీ లక్ష్యం కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్త నేతలకు ఆశ్రయం కల్పించడం కాదు.కాంగ్రెస్, బీఆర్ఎస్లకు విశ్వసనీయ సొంతంగా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలనుకుంటోంది. ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి, వ్యక్తిత్వం, సిద్ధాంతం, రాజకీయ విధానాల్లో కనిపించాలి. బీజేపీకి కార్యకర్తల బలం, కేడర్ కమిట్మెంట్ కీలకం. పార్టీని కేవలం నేతల చేరికలతో బలోపేతం చేయడం కాదు. ప్రత్యేకమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే లక్ష్యం. అందుకే “BJP = BIN” అనే రాజకీయ నరేటివ్ను నమ్మొద్దు. ప్రస్తుతం వస్తున్న రాజకీయ ఊహాగానాల వెనుక ఇంకేదైనా రాజకీయ వ్యూహం ఉందా? అన్న కోణంలో కూడా చూడాలి. బీజేపీ ఒక ప్రత్యామ్నాయం.. మరో పార్టీకి పేరు మార్చిన రూపం కాదు’ అని స్పష్టం చేశారు.BJP is NOT a BIN.Why is the media so eager to drag BJP into every speculative political story—just when the Congress crisis appears to be unfolding?Is this an attempt to prematurely stop the game, divert the narrative, and help Congress nip its troubles in the bud?BJP…— P Muralidhar Rao (@PMuralidharRao) September 5, 2026 ఇవీ చదవండి: సురేఖ ఎపిసోడ్, కేబినెట్ విస్తరణపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం’ -
‘మూడు పార్టీలు కలిసి ఉన్నా పోటీకి భయపడుతున్నాయి’
చోడవరం(అనకాపల్లి జిల్లా): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూటమి భయపడుతుందన్నారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్. కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నా పోటీ చేయడానికి భయపడుతున్నాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీకి దిగుతుందని స్పష్టం చేశారాయన. చంద్రబాబులా వైఎస్ జగన్ తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేశారని, ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించారన్నారు. ప్రజా సమస్యలు మీద వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు. చోడవరం, షుగర్ ఫ్యాక్టరీ రైతులకు రూ. 30 కోట్లు, ఉద్యోగులకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరొక 15 రోజుల్లో బకాయిలు ఇవ్వకపోతే ఈనెల 21వ తేదీన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి: ఇది దేవుడు చెప్పిన సత్యం: బొత్స -
ఇది దేవుడు చెప్పిన సత్యం: బొత్స
సాక్షి, అనకాపల్లి: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువేనని.. ఇది దేవుడు చెప్పిన సత్యం అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా మైనింగ్ జరుగుతుంది. ఏపీ గంజాయి మత్తులో తూగుతోంది. వాస్తవాలను చెబుతున్నప్పుడు సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేసే అధికారం ఎవరిచ్చారు?’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పదివేలకు పైగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చాము. సుమారు లక్షల 50 వేల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎక్కడైనా మాపై ఒక చిన్న ఆరోపణ వచ్చిందా? ఎక్కడైనా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయా?. వైఎస్ జగన్ పాలనలో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగింది. కూటమి పాలనలో స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక జీవో తీసుకువచ్చారు. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేశారు’’ అంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.డీఎస్సీలో ఉద్యోగాల కోసం బేరాలు పెట్టారు. శాసనమండలిలో చర్చకు రమ్మంటే తోక ముడిచి పారిపోయారు. విశాఖ నగరాన్ని సర్వనాశనం చేశారు. గీతం యూనివర్సిటీకి వేల కోట్లు చేసే భూములు అప్పగించారు. ఎవడబ్బ సొమ్ము అని 3 వేల కోట్లు ధారాదత్తం చేస్తారు?. గ్రావిటీ ద్వారా పోలవరం ఎడమ కాలువకు నీరు ఇవ్వాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం చివరికి నీరు ఇవ్వాలి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇచ్చి గోదావరి జలాలు ఇచ్చామని ప్రచారం చేస్తారా?. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వైఎస్సార్.. అందుకు నేను సాక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి గెలిచి తీరాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబులా పారిపోయే మనస్తత్వం వైఎస్ జగన్ది కాదు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
‘రాహుల్ ఎక్కడున్నావు.. హైదరాబాద్కు ఎందుకు రావు’
సాక్షి, కరీంనగర్: ఒక్కరిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ ప్రభుత్వమే బర్తరఫ్ కానుందంటూ రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ యువ సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘రాహుల్ గాంధీ, ఎక్కడున్నావు.. హైదరాబాద్కు ఎందుకు రావు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.రేవంత్రెడ్డి రెన్యూవల్ సీఎం.. జాబ్ క్యాలెండర్.. చిత్తు కాగితం కంటే హీనమని తేలిపోయింది. వెయ్యి రోజులయ్యాయి. యూత్ డిక్లరేషన్ గురించి అడిగితే బూతులు వినిపిస్తున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి వాటాలు, కమీషన్ల కోసం తన్నుకుంటున్నారు. వీళ్లకు తిక్క ఉంది.. కానీ లెక్కలేదు. నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్లు మాత్రం జరుగుతున్నాయి. నిరుద్యోగులు నిప్పు కణికలే మండాలి.. మళ్లీ పుడతామా ఏంటి?’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.కేసీఆర్ రాజీనామా చేయాలా?. ధోకేబాజ్ రేవంత్ చేయాలా?. కేసీఆర్తో పెట్టుకుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫోర్ ట్వంటీ హామీలిచ్చిన మీరే 420 సార్లు హామీలు చేయాలి. మంత్రులు, ముఖ్యమంత్రి కొట్లాడుకుంటున్నారు. మీకు దండం పెట్టినోళ్లే.. రేపు పిండాలు పెడతారు. రాహుల్ గాంధీ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. అవుతల పడ్డాడు. సీల్డ్ కవర్లో పంపిన మీ సీఎం ఏం చేస్తుండో నీకు సోయి ఉందా రాహూల్ ?. నెలకోసారి మూటలు తీసుకుని రాహూల్ గాంధీ నోరు మూసుకుని కూర్చుంటుండు’’ అంటూ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. -
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
అనకాపల్లి: భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయను.. వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటానని స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏరియా ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల నుంచి తప్పుకుంటాను. తర్వాత ఏది చేద్దామన్నా అవకాశం ఉండదు. పదవీకాలం మూడేళ్లు మాత్రమే ఉన్నందున ఈలోపే ఏదో ఒక మంచి పని చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను’’ అని చెప్పారు. అయ్యన్నపాత్రుడు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు -
తెలంగాణలోనూ అలా గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్
సాక్షి, కొడంగల్: కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ‘SIR’ పేరుతో కేంద్రం ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలనే ముఖ్యంగా టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని చూస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో కొడంగల్ నివాసంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొడంగల్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్కు ఈ గుర్తింపు, గౌరవం వచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం SIR పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేశారు. మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో అలాగే గెలిచారు. తెలంగాణలోనూ అలాగే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో దొంగ దెబ్బ తీస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవారు లేరు. ఓట్లు తొలగించి దొంగ దెబ్బ తీయాలనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను బీజేపీ టార్గెట్ చేసింది. ఇంతకుముందు ఎన్నికల్లో ఓడించేందుకు ఈడీ, సీబీఐ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఓట్ల తొలగింపుతో తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు దిగుతున్నారు. చిన్న తప్పిదాలను సాకుగా చూపి బీజేపీ పేదల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ను ఓడించేందుకు ఈ కుట్రకు బీఆర్ఎస్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తోంది. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ప్రజల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉంది. గ్రామాల వారీగా బీఎల్ఏలను సమన్వయం చేసుకుని పేదల ఓట్లు తొలగించకుండా చూడాలి. ఓట్లు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత మండల నాయకులదే. నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలి. ప్రతీ బూత్లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత వహించాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలి’ అని అన్నారు. ఇదీ చదవండి: ‘ఓరుగల్లు రాజకీయంలో ఆట మొదలైంది’మరోవైపు.. కొడంగల్లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రభుత్వ సలహదారు కేశవరావు సహా పలువురు నేతలు ఉన్నారు. -
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గురు పూజోత్సవం సందర్భంగా 'గురు పరిరక్షణ దీక్ష' పేరుతో ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. డీఎస్సీలో అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేష్ బాబు, ఇసాక్, కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్కుమార్, రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం నిరసన చేపట్టారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?: వైవీవైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. అనర్హులు కూడా టీచర్లు అయ్యారు.. అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?. అనర్హులను ఉద్యోగాల నుండి తప్పించాలి. సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు బయటికి వస్తాయి. మంత్రి లోకేష్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేస్తేనే అన్యాయమైన వారికి న్యాయం జరుగుతుంది. అర్హులుగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగించమని మేము అడగడం లేదు. అనర్హులను మాత్రమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేస్తే అనర్హులు బయటపడతారు’’ అని ఆయన పేర్కొన్నారు.విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?: కురసాలమాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అనర్హులు గురువులు అయితే విద్యార్థుల నష్టపోతారు. విద్యావ్యవస్థలో నకిలీ గురువులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నకిలీ గురువులతో భావితరాలు నష్టపోతాయి.. ఈ డీఎస్సీ ప్రక్రియ దుర్మార్గమైన స్కామ్. స్కామ్ బయటపడినా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?. కూటమి సర్కార్కి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అన్ని వర్గాలకు ప్రభుత్వం నష్టం చేసింది’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు -
ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది. ఒకవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై చర్చ.. మరోవైపు వరంగల్ తూర్పులో అంతర్గత సమీకరణాలపై ఆసక్తి.. వెరసి ‘కొండా’ దంపతులకు ‘అక్కడ సెగ.. ఇక్కడ పొగ..’ అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో తక్షణ రాజకీయ సంక్షోభంపై కొంత స్పష్టత వచ్చింది. వరంగల్ తూర్పుపై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ గుండు సుధారాణిలు పట్టు బిగిస్తుండటం.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తూర్పులో కొండా కుటుంబానికి భిన్నంగా వేగమందుకున్న కాంగ్రెస్ నేతల కదలికలపై చర్చ మొదలైంది.కాంగ్రెస్లోనే.. సురేఖ స్పష్టత.. పార్టీ మారతారనే ప్రచారం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ మధ్య సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో వెంటనే పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీలో తన రాజకీయ ప్రాధాన్యాన్ని ఎలా కొనసాగిస్తారు? స్థానికంగా తన వర్గాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.చదవండి: మంత్రివర్గంలోకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్?పెరుగుతున్న వ్యతిరేక స్వరంవరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొండా సురేఖకు భిన్నమైన రాజకీయ వర్గాలు గతంలోనూ ఉన్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ గుండు సుధారాణి వంటి నేతలు వరంగల్ తూర్పు రాజకీయాల్లో తమదైన ప్రాధాన్యం కలిగిన నాయకులు. గత రాజకీయ పరిణామాల్లో కొండా కుటుంబంతో వీరికి భిన్నాభిప్రాయాలు కనిపించిన సందర్భాలున్నాయి. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన గుండు సుధారాణి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేయాలని, తాను సైతం ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని బసవరాజు సారయ్య సురేఖకు సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరి రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది? కొండా సురేఖతో పార్టీ అంతర్గతంగా సమన్వయం జరుగుతుందా? లేక కాంగ్రెస్లో వేర్వేరు రాజకీయ శక్తులుగా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.‘కొండా’ అనుచర వర్గంలో మౌనంతాజా పరిణామాల తర్వాత కొండా సురేఖకు మద్దతుగా ఉండే నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా బహిరంగ ప్రకటనలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీనిని మొత్తం అనుచరవర్గం మౌనంగా ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న వాతావరణంగా చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అనుచరుల రాజకీయ వైఖరి కూడా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉండే అవకాశముంది. భవిష్యత్తులో ఏదైనా కీలక రాజకీయ నిర్ణయం వస్తే.. స్థానికంగా ఆమె వెంట ఎవరెవరు నిలుస్తారన్నది అప్పుడే స్పష్టం కానుంది. దీంతోపాటు కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా సురేఖకు ఇప్పుడు ప్రధాన సవాలు పార్టీ బయట కంటే సొంత పార్టీలోనే తన రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. కాంగ్రెస్లోనే ఉంటూ రాజకీయ బలాన్ని పునర్నిర్మించుకోవడమా? పార్టీలోని విభేదాలను అధిష్టానం దష్టికి తీసుకెళ్లడమా? వరంగల్ తూర్పులో తన కేడర్ను మరింత బలోపేతం చేసుకోవడమా? వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి తదుపరి రాజకీయ చర్యలతోనే స్పష్టం కానుంది. -
త్వరలోనే కేబినెట్లో భారీ మార్పులు?
సాక్షి, చెన్నై: శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం తమ మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కొన్ని నెలలుగా మంత్రుల పరిపాలనా సామర్థ్యం, పనితీరుపై చేయించిన సర్వేలు, అంతర్గత విచారణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో రాణించని వారికి, వివాదాల్లో చిక్కుకున్న వారికి పదవుల నుంచి ఉద్వాసన పలికి , సమర్థులైన కొత్తవారికి కీలక శాఖలు అప్పగించేందుకు సీఎం విజయ్ ప్రణాళికలు రచిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో మరింత వేగం పెంచేందుకు పరిశ్రమల శాఖనుఅధవ్ అర్జునకు అప్పగించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే, పాఠశాల విద్యా శాఖను అనుభవడైన సెంగోట్టయాన్కు అప్పగించవచ్చని భావిస్తున్నారు.మంత్రి రాజ్ మోహన్కు ఇతర ముఖ్య బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే, పరిశ్రమల మంత్రి కీర్తనకు మానవ వనరుల అభివృద్ధిశౠఖను అప్పగించే యోచనతో పాటుగా మరి కొందరి స్థానాలు కదిలించే దిశగా టీవీకే నాయకత్వం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు విశ్వనాథన్, రాజేష్ కుమార్ శాఖల్లో సైతం మార్పులు ఉంటాయని తెలుస్తోంది. చదవండి: యోగి సర్కార్కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం! -
నోరుపారేసుకుంటే మంత్రి పదవి ఇస్తారని ఆశ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘కాళింగ సామాజిక వర్గం తరఫున ఎవరికీ కేబినెట్లో చోటు దక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డారు. కింజరాపు ఫ్యామిలీలోనే ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేశారు. చంద్రబాబుపై ఆ సామాజిక వర్గమంతా గుర్రుగా ఉంది. కూన రవికుమార్ను చంద్రబాబు పట్టించుకోలేదు.’ ఇదీ కూన రవికుమార్పై ఆ పార్టీలోని కాళింగ సామాజిక వర్గంలో ఉన్న సానుభూతి. ఆ సానుభూతిని దాటి చంద్రబాబు దృష్టిలో మరింత పడేందుకు కూన రవికుమార్ ఆపసోపాలు పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి వీరావేశం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా జెడ్పీ సమావేశాల్లో సైతం జెడ్పీటీసీలు గొంతెత్తాల్సిన చోట కూన రవికుమార్ పెద్ద ఎత్తున గొంతెత్తి అంతెత్తున లేస్తున్నారు. ప్రతిపక్షంలో దారుణాలెన్నో.. కూన రవి నోటి దురుసు గురించి జిల్లాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సంబంధించి ఆడియో, వీడియోలు సంచలనం రేపాయి. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో కోవిడ్ నిబంధనల మేరకు కొందరే రావాలని పోలీసు అధికారులు అన్నందుకు ‘జాగ్రత్త.. శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్థాయి ఎంత.. మీరు ఎంత’ అని నరసన్నపేట సీఐ, ఎస్లను ఉద్దేశించి నోరు పారేసుకున్నారు. పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే ‘నేను ఖాళీ చేయను, నువ్వు మర్యాదగా బీహేవ్ చేస్తే ఫర్వాలేదు, నువ్వేగాని అక్కడేమైనా చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది’ అని బెదిరించారు. పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను’ అంటూ బెదిరించారు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే ‘కుర్చీలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా’ అని పంచాయతీ కార్యదర్శులను భయపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీపై ‘నీకెంత ఒల్లు బలిసిందిరా.. నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్పై ‘పట్టుకున్న వాహనాలు విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను.’ అంటూ విరుచుకుపడ్డారు. ‘నా ఇంటి లోపలకు నువ్వు పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగకొట్టకపోతే చూద్దువుగాని..’ అంటూ శ్రీకాకుళం టూటౌన్ పోలీసులపై జులుం చూపించారు. అధికారంలోకి వచ్చినా.. అధికారం దక్కాక కూడా కూన తీరు మారలేదు. ప్రెస్మీట్లు, మిగతా సమావేశాలు పక్కన పెడితే జిల్లా పరిషత్ సమావేశాల్లో ఆయన వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. జెడ్పీ సమావేశాల్లో సభ్యులుగా జెడ్పీటీసీలకు చాన్స్ ఇవ్వాలి. కానీ కూన రవికుమార్ ఎవరినీ మాట్లాడనివ్వకుండా ఆయనే మాట్లాడుతున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. పెద్ద పెద్ద అరుపులు, కేకలతో జెడ్పీ దద్దరిల్లిపోతోంది. గొడవకు వచ్చారా అన్నట్టుగా మాట్లాడుతుండడంతో కూన రవికుమార్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కరుణిస్తారో లేదో గానీ ఈ అరుపులతో విమర్శలకు కేంద్ర బిందువు అవుతున్నారు. చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు -
యోగి సర్కార్కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం!
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ.. ఓ కీలక భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, విద్యార్థి ఉద్యమ సంస్థ సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా భేటీ కావడంతో యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనా? లేక ఎన్నికల ముందు యువతను కేంద్రంగా చేసుకుని అఖిలేష్ కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీశారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.ఇక, అఖిలేష్తో సీజేపీ ప్రతినిధి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరి మధ్య లక్నోలో జరిగిన భేటీ దాదాపు 90 నిమిషాల పాటు సాగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సమావేశం తర్వాత ఇరువైపుల నుంచి పెద్దగా వివరాలు బయటకు రాకపోవడంతో.. అసలు ఏం చర్చించారు? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎన్నికల ముందు అఖిలేష్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారా? సీజేపీ ద్వారా యూపీలో విద్యార్థి శక్తిని ఏకం చేయబోతున్నారా? ఈ భేటీ వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఇప్పుడు యూపీ రాజకీయాల్లో ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇప్పటివరకు ఎస్పీ-సీజేపీ మధ్య ఎలాంటి అధికారిక రాజకీయ పొత్తు లేదా అవగాహన ప్రకటించలేదు.టార్గెట్ యూపీనా?సీజేపీ ఇటీవల విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలపై ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. పరీక్షల వ్యవస్థ, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలపై ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని పరిశీలించే ‘School Thik Karo’ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో అఖిలేష్తో రంకా భేటీ కావడంతో.. సీజేపీ తన విద్యార్థి ఉద్యమాన్ని యూపీలో విస్తరించేందుకు సిద్ధమవుతోందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.యువ ఓటర్లపై అఖిలేష్ కన్ను?యూపీ రాజకీయాల్లో యువత, విద్యార్థులు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఉద్యోగాలు, పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థ వంటి అంశాలను అఖిలేష్ యాదవ్ కూడా తరచూ ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో యువతలో ప్రభావం పెంచుకుంటున్న ఓ ఉద్యమ సంస్థతో సంప్రదింపులు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదీ చదవండి: ‘విజయ్ ఫర్ పీఎం’.. కాంగ్రెస్కు టీవీకే మరో షాక్!అయితే, సీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? సమాజ్వాదీపార్టీతో కలిసి పనిచేస్తుందా? లేక కేవలం విద్యార్థి సమస్యలపై మాత్రమే సహకారం ఉంటుందా? అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు.. వీరి భేటీపై బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి ఈ పరిణామాన్ని విమర్శిస్తూ సీజేపీ ఉద్యమం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఈ రకమైన సంప్రదింపులను స్వాగతించింది. దీంతో ఈ భేటీ కేవలం విద్యార్థి సమస్యలపై చర్చకే పరిమితమా.. లేక యూపీలో కొత్త రాజకీయ కూటమికి తొలి సంకేతమా? అన్న ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది. -
మంత్రివర్గంలోకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్?
గాంధీ భవన్ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు ఒకటే ఉత్కంఠ! కొండా సురేఖ బర్తరఫ్తో ఖాళీ అయిన మంత్రి స్థానం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకవర్గాల సమరానికి సిద్ధమవుతున్న వేళ..రాజధాని ప్రాంతం సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అనివార్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఏర్పడింది. ఇప్పటికే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో కలిపి భర్తీ చేయాల్సిన బెర్త్ల సంఖ్య మూడుకు చేరింది.సాక్షి, హైదరాబాద్: నగర పాలక సంస్థల సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పారీ్టకి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కేబినెట్ బెర్తులపై చర్చ తీవ్రమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, పరిసర రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్కు ఆశించిన స్థానాలు దక్కకపోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, రాబోయే గ్రేటర్ పోరులో గులాబీ, కాషాయ దళాల హోరాహోరీని తట్టుకుని జెండా పాతాలంటే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో బలమైన ప్రాతినిధ్యం తప్పనిసరైంది. ఎమ్మెల్సీ అజహరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకున్నప్పటికీ, స్థానిక రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి క్యాడర్ను మెప్పించే బలమైన నేతలకు పీఠం దక్కలేదనే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ..ఇప్పుడు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కేబినెట్ విస్తరణను ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. కేబినెట్æలో రాజధాని బెల్ట్కు చోటు దక్కితేనే పార్టీకి మైలేజ్ వస్తుందనే రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి.జెన్–జీ ప్లస్ బీసీ ఫార్ములాలో... జెన్–జీ ప్లస్ బీసీ ఫార్ములాలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, యువ నేత నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఆమె ఖాళీ చేసిన స్థానాన్ని తిరిగి బీసీ వర్గంతోనే భర్తీ చేసేవిధంగా ఒత్తిడి అధిష్టానంపై వచ్చే అవకాశం లేకపోలేదు. జెన్–జీ కోటాలో యువకుడైన నవీన్ యాదవ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే..ఒకవైపు బీసీ కోటా, జెన్జీ రాజకీయ ప్రాధాన్యతపై సముచిత నిర్ణయమవుతుందని కొందరు వాదిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే సమయంలో అధిష్టానం ఆయనకు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా కల్పించడంపై సాంకేతిక, న్యాయపరమైన చిక్కులతో పాటు పాత కాంగ్రెస్ నేతల నుండి వస్తున్న నిరసనలను అధిష్టానం ఎలా సమన్వయం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.శివారులో అసంతృప్తి జ్వాలలు రాష్ట్ర రాజధానికి ఆనుకుని, అత్యధిక జనాభా, నియోజకవర్గాలు కలిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో సరైన ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి స్థానిక నాయకత్వంలో నెలకొని ఉంది.. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి వంటి సీనియర్ నేతలు ఇప్పటికే కేబినెట్ చోటు దక్కలేదనే ఆసంతృప్తి వ్యక్తం చేస్తూనే..సాక్షాత్తు ఏఐసీసీ పెద్దల వద్ద సైతం మొరపెట్టుకున్నారు. మరొకవైపు శాసనసభ స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించకపోతే గ్రేటర్ చుట్టుపక్కల అర్బన్–రూరల్ నియోజకవర్గాల్లో పారీ్టకి ఇబ్బందులు తప్పవని జిల్లా నేతలు హెచ్చరిస్తున్నారు.హైకమాండ్ కోర్టులో బంతి ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం పూర్తిగా పార్టీ అధిష్టానం వద్దే తేలాల్సి ఉంది. ఒకవైపు పార్టీలోని సీనియర్ నేతల ఆశలు, మరోవైపు కొత్తగా చేరిన నాయకుల అంచనాలు, వీటితో పాటు సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి కత్తిమీద సాములా మారింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ విస్తరణ ఉండవచ్చనే ప్రచారంతో గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని బలపరచే దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తారా? లేక జిల్లా సీనియర్లు, బీసీ వర్గాలు నగర కీలక నేతల మధ్య సమతుల్యత పాటిస్తూ నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్ -
సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు
సాక్షి, విజయవాడ: ఏపీలో రెడ్బుక్ అరాచకాలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను కూటమి సర్కార్ బ్లాక్ చేయించింది. వాస్తవాలు ప్రసారం చేసిన సాక్షి సోషల్ మీడియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. సాక్షి ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లను బ్లాక్ చేయించిన చంద్రబాబు సర్కార్.. డీఎస్సీ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేయడంతో వణుకు పోతోంది.సాక్షి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు మరికొన్ని సోషల్ మీడియా అకౌంట్లపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది. టీడీపీ ఫేక్ అకౌంట్లు, ఏపీ సైబర్ క్రైమ్తో కలిసి కుట్రలు చేస్తోంది. ఇప్పటికే సాక్షి సోషల్ మీడియాపై కూటమి సర్కార్ పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును చంద్రబాబు సర్కార్ కాల రాస్తోంది. ఏపీ సర్కార్ కుట్రలపై సాక్షి మీడియా న్యాయ పోరాటం చేస్తోంది.అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అడుగడుగునా అక్రమ కేసులు పెట్టించిన సంగతి తెలిసిందే. అవసరం లేకపోయినా విచారణలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరించేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇదీ చదవండి: మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ -
కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరం
సాక్షి, న్యూఢిల్లీ: కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమని..అయితే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని శబరి బ్లాక్లో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై హైకమాండ్ సమానంగా చర్యలు తీసుకుందని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పారు. ‘కూతురు సుస్మిత తెలిసి చేసినా తెలియక చేసినా.. సీఎం రేవంత్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించాల్సింది. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండేది. అలా చేయలేదు కాబట్టే ఏఐసీసీ ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది’అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బ్లాక్మెయిల్ చేసే అవసరం లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖ పార్టీలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. గతంలో కొండా సురేఖపై రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు స్వయంగా సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి సర్దిచెప్పానని మహేశ్గౌడ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపట్ల అంత కఠినంగా కూడా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మహేశ్గౌడ్ ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితం కాకుండా అసెంబ్లీకి వచ్చి తన అనుభవాలను పంచుకోవాలని, ప్రతిపక్ష నేతగా తన వాదనను వినిపించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ విస్తరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మంత్రి కావాలని కోరుకోవడం సహజమే అయినా అందరికీ ఒకేసారి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్నో సమీకరణాలు ఉంటాయని చెప్పారు. -
తొలగింపుపై తాపత్రయం
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం అధికార కాంగ్రెస్లో కొత్త కోణం తెరపైకి వస్తోంది. ఈ విషయంలో అధిష్టానానికి నచ్చజెప్పి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభీష్టానికి అనుగుణంగా హైకమాండ్ను ఒప్పించడంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతల సహకారం ఉందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడిన ఓ నాయకుడు, ప్రభుత్వంతో సమాంతరంగా పార్టీకి అధికారాలు కావాలని పోరాట బాటపట్టిన మరో నాయకుడు ఏకాభిప్రాయంతో ఈ ఎపిసోడ్లో కీలకపాత్ర పోషించారని.. ఇందులో స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా దాగి ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. మరో విషయం ఏమిటంటే సురేఖకు ఖర్గే అపాయింట్మెంట్ ఇప్పించడంలో తెరవెనుక పాత్ర పోషించిన అధిష్టాన దూత ఒకరు.. ఈ వ్యవహారం ఢిల్లీకి మారాక మౌనం దాల్చారని.. ఆయన మౌనముద్రతోనే జరగాల్సిందంతా సజావుగా జరిగిందనే చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. మొదటి నుంచీ ఆయన చుట్టూనే.. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే సీఎం రేవంత్కు ఢిల్లీ వేదికగా సహకరించిన కీలక నేత ఒకరి చుట్టూనే రాజకీయమంతా తిరిగింది. ఒకదశలో సురేఖ ఎపిసోడ్పై కమిటీ వేస్తారని.. ఈ కమిటీకి ఆయనే నేతృత్వం వహిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. ఆయన క్యాంపు కార్యాలయంలోనే కీలక నేతల సమావేశాలు, తర్జనభర్జనలు జరిగాయి. ఆ సమయంలోనే ఆయన తన వైఖరిని సురేఖ శిబిరానికి కుండబద్దలు కొట్టి చెప్పారని సమాచారం. ఆ తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు కూడా తన వైఖరిని వెల్లడించారని.. ఓ దఫా ఆయనకు ఆశించిన సమ్మతి లభించకపోయినా ఎపిసోడ్ ఢిల్లీకి బదిలీ అయ్యాక ఏఐసీసీలో ఉండే మరో ముఖ్యుడి సహకారంతో ఆయన అధిష్టానం పెద్దలకు నచ్చజెప్పగలిగారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఆ కీలక నేత మంతనాల నేపథ్యంలో సురేఖ తొలుత బెంగళూరులో, ఆ తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినప్పుడు ఆయన స్వరంలో మార్పు కనిపించిందని అంటున్నాయి. ఇక పార్టీలోని ఓ ముఖ్య నేత సహకారం ఈసారి సీఎం రేవంత్కు లభించిందని తెలుస్తోంది. ఇటీవల పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగిన సందర్భంలో రేవంత్ వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆ నాయకుడు సురేఖ వ్యవహారంలో మాత్రం రేవంత్ అనుకూల శిబిరంలో కీలకపాత్ర పోషించారని సమాచారం. ఆయన కూడా సీఎం నిర్ణయానికి అడ్డుచెప్పకుండా తలూపారని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు కలిసి పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలను నియంత్రించాలంటే నిర్ణయం తప్పనిసరిని చెప్పి అధిష్టానానికి నచ్చజెప్పారని తెలుస్తోంది. ఆ ఇరువురి సహకారానికి తోడు అధిష్టాన దూత ప్రేక్షకపాత్ర పోషించడం, సీఎం సైతం ఒత్తిడి తేవడం వెరసి అధిష్టానం సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని.. ఈ నేపథ్యంలోనే సురేఖ పక్షం వహించిన మరో ముఖ్య నేత వాదనకు ప్రాధాన్యం ఇవ్వలేదని సమాచారం. అయితే తనకు సహకరించిన ఆ ఇద్దరు నేతల విషయంలో సీఎం రేవంత్ భవిష్యత్ వైఖరి ఎలా ఉంటుంది? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వారికి ప్రాధాన్యం ఉంటుందా? శాఖల మార్పుపై ప్రభావం చూపుతుందా? అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ‘అనుబంధం’కొనసాగుతుందా? అనేది వేచిచూడాల్సిందే! అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక హస్తినకు మరోసారి సీఎం! సురేఖ ఉద్వాసన నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల మార్పు గురించి చర్చించేందుకు వీలైనంత త్వరగా కబురు చేస్తామని ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. అందుకే ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని.. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక సీఎం రేవంత్తోపాటు పార్టీలోని ఇతర ముఖ్యులు హస్తినకు వెళ్లి కేబినెట్ ప్రక్షాళనపై హైకమాండ్తో చర్చిస్తారని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖకు తెలంగాణ ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవలే ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించిన సర్కార్, తాజాగా ఆమెకు కల్పించిన భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో పాటు ఆమెకు కేటాయించిన 4+4 గన్మెన్ల భద్రతను కూడా పూర్తిగా రద్దు చేసింది.కేబినెట్ నుంచి బర్తరఫ్తో పాటు భద్రతను కూడా తొలగించడంతో హనుమకొండలోని ఆమె నివాసం వద్ద ఉన్న పోలీస్ సెక్యూరిటీని అధికారులు వెంటనే వెనక్కి తీసుకున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు కొండా సురేఖ అనుచరులు, మద్దతుదారుల్లో ఈ పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 👉ఇదీ చదవండి: ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’ -
నిశాంత్జీ.. 7లక్షల గోల్డ్ చైన్ దొరికేనా?..వీడియో వైరల్
పాట్నా: బిహార్ ముజఫర్పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నిశాంత్ కుమార్ పర్యటన సందర్భంగా ఒకవైపు కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతుంటే, సందట్లో సడేమియా అన్నచందంగా అదే గుంపులో ఉన్న అగంతకుడు హస్తనైపుణ్యం ప్రదర్శించాడు. జేడీయూ నేత మెడలోని ఖరీదైన బంగారు గొలుసును కాజేశాడు. ముజఫర్పూర్ జిల్లాలోని సక్రీ చౌక్ వద్ద మంత్రి నిశాంత్ కుమార్కు స్వాగతం చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంత్రి వాహనం రాగానే ఆయనకు పూలమాలలు వేసేందుకు పార్టీ శ్రేణులు ఎగబడ్డారు. ఈ క్రమంలో జేడీయూ స్థానిక నాయకుడు రాజేష్ మౌర్యకూడా మంత్రికి మాల వేయడానికి నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు.మంత్రికి పూలమాల వేసి పక్కకు వచ్చాక తీరిగ్గా మెడపై చేయి వేసి చూసుకుంటే నాయకుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి! ఆయన మెడలో ఉన్న దాదాపు 34 గ్రాముల బరువు, రూ. 7 లక్షల విలువైన బంగారు గొలుసు కనిపించకుండా పోయింది.హడావుడి తగ్గాక రోడ్డుపై, చుట్టుపక్కల ఎంత వెతికినా గొలుసు దొరక్కపోవడంతో సదరు నాయకుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్థానిక తుర్కీ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీఐపీ మూవ్మెంట్ సమయంలో తీసిన వీడియో ఫుటేజీలతో పాటు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే దొంగను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. मंत्री निशांत कुमार को माला पहनाने गए थे… चोर ने गले से 7 लाख की चेन चुरा ली… मंत्री जी का तो स्वागत हो गया… नेताजी बेचारे अब स्वागत लायक नहीं बचे📍 मुजफ्फरपुर, बिहार pic.twitter.com/7PvYE9l5DN— Romita Tiwari (@romita_tiwari) September 4, 2026 -
‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం’
హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖ రాజకీయ భవిష్యత్పై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్రెడ్డి స్పందించారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కొండా సురేఖను బీఆర్ఎస్లోకి ఆహ్వానించే ప్రసక్తే లేదన్నారు. కొండా సురేఖను కనీసం తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమన్నారు జగదీష్రెడ్డి. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దని తప్ప ఎవరినీ తీసుకోమన్నారు. ఎమ్మెల్యేల క్యారకర్ట్ ఆధారంగా వాళ్లు వస్తామంటే తీసుకుంటామన్నారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు బిఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకోము. ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామంటే తీసుకోలేదు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ జరుగుతుంది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడు పోయినట్టే’ అని పేర్కొన్నారు. కొండా సురేఖ బర్తరఫ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు -
కొండా సురేఖ బర్తరఫ్పై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
మహబూబ్నగర్: కొండా సురేఖ బర్తరఫ్ అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ మంత్రిపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలే కొండా సురేఖ బర్తరఫ్కు కారణమన్నారు. కొండా సురేఖ సీనియర్ నాయకురాలని, వైఎస్సార్ మంత్రి వర్గంలో ఇద్దరం కలిసి పని చేశామన్నారు. ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖను బాధ్యరాలిని చేసి బర్తరఫ్ చేయడమనేది మంచి పరిణామం కాదన్నారు. వికారాబాదు జిల్లా మర్పల్లిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కొండా సురేఖ బర్తరఫ్పై స్పందించారు. ‘సీఎం రేవంత్రెడ్డి రాఖీ కట్టించుకున్నాడు.. గొంతు పిసికిండు’ అని ఆమె విమర్శించారు. తనను నమ్ముకున్న మహిళలను అసెంబ్లీలో ముందు వరుసలో కూర్చోబెట్టిన అని చెప్పిన సీఎం రేవంత్.. ఇప్పుడు మాత్రం గొంతు పిసికిండు అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి:మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ -
'ఇది బీజేపీ పనే, సీసీటీవీ ఫుటేజీ ఇదిగో'
కోల్కతా: బెంగాల్ రాజధాని కోల్కతాలోని కామాక్ స్ట్రీట్లో ఉన్న టీఎంసీ కార్యాలయంపై దుండగులు దాడి చేశారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తముందన్నారు. ‘విధ్వంసం, హింస, అరాచకం.. బీజేపీ కార్యకర్తలకు చట్టం, న్యాయవ్యవస్థ అంటే లెక్కలేనట్లుగా కనిపిస్తోంది’ అని అభిషేక్ వ్యాఖ్యానించారు. నెల రోజుల వ్యవధిలోనే బీజేపీ గూండాలు కోల్కతాలోని అమ్తాలా, కామాక్ స్ట్రీట్ పార్టీ కార్యాలయాలను నాశనం చేశారన్నారు. కోల్కతా పోలీసులు తమ ఫోన్కాల్స్కు, ఈమెయిల్స్కు దాడి జరిగిన రెండు గంటల వరకు స్పందించలేదని అభిషేక్ ఆరోపించారు.గురువారం వేకువజామున 4.30 గంటల వేళ దుండగులు మాస్క్లు, హెల్మెట్లు ధరించి కార్యాలయంలోకి జొరబడ్డారని, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి, లోపలున్న ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారన్నారు. సిబ్బంది వద్ద సెల్ఫోన్లు, లోపలున్న టీవీలను ఎత్తుకుపోయారని చెప్పారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.అభిషేక్ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య కొట్టిపారేశారు. తాము ప్రతీకార రాజకీయాలకు పాల్పడబోమని, పార్టీ కార్యాలయాలపై దాడులకు మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. ఈ విధ్వంసంతో బీజేపీ కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కాగా, టీఎంసీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు వీరు టీఎంసీలోనే ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు.బీజేపీ నేతల ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తాం: మమతా బెనర్జీ కామాక్ స్ట్రీట్ టీఎంపీ కార్యాలయంపై దాడిని మాజీ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. టీఎంసీ నేతలు, కార్యాలయాలపై ఇదే విధంగా దాడులు కొనసాగిన పక్షంలో తాము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఢిల్లీలోని బీజేపీ నేతల నివాసాల ఎదుట ధర్నాకు దిగుతామని ఆమె హెచ్చరించారు. కామాక్ స్ట్రీట్ కార్యాలయంలోని పరికరాలు, పత్రాలను బీజేపీ మనుషులు ఎత్తుకుపోయారన్నారు. ఇదంతా కోల్కతా పోలీసులకు తెలిసే జరిగిందన్నారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగుజారుతున్నాయనేందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ అని చెప్పారు. బెంగాల్లో బీజేపీ అరాచకత్వానికి తెరతీసిందని మమత విమర్శించారు.This is what the BJP has done to my party office in the early hours of this morning.Will the Governor of WB act? Will the Union Home Minister act? Will the PMO act? Or will they continue to look the other way?It is high time the judiciary, particularly the Calcutta High… pic.twitter.com/SLNwNQ6u7k— Abhishek Banerjee (@abhishekaitc) September 3, 2026ఇదీ చదవండి: కాక్రోచ్ జనతాపార్టీలో తిరుగుబాటు -
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టింది మెగా డీఎస్సీ కాదని, యువగళం డీఎస్సీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసిన పాపాలను ఎల్లకాలం దాచిపెట్టలేరని, రోజుకో నిజం బయటపడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న డీఎస్సీ అక్రమాలపై శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తమ అనుచరులకు, కార్యకర్తలకే స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారు. కనీసం టెట్ అర్హత సాధించని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను కఠినంగా వర్తింపజేస్తూ, తమ యువగళం టీచర్లకు మాత్రం ఎలాంటి అర్హతలూ లేకపోయినా మినహాయింపు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.కర్నూలు జిల్లాలో ప్రారంభమైన ఈ అక్రమాల డొంక ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకూ విస్తరిస్తోంది. కౌతాళం మండలంలోనే ఏకంగా 24 మంది, ఒకే చోట ఐదుగురు స్పోర్ట్స్ కోటా టీచర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఆదరణ లేని జూడో ఆట పేరుతో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి దాదాపు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలో కేవలం 79 మార్కులు వచ్చిన వారికి, తూర్పు గోదావరి జిల్లాలో అసలు అర్హతే లేని వారికి నియామకాలు చేపట్టారు. ఇటువంటి ఉపాధ్యాయులు రేపటి తరం పిల్లలకు ఏం పాఠాలు చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) పూర్తిగా అవినీతి అడ్డాగా మారింది. క్రీడా సర్టిఫికేట్లను కనీసం వెరిఫికేషన్ చేయకుండా నియామకాలు ఎలా పూర్తి చేస్తారని పేర్ని నాని మండిపడ్డారు.చంద్రబాబు, లోకేష్లకు ధైర్యముంటే స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన టీచర్ల జాబితాను, వారి సర్టిఫికేట్లను వెంటనే బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. మెగా డీఎస్సీలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, ఈ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం మరో డీఎస్సీ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తాజా మాజీ మంత్రి, వరంగల్ తూర్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. “నిరీక్షణ ముగిసింది.. అతిత్వరలో ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తా.. చూస్తూనే ఉండండి.. తెలంగాణ!” అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఈ ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై కాసేపటికే ఆమె మరో ప్రకటన చేశారు. ఈ పోస్టు వైరల్ అవుతూ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ ఫేస్బుక్ అకౌంట్ తనది కాదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవం. మా పేరిట జరుగుతున్న ప్రచారాలకు మాకు సంబంధం లేదు అంటూ ఆమె నుంచి ఓ ప్రకటన వెలువడింది. “త్వరలో పెద్ద అప్డేట్” అంటూ సురేఖ పేరిట వచ్చిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె ఏదైనా క్లారిటీ ఇస్తారా? అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఆమెను రెండు పార్టీలు సంప్రదించాయని.. ప్రాంతీయ పార్టీ వైపు ఆమె మొగ్గు చూపిస్తున్నారని వరంగల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో ముదిరిన పంచాయితీ.. సురేఖను బర్తరఫ్ చేసేదాకా వెళ్లింది. మరీముఖ్యంగా మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించిన తర్వాత వరంగల్ రాజకీయాల్లోనూ చర్చ ధారి తీసింది.ఇదీ చదవండి: కొండాను ఒంటరి చేయడంలో సక్సెస్! -
విజయసాయి మాట ఎందుకు మార్చారు?
మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ఏదో తెలియని ఆందోళనతో, ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమి చెప్పాలో అర్థంకాకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుంది. వైఎస్సార్సీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విజయసాయి సడన్గా ఎంపీ పదవి వదలుకోవడం, పార్టీని సైతం వీడడం సంచలనం అయింది. ఇందులో ఏమి మతలబు ఉందా అన్న చర్చ జరిగింది. కాని ఆయన మాత్రం తాను వ్యవసాయం చేసుకుంటానని, రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో ప్రకటించారు. చాలామంది ఆయన మాటకు కట్టుబడి ఉంటారేమోలే అని సరిపెట్టుకున్నారు.కాని కొంతకాలం గడిచే కొద్ది ఆయనలో మార్పు రావడం ఆరంభం అయింది. తొలుత అక్కడక్కడ కామెంట్లు చేయడం, తదుపరి వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం, ప్రత్యేకించి వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పించడం అందరిని విస్మయపరిచింది. రాజకీయ పార్టీలలో నేతల మధ్య తెలియని స్పర్ధ ఉంటుంది. అయినా పార్టీలో ప్రధాన నాయకుడిని చూసి సర్దుకుపోతుంటారు. పైగా విజయసాయికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్ద లభించిన ప్రాధాన్యత చాలా ఎక్కువే. పార్టీలో పలువురికి దీనిపై కాస్త అసంతృప్తి ఉన్నా ఎవరూ పైకి మాట్లాడలేదు.ప్రత్యేకించి విశాఖపట్నం ఇన్చార్జీగా ఉన్న సమయంలో ఈయనపై ఎల్లోమీడియా విపరీతమైన వ్యతిరేక వార్తలు ఇచ్చేది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడుకూడా ఈయన టార్గెట్గానే ఉండేవారు. ఈయన బందువులు విశాఖలో స్థలం కొనుగోలు చేసినా ఎల్లోమీడియాలో ఆరోపణలు వచ్చేవి. చివరికి ఆయనపై ఎంత నీచమైన అభియోగాలు మోపింది అందరికి తెలుసు. టీడీపీ మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ విజయసాయి మీడియా సమావేశాలు పెట్టేవారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా మొదటి పేజీతో పాటు, లోపలి పేజీలో పెద్ద ఎత్తున పరచిందంటే అందులో ఉన్న మతలబు అర్థం చేసుకోవచ్చు.ఆ రకంగా చూస్తే విజయసాయి తనకు ఇంత ప్రచారం ఆ మీడియాలో వస్తోందని సంతోషిస్తున్నారేమో తెలియదు కాని, అది పులిమీద స్వారీలాంటిదే అని తెలుసుకోగలగాలి. నిజంగానే ఆయన చెబుతున్నట్లు కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత కూడా తన విధానాలపై ప్రచారం చేసుకుంటే ఫర్వాలేదు. అధికారంలో ఉన్న టీడీపీ, జనసన, బీజేపీ కూటమి విధానాలను వ్యతిరేకిస్తారో, మద్దతు ఇస్తారో చూడాల్సి ఉంది. ఒకవేళ మద్దతు ఇస్తే ఆయన అసలు లక్షణం బయటపడుతుంది.ప్రభుత్వ విధానాలలోని మంచి, చెడులపై వ్యాఖ్యానిస్తే తప్పు కాదు. కూటమి ప్రభుత్వంపై కాకుండా వైఎస్సార్సీపీపైనే దృష్టి కేంద్రీకరిస్తే, టీడీపీకి పరోక్ష మద్దతు ఇవ్వడానికే ఈ రెండేళ్లుగా రాజకీయం నడిపారని జనం అనుకుంటారు. అంటే టీడీపీ ట్రాప్లో విజయసాయి పూర్తిగా చిక్కుకున్నట్లు అవుతుంది. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిపైన కాని, ఆయన సమీప బంధువులపై కాని కూటమి ప్రభుత్వం పలు కేసు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి యత్నించింది. దానికి తోడు విశాఖలో ఈయన అనుచరులు భూ దందాలకు పాల్పడ్డారని పదే, పదే ప్రచారం చేశారు. అప్పటికే మద్యం కుంభకోణాన్ని సృష్టించి అందులో పలువురిని అరెస్టు చేశారు. విజయసాయి పేరు కూడా కేసులో చేర్చారు.ఈ కేసుల బెడద, ఎల్లోమీడియా దాడి భరించలేకే ఈయనలో బాగా మార్పు వచ్చిందా అన్నది కొందరి అనుమానం. ఆ కేసులో ఉన్న ఇతర నిందితులు కొందరితో ఆయన వివాదపడుతున్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. మొత్తం మీద ఏ రకంగా మేనేజ్ చేసుకున్నారో కాని చంద్రబాబు ప్రభుత్వం ఐదో నిందితుడుగా ఉన్న ఆయన జోలికి వెళ్లలేదు. ఆ క్రమంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేయడం, దానిని టీడీపీ చేజిక్కించుకోవడం వంటివి జరిగాయి.ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?ఈ నేపథ్యంలో విజయసాయి తాజాగా చేసిన ప్రకటనలు సహజంగానే అందరికి సందేహాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మత మార్పిడులను జగన్ ప్రోత్సహించారంటూ దారుణమైన ఆరోపణ చేయడం ఆయనకే చెల్లింది. అదే నిజమైతే ఈయననే మార్చి ఉండాలి కదా అన్న విమర్శకు బదులు లేదు. జగన్ అధికారంలో ఉండగా, అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఈపాటికి కూటమి ప్రభుత్వం ఎంత యాగీ చేసేదో కదా! పైగా హిందూ ధర్మపరిరక్షణకు అవసరమైన అనేక చర్యలు జగన్ తీసుకున్నారు. విజయసాయి చేసిన ఈ విమర్శపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈసారి బహరంగ లేఖ పేరుతో సజ్జలపై విరుచుకుపడే యత్నం చేశారు. ఆయన పార్టీలో నెంబర్ వన్గా ఉన్నారంటూ జగన్ను తగ్గించే యత్నం చేశారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందో లేదో ఆయనకు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు ఆ ఫీలింగ్ ఉంటే అప్పుడే బయటకు వచ్చి ఉండవచ్చు లేదా ఓపెన్ అయి ఉండవచ్చు. అలాకాకుండా ఎన్నికలలో ఓటమి ఎదురయ్యాక మాట్లాడడమే అభ్యంతరం అనిపిస్తుంది. సజ్జలపై కేసులు రాలేదని ఆయన చెబుతున్నారంటే దాని అర్థం టీడీపీతో కుమ్మక్కైనట్లు కాదు.నిజానికి సజ్జలపైన, ఆయన కుమారుడు భార్గవపైన పలు కేసులను ప్రభుత్వం పెట్టింది. వాటిలో పలు పిచ్చి కేసులు ఉన్నాయి. లుక్ అవుట్ నోటీసుల వరకు వెళ్లింది. అయితే వాటన్నిటిపైన న్యాయపోరాటం చేసి స్టేలు తెచ్చుకున్నారు. అంతే తప్ప విజయసాయి మాదిరి భయపడి పోలేదని అనుకోవాలి. ఒకప్పుడు విజయసాయికి ఉన్న ధైర్యం ప్రస్తుతం లేకుండా పోయిందని అనుకోవాలి. వైఎస్సార్సీపీ కార్యకర్తల మాదిరి పోరాడే శక్తిని ఆయన కోల్పోయారని భావించాలి. సజ్జల వల్ల తాను పార్టీని వీడడం లేదని గతంలో చెప్పిన విజయసాయి మాట మార్చి, ఏకంగా తనపై భౌతిక దాడి జరిగిందని, 74 సార్లు అవమానాలు జరిగాయని ఆరోపించేవరకు వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తుంది.అది నిజమే అయితే, ఆనాడే ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి ఉండాల్సింది కదా! అప్పుడే పదవులను వదలుకుని ఉండాలి కదా!అధికారం కోల్పోయాక చేసే ఆరోపణలకు విలువ ఏమి ఉంటుంది. ఆయన ప్రతిష్ట దెబ్బతినడం తప్ప. తనను ఎన్నో విధాలుగా వేధించిన ఎల్లో మీడియాకు అస్త్రంగా మిగలడం తప్ప. ఆయన వ్యాఖ్యలు చిన్నపిల్లల చేష్టల మాదిరిగా కనిపిస్తున్నాయి.గతంలో చంద్రబాబుపై, టీడీపీపై విజయసాయి కొన్ని అభ్యంతర పోస్టులు పెట్టడం ద్వారా పార్టీని ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా సీనియర్ నేత కనుక ఎవరూ మాట్లాడలేదు. తనతో పాటు విజయసాయిపై కూడా అక్రమ కేసులు పెట్టారన్న సానుభూతి ఉండబట్టే కదా జగన్ ఈయనను రెండుసార్లు ఎంపీని చేశారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిని చేశారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. కాని వివిధ పరిణామాల నేపథ్యంలో పార్టీలో మార్పులు జరుగుతుంటాయి. ఆ సంగతి ఆయనకు తెలియదా! అయితే ఇప్పటికీ జగన్కు నమ్మక ద్రోహం చేయనని అనడం మంచిమాటే. కాకపోతే టీడీపీ ట్రాప్లో పడి, వారు రాసిచ్చే స్క్రిప్టు చదివే దశకు విజయసాయి వెళితే అది మరింత బురద ఊబిలో కూరుకుపోతున్నట్లే అవుతుందేమో! ఆ సంగతి ఆయన గ్రహిస్తే మంచిదే!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవ పరిస్థితులను.. గణాంకాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాజా అక్షరాస్యత రేటుపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలే ఇంకా వెలువడలేదని, అలాంటప్పుడు పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక ప్రకారం.. ఏపీలో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి అక్షరాస్యత రేటు 72.6 శాతంగా ఉంది. 2018-19లో ఇది 69.1 శాతంగా ఉన్నట్లు వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా ద్వారా వాస్తవాలను బయటపెట్టారు.2025లోనూ తగ్గిందే..2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన పీఎల్ఎఫ్ఎస్ వార్షిక నివేదికలో ఏపీ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా నమోదైందని జగన్ వెల్లడించారు. ఈ నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారని తెలిపారు. దీంతో 2024లో 72.6 శాతం ఉన్న అక్షరాస్యత.. 2025లో 71.4 శాతానికి తగ్గిందని, మరి 2026లో 82.1 శాతానికి ఎలా చేరిందో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.𝗜𝘁’𝘀 𝘀𝗵𝗼𝗰𝗸𝗶𝗻𝗴 𝘁𝗼 𝘀𝗲𝗲 𝘁𝗵𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝘁 𝗼𝗳 𝗺𝗶𝘀𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝗽𝗿𝗼𝗽𝗮𝗴𝗮𝗻𝗱𝗮 𝗯𝘆 𝘁𝗵𝗲 𝗽𝗿𝗲𝘀𝗲𝗻𝘁 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁.The Minister of education claims that the literacy rate increased from 72.6% in 2024 to… pic.twitter.com/6yzdtMCVjV— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026‘ఇది తప్పుడు ప్రచారం’..2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే ఆ ఏడాది అక్షరాస్యత గణాంకాలను కూటమి ప్రభుత్వం ఎలా ప్రకటించిందని జగన్ ప్రశ్నించారు. స్పష్టమైన అధికారిక గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు..ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి మరో ఆందోళనకరమైన అంశాన్ని జగన్ ప్రస్తావించారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్ (UDISE) గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.‘విద్యాశాఖపై దృష్టి పెట్టండి’..విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకోవడంపై కాకుండా శాఖ పనితీరుపై శ్రద్ధ పెట్టాలని జగన్ సూచించారు. ‘రెడ్బుక్ పాలన’పై దృష్టి పెట్టడం కంటే విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడంపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో తీసుకొచ్చిన విధాన మార్పులపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్న జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అక్షరాస్యతపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అసలు మోదీ, పవన్ ఎవరబ్బా? -
‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’
సాక్షిప్రతినిధి, వరంగల్ : పదవులు రావడం.. పోవడం రాజకీయాల్లో సహజమే. కానీ కొందరిని మాత్రం అదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణి పరిస్థితి ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల గ్రేటర్ వరంగల్ మేయర్ పదవినుంచి మాజీ అయిన ఆమెకు.. కొద్ది రోజుల వ్యవధిలోనే మరో కీలక పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ‘కుడా’ (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి ఆమెను వరించింది. టీడీపీలో రాజ్యసభ సభ్యురాలిగా, బీఆర్ఎస్ హయాంలో మేయర్గా ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇప్పుడు ‘కుడా’ చైర్పర్సన్ పదవి వరించింది. కాగా, ప్రస్తుతం ఈ పదవిలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి సుధారాణికి బాధ్యతలు అప్పగించారు.సురేఖ బర్తరఫ్.. సమీకరణాల్లో మార్పుకొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గంనుంచి తప్పించడంతో ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న గుండు సుధారాణికి రాజకీయంగా కీలక పదవులు కొత్తేమీ కాదు. గ్రేటర్ వరంగల్ మేయర్గా పనిచేసిన ఆమె.. ఇటీవల మేయర్ పదవీకాలం ముగియడంతో ఆ పదవికి వీడ్కోలు పలికారు. దీంతో ఇక ఆమె రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ జరుగుతున్న సమయంలోనే మరో కీలక బాధ్యత దక్కడం విశేషం. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణికి ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చిన’ పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆమెకు ‘అదృష్టం మరోసారి వరించింది’ అన్న చర్చ సాగుతోంది. ఇంటివద్ద సంబురాలువరంగల్ చౌరస్తా : కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. గురువారం సాయంత్రం రామన్నపేటలోని సుధారాణి ఇంటి ఎదుట బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. చదవండి: అప్పుడు రాజయ్య.. ఇప్పుడు సురేఖ -
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లాయి. ఇప్పటివరకు కొండా వర్గానికి బలంగా అండగా నిలిచి నేతలు, అనుచరుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. చర్యలు తమదాకా వస్తాయేమో అనే భయంతో కొందరు ఇప్పటికే కొండా వర్గానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత.. వరంగల్ తూర్పులో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని, ఆమె అనుచర గణం హడావిడి చేస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పటిదాకా అలాంటిదేం జరగకపోవడం గమనార్హం. పైగా నిన్నటిదాకా కొండా కుటుంబం పేరు చెప్పుకుని తిరిగిన నేతలు.. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయితే కొండా సురేఖ అనుచరులుగా ఉన్న పలువురికి దక్కిన పదవులు.. అలాగే వాళ్లకు అప్పగించిన ఏజెన్సీలు, ఇతర వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారన్న వార్తలు ఆ వర్గంలో మరింత టెన్షన్ పెంచుతున్నాయి.కొండా సురేఖ బర్తరఫ్తో వరంగల్ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. చర్యల భయంతో ఆమె అనుచర వర్గంలో టెన్షన్ నెలకొనగా.. తమ పదవులు కూడా పోతాయన్న ఆందోళనతో కొందరు సైలెంట్ అవుతున్నారు. ఈ భయంతోనే కొందరు అనుచరులు కొండాకు దూరంగా ఉంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు ఇంతకాలం కొండాకు వ్యతిరేకంగా నిలిచిన తమను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో తమకు రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుందని వారు భావిస్తున్నారు. కొందరు నేతలైతే ఏకంగా సంబురాలు జరుపుకున్నట్లు సమాచారం.మరోవైపు.. తన అనుచరులు ఇబ్బందుల్లో పడకూడదన్న ఉద్దేశంతో కొండా సురేఖ వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో కొందరు నేతలు వేచి చూసే ధోరణిలో ఉండగా.. మరికొందరు మాత్రం పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొండా వర్గాన్ని వీడి.. మరో వర్గంలోకి జంప్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇంతకాలం కొండా కేంద్రంగా సాగిన వరంగల్ రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మరో బాట పట్టేలా కనిపిస్తున్నాయి.ఇటు కొండా కుటుంబానికి ఇంతకాలం వ్యతిరేకంగా ఉన్నవాళ్లు.. తమకూ మంచి రోజులొస్తాయనే ఆశతో ఉన్నారు. కొత్త పదవులు, రాజకీయ అవకాశాలపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ కూడా మొదలైంది. దీంతో వరంగల్ కాంగ్రెస్లో ఎవరు ఎటు వెళ్తారు? ఎవరికి కొత్త అవకాశాలు దక్కుతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: విపక్షాలకు కొత్త అస్త్రం అందించిన రేవంత్! -
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి మార్పులు, చేర్పులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో జరగబోయేది కేబినెట్ విస్తరణా? శాఖల మార్పులా? లేదంటే మొత్తం ప్రక్షాళనా? అనే ఉత్కంఠ మొదలైంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్లో ఇటు మంత్రులు.. అటు ఆశావహులు కనిపిస్తున్నారు.కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ ఎపిసోడ్పై మూడ్ ఆఫ్ ఎమ్మెల్యేల నివేదికకు సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే ఆమెను తొలగించడంతో కేబినెట్లో ముగ్గురికి అవకాశం లభించనుంది. అయితే సురేఖ స్థానంలో మహిళకే చాన్స్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే కేబినెట్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతోపాటు.. కొందరు మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది.మంత్రుల్లో మరికొందరిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించే అంశంపైనా అధిష్ఠానం, సీఎం మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠాన నేతలతో భేటీల సందర్భంగా ఆయా అంశాలపై ఆయన, సీనియర్ మంత్రులు చర్చించినట్లు సమాచారం. రెండ్రోజుల పాటు సొంతూరిలో పర్యటించనున్న సీఎం రేవంత్.. సీనియర్ మంత్రులతో మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో ప్రస్తుత మంత్రుల్లో ఎవరికి పదవులు ఉంటాయో.. ఎవరికి శాఖలు మారతాయోనన్న టెన్షన్ నెలకొంది. మరోవైపు మంత్రి పదవుల కోసం పలువురు ఆశావహ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను ఎలా సర్దుబాటు చేయాలి? అనే అంశాలపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణా.. పూర్తిస్థాయి ప్రక్షాళనా.. లేక రెండూ కలిపి చేస్తారా? అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది.ఇదీ చదవండి: ఇప్పుడు కొండా సురేఖ.. అప్పుడేమో ఆయన! -
హూ ఈజ్ మోదీ.. పవన్?
సాక్షి, విశాఖపట్నం: ‘హూ ఈజ్ మోదీ? ఆయన నాకంటే సీనియరా? నాకంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రి అయ్యారా? ‘ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్కు.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం, ప్రధాని మోదీ ఎందుకు కనిపించడం లేదు? ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. ఆయనకంటూ ఒక విధానం, ఒక స్టాండ్ లేదు.’ ఇవి కూటమిగా ఏర్పడకముందు చంద్రబాబు మొదటి నాలుక పలికిన పలుకులు. కట్ చేస్తే.. కూటమిగా ఏర్పడిన తర్వాత.. ‘నరేంద్ర మోదీ 21వ శతాబ్దపు నవభారత దార్శనికుడు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం నాకెంతో గర్వకారణం.’ ‘పవన్ కల్యాణ్ నిఖార్సైన నాయకుడు, నిజాయితీపరుడు. ఆయనకు పదవుల మీద, ప్యాకేజీల మీద వ్యామోహం లేదు’. ఇదీ.. చంద్రబాబు రెండో నాలుక సూక్తులు. అందితే జుట్టు.. అందకపోతే వెన్నుపోటు.. అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధాలతో ఎవరితోనైనా జట్టులు కట్టే బాబు.. ఎన్నికలు అయ్యాక మాత్రం.. ఏరు దాటాక.. అన్న చందంగా వ్యవహరించడం పరిపాటిగా మారిందని మరోసారి బుద్ధిని బయటపెట్టారు. ఎన్నికలకు ముందు మోదీ దేవుడు.. పవన్ తమ్ముడంటూ అంటకాగిన చంద్రబాబు.. ఇప్పుడు వారిని పక్కన పెట్టేయడం హాట్ టాపిక్గా మారింది. మోదీ, పవన్ బొమ్మలు మాయం! రాష్ట్రంలో ఇంటింటికీ పంచుతున్న ‘కూటమి ప్రభుత్వం.. సంక్షేమ విజయాలు’ కరపత్రాల్లో ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలను నిర్దాక్షిణ్యంగా మాయం చేశారు. సినిమా హిట్టయ్యే దాకా హీరోలు కావాలి.. కలెక్షన్లు వచ్చాక పోస్టర్పై తన బొమ్మ మాత్రమే ఉండాలి అన్నట్లుగా బాబు చేస్తున్న ఈ సింగిల్ క్రెడిట్ సోలో పెర్ఫార్మెన్స్.. నిన్నటి దాకా ‘మా మోదీ, మా పవన్’ అన్న నోటితోనే, నేడు కరపత్రాల సాక్షిగా ‘హూ ఈజ్ మోదీ.. హూ ఈజ్ పవన్’ పార్ట్–2 డ్రామాకు తెరతీసినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కింగ్ మేకర్లు కరివేపాకయ్యారా? కూటమి అంటే ఎన్నికల ముందు ఓట్లు వేయించుకోవడానికి మాత్రమేననీ.. తీరా విజయాల క్రెడిట్ తీసుకునే సమయానికి అంతా తన సోలో పెర్ఫార్మెన్సే అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తరాంధ్ర వీధుల్లో తిరుగుతున్న ఆ కరపత్రం పేరుకే ‘కూటమి’ విజయాలు. కానీ అందులో ప్రధాని మోదీ కానీ.. పవన్ ఫొటో కానీ కనిపించడం లేదు. కేవలం తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు మాత్రమే ముద్రించుకోవడం గమనార్హం. సొమ్ము ఢిల్లీది.. సోకు బాబోరిది! రాష్ట్రంలో ఏ చిన్న సంక్షేమ పథకం అమలు చేయాలన్నా.. కేంద్రం ఇచ్చే నిధులు, రుణాలు విదిలిస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఢిల్లీ నుంచి వస్తున్న వేల కోట్ల రూపాయలతోనే రాష్ట్రంలో హడావిడి డ్రామా నడుస్తోంది. కానీ ప్రచారానికి వచ్చేసరికి మాత్రం టీడీపీ ఫోజులు కొడుతూ డప్పు కొట్టుకుంటోంది. మోదీ పంపిన నిధులతో జరిగిన పనులన్నింటినీ తన క్రెడిట్లో వేసుకుంటూ, కరపత్రాల్లో మోదీ ఫొటోకు మాత్రం తెలివిగా కత్తెర వేసేశారు. ఈ ‘పచ్చ’ పైత్యాన్ని చూసి అటు కమలనాథులు, ఇటు జనసైనికులు అగ్గిమీద గుగ్గిలవుతున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు 2018 నాటి ఫ్లాష్బ్యాక్ గుర్తుకొస్తోందని మండిపడుతున్నారు. అధికార మదంతో అప్పుడే అహంకారం తలకెక్కితే, ఈ కరపత్రాల మంటలు రేపు టీడీపీ పునాదులకే ఎసరు పెడతాయంటూ బీజేపీ రాష్ట్ర ధారి్మక సెల్ ప్రతినిధి విజయ శంకర్ ఫణీంద్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చదవండి: నరసన్నపేటలో పోటీ చేస్తా.. నీ సంగతి చూస్తా.. -
నరసన్నపేటలో పోటీ చేస్తా.. నీ సంగతి చూస్తా..
శ్రీకాకుళం: జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం మాటల యుద్దంతో భగ్గుమంది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ వ్యవహార శైలితో ఈ సమావేశాల ‘స్థాయి’ తగ్గినట్టైంది. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అ«ధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఎమ్మెల్యే తన స్థాయిని మర్చిపోయి జెడ్పీటీసీలపై ఏకవచన పద ప్రయోగం చేశారు. జెడ్పీటీసీలు ధర్మాన కృష్ణచైతన్య, సురవరపు నాగేశ్వరరావులపై దాదాపుగా భౌతిక దాడికి సిద్ధమయ్యేలా వ్యవహరించారు. కూటమి రెండేళ్ల పాలనపై జెడ్పీటీసీలు విమర్శలు ఎక్కు పెట్టడంతో ఎమ్మెల్యే కూన నోటికి పని చెప్పారు. దీంతో కేవలం నాలుగు శాఖల ప్రగ తి సమీక్షలతోనే సమావేశం ముగించాల్సి వచ్చింది. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ తదితర జిల్లా స్థాయీ అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే. జెడ్పీటీసీ కృష్ణచైతన్య మీదకు వస్తున్న ఎమ్మెల్యే కూన రవి కలెక్టర్ చెప్పినా చెయ్యరా.. పోలాకి మండలంలో జెడ్పీ నిధులతో పలు గ్రామాల్లో చేసేందుకు ఈ ఏడాది జూన్ 30న ఆదేశాలు వచ్చినప్పటికీ నేటికీ ఒక్క పని మొదలు పెట్టకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని, దీనిపై జిల్లా కలెక్టర్ కూడా చెప్పినప్పటికీ అధికారులు పనిచెయ్య డం లేదని పోలాకి జెడ్పీటీసీ కృష్ణచైతన్య అన్నారు. దీనిపై డీపీఓ స్వరూపారాణి మాట్లాడుతూ తమకు గత మూడు రోజుల కిందటే ఈ పనుల కోసం సమాచారం వచ్చిందని, వాస్తవానికి ఈ పనులకు గ్రామ తీర్మానాలు అవసరమని, అవ్వగానే పనులు చేసుకోవచ్చునని బదులిచ్చారు.జెడ్పీ నిధులతో చేయాల్సిన పనులకు ఇలాంటి అడ్డంకులేంటని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ కూడా ప్రశ్నించారు. దీనిపై ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ జోక్యం చేసుకుంటూ.. అనవసర రాజకీయాలు మాట్లాడొద్దని, జెడ్పీ నిధులతో పనులెక్కడా తాము గానీ తమ పార్టీ నేతలు గానీ ఆపడం లేదన్నారు. దీనిపై సరుబుజ్జిలి జెడ్పీటీసీ నాగేశ్వరరావు స్పందిస్తూ ‘మీరు కూడా ఆమదాలవలస నియోజకవర్గంలో పనులు అడ్డుకుంటున్నారు కదా..’ అంటూ బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే రవి ఊగిపోతూ ‘నీకు అవగాహన తక్కువ.. ప్రేలాపన ఎక్కువ’ అంటూ ఏకవచన ప్రయోగం చేశారు. ఉపాధి హామీ పథకం ని«ధులతో చేయాల్సిన పనులకు జెడ్పీ నిధులతో చేయొద్దని అన్నారు. అయితే నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఈ విషయాల్లో అవగాహన లేదని అర్థమైందని, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటివి జరగకుండా క్లాస్ తీసుకుంటానన్నారు. జెడ్పీటీసీ సురవరపుని నెట్టివేస్తున్న కూన రవి పింఛన్లపై రభస సమావేశంలో పింఛన్ల ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. వైఎస్సార్ సీపీ గ తంలో లక్షలాది పింఛన్లు తొలగించేసిందని ఎమ్మెల్యే కూన రవి ప్రస్తావించగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు కృష్ణచైతన్య, నాగేశ్వరరావు, దువ్వాడ వాణి, పాల వసంతరావు, దుబ్బ వెంకట రమణ, టొంపల సీతారాం తదితరులు ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పింఛన్లు ఎన్నో చెప్పాలని పట్టుబట్టారు. 50 ఏళ్లు దాటిన వారికి పింఛను హామీ ఏమైందని కృష్ణచైతన్య గుర్తుచేశారు. అలాగే తమ నియోజవర్గంలో అన్యాయంగా పింఛన్ నిలిపివేసినందుకు బాధితుడు కోర్టును ఆశ్రయిస్తే పింఛన్ ఇచ్చారని గుర్తుచేశారు. దీనిపై ఎమ్మెల్యే రవి మాట్లాడుతూ పింఛన్లపై రాద్ధాంతం చెయ్యొద్దని, జగన్ రూ.3 వేల చొప్పున మూడు నెలలే పింఛను ఇచ్చారని ఎద్దేవా చేశారు. అలాగే తమ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు స్పౌజ్ మాత్ర మే ఇచ్చామని, త్వరలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. జెడ్పీటీసీలకు మాట్లాడే అవకాశమివ్వరా..? స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీటీసీలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వకుండా ఎంతసేపు ఎమ్మెల్యే రవికుమార్ మాత్రమే మాట్లాడి అధికారులను బెదిరించేస్తే సరిపోతుందా మా సమస్యలు చెప్పనివ్వరా.. ఇదే ఆఖరి స్థాయీ సంఘ సమావేశం, ఇందులో కూడా మాకు కనీసం మాట్లాడనివ్వరా.. అంటూ పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే రవికుమార్ జోక్యం చేసుకుంటూ తాను కూడా సభ్యుడినేనని, తనకు కూడా మాట్లాడే హక్కు ఉందని, మీరంతా ఆఫ్ట్రాల్ జెడ్పీటీసీలని, తాను ఎక్కడైనా మాట్లాడగలనని గట్టిగా వాదనకు దిగారు. దీనిపై టెక్కలి జెడ్పీటిసీ దువ్వాడ వాణి స్పందిస్తూ రవికుమార్కు మాట్లాడటానికి అవకాశం ఇవ్వొద్దని జెడ్పీ చైర్పర్సన్ విజయకు కోరారు. జెడ్పీటీసీలకు మాట్లాడకుండా అవకాశాలు ఇవ్వకపోతే ఎలా జెడ్పీటీసీల కోరం ఉంటేనే సభ జరుగుతుందనే విషయాన్ని మరిచిపోవద్దని మండిపడ్డారు. అనంతరం జెడ్పీటీసీలు ధర్మాన కృష్ణ చైతన్య, దువ్వాడ వాణి, దుబ్బ వెంకటరమణ, పాల వసంతరావు, నాగేశ్వరరావు తదితరులంతా సమావేశం ముగియకుండానే వెళ్లిపోయారు. నరసన్నపేటలో పోటీ చేస్తా నీ సంగతి చూస్తా.. స్థాయీ సంఘ సమావేశాల వేదికలో ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్, జెడ్పీటీసీలపై విరుచుకుపడ్డారు. ముందుగా సరుబుజ్జిలి జెడ్పీటీసీ నాగేశ్వరరావుపై పనుల అడ్డగింత అంశంలో «ధ్వజమెత్తుతూ ‘నాగేశ్వరరావు.. జాగ్రత్త. సంగతి చూస్తా..’ అంటూ మీసం మెలేశారు. అనంతరం పింఛన్ల అంశంలో పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యపై తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ‘చైతన్య.. నువ్వు రెచ్చిపోతున్నావ్. నా సంగతి తెలియదు. మీ నాన్న, చిన్నాన్నలకే లెక్కచెయ్యను నేను. నువ్వెంత. నీకు అంత కోరికుంటే నేనే నరసన్నపేటలో పోటీ చేస్తా.. అప్పుడు నీ సంగతి తేల్చుతా.’ అంటూ రవి కుమార్ ఊగిపోయారు. దీనిపై కృష్ణ చైతన్య మాట్లాడుతూ ‘రండి.. నరసన్నపేటలో సర్పంచ్ స్థాయి వారిని మీపై నిలబెట్టి గెలిపించి మా దమ్ము ఏంటో చూపిస్తాం’ అంటూ సమాధానమిచ్చారు. వాదన ముదరడంతో జెడ్పీ చైర్పర్సన్ విజయ ఆదేశాలతో మైక్ కట్ చేయించారు. ఒంటరి మహిళలకు అవమానం పింఛను ఇస్తామని ఒంటరి మహిళలతో నరసన్నపేట టీడీపీ కార్యకర్తలు, నేతలు అను చితంగా వ్యవహరిస్తున్నారని పోలాకి జెడ్పీటిసీ కృష్ణచైతన్య ధ్వజమెత్తారు. దీనిపై ఎమ్మెల్యే రవి కుమార్ స్పందిస్తూ మీ ఆగడాలు తెలుసు అంటూ.. పరుష వ్యాఖ్యలు చేశారు. కృష్ణచైతన్య సమాధానమిస్తూ ‘మీరు చేసినవన్నీ మావాళ్లు చేశారని చెబుతున్నారు’ అంటూ సీటు నుంచి లేచి కూన రవికి ఆధారాలు చూపించే ప్రయత్నం చేశారు. ‘నీ సీట్లో కూర్చుని మాట్లాడు’ అంటూ ఏకవచన ప్రయోగంతో కూన రవి వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఒకరినొకరు నెట్టుకునేలా పరిస్థితి పెరిగింది. నల్ల కండువ ధరించిన కృష్ణచైతన్యపై ఎమ్మెల్యే రవి మైక్ కిందకు పడేసి మరీ మీదమీదకు వెళ్లేలా ప్రవర్తించడంపై జెడ్పీటీసీలు, అధికారులు కూడా చర్చించుకున్నారు. చదవండి: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి -
అప్పుడు రాజయ్య.. ఇప్పుడు సురేఖ
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రుల పదవులకు సంబంధించి ఉమ్మడి వరంగల్ రాజకీయ చరిత్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకే ప్రాంతానికి చెందిన మంత్రులు వేర్వేరు ప్రభుత్వాల హయాంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురికావడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 2015లో నాటి సీఎం కేసీఆర్ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యను తొలగించారు. తాజాగా 2026లో సీఎం రేవంత్రెడ్డి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారు.రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కీలక పదవి దక్కింది. ఆ తర్వాత స్వైన్ ఫ్లూ నియంత్రణలో వైఫల్యం, శాఖలో అవినీతి ఆరోపణలపై 2015, జనవరి 25న కేసీఆర్ ఆయనను మంత్రివర్గంనుంచి తొలగించారు. అదే రోజు కడియం శ్రీహరితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించారు. సురేఖ స్థానంలో ఎవరో? దాదాపు 11 ఏళ్ల తర్వాత మరోసారి ఉమ్మడి వరంగల్కు చెందిన మంత్రి.. మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురయ్యారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ 2023, డిసెంబర్ 7న రేవంత్రెడ్డి మంత్రివర్గంలో చేరారు. తాజాగా కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత వివాదాల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గంనుంచి తొలగించారు. ఆమె స్థానంలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 2021లో ఈటల రాజేందర్పైనా...బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా ఉన్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అప్పటి సీఎం కేసీఆర్ 2021, మే 2న మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. భూఆక్రమణల ఆరోపణలు కారణంగా చూపగా.. బర్తరఫ్ అయిన కొద్ది రోజులకు (2021 జూన్ 14న) రాజేందర్ బీజేపీలో చేరి, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సా«ధించారు. పరకాల కేంద్రంగానే రెండు నిర్ణయాలు అప్పుడు రాజీనామా.. ఇప్పుడు బర్తరఫ్సాక్షి, వరంగల్ : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ రాజకీయ జీవితంలో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పరకాల వేదికగానే గతంలో వైఎస్ జగన్కు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖను వదులుకుంటే.. ఇప్పుడు అదే పరకాల పంచాయితీ ఏకంగా ఆమెను మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేసే వరకు వెళ్లింది. వరంగల్ రాజకీయ చరిత్రలో మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉదంతాలు ఉన్నా.. తాజాగా చోటుచేసుకున్న బర్తరఫ్ మాత్రం భిన్నమైన పరిణామంగా నిలిచిందనే ప్రచారం సాగుతోంది. చదవండి: ఎంపీటీసీ నుంచి మంత్రి.. బర్తరఫ్ వరకు -
కాక్రోచ్ పార్టీలో తిరుగుబాటు.. ‘కేజ్రీవాల్ టీమ్’ అంటూ కొత్త పార్టీ!
జెన్జీ ఉద్యమాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాక్రోచ్ జనతా పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ మాజీ వలంటీర్ మనీష్ బ్రహ్మభట్ సంచలన ఆరోపణలకు దిగారు. అసలు ఉద్యమ స్ఫూర్తికి సీజేపీ దూరమైందని, నిరసనల్లో పాల్గొన్న క్రియాశీలక వలంటీర్లను పక్కనపెట్టి కొందరితోనే పార్టీని నడుపుతున్నారని అన్నారు. అలాగే సీజేపీ నాయకత్వం రాజకీయ నాయకులకు తొత్తులుగా మారారని అన్నారు. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (CJP-D) పేరుతో కొత్త వేదికను ప్రకటించారు. గురువారం ఢిల్లీలో మనీష్ బ్రహ్మభట్ కొత్త పార్టీని ప్రకటించారు. కాక్రోచ్ జనతా పార్టీ తో సంబంధం లేకుండా సీజేపీ-డెమోక్రటిక్ పేరుతో ఇక తాను పోరాటం చేస్తానని అన్నారు. అభిజీత్ దీప్కే నేతృత్వంలోని సీజేపీ నాయకత్వం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), దాని కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు అనుకూలంగా మారిందని ఆయన విమర్శించారు. పార్టీని ‘టీమ్ కేజ్రీవాల్’గా మార్చేశారని ఆరోపిస్తూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజల సమస్యలపై పోరాడటానికి బదులుగా బీజేపీని వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. దీప్కే సహా సీజేపీలోని ఎనిమిది మంది నాయకులకు ఆప్తో దగ్గరి సంబంధాలు ఉన్నాయని అన్నారాయన.Manish Brahmbhatt launches new group Cockroach Janata Party Democratic in DelhiManish Brahmbhatt launches a new group called Cockroach Janata Party Democratic in Delhi. He says the old Anna anti-corruption protest was hijacked by Arvind Kejriwal's team without asking real…— Ankit (@Extreo_) September 3, 2026మనీష్ బ్రహ్మభట్ గుజరాత్లో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. అలాగే, 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలన్పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి 964 ఓట్లు సాధించారు. సీజేపీ ఉద్యమంలో గుజరాత్ నుంచి వలంటీర్, కోఆర్డినేటర్గా పనిచేశారు. అయితే నీట్ నిరసనల తర్వాత.. ఆగస్టు మొదటి వారంలో సీజేపీ కోర్ టీమ్ సమావేశం జరిగింది. దానికి మనీష్కు ఆహ్వానం వెళ్లలేదు. మహారాష్ట్రలోని అభిజీత్ దీప్కే నివాసంలో(ఛత్రపతి శంభాజీనగర్కు) ఈ మీటింగ్ జరుగుతోందని మీడియా ద్వారా తెలుసుకుని బ్రహ్మభట్ అక్కడికి వెళ్లారు. అయితే ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. దీప్కే నివాసంలోకి అనుమతించకపోవడంతో.. మనీష్ అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. జంతర్మంతర్ ఉద్యమంలో పాల్గొన్న పలువురు వలంటీర్లను కీలక చర్చలకు.. అదీ ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంచారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో బ్రహ్మభట్, ఆయన సహచరుడు రాహుల్ పాండ్యా ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సీజేపీని తాను వీడుతున్నట్లు ఆయన ప్రకటించి.. ఇప్పుడు కొత్త వింగ్ ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ కామెంట్ల నేపథ్యంతో.. మే 16న అభిజీత్ దీప్కే CJPని తొలుత వ్యంగ్యాత్మక ఆన్లైన్ ఉద్యమంగా ప్రారంభించారు. కానీ, అదే యువత వేదికగా మారింది. నిరుద్యోగం, పరీక్ష పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అక్రమాల వంటి అంశాలను ఈ వేదిక ప్రస్తావించింది. అయితే సీజేపీ ఆవిర్భావం నుంచే అభిజిత్ దీప్కేకు, ఆప్కు సంబంధాలు ఉన్నాయనే చర్చా నడిచింది. జంతర్మంతర్ నిరసనల్లోనూ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నేతలు హాజరై సంఘీభావం తెలపడమూ తెలిసిందే. అభిజీత్ దీప్కే 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా, ఎన్నికల ప్రచార బృందంలో పనిచేశారు. ముఖ్యంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్లు, డిజిటల్ కంటెంట్ ద్వారా పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. 2023లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తర్వాత ఆప్తో తన అనుబంధం ముగిసిందని దీప్కే ఇదివరకే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు బ్రహ్మభట్ చేసిన ఆరోపణలకు సీజేపీ నుంచి ఎలాంటి సమాధానం ఇంకా రాలేదు.ఇదీ చదవండి: అగ్రనేతల ఆమోదంతోనే.. ఆమె తొలగింపు జరిగిందా? -
ఎంపీటీసీ నుంచి మంత్రి.. బర్తరఫ్ వరకు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తాజా మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖది ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం. క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి మొదలైన ఆమె ప్రస్థానం శాసనసభకు.. అక్కడి నుంచి మంత్రివర్గానికి చేరింది. మధ్యలో పార్టీ మార్పులు.. రాజీనామాలు.. ఉపఎన్నికలో ఓటమి.. మళ్లీ విజయాలు.. రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం.. ఇలా ఎన్నో మలుపులు తిరిగింది. కాంగ్రెస్తో మొదలైన ప్రస్థానం వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ మీదుగా తిరిగి కాంగ్రెస్లోకి చేరింది. రెండుసార్లు మంత్రి పదవిని చేపట్టిన ఆమె.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురవడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీటీసీగా రాజకీయాల్లోకి.. కొండా సురేఖ 1995లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ తరఫున వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి ఎంపీటీసీగా ఎన్నికై గీసుకొండ మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1996లో ఏపీ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు అయ్యారు. అనంతరం 1999లో అప్పటి శాయంపేట అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో సురేఖ స్థానం పొందారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వై.ఎస్. మరణం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలిచి కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి పరకాల ఉపఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా టీఆర్ఎస్ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమెకు తొలిసారి ఎదురైన రాజకీయ ఓటమి ఇదే. 2014లో బీఆర్ఎస్... 2018లో మళ్లీ కాంగ్రెస్లోకి.. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో సురేఖ వైఎస్సార్సీపీని వీడి నాటి టీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ప్రాంతంలో పార్టీ మారి భారీ మెజారిటీతో గెలవడం ఆమె రాజకీయ బలానికి నిదర్శనంగా నిలిచింది. కానీ ఆ పార్టీలోనూ ఆమె ప్రయాణం ఎక్కువకాలం సాఫీగా సాగలేదు. పార్టీ నాయకత్వంతో విభేదాలు, అంతర్గత రాజకీయాల నేపథ్యంలో 2018లో ఆ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్లో చేరిన సురేఖ.. పరకాల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో సురేఖకు ఒక దశలో రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బే తగిలింది.మళ్లీ తూర్పులో పట్టు... 2023లో ఘన విజయం 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సురేఖ తిరిగి వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెకు మరోసారి మంత్రి పదవి పొందేందుకు మార్గం సుగమమైంది. 2023 డిసెంబర్ 7న రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా సురేఖ ప్రమాణ స్వీకారం చేశారు. అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల బాధ్యతలు చేపట్టారు. కానీ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ పలుమార్లు పార్టీ అంతర్గత అంశాలపై ఆమె బహిరంగంగా స్పందించారు. ఇటీవల సీఎంను ఉద్దేశించి ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఇది సురేఖ బర్తరఫ్కు దారి తీసింది. ఈ పరిణామం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లోని అంతర్గత సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సురేఖకు ఉన్న వ్యక్తిగత అనుచరగణం, భర్త కొండా మురళి రాజకీయ పరిచయాలు, బీసీ వర్గాల్లో ఆమెకు ఉన్న మద్దతు.. ఇవన్నీ కలిపి చూస్తే ఆమె బర్తరఫ్ ప్రభావం తక్షణమే ముగిసే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.అచ్చిరాని దేవాదాయ శాఖ జూపల్లి నుంచి సురేఖ దాకా రిపీట్ అవుతున్న సెంటిమెంట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖకు ఉద్వాసన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికర సెంటిమెంట్పై చర్చ మొదలైంది. దేవాదాయ శాఖను చేపట్టిన మంత్రులకు ఆ పదవి రాజకీయంగా కలిసి రాదనే అంశం కొండా సురేఖ బర్తరఫ్తో మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు ఉదంతం ఇందుకు ప్రధాన ఉదాహరణగా రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. 2009లో వైఎస్సార్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి.. కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలో దేవాదాయ శాఖకు మారారు. తనకు ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారనే అసంతృప్తి అప్పట్లో ఆయనలో వ్యక్తమైంది. అదే సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మరో మంత్రి డీకే అరుణతో జూపల్లి మధ్య ప్రొటోకాల్, ఆధిపత్య వివాదాలు చర్చకు వచ్చాయి. చివరకు మంత్రి పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఏర్పడ్డాక దేవాదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా ఈ చర్చకు మరో ఉదాహరణగా నిలుస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో నిర్మల్ నుంచి గెలిచిన ఆయన.. దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగిన తర్వాత 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ పార్టీ అంతర్గత వివాదాల్లో చిక్కుకుని చివరకు కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. -
సురేఖ బర్తరఫ్.. విపక్షాలకు కొత్త అస్త్రం?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ వేయి రోజుల పాలనపై నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్ష పార్టీలకు కొండా సురేఖ బర్తరఫ్ అంశం కొత్త అస్త్రాన్ని అందించింది. మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభా వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశముంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి వంటి అంశాలపై రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షం ఇకపై కాంగ్రెస్పై విమర్శల దాడికి మరింత పదును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు లక్ష్యంగా కొండా సురేఖ కూతురు చేసిన విమర్శలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ లోపలా, బయటా నిలదీసే అవకాశముంది. ఇన్నాళ్లూ కేబినెట్లో ఉన్న కొండా సురేఖ నుంచి వచ్చే ప్రతీ విమర్శ కాంగ్రెస్కు కొత్త తలనొప్పి సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ముందుకు ప్రభుత్వ వైఫల్యాలుసురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత గొడవలను కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇన్నాళ్లు ప్రభుత్వంలో భాగంగా ఉన్న సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా విచారణ కోసం బీఆర్ఎస్ పట్టు పట్టే అవకాశముంది. సీఎం సోదరుడికి రూ.200 కోట్ల విలువైన భూ కేటాయింపుపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఇన్నాళ్లూ మాజీ మంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా విమర్శలు చేస్తూ వచ్చిన రేవంత్పై ఎదురుదాడికి దిగేందుకు సురేఖ, ఆమె కుమార్తె చేసిన విమర్శలను అ్రస్తాలుగా మలుచుకునే అవకాశముంది. మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకుంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సురేఖ అడుగులు ఎటు?కొండా సురేఖ బర్తరఫ్ అంశాన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా పేర్కొంటూ విపక్షాల నుంచి వచ్చే ఆరోపణలు, విమర్శలను ఇప్పటికే కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. అయితే సీఎం, ఆయన సోదరులు లక్ష్యంగా వస్తున్న ఆరోపణలపై సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర తిప్పికొడతారనే అంశంపై కాంగ్రెస్ శిబిరంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర స్వేచ్ఛగా ఉన్నారో అందరికీ తెలుసంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. విపక్షాల నుంచి అసెంబ్లీ వేదికగా ఒత్తిడి వస్తే ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే చర్చ కూడా జరుగుతోంది. సీఎంను తప్పుపడుతూ సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఎంత మేర ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంలోనూ కాంగ్రెస్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే సురేఖ వేసే భవిష్యత్తు రాజకీయ అడుగులపైనా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్లో కొనసాగుతూ అధిష్టానంతో రాజీ ధోరణితో వ్యవహరిస్తారా లేక సీఎం లక్ష్యంగా విమర్శలకు పదును పెడతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్కు దూరమైతే గతంలో బీఆర్ఎస్తోనూ అనుబంధం ఉన్న సురేఖ భవిష్యత్తులో రాజకీయంగా ఏ పార్టీ దిశగా అడుగులు వేస్తారనే అంశంపైనా చర్చ జరుగుతోంది. -
మంత్రిగా ఎవరికీ ఛాన్స్ ?
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్తో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. సురేఖ స్థానంతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు బెర్తులు కలిపి మొత్తం మూడు స్థానాలపై ఇప్పుడు ఆశావహుల కన్ను పడింది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా..? లేక సమావేశాల తరువాత ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే శనివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్రెడ్డి గురువారం రాత్రి లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశం మంత్రివర్గ విస్తరణ వాదనకు బలం చేకూరుస్తోంది. కాగా సురేఖను తొలగించిన వెంటనే నామినేటెడ్ పదవుల్లో చేపట్టిన మార్పులు కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడేళ్లు కావస్తున్న తరుణంలో మంత్రుల శాఖలో మార్పులు ఉంటాయని గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయక్, ప్రేమ్సాగర్రావు, రామచంద్రునాయక్, గడ్డం ప్రసాద్కుమార్, మహిళా కోటాలో విజయశాంతి తదితరుల పేర్లు వివిధ దశల్లో ప్రచారంలోకి వచ్చినప్పటికీ... సాకారం కాలేదు. ఇప్పుడు మూడో బెర్తు చేరడంతో పోటీ మరింత పెరగనుంది. మున్నూరుకాపు, పద్మశాలి లెక్క? సురేఖ పద్మశాలి కాగా, ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు. సురేఖకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రెండు వర్గాలకు న్యాయం చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు సురేఖకు ఉద్వాసన పలకడంతో ఆమె స్థానంలో మున్నూరు కాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన మహిళా నేతలకు పట్టం కట్టారు. ఆది శ్రీనివాస్ ఆశలపై నీళ్లు? కాంగ్రెస్ తరపున మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (వేములవాడ) ఒక్కరే. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న మున్నూరుకాపు నుంచి ఆయన పేరు చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే కొండా సురేఖ బర్తరఫ్కు ముందే మున్నూరుకాపు వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదాలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఆది శ్రీనివాస్కు చెక్ పెట్టినట్లయింది. అసమ్మతి గళం వినిపించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేరు కూడా మరోసారి మంత్రివర్గ విస్తరణలో చర్చలోకి వస్తోంది. తనకు ఇచ్చిన మంత్రి పదవి హామీని నెరవేర్చలేదని ఆయన బాహాటంగానే పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి కోసం ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఓవైపు సీఎంపై విమర్శల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోతున్న సురేఖ స్థానంలో రాజగోపాల్రెడ్డికి అవకాశం కల్పిస్తారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా చాలాకాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం కూడా విస్తరణలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాలకు చెందిన ప్రేంసాగర్ రావు, జెన్జీ ఉద్యమాల నేపథ్యంలో యువ ఎమ్మెల్యేల నుంచి ఒకరికి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా వస్తోంది. -
సురేఖ చేరికపై బీజేపీ ఆచితూచి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, ముఖ్యనేతలు మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతూ... మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ను చేశారంటూ బీజేపీ నేతలు ఘాటుగానే స్పందించారు. అయితే కొండా ఫ్యామిలీ బీజేపీవైపు వస్తుందా? వస్తే ఏం చేయాలి? చేర్చుకోవాలా వద్దా? అన్న దానిపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఒకవేళ కొండా మురళి, సురేఖ, సుస్మిత బీజేపీలో చేరితే పార్టీకి ప్రయోజనమెంత? లాంటి అంశాలను విశ్లేషిస్తుతున్నారు. కేబినెట్ నుంచి సురేఖ ఉద్వాసనకు గురైన నేపథ్యంలో... కొండా ఫ్యామిలీ జాయినింగ్పై పార్టీ ముఖ్యనేతల్లో చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రి పదవిని వదులుకున్నాక ఆమె బీజేపీ వైపు వస్తారా? రావాలనుకుంటే పార్టీలో ఎవరితో చర్చలు జరుపుతారు? పార్టీలో చేరతానంటే చేర్చుకుంటే మంచిదా? కాదా? అన్న రకరకాల చర్చలు బీజేపీలో సాగుతున్నాయి. వారి ముందున్న మార్గాలేంటి? రాష్ట్ర రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ వ్యవహారశైలి, ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలు తదితరాలు చర్చనీయాంశమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎదుట ఉన్న మార్గాలేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొండా ఫ్యామిలీ జనసేనలో చేరేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రచారాలు సాగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొండాసురేఖ, బీజేపీ చీఫ్ రాంచందర్రావు ఎదురుపడినపుడు మర్యాదపూర్వకంగా పలకరించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సురేఖ రాజీనామా చేశాక అప్పుడు ఆలోచిస్తామంటూ ఊహాగానాలకు తెరలేపారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ఇటు బీజేపీ వైపు నుంచి గానీ, అటు కొండా ఫ్యామిలీ వైపు నుంచి గానీ ఎలాంటి సమాలోచనలు మొదలుకాలేదనే సంకేతాలు ఇస్తున్నారు. మంత్రి పదవి పోయినా సురేఖ ఎమ్మెల్యేగా కొనసాగుతానంటూ, పార్టీకి కూడా రాజీనామా చేయబోనని ప్రకటించిన విషయం విదితమే. ఇతర పార్టీల నేతలు చేరాలంటే ఆ పార్టీ సభ్యత్యానికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాకే రావాలని బీజేపీ జాతీయ నాయకత్వం కండిషన్ పెట్టిన విషయాన్ని రాష్ట్ర పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అందువల్ల సురేఖ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుంటే పార్టీలో చేర్చుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇంకా రెండేళ్లకు పైగా పదవీకాలం ఉండటంతో రాజీనామాకు సురేఖ సుముఖంగా లేకపోగా... పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా కండిషన్ అడ్డుగా నిలుస్తోందని చెబుతున్నారు. బీజేపీలో ఫ్యామిలీ ప్యాకేజీలు ఉండవని... ప్రత్యేక సందర్భాల్లోనే ఒక కుటుంబంలో ఒకరికి మించి టికెట్ ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు. అందువల్ల బీజేపీలో కొండా ఫ్యామిలీ చేరడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదీగాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ పోటీకి క్లెయిమ్ చేస్తున్న సీట్లలో బీజేపీకి బలమైన నేతలు ఉన్నారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు మంచి ఓటింగ్నే సాధించారని అంటున్నారు. అందువల్ల వారి చేరికతో పార్టీకి, నేతలకు కొత్త తలనొప్పి మొదలవుతుందనే గుసగుసలు కూడా బీజేపీలో వినిపిస్తున్నాయి. -
రేవంత్ బ్లాక్మెయిల్... అందుకే ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయడం వల్లనే తనను మంత్రివర్గం నుంచి తప్పించారని కొండా సురేఖ ఆరోపించారు. పార్టీ అధిష్టానానికి తనను తప్పించాలన్న ఆలోచన లేదని.. అయితే తనను తప్పించకపోతే..తాను వెళ్లిపోతానని సీఎం అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎవరితోనూ సంప్రదించడం లేదని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా కమ్యూనికేషన్ చేయడంలో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలతో, నేతలతో వైఎస్సార్ ఉన్నట్లు రేవంత్రెడ్డి లేడన్నారు. తాము వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించనంతగా..రేవంత్రెడ్డిని అభిమానించామని చెప్పారు. రేవంత్రెడ్డిని నిందించిన వారంతా ఇప్పుడు మంచిగానే ఉన్నారని, కానీ తనను మాత్రమే రేవంత్రెడ్డి టార్గెట్ చేసుకున్నారని సురేఖ వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎం సోదరులు కొండల్రెడ్డి, తిరుపతిరెడ్డి మరికొందరు కుట్రపన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు రేవంత్రెడ్డి కూడా అలానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. పార్టీ హైకమాండ్కు ఇటీవల తాను రాసిన లేఖలను సురేఖ విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిణామాలపై పశ్చాత్తాపం లేదు.. ‘తమవైపు ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు ఆయన వైపే చూపిస్తాయన్న అంశాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అయితే ఎలాంటి తప్పు చేయకపోయినా మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యమంత్రిని నేను ఏనాడూ విమర్శించలేదు.. పార్టీని దూషించలేదు. నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. పదవుల కోసం నేనెప్పుడూ వెంపర్లాడలేదు. కొణిజేటి రోశయ్య, జైపాల్రెడ్డిలు ఇందిరాగాం«దీని నిందించిన వారే. జగ్గారెడ్డి, రాజగోపాల్రెడ్డి వంటి వ్యక్తులు మాట్లాడితే ఎలాంటి చర్యలు లేవు. నా కూతురు చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకుని నన్ను శిక్షించడం సరికాదు. ఉరి శిక్షపడిన ఖైదీని కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. కానీ అధిష్టానం నా అభిప్రాయాలను తెలుసుకోకుండా సీఎం బ్లాక్మెయిల్కు లొంగి బర్తరఫ్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ రోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో చెప్పండి. మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ప్రభుత్వంలో ఏ పనులు జరగడం లేదు. దీంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతపై సర్వే చేయించాలని సూచిస్తున్నా. ప్రభుత్వంలో తప్పులు సరిదిద్దుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఆలోగా మనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించాలంటే.. ప్రజల సమస్యలు పరిష్కరించాలి. హామీలను అమలు చేసి చూపించాలి. కాంగ్రెస్లోనే ఉంటా... కాంగ్రెస్లోనే ఉంటా. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా. మంత్రి పదవి మాకు ఆభరణం మాత్రమే. అది లేనంత మాత్రాన మాకు నష్టం లేదు. రెండు మూడు రోజుల తర్వాత కుటుంబ సభ్యులం మాట్లాడుకుంటాం. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతా. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. బర్తరఫ్ చేశారన్న సమాచారం ఇప్పుడే తెలిసింది. నా కూతురు ఇంగ్లండ్లో ఉంది. ఆమెతో, నా భర్తతోనూ ఇంకా చర్చించలేదు. నా కూతురు గౌరవం కోసమే ఆమె వ్యాఖ్యలపై నేను స్పందించలేదు. సుమంత్పై కేసులు విత్డ్రా చేసుకోవాలి నా ఓఎస్డీ సుమంత్ ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయనను వెంటాడుతున్నారు. సుమంత్ ఎవరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తికి వెంటనే బెయిల్ ఇచ్చి.. 15 రోజుల తరువాత అదే వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. సుమంత్పై పెట్టిన కేసులను విత్డ్రా చేసుకోవాలని హోం శాఖను కోరుతున్నా. పరకాలలో సీఎం అక్కడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి టికెట్ ఎలా ప్రకటిస్తారు? 70 ఏళ్ల వృద్ధుడు.. వచ్చే ఎన్నికల నాటికి నడుస్తారో..మంచంపై ఉంటారో తెలియదు. నన్ను తొలగించిన నేపథ్యంలో బ్యాలెన్స్ చేయడానికి ముగ్గురు మహిళలకు పదవులు రావడం అభినందనీయం. వారికి నా శుభాకాంక్షలు. చిన్నారెడ్డిని నా కోసం శిక్షించడం సరికాదు..’అని సురేఖ అన్నారు.పీసీసీ పదవి కోసం రూ.50 కోట్లు ఇచ్చారన్న వారిని సన్మానించారు.. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికోసం రూ.50 కోట్లు ఇచ్చారని ఆరోపించిన వారికి సీఎం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి సన్మానించారు. డీఎస్ కుటుంబంలో ఇద్దరు రెండు వేర్వేరు పార్టీల్లో లేరా? పదేళ్లుగా నా కూతురికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించలేకపోయాం. అదే మొన్న పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తన కూతురుకు ఎంపీ పదవి తెప్పించుకున్నారు. నా భర్తకు కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇప్పించుకోలేదని నా కూతురు అన్నది. నా కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. వాటిని ఖండించాల్సిన లేదా సమర్థించాల్సిన అవసరం నాకు లేదు. మేము నిబద్ధతతో రాజకీయాలు సాగిస్తున్నాం. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదు. రాజీనామాలు చేసే ఇతర పార్టీలోకి వెళ్లాం. -
సీఎం సలహా మేరకు.. కొండా సురేఖ బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రిమండలి నుంచి బర్తరఫ్కు గురయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి సైతం ఉద్వాసనకు గురయ్యారు. తక్షణమే వీరిద్దరిని ఆయా పదవుల నుంచి తొలగించాలని సీఎం ఎ.రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కొండా సురేఖకు ఉద్వాసన పలకాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు సీఎం రేవంత్ సిఫారసు చేశారని తెలిపింది. అయితే దీనిపై లోక్భవన్ గురువారం రాత్రి 8 గంటల వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగింది. కానీ సీఎం..మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్తో కలిసి రాత్రి 8 గంటల ప్రాంతంలో లోక్భవన్కు వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ వెంటనే లోక్భవన్ నుంచి బులెటిన్ జారీ అయింది. సీఎం రేవంత్ సలహా మేరకు కొండా సురేఖను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు బులెటిన్ వెల్లడించింది. కాగా చిన్నారెడ్డి తొలగింపు నేపథ్యంలో ఆ పదవిని భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వం మరోరెండు కీలక నియామకాలు కూడా చేపట్టింది. రెండు వారాలుగా రాజకీయ దుమారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరు ప్రకాశ్రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 16న పరకాలలో జరిగిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. దీనిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆగస్టు 19న కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రేవంత్రెడ్డికి సీఎం కాగానే కళ్లు నెత్తికెక్కాయని, వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే పరకాలలో ఆయన తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని వనపర్తి టికెట్ను ఇచ్చారని జి.చిన్నారెడ్డి సైతం వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పార్టీ క్రమశిక్షణ కమిటీ వీరిద్దరికి ఉద్వాసన పలకాలని సిఫారసు చేస్తూ అధిష్టానానికి నివేదిక సమర్పించింది. ఈ పర్యావసానాల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లడం, ఏఐసీసీ చీఫ్ ఖర్గే సహా కొందరు పెద్దల్ని కలవడంతో సురేఖతో పాటు జి.చిన్నారెడ్డిపై వేటు పడడం ఖాయమనే ఊహాగానాలు చెలరేగాయి. మరోవైపు సురేఖ కూడా మంగళవారం నాడే ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఖర్గే తదితరులతో సమావేశమై అదే రోజు రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. కాగా రేవంత్రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరిగి బయలుదేరడానికి ముందు..సురేఖ, చిన్నారెడ్డి విషయంలో సీఎంఓ కార్యాలయంనుంచి ప్రకటన వెలువడింది. అంతకుముందే వీరిద్దరి ఉద్వాసనకు పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. గజిట్ జారీ చేసిన ప్రభుత్వం సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రధాన సలహాదారు కె.రామకృష్ణారావు గురువారం సాయంత్రం లోక్భవన్కు వెళ్లి సీల్డ్ కవర్లో మంత్రిమండలి నుంచి కొండా సురేఖ తొలగింపు ప్రతిపాదనను అందజేశారు. అనంతరం ఢిల్లీ నుంచి సాయంత్రం 5 గంటలకు తిరిగి వచ్చిన సీఎం.. వెంటనే చంచల్గూడ – సంతోష్నగర్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించి, ఆ తర్వాత లోక్భవన్కు చేరుకుని గవర్నర్ శుక్లాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సురేఖ తొలగింపుపై లోక్భవన్ బులెటిన్ జారీ చేసింది. సీఎం వెంట ఎంపీలు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రఘువీర్రెడ్డి ఉన్నారు. కాగా సురేఖను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గజిట్ వెలువరించింది. సచివాలయంలోని 4వ అంతస్తులో ఉన్న కొండా సురేఖ కార్యాలయాన్ని సీజ్ చేశారు. అంతకు ముందే కీలకమైన ఫైళ్లన్నీ సీఎస్ కార్యాలయంలో అప్పగించాలని ఆమె పీఎస్ను ఆదేశించారు. సురేఖను మంత్రిమండలి నుంచి తొలగించడంతో ఆమె వద్ద ఉన్న పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖలూ సీఎం పర్యవేక్షణ కిందికి వెళ్లాయి. వ్యూహాత్మకంగా మూడు నియామకాలు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి జి.చిన్నారెడ్డిని తొలగించిన ముఖ్యమంత్రి తక్షణమే ఆయన స్థానంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుమార్తె, జీహెచ్ఎంసీ మాజీ మేయర్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మీ (మున్నూరుకాపు)ని నియమించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (కుడా) చైర్మన్గా మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి (పద్మశాలి)ని రెండేళ్ల కాలపరిమితితో నియమిస్తూ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద (గౌడ) నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులు సీఎం ఢిల్లీ నుంచి తిరిగి రాకముందే జారీ అయ్యాయి. కొండా సురేఖ ఇటీవల బీసీ అస్త్రాన్ని ఉపయోగించి సీఎం రేవంత్పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు, బీసీ వర్గాలకు న్యాయం చేశారనే సందేశాన్ని ఇవ్వడానికే వ్యూహాత్మకంగా ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఉద్వాసనకు గురైన మూడోమంత్రి సురేఖ తెలంగాణ రాష్ట్రంలో ఉద్వాసనకు గురైన మూడో మంత్రిగా కొండా సురేఖ చరిత్రకెక్కారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ తాటికొండ రాజయ్యను అనూహ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కేసీఆర్ 2015 జనవరి 25న నిర్ణయం తీసుకున్నారు. వైద్యారోగ్య శాఖలో అవినీతి, స్వైన్ ఫ్లూ నివారణలో వైఫల్యాల నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈటల రాజేందర్ను వైద్యారోగ్య శాఖ మంత్రిగా నియమించారు. అయితే అసైన్డ్ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2021 మే నెలలో ఈటలకు ఉద్వాసన పలికారు. రేవంత్ మంత్రివర్గంలో 1,002 రోజుల పాటు మంత్రిగా కొనసాగిన సురేఖపై తాజాగా వేటు పడింది. -
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సాక్షి, వనపర్తి: పదవిపై తనకు వ్యామోహం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం పట్ల ఆయన స్పందిస్తూ.. సీఎంను కలవలేదు. కలవాలనే ప్రయత్నం చేయలేదన్నారు. కష్టపడి ఈ స్థాయికి వస్తే.. ఒక్క పోటుతో కూల్చేశారు. నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చినా అంశాలనే మాట్లాడా అంటూ ఆయన వివరణ ఇచ్చారు.పదవి ఉన్నా, లేకున్నా నా గౌరవం నాకుంది.. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చిన్నారెడ్డి అన్నారు. తన వర్గీయులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావొద్దని.. వస్తే మెడలు పట్టి గెంటేస్తానని ఎమ్మెల్యే అంటున్నారని తనతో కార్యకర్తలు ఆవేదన వెలిబుచుకున్న సందర్భంలో మాత్రమే అలా మాట్లాడానని తెలిపారు. -
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ భర్త మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాకు ఇదేం కొత్త కాదన్న మురళి.. ఇవాళ మేము.. రేపు ఎవరో? అంటూ వ్యాఖ్యానించారు. పదవులు ఉన్నా లేకున్నా మా గౌరవం మాకు ఉంటుంది. మేం ప్రతిదానికి స్పందించకపోవచ్చు.. కానీ అన్నీ గమనిస్తూనే ఉంటాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు’’ అంటూ కొండా మురళి ట్వీట్ చేశారు. అంతకుముందు హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా ముందు కొచ్చిన కొండా మురళి.. మీసం మెలేశారు.హైదరాబాద్ లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు లోక్భవన్కు పలువురు క్యాబినెట్ మంత్రులు వెళ్లారు. కొండా సురేఖ బర్తరఫ్, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై గవర్నర్కు సీఎం వివరించారు. గవర్నర్తో సుమారు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం తెలిపారు.ఇదేం కొత్త కాదు, ఉన్నది ఉన్నట్టు, కుండా బద్దలు కొట్టినట్టు మాట్లాడుతే ఎవ్వరు తట్టుకోరు! ఇవ్వాళ మేము, రేపు ఎవ్వరో.పదవులు ఉన్నా లేకున్న మా గౌరవం మాకు ఉంటుంది.మేము ప్రతిదానికీ స్పందిచకపోవచ్చు కానీ ప్రతీ ఒక్కటి గమనిస్తూనే ఉంటాం. pic.twitter.com/xj9EUYl6rQ— Konda Murali (@TeamKonda) September 3, 2026 -
సీఎం విజయ్ ‘ప్రధాని’ కలలు?.. చురకలంటించిన కాంగ్రెస్!
సాక్షి,చెన్నై: తమిళ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న సీఎం విజయ్కు అభిమానులు, పార్టీ శ్రేణుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే, ఇదే ఉత్సాహంలో తమిళగ వెట్రి కజగం శ్రేణులు ఆయనను ఏకంగా ‘కాబోయే ప్రధాని’ అంటూ ఆకాశానికెత్తేస్తుండటం కొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. అభిమానంతో అంటున్న మాటలే అయినప్పటికీ, విజయ్ జాతీయ నాయకత్వంపై వస్తున్న ఈ వార్తలు పొత్తు ధర్మాన్ని పాటించే కాంగ్రెస్కు అస్సలు మింగుడుపడటం లేదు. రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ నాయకత్వానికి, టీవీకే శ్రేణుల ‘ప్రధాని జపం’ ఇరకాటంలో పడేసింది.ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్ టీవీకే నేతలకు గట్టిగానే చురకలంటించారు. టీవీకే నాయకులు ఇప్పటికీ తమ పాత ‘ఫ్యాన్ క్లబ్ శైలి’లోనే వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అభిమానుల భావోద్వేగాలను, ఆకాంక్షలను ఆపలేమని పేర్కొంటూనే.. ఇప్పుడే అధికారంలోకి వచ్చిన విజయ్, కమిషన్ల ప్రమేయం లేకుండా అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తూ మంచి సీఎంగా ఎదిగే దిశగా దృష్టి సారించాలని హితవు పలికారు.సీఎం విజయ్తో మాణిక్యం ఠాగూర్ భేటీఈ ప్రధాని వివాదం, పొత్తులో విభేదాలు వస్తున్నాయనే ఊహాగానాల నడుమ.. మాణిక్యం ఠాగూర్ తమిళనాడు సచివాలయంలో సీఎం విజయ్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతినకుండా, పొత్తు ధర్మాన్ని కాపాడుకోవడంపైనే ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.అసలు వివాదం ఎక్కడ మొదలైంది?తూత్తుకుడితో సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో టీవీకే నాయకులు విజయ్ను భవిష్యత్ ప్రధానిగా అభివర్ణిస్తూ పోస్టర్లు వేయడం కలకలం రేపింది. దీనికి తోడు టీవీకే నేత ఆధవ్ అర్జున్, దేవాదాయ శాఖ మంత్రి శరత్కుమార్లు భవిష్యత్తులో దక్షిణాది నుంచి ముఖ్యంగా తమిళనాడు నుంచి ఒకరు ప్రధాని కావాలంటూ చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ దుమారానికి మరింత ఆజ్యం పోశాయి.కాంగ్రెస్ స్పష్టమైన సందేశంతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ మద్దతుతోనే తమిళనాడులో ప్రభుత్వం కొనసాగుతున్న తరుణంలో, మిత్రధర్మాన్ని దాటి విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడంపై కాంగ్రెస్ నాయకత్వం చెక్ పెట్టింది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వమే అంతిమమని స్పష్టం చేస్తూనే, విజయ్ ముందుగా రాష్ట్ర పాలనకే ప్రాధాన్యమివ్వాలని హితవు పలికింది. -
రైతుల కోసం పాదయాత్ర చేస్తా: కేటీఆర్
నల్లగొండ: గతంలో నీళ్ల కోసం కోదాడ నుంచి హాలియా వరకూ కేసీఆర్ పాదయాత్ర చేశారని, ఇప్పుడు వినాయక చవిత లోపల నీటి షెడ్యూల్ను విడుదల చేయకపోతే అదే కోదాద నుంచి హాలియా వరకూ తాను పాద్రయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో రైతులు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. ఇప్పటివరకూ వెయ్యి రోజుల పడకల పాము పాలన చూశామని విమర్శించారు కేటీఆర్ఈరోజు(గురువారం, సెప్టెంబర్3వ తేదీ) నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ మేరకు కేటీఆర్ మాట్లాడుతూ.. మిర్యాలగూడలో రైతు ధర్నాను అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ‘పచ్చని పొలాలతో ఉన్న మిర్యాలగూడ ప్రాంతంలో రైతు మహా ధర్నా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆలోచించుకోవాలి. కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి. రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ ఇచ్చిన హామీ ఏమైంది?, రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా రూ. 15 వేలు ఏమైంది?, రైతు బంధు, రైతు బీమా ఎగ్గొట్టింది ఎవరు?, పంటలకు నీళ్లు ఇవ్వమంటే బీఆర్ఎస్ వాళ్ల రక్తం చల్లుతానని రేవంత్ అంటున్నారు. సాగర్లో నీళ్లు ఉన్నా పంటలకు నీళ్లు ఇవ్వాలనే సోయి జిల్లాలో ఉన్న మంత్రులకు లేదు. ఉత్తమ్ నీళ్ల మంత్రి కాదు. రైతుల కళ్లలో నీళ్లు నింపుతున్న మంత్రి. ఎంతటి కరువు పరిస్థితి ఉన్నా గతంలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చాం. నీకు ఓట్లేయడమే ఎడమ కాలువ రైతులు చేసిన తప్పా. ఓటేసిన పాపానికి రైతాంగానికి అన్యాయం చేస్తోంది. రైతులకు యూరియా కూడా దొరకడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి:రేవంత్రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం -
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ నేతలు తమ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరులో ఉనికిని కాపాడుకోవడానికే ఒకరిని మించి ఒకరు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నిజంగా తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అనుమతులపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ నేతలపై ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు ఏ విధంగా మంజూరవుతున్నాయో తెలంగాణ విషయంలో ఎందుకు అదే విధానం అమలు కావడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే తమ ఉనికిని కాపాడుకోగలమని, పార్టీ అధిష్టానం తమను గుర్తిస్తుందని భావించడం సరికాదన్నారు.ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన బీజేపీ నేతలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. గతంలో పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక బకాయిలు పెట్టినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ, పాత బకాయిలను కూడా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తెలంగాణకు రావాల్సిన అనేక హామీలు, నిధులు, ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని మంత్రి అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో తెలంగాణకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం కేంద్రానికి వెళ్తున్నప్పటికీ, తిరిగి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.తెలంగాణకు పెండింగ్లో ఉన్న మెట్రో రైల్, నవోదయ విద్యాలయాలు, కేంద్ర పాఠశాలలు, రీజినల్ రింగ్ రోడ్కు సంబంధించిన అంశాలు సహా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే అనుమతులు, నిధులు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద రాష్ట్ర హక్కులను సాధించడంలో బీజేపీ నేతలు ముందుకు రావాలని, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ తీసుకురావాలని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ప్రశ్నించండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే దమ్ము చూపించండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.


