breaking news
Politics
-
‘ఎస్పీ రాజకీయ వ్యాఖ్యలు చేయడం దారుణం’
తిరుపతి: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కోసం వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను భగ్నం చేయాలనే చంద్రబాబు కుట్రలకు అనుగుణంగా జిల్లా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పర్యటనపై శాంతిభద్రతల అంశాన్ని అడ్డం పెట్టుకుని జిల్లా ఎస్పీ మణికంఠ రాజకీయ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రైతులు తమ పంటలను లారీల్లో మార్కెట్ యార్డ్కు తీసుకురాకూడదని, వారు వాటిని రోడ్డుపై పారవేసి రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమంటూ జిల్లా ఎస్పీ రాజకీయంగా మాట్లాడటం వెనుక చంద్రబాబు డైరెక్షన్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను కలిస్తే రౌడీషీట్లు తెరుస్తామంటూ రైతులను, పార్టీ శ్రేణులను బెదిరించడం చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు బుధవారం ప్రతిపక్షనేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెం మామిడి మార్కెట్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు ఇస్తున్నామని ఒకవైపు చెబుతూనే, మరోవైపు పోలీసులు అనేక ఆంక్షలును విధిస్తున్నారు. ఎక్కడికక్కడవైఎస్సార్సీపీ శ్రేణులకు నోటీసులు ఇస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన కూడదంటూ ముందస్తు అరెస్ట్లతో భయోత్పాతానికి గురి చేస్తున్నారు. బస్తర్ అడవుల్లో నక్సల్స్ను వేటాడుతున్నట్లుగా చిత్తూరు జిల్లాలోవైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వెంటాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ మీద, పోలీస్ అధికారుల మీదవైఎస్సార్సీపీకి మంచి గౌరవం ఉంది. కానీ దానికి భిన్నంగా వైఎస్ జగన్ పర్యటనను దెబ్బతీసేలా అదే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది. జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాతో మాట్లాడుతూ జన సమీకరణ చేస్తున్న వారిని గుర్తిస్తున్నాం, వారిని అరెస్ట్ చేసి, రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ కోసం వచ్చే రైతులు ఆటోలు, మోటార్ సైకిళ్ళపై వస్తుంటే, వారి వాహనాలకు పెట్రలో, డీజిల్ పోయవద్దంటూ పోలీసులే పెట్రలో బంక్ నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. ఆటోల్లో వైఎస్ జగన్ కోసం వచ్చే రైతులు ఎక్కించుకోవద్దని, అలా చేస్తే కేసులు పెడతామంటూ వారిని కూడా బెదిరిస్తున్నారు.పదిమంది రైతులు మాత్రమే మాట్లాడాలని ఆంక్షలుతమ అభిమాన నాయకుడిని చూడాలని రైతులతో పాటువైఎస్సార్సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు కూడా వస్తుంటే, వారిని కూడా శాంతిభద్రతల సమస్యను ముందు పెట్టి అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు.వైఎస్సార్సీపీ అభిమానులు, పార్టీ శ్రేణులను గూండాలు, రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం సమంజసం కాదు. ప్రజల హక్కులను కూడా కాలరాయాలని అనుకోవడం రాజ్యాంగ విరుద్దం. మార్కెట్ యార్డ్లో వైఎస్ జగన్ను కలిసేందుకు గరిష్టంగా పదిమందిని మాత్రమే అనుమతిస్తామని జిల్లా ఎస్పీ చెప్పడం దారుణం. ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మామిడి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల అప్పులపాలై, తమను ఎవరు ఆదుకుంటారా అని ఆక్రోశిస్తున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు వస్తున్న వైఎస్ జగన్ను రైతులు కలవడానికి కూడా ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామికమా? ఇప్పటి వరకు మామిడి రైతులు కనీసం తమకు జరిగిన నష్టాన్ని కష్టాన్ని గొంతువిప్పి బయటకు చెప్పుకోలేని నిర్భందంలో ఉన్నారు. అలాంటి వారికి వైఎస్ జగన్ అండగా నిలిచేందుకు వస్తుంటే సహించలేక పోతున్నారు.పోలీసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయంపోలీసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. జిల్లా ఎస్పీతో మాట్లాడించిన మాటలు చూస్తే శాంతిభద్రతలను కాపాడే అధికారులు మాట్లాడే మాటలు కావు అవి. జగన్ను కలిసేందుకు వచ్చే వారిపై రౌడీషీటర్లు తెరుస్తామని ఎలా బెదిరిస్తారు? వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకుంటాం, ఆయనను నిలదీస్తాం, ఆయనతో వాగ్వివాదంకు దిగుతామని హెచ్చరిస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకు మాత్రం పోలీసులు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలా మాట్లాడకూడదంటూ కనీసం వారిని వారించే ప్రయత్నం కూడా జిల్లా పోలీస్ అధికారులు చేయలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు హెచ్చరిస్తుంటే పోలీసులకు వినిపించడం లేదా? జిల్లా ఎస్పీతో ఇలా మాట్లాడిస్తున్నది కూటమి ప్రభుత్వం కాదా, సీఎం చంద్రబాబు కాదా? రైతులను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు. రైతులకు శిక్షణ కూడా ఇచ్చారంటూ మాట్లాడటం దారుణం’ అని ధ్వజమెత్తారు -
‘విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా?’
నెల్లూరు : మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ శ్రేణులు చేసిన దాడిన ఎంపీ మిథున్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అప్రజాస్వామికమని మండిపడ్డారు. విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా? అని ప్రశ్నించారు మిథున్రెడ్డి. ఈరోజు(మంగళవారం, జూలై 8వ తేదీ) ప్రసన్న కుమార్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు మిథున్రెడ్డి. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఏ వస్తువును వదిలిపెట్టలేదని,. ఈ విషయంలో పోలీస్ శాఖ స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. రెడ్ బుక్ ఇవాళ అమలైతే.. తాము కూడా ఓ బుక్ ఓపెన్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్రెడ్డికి తమ నాయకుడు వైఎస్ జగన్తో పాటు పార్టీ క్యాడర్ కూడా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. -
‘లోకేష్, భరత్లు అసలు నిందితుల్ని తప్పించారు’
సాక్షి, విశాఖ: కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్కు క్యాపిటల్గా మార్చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహా నగరంలోకి ప్రవేశించేసింది. ఎన్నికల ముందు కంటైనర్లో రూ.వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్కి అడ్డాగా మార్చేశారు ఇటీవల విశాఖలో కలకలం రేపిన కూటమి నేతల డ్రగ్స్ దందాపై అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలో గంజాయి కొకైన్ ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ పేట్రేగిపోతుంది. డ్రగ్స్కు క్యాపిటల్గా విశాఖను తయారు చేశారు. డ్రగ్స్ గంజాయిని కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. ఇటీవల విశాఖలో 25 గ్రాముల కొకైన్ దొరికింది. వెలగపూడి రామకృష్ణ బాబు సీపీ మీద ఒత్తిడి చేసి అసలు దోషులను తప్పించారు.ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పోలీసులు మీద ఒత్తిడి తెచ్చారు. డ్రగ్స్ కేసులో సీఎంవో కూడా ఇన్వాల్ అయింది. మంత్రి లోకేష్, ఎంపీ భరత్ అసలు నిందితులను తప్పించారు. ఎప్పుడూ రాని టీడీపీ ప్రజా ప్రతినిధులు సీపీ కార్యాలయానికి ఎందుకు వచ్చారు. టీడీపీ నేతలు సీపీనీ కలిసిన సీసీ ఫుటేజీ బయట పెట్టే ధైర్యం ఉందా. వైఎస్ జగన్ పాలనలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అక్షయ్, థామస్, కృష్ణ చైతన్య వర్మను అరెస్టు చేసి మిగతా ఇద్దరిని ఎందుకు వదిలేశారు. అక్షయ్ కుమార్ అనే వ్యక్తి తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎంపీకి అత్యంత సన్నిహితుడు.వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ను కూటమి ప్రభుత్వం దెబ్బ తీస్తోంది.వైఎస్ జగన్ పాలనలో 25 వేల కేజీల డ్రగ్స్ దొరికిందని తప్పుడు ప్రచారం చేశారు. తరువాత సీబీఐ విచారణలో అది ఈస్ట్ అని తేలింది. కొకైన్ డ్రగ్స్ వ్యవహారం ఎల్లోమీడియాకు కనిపించలేదా. వాస్తవాలను ఎందుకు ప్రజలకు చూపించడంలేదు. అసలు రాష్ట్రంలో గంజాయి లేనట్లు ఈనాడు చంద్రబాబు భజన చేస్తుంది. డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగాలి.అసలు నిందితులను అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు
సాక్షి,చిత్తూరు జిల్లా : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు తాము పెట్టిన నిబంధనలను ఉల్లంఘించి జనసమీకరణ చేస్తే చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్ జగన్ బుధవారం (జులై9) బంగారుపాళ్యంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్ జగన్ టూర్కు జనసమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవు. మాజీ సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు 375 మందికి నోటీసులు ఇచ్చాం. ఇది కేవలం రైతులతో ముఖాముఖీ కార్యక్రమం మాత్రమే. రైతుల పరిచయ కార్యక్రమానికి 500 మందిని, హెలిపాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతిస్తున్నాం. ఈ పరిధి దాటితే నిర్వాహకులు ఎవరు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
వందమంది ఎమ్మెల్యేల మద్దతు.. సీఎంగా డీకే శివకుమార్?
సాక్షి,బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం రసకందాయంలో పడింది. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ను (D. K. Shivakumar) సీఎంను చేయాలంటూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాంబు పేల్చారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు డీకేఎస్ వెంట ఉన్నారంటూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. ఈ క్రమంలో డీకేఎస్ సైతం హస్తినలో పర్యటించడం.. రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎందుకంటే? 2023లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సిద్ధరామయ్య(Siddaramaiah)కు సీఎం పదవి, డీకేఎస్కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఆ సమయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై డీకేఎస్ వర్గం అంతర్గతంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. పైకి మాత్రం సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు, తర్వాత డీకే శివకుమార్ సీఎం అయ్యేలా ఒప్పందాలు జరిగాయంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ 2.5 సంవత్సరాల గడువు సెప్టెంబర్లో ముగియనుండటంతో, డీకే శివకుమార్ మద్దతు దారులు మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు.ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ మాట్లాడుతూ.. ‘అవును, చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ను సీఎం చేయాలని కోరుతున్నారు. మా జిల్లా ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు’ అని చెప్పారు. మరో ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలోని 100 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్కు మద్దతుగా ఉన్నారు అని పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరికీ ఆశ ఉండొచ్చుకర్ణాటక రాజకీయంపై ఇప్పటికే ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Randeep Surjewala)కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆశ ఉండొచ్చు. కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు . గతంలో ఇదే వివాదాన్ని పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం రణదీప్ సూర్జేవాలాను మధ్యవర్తిగా వ్యవహరించారు.అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంమరోవైపు తనని సీఎంను చేయాలంటూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్లపై డీకే శివకుమార్ స్పందించారు. నా కోసం మాట్లాడమని నేను ఎవరికీ చెప్పలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అది శిరోధార్యమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం మాత్రం సిద్ధరామయ్యను మార్చే ఉద్దేశం లేదని అధికారికంగా ఆయనను మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. సిద్ధరామయ్యను కొనసాగించాలనే వైఖరిలోనే ఉంది. కానీ డీకే శివకుమార్ వర్గం నుంచి వచ్చే ఒత్తిడి, ఎమ్మెల్యేల మద్దతు,2028 ఎన్నికల దృష్ట్యా పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమోనని డీకే వర్గం భావిస్తోంది. మరి ముందుముందు ఏమవుతుందో చూడాలి మరి -
‘లెక్కలతో సహా వస్తాం.. శాసనసభలో తేల్చుకుందాం’
మహబూబాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాళ్లపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. తాము చేసిన సవాల్కు సిద్ధమేనని, కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు వచ్చి చర్చకు సిద్ధంగా కావాలన్నారు. ప్రజల పట్ల ఏ మాత్రం నిబద్ధత ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు రావాలని, తాము కూడా లెక్కలతో సహా వస్తామని, శాసనసభలోనే తేల్చుకుందామన్నారు మల్లు. ఈ మేరకు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ ఒక పెద్ద మనిషి హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వచ్చి సవాళ్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి...! నీకు అర్ధం అయ్యింది ఏంటి..?, ముఖ్యమంత్రి.. మాజీ ముఖ్యమంత్రిని రమ్మని సవాల్ విసిరితే ఆయన్ను రానివ్వడం లేదు. CM సవాల్ ను జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. కేసీఆర్ను రమ్మంటే ఆయన్ను రానివ్వకుండా ప్రెస్ క్లబ్ ఎవరో వచ్చి సవాళ్లు చేస్తున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రెస్క్లబ్కు రమ్మంటావా?, ముఖ్యమంత్రి రేవంత్.. మాజీ ముఖ్యమంత్రిని చర్చకు రమ్మని స్పష్టంగా చెప్పారు.. ముఖ్యమంత్రికి ఏ బేసిన్ గురించి తెలియదు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా.. గోదావరి.. కృష్ణా జలాలు.. బేసిన్ గురించి.. ప్రజలకు తెలియ జేయడానికి చర్చించడానికి సిద్ధం. అసెంబ్లీలో చర్చకు మాజీ ముఖ్యమంత్రి రావాలి’ అని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యే అదితి పరువును ఫ్లెక్సీకి ఎక్కించి.. కార్యకర్త వినూత్న నిరసన
రాజా సాహెబ్ గారి బిడ్డ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. ఆమె దృష్టిలో పడడమే గొప్ప.. ఆమెతో ఫోటో దిగడమే మహా అదృష్టం.. ఆమెను ఏదైనా ప్రోగ్రాముకు పిలిస్తే ఆమె వచ్చి కొన్ని క్షణాలు అక్కడ నిలబడితే జీవితం ధన్యమైనట్లు భావిస్తున్న రోజులివి. అలాంటి కాలంలో ఒక చిన్న కార్యకర్త.. పేరు ఊరులేని సాధారణ క్యాడర్ ఏకంగా ఫ్లెక్సీ సాక్ష్యంగా ఎమ్మెల్యే పరువును నడిరోడ్డుమీద నిలబెట్టేశాడు.ఎమ్మెల్యే గారు.. మీరు గెలిచి ఏడాది దాటింది.. ఇంతకూ మీరు ప్రజలకు ఏం చేశారు చెప్పండి.. అసలు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనుల లిస్ట్ ఇదిగో చూడండి అంటూ ఎండగట్టేసాడు. మీ పనితీరు ఏం బాలేదు.. మీ ప్రోగ్రెస్ కార్డులో సున్నా మార్కులు వేస్తున్నా అంటూ బెత్తంతో కొట్టినట్లు చెప్పాడు. ఈ అంశం ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ టాపిక్ అయింది.తెలుగుదేశం సీనియర్ నాయకుడు పాలిట్ బ్యూరో సభ్యుడు అయిన అశోక్ గజపతిరాజు కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, విజయనగరం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలవడం అయితే గెలిచారు కానీ ఆమెకు పట్టణం మీద గ్రామీణ నియోజకవర్గ మీద ఎలాంటి పట్టులేదు. ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వెళ్లడం ఫోటోలు దిగి రావడం మినహా పట్టణ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదు. ప్రభుత్వంలో ఆమెకు ఆమె తండ్రికి మంచి పలుకుబడి ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి కోసం ఆమె ఏమీ చేయడం లేదన్నది ప్రజలకు అర్థమైంది. దీంతోపాటు కార్యకర్తల విషయంలో కూడా ఆమె పెద్దగా ఆసక్తికరంగా లేరని వారి భావన.అయినా సరే అశోక్ గజపతిని, ఆయన కుమార్తె అదితి గజపతిని ఎవరు ప్రశ్నించే ధైర్యం చేయలేరు. కానీ విజయనగరానికి చెందిన 28వ డివిజన్ కార్యకర్త తీగల ఆనందరావు అదితి గజపతి పరుగును ఫ్లెక్సీకి ఎక్కించాడు. రాజీవ్ నగర్ కాలనీలో మీరు చేయాల్సిన పనులు లిస్ట్ ఇది.. మీరు గెలిచి ఇన్నాళ్లు అయింది ఏ ఒక్క పని అయినా చేశారా?. దీని కోసమేనా మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ ఆయన పనుల జాబితాతో పాటు ప్రశ్నల పరంపరతో అదితిపై విరుచుకుపడ్డారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ తమ నాయకురాలు అసమర్థతను వీధిలో నిలబెట్టారు. అదితి విధేయులకు ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా ప్రజలు.. ఇతర కార్యకర్తలకు మాత్రం ఆనందరావు హీరోలా కనిపించాడు. ఎవరు ప్రశ్నించకపోయినా ఆయన మాత్రం గొంతు ఎత్తాడు.. అదితి పరువు నడివీధిలో నిలబెట్టారు అంటూ లోలోన సంబరపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
దటీజ్ వైఎస్సార్.. అందుకే జనాల గుండెల్లో నిలిచిపోయారు: వైఎస్సార్సీపీ
సాక్షి, ఆంధ్రప్రదేశ్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఘనంగా నిర్వహిస్తోంది. వైఎస్సార్ విగ్రహాలకు, పార్టీ కార్యాలయాల్లో చిత్రపటాలకు పార్టీ నేతలు నివాళులర్పించారు. మరపురాని మహానేతను స్మరించుకుంటూ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైయస్సార్ ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. క్రింది స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగిన మహానేత ఆయన. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన అందరి లాంటి ముఖ్యమంత్రి కాదు. స్వయంగా ప్రజాబలం కలిగిన నాయకుడు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్ అంటే నచ్చని ప్రభుత్వం వచ్చినా వాటిని పక్కన పెట్టలేకపోయారు. సుదీర్ఘమైన దూర దృష్టితో వైయస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేశారు. పేదరికం వలన విద్య మధ్యలో ఆగకూడదని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. పేదవాడు కూడా ఉన్నత హాస్పిటల్ వెళ్లి వైద్య సేవలు పొందాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించకపోయినా రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. నేడు ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ వస్తుందంటే అది వైయస్సార్ కృషి. ప్రజలకు ఏది అవసరమో అది గుర్తించి వాగ్దానం చేసి, అమలు చేసిన నాయకుడు వైయస్సార్..మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. ఒక సంతకం ఆటోగ్రాఫ్గా మారిందంటే అది వైయస్సార్ వలనే. వైయస్సార్ భౌతికంగా దూరమై మనకు దూరమైన ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా బతికే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం లేని మహానేత. రాజశేఖర్ రెడ్డి పుట్టింది ఆయన కుటుంబం కోసం కాదు, పేద బడుగు బలహీనవర్గాల కోసం. 2029లో వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే వైఎస్సార్ పాలన సాధ్యమవుతుంది.గుంటూరు తాడేపల్లి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమంవైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలుకేక్ కట్ చేసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి , ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ ,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలుమాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావువైఎస్సార్ పేద ప్రజల చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తిపేదలు మెరుగైన ఆరోగ్యం పొందుతున్నారంటే అది వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్లేవైఎస్సార్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగించారుమళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే వైఎస్సార్ ఆశయాలు కొనసాగుతాయిజోగి రమేష్ మాట్లాడుతూ.. తన పాదయాత్రతో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు వైఎస్సార్2009లోనూ కాంగ్రెస్ ను నిలబెట్టింది వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ,నయవంచకుడు చంద్రబాబు కలిసి వైఎస్సార్ బిడ్డ జగనన్నను ఇబ్బంది పెట్టారుజగనన్న తన పాలనతో భారదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శమయ్యాడుతల్లికి వందనం పథకం ఇచ్చి చంద్రబాబు తల్లడిల్లిపోతున్నాడుఎప్పుడు ఎన్నికలొచ్చినా మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనేవిజయవాడ నగర మేయర్,రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మా కులానికి దేవుడు వైఎస్సార్ఓసీ కులంలో ఉన్న మేం 40 ఏళ్లుగా పోరాడారుఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా మాకు న్యాయం జరగలేదుతొలిసారి ముఖ్యమంత్రి కాగానే వైఎస్సార్ మమ్మల్ని బిసిల్లో చేర్చారురాజకీయంగా మాకు అవకాశాలొచ్చాయంటే...మా పిల్లలు చదువుకుంటున్నారంటే వైఎస్సార్ చలవేతండ్రిబాటలో నడిచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డినేను విజయవాడ నగరానికి మేయర్ అయ్యానంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లేసమిష్టి కృషితో విజయవాడ నగరపీఠాన్ని దక్కించుకున్నాంనిన్న స్టాండింగ్ కమిటీలో ఏకగ్రీవంగా ఆరుస్థానాలు దక్కించుకున్నాంవచ్చే ఎన్నికల్లో సమిష్టిగా కలిసి పనిచేసి జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుందాంమాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రజల నాయకుడువ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబువ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి వైఎస్సార్రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన నాయకుడు వైఎస్సార్వైఎస్సార్ తెచ్చిన సంక్షేమం తొలగించే ధైర్యం ఎవరూ చేయలేరుజగన్ మోహన్ రెడ్డిని చూసి ఈ కూటమి ప్రభుత్వం భయపడుతోందివైఎస్సార్ ఆశయాలను కొనసాగించేలా వైఎస్ జగన్ ను మళ్లీ గెలిపించుకుందాంమాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. జగనన్న హయాంలో రాజశేఖరుడి సంక్షేమ పాలన చూశాంప్రస్తుతం ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందిరాష్ట్రంలో పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయ్మళ్లీ వైఎస్సార్ పాలన కావాలంటే జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలిరాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ ఎంతో మహోన్నతమైన వ్యక్తిఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి వైఎస్సార్ అండగా ఉండేవారునేనున్నాను అనే ధైర్యం అందరిలోనూ కల్పించిన వ్యక్తి వైఎస్సార్అనేక రాష్ట్రాల్లో వైఎస్సార్ గురించి నాయకులు గొప్పగా చెప్పుకునే వారువైఎస్సార్ ఆలోచనలను వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్లారువైఎస్సార్ రైతు రాజ్యం.. రామరాజ్యం రావాలంటే మనమంతా జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలివైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్సార్సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించారుఉచిత విద్యుత్ తో ఎంతో మంది రైతులు మేలు పొందారురెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారుపేదవాడికి విద్య,వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్సార్దేశంలోనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ఫీజురీయింబర్స్ మెంట్ వల్ల ఎంచో మంది విద్యావంతులయ్యారు... విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారుప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారురెండు పర్యాయాలు కాంగ్రెస్ ను జాతీయస్థాయిలో నిలబెట్టింది వైఎస్సార్వైఎస్సార్ ఆశయాల సాధనకోసం ఏర్పాటైన పార్టీ వైఎస్సార్సీపీతండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డితండ్రి నాలుగు అడుగులు వేస్తే కొడుకుగా జగన్ 10 అడుగులు ముందుకు వేశారువిద్య,వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారుఅందరికీ మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ కాలేజీలను తెచ్చారురైతే రాజులా ఉండాలని వైఎస్సార్,జగన్ పాలన అందించారుకూటమి పాలనలో అరాచకం కొనసాగుతోందికక్ష సాధింపుకే అధికారాన్ని వాడుకుంటున్నారుఅన్ని వర్గాల వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారుకూటమి అరాచకాలను తిప్పికొట్టేలా పోరాడదాంకాకినాడ జిల్లాపిఠాపురంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలువైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతాప్రత్తిపాడు లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలుమెగా రక్తదాన శిభిరాన్ని ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబుఒమ్మంగిలో వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి..పేదలకు వస్త్రాలు పంపిణీ చేసిన గిరిబాబుఎన్టీఆర్ జిల్లాజగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు.పట్టణంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ శ్రేణులు.గ్రామ గ్రామాన పండుగ వాతావరణం లో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పాఠశాలలలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు.ఎన్టీఆర్ జిల్లాతిరువూరులో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు.పట్టణంలో ఉన్న మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించిన ఇంచార్జ్- నల్లగట్ల స్వామిదాస్..పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేకు కట్ చేసి, మిఠాయిలు పంపిణీ..తూర్పుగోదావరి జిల్లారాజమండ్రి పార్లమెంటరీ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జన్మదిన వేడుకలుహాజరైన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు.. జక్కంపూడి రాజా కామెంట్స్రాజకీయాల్లో మానవీయ కోణాన్ని జోడించి పరిపాలన చేసిన మహోన్నతుడు వైయస్సార్ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్సిపికచ్చితంగా వైఎస్ఆర్సిపిని అధికారంలోకి తెచ్చుకుంటాం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కామెంట్స్...వైయస్సార్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ...పేద వర్గాల ఆర్థిక స్వావలంబనకు వైఎస్ఆర్ ఎంతగానో కృషి చేశారువైయస్సార్ ఆశయ సాధన కోసం ప్రారంభమైన పార్టీ వైఎస్ఆర్సిపిరానున్న రోజులో వైఎస్ఆర్సిపిని మరింత బలోపేతం చేసుకుంటాంవిజయవాడపోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి శ్రేణులువైయస్సార్ జయంతి సందర్భంగా 76 కేజీల కేక్ కట్ చేసిన వైస్సార్సీపీ శ్రేణులు.కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ మాజీ ఎమెల్యే మల్లాది విష్ణు, వైస్సార్సీపీ స్టేట్ సెక్రటరీ ఆసీఫ్ , రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు..వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి మాట్లాడుతూ.. వైఎస్సార్ జయంతిని ఓ ఉత్సవంలా నిర్వహిస్తున్నాంఅనేక సంక్షేమ పథకాలు పెట్టిన నేత వైఎస్సార్విదేశాల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే అదే రాజశేఖర్ రెడ్డి వల్లనే..40ఏళ్ళు అనుభవం అన్న చంద్రబాబు పాలన ప్రజలు చూస్తూనే వున్నారు..రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్లే వ్యక్తి జగన్..జోగి రమేష్, మాజీ మంత్రిప్రపంచంలో ఉన్న తెలుగు వారు గౌరవించే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి..పేద ప్రజలు పెద్ద పెద్ద చదువులు చదివారంటే దానికి కారణం వైయస్సార్ మల్లాది విష్ణు, మాజీ MLAతెలుగుజాతి ముద్దుబిడ్డ రాజశేఖర్ రెడ్డి గారు..సుదీర్ఘమైన పాదయాత్ర చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు..అనారోగ్యం పాలైన పాదయాత్ర ని కొనసాగించారు..తెలుగుదేశం వ్యవసాయం దండగ అంటే వ్యవసాయాన్ని పండగ చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డిఉచిత విద్యుత్ ద్వారా రైతులకు ఎంతో మేలు చేసిన వ్యక్తి..తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుందంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి.1200 కోట్లు రూపాయలు తొలి సంతకం తోనే రైతుల బకాయిలు రద్దు చేసిన వ్యక్తిఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారుకృష్ణాజిల్లా ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డిఅనేక ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు మచిలీపట్నం పోర్ట్ కి శంఖుస్థాపన చేశారు..తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ఆపరేషన్ చేయించుకొచ్చే అవకాశం కల్పించారు న్రాజశేఖర్ రెడ్డి ఆశయాలను వైఎస్ఆర్సిపి ముందు తీసుకొని వెళ్తుంది..రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందింది..రాష్ట్రాన్ని అప్పులు పని చేస్తుంది..ఎమ్మెల్యేలు పూర్తిగా అవినీతి అక్రమాలు చేస్తున్నారుఅన్ని రంగాల ప్రజల నుంచి ఓటమి ప్రభుత్వం చిత్కారం ఎదుర్కొంటుందిరాయన భాగ్యలక్ష్మి , నగర మేయర్..ఘనంగా రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వాడవాడల చేస్తున్నారు..రాజశేఖర్ రెడ్డి కంటే ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమం ఎక్కువ అందించారురాజశేఖర్ రెడ్డిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన సంక్షేమ పథకాలు గుర్తు వస్తాయి..చంద్రబాబును చూస్తే గుర్తొచ్చే ఒక సంక్షేమ పథకము లేదురాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలను మాత్రమే పేర్లు మార్చి చంద్రబాబు అమలు చేస్తాడుషేక్ అసిఫ్, వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శికూటమి పాలనలో చేశామని చెప్పుకోవడానికి ఎమ్ లేదు..శత్రువు సాయమడిగిన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డిమీ వస్తున్నాయి పథకాలు రాలేదని ప్రజలు అడిగితే మాట దాటవేస్తున్నారుబడుగు బలహీన వర్గాలకు రాజశేఖర్ రెడ్డి అండగా నిలించారు..పేద ప్రజల పిల్లలకు ఉన్నత స్థానాలు గెలుగా అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి మాత్రమే..సంక్షేమ అమలు చేయడంలో రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకేసారుఇటువంటి నాయకుడిని పోగొట్టుకున్న అంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు..పవన్ కల్యాణ్ దోచుకోండి దాచుకోండి అంటూ మాట్లాడుతున్నారు..ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో.. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి వేడుకలుమాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళికృష్ణా జిల్లాడా. వైఎస్ రాజశేఖరరెడ్డి 76 వ జయంతి సందర్భంగా ఉయ్యూరు బస్ స్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి,కేక్ కట్ చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు.విజయవాడపశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలువాడవాడలా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులుకార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలుగుంటూరు తాడేపల్లిలో..వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలుతాడేపల్లి వైఎస్సార్ సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులుపాల్గొన్న వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి , మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి , వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులుపేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్ఎంతమంది నేతలున్నా వైఎస్సార్ కు ప్రజల మనసులో ప్రత్యేకమైన స్థానం దక్కిందిపేదలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్సార్ఏ ప్రభుత్వమూ తీసివేయలేని సంక్షేమ పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారురైతులను ఆదుకున్న రైతు పక్షపాతి వైఎస్సార్పేద విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉన్నత విద్యను అందించారువైఎస్సార్ ఆశయాలను ఆయన తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి కొనసాగించారుఏపీలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందిప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు...ఇళ్ల పై దాడులు చేస్తున్నారుఅన్ని వ్యవస్థలను నాశనం చేశారువైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే మన ముందున్న కర్తవ్యంవైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి ప్రకటనవిశాఖపట్నంవిశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా దివంగత నేత వైయస్ జన్మదిన వేడుకలు.వైయస్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన పార్టీ నాయకులు.కేక్ కట్ చేసిన ఎంపీ గొల్ల బాబురావు విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి..యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.గొల్ల బాబురావు, రాజ్యసభ ఎంపీ..దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ జయంతి ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నాయి..కేవలం 5 సంవత్సరాల 3 నెలల్లో దేశ చరిత్రలో ప్రజలకు ఎవరూ చేయనంత మంచి వైఎస్సార్ చేశారు..వైఎస్సార్ లాంటి గొప్ప పాలనను జగన్ అందించారు..జగన్ ను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు..టీడీపీ, బీజేపీ,జనసేనకు అదే గతి పడుతుంది..విద్యుత్ చార్జీలు పెంచేది లేదని ఎన్నికల ముందు చెప్పారు.. ఇప్పుడు విద్యుత్ చార్జీల బాదుడికి పాల్పడుతున్నారు..జగన్ పాలన మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు..కేకే రాజు కామెంట్స్..వైఎస్సార్ అంటే హుందాతనం..ప్రత్యర్థులు సైతం కొనియాడేలా వైఎస్సార్ పాలన చేశారు..సంక్షేమం, సంస్కరణ అంటే డా. వైఎస్సార్ పాలనలా ఉండాలని అనుకునేలా పాలించారు..5 సంవత్సరాల 3 నెలల పాలనతో రాష్ట్రాన్ని సుభిక్షం చేశారు..ఈ భూమి ఉన్నంతకాలం వైఎస్సార్ పాలనను స్మరించుకుంటాం..వైఎస్సార్ ఆశయాల సాధన కోసం జగన్ పని చేస్తున్నారు..ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వైఎస్ కుటుంబానికే చెందింది..ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ మాటకు కట్టుబడి జగన్ పాలన అందించారు..వైఎస్సార్ ఆశయాలను ఆచరించి జగన్ ఆయన పాలనను మరిపించారు..మహిళ, బీసీ వర్గాలకు జగన్ న్యాయం చేశారు..వరుదు కళ్యాణి కామెంట్స్..డా.వైఎస్సార్ స్వర్ణయుగ పాలన అందించారు..పేద ప్రజల తమ గుండెల్లో వైఎస్సార్ కు గుడి కట్టుకున్నారు..అన్ని వర్గాల వారు తామే ముఖ్యమంత్రి అయితే ఎలా పాలిస్తారో వైఎస్సార్ అలాంటి పాలన అందించారు..రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న మళ్ళీ సీఎం కావాలి..అల్లూరి జిల్లాఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 వ,జయంతి వేడుకలు..పాడేరులో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కాకినాడ జిల్లా.. తునిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు.వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాఅనంతపురంవైఎస్సార్ జయంతి సందర్భంగా పోలీసుల అత్యుత్సాహంవైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులువైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనరాదని ఆంక్షలుతాడిపత్రి నియోజకవర్గంలో జరిగే వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్పీ జగదీష్ కు లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రి, యాడికి, పెద్దవడగూరు మండలాల్లో ఏదో ఒక కార్యక్రమంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన పెద్దా రెడ్డిశింగనమల నియోజకవర్గం తిమ్మంపల్లిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుతాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దవడగూరు మండలాలకు వెళ్లొద్దని నోటీసులు జారీ చేసిన పోలీసులుతిరుపతిలో.. తిరుపతిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ జన్మదిన వేడుకలుభారీ ఎత్తున నిర్వహించిన పార్టీ శ్రేణులువైఎస్సార్ కటౌట్లతో నగరంలో కోలాహలంపాల్గొన్న భూమన అభినయ్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు -
రైతే రాజులా ఉండాలని వైఎస్సార్, జగన్ పాలన అందించారు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: దివంగత మహానేత వైఎస్సార్ రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారు. తండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్ అని సుబ్బారెడ్డి కొనియాడారు. రైతే రాజులా ఉండాలని వైఎస్సార్, జగన్ పాలన అందించారని చెప్పుకొచ్చారు.వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్సార్. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించారు. ఉచిత విద్యుత్తో ఎంతో మంది రైతులు మేలు పొందారు. రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారు. పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్సార్. దేశంలోనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.ఫీజురీయింబర్స్మెంట్ వల్ల ఎంతో మంది విద్యావంతులయ్యారు.. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ను జాతీయ స్థాయిలో నిలబెట్టింది వైఎస్సార్. ఆయన ఆశయాల సాధన కోసం ఏర్పాటైన పార్టీ వైఎస్సార్సీపీ. తండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్. తండ్రి నాలుగు అడుగులు వేస్తే కొడుకుగా జగన్ 10 అడుగులు ముందుకు వేశారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ కాలేజీలను తెచ్చారురైతే రాజులా ఉండాలని వైఎస్సార్, జగన్ పాలన అందించారు. కూటమి పాలనలో అరాచకం కొనసాగుతోంది. కక్ష సాధింపుకే అధికారాన్ని వాడుకుంటున్నారు. అన్ని వర్గాల వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి అరాచకాలను తిప్పికొట్టేలా పోరాడుదాం. మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకుందాం’ అని పిలుపునిచ్చారు. -
కేటీఆర్.. ఎందుకు నీకింత అహంకారం?
సాక్షి, ములుగు: ప్రభుత్వం తప్పులు చేసిందని అనిపిస్తే అసెంబ్లీలో నిలదీయాలని.. అంతేగానీ రోడ్ల మీదకు రావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఉద్దేశించి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె.. కేటీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలంటే నీకు గిట్టదు. సొంత చెల్లె నీ అహంకారాన్ని చూసి నీపై మట్టి పోస్తోంది. నువ్వు ఓర్తలేవని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇప్పుడు ఆదివాసి మహిళా అని చూడకుండా నన్ను టార్గెట్ చేస్తున్నావ్.. ఎందుకు?. ఇలా చేసి నువ్వు సాధించిందేది ఏమిటి?. కేటీఆర్.. నీకు ఎందుకు ఇంత అహంకారం. నీవు నిజంగా వాస్తవాల మీద బతికిన వాడివైతే చెప్పు.. మేము ఎంతమందిని ఇబ్బంది పెట్టాం ఎవరిని జైలుకు పంపించాం.70 ఏళ్ల చరిత్రలో కోయ వర్గానికి మంత్రి పదవి రాలేదు. ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. నేను తప్పులు చేశానని చెప్పడం కాదు.. అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలి. అంతేగానీ పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి రోడ్లమీద పోర్లాడితే సానుభూతి వస్తుందనుకోవడం నీ మూర్ఖత్వం. .. పదేళ్లు అధికారంలో ఉండి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైన మీరు.. ములుగులో సీతక్క రాజ్యం . పోలీస్ రాజ్యం అంటూ ధర్నాలు చేస్తారా?. ములుగు లో నడుస్తుంది ప్రజారాజ్యం .ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన. ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టామో మీ దగ్గర లెక్క ఉంటే తీయండి. నిలదీయండి. దుబాయ్ లాంటి ప్రాంతాల్లో స్టూడియోలు ఏర్పాటు చేసి మాపై రోత వార్తలు రాపియడం ప్రజలు గమనిస్తున్నారు. ఆదివాసీ బిడ్డనైన నన్ను టార్గెట్ చేయడానికి మిడుతాల దండును పంపిస్తున్నావా కేటీఆర్. మేం సమ్మక్క సారక్క వారసులం. మా జోలికి వస్తే నాశనమై పోతావు అని మంత్రి సీతక్క అన్నారు.తాజాగా మంత్రి పొంగులేటితో జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలు కాపాడాలంటూ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల అరెస్టుతో ములుగు కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
Harish Rao: రెండోసారి కాళేశ్వరం విచారణకు..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు కాళేశ్వరం కమిషన్ ముందు మరోసారి హాజరు కానున్నారు. మళ్లీ విచారణకు రావాలంటూ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు సిద్ధమయ్యారు. అయితే..విచారణకు ముందు హరీష్రావు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాతే ఆయన బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. గత విచారణలో.. ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతులు ఉన్నాయని హరీష్రావు స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. గతంలో ఇచ్చిన వాంగ్మూలం, ప్రభుత్వం అందించిన కేబినెట్ నోట్స్ మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇవాళ మరోసారి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.మాజీ ENC అనిల్ కుమార్ హాజరు.. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో బుంగలు పూడ్చడంపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. కమిషన్కు తెలియకుండా బ్యారేజీల్లో గ్రౌంటింగ్ చేయడంతో అనిల్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది. కేబినెట్ మినిట్స్ పరిశీలనక్యాబినెట్ రాటిఫికేషన్స్ పై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేబినెట్ ప్రొసీజర్ పై ఇరిగేషన్, ఫైనాన్స్ ఉన్నతాధికారులను అడిగిన కమిషన్.. కేబినేట్ నిర్ణయాల ప్రొజిజర్ ఎలా ఉంటుందనే వివరాలను GAD అధికారులను అడిగి తెలుసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 28 ప్యాకేజీల్లో కేబినెట్ ముందుకు ఎన్ని వచ్చాయనే విషయాన్ని అడిగిన జస్టిస్ పీసీ ఘోష.. ప్రాజెక్టు లొకేషన్లు, డిజైన్ల మార్పుకు సంబంధించిన ఫైల్స్ కేబినేట్ ముందుకు వచ్చాయా? విషయంపై కమిషన్ ఆరా తీశౠరు. అలాగే.. నిధుల మంజూరులో పారదర్శకత ఉందా లేదా అనే విషయం పైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. -
మహానేత వైఎస్సార్ జయంతి.. తెలంగాణ నేతల నివాళులు
సాక్షి, హైదరాబాద్: నేడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి. ఈ సందర్భంగా మహానేత వైఎస్సార్కు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు నేతలు ఘన నివాళి అర్పిస్తున్నారు. ప్రజలకు వైఎస్సార్ అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ..‘జనహృదయ నేతకు నివాళి. రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత, అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా చిరస్మరణీయుడైన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళి. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, వారి అడుగుజాడల్లో ప్రజాపాలన సాగిస్తున్నాం’ అని అన్నారు.తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ..‘అవిశ్రాంత ప్రజా సేవకులు. వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనం. మహానేత, అభివృద్ధి ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు’ అర్పించారు.మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ..‘జన హృదయనేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారికి నా హృదయపూర్వక నివాళి. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని.. ప్రజాసంక్షేమమే విధానంగా ప్రభుత్వం నడవాలని.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, చిర స్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు వైఎస్సార్’ అని అన్నారు. -
జన్మ సార్థకత వైఎస్కే చెల్లింది!
‘పుట్టిన రోజు పండగే ప్రతి ఒక్కరికి.. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే’’ పాత సినిమా పాట ఇది. కాకపోతే... దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అతికినట్లు సరిపోతుంది ఇది. వచ్చిన అవకాశాలను ప్రజల కోసం వినియోగించిన తీరు గమనిస్తే పుట్టింది ఎందుకో తెలిసిన వ్యక్తులలో వైఎస్సార్ అగ్రభాగాన ఉంటారు. సంపన్న కుటుంబంలో జన్మించినా సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడడం ఆయన ప్రత్యేకత. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మలమడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు. రూపాయి డాక్టర్గా సేవలందించి ప్రజల మన్నన చూరగొన్నారు. రాజకీయాలలోనూ ఆయన తన విధానాలను వదులుకోలేదు. ఎన్నో ఎగుడు దిగుడులు చూశారు. సవాళ్లు ఎదుర్కున్నారు. అయినా ఓటమి ఎరుగని నేతగా రికార్డు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు... విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఈ రికార్డు దక్కింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్కు మాత్రమే. ఎమ్మెల్యేగా పోటీచేసినా, ఎంపీగా ఎన్నికల బరిలో దిగినా ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు. 1996లో కడప లోక్సభ సీటు నుంచి పోటీచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ గెలవడం ఒక సంచలనం. 1999లోనే ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కాని అప్పట్లో టీడీపీ బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం, కార్గిల్ యుద్ద ప్రభావం, ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కోల్పోయారన్న సానుభూతి వంటి కారణాలు కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా చేశాయి. ఆ దశలో ప్రతిపక్ష కాంగ్రెస్కు వైఎస్ నాయకత్వం వహించారు. అప్పట్లోనూ చంద్రబాబు నాయుడు తన సహజశైలిలో వైఎస్ వ్యక్తిత్వ హననం నానా ప్రయత్నాలూ చేశారు. బ్యానర్లు కట్టారని, ఎన్నికల నిబంధనలు సరిగా పాటించలేదని, ర్యాలీలు తీశారన్న చిన్న చిన్న కారణాలపై కూడా కేసులు పెట్టించి వ్యతిరేక ప్రచారం చేసేవారు. వాటిని బూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగేది. ఇందుకు టీడీపీ మీడియా తోడు ఉండనే ఉంది.1999లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా వైఎస్ దానిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. తదుపరి పాదయాత్రను ప్లాన్ చేసుకుని జనంలోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు వ్యతిరేకించాయి. సొంతంగా ఎదగడానికి యత్నిస్తున్నారని, భవిష్యత్తులో సోనియా గాంధీని కూడా ధిక్కరిస్తారని పితూరీలు చెప్పేవారు. అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తూండేది. దాంతో వైఎస్ కొన్నిసార్లు ఇబ్బందులు పడేవారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వద్ద అనారోగ్యానికి గురయ్యారు. సోనియా గాంధీని అక్కడకు తీసుకురావాలని కొంతమంది నేతలు యత్నించారు కాని ఎందువల్లో ఆమె రాలేదు. అయినా వైఎస్ తన పాదయాత్రను వదలి పెట్టలేదు. 2003లో చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ దాడి చేసినప్పుడు వైఎస్ తిరుపతి వెళ్లి పరామర్శ చేసి దాడికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. అప్పట్లో చంద్రబాబు సానుభూతి వస్తుందని ఆశించి శాసనసభను రద్దు చేశారు. కాని వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూశారు. పాదయాత్ర ద్వారా ప్రజలలో వచ్చిన ఆదరణను నిలబెట్టుకునేందుకు వైఎస్ యత్నించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ గ్రూపులను సైతం కలుపుకుని వెళ్లడానికి సిద్దపడ్డారు. అక్కడ నుంచి ఆయన రాష్ట్ర చరిత్రను ,గతిని మార్చేశారని చెప్పాలి. 2004లో కాంగ్రెస్ను విజయపథంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కరాదని కొన్ని యత్నాలు జరగకపోలేదు. అయినా ఆయన తొణకలేదు. చివరికి వైఎస్ కాకుండా మరెవరికైనా సీఎం పదవి ఇస్తే ప్రభుత్వం నడవడం కష్టమని తెలుసుకుని, అధిష్టానం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉచిత విద్యుత్పై తొలి సంతకం మొదలు అనేక హామీల అమలుకు కృషి చేశారు. అంతకుముందు ఒకసారి ఎంపీల సమావేశంలోకాని, ఇతరత్రాకాని నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టకపోతే చరిత్ర హీనులవుతారని ఆనాటి పాలకులను రాజశేఖరరెడ్డి హెచ్చరించే వారు. వైఎస్కు భయపడి ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాని 2004 వరకు ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఆ సమయంలో వైఎస్ ఒక కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాల వద్ద పూలు పెట్టివచ్చారు. ఆ సంగతులు అన్నిటిని గుర్తుంచుకున్న వైఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే ప్రాజెక్టులపై సమీక్ష చేసి వాటిని ఎలా పరుగు పెట్టించాలా అని ఆలోచన చేశారు. వైఎస్ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు. ఉమ్మడి ఏపీలో ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి. రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు విస్తరణతో సహా హంద్రీ నీవా, గాలేరు-నగరి, గండికోట ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టారు. తెలంగాణలో ఎల్లంపల్లి, కల్వకర్తి, బీమా, ప్రాణహిత-చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోస్తాంద్రలో పోలవరం, పులిచింతల, వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలైవని ఉన్నాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో తెలంగాణ వారితో పాటు ఆంధ్రకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు, నిరసనలు ఎదుర్కున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు తవ్వుతుంటే టీడీపీ ఎన్నో ఆటంకాలు కల్పించింది. అయినా ఆయన ఆగలేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కావల్సిన అనుమతులు తేవడంలో వైఎస్ చూపిన శ్రద్ద నిరుపమానం. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకున్నదంటే ఆ ఘనత ఆయనదే. పులిచింతల నిర్మాణం దశాబ్దాల తరబడి స్తంభించిపోతే వైఎస్సార్ దానిని చేసి చూపించారు. దానిని వ్యతిరేకించే తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఒప్పించి మరీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. ఒక నేత ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావని భావిస్తే, వైఎస్ మాత్రం మనం మొదలుపెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారంటూ విశాల దృక్పథంతో ఆరంభించారు. ఈ రోజు విభజిత ఆంధ్ర ఈ మాత్రమైనా నిలబడిందంటే అది వైఎస్ గొప్పదనమని అంగీకరించక తప్పదు. ఇది మాబోటివాళ్లం ఇప్పుడు చెప్పడం లేదు. 2009 నుంచే చెబుతున్నాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం కట్టిన ఒక సీఎం హైదరాబాద్ తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ ప్రచారం లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు ఒక రూపం తెచ్చారు. అదంతా ఒక ఆధునిక నగరంగా మారిందంటే బీపీ ఆచార్య అనే ఐఎఎస్ అధికారిని నియోగించి వైఎస్ చేసిన కృషే అని చాలామందికి తెలియక పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ప్రచారం చేసుకోలేకపోయింది. టీడీపీ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకతను భరిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మూడువంతులు పూర్తిచేశారు. హైదరాబాద్ దశ, దిశను మార్చిన గొప్ప ప్రాజెక్టు అది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణమే కాకుండా, అక్కడకు వెళ్లడానికి వీలుగా ఎక్స్ప్రెస్ వంతెనను 13 కిలోమీటర్ల దూరం నిర్మించడం ద్వారా ఆయనకు ఉన్న విజన్ను ప్రజలకు తెలియ చేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన నేతగా, విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టి పేదలకు విద్యాదానం చేసిన వ్యక్తిగా చరిత్రపుటలలోకి ఎక్కారు. 2009లో ఆయనను ఓడించడానికి టీడీపీ ఏకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసిందంటేనే వైఎస్ ఎంత శక్తిమంతుడుగా అవతరించారో అర్థం చేసుకోవచ్చు. పరస్పర విరుద్ద భావాలు కలిగిన టీడీపీ, టీఆర్ఎస్(నేటి బీఆర్ఎస్), సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూటమి కట్టినా 2009లో వైఎస్ను ఓడించలేకపోయాయి. మొత్తం బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి రావడానికి కూడా వైఎస్ కారణభూతులయ్యారు. అయినా ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. వైఎస్ జీవించి ఉన్నా, వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ను సీఎంగా చేసినా ఉమ్మడి ఏపీ భవిష్యత్తు మరోలా ఉండేదని చాలామంది నమ్ముతారు. ఏది ఏమైనా వైఎస్ సీఎంగా చేసింది ఐదేళ్ల మూడునెలల కాలమే అయినా, ఒక శతాబ్దానికి సరిపడా పేరు తెచ్చుకుని గొప్పనేతగా ప్రజల మదిలో నిలిచిపోయారు.వైఎస్ రాజశేఖరరెడ్డికి జయంతి సందర్భంగా ఇదే నివాళి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
10న రాష్ట్ర మంత్రివర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 10న మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. విధానపరమైన అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి నెలా రెండు పర్యాయాలు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీ సుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమావేశా న్ని నిర్వహించనుంది.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమరి్పంచిన తుది నివేదికపై మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. దీని ఆధారంగా బరాజ్ల పునరుద్ధరణకు తదుపరి కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. ఈనెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిపై కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. స్టాంపుల చట్ట సవరణ బిల్లును మంత్రివర్గం ఆమోదించనుంది. -
మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడి
నెల్లూరు: జిల్లాలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. సోమవారం(జూలై 7) రాత్రి సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రి నగర్లో ఉన్న ప్రసన్న కుమార్ ఇంటిపై ఎంపీ వేమిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ప్రసన్న కుమార్ ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆయన ఇంటి దగ్గర ఉన్న రెండు కార్లు ధ్వంసం చేశారు. -
గొర్రెలు.. బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలి?..తనకు కేటాయించిన శాఖలపై మంత్రి అసంతృప్తి
సాక్షి, కరీంనగర్ జిల్లా: తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కింద ఇచ్చిన శాఖలపై శ్రీహరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి.ఇది అదృష్టమో, దురదృష్టమో తెల్వదు.పదేళ్లలో ఆగమైన శాఖలను నాకు ఇచ్చారు. పశుసంవర్థక శాఖ గందరగోళంగా ఉంది.ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయి.యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలి..? గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి?అని వ్యాఖ్యానించారు. -
‘ఏపీలో ఏడాదిలోనే 5 వేల స్కూళ్లు మూసివేశారు’
విజయవాడ: కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతామోహన్,. అసలు పేదలు చదువుకోవడం అనేది చంద్రబాబుకు అస్సలు ఇష్టం ఉండదని ధ్వజమెత్తారు చింతామోహన్. అందుకే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 5వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేశారని మండిపడ్డారు చంద్రబాబు పాలనలో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఈ ఏడాది మరో ఐదు వేల స్కూల్స్ మూసివేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, పేదల చదువుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదనేది ఈ తరహా చర్యలతోనే అర్థమవుతుందని విమర్శించారు. ‘రాబోయే రోజుల్లో 35 వేల ప్రాథమిక పాఠశాలలను 10 వేలకు కుదించాలని చూస్తోంది. తల్లికి వందనం పథకం డబ్బులతో భార్య భర్తల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చురేపారు. తల్లికి వందనం పథకం డబ్బును స్కాలర్ షిప్ ల ద్వారా నేరుగా పాఠశాలలకే ఇవ్వాలి. ఉపాధి హామీ పథకం కూలీలకు కూటమి ప్రభుత్వం 10శాతమే కూలీ ఇస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోంది. మూడు నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్ లకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. అమరావతిలో రైతులకు ఇచ్చిన హమీలను ఈరోజు వరకూ చంద్రబాబు నెరవేర్చలేదు. అమరావతికి నేను వ్యతిరేకం కాదు..కానీ మీ అమరావతి సక్సెస్ కాదు. చంద్రబాబు కాన్సెప్ట్ పూర్తిగా విఫలం చెందింది. రైతులు మనస్పూర్తిగా భూములు ఇవ్వడం లేదు. అమరావతిలో మూరెడు మట్టి తీస్తే చారెడు నీరు వస్తోంది. నీళ్లల్లో ఏ నగరం కడతావయ్యా చంద్రబాబు. గన్నవరంలో ఎయిర్ పోర్టు ఉంటే అమరావతిలో మరో ఎయిర్ పోర్టు కడతానంటున్నాడు. 30 కిలోమీటర్ల దూరంలోనే మరో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఎందుకు?, చంద్రబాబు ఎవరిస్తున్నారయ్యా నీకు ఇలాంటి సలహాలు. రైతుల నోళ్లు కొట్టి భూములు తీసుకుని వాళ్లకిచ్చిన హామీలు తప్పి ఎందుకు ఇలాంటి పనులు. రైతులకు నష్టం చేసి నువ్వు ప్రతిఫలం పొందాలనుకునే ఆలోచన మానుకో. కుప్పంలో పేదరికం తీసేయలేనోడు..రాష్ట్రంలో ఏం చేస్తాడంట’ అని చింతామోహన్ విమర్శించారు. -
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. జులై 9న (బుధవారం) వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనలో ‘పార్టీ శ్రేణులు 500 మందికి మించరాదు. రోడ్షో, పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి మించి ఉండకూదు’అని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా వస్తుండటంతో కూటమి ప్రభుత్వం కంగారు పడుతోంది. ఇప్పటి వరకు మామిడి రైతులను ఆదుకోవడంలోనూ, వారికి మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి, కూటమి పెద్దలు కుట్రలకు దిగారు. బంగారుపాళ్యం పర్యటనపై అనుమతులు ఇచ్చే విషయంలో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. జగన్ జెండా వదిలేదే లేదు’
పల్నాడు: సత్తెనపల్లి పోలీసులు అమాయకులని, అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి పెడుతున్నారని కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పేర్ని నానికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు(జూలై 7) విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి పోలీసులు అమాయకులు. అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్నందుకు నాపై కేసు పెట్టారు. పోలీసులు నిన్న మా ఇంటికి నోటీసు అంటించి వెళ్ళిపోయారు. 11 సెక్షన్లతో నామీద నేరం నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు 100 మందిలో నేను ఒక వ్యక్తిని. నా మీద కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు, సస్పెండ్ గాని చేస్తామని అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో సైకో పరిపాలన నరకాసుని పరిపాలన జరుగుతుంది. మహా అయితే బందర్ నుండి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి జగన్ జెండా వదిలేదే లేదు’ అని పేర్ని నాని స్పష్టం చేశారు. -
నటితో అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో ప్రముఖ నేత కుమారుడి వీరంగం
ముంబై: ముంబైలో కలకలం. మద్యం మత్తులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు జావేద్ షేక్ కుమారుడు రాహిల్ జావేద్ వీరంగం సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించి నటి రాజశ్రీ మోరే పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కారును ఢీకొట్టి దూర్భలాడాడు. తనతో ఎందుకు ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తే.. ఇదిగో కావాలంటే డబ్బులు తీసుకో అంటూ నటిని బెదిరిస్తున్న వీడియోలో వెలుగులోకి వచ్చాయి.గత ఆదివారం (జూలై 6న) ముంబైలోని అంధేరి ప్రాంతంలో రాహిల్ మోతాదుకు మించి మద్యం సేవించాడు. అంధేరి నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా.. మార్గం మధ్యలో నటి రాజశ్రీ మోరే కారును ఢీ కొట్టాడు. దీంతో రాజశ్రీ.. రాహిల్పై వాగ్వాదానికి దిగింది. అర్ధ నగ్నంగా ఉన్న రాహిల్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మహరాష్ట్ర నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు జావెద్ షేక్ అని బెదిరించాడు. ఇరువురి వాగ్వాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో రాహిల్ ఘర్షణకు దిగారు. తాజా సమాచారం ప్రకారం.. రాహిల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఇటీవల మరాఠీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనని లక్ష్యంగా చేసుకున్నారని రాజశ్రీ ఆరోపించారు. ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The son of MNS leader Javed Shaikh abuses (in Hindi/Urdu, of course) a Marathi girl after hitting her car. He even mocks her Marathi surname.Let’s see whom the Thackeray brothers choose, a Marathi-speaking Maharashtrian or a Hindi-speaking Muslim. pic.twitter.com/xxamEFlTn7— Mr Sinha (@MrSinha_) July 7, 2025మహారాష్ట్రలో భాషా వివాదం మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది. ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన(యూబీటీ) శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబైతోపాటు మహారాష్ట్ర భాషగా మరాఠీని ఆయన అభివర్ణించారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మరాఠీని నేర్చుకుని మాట్లాడి తీరవలసిందేనంటూ స్పష్టంచేశారు. మీ మాతృభాషను మీరు ప్రేమించి, గౌరవిస్తే ఇతర భాషల పట్ల కూడా మీరు అలాగే వ్యవహరిస్తారు అని ఫడ్నవీస్ చెప్పారు.నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలుఈ వివాదంపై నటి రాజశ్రీ మోరే స్పందించారు. మహరాష్ట్రలో మరాఠీ భాషను తప్పనిసరి చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో.. మరాఠీలు ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తారు. కానీ భాషను రద్దు ప్రయత్నం చేయడం వల్ల వలసదారులు నగరం విడిచిపెడతారని అన్నారు. అదే జరిగితే ముంబైలోని స్థానిక మరాఠీ సమాజం పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ ప్రకటనల తర్వాత, నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలు వెల్లువెత్తాయి.నేపథ్యంలో, రాజ్శ్రీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మరాఠా భాషపై స్పందించిన వీడియోను డిలీట్ చేశారు. ఎంఎస్ఎన్ మద్దతు దారులు సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబు వంద చెబితే.. లోకేష్ రెండొందలు చెబుతున్నాడు
సాక్షి, కాకినాడ: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు కచ్చింగా మోసపోతారని.. ఇలా మాయమాటలు చెప్పేవాళ్లను మోసగాళ్లు అనడంలో తప్పే లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం వంగా గీత అధ్యక్షతన పిఠాపురంలో జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అసలు సూపర్ సిక్స్ వాగ్ధానాలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయ్యరా?. అడిగితే మక్కెలు విగకొడతాం, తాట తీస్తాం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు తేరగా ఉన్నారా?. ఒక్కసారి గ్రామాల్లో తిరగండీ.. ఎవరికి మక్కెలు విరగకొడతారో తెలుస్తుంది.మాయమాటలు చెప్పేవాళ్ళను మోసగాళ్ళని అనలా? వద్దా?. కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగం ఇచ్చిందా?. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు మోసపోతారు. చంద్రబాబు వంద అబద్దాలు చెబితే.. లోకేష్ రెండు వందల అబద్దాలు చెబుతారు. ఏప్రిల్.. మే మాసంలో రైతులు అన్నదాత సుఖీభవ ఇస్తామని లోకేష్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఇప్పుడు ఏ నెల నడుస్తుందో రైతులు,ప్రజలు గుర్తించాలి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు వెళ్ళాలి అని బొత్స పిలుపు ఇచ్చారు. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జి వంగా గీతా మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాకు వెన్నంటే ఉన్నారు. ఏలేరు వరదల సమయంలో జగన్ వెంట జనం ఉన్నారు అని చూపించారు.దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక వీదికో రెండు బెల్టు షాపులు పెట్టారు. నాణ్యమైన గంజాయి వ్యాపారం చేసి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు. చంద్రబాబు మాటలకు విలువలు..విశ్వసనీయత ఉండదు. అందుకే బాబు హమీలకు నాది భాధ్యత అని గత ఎన్నికల్లో పవన్ చెప్పారు. ఇద్దరు మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ధాన్యాగారంగా ఉన్న పిఠాపురంలో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటీ?. నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు కుప్పాన్ని...స్వర్ణ కుప్పం ఎందుకు చేయ్యలేదు. సుపరిపాలనలో తొలి అడుగుకు టీడీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు.జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అయిన తరువాత పిఠాపురం నియోజకవర్గం కు పవన్ ఎన్నిసార్లు వచ్చారు?. పిఠాపురం లో ప్రజల సమస్యల మీద ఒక్క క్షణం ఆలోచించే పరిస్ధితిలో లేరు. వాలంటీర్ల ద్వారా అదృశ్యమయ్యారని చెప్పిన పవన్.. మరి ఆ మహిళలను వెనక్కి తీసుకువచ్చారా?. కాపు సామాజిక వర్గంలో యువత పవన్ ను హీరోగా భావించి వెనుక తిరిగారు. వారంతా ఇప్పుడు తమను తాము ప్రశ్నించుకోవాలి. పవన్ ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీ పెట్టారా?. లేదంటే చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేయ్యడానికి పార్టీని పెట్టారా? చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయ్యాలని తాపత్రాయ పడే పవన్ ను హీరోగా చూడడం ఖర్మ.వంగవీటి మోహన రంగా , ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళను కాపులు హీరోలుగా చూడాలి. సినిమాలో నాలుగు స్టెప్పులు వేసి..బయటకు వచ్చి మైక్ పట్టుకున్న వ్యక్తిని హీరోగా చూడడం దౌర్భాగ్యం. రానున్న రోజుల్లో పవన్ కల్యాణ్కు, వంగా గీతా కు మధ్య ఉన్న వ్యత్యాసం పిఠాపురం ప్రజలకు కచ్చితంగా తెలుస్తుంది. రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురం లో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలి.తోట నరసింహం మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైఎస్ జగన్. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా అనేక సంక్షేమ పధకాలు అమలు చేశారు. మేనిఫెస్టోను భగవత్ గీత,బైబిల్,ఖురాన్ గా ఆరాధించారు. మరో 15-20 ఏళ్ళు కూటమి కలిసే ఉంటుందని పవన్ అంటున్నారు. పిఠాపురం లోనే కూటమీకి బీటలు వారాయి. జెండాలతో.. కుర్చీలతో కూటమి నేతలు కొట్టుకుంటున్నారు. -
విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం సోమవారం చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి నేతలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. దీంతో.. వర్సిటీ ప్రధాన ద్వారం వద్దే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో పార్టీ నేతలు, విద్యార్థులు, యువకులు గుణదల నుంచి హెల్త్ యూనివర్సిటీ దాకా భారీగా ర్యాలీకి వచ్చారు. అయితే ఈ సమాచారంతో అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ వద్దకు చేరుకోగానే వాళ్లను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో విద్యార్థి నాయకులు యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద భైటాయించి నిరసన తెలుపుతున్నారు. -
ఆ మాటల మతలబు ఏమిటి పవన్?
జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లూ మామూలే కానీ.. పవన్ కల్యాణ్తోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ల ఈ మాటల వెనుక ఏదో నిగూఢ అర్థం ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. 2024 నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గెలిచిన తీరుపై ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి. టీడీపీ ఆర్భాటంగా ప్రకటించి అమలు చేయని సూపర్ సిక్స్ వాగ్ధానాల ప్రభావం కొంత ఉంటే ఉండవచ్చునేమో కానీ.. వైఎస్సార్సీపీకి అనూహ్యంగా తగ్గిన సీట్లు ఈవీఎంల మహిమ వల్లేనని సామాన్యులతోపాటు మేధావులూ బహిరంగంగానే ప్రకటించారు. కూటమి నేతల మాటలిప్పుడు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఏడాది కూటమి పాలనలో జరిగిన పరిణామాలు, కూటమి నేతల దాష్టీకాలు, పోలీసులను అడ్డంపెట్టుకుని తమను వేధిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు చాలా ఆగ్రహంతో ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కొన్నేళ్లు ఓపిక పడితే మళ్లీ అధికారం మనదే అని భరోసా కూడా ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే జగన్కు రాష్ట్రం నలుమూలల్లోనూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒకరకమైన పట్టుదలతో ఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఎక్కడ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడో అన్న భయం పట్టుకుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ మధ్యే ఒక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మళ్లీ గెలిచే పరిస్థితిలోకి వచ్చిందన్న అర్థంతో మాట్లాడారు. అలాగే జగన్ను ఒక భూతంలా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలూ చేశారు. మంత్రి లోకేశ్ కూడా పలు సందర్భాల్లో జగన్ మళ్లీ వస్తే ఏమిటని పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారని.. చెబతూండటం ప్రస్తావనార్హం. ఈ వ్యాఖ్యలన్నింటి ద్వారా స్పష్టమయ్యే విషయం ఒక్కటే.. ఓటమి ఎదురుదెబ్బ నుంచి జగన్ బాగా పుంజుకున్నట్లే అని! ప్రజాదరణ బాగా పెరిగిందీ అని! దీనికి కారణం ఏమిటో కూడా కూటమి నేతలకు బాగానే తెలుసు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతూండటంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. కూటమి నేతలు మాత్రం ఈ మాట చెప్పకుండా, జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అప్రమత్తంగా ఉంటామని అంటున్రాను. తాజాగా పవన్ కల్యాణ్ కూడా సరిగ్గా ఆ దారిలోనే మార్కాపురం సభలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ వారు మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారో తామూ చూస్తామని అన్నారు. అధికారంలో ఉన్న వారు తాము తిరిగి అధికారంలోకి వచ్చేలా పాలన చేస్తున్నామని, మానిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తున్నామని చెప్పగలగాలి. ఏడాది సమయంలో ఏమి సాధించారో చెప్పాలి. కాని ఈ ముగ్గురు నేతలు పెద్దగా వాటి జోలికి వెళ్లడం లేదు. పవన్ కూడా జగన్ టైమ్ లో అభివృద్ది జరగలేదని విమర్శించారు. పవన్కు నిజంగా అభివృద్దిపై శ్రద్ద ఉంటే మార్కాపురంలో జగన్ హయాంలో చేపట్టిన వైద్యకళాశాల భవనాలను చూసి ఉండాల్సింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భవనాల నిర్మాణం ఎందుకు ఆగిందో చెప్పి ఉండాలి.అంతేకాదు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాది కాలంగా ఎందుకు పూర్తి చేయలేదు? నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? వీటిపై మాట్లాడకుండా, వైఎస్సార్సీపీ వారు అనని మాటలను వారికి అంటకట్టి సినిమా డైలాగులు చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? పవన్ తరచు సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారట. కొత్త సినిమా ప్రచారం గురించి అప్పడప్పుడు కొన్ని సభలు పెట్టుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కుత్తుకలు కోస్తామని, గూండాగిరి చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పవన్ చెబుతున్నారు. అబద్దాలు చెప్పడంలో టీడీపీ రికార్డును దాటిపోవాలని పవన్ అనుకుంటే ఎవరం ఏమీ చేయలేం. ఈ ఏడాదిలో కూటమికి చెందిన వారు ఎన్ని దాడులు చేశారు? వైఎస్సార్సీపీ వారు ఎంతమంది హత్యలు, దాడులకు గురయ్యారు? తప్పుడు కేసులలో పెట్టి ఎందరిని అరెస్టు చేశారు? అన్నవి పవన్ కు తెలియదా! అయినా.. అధికారంలో ఉన్నప్పుడు అంతా హాపీ అనుకుంటూ పవన్ అనుకోవచ్చు. రాజకీయ విమర్శల వరకు ఓకే. కాని వైఎస్సార్సీపీ వారు అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామని అనడంలోనే అనుమానం కలుగుతుంది. బహుశా గత ఎన్నికలలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లోనూ ఈవీఎంలు తమని గట్టెక్కిస్తాయన్న ధీమానా? ఒక రకంగా ఇది పవన్ కల్యాణ్ బెదిరింపుగానే చూడాలి. రఫ్పా, రఫ్పా అనే డైలాగుకు వక్రభాష్యం చెబుతున్న పవన్ కల్యాణ్ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా దౌర్జన్య పూరితంగా మాట్లాడింది.. అభ్యంతరకరంగా మాట్లాడింది గుర్తు లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని పవన్ చేసిన ఆరోపణపై ఇంతవరకు ఎందుకు నోరు విప్పడం లేదు? ఈ సంవత్సరంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలపై పవన్ ఎన్నడైనా స్పందించారా? ఏమీ చేయక పోయినా, ప్రభుత్వం ఎంత అరాచకంగా ఉన్నా గెలవగలమని వారు భావిస్తున్నారంటే ఈవీఎంల మానిప్యులేషన్ తమ చేతిలో ఉందన్న అభిప్రాయమే కారణమా?. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు ఈవీఎంల అక్రమాలు, ఓట్ల పోలింగ్లో జరిగిన అవకతవకలను ఆధార సహితంగా ఎన్నికల కమిషన్కు వివరించి వచ్చారు. వారి లెక్కల ప్రకారం పోలింగ్ శాతంలో తేడా వల్ల 87 శాసనసభ నియోజకవర్గాలలో గెలుపు, ఓటములను నిర్దేశితమయ్యాయి. పోలింగ్ ముగిసే టైమ్ కు ఉన్న ఓట్ల శాతం, తదుపరి నమోదైన ఓట్ల శాతానికి ఉన్న తేడా ఏకంగా 12.54 శాతం ఉన్న సంగతిని వారు తెలియ చేశారు. హిందుపూర్, రాయచోటి వంటి నియోజకవర్గాలలో ఓటింగ్ సరళి వ్యత్యాసాలను వివరించారు. అనూహ్యమైన రీతిలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ మార్పులు, ఎన్నికల అధికారులు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించకుండా దాటవేసి, దగ్దం చేసిన తీరు మొదలైనవి చూసిన వారందరికి ఏదో మోసం జరిగి ఉంటుందన్న భావన ఏర్పడింది. ఎక్స్ అధిపతి ఎలన్ మస్క వంటి వారు కూడా ఈవీఎంలను టాంపర్ చేయవచ్చని చెప్పడం కూడా గమనించాలి. ఎవరో ఎందుకు. టీడీపీ ఓటమి పాలైన ప్రతి సందర్భంలోను చంద్రబాబు నాయుడు ఈవీఎంలను తప్పుపట్టారు. వాటి ద్వారా మోసం చేయవచ్చని గతంలో ఆయన స్వయంగా ప్రదర్శనలు చేయించారు.ఇప్పుడు ఆయన మాట్లాడకపోతుండవచ్చు. అది వేరే సంగతి.ఒంగోలు లో వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని అప్పట్లో వైఎస్సార్సీపీలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు చేసిన ప్రయత్నాలను ఎన్నికల సంఘం, అధికారులు అంగీకరించకుండా డ్రామా నడపడం, వీవీప్యాట్ స్లిప్ లను పది, పదిహేను రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి పలు సందేహాలకు అవకాశం ఇచ్చాయి. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కూడా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించాయి. సీపీఎం నేత వి.శ్రీనివాసరావు కూడా ఏపీలో 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేశ్లతో పాటు, తాజాగా పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ఎలా గెలుస్తుందో తామూ చూస్తామంటూ చేసిన ప్రకటనలపై కూడా సందేహాలు కలుగుతాయి. ఈవీఓంల మహిమను తక్కువ అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే బాలెట్ పత్రాలనే వాడాలని వైఎస్సార్సీపీతో సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ఎన్నికల సంఘం అంగీకరించకపోతే ప్రజలలో ఈవీఎంలపై అనుమానాలు మరింతగా బలపడతాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘నిధుల్లేవ్.. నేనేమి మంత్రినీ కాను’.. వరద సాయంపై ఎంపీ కంగనా
నా దగ్గర నిధులు లేవు, నేనేం కేంద్రంలో మంత్రినీ కాను.. అయినా సరే కేంద్రం నుంచి వరద బాధిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటూ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. తన మండీ నియోజకవర్గంలో వ్యాఖ్యలు చేశారు.హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కారణంగా వరదలు సంభవించి 14 మంది మృతిచెందారు. మరో 31 మంది గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో మండీ ఎంపీ కంగనా రనౌత్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు క్యాబినెట్ పదవి లేదని, విపత్తు సహాయానికి తన దగ్గర నిధులు లేవని, అయినా కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందించేందుకు తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. ఇంతటి వరదలకు బాధ్యులైనవారు తమ ముఖాలను దాచుకుంటున్నారని, వారు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్పై కంగనా విమర్శలు గుప్పించారు. విధాన రూపకల్పనలో తనకు సామర్థ్యం ఉందని, అయితే రాష్ట్ర స్థాయిలో లేదా పంచాయతీ స్థాయిలో అది చాలా తక్కువని కంగనా పేర్కొన్నారు. #WATCH | Himachal Pradesh: BJP MP from Mandi, Kangana Ranaut says, "The central government provided immediate relief operations by sending in the forces. At the local level, we provided relief material to the affected families... Even though the Prime Minister is on a foreign… https://t.co/VoW4I4Uh4X pic.twitter.com/G9BeCHHTjF— ANI (@ANI) July 6, 2025హిమాచల్ ప్రదేశ్కు రక్షణ దళాలను పంపడం ద్వారా కేంద్రం తక్షణ సహాయ కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఇక్కడి పరిస్థితి గురించి తెలుసునని ఎంపీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తాము సహాయ సామగ్రిని అందించామని, ఒక ఎంపీగా నిధులు తీసుకురావడం, ప్రభుత్వానికి గ్రౌండ్ రియాలిటీని తెలియజేయడం తన పని అని ఆమె స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్లో రాబోయే 20 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రనౌత్ వ్యాఖ్యానించారు. కాగా కంగనా.. విపత్తుల సమయంలో మండీ ప్రజలకు అందుబాటులో లేరంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించిన అనంతరం ఆమె ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఒక ఎంపీగా ఆమె ఇటువంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. స్థానికంగా సాయం అందించేందుకు ఒక ఎంపీకి అవకాశమే ఉండదా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.ఇది కూడా చదవండి: భారత్-పాక్లను ఒకేలా తూచలేం: ‘బ్రిక్స్’లో ప్రధాని మోదీ -
ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు అధికారమా!?: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: హైకోర్టు విచారణలో ఉన్నప్పటికీ.. దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చి ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన సవాల్ చేశారు. అలాగే, రాష్ట్రంలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా, ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) హోల్డర్లు ఆర్బీఐ డైరెక్ట్ డెట్ మాండేట్ ద్వారా రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధిని పొందవచ్చనే వాస్తవాన్ని అంగీకరించి.. ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర ఖజానాను అప్పగించే స్థాయికి ఎందుకు దిగజారిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన అంశాలు, జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను జతచేస్తూ ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో బుగ్గన ఏమన్నారంటే..ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్ల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలేదనే ఆరోపణలు నిరంతరం వస్తున్నప్పటికీ.. వాటిని ప్రభుత్వం విస్మరించడం శోచనీయం. ఈ అంశంపై ప్రజలకు ఎటువంటి వివరణలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎన్సీడీ బాండ్ల జారీలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటాన్ని ప్రస్తావిస్తూ జాతీయ మీడియాలో విస్తృతమైన కథనాలు వస్తున్న నేపథ్యంలో.. ఆ తప్పును ప్రభుత్వం సరిదిద్దుకుంటుందని లేదా వివరణ ఇస్తుందని ఎవరైనా ఆశిస్తారు. కానీ, ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేయడంపై నోరుమెదపకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇది ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకపోవడానికి.. పారదర్శకతపై కరువైన చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. నిజానికి.. హైకోర్టులో ఈ అంశం విచారణలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా రెండు విడతలుగా ఎన్సీడీ బాండ్లు జారీచేసి రూ.9 వేల కోట్లు అప్పుచేసింది. ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తుల (రుణదాతలు)కు రూ.1,91,000 కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టింది. అంతేకాదు.. ఆ అప్పును ఏపీడీఎంసీ కట్టలేకపోతే ఆర్బీఐలో రాష్ట్రానికి ఉన్న ఖాతా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రాష్ట్ర అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా వారికి రావాల్సిన మొత్తాలను డ్రా చేసుకునే అధికారం కల్పించింది. ఇలా రాష్ట్రంలో ఇంతముందెన్నడూ లేని రీతిలో ప్రైవేటు వ్యక్తులకు ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై అజమాయిషీ ఇవ్వడం వాస్తవం కాదా? రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చే స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు వివరణ ఇవ్వాలి. -
‘మేనిఫెస్టోని అమలు చేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం’
తాడేపల్లి : ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇంటింటికి వెళ్లలేక టిడిపి, జనసేన నేతలు ముఖం చాటేస్తున్నారని, ఇప్పటికే కూటమీ ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘోరంగా విఫలమైందన్నారు. ఈరోజు(ఆదివారం, జూలై 06) వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘రీకాల్ చంద్రబాబూ మేనిఫెస్టో' కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. దీన్ని మరింతగా గ్రౌండ్ లెవెల్కు తీసుకువెళ్లాలి. 13 నుంచి 20వ తేదీ వరకు మండలాల స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. 21 నుంచి ఆగస్టు 4 వరకు గ్రామీణ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. చంద్రబాబు సహా కూటమి నేతలు చేసిన మోసాలపై మనం గట్టిగా జనంలోకి వెళ్లాలి. రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమానికి జిల్లాల స్థాయిలో మంచి స్పందన వచ్చింది. దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లడాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని సజ్జల సూచించారు. -
కూటమి ప్రభుత్వంపై బుగ్గన ఫైర్
సాక్షి,తాడేపల్లి: కూటమి నేతలకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సవాల్ విసిరారు. ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ, ప్రయివేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పించిన విషయాన్ని అంగీకరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ, రాష్ట్ర ఆర్ధిక విధానాన్ని అస్తవ్యస్తం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై జాతీయ మీడియాలో సైతం వార్తలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఒక జవాబుదారీతనం, పారదర్శకత అనేదే లేకుండా పరిపాలన చేయటం దారుణం. హైకోర్టులో ఈ విషయమై కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్ల నిధులు సమీకరించటానికి బాండ్లు జారీ చేయించింది. రూ.లక్షా 91 వేల కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టారు. ప్రభుత్వం అప్పు తీర్చకపోతే ప్రయివేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ఖజానా నుండి నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించటం రాజ్యాంగ విరుద్దమని సూచించారు. -
‘అప్పుడు ఊగిపోయారు.. మరి ఇప్పుడేమైంది చంద్రబాబూ?’
తిరుపతి: ఎన్నికలకు ముందు 143 అబద్ధపు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, పవన్లు కలిసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 06) నగరిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా రోజా మాట్లాడారు.అమరావతిని దోచుకోవడానికి మాత్రమే అధికారాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఊగిపోతూ చంద్రబాబు మాట్లాడారని,, నేడు మహిళల పై అగాయుత్యలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు రోజా. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రశ్నించేందుకకే ఉన్నానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యారని రోజా ప్రశ్నించారు.చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతుంటే.. అది ఆయనకు తెలియదా? అని నిలదీశారు రోజా. ఒకవేళ రైతుల సమస్యలు తెలియకుంటే సీఎం పదవికి రాజీనామా చేయడం మంచిదన్నారు. చిత్తూరు జిల్లాలో కిలోమీటర్ల మేర మామిడి రైతు రాత్రి, పగలు అనేది తేడా లేకుండా ఎదురుచూస్తున్నాడని, వారికి మాత్రం పర్మిట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. -
‘రెండు తలల పాము’తో మస్క్ ఎలక్షన్ ‘వెర్రి’!
వాషింగ్టన్: అమెరికా (usa) రాజకీయాల్లో కీలక మలుపు అంటూ,. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (elon musk) రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఆయన స్వయంగా షేర్ చేసిన కొత్త పార్టీ ప్రకటన.. తాజాగా పెద్ద చర్చకు దారి తీసింది. ‘ది అమెరికా పార్టీ’ (the america party) అనే పేరుతో మూడో రాజకీయ శక్తిని ప్రకటించిన మస్క్, ఆ పార్టీకి రెండు తలల పాము మీమ్ను షేర్ చేశారు. కానీ మస్క్ నిజంగానే కొత్త పార్టీని పెట్టారా.. ?లేక జనాల్ని వెర్రివాళ్లను చేయడానికే ఇలా చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే.. అమెరికన్ చట్టాల ప్రకారం..ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు అనర్హులు. దీంతో మస్క్ కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే.. కొత్త పార్టీ లేదు. ఏమీ లేదు. తూచ్ అని పక్కకు తప్పుకుంటారా? అని చూడాల్సి ఉండగా.. మస్క్ సౌతాఫ్రికన్ పౌరుడుమస్క్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా, అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం.. ఆర్టికల్ 2, సెక్షన్ 1 ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడై ఉండాలి. తద్వారా మస్క్కు అర్హత లేదు. కారణం ఆయన జన్మస్థలం దక్షిణాఫ్రికా కావడం. మస్క్ పార్టీపై సవాలక్ష ప్రశ్నలుఈ నేపథ్యంలో, మస్క్ పార్టీ విస్తరణకు ముందు వ్యతిరేక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై నిర్ణయం వచ్చే ఏడాది చెబుతానంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ.. మస్క్ టార్గెట్ ఏంటి? అమెరికాను పాలించాలని చూస్తున్నారా? పార్టీగా ప్రభావం చూపాలని అనుకుంటున్నారా? అనేది సదరు అమెరికన్ పౌరుల్లో పుట్టుకొస్తున్న సవాలక్ష ప్రశ్నలు.. ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మస్క్కే మద్దతు ఈ క్రమంలో మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు? అందుకు గల కారణాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరించుతున్నాయని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై 4న తన కొత్త పార్టీని ప్రకటించారు. ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాల్ని సేకరించారు. కొత్త పార్టీకి మద్దతుగా 1.2మిలియన్ల మంది నెటిజన్లు స్పందించారు. దాదాపు 80 శాతం మంది మస్క్కు మద్దతు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.త్వరలోనే పార్టీ లోగో ప్రకటనపార్టీ పేరు ది అమెరికా పార్టీగా నామకరణం చేసినా.. పార్టీ గుర్తును రెండు తలల పాము మీమ్ను షేర్ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు. ఇది అధికారిక పార్టీ లోగోగా ప్రకటించలేదు కానీ.. ప్రారంభ దశలో పార్టీ భావజాలానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి ప్రత్యేక లోగో, జెండా, రంగులు ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో మస్క్ పోటీఇక వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో 2–3 సెనేట్ స్థానాలు, 8–10 ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్ మస్క్ పోటీ చేయనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించడమే తన పార్టీ ఉద్దేశమనే నినాధాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఎన్నికల్లో మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహం అమెరికాలో ప్రతినిధుల సభ (House of Representatives) సభ్యుల పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభ (House of Representatives) లోని 435 స్థానాలకు, సెనేట్ (Senate) లోని 34 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్ మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం దేశంలోని అన్నీ స్థానాల్లో పోటీ చేయకుండా.. కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగడం, గెలుపు సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేయడం వంటి అంశాలు దీని కిందకే వస్తాయి.మస్క్ ముందున్న సవాళ్లుకాగా,మస్క్ సంపద, ప్రభావం ఉన్నప్పటికీ, మూడో పార్టీగా ఎదగడం సవాలుతో కూడుకున్నదే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరుఫున మస్క్ ప్రచారం చేశారు. ఆ సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిని కాలేను. ఎందుకంటే? నేను సౌతాఫ్రికాలో జన్మించాను. మా తాత అమెరిన్. నేను ఆఫ్రికన్. కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను. రాకెట్లను, కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్ ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ ప్రకటించడం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలివ్వడంపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. మస్క్కు ఎలక్షన్ ఎర్రి ఉందంటూ మండిపడుతున్నారు. -
‘ముసలమ్మ నొక్కిద్ది బటన్ అన్నారు..ఇప్పుడు బాబే బటన్ నొక్కలేకపోతున్నారు’
తణుకు(ప.గో.జిల్లా): సంపద సృష్టించి పేదవాడికి పంచుతామన్న చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, జూలై 6) తణుకులో బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కారుమూరితో పాటు, నరసాపురం వైఎస్సార్సీపీ పరిశీలకులు మురళీకృష్ణం రాజు, వైఎస్సార్సీపీ కన్వీనర్ గూడూరి ఉమా బాల, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా కారుమూరి మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు పాలనతో ప్రజల్లో ఇప్పటికే విసుగు మొదలైంది. మంచం మీద పడుకున్న ముసలమ్మ నొక్కిద్ది బటన్ విశేషమా అన్నారు... ఇప్పుడు ఆ బటన్ నొక్కలేక పోతున్నారు. సంపద సృష్టించి పేదవాడికి పంచుతా అన్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తా అన్నారు.. మర్చిపోయారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామన్నారు దానిని p4కు మార్చేశామంటున్నారునిరుద్యోగ భృతి అడిగితే స్కిల్ డెవలప్మెంట్లో కలిపేశాం అంటున్నారు. లోకేష్ గాని చంద్రబాబు గానీ పీఫోర్లో ఎంత ఇచ్చారు తమ నియోజకవర్గాల్లో. వారి సొంత డబ్బు ఒక్క రూపాయిఅయినా ఇచ్చారా..?, ప్రతి నెల పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామాలాడుతున్నారు. సంవత్సర కాలంలో 1 లక్ష76 వేల కోట్లు అప్పు చేశారు. ఈవీఎంల తో మోసం చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మోసం చేయలేదు కూటమినేతల్లా వెన్నుపోట్లు పొడవ లేదు. పార్టీలు కులాలు మతాలు చూడకుండా ఓట్లు వేసిన వారికే కాదు వేయనివారికి సైతం మేలు చేయామని మా నాయకుడు జగన్ చెప్పారు. ైఎస్ఆర్ సీపీకి వారికి పథకాలు ఇవ్వద్దు అని అంటున్నారు చంద్రబాబు.. ఆయన బాబు సొమ్ము ఏమైనా పెడుతున్నారా...?, ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ముందు.. అనేక వాగ్దానాలు చేశారు.. ఎన్ని నెరవేర్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేశారు’ అని ధ్వజమెత్తారు. -
9న చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్.. కూటమి సర్కార్లో అలజడి
సాక్షి, చిత్తూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని చూస్తే సీఎం చంద్రబాబుకు వణుకుపుడుతోంది. వైఎస్ జగన్ ఈ నెల 9న బంగారుపాళెం మామిడి రైతులను పరామర్శించనున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అలజడి రేగుతోంది. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కష్టాలు పడుతున్నారు. రైతులను జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్నాయి. కిలో 3 నుంచి 4 రూపాయలకు కొనుగోలు చేస్తూ.. నిలువు దోపిడీ చేస్తున్నాయి.ఈ నెల 9న వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కిలో ఆరు రూపాయలకు కొనేందుకు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ సిద్ధమైంది. వైఎస్సార్సీపీ హయాంలో కిలో 26 రూపాయలకు మామిడి అమ్మకాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామిడి ధర తగ్గిపోయింది. జ్యూస్ ఫ్యాక్టరీలు వద్ద క్యూలైన్లో టోకెన్లు ఇచ్చి తక్కువ ధరకే దోచుకుంటున్నాయి. చాలా చోట్ల 3 నుంచి 4 రూపాయలకే జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్నాయి. వైఎస్ జగన్ పర్యటన ఇలా..ఈనెల 9న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కోలారు, ముళబాగిళు, ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారు. -
నీళ్ల విలువ తెలియని వ్యక్తులా మన నాయకులు.. హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణభవన్: నీళ్ల విలువ తెలియని నాయకులు తెలంగాణలో పాలన చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మోటర్లు ఆన్ చేయని పక్షంలో రైతులతో కన్నెపల్లి వైపు కదులుతామని హరీష్ రావు హెచ్చరించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీరోజు ఏ నదిలో ఎంత నీరు ఉందో తెలుసుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని విస్మరిస్తోంది. నీళ్ల విలువ తెలియని నాయకులు మనకు పాలకులుగా ఉన్నారు. ఇప్పుడు నీరు వస్తున్నా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?. కాళేశ్వరం మోట్లరు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. వెంటనే కాళ్లేశ్వరం మోటర్లు ఆన్ చేయండి. కాళేశ్వరం నీటితో రిజర్వాయర్లు నింపండి. లేదంటే లక్షలాది మంది రైతులతో కన్నెపల్లి వైపు కదులుతాం’ అని హెచ్చరికలు జారీ చేశారు. కాళేశ్వరానికి మాత్రమే NDSA వర్తిసుందా? SLBC కి NDSA వర్తించదా?. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అన్నదాతకు అక్షయ పాత్ర కాళేశ్వరం. మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి నీళ్ళను ఎత్తి పోయేచ్చు. పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజల నోరు కొడుతుండు. శ్రీశైలానికి వరద నీళ్లు వచ్చి 36 రోజుల అవుతుంది.కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చెయ్యడం లేదు. కల్వకుర్తి మోటార్లు ఇప్పటికైనా ఆన్ చేస్తరా, లేదంటే రైతులను ఆన్ చెయ్యమంటరా?. భీమా, కోయిల్ సాగర్ మోటార్లు ఆన్ చేయడంలో పూర్తిగా నిర్లక్యం చేశారు. గేట్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్. కృష్ణా జలాల వాడుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్యం చేస్తోంది. ఏపీకి నీళ్ళు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికైనా కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ హెచ్చరించారు. -
బాబు పాలనలో ఎన్ని విచిత్రాలో.. చనిపోయిన ఉద్యోగికి బదిలీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇష్టారాజ్యంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. చనిపోయిన ఉద్యోగిని కూడా చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు తప్పుల తడకగా మారింది. పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామంటున్నా ప్రభుత్వం.. చనిపోయిన వారిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ లిస్టులో పేర్కొంది.మూడేళ్ల క్రితం, రెండేళ్ల క్రితం సచివాలయ ఉద్యోగం మానేసిన వాళ్లని కూడా బదిలీల లిస్ట్లో పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కొంత మందిని పాత సచివాలయమే కేటాయించారు. ఇలా.. తమకు అనుకూలమైన వారికి ఉన్న చోటే పోస్టింగ్లు ఇచ్చారు.కొండ ప్రాంతాలకు దివ్యాంగులను బదిలీ చేసింది. కౌన్సిలింగ్ నిర్వహించకుండానే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం అంటూ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. బదిలీలన్నీ రద్దుచేసి కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న(శనివారం) విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ను సచివాలయ ఉద్యోగులు ముట్టడించారు. -
హవ్వ... బాబూ నవ్విపోతారు!
‘‘నేను, గాంధీజీ, అంబేద్కర్లు సామాన్య కుటుంబాల్లోనే పుట్టినా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగాము’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్రంలోనే కాదు.. దేశాద్యంతం ఈ వ్యాఖ్యలకు నివ్వెరపోయి ఉండవచ్చు. గాంధీజీ.. అంబేద్కర్లతో పోల్చుకోవడం ఎంతవరకూ సమజసం అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే చంద్రబాబు తీరే అంత. ఏమైనా అనగలరు. చేయగలరు. పోల్చుకోగలరు కూడా. వాస్తవం ఏమిటంటే... గాంధీజీ, అంబేద్కర్లో సామాన్య కుటుంబాల్లో పుట్టిన మాట నిజం. అయితే వారెవరూ అవకాశాలను అందిపుచ్చుకోలేదు.సామాజిక పరిస్థితులను ఎదిరించి ప్రజలకు ఒక దారి చూపడం ద్వారా నేతలుగా ఎదిగారు! దేశ స్వాతంత్ర్య సాధనలో అందరికంటే ముందున్న గాంధీజీ జాతిపితగా ఎదిగితే... అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేశారు. ఇద్దరూ అసత్యాలు చెప్పడాన్ని నిరసించారు. తిరస్కరించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యపరిచారు.చంద్రబాబు విషయానికి వస్తే... ఈయన కూడా సామాన్య కుటుంబంలో జన్మించారు. సీఎం స్థానానికి ఎదిగారు. వాస్తవమే. కానీ ఈయన రాజకీయ ప్రస్థానాన్ని తరచి చూస్తే గాంధీజీ, అంబేద్కర్ల ఆలోచనలు, ఆదర్శాలకు ఎంతో దూరంగా.. విరుద్ధంగా ఎన్నో మరకలు కనిపిస్తాయి. కాంగ్రెస్(ఐ)తో రాజకీయ ఆరంగేట్రం చేసి గ్రూపులు కట్టి, పైరవీలతో మంత్రిపదవి సాధించిన చరిత్ర చంద్రబాబుది. తరువాతి కాలంలో పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పేరుతో పార్టీ పెడితే.. మామపైనా పోటీ చేస్తానని సవాలు విసిరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని అదే తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. అక్కడ ఏకు మేకు అయినట్లు మామనే పదవి నుంచి లాగిపడేశారు. పదవుల కోసం ఆరాటపడకపోవడం గాంధీజీ, అంబేద్కర్ల నైజమైతే.. వాటి కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డ చరిత్ర బాబు గారిది!చంద్రబాబు నిజంగానే వారిని ఆదర్శంగా తీసుకోదలిస్తే ముందుగా అసత్యాలు చెప్పడం మానుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులపై ద్వేష భావాన్ని వదిలించుకోవాలి. కుమారుడు లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలి. ఏపీలో యథేచ్ఛగా సాగుతున్న హింసను నిలువరించాలి. ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని ఎగవేసి ప్రజలను మోసం చేస్తున్నారన్న విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టాలి. అయితే... గాంధీజీ, అంబేద్కర్లలతో పోల్చుకోవడానికి ప్రయత్నించిన సభలోనే ఆయన ఎంత పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడారో చూడండి.ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అప్పుల గురించి స్వేచ్ఛగా అబద్ధాలు చెప్పేశారే. వెయ్యి రూపాయల అదనపు పెన్షన్ ఇవ్వడం కోసం మంచినీళ్లలా లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో పర్యటిస్తూ సభలు పెడుతున్నారే! కార్యకర్త కారు కింద పడితే కుక్క పిల్లలా పక్కన పడేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్పై ఎంత దారుణమైన ఆరోపణ చేశారు! కారు ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారని సీఎం స్థాయి వ్యక్తి ఆరోపించడమా! చంద్రబాబు ఈ ఘటనకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఈనాడు దినపత్రిక దాన్ని బ్యానర్గా వండి వార్చడం చూస్తే వారు సింగయ్య మృతి విషయంలో ఆత్మరక్షణలో పడ్డారని తెలిసిపోతోంది. ఏపీ హైకోర్టులో తగిలిన ఎదురు దెబ్బను కవర్ చేసుకోవడానికి ఇలాంటి వ్యూహాలను అమలు చేసినట్లు అర్థమవుతోంది. ఈ కుట్రల అమలుకు ఎల్లో మీడియాను ఒక టూల్గా వాడుతున్నారన్నమాట.నిజానికి ఈ కేసులో ఎన్నో సందేహాలున్నాయి. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్ల గ్రామానికి వెళ్తునప్పుడు వచ్చిన జన సందోహాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు? మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న జగన్కు ఎందుకు తగిన భద్రత కల్పించలేదు? వాహనాల వెంట ఉండవలసిన రోప్ పార్టీ ఎందుకు లేదో తెలియదు. కారు తగిలి సింగయ్య అనే వ్యక్తి గాయపడినప్పుడు వచ్చిన వీడియోలు గమనించిన వారెవరికైనా ఆయనకేమీ ప్రమాదం లేదన్నట్టుగానే అనిపించింది. కాని అంబులెన్స్లోనే ఆయన మరణించడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది.ఇవన్నీ ఒక ఎత్తైతే... ఏదో గుర్తు తెలియని వీడియో ఆధారంగా పోలీసులు జగన్తో పాటు కొందరు వైసీపీ నేతలను నిందితులుగా చేసేశారు. కారు ప్రమాదానికి డ్రైవర్ కాకుండా... అందులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు పెట్టి కొత్త ట్రెండ్ సృష్టించారు. హైకోర్టు ఇదే ప్రశ్న లేవనెత్తడంతో సమాధానాలు చెప్పలేని ప్రభుత్వ న్యాయవాదులు వాయిదాలు కోరారన్న భావన కలిగింది. దాంతో జగన్ తదితరులపై నేరారోపణకు ప్రాధమిక ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది.అదే టైమ్ లో ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్య లూర్దు మేరి చేసిన ప్రకటన మరింత సంచలనమైంది.తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, లోకేష్ మనుషులు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని ఆమె చెబుతున్నారు. ఒక సాధారణ మహిళగా ఉన్న ఆమె అంత ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకు వచ్చిందంటే అందులో నిజం లేకపోతే అలా చేయగలుగుతుందా? అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సీనియర్ నేత దానిపై స్పందించడం ఏమిటి? అంబులెన్స్ లో ఏదో జరిగిందని చెప్పించారని అనడం ఏమిటి? అదే జగన్ పై ఆమె ఏదైనా ఆరోపణ చేసి ఉంటే సీఎం ఎంత తీవ్రంగా ప్రచారం చేసి ఉండేవారు. ఎల్లో మీడియా ఎంతగా ఇల్లెక్కి అరిచేది. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యేవారు! ఇప్పుడేమో ఆ ఆరోపణలపై విచారణ కాకుండా, ఆమె జగన్ను కలవడంపై విచారణ చేస్తారట. ఇదేనా ప్రభుత్వం నడిపే పద్దతి?గాంధీజీ, అంబేద్కర్లతో పోల్చుకునే వారు ఎంత నిజాయితీగా ఉండాలి? ఒక ప్రమాదాన్ని జగన్కు పులమడం ద్వారా కుటిల రాజకీయం చేయడం ఏ తరహా నీతి అవుతుంది. గతంలో గోదావరి పుష్కరాల్లో డాక్యుమెంటరీ తీసేందుకు ఒక్కసారిగా గేట్లు తెరచి తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇదే చంద్రబాబు ఏమన్నారు? రోడ్డు ప్రమాదాలు జరగడం లేదా? పూరి జగన్నాథ ఉత్సవాలలో తొక్కిసలాటలు జరగడం లేదా? కొందరు మరణించడం లేదా అని ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరులలో జరిగిన తొక్కిసలాటలలో పదకుండు మంది మరణిస్తే, అదంతా పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేయలేదా?జగన్ కాన్వాయ్లో ప్రమాదం జరిగితే మాత్రం ఆయనను నిందితుడుగా చేర్చుతారా? ఇది చిల్లర రాజకీయం కాదా? పైగా రాజకీయాలు, రౌడీలు, అంటూ నీతి సూత్రాలు వల్లిస్తే సరిపోతుందా? వైసీపీ నేతలు కొందరు రౌడీలు, గూండాలు, పేకాట క్లబ్లులు నడుపుతారు.. అంటూ గతంలో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో వారిని టీడీపీలో చేర్చుకుని టిక్కెట్లు ఎలా ఇచ్చారన్న దానికి జవాబు దొరుకుతుందా?అదెందుకు అంగళ్లు వద్ద గతంలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబే ఎంతగా రెచ్చగొట్టారో వీడియోలు చెబుతాయి. పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్ను దగ్దం చేయడం, రాళ్ల దాడిలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరి కన్ను పోవడం ఇటీవలి చరిత్రే కదా? ప్రతిపక్షంలో ఉంటే ఏ అరాచకం చేసినా సమర్థించుకోవడం, అధికారంలోకి రాగానే శాంతి వచనాలు పలకడమే చంద్రబాబు ఇజమా! అని అంటే ఏమి చెబుతాం. ఏ నాయకుడైనా పదవుల కోసం సంకుచిత రాజకీయాలకు దిగకుండా ఉంటేనే మంచి పేరు వస్తుంది కానీ... రాజకీయ అవసరాలకు గొప్పవాళ్ల పేర్లు చెప్పుకుని పోల్చుకుంటూ, స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తే ప్రజలు తెలుసుకోలేకపోతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కొండారెడ్డిపల్లికి వస్తావా? కొడంగల్కు రమ్మంటావా?
సాక్షి, హైదరాబాద్: ‘రైతులకు ఎవరు మంచి చేశారో చర్చిద్దాం.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రొటీన్గా రంకెలు వేస్తూ చాలెంజ్లు చేస్తున్నారు. ఆయన ముచ్చట తీర్చేందుకు బీఆర్ఎస్ తరఫున నేను సిద్ధం. ఆయన స్థాయికి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి లేదా అయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్లో చర్చకు సిద్ధం. లేదంటే మా నాయకుడు కేసీఆర్ సొంతూరు చింతమడక, ఆయన నియోజకవర్గం గజ్వేల్ అయినా సరే. అసెంబ్లీలో పెడతావో, అంబేడ్కర్ విగ్రహం దగ్గర పెడతావో చర్చ నీ ఇష్టం. వేదిక, తేదీ, సమయం అన్నీ సీఎం ఇష్టమున్నట్లుగా నిర్ణయించుకోవచ్చు. బేసిక్స్ కూడా తెలియని సీఎం.. చర్చకు ప్రిపేర్ అయ్యేందుకు 72 గంటల గడువు ఇస్తున్నా.లేదంటే ఈ నెల 8న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఉదయం 11 గంటలకు మేమే వేదిక ఏర్పాటు చేసి సీఎం కోసం కుర్చీ వేసి ఎదురుచూస్తాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సవాలు చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ‘తెలంగాణలో రేవంత్రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ మినహా ఎవరూ సంతోషంగా లేరు. దండుపాళ్యం ముఠా రీతిలో బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరించి దోచుకుంటూ హామీలు అమలు చేయడం లేదు. రూ.2 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను ఏటీఎంగా మార్చి రేవంత్.. ‘పే సీఎం’లా తయారయ్యారు. చంద్రబాబు కోవర్టులా మారిన రేవంత్ ఇక్కడి నీళ్లను ఆంధ్రకు తరలిస్తున్నారు’అని మండిపడ్డారు. నిధులు ఢిల్లీకి.. నీళ్లు ఆంధ్రకు ‘తెలంగాణలో రైతు రాజ్యాన్ని తెచ్చి, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దింది ఎవరో ప్రజలకు తెలుసు. అన్నీ తెలిసీ నిజం ఒప్పుకోకుండా నటించడం రేవంత్కు మాత్రమే తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదం స్ఫూర్తిని దెబ్బతీస్తూ నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీ కాంగ్రెస్కు మళ్లిస్తూ.. కొందరు తొత్తులను రేవంత్ పదవుల్లో నియమించుకున్నారు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు ఊడదీసి కొట్టాలి అంటున్న రేవంత్కు కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో చెప్పులతో నిలబడటమే ఇందిరమ్మ రాజ్యం అని తెలియదా. ఎమర్జెన్సీ విధించి ఎంతోమందిని అన్యాయంగా జైల్లో పెట్టిన ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడితే నికృష్టంగా ఉంది.మాకు ఓటేస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని చెప్పి.. నిజంగానే ఆ పాత దుర్ధినాలను రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. ఎరువులను పంచడం కూడా చేతగాని సీఎం రేవంత్, చర్చకు కేసీఆర్ రావాలని సవాలు చేయడాన్ని చూసి జనం నవ్వుతున్నారు. నాలుగు పంటలకు గాను ఒక్క పంటకు ఒక్కసారి రైతుబంధు వేసి దానికి పండుగ చేసుకోమని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు. ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకుంది. వంద అసెంబ్లీ సీట్లు వస్తాయని రేవంత్ పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా ఈసారి ఓటేయదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ధర్మయుద్ధం ప్రారంభిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధర్మ పాలన సాగుతోందని.. ఎన్నో హామీలతో మభ్యపెట్టి ఓట్లు దండుకున్న కాంగ్రెస్... ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు విమర్శించారు. ప్రజలను వంచించిన అధర్మ ప్రభుత్వంపై ధర్మ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్రావు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అప్పుల కుప్పలు.. ‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సర్వనాశనం చేశాయి. పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రాష్ట్రం పరువును బజారుకీడ్చింది. అప్పులపాలైందంటూ ప్రపంచమంతటా ప్రచారం చేస్తోంది. హామీలు అమలు చేయాలని అడిగితే ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ప్రజలను మోసగిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసినప్పుడు హామీలు ఎందుకివ్వాలి? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్నివిధాలా సాయం అందిస్తోంది. 11 ఏళ్లలో రూ. 12 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచి్చంది. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ దు్రష్పచారం చేస్తున్నారు. కేంద్రం ఏమి ఇచ్చిందో లెక్కలతో సహా వివరాలున్నాయి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం’అని రాంచందర్రావు చెప్పారు. యూరియా కొరత పట్టదా? కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సదస్సు అంటూ బహిరంగ సభ పెట్టి ప్రధాని మోదీ, బీజేపీని తిట్టడాన్ని రాంచందర్రావు తప్పుబట్టారు. సామాజిక న్యాయమంటే మోదీని, బీజీపీని తిట్టడం కాదన్నారు. ఏడాదిన్నరలో ఏం చేశారో చెప్పకుండా చిల్లర మాటలు మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని.. కేంద్రం దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపినా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల, అధికార యంత్రాంగం చేతులెత్తేయడం వల్ల రైతులకు యూరియా అందడంలేదని విమర్శించారు. ఏఐసీసీ అంటే ఆలిండియా చీటింగ్ కమిటీ బీజేపీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, కాంగ్రెస్ అధికారం కోసం, అవినీతి కోసం పనిచేసే పార్టీ అని రాంచందర్రావు ఆరోపించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పారు. అధికారంలోకి వచి్చన రెండేళ్లలోపే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసిన ప్రజలు... ఈసారి బీజేపీకి అవాకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ధర్మ యుద్ధం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన వ్యాఖ్యానించారు. సీఎంకు బహిరంగ లేఖ.. ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేయాలని.. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. -
పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలి: పొన్నవోలు
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రపు బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాక్షసులా వ్యవహరిస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి వెనుక పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి. కూటమి ప్రభుత్వం అరాచకం తారా స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీకు తింటున్నారు’’ అని పొన్నవోలు మండిపడ్డారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలిసింది.. లేకపోతే ఈ ఘటనను యాక్సిడెంట్గా చిత్రీకరించాలనుకున్నారని పొన్నవోలు చెప్పారు.పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావు దాడి వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర నాగమల్లేశ్వరరావు గురించి మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనమన్నారు. నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. -
పుష్ప సినిమా నేనూ చూశా.. గడ్డం ఉంటే డైలాగూ కొట్టేవాడిని!
శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రే(Uddhav Thackeray) భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం ముంబై వేదికగా జరిగిన శివసేన-ఎంఎన్ఎస్ కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది. అదే సమయంలో పుష్ఫ సినిమాలోని డైలాగులను ఆయన తన ప్రసంగంలో రిఫరెన్స్లుగా వాడారు.ముంబై: సుమారు 20 ఏళ్ల తన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్థాక్రేతో కలిసి రాజకీయ వేదిక పంచుకున్న ఉద్దవ్ థాక్రే.. భావోద్వేగానికి గురయ్యారు. శనివారం ముంబైలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఆవాజ్ మరాఠీచా కార్యక్రమం కోసం ఆత్రుతగా ఎదురు చూశా. రాజ్ అద్భుతంగా మాట్లాడాడు. ఇంక నేనేం మాట్లాడక్కర్లేదనుకుంటున్న. ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నా. మా మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఇక్కడికి వచ్చాం. అధికారం రావొచ్చు.. పోవొచ్చు. కానీ, కలిసి ఉంటేనే బలం అని చాటి చెప్పడానికి వచ్చాం. ఒక్కటి కలిసి ఉండేందుకు మేం ఒక్కటయ్యాం. ఇక మీదట కలిసి కట్టుగా ముందుకు సాగుతాం. ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్ర బడులలో బలవంతంగా హిందీని ప్రవేశపెట్టనివ్వబోం’’ అని ఉద్దవ్ అన్నారు.పుష్ప సినిమా నేనూ చూశా. నాకు కూడా అందులో హీరోలా గడ్డం ఉండి ఉంటే.. తగ్గేదేలే అని డైలాగ్ కొట్టేవాడిని అని ఉద్ధవ్ ఉన్నారు. దీంతో అక్కడున్న ఇరుపార్టీల కార్యకర్తలు విజిల్స్ వేశారు. మరాఠీ భాషను రక్షించేందుకు తామిద్దరం ఐక్యమైనట్లు ప్రకటించిన ఉద్దవ్.. ఇది ట్రైలర్ మాత్రమే అని, ముందు చాలా ఉందన్నట్లు ఆయన చెప్పారు.పుష్ఫ సినిమాలో హీరో తగ్గేదేలే అన్నాడు. కానీ, ఇక్కడి ఓ ద్రోహి(ఏకనాథ్ షిండేను పరోక్షంగా ఉద్దేశించి) మాత్రం ‘దమ్ము ధైర్యం ఏమాత్రం లే’ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఆ ద్రోహికి సొంత ఆలోచనలు లేవు. కేవలం తన బాస్ వచ్చాడు కాబట్టి ఆయన్ని మెప్పించడానికే ‘జై గుజరాత్’ అన్నాడు. అలాంటోడు మహారాష్ట్రకు, మరాఠీ భాషకు ఏం గౌరవం ఇచ్చినట్లు? అని ఉద్దవ్ మండిపడ్డారు. Mumbai, Maharashtra: Shiv Sena (UBT) Chief Uddhav Thackeray says, "Gaddar (Eknath Shinde) said ‘Jai Gujarat’ just like the actor in the movie Pushpa says ‘Jhukega nahi s*la’; but this Gaddar follows ‘Uthega nahi s*la’. He doesn’t have his own thoughts. His boss came, so to please… pic.twitter.com/s7N4a0bog0— IANS (@ians_india) July 5, 2025మరాఠీలో మాట్లాడలేదని ఓ షాపు అతనిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మరాఠీ భాష పేరుతో చేసే గుండాగిరిని సహించేది లేదని సీఎం ఫడ్నవిస్ అన్నారు. అయితే.. ఈ వ్యవహారంలో తామూ గూండాలేమేనని, మరాఠా ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ గుండాగిరి ఇలాగే కొనసాగుతుందని ఉద్దవ్ థాక్రే స్పష్టం చేశారు. అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ఫ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు, అందులోని డైలాగులు.. హీరో మేనరిజానికి బాగా అడిక్ట్ అయ్యారు. అందుకే మొదటి భాగం రిలీజ్ అయ్యాక.. అందులోని డైలాగులను పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాలకు వాడుకున్నాయి. పుష్ఫ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగ్ను బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో బాగా ఉపయోగించింది. -
మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకా మరి.. శ్మశానాన్నీ వదల్లేదు
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో శ్మశాన వాటికలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. మచిలీపట్నంలో క్రైస్తవుల స్మశాన వాటికను టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ కబ్జా చేసేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన స్మశాన వాటికకు టీడీపీ నేత తాళం వేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక నిర్వహణను నగరపాలక సంస్థకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది.నగరపాలక సంస్థ నిర్వహణలో ఉన్న స్మశాన వాటికను తన చేతుల్లోకి తీసుకున్న టీడీపీ నేత.. స్మశాన వాటికను తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. స్మశాన వాటికకు తాళం వేసి.. టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ తన గేదెలను పెంచుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతపై మున్సిపల్ కమిషనర్కు క్రైస్తవులు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
కేటీఆర్.. మీరొక ఎమ్మెల్యే కదా! అసెంబ్లీలోనే చర్చిద్దాం
సీఎం రేవంత్ విసిరిన సవాల్కు స్పందించే క్రమంలో.. 72 గంటల డెడ్లైన్ విధిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. మంత్రులు పొన్నం, సీతక్కతో పాటు పలువురు కీలక నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు, సవాల్పై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. ‘‘కేటీఆర్ ఈ దేశంలో లేకపోవడం వల్ల మా సీఎం మాట్లాడింది తెలియనట్లు ఉంది. కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధం అన్నారు. కానీ కేటీఆర్ శాసన సభ కాదని ప్రెస్ క్లబ్కు రావాలని సవాల్ చేస్తున్నారు. అక్కడకు చర్చకు పిలవాల్సింది మీరు కాదు. మీరు (కేటీఆర్) ఒక ఎమ్మెల్యే. కాబట్టి అసెంబ్లీలోనే చర్చకు రండి. అంతకంటే ముందు.. ప్రతిపక్ష నేత కేసీఆర్ చేత ముందు చర్చ కోసం స్పీకర్కు రాయించండి.సీఎం ఒక్క మాట మాట్లాడితే కేటీఆర్కు ఎందుకు అంత భయం?. మనం వీధుల్లో కోట్లాడుకునే వీధి మనుషులం కాదు. శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలం. అక్కడే చర్చిద్దాం రండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్కు అర్దం కానట్లు ఉంది. విదేశాలలో ఉన్న కేటీఆర్ ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటే మంచిది. అసెంబ్లీ లో చర్చిద్దాం అంటే.. ప్రెస్ క్లబ్కు రమ్మనడం ఏంటి?. డెడ్ అయిన పార్టీ(బీఆర్ఎస్ను ఉద్దేశించి..) డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉంది. నీ సొంత చెల్లే(కవితను ఉద్దేశించి).. నిన్ను నాయకునిగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష నాయకుడు(కేసీఆర్) అసెంబ్లీకి రాడా?. సమస్యల పై చర్చింద్దాం రా అంటే భయమెందుకు?.. అని అన్నారామె.చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందిస్తూ.. కేటీఆర్ లండన్ లో బాగా రెస్ట్ తీసుకుని వచ్చి మళ్లీ రోస్టు మొదలుపెట్టారు. మా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆడిపోసుకోవడమే ఆయనకు పనిగా మారింది. అక్కసు, కుళ్లు తప్ప కేటీఆర్ లో మాటల్లో ఏ మాత్రం పస లేదు. మా ప్రభుత్వ పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. మా ప్రభుత్వ పనితీరుపై ఎప్పుడైనా మేం చర్చకు సిద్దం.ప్రజాస్వామ్యంలో చర్చకు చట్ట సభలున్నాయి. అక్కడ జరిగే చర్చలు రికార్డు అవుతాయి. అసెంబ్లీలో చర్చకు రాావాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా సవాల్ విసురుతున్నారు. కృష్ణా, గోదావరి జలాలతో పాటు అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు మేం సిద్దం. దమ్ముంటే స్పీకర్ దగ్గరకు వెళ్లి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు కోరుతు మీ పార్టీ తరపున లేఖ ఇవ్వండి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకువచ్చి చర్చ చేయమనండి అని అన్నారు. -
ఓటేసిన వారిని కాటేస్తారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రీజనల్ కో-ఆర్డినేటర్ కురుసాల కన్నబాబు. అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు పాముల పుష్పా శ్రీవాణి, పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం రెండోది ప్రతి పక్షం, ప్రతి పక్షం బాధ్యత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గొంతుగా నిలవడం. ఇచ్చిన హామీలపై నిలదీయడం ప్రతి పక్షం బాద్యత. అమలు కానీ హామీలపై అడిగితే కేసులు పెట్టడం, నలకమందం అనడం సంప్రదాయం కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు హామీలు ఇచ్చారు. నెలలు గడుస్తున్నాయి. ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరపున అడిగే హక్కు ఉంది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో ఈ మోసాలపై నిలదీస్తాం. ఏడాది పాలనలో ఉద్యోగాలు తీసి.. నిరుద్యోగ భృతి మాట లేకుండా చేశారు. ఈ ఏడాది నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి రూ.36 వేలు ఎప్పుడు ఇస్తారు?. మా ప్రభుత్వంలో హామీల అమలు కోసం మేనిఫెస్టోను జేబులో పెట్టుకుని తిరిగితే.. కుటమి నాయకులు అమలు చేయలేక వారి మేనిఫెస్టోను బిరువాలో పెట్టారు.’’ అంటూ బొత్స దుయ్యబట్టారు.‘‘పువ్వు పుట్టిగానే పరిమళించినట్లు లోకేష్ మంత్రి అయ్యారు. తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ‘‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’’ అన్నట్లు ఉంది. ఏడాది పుర్తి అయినా కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్ర హామీ ఏమైంది?. సభ సాక్షిగా మే నెలలో ఇస్తామని చెప్పిన మంత్రి లోకేష్ ఏ మే నెలలో ఇస్తారో చెప్పాలి. వైద్య విద్యార్థులపై ఆడ పిల్లలు, చిన్న పిల్లలు అని చూడకుండా లాఠీఛార్జ్ చేయడం ప్రభుత్వ ధర్మం కాదు. ఏమి చేసిన అడిగే వారే లేరని వ్యవహరించడం సరికాదు. మనిషికి ఉన్న ఆశపైనే మోసపురిత రాజకీయాలు చంద్రబాబు చేస్తారు...చంద్రబాబు ఎప్పుడూ రైతులు, మహిళాలనే మోసం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్రంలో రైతులకు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. సరైన గిట్టుబాటు ధర కల్పించే బాద్యత ప్రభుత్వనిదే. వాటిపై మాట్లాడితే కేసులు పెట్టి తాట తీస్తామని వ్యాఖ్యలు చేస్తారా?. ఉపాధి హామీలో ఎప్పుడైనా మూడు నెలల బకాయిలు చెల్లించకుండా ఉంచారా?. రెక్క ఆడితే కానీ డొక్కా ఆడాని వారిని ఇబ్బందులకు గురి చేస్తారా?. మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు’’ అంటూ బొత్స నిలదీశారు.కూటమి సర్కార్ నయ వంచన: కన్నబాబుమాజీ మంత్రి కురుసాల కన్నబాబు మాట్లాడుతూ.. మోసపోయింది ప్రజలు తప్ప.. చంద్రబాబు కాదు. ఓటేసిన వాడిని కాటేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలు కాపీ కొట్టి.. పక్క రాష్ట్రాల్లో కొన్ని కాపీ కొట్టి నయవంచన చేశారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసిన హామీ ఏమయింది?. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరచాలి.ఏడాది పాలనలో ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలి. సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పిన చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల్లో ప్రజల్లో మోసం చేసే గెలిచిన నాయకుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డులు సాధిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు ష్యూరిటీ అని చంద్రబాబు ప్రమాణం చేశారు. తల్లి వందనం కార్యక్రమంలో సర్పంచ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పథకం రాకుండా చేశారు. రాష్ట్రంలో లక్షలాది మహిళాలకు తల్లికి వందనం రాలేదు అన్నది నిజం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు ఆడి అధికారం దక్కించుకున్నారు. గతంలో కూడా ఆనాడు చంద్రబాబు 89 వేల కోట్లు రుణ మాఫీ చేయ్యల్సి వస్తే 15వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేశారు. మీరు కనబడితే తొలి అడుగు కాదు తొలిసారిగా మిమ్మల్ని నిలదీస్తారు ప్రజలు. మా ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమన్ని నేరుగా ఇంటికి వెళ్లి తెలియజేశాం. మీరు చేసిన ప్రతి అరాచకాన్ని 2.0 లో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు’’ అని కన్నబాబు చెప్పారు. -
ఫడ్నవిస్ వల్లే మేం ఇలా! ఇక ఒక్కటిగానే..: థాక్రే సోదరుల ప్రకటన
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే మళ్లీ ఏకతాటిపైకి వచ్చారు. ఒక్కటిగా ఉంటాం.. ఇక ఒక్కటిగానే ముందు సాగుతాం అంటూ ఇద్దరు సోదరులు సంయుక్త ప్రకటన చేశారు.శనివారం హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ జరిగిన అవాజ్ మరాథిచా కార్యక్రమం.. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ అపూర్వ కలయికకు వేదికైంది. ఈ సందర్భంగా జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా హిందీని మహారాష్ట్రలో ప్రవేశపెట్టనివ్వబోమని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఈ ఇద్దరూ అల్టిమేటం జారీ చేశారు.బాల్ థాక్రే వల్ల కూడా కాలేదు..మా ఇద్దరినీ ఒక్క తాటిపై తీసుకురావాలని శివసేన వ్యవస్థాపకులు బాల్థాక్రే ఎంతో ప్రయత్నించారు. కానీ, ఆయన వల్ల కాలేదు. అది ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వల్ల అయ్యింది. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. మా మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టాం అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే ప్రకటించారు.మహారాష్ట్రలో ప్రాథమిక పాఠశాలలో హిందీ తప్పనిసరిని చేస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే హిందీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శివసేన యూబీటీ-ఎంఎన్ఎస్లు సంయుక్తంగా ఈ సభను నిర్వహించాలనుకున్నాయి. ఈలోపు ఫడ్నవిస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హిందీని కేవలం ఆప్షన్ భాషగానే ప్రకటించింది. దీంతో భారీ విజయంగా పేర్కొంటూ ఇరు పార్టీలు ఈ సభను ముంబైలో ఇవాళ నిర్వహించారు.మీకు చట్ట సభలో అధికారం ఉండొచ్చు. కానీ మా శక్తి రోడ్లపై ఉంది. త్రిభాషా విధానంతో ముంబైను మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రయత్నం చేశారు. కానీ, మరాఠా ప్రజల బలమైన ఐకమత్యం కారణంగానే ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దమ్ముంటే.. మహారాష్ట్రను టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో తెలుస్తుంది అని రాజ్ థాక్రే వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు.. శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ థాక్రే ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహారాష్ట్ర అభివృద్ధికి కలిసి పని చేస్తామని ఇరువురు సంయుక్తంగా పని చేస్తామని ప్రకటించారు.రాజ్ థాక్రే చివరిసారిగా 2005లో ఉద్దవ్తో రాజకీయ వేదికను పంచుకున్నారు. అదే ఏడాది శివసేనను విడిచి ఎంఎన్ఎస్ను స్థాపించుకున్న సంగతి తెలిసిందే. महाराष्ट्राने मनात जपलेला सुवर्णक्षण...! pic.twitter.com/kugbSPx0JU— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) July 5, 2025శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడే రాజ్ థాక్రే. శ్రీకాంత్ థాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ.. ఆయన తనయుడు రాజ్ థాక్రే.. బాల్ థాక్రే వారపత్రిక మార్మిక్లో కార్టూనిస్ట్గా పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అయితే..90వ దశకంలో శివసేనలో రాజ్ థాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ శ్రేణులు, బాల్ థాక్రే అభిమానులు రాజ్నే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ థాక్రే తన కుమారుడు ఉద్ధవ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాడు. దీంతో రాజ్ అసంతృప్తికి లోనయ్యారు. తదనంతర పరిణామాలతో.. 2006లో శివసేనను విడిచిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. -
అదంతా కూటమి కుట్రే.. జగన్ రైతులను కలవడం ఖాయం: భూమన
సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి ప్రభుత్వం మామిడి రైతులతో చలగాటం ఆడుతుందని ఆరోపించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరులో కుమార్ అనే రైతును ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. బిన్ లాడెన్పై అమెరికా దాడిచేసినట్లు.. మారుమూల గ్రామంలో ఉన్న రైతును కూటమి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు. రైతుల కోసం వైఎస్ జగన్ తప్పకుండా వస్తారు.. వారిని కలిసి కష్టాలను తెలుసుకుంటారు అని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల కోసమే బంగారుపాల్యం గ్రామానికి వైఎస్ జగన్ వస్తున్నారు. అందుకే కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు. జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం.. అందుకే రైతులను రాకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క వైఎస్సార్సీపీ నాయకులను భయపెడుతున్నారు. జనసేన, టీడీపీ వారు జగన్ పర్యటన రద్దు అయిందని అంటున్నారు. జగన్ రావడం.. రైతులను కలవడం ఖాయం.కర్ణాటకలో మామిడికి ప్రభుత్వం మంచి ధర కల్పించింది. కానీ, చిత్తూరులో కుమార్ అనే రైతు నష్టాలకు భరించలేక, చెట్లు నరికేశాడు. దానికి ఫారెస్టు అధికారులు.. కుమార్ను నా ఇబ్బందులకు గురి చేశారు. అటవీశాఖ పవన్ కళ్యాణ్ అధీనంలో ఉంది. ఓ మామిడి రైతును ఎర్ర చందనం స్మాగ్లర్ గా చూపించారు. తన తోటలో తోతాపురి మామిడి కుళ్లిపోయే పరిస్థితి వచ్చింది. మామిడి రైతులతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతుంది. వైఎస్సార్సీపీ నాయకులు నిజాలు చెబితే తట్టుకోలేకపోతున్నారు.వైఎస్ జగన్ పర్యటనపై నిర్బంధాలను విధించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ప్రజా సముద్రాన్ని ఎవరూ అడ్డుకోలేరు. వైఎస్ జగన్ రాష్ట్రంలోనే అత్యధిక, అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. జగన్కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టే పద్దతి మారాలి. హెలికాప్టర్ అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరాము’ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాటలను మేము పట్టించుకోము. ఎవరో చెప్పారు. నేను లేస్తే మనిషి కాదని బెదించేవాడంటా.. ప్రజలు కూడా అతనికి భయపడేవారు.. వాస్తవానికి అతనికి కాళ్లే లేవు.. పవన్ కళ్యాణ్ మాటలు కూడా అలా ఉంటాయ్.. వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటూ ఎద్దేవా చేశారు. -
పొన్నం.. రేవంత్తో రాజీనామా చేపించు: రామచందర్రావు
హైదరాబాద్, సాక్షి: పార్టీని నమ్ముకున్నవారికి బీజేపీ నిరంతరం అండగా నిలుస్తుందని, అందుకు తాను ఒక ఉదాహరణ అని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పేర్కొన్నారు. అలాగే బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు పార్టీని వీడినా నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.పార్టీ అభివృద్ధికి పని చేసిన ప్రతీఒక్కరికీ కచ్చితంగా అవకాశాలు వస్తాయని రాంచందర్రావు పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రాంచందర్రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దీనికి ముందు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో అందరూ ఒకటేనని, తమ మధ్య అభిప్రాయ బేధాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ లేదని రాంచందర్రావు ఆరోపించారు. మతం ఆధారంగా తాము ఏ బిల్లును ఆమోదించబోమని, అసెంబ్లీలో మా పార్టీ ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడని ప్రశ్నించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు ఏమైందని రాంచందర్రావు కాంగ్రెస్ను నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులు చేయలేక తప్పులను తమపై నెడుతున్నదన్నారు. ప్రతీసారి ఢిల్లీ వెళ్లినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారన్నారు. లోకల్ బాడీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని రాంచందర్రావు ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేత రాజీనామా చేయించాలని, అప్పుడు బీసీని సీఎం చేస్తే, తన పదవిని రాజీనామా చేస్తానని రాంచందర్రావు సవాల్ విసిరారు. -
గంటాను గెలిపించి తప్పు చేశాం..
విశాఖపట్నం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న జీవీఎంసీ భీమిలి జోన్ 2, 3 వార్డు నాయకులు, భీమిలి మండల నాయకులు శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి ఫిర్యాదు చేశారు. గంటాను గెలిపించుకోవడం తమకు భస్మాసురహస్తం అయిందని వారు బాబ్జీ వద్ద వాపోయినట్లు తెలిసింది. ఈ నెల 7న తాళ్లవలసలో జరగనున్న ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమం గురించి అదే గ్రామానికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు డీఏఎన్ రాజుకు ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గంటా వెంట ఉన్న వ్యక్తి (స్వామి) ఇప్పుడు కూటమి నాయకుల నెత్తిన కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గంటా శైలి మారకపోతే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం ఢిల్లీ నుంచి రానున్న ఎంపీ భరత్కు ఫిర్యాదు చేసిన అనంతరం.. అమరావతి వెళ్లి పార్టీ అధిష్టానం దృష్టికి తమ సమస్యను వివరిస్తామని నాయకులు తెలిపారు. బాబ్జీకి ఫిర్యాదు చేసిన వారిలో డీఏఎన్ రాజు, యరబాల అనిల్ ప్రసాద్, పతివాడ రాంబాబు, సాగిరాజు రాంబాబు, గరికిన పరశురాం, మరగడ రఘురామిరెడ్డి, లక్ష్మణరావు, వివిధ పంచాయతీల నాయకులు ఉన్నారు. అంతకు ముందు వారంతా డీఏఎన్ రాజు ఇంటి వద్ద సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. -
బీజేపీ ఐదు శాతం పార్టీనే ఉండిపోతుందేమో!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ భాగస్వామి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్యాయానికి గురవుతోందా? నామ్ కా వాస్తే మాత్రమే ప్రభుత్వ భాగస్వామిగా మిగిలిపోతోందా? ఆ పార్టీ నేతలు స్వయంగా వాపోతున్న విషయాలివే. ఈ ఆవేదన కూడా అర్థం చేసుకోదగ్గదే. ఏదో పెద్దన్న పాత్ర పోషిద్దామన్న ఆలోచనతో తెలుగుదేశంతో జతకట్టిన ఆ పార్టీ రాష్ట్ర నేతలకు ఇప్పుడు కనీసం చిన్నతమ్ముడు పాత్ర కూడా లభిస్తున్నట్లు లేదు. కొందరు మిత్రపక్ష నేతలు ఇప్పటికే బీజేపీని ఐదు శాతం పార్టీగా అవహేళన చేస్తున్నారని వీరు వాపోతున్నారు. పార్టీకి కొత్త అధ్యక్షుడుగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైన సందర్భంగా జరిగిన సమావేశంలో కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తికి దర్పణం పడుతున్నాయి. మంత్రివర్గం కూర్పు నుంచి, నామినేటెడ్ పదవుల నియామకం వరకూ అన్నింటిలోనూ తమకు అన్యాయం జరుగుతోందన్నది వారి ఆవేదన. 2014-19 మధ్యకాలంలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలే ఉన్నా కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావుల రూపంలో రెండు మంత్రి పదవులు దక్కాయి. 2024లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఒకే మంత్రి పదవి దక్కడం.. అది కూడా ఢిల్లీలో పలుకుబడి కలిగిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కావడం విశేషం. ఆ నియోజకవర్గానికి ఆయనకు సంబంధమే లేదట. సూట్ కేస్తో ధర్మవరం వెళ్లి ఎమ్మెల్యే అయిపోయారని, తదుపరి మంత్రి అయ్యారని వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈసారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డట్టు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సభలో ఆయన తన బాధను వ్యక్తం చేసినట్లు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేదని, బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండని రాజు వ్యాఖ్యానించారు. ఇది నిజం కూడా. ఎందుకంటే 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం నానా తంటాలు పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు జరిపింది. ఆ విషయాన్ని ఆయన ఆ రోజుల్లో బహిరంగంగానే చెబుతూ తాను టీడీపీ పొత్తు గురించి మాట్లాడితే బీజేపీ పెద్దలు చివాట్లు పెట్టారని అనేవారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్లు బతిమలాడి మరీ పొత్తు కుదిరేలా చేసుకున్నారు. పొత్తు కోసం చంద్రబాబు స్వయంగా ఢిల్లీలో రెండు,మూడు రోజులు వేచి చూసిన సందర్భాలూ ఉన్నాయి. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత లోకేష్ తన పెద్దమ్మ పురందేశ్వరిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంటబెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ క్రమంలోనే పొత్తు పెట్టుకోవడానికి మంతనాలు జరిగాయి. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండడం కూడా కలిసి వచ్చింది. అంతేకాక వైఎస్సార్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపినా, వివిధ కారణాల వల్ల వైసీపీ ముందుకు రాలేదు. ఆ తర్వాత బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో పొత్తుకు ఓకే చేసిందని చెబుతారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాని మోడీని, భారతీయ జనతా పార్టీని ఎంత తీవ్రంగా విమర్శించారో గుర్తు చేసుకుంటే.. రాజకీయాలలో ఇంతగా దూషించుకుని మళ్లీ కలవగలుగుతారా అన్న సందేహం వస్తుంది. ఎలాగైతేనేం..పొత్తు కుదరడంతో బీజేపీ తన కార్డును ప్లే చేసినట్లే ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో కూటమి ప్రయోజనాలకు అనుకూలంగా పని చేసిందన్న విమర్శలు వచ్చాయి. కొందరు పోలీసు అధికారులను బదిలీ చేసిన తీరు దీనికి దర్పణం పడుతుందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అంతేకాక ఈవీఎంల మానిప్యులేషన్ జరగిందని కూడా చాలా మంది నమ్ముతారు. పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓట్ల శాతం, ఆ తర్వాత అర్దరాత్రికి పెరిగిన ఓట్ల శాతంపై పలు అనుమానాలు వచ్చాయి. అయినా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదు.ఎన్నికల తర్వాత వీవీపాట్ స్లిప్లను, ఈవీఎంలతో కలిపి లెక్కించాలని కొందరు అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో అనుమానాలు మరిన్ని పెరిగాయి. ఇదంతా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్లే జరిగిందన్నది పలువురి భావన. ఆ విషయం నేరుగా చెప్పకపోయినా, విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల మతలబు ఇదేనన్న సందేహాం వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ వ్యూహాత్మకంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యత నడుపుతూ, వారు కోరిన విధంగా రాజ్యసభ సీట్లు కేటాయిస్తూ, క్షేత్ర స్థాయి బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదన్నది ఒక అభిప్రాయం.ఈ నేపథ్యంలోనే తమను ఐదు శాతం పార్టీగా ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. అయినా బీజేపీ నేతల డిమాండ్లు ఎంతవరకు నెరవేరతాయన్నది అప్పుడే చెప్పలేం. గతంలో బీజేపీతోపాటు ఇతరత్రా వారు కూడా పురందేశ్వరిని టీడీపీ ప్రతినిధే అన్నట్లుగా పరిగణిస్తుండే వారు. ఒకప్పుడు చంద్రబాబుకు దగ్గుబాటి కుటుంబానికి మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పుగా ఉన్నా, తదుపరి వారి కుటుంబాల మధ్య రాజీ చేసుకున్నారు. దీంతో ఒరిజినల్ బీజేపీ నేతలు వెనకబడిపోయారు. ఆ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే సీట్లు కూడా పలువురు మాజీ టీడీపీ నేతలకే దక్కాయని అంటారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలలో ఐదుగురు టీడీపీ మద్దతుదారులు కావడం విశేషం. ఇదేమి రహస్యం కాదు. వారిలో ఒకరైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీకి సరైన ప్రాధాన్యత లభించడం లేదని అన్నారట. ఆయన కూడా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో సహజంగానే అసంతృప్తి ఉంటుంది. నామినేటెడ్ పదవులకోసం చంద్రబాబుకు జాబితాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదట. తాజాగా కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒరిజినల్ బీజేపీ నేత కావడంతో ఆ పార్టీ క్యాడర్లో కాస్త ఆశ చిగురించినట్లయింది. ఆయన టీడీపీతో గొడవ పెట్టుకోకపోయినా, అవసరమైనప్పుడు గట్టిగానే నిలదీయవచ్చని అనుకుంటున్నారు. కొంతకాలం క్రితం రాజ్యసభ సీటును బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు పాకా సత్యానారాయణకు కేటాయించడం, ఇప్పుడు మాధవ్కు అధ్యక్ష పదవి ఇవ్వడంలో కేంద్ర బీజేపీకి ఏమైనా వ్యూహం ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. భవిష్యత్తులో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడానికి కూడా సిద్దపడవచ్చన్న అభిప్రాయం ఉన్నా, టీడీపీ బీజేపీ కేంద్ర నేతలను ప్రసన్నం చేసుకుంటున్నంత కాలం కూటమి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అందువల్ల బీజేపీ క్యాడర్కు రాష్ట్రంలో పదవులు పెద్దగా దక్కకపోవచ్చు. వారు నిజంగానే ఐదు శాతం పార్టీగానే మిగిలిపోవచ్చు. అప్పుడప్పుడు మీటింగ్లలో తమ గోడు వెళ్లగక్కుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చు. కేంద్ర బీజేపీ పెద్దలే పలు అవమానాలను దిగమింగుకుని టీడీపీతో కలిసిన తర్వాత రాష్ట్రంలోని బీజేపీ నేతలుకాని, కార్యకర్తలు కాని ఏమి చేయగలుగుతారు?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘పవన్.. నీదే టెంట్హౌజ్ పార్టీ.. కనీసం నీ శాఖ గురించైనా తెలుసా?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి పేర్నినాని. ఏపీలో పోలీసు వ్యవస్థ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. బాబు రావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా?. టీడీపీ నేతల దోపిడీని అడ్డుకోవడమే నాగ మల్లేశ్వర రావు చేసిన నేరమా?. ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు.. ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ర్టంలో నరరూప రాక్షసులు రాజ్యం ఏలుతున్నారు. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా ఉండాల్సిన ఖాకీలు సైలెంట్ అయిపోయాయి. ఒక ముఖ్యమంత్రి గా అందరికీ న్యాయం చేయాల్సిన చంద్రబాబు వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయొద్దంటున్నారు. దైవ సాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఇలా చేయటం సబబేనా?. వైఎస్సార్సీపీ వారిపై దాడులు చేయండి, పోలీసులు అండగా ఉంటారని చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయిపొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కనుసన్నల్లోనే మల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగింది. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబమే ఇరవై ఏళ్లుగా ఆ గ్రామంలో సర్పంచ్గా ఉంటున్నారు. మరి ఎమ్మెల్యే చెప్పినట్టు ఆ కుటుంబమంతా రాక్షసులైతే జనం ఇన్నేళ్లుగా ఎలా గెలిపిస్తున్నారు?. ఎమ్మెల్యే మనుషులే నాగమల్లేశ్వర రావుపై హత్యాయత్నం చేశారు. బాబూరావు అనే ఎమ్మెల్యే మనిషితో గొడవల వలనే నాగ మల్లేశ్వరరావుపై దాడి చేశారని అంటున్నారు. నిజానికి బాబూరావుపై గతంలో దాడి జరుగుతుంటే ఆపిందే నాగ మల్లేశ్వరరావు. అలాంటి వ్యక్తిని ఈరోజు చంపేందుకు ప్రయత్నించారుమన్నవ గ్రామంలో వైఎస్సార్సీపీదే హవా. దాన్ని చూసి తట్టుకోలేక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ఊర్లో గొడవలు పెడుతున్నారు. ఆ పక్కనే ఉన్న వెల్లలూరు గ్రామంలో ఆరు హత్యలకు కారకులెవరో అందరికీ తెలుసు. ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చేయాలని ధూళిపాళ్ళ కోరుకుంటున్నారు?. రప్పా రప్పా అని పోస్టర్ పట్టుకున్నోడిపై కేసులు పెట్టినవాళ్లు మరి నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నంపై ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఆడపిల్లలు కనపడకపోతే పోలీసులు పట్టించుకోవడం లేదు.పవన్ కళ్యాణ్ చెబితేనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. మరి ఆయన దగ్గరకు వెళ్దామంటే సినిమా షూటింగ్ బిజీలో ఎక్కడో ఉంటారు . చంద్రబాబుకు ఇబ్బంది కలిగినప్పుడు ఒక తమ్ముడు, చెల్లెలు కలుగులో నుండి వస్తారు. మిగతా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగినా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ. చంద్రబాబుకు అద్దెకు ఇవ్వటానికే పవన్ పార్టీ పెట్టారు.వైఎస్ జగన్ని అధికారంలోకి రానీయను అనటానికి పవన్ ఎవరు?. 2019లో కూడా జగన్ని అధికారంలోకి రానీయనని పవన్ అన్నారు. మరి ఏమైంది?. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది జనమే తప్ప పవన్ కాదు. సుగాలీ ప్రీతి అదృశ్యం కేసును పవన్ రాజకీయాలకు వాడుకుని ఇప్పుడు వదిలేశారు. కనీసం కార్యకర్తలను కూడా పవన్ పట్టించుకోవడం లేదు. హెలికాఫ్టర్లో పిల్లల్ని తీసుకుని తిరగటం తప్ప పవన్కి ఇంకేం తెలుసు?. కనీసం తన సొంత శాఖలో ఏం జరుగుతుందో కూడా పవన్కి తెలియదు.పంచాయతీలకు రావాల్సిన రూ.2,800 కోట్లను ప్రభుత్వం పక్క దారి పట్టిస్తే పవన్ ఎందుకు నోరు మెదపటం లేదు?. రేషన్ బియ్యం షిప్పుల కొద్దీ బయటకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. తిరుమలలో రోజూ అపచారాలు జరుగుతుంటే పవన్ పోరాటం ఎందుకు చేయటం లేదు?. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించటం లేదు?. హెలికాఫ్టర్లో ప్రకాశం జిల్లాకు వెళ్లిన పవన్కి కరేడులో రైతుల సమస్యలు కనపడటం లేదా?. మీ ప్రభుత్వం 8 వేల ఎకరాలను మీ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుంటే ఏం చేస్తున్నారు?.రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల విధానాలు బాగ లేవంటూనే వాటిని ఎందుకు అమలు చేస్తున్నారు?. చంద్రబాబు, లోకేష్ లకు సిగ్గు లేదా?. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులను మంత్రి వచ్చే వరకు సైకోగాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు రెడీ. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో 8వ తేదీన 11 గంటలకు చర్చ వస్తామని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక పథకం. రైతు బంధుపై ఆక్స్ఫర్డ్లో ప్రశంసలు వచ్చాయి. ఎరువులు కూడా ఇవ్వలేని సీఎం మమ్మల్ని విమర్శిస్తారా?. ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండితే మేము కళకళలాడేలా చేశాం. చంద్రబాబు రైతులు గొంతు కోశారు. జల దోపిడీని సీఎం రేవంత్ అడ్డుకోవడం లేదు. దత్తత పేరుతో పాలమూరును దగ చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. ఫ్లోరైడ్ మహమ్మరిని తరిమికొట్టింది కేసీఆర్ కాదా?. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే రూ.30వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చాం’ అని చెప్పుకొచ్చారు. 18 నెలలుగా తెలంగాణ టైమ్ పాస్ పాలన నడుస్తుంది. మీ స్తాయికి కేసీఆర్ అవసరం లేదు మేము చాలు.. ఎక్కడికి పిలిచిన రెడీ. 72 గంటల సమయం రేవంత్కు ఇస్తున్నాం. ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇస్తున్నా. ప్లేస్ ఎక్కడ అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే కాలిపోతున్న మోటార్లు, అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు. ప్రతీ మండలం లో ఎరువుల కోసం క్యూ లైన్ లో రైతులు ఎదురు చూసే పరిస్థితి. కేసీఆర్ ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చారు. రైతులకు రైతు భీమా ఎగ్గొట్టి రైతుల ఉసురు తీస్తుంది కాంగ్రెస్..చంద్రబాబు బనకచర్ల ద్వారా తెలంగాణ రైతుల గొంతు కోస్తున్న మాట వాస్తవం. ఆంధ్రా ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఒక్క హామీ అయినా నెరవేర్చారా రేవంత్?. బురద చల్లడం పక్కకు వెళ్ళడం రేవంత్కు అలవాటు. రుణ మాఫీ 12 వేల కోట్లు మాత్రమే చేసి రైతులను మోసం చేశారు. రేవంత్ ప్రభుత్వం రైతులను, మహిళలను, కౌలు రైతులను మోసం చేసింది. 400 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. ఒక్క కొత్త పథకం ప్రారంభించ లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఢిల్లీకి మూటలు పంపించడం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం తప్ప రేవంత్కు మరో పని లేదు. రేవంత్కు ఓట్లు వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. చంద్రబాబు కోవర్టు రేవంత్. తెలంగాణలో జరుగుతుంది కోవర్టు పాలన’అని విమర్శించారు. -
తెలంగాణ తెచ్చుకుంది కడుక్కు తాగేందుకు కాదు
సాక్షి, హైదరాబాద్: ‘సుదీర్ఘ కాలం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కడుక్కుని తాగేందుకు, కరిగించుకుని తినేందుకు కాదు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వెనుక ఉన్న గాఢతను అర్థం చేసుకునే తెలివితేటలు ప్రస్తుత పాలకులకు లేవు. రొడ్డకొట్టుడు ఉపన్యాసాలతో, నాసిరకం పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పుట్టిందనే విషయం అందరికీ తెలుసు. కానీ ప్రస్తుత పాలకులకు సాగునీటి రంగంపై అవగాహన లేకపోవడంతో జరుగుతున్న నష్టంపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.ఒకటి రెండు రోజుల్లో నేను స్వయంగా ప్రెస్మీట్ పెట్టి అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తా’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తన పార్టీ నేతలతో అన్నారు. వైద్య పరీక్షల కోసం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ను పలువురు పార్టీ నేతలు శుక్రవారం పరామర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ సాగు నీటి రంగంపై ప్రస్తుత పాలకులకు కనీస అవగాహన లేదు. వారికి తోక తెలియదు.. మూతి తెలియదు. బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టంపై నేనే స్వయంగా ఆదివారం (సూచనప్రాయంగా) మీడియాతో మాట్లాడతా. నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేడు సాయంత్రం డిశ్చార్జి అయిన తర్వాత నందినగర్ నివాసంలోనే ఉంటా’అని కేసీఆర్ తెలిపారు. కేటీఆర్, హరీశ్రావుతో భేటీ నేతలతో ఇష్టాగోష్టి తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావుతో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించినట్లు తెలిసింది. బనకచర్లపై తన ప్రెస్మీట్ తర్వాత పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చిరుమర్తి లింగయ్య, శంకర్నాయక్, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేశ్, నాగేశ్, సతీశ్రెడ్డి తదితరులు ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. -
యుద్ధాన్ని ఆపేశారేం?
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్పై యుద్ధాన్ని ఆకస్మికంగా ఎందుకు ఆపేశారో, అసలు ఆపిందెవరో దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పహల్గాం ఘటనపై దేశం యావత్తు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిందని చెప్పారు. దేశంలోని అన్ని రాజకీయపార్టీలు మోదీకి మద్దతు ఇస్తూ యుద్ధం చేయాలంటూ గొంతు కలిపాయని గుర్తుచేశారు. అయినా యుద్ధం కొనసాగించకుండా అర్ధాంతరంగా నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.దేశానికున్న బలగంతో వీరోచితంగా పోరాడి పాక్ పీచమణిచి పీఓకేను స్వాదీనం చేసుకునే అవకాశాన్ని చేజేతులా కోల్పోవడం అత్యంత దురదృష్టకరమంటూ ఖర్గే ధ్వజమెత్తారు. జబ్బలు చరుచుకునే మోదీ కి కీలక సమయంలో చేతులు ఎత్తేయడమే చేతనవుతుందని విమర్శించారు. దేశరక్షణ, సైనికులపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావడం ఆయన దేశభక్తికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కార్యకర్తల సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మోదీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు? ‘గంభీరంగా కనిపిస్తున్నట్లు నటించే మోదీ నిజానికి అత్యంత భయస్తుడు. ప్రధాని మోదీ ఇప్పటివరకు 42 దేశాల్లో పర్యటించారు. కానీ స్వదేశంలో అగి్నగుండంగా మారిన మణిపూర్కు మాత్రం వెళ్లలేదు. మణిపూర్ భారత్కు అత్యంత కీలకమైన ప్రదేశం. అక్కడ జరుగుతున్న ఆందోళనలను పరిశీలించేందుకు నేను, రాహుల్గాంధీ వెళ్లాం. బాధితులను పరామర్శించాం. మరి మోదీ ఎందుకు మణిపూర్ వెళ్లలేదు? వారు దేశ పౌరులు కాదా? దేశ ప్రజలను పట్టించుకోకుండా ప్రపంచ దేశాలు తిరుగుతూ దేశ ప్రజలను మోదీ రోడ్లపై వదిలేశారు. మోదీ మాదిరి అప్పట్లో ఇందిరాగాంధీ భయపడలేదు. బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం కల్పిస్తామని చెప్పి చేసి చూపించారు..’ అని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాకే అందరికీ అభివృద్ధి ఫలాలు ‘కార్యకర్తల కృషితోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి ఆత్మ. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టారు. రాహుల్గాంధీ పాదయాత్ర సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కీలక రంగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, రైతుభరోసా, రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తొలగించలేరు.. హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాదాపు 50కి పైగా కాంగ్రెస్ పాలనలో ఏర్పడ్డాయి. మరి మోదీ ప్రభుత్వం హైదరాబాద్కు ఏమిచ్చిందో చెప్పాలి. నల్లధనం తెచ్చి ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు ఇస్తానన్న మోదీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. మోదీ, అమిత్షా అబద్ధాలు చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో లేదని బీజేపీ చెప్తోంది. కానీ రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తీసేయలేరు. సెక్యులర్ అనే పదంతో ఇబ్బందిగా ఉంటే బీజేపీ పార్టీ ప్రణాళిక నుంచి ఆ పదం తొలగించి చూపించాలి..’ అని ఖర్గే సవాల్ చేశారు. కాంగ్రెస్కు కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు: సీఎం ‘తెలంగాణలో అధికార మదంతో తమకు తిరుగులేదనే అహంకారంతో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు. కార్యకర్తల కృషితో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం..ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలు దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నాయి. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా మారుతోంది. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం అమలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది..’ అని సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి ‘అద్భుతమైన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నప్పటికీ వాటిని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతి శాఖలో ఒక సంక్షేమ పథకం ఉంది. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. ప్రజా ప్రభుత్వం ప్రతి హామీ అమలు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కుల సర్వే హామీ ఇచ్చి అమలు చేసి చూపించాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిని జనగణనలో చేర్చింది. మహిళా సంఘాలకు ఆర్టీసీలో బస్సులు అద్దెకు ఇప్పించి లాభాలు గడించేలా ప్రోత్సహిస్తున్నాం. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్బంక్లు ఏర్పాటు చేయిస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. కోటిమంది మహిళలను ఎస్హెచ్జీల్లో చేర్పించి కోటీశ్వరులుగా చేసే బాధ్యత ప్రభుత్వానిదే. మోదీ, కిషన్రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. 18 నెలల్లో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. వంద నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను స్థాపించాం. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాలి. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదంటూ కొందరు వెకిలిగా వ్యాఖ్యానించారు. కానీ 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించాం. ఈ అంశంపై మోదీ, కిషన్రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలి. రైతులకు ఎవరు మేలు చేశారో అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం..’ అని ముఖ్యమంత్రి సవాల్ చేశారు. కార్యకర్తల ఎన్నికలొస్తున్నాయి.. ‘రాష్ట్రంలో నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి అధిష్టానానికి బహుమతి ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. స్టేజిమీద ఉన్న నాయకుల ఎన్నికలు అయ్యాయి. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. కార్యకర్తల గెలుపు కోసం పూర్తి సహకారం అందిస్తాం. టిక్కెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. బీఫామే ఇంటికి వస్తుంది..’ అని సీఎం అన్నారు. కాగా బహిరంగ సభ అనంతరం ఖర్గే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. -
మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు సోదరుడికి వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు సోదరుడు వేణు ప్రసాద్తో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
బీజేపీపై ఆర్ఎస్ఎస్ పట్టు బిగిస్తోందా?
దశాబ్దకాలంగా బీజేపీలో అప్రతిహత నిర్ణయాలు తీసుకున్న మోదీ - షా ద్వయం ఈ సారి మాత్రం ఆర్ఎస్ఎస్ ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. 2024 ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ సాధించకపోవడంతో కమలదళంపై ఆర్ఎస్ఎస్ తిరిగి పట్టు బిగించడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ సహకారం లేకపోతే పరిస్థితి భిన్నంగా ఉంటుందనే విషయాన్ని గమనించిన మోదీ-షా ద్వయం ఆర్ఎస్ఎస్తో సంప్రదింపులు, ఆమోదం తర్వాతే పార్టీ నియామాకాలకు ముందుకువెళుతున్నారు. అయితే బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం రాకపోవడంతో దాదాపు ఏడాదిగా ఈ నియామకం పెండింగ్లో పడింది. అయితే ఎట్టకేలకు గత రెండువారాల నుంచి ఆర్ ఎస్ ఎస్ ఆమోదంతో రాష్ట్రాల అధ్యక్షుల నియామాకాలు జరిగాయి. దాదాపు తొమ్మిది రాష్ట్రాలకు నూతనంగా బిజెపి అధ్యక్షుల నియామకం. ఈ నియామాకాలన్నింటిలో స్పష్టంగా ఆర్ఎస్ఎస్ ముద్ర కనిపించింది. ప్రత్యేకించి రెండు తెలుగురాష్ట్రాలలో బిజెపి అధ్యక్షుల నియామకంలో ఆర్ఎస్ఎస్ తిరుగులేని తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ తర్వాత బిజెపిలోకి ప్రవేశించిన మాజీ ఎమ్మెల్సీలు రాంచందర్రావు, పివిఎన్.మాధవ్కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ అధ్యక్ష పదవికోసం హేమాహేమీలు పోటీపడినా, రేసులో లేని రాంచందర్రావుకే నాయకత్వ పగ్గాలు అప్పగించారు. పార్టీలో విపరీతమైన గ్రూపు తగాదాల నేపథ్యంలో ఎవరికి పదవి అప్పగించినా, మరొకరు వారిని దెబ్బకొట్టే పరిస్థితి నెలకొనడంతో అందరినీ సమన్వయం చేసేందుకు సంస్థాగత నాయకుడిని సెలెక్ట్ చేసుకుంది.ఏ గ్రూపులలో లేకపోవడం, వివాదాలకు దూరంగా ఉండడం, సంఘ్ పరివార్ ఆశీస్సులు ఉండడం రాంచందర్రావుకు కలిసొచ్చింది. అలాగే పార్టీ వ్యవహారాలు తమ చేతిలోనే ఉండాలనే ఉద్దేశంతో సీనియర్లు కూడా రాంచందర్రావుకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీ, రాజకీయంగా, ఆర్థికంగా బలమైన రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఎంపీలు అధ్యక్షపదవిని ఆశించినా, వారిని కాదని బ్రాహ్మణ వర్గాన్నే అధ్యక్ష పదవి వరించింది. ప్రతిపక్షంలో ఉండే ఏ పార్టీకైనా దూకుడుగా ఉండే నాయకుడు అవసరమనేది అభిప్రాయముంది. కానీ ఈసారి దూకుడు కంటే , గ్రూపిజం లేని వ్యక్తికే పగ్గాలు అప్పగించడం ద్వారా సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసేవారికే పెద్దపీట వేసింది. అన్ని గ్రూపుల మధ్య బ్యాలెన్స్ కోసమే ఈ నియామకం చేసినట్లుగా కనిపిస్తోంది.ఇటు ఆంధ్రప్రదేశ్లో సైతం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్కు బిజెపి సారథ్య బాధ్యతలు అప్పగించడంలో ఆర్ ఎస్ ఎస్ చక్రం తిప్పింది. మొన్నటిదాకా అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి మరోసారి తనకు అధ్యక్ష పదవి పొడగించాలని కోరారు. అయితే అధ్యక్షురాలిగా పురంధేశ్వరి పార్టీ నిర్మాణం, పార్టీ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించలేదని అధిష్టానానికి నివేదికలందాయి. దాంతో ఆమెను కొనసాగించేందుకు అధిష్టానం అంగీకరించలేదు. ఆమె స్థానంలో ఆర్ఎస్ఎస్కు చెందిన మాధవ్ను నియమించడం ద్వారా సంస్థాగత నిర్మాణంపై వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఏపీలో అధ్యక్ష పదవికోసం పెద్దగా పోటీ లేనప్పటికీ వలస నేతలకు కాకుండా ఒరిజినల్ నేతలకే కీలక బాధ్యతలు ఇవ్వాలన్న ఆర్ఎస్ఎస్ అభిప్రాయం మేరకే మాధవ్ నియామకం జరిగింది. వలసనేతలకు ఎన్నికలలో టికెట్ ఇచ్చి రంగంలోకి దింపాలే తప్ప, పార్టీ కోర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల పెద్దగా లాభం లేదన్నది ఆర్ ఎస్ ఎస్ అభిప్రాయంగా ఉంది.గత పదేళ్ల నుంచి బిజెపిలో నియామకాలన్నీ దాదాపుగా నరేంద్రమోడీ, అమిత్షా ద్వయమే ఫైనల్ చేసేది. అన్ని నియామాకాల్లోనూ వారి మాటే నెగ్గేది. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడంలో మోడీ-షా ద్వయం కీలకపాత్ర పోషించింది. దాంతో వారూ కోరుకున్నట్లుగానే ఆర్ ఎస్ ఎస్ సైతం బిజెపి నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అయితే ఒక్కసారిగా 2024లో పరిస్థితి మారిపోయింది. అబ్కీ బార్ చార్ సౌ పార్ ...ఈసారి 400 సీట్లు అనే గట్టి ప్రచారం చేసినా అది వర్కవుట్ కాలేదు. 2019లో వచ్చిన 304 సీట్ల నుంచి 2024కల్లా 240 సీట్లకు పడిపోవడంతో మోదీ-షా ద్వయం ప్రభ సన్నగిల్లడం మొదలైంది. మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, పార్టీలో మాత్రం మోడీ-షా నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ ఆమోదం తప్పనిసరిగా మారింది. దాని వల్లే బిజెపి అధ్యక్షుడు జెపి.నడ్డా పదవీకాలం ముగిసినా కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది. జాతీయ అధ్యక్షుడి నియామకానికి దేశంలోని సగం రాష్ట్రాలలో బిజెపి అధ్యక్షుల నియామకం జరగాలనే నిబంధన ఉంది. దీనివల్లే నియామకం చేయడం లేదని బిజెపి అగ్రనేతలు బయటికి చెప్పుకున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం కొత్త బిజెపి అధ్యక్షుడి నియామకంపై మోడీ-షా, ఆర్ఎస్ ఎస్ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధానకారణం. తమ ఆమోదం లేకుండా నియమిస్తే, రానున్న ఎన్నికల్లలో సహకారం ఉండదనిసంకేతాలిచ్చింది. ఇప్పటికే లోక్సబ ఎన్నికల్లో మెజారిటీ రాక, మిత్రపక్షాల బలంపై ఆధారపడిన మోడీ ప్రభుత్వం ఆర్ ఎస్ ఎస్ సహకారం కోల్పోతే పరిస్థితి మరింత జఠిలమవుతుంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తొలిసారిగా నాగ్పూర్లోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి తన విధేయతను చాటారు. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అన్ని నియామాకాలు ఆర్ ఎస్ ఎస్ ఆమోదంతో కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర బిజెపి చీఫ్గా రవీంద్ర చవాన్, ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్గా మహేంద్రభట్, హిమాచల్ప్రదేశ్ అధ్యక్షుడిగా రాజీవ్ బిందల్, మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా హేమంత్ ఖండేల్వాల్, పుదుచ్చేరికి రామలింగం, మిజోరాంకు కె.బెచువా, అండమాన్ నికోబార్కు అనిల్ తివారిని అధ్యక్షులుగా నియమించింది. వీరంతా ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితులే. ఈ నియామకాల ద్వారా ఆర్ ఎస్ ఎస్ తిరిగి బిజెపి పై పట్టు బిగించినట్లయింది.సగం రాష్ట్రాలకు కొత్తగా అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో బిజెపి రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడి నియామకానికి లైన్ క్లియరైంది. అయితే అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేదానిపై రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కేంద్ర మంత్రులు శివరాజ్సింగ్ చౌహన్, ధర్మేంద్ర ప్రదాన్, మనోహర్లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరంతా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నుంచే బిజెపిలోకి రాజకీయ ప్రవేశం చేసి వివిధ హోదాలలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తొలిసారిగా అధ్యక్ష పదవి మహిళకు అప్పగించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, శోభా కరద్లాంజె, మహిళామోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరమైన ఎంపికలు చేసే మోదీ-షా ద్వయం ఈసారి ఆర్ఎస్ఎస్తో సమన్వయంతో వెళ్లాల్సి ఉంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది. దాదాపు ఏడాదికి పైగా జాతీయ అధ్యక్షుడి నియామకంపై అనిశ్చితి కొనసాగుతోంది. బిజెపి అగ్రనాయకత్వం- ఆర్ ఎస్ ఎస్ మధ్య ఏకాభిప్రాయం లేని కారణంగానే ఆలస్యమయ్యింది. అయితే ఢిల్లీలో జరుగుతున్న ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారక్ల సమావేశం తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈసారి సంఘ్ సంపూర్ణ ఆశీస్సులున్న వ్యక్తికే పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు అందబోతున్నాయి-వెంకటేష్ నాగిళ్ల, డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ ఢిల్లీ -
‘బాబు, పవన్లు గ్రామాల్లోకి రండి.. ఎవరి తాటతీస్తారో చూద్దాం’
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయిందని, మరి సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ‘ చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకు మురళీ కృష్ణంరాజు, కన్వీనర్ ఉమాబాల, జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాద్ రాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా బొత్స మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాండ్లు రాసి పేద ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంవత్సరం దాటిపోయింది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయి..?, సూపర్ సిక్స్ హామీలు.. అన్ని ఇచ్చేసాను ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ నాలుక మందం అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తాటతీస్తాను మధ్యలో ఇరగ కొడతా అంటున్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగా కోరులు మోసగాళ్లు.. పేద ప్రజల పక్షాన ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూటమినేతల మెడలు వంచుతాం. చంద్రబాబు పాలన ఎప్పుడు వచ్చినా మహిళలు రైతులు నష్టపోతు ఉంటారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రండి గ్రామాల్లోకి వెళదాం... ఎవరి తాటతీస్తారో తేలిపోతుంది. చంద్రబాబు వచ్చి 100 అబద్ధాలు చెబుతాడు..లోకేష్ వచ్చి... 200 అబద్ధాలు చెబుతాడు. అన్నదాత సుఖీభవ రూ. 20000 ఇస్తా అన్నారు సంవత్సరమైంది ఎవరికైనా ఇచ్చారా....?, ప్రజల సమస్యలపై పోరాడటం మా పార్టీ ధ్యేయం. రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా....?, సిండికేట్లుగా మారి ఆక్వా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ’ అని ధ్వజమెత్తారు బొత్స. జగన్ 2.0 లో కార్యకర్త ఏది చెబితే అదే జరుగుతుందిజగన్ 2.0 లో కార్యకర్త ఏది చెబితే అదే జరుగుతుందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. మన నాయకుడు మాటిస్తే మాట తప్పే పరిస్థితి లేదు.. తగ్గేదే లేదని ఈ సందర్భంగా తెలిపారు. కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రజలందరిని వంచించి మోసం చేశాడు. సంపదల సృష్టి కరెంటు బిల్లులు పెన్షన్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చంద్రబాబు దుర్మార్గమైన మనిషి. ఒక పెద్ద మనిషి ప్రశ్నిస్తాను అన్నాడు. కాపు నేస్తమా అమలు చేయడం లేదు. దానిపై ప్రశ్నించడం లేదుచంద్రబాబు సంపద సృష్టించడంలో నెంబర్ వన్ కాదు అప్పులు చేయడంలో నెంబర్ వన్. సంవత్సరం తిరగకుండానే రూ. 1,50,000 కోట్లు అప్పులు చేశాడు’ అని మండిపడ్డారు. -
పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న దారుణాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైఎస్ జగన్ శుక్రవారం (జులై 4) ఎక్స్ వేదికగా స్పందించారు.‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు… pic.twitter.com/VfNxKZRUlz— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 విషమంగా నాగమల్లేశ్వర్రావు ఆరోగ్యంకూటమి ప్రభుత్వంలో దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మన్నవ గ్రామంలో టీడీపీ అడ్డు అదుపూ లేకుండా పోతున్న ఆగడాల్ని ఆ ఊరి సర్పంచి నాగమల్లేశ్వర్రావు ప్రశ్నించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, సర్పంచి నాగమల్లేశ్వర్రావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
‘ఈ ప్రభుత్వంలో అసలు పవన్కు భాగస్వామ్యం ఉందా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్కు హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. జగన్ని అధికారంలోకి రానివ్వనని చెప్పడం కన్నా.. చంద్రబాబును మోస్తూ ఉంటానని చెప్తే మంచిదని అంబటి రాంబాబు చురకలంటిచారు. జగన మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు భయం పట్టుకుందని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. కూటమి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడమని హెచ్చరించారు. ‘పుష్ప సినిమా అన్నా, ఆ సినిమాలోని హీరో అన్నా పవన్ కళ్యాణ్కు నచ్చదు. అందుకే ఆ సినిమాలోని డైలాగులు పోస్టర్ వేసిన యువకుడిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు. సినిమా షూటింగులు చేసుకుంటూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో పవన్ తెలుసుకోలేక పోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకొని, ఆయన ఇచ్చిన స్క్రిప్టులు చదవటమే పనిగా పెట్టుకున్నారు. పవన్కి ఇల్లు, ఆఫీసు కట్టిస్తున్నది చంద్రబాబు కాదా?, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పేరుతో దియేటర్ల యాజమాన్యాలను బెదిరించారు. నాగబాబుని మంత్రి పదవిలోకి తీసుకుంటానని చంద్రబాబు లెటర్ రాసిచ్చి మోసం చేశాడు. మరి పదవి ఇవ్వలేదని చంద్రబాబును ఎందుకు అడగటం లేదు?’ అని అంబటి ప్రశ్నించారు.మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరి పరిపాలనఏపీలో చంద్రబాబు నేతృత్వంలో పరిపాలన మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా ఉందని అంబటి స్పష్టం చేశారు. ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా?, ఆ నిందితులను ఎమ్మెల్యేనే రక్షించి ఊరు దాటించేశారు. రెడ్బుక్ని కొనసాగించేందుకు కొందరు అధికారులు, రిటైర్డ్ అయినవారు కలిసి అజ్ఞాతంగా పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపాలని చూడటం లేదు. ఆ అజ్ఞాత వ్యక్తులు మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్తాం. పల్నాడులోని గుండ్లపాడులో టీడీపీలోని రెండు వర్గాలు గొడవ పడి చంపుకుంటే మా నేతలపై కేసులు పెట్టారు.సింగయ్యను ప్రయివేటు కారు ఢీకొట్టి చనిపోయాడని తొలుత ఎస్పీ చెప్పారు తర్వాత మాట మార్చారు. ఆ తర్వాత జగన్ కారే ఢీకొట్టిందంటూ ఆయన మీద కూడా కేసు పెట్టారు. సింగయ్యను ఆస్పత్రికి తరలించటానికి 40 నిమిషాలు ఎందుకు ఆలస్యం చేశారు?, అంబులెన్స్ లో ఎక్కకముందు చక్కగా మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత ఎలా చనిపోయారు?అని అంబటి నిలదీశారు. -
‘ప్యాడ్ మ్యాన్’గా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ ప్రచారంపై రాజకీయ దుమారం
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ చేపట్టిన ఎన్నికల వ్యూహం బెడిసికొట్టిందా?. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ప్యాడ్ మ్యాన్ సినిమా స్పూర్తితో కాంగ్రెస్ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కాంగ్రెస్కు భంగపాటు ఎదురైనట్లు సమాచారం. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మై బహన్ మాన్ యోజన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ బీహార్లోని ఐదులక్షల మంది మహిళలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంగానే ఉన్నా.. మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్లపై వివాదం రాజుకుంది. శానిటరీ ప్యాడ్ కవర్పై రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన మై బహన్ మాన్ యోజన పథకం వివరాలు ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ఫోటో ముద్రించడంపై బీజేపీ, ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మహిళల్ని కించపరిచేలా, వారి గౌరవాన్ని తక్కువ చేసేలా ప్రచారం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి ‘రాహుల్ ఫోటోతో శానిటరీ ప్యాడ్ పంపిణీ చేయడం మహిళల్ని అవమానించినట్లేనని ’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం బీజేపీ విమర్శల్ని ఖండిస్తోంది. నెలసరి సమయంలో మహిళల బాధల్ని ప్రపంచానికి చూపేలా శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. మై బహన్ మాన్ యోజన పథకం వివరాలు ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.2,500 నేరుగా నగదు సహాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్లు చెప్పింది. మహిళల గౌరవాన్ని, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఈ పథకం పేరు మై బహన్ మాన్ అని పెట్టినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు, నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా మహిళా సంభాషణ అనే కార్యక్రమం ద్వారా 2 కోట్ల మహిళలతో నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. -
‘మీలాంటోళ్లను చూసి భయపడం..’ టీపీఏసీ భేటీలో ఖర్గే వ్యాఖ్యలు
గాంధీభవన్లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని తప్పుబడుతూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, సాక్షి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నలుగురైదుగురు గ్రూపులు కడితే భయపడతాం అనుకుంటున్నారా?. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేనూ రాహుల్ అసలు పట్టించుకోం. వాళ్ల సంగతి పార్టీ క్రమశిక్షణా కమిటీ తేలుస్తుంది. అందుకే పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలి’’ అని సున్నితంగా హెచ్చరించారు. మరో సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నేతలకు చురకలంటించారు. ‘‘కాంగ్రెస్లో కొంత మంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మన ప్రతీ మూమెంట్ ప్రజలు గమనిస్తారు. అందుకే ఆచితూచి వ్యవహరించాలి. మీ వ్యవహార శైలితో పార్టీకి కొత్త నష్టం చేస్తే ఊరుకోం. పార్టీ ఉంటేనే మీరుంటారు. సొంత ఎజెండాతో పనిచేసే వారిపై వేటు తప్పదు. పార్టీ, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. జిల్లాల వారీగా ఆశావహుల లిస్టును పీసీసీ సిద్ధం చేయాలి అని సూచించారు. ఈ మీటింగ్ వేదికగా.. పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే టీపీసీసీకి డెడ్ లైన్ విధించారు. ‘‘ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలి. పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దే బాధ్యత’’ అని ఖర్గే అన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్ కలగజేసుకుని ఇంచార్జీ మంత్రులు బాధ్యత తీసుకొని పదవుల భర్తీ కోసం లిస్టులు టీపీసీసీ చీఫ్కు పంపాలని చెప్పారు. ఆ వెంటనే ఖర్గే మరోసారి ‘పార్టీలో పనిచేసిన వారికి.. అర్హత ఉన్నవాళ్లకే పదవులు ఇవ్వాలి’’ అని సూచించారు. టీపీసీసీ విస్తృత స్థాయి, కార్యవర్గ సమావేశాల్లోనూ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు. మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ లో పరిపాలన బావుంది, పార్టీ కార్యకర్తల పనితీరు బావుంది. పార్టీ మీ అందరికీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలి. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ఖర్గే ప్రసంగించారు. జడ్చర్ల ఎమ్మెల్యేపై పీసీసీ చీఫ్ ఆగ్రహంజడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీని పీసీసీ చీఫ్ ఆదేశించారు. సోమవారం జరగబోయే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కస్తూర్బా వసతి గృహంలో ఫుడ్పాయిజన్.. పోలీసుల అత్యుత్సాహం
శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సాక్షాత్తూ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాల్సి ఉండగా.. హాస్టల్ నేలపైనే ఉన్న చికిత్స అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే విషయంపై ఆరా తీసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్తో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. బాలికలు గురువారం రాత్రి తిన్న ఆహారం కలుషితమవడంతో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దీంతో బాలికలు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ప్రత్యేక వైద్య బృందం అక్కడికి చేరుకుని వసతిగృహంలోనే వారికి చికిత్స అందిస్తున్నారు.అయితే,బాలికల ఆరోగ్యంపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ బాలికల వసతి గృహానికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న బాలికల్ని పరామర్శించారు. బాలికలకు హాస్టల్లో కాకుండా మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు.ఈ సమయంలో పోలీసులు అత్యుత్సాహం చేశారు. హాస్టల్లో బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆహారం, భద్రత వంటి వివరాల్ని ఆరా తీయగా.. మంత్రి సవిత బాలికల్ని పరామర్శించేందుకు వస్తున్నారంటూ మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్తో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతలను బలవంతంగా బయటకు పంపారు. మీడియా ప్రతినిధులపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఓ విలేకరి సెల్ ఫోన్ను లాక్కొని పగులగొట్టారు. ఈ ఘటనలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీవీకే సీఎం అభ్యర్థిగా నటుడు విజయ్
తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్(Joseph Vijay Chandrasekhar) పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.శుక్రవారం ఉదయం చెన్నైలోని పార్టీ ప్రధానకార్యాలయంలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో విజయ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది టీవీకే కార్యవర్గం. అలాగే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ‘‘బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవు. ఈ ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదు’’:::విజయ్ వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, అటుపై ఎన్నికల దాకా గ్రామగ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయ్ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తోంది.అంతేకాదు.. తాజాగా అమిత్ షా చేసిన ఆంగ్ల భాష కామెంట్లు.. తమిళనాడుపై నేరుగా చేసిన దాడిగా టీవీకే పేర్కొంటూ ఖండించింది. బలవంతంగా హిందీని, సంస్కృత భాషను తమిళనాడులో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానంలో టీవీకే స్పష్టం చేసింది. అలాగే.. ఎలక్టోరల్ రివిజన్ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీవీకే తప్పుబట్టింది. ఇది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నమేనని, రాష్ట్రంలో మైనారిటీల ఓట్లను తగ్గించే ప్రయత్నమేనని ఆరోపించింది. భారత సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళనాట మాత్రమే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనూహ్యంగా.. 2024 ఫిబ్రవరి 2వ తేదీన సెక్యులర్ సోషియల్ జస్టిస్ అనే సిద్దాంతంతో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని విజయ్ ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో తొలి రాజకీయ మహాసభ నిర్వహించగా.. అది సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ మహాసభ వేదికగా.. తన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రకటించారాయాన. పెరియార్, అంబేడ్కర్, కామరాజ్, వేలు నాచియార్ తదితరుల ఆశయాలపై నడుస్తానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. నీట్, జాతీయ నూతన విద్యా విధానం.. త్రిభాషా సిద్ధాంతం అమలు లాంటి అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ రాజకీయంగానూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. -
రేవంత్.. నిరుద్యోగుల నిర్బంధం, అరెస్ట్ దుర్మార్గం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టుచేసి వారి గొంతులు నొక్కలేరు అంటూ విమర్శించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్ గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్ కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా?. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి మరీ నిరుద్యోగులతో చాయ్ పే చర్చ పెట్టిన రేవంత్కు గద్దెనెక్కిన తరువాత జాబ్ క్యాలెండర్ అసలు గుర్తే లేదా?.చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుద్యోగులు హైదరాబాద్ రాకుండా ముందుగానే నిర్బంధించడమే దారుణమైతే, ఇవాళ సచివాలయానికి గోడు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గం. యూత్ డిక్లరేషన్ పేరిట ఢిల్లీ పెద్దలను పిలిపించి మరీ మోసం చేసిన రేవంత్ ఏడాదిన్నర కాలంలో పట్టుమని పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడమే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రక్రియ పూర్తి చేసిన 60వేల ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న చేతకాని ముఖ్యమంత్రిని నిరుద్యోగులు ఎప్పటికీ క్షమించరు. ఓవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇంకెప్పుడు అని నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు నిరుద్యోగులు నోటిఫికేషన్లే వద్దంటున్నారని బుకాయించడం కాంగ్రెస్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనం.ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టుచేసి వారి గొంతులు నొక్కలేరు. వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలి. లేకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రేవంత్ సర్కారు మెడలు వంచుతాం.. కాంగ్రెస్ సర్కారు చేసిన ద్రోహాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం.. జై తెలంగాణ అని వ్యాఖ్యలు చేశారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఏరాసుపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి
సాక్షి, నంద్యాల: జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి, టీడీపీ నేత ఏరాసు ప్రతాప్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహణపై పెద్ద రచ్చే జరిగింది. తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ బుడ్డా అనుచరులు రెచ్చిపోయారు.ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలను బుడ్డా వర్గీయులు ధ్వంసం చేశారు. బుడ్డా అనుచరులు.. ఏరాసుపై చేయి చేసుకున్నారు. ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. -
గాంధీ భవన్లో ఖర్గే.. సీఎం రేవంత్తో భేటీ
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్, పార్టీ ఇంఛార్జీ మీనాక్షీ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, పీఏసీ సభ్యులతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ పాలన, జై బాపు జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పీఏసీలో ప్రత్యేకంగా చర్చించనున్నారు.లక్డీకాపూల్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.కాగా, ఇవాళ పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ కృష్ణా హోటల్కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. -
నిలకడగానే కేసీఆర్ ఆరోగ్యం
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అస్వస్థతతో గురువారం సాయంత్రం నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జ్వరం, మధుమేహ సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(71) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉన్న ఆయన.. వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచనతో నిన్న నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనతోపాటు కుటుంబ సభ్యులు ఉండగా.. తాజాగా కూతురు-ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.కేసీఆర్ నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వైద్య బృందం ఇదివరకే ఉందని ప్రకటించింది. కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరగగా, సోడియం లెవెల్స్ కాస్త తగ్గాయని తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసి, సోడియం లెవెల్స్ను పెంచుతున్నామని హెల్త్ బులిటెన్ ద్వారా వెల్లడించింది. అయితే.. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందన్న వైద్యులు.. కోలుకునేందుకు మరో రెండు రోజులు పట్టొచ్చని, అప్పుడే ఆయన్ని డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. KCR ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులు, అధికారులతో స్వయంగా మాట్లాడిన సీఎం.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా కేసీఆర్ ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. మరోవైపు.. కేసీఆర్ అనారోగ్య వార్తలతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు తరలి వస్తున్నారు. -
ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలోని ఎల్బీ స్టేడియంలోనిర్వహించబోయే సామాజిక న్యాయ సమర భేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అయితే, ఖర్గే పర్యటన వేళ హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం.. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ ప్లెక్సీలు వెలిశాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. ‘జై భీం ఎస్సీ,ఎస్టీలే మా లక్ష్యం. జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు’ అనే స్లోగన్లతో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.కాగా, మల్లికార్జున ఖర్గే ఇవాళ(శుక్రవారం) వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
బీజేపీ రాజకీయ వ్యూహం.. మహిళకు అధ్యక్ష పదవి!.. రేసులో ముగ్గురు!
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధ్యక్షుడు ఎవరు అని రాజకీయ వర్గాల్లో, పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీకాలం ముగిసి రెండేళ్లయినా, ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. అయితే, బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, కీలక పదవి ఎవరిని వరిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇక, ఈసారి అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు నేషనల్ మీడియా(ఇండియా టుడే)లో కథనాలు వెలువడ్డాయి.బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ నుంచి ముగ్గురు మహిళల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. నిర్మల ముందంజ..అయితే, రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆమె విస్తృత అనుభవం, నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. అధ్యక్ష బాధ్యతలను సీతారామన్కు ఇస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, పార్టీ విస్తరించడానికి సహాయపడుతుందనే అంచనాకు పార్టీ నాయకత్వం ఆలోచన చేసినట్టు సమాచారం. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిర్మల కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి, రక్షణమంత్రిగా విజయవంతంగా నిర్వర్తించారు. ఈమెకు ఆర్ఎస్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెనే అధ్యక్షురాలు అవ్వొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణాలతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మలకు బాధ్యతలు ఇచ్చే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. వనతి శ్రీనివాసన్..తమిళనాడుకు చెందిన న్యాయవాది, బీజేపీ నాయకురాలు వనతి శ్రీనివాసన్ కూడా పరిశీలనలో ఉంది. ఆమె ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కోయంబత్తూర్ సౌత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1993లో బీజేపీలో చేరినప్పటి నుండి రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, తమిళనాడు ఉపాధ్యక్ష పదవి సహా అనేక కీలక బాధ్యతలను ఆమె నిర్వహించారు. 2020లో పార్టీ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో, ఆమె పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలకు ఆమెకు అప్పగిస్తే తమిళనాడులో వనతి మార్క్ కనిపించే అవకాశం ఉంది.పురందేశ్వరిరాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకురాలైన పురంధేశ్వరి ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగారు.ఆర్ఎస్ఎస్ ఆమోదంమహిళా నాయకత్వం, ప్రతీకాత్మక, వ్యూహాత్మక ప్రయోజనాలను గుర్తించి, పార్టీ అత్యున్నత పదవికి మహిళను నియమించాలనే ఆలోచనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆమోదించిందని పార్టీ సైతం వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, ఈసారి అధ్యక్ష బాధ్యతలను మహిళకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మా నాన్నకు 50 ఏళ్లు.. పింఛన్ ఎప్పుడిస్తారు!
సి.బెళగల్: ‘యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు.. మా నాన్నకు ఇంతవరకు పింఛన్ రాలేదు. పింఛన్ ఎప్పుడిస్తారు?’అంటూ కర్నూలు జిల్లా సి.బెళగల్లో ఓ ముస్లిం కుటుంబం కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్ధన్రెడ్డిని ప్రశ్నించింది. సి.బెళగల్లో టీడీపీ నాయకులు గురువారం తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కోట వీధిలోని అబ్దుల్ సత్తార్ ఇంటికి టీడీపీ నాయకులతో కలిసి వెళ్లిన విష్ణువర్ధన్రెడ్డిని అబ్దుల్ కుమార్తెలు తమ తండ్రికి 50 ఏళ్ల పింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నింనంచారు. దీనితో టీడీపీ నాయకులు కొంత ఇబ్బంది పడ్డారు.అదే విధంగా గ్రామ ప్రధాన రోడ్డు, మురికి కాలువలు, మంచినీటి ట్యాంక్ నిర్మాణాల వంటి డిమాండ్లూ గ్రామస్తుల నుంచి వచ్చాయి. కాగా, ఎంపిక చేసిన కొన్ని ఇళ్లను మాత్రమే టీడీపీ నాయకులు సందర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
రెండు గంటల్లో.. ‘వెనకడుగు..’ మంత్రి, ఎంపీలకు చేదు అనుభవం
జరుగుమల్లి (సింగరాయకొండ): కూటమి ప్రభుత్వ హామీల అమలు, అవకతవకలపై అడుగడుగునా మహిళలు నిలదీయడంతో రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యకు చేదు అనుభవం ఎదురైంది.ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల కేంద్రంలో గురువారం తొలిరోజు ప్రారంభమైన ‘తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా నాయకులు జరుగుమల్లి మండల కేంద్రానికి వచ్చారు.‘అయ్యా.. నాకు ముగ్గురు పిల్లలు. ఒక పాపకు మాత్రమే తల్లికి వందనం నగదు పడింది.. మిగతా వారికి పడలేదు’ అని మహిళ అడగ్గా, ‘మాకు గ్యాస్ డబ్బులు పడలేదు’ అంటూ మరికొందరు నిలదీశారు. ‘సార్.. నాకు ఇంటి స్థలం ఉంది.. ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇల్లు మంజూరు కాలేదు’ అని మరో మహిళ ఆగ్రహం వ్యక్త చేసింది. -
ఇవిగో సాక్ష్యాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతేడాది ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరులో మాయాజాలం.. ఈవీఎంలలో పోలైన ఓట్లకు (ఫారం–17 ప్రకారం), లెక్కించిన ఓట్లకు (ఫారం–20 ప్రకారం) మధ్య భారీ వ్యత్యాసం ఉండటం.. అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికీ, ఆ తర్వాత నాలుగు రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండటం.. తొలుత ప్రకటించిన దానితో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్ ఏకంగా 12.54 శాతం పెరగడం.. దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28 వేల ఓట్లు, లోక్సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం.. అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోటములను నిర్దేశించడం.. తదితర అంశాలపై వైఎస్సార్సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసింది. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధారాలతో సీఈసీ ముందుంచింది. ఈవీఎంల పనితీరుపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వాటిని పక్కనపెట్టి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ను సీఈసీ దృష్టికి గట్టిగా తీసుకొచ్చింది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుకు సంబంధించి సాంకేతిక అంశాలు, కొన్ని పోలింగ్ బూత్లలో చోటుచేసుకున్న అసంబద్ధ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ గతంలోనే సీఈసీకి ఫిర్యాదుచేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్కుమార్, కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు నిర్వహించిన సమావేశానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, లోక్సభ పక్షనేత పి.మిథున్రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం మిథున్రెడ్డి, చంద్రశేఖర్తో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈవీఎం, వీవీ ప్యాట్లను పోల్చి చూడాలి2024 ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల తీరుపై అనేక అనుమానాలున్నందున వాటిని నివృత్తి చేయాలని కోరాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ఓట్లను పోల్చి చూడాలని కోరాం. ఇందుకు ఫీజు కింద నిర్ణీత రుసుము కూడా ఇప్పటికే చెల్లించాం. బ్యాటరీ చార్జింగ్ విషయంలో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలున్నాయి. పోలింగ్ పూర్తయ్యాక 80 శాతం ఉంటే.. 40 రోజుల తర్వాత కౌంటింగ్ సమయంలో 98 శాతం చార్జింగ్ ఉన్న సందర్భాలు కనిపించాయి. సాయంత్రం 6 గంటల తర్వాత చాలాచోట్ల పోలింగ్ శాతం పెరిగింది. నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పోలయ్యాయి. వీటిపై అనేక అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని సీఈసీని కోరాం. అయితే, వీవీ ప్యాట్లను కంపారిజన్ చేయడం కుదరదని చెప్పారు. అవి రీ చార్జబుల్ బ్యాటరీలు కావడం వల్ల చార్జింగ్ పెరగడం, తగ్గడం అంటూ జరగదని చెబుతున్నారు.రాయచోటి ఓ ఉదాహరణ..2014–19 కంటే గతేడాది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని సీఈసీకి వివరించాం. రాయచోటి నియోజకవర్గం దీనికి ఉదాహరణ అని చెప్పాం. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎక్కువ శాతం పోలింగ్ అంశంపై నియోజకవర్గం డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల పెరుగుదలపై మావద్ద ఉన్న ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్కుమార్కు అందించాం. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందిస్తూ.. ఓటర్ల జాబితా విషయంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక విస్తృత సవరణ) చేపడతామని హామీ ఇచ్చింది.మీడియాతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. పక్కన పి.మిథున్రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ హిందూపురం ఓటింగ్ సరళిలో వ్యత్యాసాలు..ఈవీఎంలపై సాంకేతికతపరంగా ఉన్న సందేహాలను ఈసీకి వివరించాం. మేం ఓడిపోయాం కదా అని నేరం ఎవరిపైనా మోపట్లేదు. అందుకే ప్రత్యేకంగా హిందూపురం నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను సీఈసీ ముందుంచాం. హిందూపురం నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్–157, 28లలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థికి 472 ఓట్లు పోలవ్వగా, అదే బూత్లో అసెంబ్లీ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు పోలైన విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇక కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి ఒక ఓటు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చాయి. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థికి 8 ఓట్లు పోలవ్వగా, అసెంబ్లీ అభ్యర్థికి 95 ఓట్లు వచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా సీఈసీ ముందుంచాం. ఓటింగ్ సరళిలో ఇన్ని తేడాలు రావడం మా అనుమానాలకు కారణం. దీనిపై క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని కోరాం. దీంతో.. బిహార్ తరహాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించేందుకు సీఈసీ జ్ఞానేశ్కుమార్ అంగీకరించారు.బ్యాలెట్తోనే ఎన్నికలు జరపాలి..ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంలను, వీవీ ప్యాట్లను విశ్వసించేందుకు ఏమాత్రం ఆస్కారం లేనందున బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేశాం. అమెరికా, జర్మనీ, యూరప్ దేశాల్లో సైతం బ్యాలెట్తోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని వారికి గుర్తు చేశాం. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరిగితే ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, పారదర్శకత ఉంటుందని వివరించాం. వీవీ ప్యాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కించబోమని.. ఆయా పోలింగ్ బూత్లకు సంబంధించి సీసీ ఫుటేజీలను కూడా ఇచ్చేది లేదని సీఈసీ చెప్పింది.ఎన్నికల ప్రక్రియ బలోపేతం: ఈసీఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రత్యక్షంగా కమిషన్ దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ బృందంతో చర్చలు జరిపినట్లు సీఈసీ తెలిపింది. ఈమేరకు ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గురువారం వైఎస్సార్సీపీ నేతలతో భేటీ అనంతరం సీఈసీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ పార్టీలతో నిర్మాణాత్మక చర్చలు అవసరమని ఈసీ పేర్కొంది. -
పార్టీ ఎజెండా ముఖ్యం.. అధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఎలాంటి నిర్ణయమైనా సమష్టిగా చర్చించిన తర్వాతే తీసుకుంటామని, దాన్నిఅమలు చేసే బాధ్యత మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడిపై ఉంటుందని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు చెప్పారు. సొంతంగా, స్వార్థపూరితంగా నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ‘పార్టీ ఎజెండా ముఖ్యం.. 2028లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యం’ అనే నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యక్రమాలపై గురువారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అప్పుల గురించి రేవంత్కు అప్పుడు తెలియదా? ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాదిన్నర కాలంలోనే పూర్తిగా విఫలమైంది. సీఎం రేవంత్రెడ్డి వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ అప్పుల గురించి చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఈ అప్పుల సంగతి ఆయనకు తెలియదా? కనీస అవగాహన లేకుండానే హామీలు ఇచ్చారా? అమలు చేయాల్సి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి గురించి చెబుతారా? రైతు రుణమాఫీ ఇంకా పూర్తికాలేదు. రైతుబంధు అందడం లేదు. మహాలక్ష్మీ, గృహలక్ష్మి అంటూ ఎన్నో హామీలు ఇచ్చి... ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసిందంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నమే కనిపిస్తోంది. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు ప్రజలు గుర్తించారు. ప్రజాస్వామ్య తెలంగాణ మాటలకే పరిమితమైంది. భైంసాలో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టారు. గోరక్షకులను అరెస్టులు చేశారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.. పదేళ్ల పాలన చూసిన తర్వాత బీఆర్ఎస్ను ప్రజలు వద్దనుకున్నారు. అందుకే కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ విధానాలనే అమలు చేస్తోంది. అందుకే కేవలం ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండింటికీ ప్రత్యామ్నాయం బీజేపీ అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో ఉంది. రెండు ప్రభుత్వాలను చూసిన తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితికి తగినట్లు బీజేపీ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. అధికారంలోకి వచ్చేలా కష్టపడతాం. ఒక్క ఎమ్మెల్యేతో మొదలుపెట్టి.. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో బలమైన పార్టీగా ఎదిగింది. గతంలో కేవలం మూడు, నాలుగు శాతం ఓట్లున్న ఈ పార్టీ..గత పార్లమెంటు ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో సగం ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామనే ధీమా ఏర్పడింది. గెలుపు గుర్రాలకే ‘స్థానిక’టిక్కెట్లు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. జీహెచ్ఎంసీలో పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్లపై ఉన్న వ్యతిరేకత మాకు కలిసివస్తుంది. త్వరలో వర్క్షాప్ నిర్వహిస్తాం. ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే దానిపై చర్చిస్తాం. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటాం. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాం. ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్లను చేర్చుకుంటాం. కొత్త నీరు వస్తేనే కదా ప్రవాహం పెరిగేది. టాలెంట్కు తగిన పదవులు కూడా ఇస్తాం. పాత, కొత్త నాయకులనే తేడా అస్సలు లేదు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటా.. రాష్ట్ర అధ్యక్షుడిగా క్షేత్రస్థాయి పర్యటనలకే తొలి ప్రాధాన్యత. పార్టీ పరంగా మాకు 38 జిల్లాలున్నాయి. కార్యాలయానికే పరిమితం కాకుండా నిత్యం ప్రజల మధ్యనే ఉంటా. సమస్యలపై ఉద్యమాలు చేపడతా. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతా. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొదిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బీసీ నినాదం ఉత్తమాటే. బీసీ బిల్లు ఇక్కడ రూపొందించి అక్కడ అమలు చేయడమనేది తెలివి తక్కువ చర్య. బిల్లు ఆమోదిస్తే గెజిట్ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ బిల్లు తయారు చేసి కేంద్రాన్ని అమలు చేయమన్నది. మా ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతి ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తాం. యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇచ్చే సమయాన్ని బట్టి ఈ నెల 5 లేదా 10వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తా. -
సారీ.. వచ్చేసారి.. మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఖర్గే
సాక్షి, హైదరాబాద్: అర్హులైన నేతలు మంత్రి పదవులు ఆశించడంలో తప్పులేదని అయితే పార్టీ అంతర్గత పరిస్థితులు రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సముచిత న్యాయం చేసేందుకు పార్టీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారి వారి అనుభవం, అర్హతలకు అనుగుణంగా పదవులు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం జరగనున్న పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, పార్టీ నేత హర్కర వేణుగోపాలరావు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేరుగా తాను బస చేసే తాజ్ కృష్ణా హోటల్కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. మేం అర్హులం.. మాకు అవకాశం ఇవ్వాల్సిందే ఏఐసీసీ చీఫ్తో భేటీ అయ్యేందుకు రావాలని గురువారం మధ్యాహ్నం కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు సుదర్శన్రెడ్డి, ప్రేంసాగర్ రావు, బాలునాయక్, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి సాయంత్రం హోటల్కు చేరుకుని ఖర్గేతో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్కు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ నియోజకవర్గాల్లో ముందే నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వారు రాలేకపోయారు. కాగా ఈ భేటీలో ఎమ్మెల్యేలు.. తమకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలో, తాము ఎలా అర్హులమో వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, పార్టీ పట్ల విధేయతో ఉంటున్నామని, తమకు ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిందేనని కోరారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, ఆ రెండు జిల్లాలకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కష్టపడండి ..గెలిచి రండి అందరి వాదనలను సావధానంగా విన్న ఖర్గే..ఎమ్మెల్యేల వినతులను పార్టీ తప్పకుండా పరిశీలిస్తుందని, భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అర్హులైన వారికి కూడా కొన్ని పదవులు ఇవ్వలేకపోయామని భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీలును బట్టి పార్టీలో ప్రాధాన్యమిస్తామని, సీనియారిటీని తప్పకుండా గౌరవిస్తామని, సామాజిక న్యాయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందని అప్పుడు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని, మెజార్టీ స్థానాల్లో గెలవాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నిటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో ఖర్గే సమావేశం కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోటల్లోనే ఉన్నారు. సాయంత్రం 6:30 గంటలకు అక్కడికి వచ్చిన ఆయన.. 9 గంటల తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. ఖర్గేతో భేటీ అయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత సీఎంను కూడా కలిశారు. తమకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలో, ఖర్గేకి ఏం చెప్పామో వివరించారు. 9 దాటిన తర్వాత హోటల్ నుంచి రేవంత్ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్ కూడా హోటల్లో కొంతసేపు ఉండి ఆ తర్వాత శుక్రవారం నాటి సమావేశాలు, సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు వెళ్లారు. కాగా సీఎంను కలిసేందుకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హోటల్కు రాగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. చీఫ్ విప్ ఆఫర్ చేసినా.. తాను పార్టీ కోసం చేసిన కృషిని, పార్టీ పట్ల విధేయతను వివరించినప్పటికీ మంత్రి పదవిపై సరైన భరోసా లభించకపోవడంతో అలిగిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు హోటల్ నుంచి విసురుగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆయనకు చీఫ్ విప్ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా ప్రేంసాగర్ రావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన ప్రేంసాగర్ రావు.. తాను అలిగాననడంలో ఎలాంటి వాస్తవం లేదని, పార్టీ అధ్యక్షుడికి తన మనసులో మాట చెప్పి వెళ్లిపోయానని చెప్పారు. కొండా మురళి దంపతుల వివరణ వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా ఖర్గేను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విభేదాలపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని, సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఖర్గే చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళిలు కూడా ఖర్గేతో కాసేపు సమావేశం అయ్యారు. ఖర్గేతో భేటీ అనంతరం ఎవరేమన్నారంటే.. ఉమ్మడి జిల్లాలన్నింటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరినట్లు మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ‘పార్టీలో సీనియర్లం ఉన్నాం..మంత్రి పదవి ఇవ్వాలని కోరా..’ అని సుదర్శన్రెడ్డి చెప్పారు. లంబాడా సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారని బాలునాయర్ తెలిపారు. తాను మంత్రి పదవికి ఎలా అర్హుడనో ఖర్గేకి వివరించానని రామ్మోహన్రెడ్డి తెలిపారు. తనది నాలుగు తరాల విధేయత అని చెప్పానన్నారు. నేడు వరస సమావేశాలు మల్లికార్జున ఖర్గే శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ సర్పంచ్పై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా టీడీపీ నేతల అక్రమాలను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నాగమల్లేశ్వరరావును టీడీపీ నేతలు.. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన నాగమల్లేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
‘కేసీఆర్ మాట్లాడితే నేను మాట్లాడతా.. వారితో సంబంధం లేదు’
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్నిఅంశాలపై చర్చ జరుపుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. కేసీఆర్, మేము ఉద్యమంలో పని చేశామని, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి అన్నారు. తమకు హరీష్ రావు, కేటీఆర్లతో సంబంధం లేదని, వారు తమ లెక్కల్లోకి రారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘ హరీష్రావు ఉత్తి ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులను చెప్పాలి. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటాం. కేసీఆర్తోనే లెక్క.. హరీష్రావు ఎవరో నాకు తెలీదు. ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్రావు, కేటీఆర్లు,. కేసీఆర్ చుట్టూ ఉంటూ కేసీఆర్కు చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావు, కేటీఆర్లు కీలకం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. -
Siddaramaiah: ‘సీఎం సిద్ధరామయ్య నా మీదే చెయ్యెత్తుతారా?’
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ధార్వాడ జిల్లా ఏఎస్పీ నారాయణ భరమణి (ASP Narayan Venkappa Baramani) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు బహిరంగ సభలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య (cm siddaramaiah).. తనని కొడుతానంటూ చెయ్యెత్తడం తనని మానసికంగా కలచివేసిందంటూ ఏఎస్పీ నారాయణ భరమణిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేసిన తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ప్రకటించారు.ఈ మేరకు కర్ణాటక పోలీస్ శాఖకు ఏఎస్పీ నారాయణ భరమణి లేఖ రాశారు. వీఆర్ఎస్ లేఖలో..‘ అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగింది. ఆ సంఘటన నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కుటుంబం బాధపడింది. నా భార్య, పిల్లలు కన్నీళ్లతో నిశ్శబ్దంగా గడిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. పలువురు నన్ను అవమానిస్తూ కామెంట్లు పెట్టారు. 31 ఏళ్లుగా పోలీస్ శాఖలో అంకిత భావంతో పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. ఏఎస్పీ నారాయణ భరమణి వీఆర్ఎస్ ప్రకటించడంపై కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర .. ఏఎస్పీ నారాయణ భరమణిని సంప్రదించి బెళగావి డీసీపీ (Belagavi)గా కొత్త పోస్టింగ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను భరమణి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. The Police, who was insulted on stage by Congress leader & CM Siddaramaiah has resigned.The cop served for 31 years, joined force as his dream wish, worked hard.In his resignation, ASP Narayan Baramani has said he felt humiliated & traumatizedpic.twitter.com/ZxBCvSSF9h— Karthik Reddy (@bykarthikreddy) July 3, 2025పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో (2025 Pahalgam attack) ‘పాకిస్తాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’అంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. పలువురు సిద్ధరామయ్య పాకిస్తాన్ వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్ తర్వాత ఏప్రిల్ 28న బెలగావిలో కాంగ్రెస్ సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.సహనం కోల్పోయిన సిద్ధరామయ్యఅయితే, ఆసభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుతగిలారు. గో టూ పాకిస్తాన్ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్ చేయడంలేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.ఆ ఘటనపై రాజకీయ వివాదం జరిగింది. ప్రతిపక్షాలు ఆయన తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్ పరిపాలనతో పోల్చాయి. ఆ ఘటనపై ఏఎస్పీ నారాయణ్ భరమణి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వీఆర్ఎస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చాంశనీయంగా మారింది. -
‘సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది’
విశాఖ: హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు‘శవరాజకీయాలపై పేటెంట్ హక్కు చంద్రబాబుది. సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది. అంబులెన్స్లో నా భర్తకు ఏదో జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను లోకేష్ మనుషులు ఎందుకు బెదిరించారు. వైఎస్ జగన్ను చూసి పాలక పక్షం భయపడుతోంది. ఏఐ ద్వారా జగన్పై తప్పుడు ప్రచారం చేశారు. తండ్రీ కొడులు ఇద్దరూ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి పిచ్చెక్కిపోతున్నారు. కూటమికి ఓటు వేసి ప్రజలు మోసపోయారు..షరతులు పెట్టి తల్లికి వందనం కట్ చేశారు.. పురుగులు పట్టిన అన్నం విద్యార్థులకు పెడుతున్నారు. హోమ్ మంత్రి అనిత చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. బొద్దింక ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.’ అని జూపూడి డిమాండ్ చేశారు. -
‘నిజం చెప్పినందుకు లోకేష్ మనుషులు బెదిరిస్తారా?’
తాడేపల్లి: సత్తెనపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు. నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నారు. సత్తెనపల్లి లో జరిగిన సింగయ్య మరణంపై చంద్రబాబు నీచంగా మాట్లాడటం ద్వారా తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే కుక్క పిల్లలా లాగిపడేశారని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబు తనకు ఉన్న చులకలభావాన్ని చాటుకున్నారు. సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని, వైఎస్ జగన్పై పన్నిన కుతంత్రంను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేశారు.దళితులంటే అంత చులకనా బాబూసింగయ్య భార్య లూర్దు మేరి వైఎస్ జగన్ని కలిశారు. తమ కుటుంబానికి వైఎస్ జగన్ అంటే అభిమానమని, ఆయన్ను చూడటానికి తాను, తన భర్త సింగయ్య బయటకు వచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు తన భర్తే స్వయంగా మా పేర్లు, ఫోన్ నెంబర్లు చెప్పారని, అంబులెన్స్ లోకి చేరేవరకు బాగానే ఉన్నారని, బాగానే మాట్లాడుతున్నారని, తనకు కొద్దిపాటి దెబ్బలే తగిలాయని చెప్పిన విషయం ఆమె గుర్తు చేశారు. ఆటోలో తీసుకెళ్తామని చెప్పినా వినకుండా అంబులెన్స్లో తరలించారు. బాగా మాట్లాడుతున్న వ్యక్తి ఎలా చనిపోయాడని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఎస్పీ సైతం ప్రమాదం జరిగిన్పపుడు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారు. నారా లోకేష్ 50 మందిని తన ఇంటికి పంపించి బెదరించారని బాధితురాలు మేరీ చెబుతోంది. ఇవన్నీ సింగయ్య మరణంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దళితుల పట్ల చంద్రబాబు ఎంత ప్రేమ ఉందనేది మా అందరికీ తెలుసు. మొన్న తెనాలిలో దళిత యువకులను పోలీసులు లాఠీలు విరిగేలా కొడితే వారిపై చర్యలు తీసుకోకుండా గంజాయి బ్యాచ్ అని విషప్రచారం చేశారు. గత చంద్రబాబు పాలనను పక్కన పెడితే, ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్ననే చంద్రగిరిలో దళిత మహిళను బట్టలు చించి కొట్టారు. జేమ్స్ అనే యువకుడితే మూత్రం తాగించారు. దళితుల మీద సాంఘిక బహిష్కరణలు ఎక్కువైపోయాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా కనీసం దానిపై ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? మంగళగిరి నియోజకవర్గంలో దళితులు నడిచారని రోడ్డు మైలపడిందని పసుపు నీళ్లతో కడిగిన దారుణం ఇప్పటికీ మా కళ్లలో కదులుతూనే ఉంది. సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై టీడీపీ యువకులు 16 మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తే వారి కుటుంబానికి న్యాయం చేశారా? ఆ బాలిక తండ్రి మీ పార్టీ కార్యకర్త అని, మీ పార్టీ విజయోత్సవ సంబరాల్లో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ వారి కుటుంబాన్ని ఆదుకోకపోగా ఇంత దారుణంగా మృతుడి కుమార్తెకి అన్యాయం చేస్తారా? ఇలా ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకున్నారా? ఒక దళితుడిని కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్లినంత మాత్రాన దళితులను ఉద్దరించినట్టు ప్రజలకు అనుకుంటారనే భ్రమల్లో నుంచి బయటకు రండి. మైకులు పెట్టి ఇచ్చిన స్ర్కిప్టు చదివితే మేం నమ్మేస్తామని ఎలా అనుకుంటారు? మీ హయాంలో జరిగిన వాటికి ఏం సమాధానం చెబుతారు?నాడు సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్లో ఉండగా గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట జరిగి 29 మంది అమాయక భక్తులు చనిపోయారు. చంద్రబాబు నిర్వహించిన కందుకూరు రోడ్ షోలో 7 మంది చనిపోయారు. గుంటూరులో చంద్రబాబు బహిరంగ సభ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస జాగ్రత్తలు పాటించని కారణంగా ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ప్రమాదాలు జరిగిన అన్ని సందర్భాల్లో అక్కడ చంద్రబాబు ఉన్నారు. వీటన్నింటికీ ఆయన ఏం సమాధానం చెబుతారు. అన్ని వర్గాల్లోనూ కూటమి ప్రభుత్వంపై రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది. వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుని, ఆయన పర్యటనలకు బ్రహ్మరథం పడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైఎస్ జగన్కి ఉన్న ప్రజాభిమానాన్ని తక్కువ చూసి చూపించడానికి వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఆయన బయటకు రాకుండా చేయాలనే కుట్రతో ఆయన పర్యటనలకు అనుమతులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై చర్చ జరిగితేనే పాలన మెరుగువుతుందన్న కీలక విషయాన్ని చంద్రబాబు మర్చిపోతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక మందం అనడం దేనికి సంకేతం? పోలీసులను కూడా పార్టీల వారీగా విభజించి వేధిస్తున్న ఘనత చంద్రబాబుది.ఇంత వికృతమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారో చర్చించటానికి మేము సిద్ధం. మా హయాంలో జరిగిన అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేశారు. లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని సింగయ్య భార్య చెప్పింది. దీనిపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పటం లేదు?, ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై లైంగిక దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారు?, ఆ బాలిక తండ్రి టీడీపీ కార్యకర్త. చంద్రబాబు మీటింగుకి వెళ్లి ఆయన చనిపోయారు. అలాంటి కుటుంబానికి చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?, చంద్రబాబు గానీ ఆయన మంత్రులుగానీ కనీసం పరామర్శించకపోవటానికి కారణం ఏంటి?, లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని శైలజానాత్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య -
బాబు.. సెక్యూరిటీ లేకుండా వెళ్లండి.. ప్రజలే చెబుతారు: పెద్దిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రజల్ని మోసం చేసి సుపరిపాలన అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని అన్నారు. అలాగే, బనకచర్లపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఏడాది పాటు ప్రజలను ఎలా మోసం చేశాడో మనం ప్రజలకు వివరించాలి. ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టారు. రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం ఎత్తివేశారు.. రెండు రూపాయల కిలో బియ్యం ఆపేసి ప్రజలను మోసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తరహాలో ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారు. 2014లో కూడా మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేశారు. 2024లో మరోసారి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. గ్రామాల్లో తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మనం వివరించాలి. బాబు ష్యూరీటీ మోసం గ్యారంటీ అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించాలి.బనకచర్ల ప్రాజెక్ట్ పై గురు శిష్యులు దోబూచులాడుతున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకరిపై మరొకరు పెట్టుకొని బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి తెర లేపారు. బాబుకు బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆలోచన లేదు. అందుకే వాటిని వివాదాస్పదం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలి. ఒక్క సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పుడు సుపరిపాలనా అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గు చేటు. సంక్షేమ పథకాలను ఏడాది విస్మరించిన చంద్రబాబు సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం ఏంటి?.రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక ఆయన హయాంలోని సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కారు. హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. మోసపురిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు చేసినా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. ప్రతీదీ అబద్దాలు చెప్పడం మోసపురిత వాగ్దానాలను చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..త్రికరణశుద్ధితో సంక్షేమ పథకాలు కులాలు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత జగన్కే దక్కింది. ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. తల్లికి వందనంలో సాంకేతిక కారణాల పేరిట దగా చేశారు. పోలీసుల పహారా మధ్య ఇంటింటికి.. సెక్యూరిటీ లేకుండా వెళ్ళితే ప్రజలు చొక్కా పట్టుకుంటారు. సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలే చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
జనసేనకు షాక్.. వైఎస్సార్సీపీలోకి దేవమణి
ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు యేశపోగు దేవమణి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి సుబ్బారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో జెడ్పీటీసీ సభ్యురాలు దేవమణి శ్రీనివాస్ వైఎస్సార్ సీపీ తరుపున ఎన్నికయ్యారు. తరువాత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి జనసేనలో చేరారు. జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చక తిరిగి సొంతగూటికి వచ్చారు. ఈ సందర్భంగా సుబ్బా రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విలువ ఇప్పుడు పేద ప్రజలకు తెలుస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధికి మారుపేరన్నారు. రానున్న కాలంలో పార్టీనుండి వెళ్లిన అందరూ తిరిగి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, వత్సవాయి ఎంపీపీ కొలుసు రమాదేవి పాల్గొన్నారు. -
వైఎస్ జగన్కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. -
తప్పుడు కేసులు పెట్టినోళ్లు శిక్ష అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: మద్యం కుంభకోణం కేసు నిందితులను మూడో రోజు సిట్ తమ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలో.. విజయవాడ జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేశ్ నాయుడ్ని తొలుత జీజీహెచ్కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. జైలు నుంచి తరలించే సమయంలో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టిన వారు ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు అని చెవిరెడ్డి అన్నారు. ఆ సమయంలో మీడియా కాస్త దూరంలో ఉండగా.. చెవిరెడ్డిని మాట్లాడనీయకుండా పోలీసులు దురుసుగా నెడుతూ వాహనంలోకి తరలించారు. ఇదీ చదవండి: వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది! -
వరంగల్ రాజకీయంలో కొత్త ట్విస్ట్.. మీనాక్షితో కొండా దంపతుల ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, మురళి ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. ఇంచార్జి మీనాక్షికి 16 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో వరంగల్ జిల్లాలోగ్రూప్ రాజకీయాల గురించి వివరించినట్టు సమాచారం.ఈ క్రమంలో తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరు సమాధానం చెప్పారు. ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గం వారిగా ఇంచార్జీకి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని కోరారు. రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని వారిద్దరూ నివేదికలో క్లారిటీ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు.అనంతరం, కొండా మురళి సాక్షితో మాట్లాడుతూ..‘నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని. నలభై నాలుగు ఏళ్ల నుండి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. వైఎస్సార్ హయం నుంచి మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. పని చేసే వారిపైనే విమర్శలు వస్తాయి. క్షమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మొదటిసారి కాంగ్రెస్ ఇంచార్జిని కలిశాను. రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ గెలిచేలా నేను తీసుకుంటాను. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. నేను ఎవరికి భయపడేది లేదు. బీసీ కార్డుతోనే పనిచేస్తా.. బీసీల అభ్యున్నతికి పనిచేస్తాను. సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటున్నాను. నాకు భయం లేదని ముందు నుంచే చెబుతున్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. పెద్ద పెద్ద కేసులకే నేను భయపడలేదు. ఇదే సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా నాకు భయపడరు. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు?. నా కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ అవుతుంది. మాది పరకాల.. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి?. భవిష్యత్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో గతంలో నటి సమంత, నటుడు నాగార్జునపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా మురళి తన లేఖలో వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన అంశాలను మాత్రమే తాను పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు మురళి వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా నేను ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించను అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు.. ఆన్సర్ ఉందా బాబూ?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎవరివల్ల చెడ్డ పేరు వస్తోంది? అధినేతల లోపాల వల్ల ఎమ్మెల్యేలకు డ్యామేజ్ అవుతోందా? లేక ఎమ్మెల్యేల అక్రమాలు, అలసత్వాలు ప్రభుత్వం పరువును దిగజారుస్తున్నాయా? రెండూ కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే...ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కీలక మంత్రి లోకేశ్లు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేసిన భ్రమ కల్పించాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆగ్రహం పెరిగేందుకు కారణమవుతున్నాయి.అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపివ్వడం మంచిదే. ప్రజల్లో తిరిగితే కదా వారి మనోభావాలు, ప్రభుత్వం పనితీరు, రెడ్బుక్ హడావుడి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? లేదా? అన్నది తెలిసేది? విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వేధింపులు, అక్రమ అరెస్ట్, నిర్బంధాలతో సామాన్యులకు ఒరిగిందేమిటని కూడా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఏడాది కాలంలో తామోన్నో ఎన్నో విజయాలు సాధించేశామని చంద్రబాబు అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అన్ని విషయాలు తెలిసినా ఆయన చెప్పినదానికి ఊ కొట్టడం తప్ప మరో గత్యంతరం ఉండదు. ముందుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకుని ఆ తర్వాత తొలి అడుగో, మలి అడుగో వేస్తే అదో పద్దతి కాని, అదేమీ లేకుండా తాము బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చిందని, లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి ఎమ్మెల్యేలవే అన్నట్లుగా మాట్లాడితే ఆశ్చర్యం పోవడం తప్ప వేరే ఏమి ఉంటుంది?. 👉ఏడాది కాలం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైనదే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం ఒక ఏడాదిలోనే నెరవేర్చిన హామీలెన్ని? తెచ్చిన సంస్కరణలు ఏమిటి? ప్రజలకు ఎలా ఇళ్ల వద్దే ప్రభుత్వ సేవలు అందించింది అందరికి తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసి ప్రజలను రోడ్లపైకి తెచ్చిందన్నదీ పలువురు ఎమ్మెల్యేల భావన. ఉదాహరణకు జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని చంద్రబాబు ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తాము ఎవరి పొట్టగొట్టబోమని ఊదరగొట్టారు. కానీ.. 👉.. అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారా? లేదా? రేషన్ సరుకులను ప్రజల ఇళ్లవద్దకే చేర్చే వ్యవస్థ గతంలో ఉంటే, ఇప్పుడు దానిని ఎత్తివేశారా? లేదా? ప్రభుత్వ పరంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ రైతు భరోసా కేంద్రాలు వంటివాటిని గ్రామ, గ్రామానా, పట్టణాలలో వార్డు, వార్డులో జగన్ ప్రభుత్వం నెలకొల్పితే వాటన్నిటిని నీరు కార్చుతున్నారా? లేదా ?వారికి ఈ వ్యవస్థలపై నమ్మకం లేకపోతే, మంచివి కావని భావిస్తే ఎన్నికల ముందే ఆ విషయం చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా, అవన్నీ యథాతథంగా కొనసాగుతాయని ప్రచారం చేసి, తీరా పవర్ లోకి వచ్చాక అన్నిటిని నిర్వీర్యం చేస్తే ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందా? లేక చెడ్డ ప్రభుత్వం అవుతుందా?. హామీలపై ప్రజలకు బాండ్లు ఇచ్చారు కదా?. వాటిలో పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మొదటి ఏడాదిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదే! గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చి సరిపెట్టారే. తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఏబై ఏళ్లకే బలహీన వర్గాలకు పెన్షన్ మొదలైన వాటన్నిటికి తొలి ఏడాది ఎగనామం పెట్టారా? లేదా? ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారికి ఇచ్చిన బాండ్ల గురించి ,ఆయా వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే వారందరిని వైఎస్సార్సీపీ వారి కింద జమకట్టి కేసులు పెడతామని బెదిరిస్తారా? ముఖ్యమంత్రే స్వయంగా వైఎస్సార్సీపీ వారు నిలదీయడానికి లేదని, అలా చేస్తే తాట తీస్తామని అనడం దేనికి సంకేతం. రెండో ఏడాదిలో తల్లికి వందనం కొంతవరకు అమలు చేసినా, మొదటి ఏడాది బకాయిల మాటేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పాలి? తల్లికి వందనం ఈ మాత్రం అయినా అమలు అయిందంటే అది జగన్ ప్రభావం వల్లే అన్న సంగతి అందరికి తెలుసు. జగన్ ఎప్పటికప్పుడు దీని గురించి నిలదీస్తున్న ఫలితంగా ఈ స్కీమ్ ఈ మాత్రం అయినా ఇవ్వక తప్పలేదు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలలో వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేసి, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తెగ బాదుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందమని ఎమ్మెల్యేలు అనగలరా? ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారో, లేక ఆయన కుమారుడు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి గురించి ఎవరైనా అడిగితే జవాబు ఏమని చెబుతారు?. 👉మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తూ కాలం గడపాలని చంద్రబాబు సర్కార్ చేస్తున్న యత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరా? జగన్ టైమ్లో అప్పుల గురించి అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదిలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించింది కదా! అప్పట్లో 'దాన్ని తనఖా పెట్టారు.. దీన్ని తనఖా పెట్టార"ని ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఏకంగా అప్పులు ఇచ్చేవారికి ట్రెజరీనే తాకట్టు పెట్టి ఘన చరిత్ర నెలకొల్పారే. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అంగీకరిస్తారా? లేక వారిని కోప్పడతారా? వైసీపీ వారు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు అవేమిటో వివరించాలి కదా?. 👉నిత్యం విధ్వంసం అంటూ నిందలు వేసే చంద్రబాబు అదేమిటో ఎన్నడైనా చెప్పారా? కేవలం సినిమా డైలాగులు చెప్పి ప్రజలను మభ్య పెట్టే యోచన కాకుండా వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటారు.అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని ఎమ్మెల్యేలపైకి నెట్టేసి తప్పుకోవాలని చూస్తే వారు గుసగుసలాడు కోకుండా ఉంటారా? 1995 లొ ముఖ్యమంత్రి అయింది మొదలు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేలపై అసంతృప్తి అంటూ లీకులు ఇవ్వడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల వైఫల్యాలు లేవా అంటే చాలానే ఉన్నాయి. అనేక చోట్ల ఇసుక, మద్యం, గనులు, పరిశ్రమలు తదితర లావాదేవీలలో ఎమ్మెల్యేల దందా పై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. వెరసి అటు ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యేలు రెండువైపులా సాగుతున్న దందాల వల్ల ప్రజలు నలిగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలలోకి వెళ్లాలంటే భయం ఏర్పడిన మాట నిజం. కొనమెరుపు ఏమిటంటే కీలకమైన తొలి అడుగు సన్నాహక సమావేశానికి 56 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఆ విద్యార్థుల కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని.. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణు్ణలైన వారికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? ‘చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (ఎఫ్ఎంజీ) ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన తరువాత ఇక్కడే ఇంటర్న్షిప్ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా.. ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ.. ఇంటర్న్షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా.. ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే.. ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగా చూస్తూ వారి కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్లో భాగం కాదా?.విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ?డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా ఇక్కడే.. మన రాష్ట్రంలోనే.. ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటిద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే.. చంద్రబాబు గారూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే వాటిని వద్దు అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతి కోసం స్కామ్లు చేస్తూ ఆ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లను కూడా వద్దు అంటూ లేఖరాసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని.. కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.వైఎస్ జగన్కు గోడు వెళ్లబోసుకున్న యువ వైద్యులువిదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తిచేసుకున్న యువ వైద్యులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడంతో తామంతా విజయవాడలోని వైద్య విశ్వవిద్యాలయానికి మంగళవారం వెళ్లామన్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు తమపై దాడి చేశారని యువ వైద్యులు వైఎస్ జగన్కు వివరించారు. ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని చెప్పారు. తాము కష్టపడి మెడికల్ కోర్సులు పూర్తిచేశామని, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్ష, ఇంటర్న్షిప్ చేసినా తమకు పర్మినెంట్ నంబర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఎంజీ చేసిన మరికొంతమంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్షిప్ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకున్నారని యువ వైద్యులు వైఎస్ జగన్కు వివరించారు. యువ వైద్యుల వెంట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర ఉన్నారు. -
కూటమి పాలనలో భ్రష్టుపట్టిన వైద్య రంగం: సీదిరి అప్పలరాజు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసై, ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్యను పూర్తి చేసి.. నిబంధనలు ప్రకారం ఇంటర్నషిప్ కూడా కంప్లీట్ చేసి.. దాదాపు ఏడాది కావస్తున్నా వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి పీఆర్ చేయకపోవడాన్ని సీదిరి అప్పలరాజు తప్పు పట్టారు.రాష్ట్రంలో తగినన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు లేకపోవడం.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య ఖరీదు కావడం వల్లే చాలా మంది విదేశాల్లో మెడిసిన్ విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. అనంతరం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష కూడా క్లియర్ చేసి... ఆ తర్వాత ఏడాది ఇంటర్నెషిప్ పూర్తి చేసుకున్నా వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యారన్న సాకుతో రిజిష్ట్రేషన్ నిరాకరస్తున్నారని... మన దేశంతో పాటు ప్రపంచమంతా కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకే హాజరయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు.తమకు న్యాయం చేయాలని వారు ధర్నాకు దిగితే... వారి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించాల్సిన ప్రభుత్వం... నేరస్ధులు తరహాలో వారిని అత్యంత దుర్మార్గంగా కొట్టి పోలీసు స్టేషన్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని.. హక్కులు కోసం ఎవరూ గొంతెత్తి మాట్లేడే వీలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్స్ డే రోజునే తమ న్యాయపరమైన డిమాండ్ కోసం ఆందోళన చేస్తుంటే వైద్య విద్యార్థులను కూడా జైల్లో పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.తెలంగాణాలో జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంచాలని ఉదయం ఆందోళనకు దిగితే సాయంత్రానికి అక్కడ ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించిందని గుర్తు చేసారు. గతంలో కూడా చంద్రబాబు ఎంబీబీఎస్ పూర్తైన తర్వాత ఐదేళ్ల గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు చేయాలని నిబంధన పెట్టారని.. చంద్రబాబుకు వైద్య విద్యార్ధులను వేధించడం అలవాటేనని మండిపడ్డారు.తన నాలుగు దఫాలు పాలనలో చంద్రబాబు కనీసం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని తేల్చి చెప్పారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కేవలం తన ఐదేళ్ల పాలనలోనే నాలుగు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో నిర్మించి రాష్ట్రానికి గొప్ప మేలు చేశారని కొనియాడారు. వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రయత్నం చేయలేదని.. కేవలం ప్రయివేటు మెడికల్ కాలేజీల నిర్మాణానికే మొగ్గు చూపారని స్పష్టం చేశారు.పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి వాటి పనులు మొదలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డాక్టర్ అప్పలరాజు తేల్చి చెప్పారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023-24 లో ప్రారంభించి 750 సీట్లు అదనంగా సాధించారన్నారు.చంద్రబాబు సీఏం అయ్యేనాటికి 2024-25 సంవత్సరం నాటికి మరో ఐదు కాలేజీల్లో అరవై శాతం పనులు పూర్తయితే... వాటిని మొదలు పెట్టకుండా... మాకు మెడికల్ సీట్లు వద్దంటూ లెటర్ పెట్టిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను నిలిపివేయడం దారుణమని.. 17 మెడికల్ కాలేజీల కోసం రూ. 8,500 కోట్లు అవసరం కాగా.. జగన్మోహన్ రెడ్డి హయాంలో సుమారుగా రూ. 2300 కోట్లు ఖర్చు పెడితే.. మరో రూ. 6.500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం కోసం రూ. 80 వేల కోట్లు అప్పు చేస్తున్న ప్రభుత్వం.. పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించడానికి ముందుకు రాకపోవడం... వైద్య రంగం పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.పక్క రాష్ట్రాల్లో వీరితో పాటు చదువుకున్న వైద్య విద్యార్దులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు చేయడం లేదని నిలదీశారు. న్యాయం చేయమని అడిగితే వైద్యులపైకూడా పోలీసులతో దాడులు చేయించడం అత్యంత విచారకరమన్నారు. ప్రభుత్వం కచ్చితంగా తన నిర్ణయాన్ని మార్చుకోని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే వైద్యరంగంలో సమూలు మార్పులు వచ్చి ఉండేవని.. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ సహా వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైందని తేల్చి చెప్పారు.ఈ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్ధితి లేదన్నారు. రూ.లక్షా అరవై ఐదువేల కోట్లు అప్పు చేసి ఎవరి సంక్షేమం చేశారని నిలదీశారు. తక్షణమే వైద్య విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించడంతోపాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అజిత్ కుమార్ కుటుంబాన్ని ఓదార్చిన విజయ్
సాక్షి, చెన్నై: ఒకప్పుడు ప్రజల రక్షణకు ప్రతీకగా నిలిచిన ఖాకీ యూనిఫాం.. ఇప్పుడు అమానవీయ ఘటనలకి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు శివగంగై జిల్లాలో పోలీసుల చిత్ర హింసలకు ప్రాణాలు అజిత్ కుమార్ (28) కుటుంబాన్ని తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Vijay) పరామర్శించారు. బుధవారం మదపురంలోని బాధితుడు అజిత్ కుమార్ కుటుంబాన్ని కలిశారు. అజిత్ కుమార్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, విజయ్ మాట్లాడుతూ.. ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు (SIT) వేయాలని డిమాండ్ చేశారు.తమిళనాట యువకుడు అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అజిత్ కుమార్ (27) అనే యువకుడు శివగంగై జిల్లాలోని మదపురం భద్రకాళి అమ్మన్ ఆలయంలో తాత్కాలిక భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో జూన్ 27న ఓ మహిళ తన బంగారు ఆభరణాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం పోలీసులు అజిత్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. అజిత్పై పోలీసుల అమానుషంవిచారణ పూర్తి కావడంతో అజిత్ను పోలీసులు వదిలేశారు. మళ్లీ మరోసారి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత అంటే జూన్ 29న బాధితుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పోలీసులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించారు. కానీ పోస్టు మార్టం నివేదికలో మాత్రం పోలీసులు తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. పోస్టుమార్టం నివేదికలో అజిత్ కుమార్ తల, ఛాతీ, శరీరంపై 30 నుంచి 40 వరకు గాయాలైన ముద్రలు ఉన్నట్లు తేలింది. లాఠీ దెబ్బలు, చింతపండు పొడి నోట్లో, ప్రైవేట్ పార్ట్స్లో నింపడం వంటి అమానుష చర్యలు జరిగినట్లు తేలింది. సివిల్ డ్రెస్లో పోలీసులు..అజిత్పై దాడిమరణం అనంతరం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీల్లో సైతం అజిత్ కుమార్ పోలిస్ స్టేషన్కు వెళ్లే ముందు ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ పోలీసుల చిత్ర హింసలతో తీవ్రంగా గాయపడిన స్థితిలో బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు అజిత్ కుమార్ను అతను పనిచేసే భద్రకాళి అమ్మన్ ఆలయం వెనక్కి తీసుకెళ్లి కొడుతున్న దుశ్యాలు వెలుగులోకి రావడం కలకలం రేగింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలకు ఉపక్రమించింది.#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025ఎస్పీ అశిష్ రావత్పై వేటు అజిత్ కుమార్ మరణానికి కారణమైన ఐదుగురు పోలీసుల్ని తమిళనాడు పోలీస్ శాఖ అదుపులోకి తీసుకుంది. హెడ్ కానిస్టేబుళ్లు కన్నన్, ప్రభు, కానిస్టేబుళ్లు రాజా, ఆనంద్, శంకరమణికంతో పాటు వారికి సహకరించిన డ్రైవర్ రామచంద్రన్ను సస్పెండ్ చేసింది. శివగంగై ఎస్పీ అశిష్ రావత్పై వేటు వేసి.. రామనాథపురం ఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.మరోవైపు లాకప్ డెత్లో మరణించిన అజిత్ కుమార్ కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. విచారణలో ఓ హంతకుడు కూడా ఇలా దాడి చేయడూ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం స్టాలిన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. బీజేపీ,ఏఐడీఐఏంకేతో పాటు ఇతర పార్టీలు సీబీఐ విచారణ కోరుతున్నాయి. -
చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?.. విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎన్ఎంసీ (NMC) గైడ్లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (FMG) ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్షిప్ పూర్తి చేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ, ఇంటర్న్షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా?..తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే, ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగాచూస్తూ, వారి కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్లో భాగం కాదా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటి ద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే, చంద్రబాబూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే, వాటిని వద్దు అన్న ప్రభుత్వం, దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతికోసం స్కామ్లు చేస్తూ ఆ కాలేజీలను ప్రయివేటీకరించే కుట్ర చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..@ncbn గారూ మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ (NMC) గైడ్లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్(FMG) ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్షిప్… pic.twitter.com/GKBsMr7e9J— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2025‘‘పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లనుకూడా వద్దు అంటూ తిరిగి లేఖరాసి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని, కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే, వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
మీ అడుగులకు మడుగులొత్తలేం.. సైడైపోతున్న జనసేన, బీజేపీ
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఎన్నికలకు ముందు అందరూ కలిసికట్టుగా ఉన్నామన్నట్లుగా కలరింగ్ ఇచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మూకుమ్మడిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. పవర్ చేతిలోకి వచ్చాక ఎవరి చేతికి ఎక్కువ పవర్ దక్కిందన్న విషయంలో పార్టనర్ల మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతున్నప్పటికీ అంతా గుంభనగా ఉన్నట్లుగా మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు.అన్నిటికి మించి పొత్తులకు ముందు ఓడ మల్లయ్య అని పిలిచే చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక బోడి మల్లయ్య అంటారన్న విషయం జనసేన, బీజేపీలకు మరో మరో అర్థమయింది. దీంతో ఇప్పుడు వాళ్లు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఓడలో నుంచి బయటకు రాలేక.. అందులోనే ప్రయాణం చేయలేక సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కాంట్రాక్టర్లు ఇతరత్రా వ్యవహారాల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన, బీజేపీ నాయకులను కేవలం పెయిడ్ కూలీలుగా మాత్రమే భావిస్తూ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.నీకు ఇవ్వాల్సిన కూలి డబ్బులు ఇచ్చేసాంగా ఎవరి కోసం మా జెండా మోస్తారు అన్నట్లుగా తెలుగుదేశం నాయకులు తీరు ఉంది. ఇదే తరుణంలో ప్రభుత్వంలో చంద్రబాబుకు బదులుగా లోకేష్ పెత్తనం పెరిగిపోవడం బీజేపీ, జనసేన నాయకులను తొక్కేస్తూ కేవలం టీడీపీ వారికి ప్రాధాన్యం ఇస్తూ వెళ్లడం కూడా భాగస్వామి పక్షాలైన ఈ రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.లోపల సరుకు పుచ్చిపోయినా.. బయట మంచి కలరింగ్.. కవరింగ్ ఇచ్చేసి జనానికి అంటగట్టే వ్యాపారి మాదిరిగా చంద్రబాబు సైతం ఇటు తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెలువెత్తుతున్న దాన్ని మీడియా ఇతర పబ్లిసిటీ సంస్థలు మాటున దాచిపెట్టి అంతా బాగుంది అన్నట్లుగా ప్రజలను భ్రమింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు అంటూ ఇంటింటికి తన ప్రభుత్వ విజయాన్ని ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.ఇందులో భాగంగా భాగస్వామి పక్షాలైన జనసేన, బీజేపీతో బాటు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన పథకాలు సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తారు. అయితే చంద్రబాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్నట్లుగా సర్వేల్లో వెళ్లడవడం.. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, తెలుగుదేశం నాయకుల అలవిమాలిన అవినీతి.. దందాలు.. గూండాగిరి వంటి అంశాల ద్వారా ప్రజల్లో ఘోరమైన అప్రదిష్టను ఏడాదిలోనే మూటగట్టుకుంది.దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలు ఈ క్షణమే ఓడిపోతారని.. ఇంకా ఎంతోమంది ఓటమి అంచులో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బాటు గెలిచిన తరువాత టీడీపీ నాయకుల్లో అహంకారం పెరగడం.. జనసేన, బీజేపీ నేతలను చిన్నచూపు చూస్తుండడం వంటి అంశాలు కూడా గ్రామ స్థాయిలో కూడా చర్చలకు కారణమవుతున్నట్లు.. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు ప్రచార కార్యక్రమానికి జనసేన, బీజేపీ నాయకులు దూరంగా ఉంటున్నారు."మీ అవకాశవాదానికి ఒక దండం.. మీ అడుగులకు మేం మడుగులొత్తలేం" అంటూ చిన్నగా సైడ్ అయిపోతున్నారు. మంచి ప్రభుత్వం పేరిట చేపట్టని ఈ ప్రచారానికి కేవలం తెలుగుదేశం నాయకులు మాత్రమే హాజరవుతున్నారు. అక్కడక్కడ అరా ఒకటి తప్ప జనసేన-బీజేపీ నాయకుల హాజరు లేనేలేదు. కూటమి గెలవడానికి మా అవసరం ఉంది.. ఆ పొత్తు లేకపోతే చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యేనా అంటూ ఇటు జనసేన-బీజేపీ నాయకులు లోలోన భావిస్తున్నారు. అలాంటపుడు తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే కానీ అధికారం దక్కాక బాబు.. టీడీపీ నేతల తీరు మారిందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడా వీళ్లు ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఊసురో మంటూ కేవలం టీడీపీ నేతలు ఈ ప్రచారాన్ని చేపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న -
యువ వైద్యులకు అండగా ఉంటాం: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసై, ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని అర్హతలతో వైద్యవిద్యను పూర్తి చేసుకుని, సమాజంలో వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి 13 నెలలుగా పీఆర్ చేయకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు.తమకు న్యాయం చేయాలని ప్రశ్నించినందుకు రెడ్బుక్ రాజ్యాంగం మేరకు యువ వైద్యులను పై పోలీసులను ప్రయోగించి, అరెస్ట్లు చేయడం కూటమి ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనమని మండిపడ్డారు. యువ వైద్యులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వ మెడలు వంచైనా సరే వారికి పీఆర్ వచ్చే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వంలో వేధింపులకు ఎవరూ అతీతం కాదని తేలిపోయింది. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా అన్ని వర్గాలను వేధించి పరాభవిస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. వారంతా ప్రభుత్వంపై శాంతి యుతంగా నిరసనకు దిగితే ఈడ్చి పారేశారు. ఉన్నత చదువులు చదివి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని 'డాక్టర్స్ డే' అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం అవమానించింది.పేద కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విద్యనభ్యసించడంతోపాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకండా వేధించడానికి ప్రభుత్వానికి మనసెలా ఒప్పిందో అర్థం కావడం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏడాదే ఉంటే ఏపీలో మాత్రం మూడేళ్లపాటు చేయాలనే నిబంధన పెట్టి వేధిస్తున్నారు. ఇంటర్న్షిప్ చేసిన వారిని రిలీవ్ చేయడం లేదు. పక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టడమో, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడమో లేదా పీజీలు రాసుకుంటున్నారు.కానీ ఒక్క ఏపీలో మాత్రమే ఇంటర్న్షిప్ చేసిన దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలను తెలియపర్చడానికి హెల్త్ యూనివర్సిటీకి వచ్చి వైద్యారోగ్యశాఖ మంత్రిని కలిస్తే ఆయన వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. దీంతో మెడికల్ విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసన తెలియజేయడానికి పూనుకుంటే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువ వైద్యులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ని కలిశారు. వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుని వారికి న్యాయం చేసేదాకా పోరాడుతుంది.వైద్య రంగంపై చంద్రబాబు నిర్లక్ష్యంరాష్ట్రంలో మొత్తం వైద్య రంగాన్నే చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడు. సీఎంగా వైఎస్ జగన్ తీసుకువచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం, సీట్లు అక్కరలేదని కేంద్రానికి లేఖ రాయడం, నిర్మాణ పనులను అర్థాంతరంగా ఆపేయించడం వంటి చర్యలతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్ధుల వైద్య విద్య ఆశలపై నీళ్ళు కుమ్మరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంబీబీయస్ డాక్టర్లు, పీజీ డాక్టర్లను నియమించుకోకుండా ఎలా వైద్యం అందించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ పాలనలో వైద్యారోగ్యశాఖలో ఐదేళ్లలో 54 వేలమంది నియామకం జరిగితే అందులో డాక్టర్లే 3800 మంది ఉన్నారు.మెడికల్ కాలేజీల్లో స్టాఫ్ లేరంటూ వైద్యం నిరాకరిస్తున్నారు. వైద్య విద్య పూర్తిచేసుకుని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్లు చేయకుండా వేధిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఆయుష్మాన్ భారత్లో కలిపే పేరుతో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క రూపాయి లేకుండా ఆపరేషన్లు జరిగితే ఇప్పుడు కూటమి పాలనలో యూజర్ చార్జీల పేరిట రోగులను దోచుకుంటున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో కోపేమెంట్ల పేరుతో వసూలు చేసి ఆస్పత్రులను నడిపించుకోవాల్సిన పరిస్థితి ఆస్పత్రి యాజమాన్యాలది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. -
యువ వైద్యులపై కూటమి సర్కార్ అరాచకం
సాక్షి, తాడేపల్లి: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, దేశంలో వైద్య వృత్తిని కొనసాగించేందుకు అన్ని అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూటమి సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్రలు మండిపడ్డారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చెందిన దాదాపు 1500 మంది యువ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం గత 13 నెలలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా, వారిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగితే, పోలీసులతో వారిని అరెస్ట్ చేయించి, టెంపో వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించడం ద్వారా ప్రభుత్వం తన కర్కశత్వాన్ని చాటుకుందని ధ్వజమెత్తారు. ఇంకా వారేమన్నారంటే..విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 13 నెలల నుంచి విద్యార్ధులు పీఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా, వారి గోడు వినేవారే లేరు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రిని కలిసిన యువ వైద్యులపై ఆయన కనీసం సానుభూతి కూడా చూపకుండా, బెదిరింపు ధోరణితో మాట్లాడారు.ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ను కలిసి మొరపెట్టుకుంటే, వీరికి సంబంధించిన ఫైల్పై ఆయన సంతకం పెట్టారు. కానీ విజయవాడ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాత్రం ఈ ఫైల్పై కొర్రీలు వేస్తున్నారు. ఎన్ఎంసీ నుంచి క్లారిటీ ఉంటేనే పీఆర్ ఇస్తానంటూ, రెండేళ్ళ పాటు ఇంటర్న్షిప్ చేస్తేనే పీఆర్ ఇస్తామంటూ రకరకాలుగా సాకులు చూపుతూ అభ్యర్ధులను వేధిస్తున్నారు. వీరితో పాటు క్వాలిఫై అయిన వారందరూ వివిధ రాష్ట్రాల ఆయా ప్రభుత్వాల నుంచి పీఆర్ సర్టిఫికేట్లు పొందారు.కానీ ఏపీలో మాత్రమే యువ వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. దీనిపై హెల్ట్ యూనివర్సిటీ ఎదుట యువ వైద్యులు ఆందోళన చేస్తే, రాత్రి సమయంలో టెంపో వ్యాన్లలో వారిని బలవంతంగా ఎక్కించి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. డాక్టర్స్ డే రోజునే వైద్య విద్యార్ధుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది.రాష్ట్రంలో రూ.8500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్లు కేటాయిస్తామని కేంద్రం ముందుకు వస్తే, సీఎం చంద్రబాబు దానికి మోకాలడ్డారు. తమకు సీట్లు అక్కరలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరో వైపు ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.విదేశాల్లో చదువుకుని, ప్రాక్టీస్కు అన్ని అర్హతలు సాధించుకున్న యువ వైద్యుల పట్ల కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఏం అనాలో కూడా అర్థం కావడం లేదు. తక్షణం యువ వైద్యులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం తరుఫున ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. -
వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది: పేర్ని నాని
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వంశీని జైల్లో ఉంచి కొందరు శునకానందం పొందారని, ఇందుకు రేపో.. మాపో.. మరో నాలుగేళ్లకో వాళ్లే అందుకు పశ్చాత్తాపం చెందుతారని అన్నారాయన. సాక్షి, ఎన్టీఆర్: విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ మోహన్ ఇవాళ(జులై 2, బుధవారం) విడుదలయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ‘‘వల్లభనేని వంశీపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని ఇబ్బంది పెట్టారు. 140 రోజుల తర్వాత వంశీ జైలు నుంచి బయటకు వచ్చారు. ఒకే కేసులో బెయిల్ వస్తే.. మరో కేసు పెడుతూ కుట్రలు చేశారు. ఐదేళ్లు, పదేళ్లు కింద జరిగినవాటికి కూడా కేసు పెట్టారు. లొసుగులు వాడుకుంటూ వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఎత్తుగడలు వేశారు. అడ్డగోలు జీతాలు తీసుకుని వాదించేవాళ్లు ఉన్నా కూడా.. వాదించడానికి ఢిల్లీ బాబాయి రావాలి అంటూ వాయిదాలు వేయించుకున్నారు. చివరకు ఇవాళ కూడా సుప్రీం కోర్టులో వంశీ బెయిల్ను రద్దు చేయించే ప్రయత్నం చేశారు. ఇంత చేసి సాధించింది ఏంటి?.. అక్రమ కేసులు, వేధింపులతో ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేయడమా? పోనీ..వంశీని రాజకీయాల నుంచి పారిపోయేలా చేశారా?.. గన్నవరం ప్రజల నుంచి దూరం చేయగలిగారా?. పైగా ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాకుండానే ప్రజల్లో సానుభూతిని మూటగట్టి పెట్టారు. వంశీని జైల్లో ఉంచి మీ పార్టీకి(టీడీపీని ఉద్దేశించి..) మీరే గొయ్యి తవ్వుకున్నారు. కక్ష సాధింపు తప్ప కూటమి సాధించింది ఏమీ లేదు. కేవలం శునకానందం పొందారు. రేపో,, మాపో, మరో నాలుగేళ్లకైనా దీని వెనుక ఉన్నవాళ్లు ఈ విషయం తెలుసుకుంటారు అని పేర్ని నాని అన్నారు. -
చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు మార్లు చంద్రబాబు తీరును బహిరంగంగానే విమర్శించారు. తాజాగా, మరోమారు అదే తరహాలో చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు. ఇరిగేషన్, రోడ్డు కాంట్రాక్ట్లు చూసేది బాబు కోవర్టులే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాయడం కాదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి’ అంటూ వ్యాఖ్యానించారు. -
సింగయ్య, జయవర్దన్ కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: తన రెంటపాళ్ల పర్యటనలో మృతి చెందిన చీలి సింగయ్య, పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ రెండు కుటుంబాలను రప్పించుకున్న ఆయన.. పార్టీ తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తొలుత చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు జగన్ను కలిశారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది. ఈ తరుణంలో సింగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్.. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, ఆదుకుంటామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ సింగయ్య కుటుంబాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. అదే సమయంలో.. ఈ పర్యటనలో సత్తెనపల్లికి చెందిన పాపసాని వెంకట జయవర్దన్రెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబానికి కూడా వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. తక్షణమే పార్టీ తరఫున రూ.10 లక్షల సాయం అందజేశారు. ఇవాళ జయవర్ధన్ తల్లిదండ్రులు సావిత్రి, భాస్కర్ రెడ్డి, సోదరుడు మణికంఠ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు జగన్ను కలిశారు. జయవర్ధన్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అన్నివిధాల ఆదుకుంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కుటుంబం వెంట వైఎస్సార్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి వచ్చారు. -
‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి?’.. డీకేఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు
కర్ణాటకలో ముఖ్యమంత్రి త్వరలోనే మారతారంటూ ఊహాగానాలు వినిపించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో మొదలు.. బీజేపీ, జేడీఎస్ల సెటైర్లతో అది జరగొచ్చని జోరుగా ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి ఎట్టకేలకు తెర పడింది. తానే ఐదేళ్లు సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించగా.. దానికి కొనసాగింపుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం కొట్టిపారేశారు. ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మీడియాతో అన్నారాయన. అయితే కాసేపటికే ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.‘‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి. ఆయనకు మద్దతుగా నిలవడం తప్ప..’’ అంటూ డీకేఎస్ బదులిచ్చారు. ‘‘నన్ను సీఎంగా చేయాలని నేరు ఎవరినీ కోరలేదు. నాకు మద్దతుగా మాట్లాడమని ఎవరినీ పురమాయించలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. ఒకరు సీఎం ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రకటనలు ఎందుకు?. పార్టీలో నాతో పాటు లక్షల మంది పని చేస్తున్నారు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం’’ అని స్పష్టం చేశారాయన. అంతకుముందు.. సీఎం మార్పు ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య కాస్త కటువుగానే స్పందించారు. యస్.. ఐదేళ్లు నేనే సీఎంగా కొనసాగుతా. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. మార్పు ఉందని చెప్పడానికి వాళ్లు(బీజేపీ, జేడీఎస్)ఏమైనా కాంగ్రెస్ అధిష్టానమా? అని మీడియాను ఎదురు ప్రశ్నించారాయన. 👉2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే అప్పట్లోనే ఇద్దరూ రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని ఇద్దరూ తోసిపుచ్చారు. కట్ చేస్తే..👉ఈ ఏడాది జూన్ 29వ తేదీన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్.. 2–3 నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని వ్యాఖ్యానించడంతో అసలు చర్చ మొదలైంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది అని బదులిచ్చారు. అయితే.. 👉ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది. పార్టీ అధ్యక్షుడే హైకమాండ్ కాకపోతే మరెవరు?” అని ప్రశ్నించింది. మరోవైపు జేడీఎస్ కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ను ఎద్దేవా చేస్తూ సీఎం మార్పు తథ్యమన్నట్లు ప్రకటనలు ఇచ్చింది. ఈ తరుణంలో.. ఇటు సిద్ధరామయ్య, అటు శివకుమార్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. హుస్సేన్కు నోటీసులు ఇస్తాం: డీకేఎస్సీఎం మార్పు ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్కు నోటీసు ఇస్తాం. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరతాం. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలి.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదు అని డీకే శివకుమార్ హెచ్చరించారు. -
‘బాబు అనుకూల మీడియానే జగన్ బలం చూసింది.. ఒప్పుకుంది’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ జెండా మోసిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఇదే సమయంలో చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఉందన్నారు. పెన్షన్లు పెంచామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. దీనిపై ప్రజలే సమాధానం చెబుతారు అని కామెంట్స్ చేశారు.ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నియోజక వర్గాల ఇంఛార్జిలు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘ప్రజలను మరోమారు మభ్యపెట్టేందుకు చంద్రబాబు తొలి అడుగు కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చేపడుతోంది.వైఎస్ జగన్ చేసింది సుపరిపాలనో.. చంద్రబాబు చేసేది సుపరిపాలనా అనేది ప్రజలకు తెలియజేయాలి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ చేసింది సుపరిపాలన. పెన్షన్లు పెంచామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నాడు. ఎంతమంది పెన్షన్లు అందక ఇబ్బంది పడుతున్నారో మారుమూల గ్రామాలకు వెళితే తెలుస్తుంది. అదే వైఎస్ జగన్ సీఎంగా ఉండి ఉంటే ఈ ఏడాది కాలంలో ఏం చేయగలిగేవారో ప్రజలకు మనం తెలియజేయాలి. వైఎస్ జగన్ చెప్పినట్లు మన కార్యకర్తలకు సెల్ ఫోనే ఆయుధం. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం. జెండా మోసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగారు. బాండ్లు చూపించి మరీ ఎంతెంత వస్తాయో చెప్పారు. చంద్రబాబు రీకాల్ కార్యక్రమంలో బాబు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించడం మన బాధ్యత. నియోజకవర్గం, మండల స్థాయిలో చంద్రబాబు రీకాల్ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా విజయవంతం చేయాలి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజలు ఈ ప్రభుత్వంపై సంతృప్తిగా లేరు. ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ..‘పోరాటాలు మనకు, మన పార్టీకి కొత్త కాదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి పోరాటం చేసిన పార్టీ వైఎస్సార్సీపీ. వైఎస్ జగన్ నేతృత్వంలో మరోసారి మనం పోరాటాలకు సిద్ధమవ్వాలి. ఆచరణ కాని అబద్ధాల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. వైఎస్ జగన్ను చూసి చంద్రబాబు మారాడని ప్రజలు భ్రమపడి ఓటేశారు. వైఎస్సార్సీపీ పోరాటం వల్లే ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చింది. వైఎస్ జగన్ సత్తెనపల్లి కార్యక్రమానికి ఎవరూ కార్లు పెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. కానీ, వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా వైఎస్ జగన్ వెంట తరలివచ్చారు. చంద్రబాబు అనుకూల మీడియానే వైఎస్ జగన్ బలం గురించి నిజం ఒప్పుకుంటోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలి.మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్కు, వైఎస్సార్సీపీకి అనుసంధానం కార్యకర్తలే. సచివాలయాలను నమ్ముకుని మనం మునిగిపోయాం. రెండు అబద్ధాలు చెప్పి అయినా సరే మనం అధికారంలోకి వద్దామని వైఎస్ జగన్ను కోరాం. కానీ, అబద్ధాలు వద్దని వైఎస్ జగన్ చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేని వ్యక్తి చంద్రబాబు. ఈ ఐదేళ్లూ పనిచేసిన మన కార్యకర్తలను మర్చిపోకుండా పేర్లు రాసుకుందాం. మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేస్తాం. చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీని మనం జనంలోకి తీసుకెళ్లాలి. జంప్ జిలానీలంతా టీడీపీలోకి పోయారు. మన దగ్గర దమ్ బిర్యానీ వంటి నాయకులు, కార్యకర్తలు మిగిలారు’ అని చెప్పుకొచ్చారు. -
లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రమాదవశాత్తూ చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతికి తనకు అనుమానాలు ఉన్నాయన్న ఆమె.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటోందని వాపోయారు. సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారామె. ‘‘నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారామె.అలాగే.. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారామె. ‘‘లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. మరోవైపు.. పోలీసులు కూడా తన భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె. జరిగింది ఏంటంటే..జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ సింగయ్య అనే కార్యకర్త మరణించారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో వైఎస్ జగన్తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే.. కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ప్రభుత్వం తనపై కేసు పెట్టించిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణికులపై కేసు ఎలా పెడతారని?.. సింగయ్య మృతికి జగన్ ఎలా కారకుడవుతారని? పోలీసులను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో వైఎస్ జగన్ విచారణపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. -
‘నాడు బాబుకు బ్యాగులు మోసి బ్యాడ్మెన్.. నేడు బనకచర్ల బొంకుమెన్’
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్లోనే చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారని సంచలన ఆరోపణలు చేశారు. గురు దక్షిణలో భాగంగానే ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తే.. కాంగ్రెస్ మొద్దు నిద్ర పోతోంది. మధ్యాహ్నం మేం ప్రెస్మీట్ పెడితే రాత్రి ఉత్తమ్ లేఖ రాశారు. బ్యాక్ డేట్ వేసి మీడియాకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. బనకచర్లపై బొంకుడు రాజకీయాలు బంద్ చేయాలి. రేవంత్, ఉత్తమ్ కలిసిన తర్వాతే కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ విషయాన్ని జనవరిలో బీఆర్ఎస్ బయటపెట్టింది.సీఎం రేవంత్కు బేసిన్ల గురించి కనీసం అవగాహన లేదు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్లో అని రేవంతే చెప్పారు. రేవంత్ టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది. బనకచర్లను ఆపే చిత్తశుద్ది రేవంత్కు లేదు. బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు జెండా ఊపారు. నాడు బాబు బ్యాగులు మోసి బ్యాడ్మెన్గా పేరు తెచ్చుకున్నారు. నేడు అదే బాబు కోసం బనకచర్ల బొంకుమెన్గా మారిపోయారు. చంద్రబాబును ప్రజాభవన్లో కలిశాక చీకటి ఒప్పందం కుదిరింది. గురు దక్షిణలో భాగంగానే చీకటి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారు. తెలంగాణ పుటల్లో సీఎం రేవంత్ ద్రోహిగా మిగిలిపోతారు. రేవంత్ చిల్లర మల్లర రాజకీయాలు మానేసి రాష్ట్రం కోసం పోరాడాలి. నిన్నటి ప్రజంటేషన్లో అన్ని అబద్దాలే. రేవంత్ అబద్ధాలను బీఆర్ఎస్ చీల్చి చెండాడుతుంది. కేసీఆర్ మీదు ముఖమంత్రి రేవంత్ నిందలు మోపుతున్నారు. సీఎం వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోస్తోంది. మాకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యం. బనకచర్లపై ప్రజంటేషన్ ఇస్తే అన్ని పార్టీలను పిలవాలి కదా?. అహంకారంతో మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. -
‘నితీష్కు తెలివే లేదు’: తేజస్వి సంచలన వ్యాఖ్యలు
పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అక్కడి రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, ఎన్నికల వాతావారణానికి కొత ఊపు తెస్తున్నారు. తాజాగా బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.నితీష్ కుమార్కు ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆయన బీహార్ను ఇకపై పరిపాలించలేరని తేజస్వి యాదవ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతున్న వేళ తేజస్వి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)నేత తన మాజీ మిత్రుడైన నితీష్పై పలు వ్యాఖ్యలు చేయడమే కాకుండా, జేడీయూ కార్యాలయంలో ఎప్పుడూ లేనిది.. ఇప్పుడు ప్రధాని మోదీ ఫొటో కనిపిస్తున్నదన్నారు. నితీష్కు తెలివే లేదు... అందుకే మోదీ ఫోటోను కార్యాలయంలో తగిలించారని అన్నారు. ఇదే ముఖ్యమంత్రి ఒకప్పుడు ప్రధాని మోదీతో కరచాలనం చేసి, వివాదాల్లో చిక్కుకున్నారని తేజస్వి పేర్కొన్నారు.నితీష్ కుమార్ అతని హృదయం చెప్పిన మాట వినరని, ఎందులో అతనికి సమ్మతి ఉందని తేజస్వి ప్రశ్నించారు. ఆయన పార్టీ మారనని చెబుతూ, అందుకు పదే పదే ఇందుకు రుజువులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత లేదని,అతని వయస్సు కూడా ఇందుకు ఒక కారణమని తేజస్వి వ్యాఖ్యానించారు. బీహార్లో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయని, అటువంటి సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలే లేవని ఆరోపించారు.రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సవరణకు రెండేళ్లు పట్టవచ్చని, ఎన్నికలకు ఆరు నెలల కన్నా తక్కువ సమయమే ఉన్నందున ఈ కసరత్తు ఇప్పుడు ఎందుకని తేజస్వి ప్రశ్నించారు. ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి.నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభానికి రెండు నెలలలే మిగిలి ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎనిమిది కోట్ల మందితో కూడిన కొత్త జాబితాను కేవలం 25 రోజుల్లో తయారు చేయాలి. రాష్ట్రంలోని 73 శాతం మంది వరదల బారిన పడిన సమయంలో కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన సాధ్యమవుతుందా? అని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు.ఇది కూడా చదవండి: అరెస్టు హెచ్చరికలు.. ట్రంప్పై జోహ్రాన్ మమ్దానీ ఫైర్ -
బాబు మాటలు రాష్ట్రానికి చేటు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూత వైద్యుడి అవతారమెత్తారు. సొంత ఆలోచనో.. ఎవరైనా సలహా ఇస్తున్నారో తెలియదు కానీ.. భూతాల భాష మాట్లాడి తన పరువు తానే తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రతిష్టనూ మసకబారుస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలోనే భూతాలు, దెయ్యాలు అంటూ మాట్లాడటం ఆయనకు, రాష్ట్రానికీ గౌరవం పెంచే పనైతే కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ద్వేషం, కోపం ఏమైనా ఉండవచ్చు. కానీ, అందుకోసం ఇలా తనను తాను భూత వైద్యుడిగా పోల్చుకుంటూ భూస్థాపితం చేస్తానంటూ ఉపన్యాసాలు చెబితే ఎవరికి నష్టం?. ఆధునిక సమాజంలో భూత వైద్యులను ఎవరైనా విశ్వసిస్తారా? అలా నమ్మేవారు ఎవరైనా ఉంటే వారు అమాయకులు, అంధ విశ్వాసాలను అనుసరించేవారై ఉంటారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకు వెళతారనో, లేక తాము చేసిన హామీలను నెరవేర్చుతారనో ప్రజలు ఓట్లు వేస్తే, వారికి భేతాళ మాంత్రికుడి కబుర్లు చెబితే ఎలా?. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, గత ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జగన్ ఎన్నడైనా ఈ భూతాల భాష వాడారా?. ఆయన హయాంలో రిలయన్స్ అంబానీ, అదానీ, జిందాల్, ఆదిత్య బిర్లా వంటి పెద్ద, పెద్ద పారిశ్రామికవేత్తలు విశాఖలో సదస్సులో పాల్గొని ఏపీ గురించి ఎంత గొప్పగా మాట్లాడారు!. వైఎస్ జగన్ దార్శనికతను ఎంతగానో మెచ్చుకున్నారు. వారిలో ఇప్పుడు ఎవరైనా జగన్ను భూతంగా చెప్పారా?. మళ్లీ అ భూతం వస్తుందా అని ఎవరైనా అడిగారా?. అది నిజంగా జరిగి ఉంటే వారి పేర్లు చెబుతారా?. అదేమీ లేకపోయినా చంద్రబాబు ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీస్తున్నట్లు?. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం బాగుండాలి. వారికి అవసరమైన వసతులు, రాయితీలు కల్పించాలి. వైఎస్ జగన్ ఏమని చెప్పేవారు.. పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే.. తనకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు.. వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని అనేవారు. అంతే తప్ప అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అలాంటి సమావేశాలలో కానీ, ఇతరత్రా పెట్టుబడిదారులు వచ్చినప్పుడు గానీ.. జగన్ ఒక్కమాటైనా అన్నట్లు లేదు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న గ్రీన్ ఎనర్జీకి సంబంధించి లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చింది. సంబంధిత పరిశ్రమలు ఆచరణలోకి రావడం ఆరంభమైందీ జగన్ టైమ్లోనే కాదా?. కర్నూలు వద్ద వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ కో ప్లాంట్ వచ్చింది జగన్ హయాంలోనే.. అప్పుడు వచ్చిన పరిశ్రమలు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేసి తమ ఘనతేనని కూటమి పెద్దలు చెప్పుకోవడం లేదా?. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. కానీ, గత ప్రభుత్వంపై నిత్యం నిందారోపణలు చేస్తూ పెట్టుబడిదారులలో అనుమానాలు కల్గించేలా చేస్తే ఎవరైనా ధైర్యంగా పరిశ్రమలు పెడతారా?. అసలే కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా, శాంతిభద్రతల రీత్యా అంత అనుకూల వాతావరణం లేదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పలు చోట్ల ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను కూటమి బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల నిర్వాకాల వల్ల పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డ ఘటనలు చోటు చేసుకున్నాయి. చివరికి విద్యుత్ ప్లాంట్ల బూడిద గురించి కూడా కూటమి నేతలు గొడవలు పడ్డారే!.. అంతెందుకు! ఒక మాజీ ఎమ్మెల్యే తన ప్రాంతమైన తాడిపత్రిలో ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తే టీడీపీ నేత ఒత్తిడితో పోలీసులు ఆయనను బలవంతంగా అనంతపురం తరలించారే. ప్రభుత్వ పెద్దలకు తెలియదా! ఇది మంచి వాతావరణమా?.సాక్షి మీడియాతో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై కక్ష కట్టి ప్రభుత్వం చేస్తున్న పనులు పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటాయా?. ఏదో ఒక సాకుతో సాక్షి మీడియా సంస్థలపై ఏపీ వ్యాప్తంగా దాడులు చేయిస్తే, దాడులకు తెగబడిన మూకలపై సరైన చర్య తీసుకోకపోతే శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా?. ఈ వార్తలు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియవా?. పారిశ్రామికవేత్తలు గమనించరా?. ఒక పారిశ్రామికవేత్తను సైతం ఒక మోసకారి నటి కేసులో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించగా, ఆయన ఏపీలో కాకుండా మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదించింది వాస్తవం కాదా?. ప్రజలలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇలా భూతాల కబుర్లు చెబుతున్నారని పారిశ్రామికవేత్తలు ఊహించలేరా!. వైఎస్ జగన్ ఏపీలో ఎక్కడకు వెళుతున్నా ప్రజలలో వస్తున్న ఆదరణను తట్టుకోలేక చంద్రబాబు ఇలాంటి మాటలు అంటున్నారని వారికి తెలియకుండా ఉంటుందా?. జగన్ టైమ్లో పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి టీడీపీ మీడియా చేయని ప్రయత్నం ఉందా?. ఆదానికి భూమి కేటాయిస్తే మొత్తం రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేశారే? ఇన్ని ఉదాహరణలు ఎదురుగా పెట్టుకుని జగన్ టైంలో విధ్వంసం జరిగిందని, భూతమని, మరొకటని డైలాగులు చెబితే పారిశ్రామిక వేత్తలు అంత అమాయకులా? నమ్మడానికి!. వారు అమాయకులైన సాధారణ ప్రజల మాదిరి కాదు కదా!. సాధారణ ప్రజలు ఎన్నికల సమయంలో బహుషా భూత వైద్యులను నమ్మి ఉండవచ్చు. ఇష్టారీతిన చేసిన వాగ్ధానాలకు ఆకర్షితులై ఉండవచ్చు. అల్లాఉద్దీన్ అద్భుత దీపం అనుకుని ఓట్లు వేసి ఉండవచ్చు. లేదా ఈవీఎంల మహిమ ఉండవచ్చన్న భావన కూడా లేకపోలేదు.కూటమి అధికారంలోకి వచ్చాక కానీ.. వారికి భూత వైద్యులను నమ్మడం వల్ల లాభం లేదని తెలిసి ఉండవచ్చు. అందుకే ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను తట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భూతం కబుర్లు చెప్పి ప్రజలను డైవర్ట్ చేయాలని తలపెట్టినట్లు కనిపిస్తుంది. ఆ భూతం రాదని తనది హామీ అని చంద్రబాబు అంటున్నారు. ఈసారి ఏమర పాటుగా లేనని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లు అనిపించదా!. భూత వైద్యులను విశ్వసిస్తే ఉన్న వ్యాధులు పోకపోగా కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో భూత వైద్యుల పాలనలో అదే పరిస్థితి ఏర్పడుతోందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేసులో మేయర్ విజయలక్ష్మి?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్ల హడావుడి పెరిగింది. అన్ని కార్యక్రమాల్లోనూ తామున్నామంటూ ముందుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమంటూ సర్కిల్, జోనల్ అధికారులతో పాటు ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ను, ఉన్నతాధికారులను కలుస్తున్నారు. తమ పరిధిలోని అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్నారు. త్వరితంగా చేయాల్సిందిగా తొందర పెడుతున్నారు. అంతే కాదు.. స్థానిక సమస్యలపైనా పాలకమండలి సమావేశాల్లో గళమెత్తుతున్నారు. అవినీతి, అక్రమాలు, అవకతవకలపై ప్రశ్నలతో అధికారులను ఇరుకున పెడుతున్నారు. బోగస్ బర్త్, డెత్ సర్టిఫికెట్ నుంచి మొదలు పెడితే, వివిధ అంశాల్లో అవినీతిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వేయని రోడ్లకు బిల్లులు కాజేస్తున్నారంటూ ఇంజినీర్ల అక్రమాలను కళ్లకు కడుతున్నారు. నాలుగేళ్ల పాటు లేనిది.. గడచిన నాలుగేళ్లుగా లేని చైతన్యం ఇప్పుడే ఎందుకొచ్చింది అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. త్వరలోనే వారి పదవీకాలం ముగియనుండటం అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పాలక మండలికి దాదాపు ఏడు నెలల సమయం మాత్రమే ఉంది. తిరిగి గెలవాలంటే ప్రజల్లోకి వెళ్లక తప్పదు. తీరా ఎన్నికలు వచ్చాక వెళ్తే ప్రజలు తిరగబడ్తారని, అభాసుపాలవుతారని తెలిసి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కారమైతే తమకదే పదివేలంటున్నారు ప్రజలు. ఇది అందరి కార్పొరేటర్ల పరిస్థితి కాగా, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్ల పరిస్థితి ఇంకొంచెం భిన్నంగా ఉంది. అందుకు కారణం త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుండటమేనని చెబుతున్నారు. ‘జూబ్లీహిల్స్’పై కన్ను.. ఆ నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లతో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు సోమవారం ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోనే ఉన్న యూసుఫ్గూడ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్తో పాటు రహ్మత్నగర్, యూసుఫ్గూడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల ఫిర్యాదులు ఓపికగా విన్నారు. జాప్యం లేకుండా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇదివరకు లేని విధంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎక్కువసేపు ఉంటున్నారు. మే యర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ కూడా పొరుగునే ఉండటాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. రాబో యే ఎన్నికల్లో తాను మళ్లీ కార్పొరేటర్గా పోటీ చేయ నని ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీపై ఆమె చూపు ఉందేమో అనే వ్యాఖ్యానాలు సైతం వినిపిస్తున్నాయి. -
కర్ణాటక సీఎం మార్పు.. డీకే కీలక వ్యాఖ్యలు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ మంగళవారం కొట్టిపారేశారు. ప్రస్తుతం అలాంటి చర్చే లేదని అన్నారు. అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను ఆదేశించారు. డి.కె.శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హెచ్.ఎ.ఇక్బాల్ హుస్సేన్కు నోటీసు ఇస్తామని, ఆయన వివరణ కోరుతామని వెల్లడించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. సీఎం మార్పును ఇప్పుడు ఎవరూ కోరుకోవడం లేదని, తమ దృష్టి మొత్తం 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని శివకుమార్ తేల్చిచెప్పారు. తన గురించి ఇతరులు మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. అలాంటి అంశాలపై ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని పేర్కొన్నారు. -
సంఘటితం.. సంఘర్షణ.. సిద్ధంచేయడం
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుపై మూడు ప్రధాన బాధ్యతలున్నాయి. కార్యకర్తలను సంఘటితం చేయడం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సంఘర్షణ చేయడం.. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేలా పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయడం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యాఖ్యానించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రకటన, సన్మాన కార్యక్రమంలో ఎన్.రామంచందర్రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శోభ కరంద్లాజే ప్రకటించి ఆయకు నియామకపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతోపాటు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపైనా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఈ రెండింటికీ ప్రత్యామ్నాయమైన బీజేపీకి అధికారం ఇవ్వాలనే యోచనలో ప్రజలు ఉన్నారని.. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని కేడర్కు సూచించారు. ‘తెలంగాణలో ఇప్పుడు బీజేపీకి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచండి. అలా చేస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు కాంగ్రెస్కు ఏటీఎంలుగా తయారయ్యాయి. ఇక్కడి ప్రజాధనాన్ని లూటీ చేసి పార్టీ పెద్దలకు కట్టబెడుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే రోజులు ఎంతో దూరం లేవు’అని పేర్కొన్నారు. 11 ఏళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి రూ. 12 లక్షల కోట్లు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని కొందరు తెలివితక్కువగా మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ. 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని.. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పాలనంతా దోచుకోవడంతోనే గడిచిపోయిందని.. ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా అందరూ ఐకమత్యంగా పనిచేయాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. నాలుగుసార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని.. తన హయంలో ఏమైనా లోటుపాట్లు జరిగితే క్షమించాలని కోరారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం: కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, ఈ–కార్ రేస్ కేసుల్లో ఎలాంటి చర్యలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ రెండు పారీ్టలను నమ్మని ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారు. సౌమ్యుడిగా కనిపించినా సమస్య వస్తే టఫ్గా ఉంటా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ సామాన్య కార్యకర్తలాగే కష్టపడి పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు తెలిపారు. అయితే తాను సౌమ్యుడిగా కనిపించినా సమస్య వచి్చనప్పుడు చాలా టఫ్గా వ్యవహరిస్తానన్నారు. సిద్ధాంతం కోసం పోరాడతానని, గతంలో 14సార్లు జైలుకు వెళ్లి వచ్చానని.. విద్యార్థుల కోసం లాఠీచార్జిలో తన చెయ్యి, కాలు దెబ్బతిన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తానన్నారు. బీజేపీలో ఉమ్మడి నాయకత్వం ఉంటుందని.. అందరి అభిప్రాయంతోనే తాను నిర్ణయాలు తీసుకుంటానని రాంచందర్రావు తెలిపారు. ఇప్పుడు అందరి లక్ష్యం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీలోని కొత్త వాళ్లు, పాత వాళ్లు కలిసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ వాట్సాప్ యూనివర్సిటీతో, కాంగ్రెస్ ఫేక్ న్యూస్లతో ట్రోలింగ్ చేస్తోందని, అలాంటి వాటికి జడిసేది లేదన్నారు. పేరులేని పేపర్లతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు వేసి జైలుకు పంపిస్తానని హెచ్చరించారు.జాతీయ కౌన్సిల్ సభ్యులు... రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అనంతరం జాతీయ కౌన్సిల్కు ఎన్నికైన వారి పేర్లను ప్రకటించారు. వారిలో కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, ఎంపీలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, గోడం నగేశ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, గరికపాటి మోహన్రావు, పి.సుధాకర్రెడ్డి, ఎం.ధర్మారావు, చింతా సాంబమూర్తి, కె.గీతామూర్తి, పద్మజారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, బంగారు శ్రుతి, అరుణజ్యోతి, బండారు రాధిక, జి.ప్రేమేందర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్, మర్రి శశిధర్రెడ్డి, పాయల్ శంకర్ ఉన్నారు. మరికొందరు నామినేషన్ వేసినప్పటికీ పేర్లను తర్వాత ప్రకటిస్తామన్నారు. -
బీఆర్ఎస్ కోసమే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసమే ఆ పార్టీ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి– బనకచర్ల ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి మంగళవారం ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో సీఎం మాట్లాడారు. ‘వాళ్లు (బీఆర్ఎస్) 2023లో ఓడిపోయారు. 2024లో డిపాజిట్లు కోల్పోయారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇప్పుడు నదుల పునరుజ్జీవం కాదు.. పార్టీ పునరుజ్జీవం కోసం నీళ్ల సెంటిమెంట్ను వాడుకుంటున్నారు. పక్క రాష్ట్రం సీఎంను, ఈ రాష్ట్రం సీఎంను భూతాలుగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తున్నరు. క్షుద్రపూజలు చేసినట్టుగా ఆయన (కేసీఆర్) ఫాంహౌస్లో కూర్చుని ఆలోచన చేస్తున్నడు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు. మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీశ్రావులే.. తొమ్మిదిన్నరేళ్లు పాలనలో కేసీఆర్, హరీశ్రావు తీసుకున్న నిర్ణయాలు నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని సీఎం విమర్శించారు. ‘కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల నికర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎలా వాడుకోవాలన్న అంశంపై 2015 సెప్టెంబర్ 18న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, సాగునీటి రంగ సలహాదారులు విద్యాసాగర్ రావు హాజరై ఏపీ 512 టీఎంసీలు వాడుకోవచ్చని, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అంగీకరిస్తూ సంతకం పెట్టి తెలంగాణ రైతాంగం పాలిట మరణశాసనం రాసి వచ్చారు. 2020లో కూడా సమావేశానికి వెళ్లి మళ్లీ సమ్మతి తెలిపారు. 2015లో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో, తర్వాత జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కృష్ణా జలాల్లో మన హక్కుల కోసం కేసీఆర్ వాదించలేదు. కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలనూ కేసీఆర్ ఏపీకి తాకట్టు పెట్టిండు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి కృష్ణా, గోదావరి జలాలపై చర్చిద్దాం’అని సీఎం బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రాచపుండును పెట్టింది కేసీఆరే.. ‘ఏటా 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని 2016 సెపె్టంబర్ 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారి నాటి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలను పూర్తిస్థాయిలో వాడుకునే విధంగా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాతే మిగులు జలాలు, వరద జలాల లభ్యత ఎంతో లెక్క తేలుతుంది. ఆ తర్వాతే ఆ జలాల్లో దామాషా ప్రకారం రెండు రాష్ట్రాల వాటాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. ఏటా 3,000 టీఎంసీల వరద సముద్రంలో కలుస్తోందని కేసీఆర్కు ఏ దేవుడు చెప్పిండు? లేని ఏకును, రాచపుండును పెట్టిందే కేసీఆర్. దాని ఆధారంగానే గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు డీపీఆర్ తయారు చేయించడానికి చంద్రబాబు 2016లో జీవో ఆర్టీ నం.262 జారీ చేశారు. దీనికి కొనసాగింపుగా 2019 సెపె్టంబర్ 29న జీవో ఆర్టీ నం.230 ఇచ్చారు. వ్యాప్కోస్ 4 ప్రత్యామ్నాయాలు సూచించగా, 4వ ప్రత్యామ్నాయంగా 400 టీఎంసీలు తరలించవచ్చని నివేదిక ఇచి్చంది. ఇప్పుడు ఏపీ 200 టీఎంసీలను తరలిస్తామని చూపించడం తాత్కాలికం. ప్రీఫీజిబిలిటీ రిపోర్టు ప్రకారం 300 టీఎంసీల ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదనంగా 100 టీఎంసీల పంపులను ఫిట్ చేయడం లేదు. 400 టీఎంసీలను నెల్లూరు, ప్రకాశంకు ఎలా తీసుకెళ్లాలో 2016లోనే కేసీఆర్ చెప్పిండు. ఇదే అదనుగా చంద్రబాబు పనులు మొదలు పెట్టిండు. 2019లో జగన్ సీఎం కాగానే గోదావరి జలాలను ఏ విధంగా పెన్నాకు తరలించాలో ఆయనకు కేసీఆరే నేర్పిండు. కేసీఆర్ రోజా ఇంటికి వెళ్లి గోదావరి జలాలు మీకిచ్చి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నాడు. 2016–19 మధ్యలో కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు’అని సీఎం ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపకుండా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్రెడ్డి కోరారు. సమస్యల పరిష్కారంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం వివాదం సృష్టిస్తోందని విమర్శించారు. నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. బీజేపీ పరోక్షంగా బీఆర్ఎస్ను బతికించడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. సదస్సులో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర పర్యావరణ శాఖ తిరస్కరించిందని తెలిపారు. -
అండగా నిలబడాలి: వైఎస్ జగన్
పార్టీ యువజన విభాగం కార్యాచరణలో ఇది ఆరంభం మాత్రమే. తర్వాత జిల్లాల్లో నా పర్యటన ఉంటుంది. ఇంకా పాదయాత్ర కూడా ఉంటుంది. ఇక ముందు మనం మళ్లీ మళ్లీ కలుస్తాం. ఇది మనం మమేకం కావడంలో తొలి అడుగు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘‘రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకం.. అది తొలి అడుగు.. ఎమ్మెల్యే కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం కావాలి...’ అని వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలతో మమేకం కావడం.. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం.. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచి వారితో కలిసి పోరాడడం.. ఈ మూడు లక్షణాలను పార్టీలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడే రాజకీయాల్లో నిలబడి ఎదుగుతారని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుదలకు మంచి అవకాశం ఉంటుందని.. అందుకే చొరవ చూపి వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని దిశానిర్దేశం చేశారు.‘ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. అయితే మీరు ఆ మూడు లక్షణాలను పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల్లో మీరు అది సాధించాలి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది కదిలి రావాలి..’ అని సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై యువజన విభాగం ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం..పార్టీలో క్రియాశీలకంగా నిర్మాణ కార్యక్రమం సాగుతోంది. ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, వారు హామీలు ఎగ్గొట్టే విధానాన్ని ఎండగడుతూ.. ఈ సర్కారును నిద్ర లేపుతున్నాం. ఇందులో చాలా క్రియాశీలకంగా ఉన్నాం. అయితే ఇంకా ఎదగాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు నాయకుడి దృష్టిలో పడతారు. అధికారంలో ఉన్నప్పుడు పాలకులకు పదవుల పంపకంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. కాబట్టి నాయకులపై దృష్టి అందరిపై అంతగా ఉండదు. ఎవరైనా నాయకుడిగా ఎదగాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అది సాధ్యం. మన పార్టీ నుంచి ఎన్నికైన వారిలో చాలా మంది కొత్తవారే. మూడు లక్షణాలు అలవర్చుకోవాలి..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. అయితే అందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఒకటి.. నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ఎప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి. చిక్కటి చిరునవ్వుతో చక్కగా పలకరించాలి. అందరితోనూ అలాగే వ్యవహరించాలి. ఇంకా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారితో కలిసి పోరాడాలి. ప్రజల తరఫున నిలబడాలి. వారికి తోడుగా ఉండాలి. ఈ మూడు చేయగలిగితే ఎవరైనా నాయకుడిగా ఎదుగుతారు.అదే మీ లక్ష్యం కావాలి..నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్లకు చెబుతున్నా. ఈరోజు నుంచి మీరు పని మొదలు పెట్టండి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది రావాలి. ఇది నియోజకవర్గం ఇన్ఛార్జ్లకు ఇస్తున్న టార్గెట్. అలా లేకపోతే ఆ దిశగా కృషి చేయాలి. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ఇది మీ తొలి అడుగు. మీ చివరి అడుగు కనీసం ఎమ్మెల్యే కావడం. ఎదగడం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. కానీ మీరు పై మూడు గుణాలు పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల్లో దాన్ని సాధించాలి. కార్యాచరణ ఇలా ఉండాలి..దీనికి తగ్గట్టుగానే గ్రామ, మండల, మున్సిపాలిటీ, వార్డు కమిటీలు ఏర్పాటు కావాలి. వాటిలో సమర్థులను నియమించండి. ఎదగడానికి సిద్ధంగా ఉన్నవారిని పార్టీలోకి తీసుకురండి. అసంఘటితంగా ఉన్నవారిని సంఘటితం చేయాలి. అలా మీరు పక్కా ప్రణాళికతో పని చేస్తే, చొరవ చూపితే, కృషి చేస్తే రాజకీయంగా బాగా ఎదుగుతారు. అప్పుడు మీరు ఒక్క పిలుపునిస్తే జనం కదిలి వస్తారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే కనీసం 5 వేల మంది రావాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోతే వెంటనే కమిటీల మీద దృష్టి పెట్టండి.వాటిని ఏర్పాటు చేయండి. వాటి పనితీరు ఎప్పటికప్పుడు బేరీజు వేయండి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులకు చేదోడు వాదోడుగా ఉంటూ, సలహాలు ఇస్తూ వారిని చేయి పట్టుకుని నడిపించండి. తద్వారా మీరు ఎదుగుతారు. అప్పుడు మీరు పిలుపునిస్తే ఐదు వేలు కాదు.. 20 వేల మంది కదిలి వస్తారు. ఇక పార్టీ జోన్ విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే 10 వేల మంది రావాలి. అలా లేకపోతే, ఆ స్థాయికి ఎదగడం కోసం పక్కాగా ప్లాన్తో పని చేయండి. పార్టీలో కింది శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించడం మీ కార్యాచరణ కావాలి. అలా మీరు రాజకీయంగా ఎదిగాక, మీరు పిలుపునిస్తే పది వేలు కాదు.. ఏకంగా 40 వేల మంది వస్తారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్..ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగడం కోసం పార్టీలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నాం. వారు మీకు అండగా ఉంటారు. యువ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యువ నాయకులను ఆ పదవుల్లో నియమిస్తాం. ఆర్గనైజేషన్ తెలిసిన వారు మీకు తోడుగా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెడతారు. అలా కేసులు పెట్టినా ఎదుర్కొనేలా.. పార్టీ మీకు అండగా, తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన యంగ్ అభ్యర్థులను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తీసుకొస్తున్నాం. వారు పార్టీ జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పని చేస్తారు.ఆ విభాగాలు బలంగా ఉండాలి..పార్టీలో సంస్థాగతంగా యువజన, మహిళ, విద్యార్థి, రైతు విభాగాలు చాలా బలంగా ఉండాలి. అలాగే ఎస్సీ, బీసీ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలి. అప్పుడు పార్టీ మరింత బలపడుతుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. అలా అన్ని వ్యవస్థలు దృఢంగా ఏర్పడితే పార్టీ మరింత బలపడుతుంది. ఇంకా ఎదుగుతుంది. మీ ఫోన్.. మీ ఆయుధంఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో భాగస్వామ్యం కావాలి. ఇది సోషల్ మీడియా యుగం. కాబట్టి మీ ఫోన్ ఒక గన్ లాంటిది. అంటే అది ఒక ఆయుధం అన్నమాట. సోషల్ మీడియా ఎక్కౌంట్, యూట్యూబ్, ఎక్స్ పోస్టులు.. ఇలా అన్ని మాధ్యమాల్లో మీరు చురుకుగా ఉండాలి. గ్రామస్థాయి వరకు భాగస్వామ్యం కావాలి. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, పార్టీలో మా వరకు తెలియడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ ఈ మెసేజ్ వెళ్లాలి. ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా పార్టీ మొత్తం తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇదీ విజన్. ఇందులో భాగస్వాములు కావాలి. ఇది మీ అందరికీ తెలియాలి.విలువలు, విశ్వసనీయతకే పెద్దపీట2011లో మన పార్టీని స్థాపించాం. నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నా వెనక ఎవరూ లేరు. నేను, అమ్మ.. ఇద్దరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాం. మా ఇద్దరితోనే పార్టీ ప్రస్థానం మొదలైంది. అప్పుడు నాతో రావడానికి కొందరు సిద్ధం కాగా.. ఇప్పుడు నా పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి, నాతో రమ్మని చెప్పను. రాజకీయంగా తెరమరుగైపోతావ్ అంటున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో నాతో రమ్మని చెప్పలేనన్నాను. దేవుడు దయ తలిచి, పరిస్థితులు చక్కబడ్డప్పుడు, నేను బాగున్నప్పుడు రమ్మని చెప్పా. ఎందుకంటే.. అప్పుడు నేను కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో ఢీ కొడుతున్నా. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చా. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఏరోజూ వాటి విషయంలో రాజీ పడలేదు.ఒంటరిగా మొదలై ఎదిగాం..ఆ సమయంలో కాంగ్రెస్ను వీడి 18 మంది నాతో వస్తామన్నారు. వారందరినీ రాజీనామా చేయమని కోరా. అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కూడా వస్తానంటే తననూ రాజీనామా చేయమన్నా. అలా 18 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ రాజమోహన్రెడ్డి అందరం ఉప ఎన్నికలకు వెళ్లాం. అప్పుడు నాకు 14వ లోక్సభలో రికార్డు స్థాయిలో అత్యధికంగా ఏకంగా 5.50 లక్షల మెజారిటీ వచ్చింది. పార్లమెంట్లో అందరూ మనవైపే చూశారు. దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో... నాపై కక్ష కట్టారు. సిట్టింగ్ ఎంపీగా ఎం.రాజమోహన్రెడ్డి కాంగ్రెస్లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి 15 మంది విజయం సాధించారు. ఎక్కడా విలువలు, విశ్వసనీయత తగ్గలేదు.కాంగ్రెస్ – టీడీపీ కుమ్మక్కు...నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు చార్జీలు విపరీతంగా పెంచితే ఆ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. దానికి మద్దతు ఇవ్వాలని టీడీపీని కోరినా.. చంద్రబాబు కలిసి రాలేదు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి అండగా నిల్చి, నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ కుమ్మక్కయ్యాయి. దాంతో ఆ ప్రభుత్వం గట్టెక్కింది. అలా ఆ రెండు పార్టీలు విలువలు లేని రాజకీయం చేశాయి.టీడీపీకి దేవుడు మొట్టికాయ..రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. మన పార్టీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెలిచారు. అయితే వారిలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నారు. అలా అనైతిక రాజకీయాలు చేశారు. కానీ ఆ తరువాత ఏం జరిగింది? 2019లో జరిగిన ఎన్నికల్లో మన పార్టీకి అఖండ విజయం దక్కింది. అదే టీడీపీకి ఆ ఎన్నికల్లో దేవుడు మొట్టికాయ వేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీకి సరిగ్గా 23 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే అంతకుముందు మన పార్టీ నుంచి ఎంత మందినైతే అనైతికంగా లాక్కున్నారో, ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి సరిగ్గా అన్నే సీట్లు వచ్చాయి. -
ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై వైఎస్సార్సీపీ ధ్వజం
తాడేపల్లి : తమ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు రాతలు రాస్తున్న ఎల్లోమీడియాపై వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరాధార ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డం ఎల్లో మీడియాకు ఒక అలవాటుగా మారిందని మండిపడింది. వైఎస్సార్సీపీని దెబ్బతీసే దురుద్దేశంతో తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి కుట్రలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయిందని, సజ్జలపై ఆంధ్రజ్యోతి, ఈటీవీ-2 సహా ఇతర ఎల్లో మీడియాలో ప్రచురించిన, ప్రసారమైన వార్త కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. కార్యాలయానికి వచ్చే సందర్శకులకు అనుచరుడిగా ముద్రవేసి, వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ లేకుండా, నిర్ధారించుకోకుండా, కనీస ఆధారాలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆపాదిస్తూ నిర్లజ్జగా వార్తా కథనం ప్రసారం చేయడం అత్యంత దారుణమని పేర్కొంది. ఆ వార్తల్లో పేర్కొన్న ప్రేమ్చంద్ అనే వ్యక్తితో కాని, అతనిపై వచ్చిన ఆరోపణలతో కాని సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ తెలిపింది. పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలకు వెనుకాడమని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. -
‘రేవంత్.. మీకు, మీ హైడ్రాకు ఇవేమీ కనబడవు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి మండిపడ్డారు. ప్రధానంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఈ మేరకు అనేక ప్రశ్నలు సంధించారు కేటీఆర్. ‘ కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు.. మీ అన్న తిరుపతిరెడడఇకి దుర్గం చెవురు ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు. మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్లో ప్యాలసులు కట్టవచ్చు. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు. కేవీపీ లాంటి పెద్దలు చెరువు బఫర్ లో గెస్ట్ హౌసులు కట్టుకోవచ్చు. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. ఇవేమీ మీకు, మీ హైడ్రాకు కనబడవు’ అని ప్రశ్నించారు.మిస్టర్ రేవంత్ రెడ్డి, ⭕️ నువ్వు కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు ⭕️ మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు FTLలో ఇల్లు ఉండవచ్చు ⭕️ మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్ లో ప్యాలసులు కట్టవచ్చు ⭕️ మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు⭕️… pic.twitter.com/Vnuqyfb6i2— KTR (@KTRBRS) July 1, 2025 -
హాస్టల్లో పురుగుల పులుసు.. హోం మంత్రికి స్పెషల్ భోజనం
మంత్రిగారు.. అది కూడా హోం మంత్రి తన సొంత నియోజకవర్గంలో హాస్టల్ తనిఖీకి వచ్చారు.. మంత్రి వస్తున్నారంటే హాస్టల్ శుభ్రంగా ఉంచి ఆ ఒక్కరోజే అనే పిల్లలకు మంచి భోజనం పెట్టాలి కదా.. కార్యక్రమంలో పాయకరావుపేటలోని బీసీ బాలికల హాస్టల్ నిర్వాహకులు మంత్రి గారికి ప్రత్యేకంగా పురుగులతో చేసిన పులుసు వడ్డించారు.. ఇంకేముంది మంత్రి అనిత అవాక్కయ్యారు.. ఏంటి మంత్రిని నేను వస్తె పురుగుల భోజనం పెడతారా అని గదమాయించాడు. " ఏంజేస్తాం మేడం ఎలకల వేపుడు.. బల్లుల ఇగురు.. బొద్దింకల పచ్చడి పెడదాం అనుకున్నాం.. కానీ దొరకలేదు" అని సిబ్బంది లోలోన నవ్వుకున్నారు.ఈ క్రమంలో మంత్రి అనిత.. ఉన్నఫలంగా అధికారుల మీద ఫైరయ్యారు.. ఏంటి భోజనం ఎలా ఉంటుందా.. మీ విద్యాశాఖ ఇలా పనిచేస్తుందా అంటూ మీడియా కవరేజ్ కోసం కొన్ని డైలాగులు కొట్టారు. అంతా బానే ఉంది కానీ ఆవిడ వెళ్లిన హాస్టల్.. చేసిన భోజనం అంతా డీ ఫ్యాక్టో సీఎం లోకేష్ పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కొన్ని క్షణాలు మర్చిపోయినట్లున్నారు. ఏంటి.. నాకు పెట్టే భోజనంలోనే పురుగుల అని అధికారులపై చిరాకు చూపిస్తూ.. మీడియాకు న్యూస్ అందించారు.. అది కాస్త బ్యాక్ ఫైర్ అయిందని అధికారులు తెలుగుదేశం పెద్దలు అంటున్నారు. పురుగులు వస్తే వచ్చాయి పక్కకు తీసి పడేసి భోజనం చేసి భళా భళా అంటే సరిపోయేది కదా..సాక్షాత్తు లోకేష్ శాఖలో తప్పులు పట్టుకుని అనవసరంగా నెత్తిమీదకు తెచ్చుకున్నారు మంత్రిగారు అని పార్టీ నేతలు..కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.అమాయకత్వమో.. అత్యుత్సాహమో.. అజ్ఞానమో తెలియదు కానీ కూటమి క్యాబినెట్లో మంత్రులు ఒక్కోసారి ఇలాంటి హుషారు పనులు చేసి మీడియాకి న్యూస్ అయిపోతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా మహిళలపై వరుస దాడులు జరుగుతున్న తరుణంలో హోం మంత్రి ఏం చేస్తున్నారు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే నేనే హోంశాఖ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.. అంటూ డైలాగులు పేల్చారు.. ఆ డైలాగులు ఆరోజు పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచాయి. కానీ ఆయన చేసిన కామెంట్లు హోం మంత్రి అనితతో బాటు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. క్యాబినెట్లో రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏకంగా హోం మంత్రి పనితీరును తప్పు పట్టడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.ఆ తర్వాత ఆయన తన తప్పును తెలుసుకొని సైలెంట్ అయ్యారు అది వేరే విషయం. ఆ తర్వాత కాశీనాయన క్షేత్రం లో భవనాలు కూల్చివేతకు సంబంధించి లోకేష్ అత్యుత్సాహంతో వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ పరిధిలో ఉన్న భవనాలను లోకేష్ ఆదేశాల మేరకు కూల్చివేయడం పవన్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఆ తర్వాత ఆ అంశం సైలెంట్ అయింది. ఇప్పుడు అనిత కూడా నక్కపల్లి లో బాలికల హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడ పరిస్థితులను చూసి షాక్ అయ్యారు.43 మంది ఆడ పిల్లలు చదువుతున్న హాస్టల్ వద్ద కనీసం సీసీ కెమెరాలు లేవు. వార్డెన్ పిల్లల్ని వదిలేసి 5 గంటలకే ఇంటికి వెళ్ళిపోయింది. సన్న బియ్యం ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదు. ముతక బియ్యంతో ఉడికే ఉడకని భోజనం పెడుతున్నారు. మెనూ అమలుకావడం లేదని విద్యార్థులు చెప్పడం గమనార్హం. అయితే విద్యార్థులతో కలిసి భోజనం చేద్దాం అని కూర్చున్న హోం మంత్రి అనితకు మొదటి ముద్దలోనే పురుగు వచ్చింది. అదేంటి నేను వచ్చిన రోజు కూడా ఇలాంటి భోజనమే పెట్టారు అంటే మిగతా రోజుల్లో ఇంకెలా ఉంటుందో అంటూ ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.ముఖ్యమంత్రి కొడుకు హోదాలో అన్ని శాఖల్లోనూ దూరీపోవడమే కాకుండా.. ఇటు హోంశాఖ తో పాటు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే బాధ్యత వారిని టార్చర్ చేసే వ్యవహారాలన్నీ చూస్తున్న లోకేష్ ఏకంగా విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేశారు. టీచర్ల బదిలీలు పాఠశాలల రేషన్లైజేషన్ ఇదంతా పెద్ద గందరగోళంగా మారింది. దీంతో ఆయన హాస్టల్లు విద్యార్థులు భోజనాలు వంటి చిన్న చిన్న అంశాలను పట్టించుకోవడమే మానేశారు. ఈ అంశం ఏకంగా హోం మంత్రి పర్యటనలోనే వెల్లడి కావడంతో ఆమె ఇది లోకేష్ బాబు శాఖ కదా కాస్త చూసి చూడనట్టు పోదాం అని సర్దుకోకుండా ఇంత దరిద్రంగా ఉంది ఏంటి అని ఓపెన్ గా కామెంట్ చేశారు. అంటే లోకేష్ తన శాఖను సరిగ్గా చూడటం లేదని ఆమె చెప్పకనే చెప్పేశారు. ఆమె కామెంట్ ఆమె పీకల మీదకు తెస్తుందా ఏమో అని కార్యకర్తలు లోలోన చెవుల కొరుక్కుంటున్నారు.-సిమ్మాదిరప్పన్న -
యువతకు చంద్రబాబు మళ్ళీ వెన్నుపోటు: జక్కంపూడి రాజా
సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం ప్రతిసారీ యువతను నమ్మించి మోసం చేయడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు మరోసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారని వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి భృతి అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఏదని ప్రశ్నించారు.చివరికి మెగా డీఎస్సీ అంటూ సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకానికే ఏడాది కాలంగా విలువలేని దారుణమైన పాలన ఏపీలో జరుగుతోందని ధ్వజమెత్తారు. కూటమి చేస్తున్న మోసాలపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉందని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వైఎస్సార్సీపీ యువజన విభాగంతో ఇవాళ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలపై గొంతెత్తాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో వైఎస్సార్సీపీ యువజన విభాగం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. వైఎస్ జగన్ని సీఎం చేసే దాకా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యేలా చూస్తాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే ఆయన సీఎం కావాలి. ప్రభుత్వం కుట్రలు చేయడం మాని ఇకనైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం చేయాలి.నిరుద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వమిదివైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ ప్రకటించిన టీచర్ పోస్టులను భర్తీ చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారు. ఏడాది పూర్తయినా దానికి దిక్కుమొక్కు లేకుండా చేశాడు. 2014లో నిరుద్యోగ యువతకు నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు, 2024 లోనూ నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారు. చంద్రబాబుకు వంతపాడే ఈనాడు పత్రిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉంటే గత ఏడాది వారందరికీ ఒక్కొక్కరికి రూ. 36 వేలు చొప్పున చంద్రబాబు బకాయి పడ్డాడు. ఒక్క నిరుద్యోగ భృతి పేరుతోనే రూ.56 వేల కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం బకాయిపడింది.కొత్త ఉద్యోగాల భర్తీ లేదు.. ఉన్న ఉద్యోగాల తొలగింపుకూటమి మేనిఫెస్టోలో ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఏడాది గడిచినా రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి సూపర్ సిక్స్ పేరుతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సంతకాలు చేసిన బాండ్లు పంపిణీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఒక్కో వ్యవస్థనూ ఎత్తివేస్తూ ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు.వలంటీర్ల గౌరవం వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పిన ఈ కూటమి పెద్దలు, చివరికి వారిని రోడ్డుపాలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 33 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా రేషనలైజేషన్ పేరుతో ఉన్న ఉద్యోగులే ఎక్కువని తేల్చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలను తీసేసి 15 వేల మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగులను తొలగించారు.ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి దాదాపు 2,360 మందికి ఉపాధి లేకుండా చేశారు. ఏపీఎండీసీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే దాదాపు 400 మంది ఉద్యోగులను, ఉద్యోగుల జీతాన్ని దళారులు దోచుకోకుండా కోతల్లేకుండా శాశ్వత ఉద్యోగులకు దక్కే అన్ని సౌకర్యాలు కల్పించిన ఆప్కాస్ అనే వ్యవస్థను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోంది.వైఎస్ జగన్ పాలనలో 6.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలువైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో యువతకు అండగా నిలిచారు. ఉద్యోగాల భర్తీ నుంచి, ఉపాధి కల్పన వరకు చక్కని ప్రణాళికతో పాలనను సాగించారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. ఒకేసారి దాదాపు 1.36 లక్షల మంది సచివాలయ శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి సంక్షేమ పథకాలను ఇంటికే అందించారు.ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 6.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఐదేళ్లలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 48 వేల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి. ఏపీయస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యకు ఎండ్ కార్డ్ వేశారు. ఎంఎస్ఎంఈల ద్వారా 33,82,242 మందికి ఉపాధి లభించింది. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు సోషియో ఎకనమిక్ సర్వే రిపోర్టులో పొందుపర్చడం జరిగింది. -
అయ్య బాబోయ్ ఇంటింటికీనా..!
అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు..తర్వాత వాటిని గాలికొదలడంతో ఐదేళ్ల వ్యతిరేకతను ఏడాదిలోనే మూటగట్టుకున్నారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు ఇలా ఏ వర్గాన్ని కదిలించినా కూటమి పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలన అంటూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని చెప్పడంతో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినా ఏ ఎమ్మెల్యే కూడా ఒక్క పల్లెకూ వెళ్లిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ఏడాదిలో చేసిన ‘సుపరిపాలన’ను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సీఎం చంద్రబాబు చెబుతుండడంతో ప్రజల వద్దకు వెళ్లి ఏం చేశామని చెప్పాలంటూ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. ఓవైపు రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాం.. మరోవైపు పెన్షన్ మినహా అన్ని పథకాలకూ మంగళం పాడాం.. ‘అమ్మ ఒడి’ సగం కోతలు, సగం వాతలు తరహాలో ఇచ్చాం.. ఈ పరిస్థితుల్లో ఇంటింటికీ వెళితే మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లడం అంత మంచిది కాదని చాలా మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.కబ్జాలు, ఆక్రమణలతో వణుకు జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యేల అనుచరులు భూ ఆక్రమణలు, కబ్జాలు ఇబ్బడిముబ్బడిగా చేశారు. దీంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరకు వెళ్తే నిలదీసి కడిగిపారేస్తారన్న భయం ఎమ్మెల్యేల్లో ఉంది. అంతేకాదు తమ కార్యకర్తలు ఏం చేసినా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి విడిపించుకుంటున్నారు. బాధితులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ‘తమ్ముళ్లు’ దాడులు చేసినా బాధితులకు న్యాయం లేదు. దీంతో ఎమ్మెల్యేలు తమ వార్డుల్లోకి వస్తే నిలదీసేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.మహిళలు ‘బెల్టు’ తీస్తారు..! ఉమ్మడి జిల్లాలో 230 వైన్ షాపులుండగా.. 2,100 బెల్టుషాపులు ఉన్నాయి. ఈ క్రమంలో విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతుండడంతో పేద కుటుంబాలు గుల్లవుతున్నాయి. దీంతో మహిళల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల నిరసనలకు దిగారు. ఇలాంటి సమయంలో పల్లెలకు ఎమ్మెల్యేలు వెళితే ‘బెల్టు’ తీస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఉద్యోగులు నిజం తెలుసుకున్నారు.. ఉద్యోగులందరూ ఎన్నికల్లో టీడీపీకి గంపగుత్తగా ఓట్లేశారని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే ఉద్యోగ వర్గాలు ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నాయి. బదిలీల్లో నాయకుల పాత్రపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సిఫార్సు లేఖలు, లంచాలతో తమకు కావాల్సిన వారిని దగ్గరకు చేర్చుకోవడంతో వేలాది మంది సామాన్య ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి విభాగం బదిలీలోనూ అవినీతి అక్రమాలే. ఈ సమయంలో ఎమ్మెల్యేలకు అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆగ్రహంలో రైతన్నలుప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది వచ్చినా పైసా ఇవ్వలేదు. ఖరీఫ్ ప్రారంభమైనా రూపాయి అందించలేదు. పైగా పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ‘ఎమ్మెల్యేలైతే మాకేంటి..ఊర్లోకి వస్తే చూస్తాం’ అంటూ మండిపడుతున్నారు. -
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా రాజీ పడలేదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం. పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే. పార్టీ పెట్టిన కొత్తలో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. నామీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు నాతో వచ్చారు. నా ప్రస్థానం అక్కడ నుంచి మొదలయ్యింది.. .. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది. పార్లమెంటులో ప్రతి సభ్యుడూ మనవైపు చూసే పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేక మనమీద పగబట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే.. వాళ్లందరిచేతా రాజీనామా చేయించాను. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసే పోటీచేశాయి. 2014లో 67 మందితో గెలిచాం. మళ్లీ మన దగ్గర నుంచి 23 మందిని లాక్కున్నారు. .. ఎన్నికష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశాం. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలి. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యం. ఇవి చేయగలిగితే.. లీడర్గా ఎదుగుతారు. యూత్ వింగ్లో ఉన్న వారు ప్రభావంతంగా పనిచేయాలి. రాజకీయంగా ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని రాజకీయంగా పెంచడం నా చేతుల్లో ఉంది. పెరగాలంటే.. మీరు కష్టపడాలి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయండి. సమర్థత ఉన్నవారిని పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురండి. పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేయాలి... మీ పనితీరును మీరు ఎప్పటికప్పుడు మీరే మదింపు చేసుకోండి. జోన్ల వారీగా యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా పెడుతున్నాం. ఎమ్మెల్యేలుగా పోటీచేసిన యువకులు దీనికి ఉంటారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోకి రావాలి. వాస్తవాలను చెప్పడానికి ఇది ఒక ఆయుధం. అన్యాయాలను, అక్రమాలను ఈ మాధ్యమం ద్వారా వెలుగులోకి తీసుకురావాలి. ప్రజలందరి దృష్టికి ఈ సమాచారాన్ని చేరవేయాలి. ఎవరికి, ఏ అన్యాయం జరిగినా సమాజం దృష్టికి తీసుకు రావాలి అని వైఎస్ జగన్ సూచించారు. ఈ భేటీలో యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. -
హోం మంత్రి అనితకు చేదు అనుభవం
హోం మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్ 'సందర్శనకు వెళ్లిన ఆమెను సమస్యలు పలకరించాయి. హాస్టల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ పలువురు బాలికలు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమె చేసేది లేక అధికారులపై చిందులు తొక్కారు. హోం మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ఆమె అక్కడి బాలికల గురుకుల హాస్టల్ను సందర్శించారు. ఆ టైంలో గురుకుల హాస్టల్స్ దుస్థితి వెలుగులోకి వచ్చింది. భోజనంతో పాటు మెయింటెనెన్స్ కూడా బాగా లేదంటూ విద్యార్థినిలు హోం మంత్రికి చెప్పారు. దీంతో ఆమె కాస్త అసహనానికి గురయ్యారు.‘‘43 మంది ఆడ పిల్లలు చదువుతున్న హాస్టల్ వద్ద కనీసం సీసీ కెమెరాలు లేవు. వార్డెన్ పిల్లల్ని వదిలేసి 5 గంటలకే వెళ్ళిపోయింది. సన్న బియ్యం ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదు. నాణ్యమైన భోజనం అందడం లేదు. ఇద్దరు అధికారులను ఎత్తేస్తే అందరికీ బుద్ధి వస్తుంది అంటూ ఆమె అధికారులపై మండిపడ్డారు. -
దేవుడు చూస్తూ ఊరుకోడు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కాం కేసు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులో తనను అక్రమంగా ఇరికించారని మీడియా ముందు వాపోయారాయన. ఈ కేసులో సిట్ కస్టడీకి తరలించే క్రమంలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు.‘‘నాపై తప్పుడు కేసులు పెట్టారు. అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది. దేవుడు చూస్తూ ఊరుకోడు’’ అని అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు ఆయన్ని బలవంతంగా వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నేటి(జులై 1వ తేదీ) నుంచి చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని సిట్ మూడు రోజులపాటు విచారించనుంది.విచారణకు ముందు జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు. -
బాబు, పవన్ను ఓడిద్దాం.. ముస్లింలకు అసదుద్దీన్ పిలుపు
కర్నూలు (టౌన్): బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మద్దతుగా నిలిచి ముస్లింలను దగా చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ‘వక్ఫ్ బచావో.. దస్తూర్ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ మరువరన్నారు. టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బయటకు రావాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణల్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచి్చనా టీడీపీ, జనసేన పార్టీలను చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు రూ.వేల కోట్లను ఆయన వర్గీయులు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. వక్ఫ్ అమలుకు ప్రతి ముస్లిం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల ఏరివేత ముసుగులో ముస్లింలను బీజేపీ ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తోందన్నారు. పహల్గాంలో అమాయకులను ఊచకోత కోసిన నిందితులను మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోందని ప్రశ్నించారు.ఆర్ఎస్ఎస్ దేశంలో పేట్రేగిపోతోందని, మసీదులు, దర్గాలను టార్గెట్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ముస్లిం మతపెద్దలు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలకు తెరలేపింది. జులై 3న వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తోంది. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు.ఇప్పటికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవలం 100 మందే రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ స్థలం యజమానికి అధికారులు, పోలీసులు ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లిన పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అక్కసుతో హెలిప్యాడ్ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతూ.. అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యం: అనిల్వైఎస్ జగన్ పర్యటనపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని.. పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యమన్నారు. -
వారు దుండగులు కాదా?.. టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ల చేసిన ఒక ప్రకటనను అంతా స్వాగతించాలి. హైదరాబాద్ లో ఒక న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని వారు ఖండించారు. కూటమి పెద్దల భావజాలంలో మార్పు వచ్చి ఉంటే సంతోషించాలి. కాని వారు అన్ని విషయాలలో మాదిరి ఇక్కడ కూడా డబుల్ గేమ్ ఆడడం బాగోలేదని చెప్పాలి. చంద్రబాబు చేసిన ప్రకటనను గమనించండి. హైదరాబాద్ లో ఒక టీవీ చానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విద్వంసం సృష్టించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు,సమాజం దీనిని ఆమోదించదని అంటూ,ఆ ఛానల్ యాజమాన్యానికి ,సిబ్బందికి ఆయన సంఘీభావం తెలియచేశారు. 👉చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే అందరికి గుర్తుకు వస్తున్నది ఏపీలో ఉన్న పరిస్థితి గురించే. ఏపీలో తనకు నచ్చని మీడియాపై ప్రభుత్వం చేస్తున్న దాడి, ప్రత్యేకించి సాక్షి మీడియాపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు చూస్తున్న ఎవరికి అయినా చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించదు. తమకు మద్దతు ఇస్తే ఒక రకంగాను, లేకుంటే మరో రకంగాను టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది.👉ఈ మధ్య సాక్షి టీవీ డిబేట్ కు సంబందించి ఒక వివాదాన్ని సృష్టించి కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయించిన తీరు,ఆ తర్వాత కేసులు పెట్టడమే కాకుండా.. జర్నలిస్టులను అరెస్టు చేసిన వైనం, అక్కడితో ఆగకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీకి చెందినవారు చేసిన దాడులు,వీరంగం వేసి విధ్వంసం సాగించిన పద్దతి గురించి కూడా కూటమి నేతలు మాట్లాడి వాటిని ఖండించి ఉండాలి కదా!. పైగా అనని మాటలు అన్నట్లుగా, ఒక ప్రాంతానికి ఆపాదించి సాగించిన రచ్చ అందరిని ఆశ్చర్యపరచింది. సాక్షి సంస్థలపై దాడులకు పాల్పడినవారిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు లు చేయలేదు? అలా చేసినవారు దుండగులు కాదా?వారు టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?ప్రజాస్వామ్యంలో బెదిరింపులు ,దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చెబుతున్న చంద్రబాబుకు ఏపీ విషయంలో అదే సూత్రం వర్తించదా?.. దీనికి ఆయన ఏమి జవాబిస్తారు. నిత్యం సాక్షిపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, ఆ మీడియాను ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచన సాగించే ఆయన తనకు మద్దతు ఇచ్చే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రమే స్వేచ్చ ఉండాలని చెప్పడం సహేతుకమే అవుతుందా?. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.👉సాక్షి డిబేట్లో ఒక పదం అభ్యంతరకరం అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. దానిపై వివరణ కోరవచ్చు. కాని అసలు ఆ పదం పలకని జర్నలిస్టునే అరెస్టు చేశారే!. విచిత్రం ఏమిటంటే డిబేట్లో ఒక విశ్లేషకుడు ఒకసారి ఆ పదాన్ని ఉచ్చరిస్తే, తెలుగుదేశం మీడియా సంస్థలు వందల సార్లు ప్రచారం చేశాయి. అలాగే లక్షల పత్రికలలో దానిని యధాతధంగా ప్రచురించాయి. ఆ విశ్లేషకుడు మాట్లాడింది అభ్యంతరకర పదమే అనుకుంటే దానిని ఎల్లో మీడియా ప్రచారం చేయకూడదు కదా?. కాని ఎందుకు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. వారు చేసింది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా!, మరి వారిపై కేసులు పెట్టరా?దీనిపై ప్రభుత్వంకాని, పోలీసు కాని, న్యాయ వ్యవస్థకాని ఎందుకు స్పందించలేదంటే ఏమి చెబుతాం. హైదరాబాద్ లో దాడికి గురైన టీవీ చానల్ కొన్ని వీడియాలకు పెట్టిన తంబ్ నెయిల్ చాలా దారుణంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు. ఈ అంశాలను టీడీపీ, జనసేన పెద్దలు కనీసం ఖండించలేదు. అయినా ఆ సంస్థపై దాడి చేయాలని ఎవరం చెప్పం. చట్టప్రకారం పోవాల్సిందే. ఏపీలో సాక్షి మీడియా వివరణ ఇచ్చినా అన్యాయంగా దాడులు చేశారే!. సాక్షిపై దాడులు జరుగుతున్నప్పుడు , ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఇష్టారీతిన విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పుడు టీడీపీ మీడియా చంకలు గుద్దుకుంటూ మరింత రెచ్చిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలోప్రభుత్వం.. వాళ్లకు బంధించిన మీడియా కలిసి మరీ నానా బీభత్సం సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యం, బెదిరింపులు, మీడియాను కట్టడి చేయడం వంటి అంశాలు.. చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకదు!!.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రం అంతా గంజాయి కేంద్రం అయిపోయిందని చంద్రబాబు,ఇతర కూటమి నేతలుతీవ్ర విమర్శలు చేసేవారు. అంటే అప్పుడు ఏపీలో ఉన్నవారంతా గంజాయి తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నట్లు భావించాలా?. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు 30 వేల మంది మహిళలు ఏపీలో మిస్ అయిపోయారని ప్రచారం చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా?. అంతెందుకు తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఆరోపించినప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినలేదా?. అయినా ఎవరిపైన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని తమకు అధికారం ఉంది కదా అని విషయాన్ని వక్రీకరించి సాక్షిపై దాడి చేయడం ,కేసులు పెట్టి వేధించడం మాత్రం ప్రజాస్వామ్యబద్దం అని వారు భావిస్తున్నట్లా?. సాక్షిని మాత్రమే కట్టడి చేయాలన్నది వారి అభిమతమా?. అంతెందుకు.. సాక్షి టీవీ చానల్ ప్రజలలోకి వెళ్లరాదన్న ఉద్దేశంతో ఆయా నగరాలలో ,పట్టణాలలో కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి సాక్షి ప్రసారం కాకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మీడియా స్వేచ్చ గురించి నీతులు చెబితే ఎవరైనా నమ్ముతారా?.. చంద్రబాబు కు ఇది కొత్తేమి కాదు. 2014 టైమ్లో కూడా కూడా సాక్షితో పాటు మరికొన్ని చానళ్లపై కూడా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో నిషేధం పెట్టారు. అప్పట్లో కాపుల రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే,ఆ వార్తలు ప్రచారం కాకుండా ఎన్నిరకాల ఆటంకాలు కలిగించారో అందరికి తెలుసు. ఈసారి కూడా సాక్షి టీవీతో మరో రెండు చానళ్లపై కూడా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. ఇదీ చంద్రబాబుకు మీడియా స్వేచ్చపై ఉన్న విశ్వాసం. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్న సూత్రం బాగా వర్తిస్తుందా?ఇక పవన్, లోకేష్ లు కూడా టీవీ చానల్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రం మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదని వీరు భావిస్తున్నారన్నమాట.ఏపీలో జర్నలిస్టులను అరెస్టు చేయించి,అదేదో గొప్పపనిగా ఛాతి విరుచుకున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు గుండెలు బాదుకుంటున్నారు. దీనినే హిపోక్రసి అంటారు.అలా అని హైదరాబాద్ లో దాడి ఘటనను సమర్ధించడం లేదు.కాని ఏపీలో కూటమి నేతల తీరుతెన్నులు మాత్రం ఇలా రెండుకళ్ల సిద్దాంతంతో సాగుతుండడమే బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ వ్యాఖ్యల్లో అర్థం ఇదేనా ?.. సీఎం మార్పు ఖాయమేనా?
బెంగళూరులో తొక్కిసలాట ఘటన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టిందా?, కర్ణాటకలో సీఎంను మార్చాలా? అనేది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా చర్చిస్తున్న అంశం. మరొకవైపు తొక్కిసలాట ఘటన పేరుతో డీకే శివకుమార్ను సీఎం చేయడానికి రంగం సిద్ధమైందా? అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ హైకమాండ్ నుంచి ఎటువంటి ప్రకటనా నేరుగా రాకపోయినప్పటికీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటకలో సీఎంను మార్చబోతున్నారా? అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే డైరెక్ట్గా ఏమీ చెప్పలేకపోయారు. ఆయన నో అనే అవకాశం ఉన్నా కూడా ‘ అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ హైకమాండ్ అంటే తానే అనే విషయం మరిచిపోయి ఖర్గే ఇలా వ్యాఖ్యానించినప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఏదో జరుగబోతుందనే సంకేతాలిచ్చారు ఖర్గే. మీడియా అడిగిన దానికి.. ‘ఇప్పుడు కర్ణాటకలో సీఎంను మార్చాల్సిన అవసరం ఏమిటి?’ అని చెప్పకుండా, అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది అనడం త్వరలో ఏదో జరగబోతుందనే దాన్ని బలపరిచింది.డీకే శివకుమార్కు చాన్స్..? అక్కడ ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తప్పిస్తే, ఆ తర్వాత రేసులో ఉన్నది డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్కే అవకాశం దక్కుతుంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో డీకే శివకుమార్ సీఎం అనే ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యనే సీఎంను చేసింది. కర్ణాటకలో ఎటువంటి మార్పులు లేకుండా సీనియర్ అయిన సిద్ధరామయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పట్నుంచి డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య కాస్త దూరం పెరిగిందనేది జనాల్లో వినిపిస్తున్న మాట. అయితే సిద్ధరామయ్య కోసం తన చివరి శ్వాస వరకూ నిలబడతా అనే వ్యాఖ్య కూడా డీకే శివకుమార్ ఒకానొక సందర్భంలో చేసి తమ మధ్య ఏమీ విభేదాల్లేవని సంకేతాలిచ్చారు. ఈ ఏడాది శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే డీకే శివకుమార్ తనపై వచ్చిన ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఎవరు ఏమనుకున్నా తాను చివరి శ్వాస వరకూ కాంగ్రెస్లోనే ఉంటానని తేల్చి చెప్పారు.మరింత పటిష్టం చేసే దిశగా పావులు..!కర్ణాటకలో కాంగ్రెస్ను మరింత పటిష్టం చేసి.. బీజేపీకి ధీటుగా నిలబడాలంటే డీకే శివకుమార్ సీఎం పగ్గాలు అప్పజెప్పాలని గత కొద్దికాలంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఆలోచన చేసే దిశగా ముందుగా సాగుతున్నట్లు ఖర్గే వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ఉన్న సారాంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ందేళ్లు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలికావడాన్ని తట్టుకోలేకపోతున్నా. ఈ ఘటనతో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చింది’అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 14–15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. -
నేను స్త్రీ ద్వేషినా.. మీరు చేసిందేంటి?
నేను స్త్రీ ద్వేషినా? మరి ఆమె చేసిందేంటి? అంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత, ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఫైర్ అయ్యారు. ఆయన అంతలా ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రత్యర్థులపై కాదు.. సొంత పార్టీ మహిళా ఎంపీపైనే. ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన మహువా మొయిత్రాపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూ నోరు పారేసుకున్నారు. కళ్యాణ్ బెనర్జీ ఎందుకంత కోపంతో ఊగిపోయారంటే..?జూన్ 25న, సౌత్ కలకత్తా లా కాలేజీలో విద్యార్థిపై దుండగులు దారుణానికి పాల్పడిన ఘటనపై కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'స్నేహితురాలిని స్నేహితుడే చెరబడితే మేమేం చేయగలం. యువతులు ఎలాంటి వారితో తిరుగుతున్నారో గమనించుకోవాలి. బెంగాల్లో ప్రతి చోట మహిళలకు రక్షణ కల్పించడం సాధ్యం కాద'ని వ్యాఖ్యానించారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా మహువా మొయిత్రా ఖండించారు. 'భారతదేశంలో స్త్రీ ద్వేషం పార్టీలకు అతీతంగా ఉంటుంది. మిగతా పార్టీలతో టీఎంసీని వేరు చేసే విషయం ఏమిటంటే, ఈ అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా మేము ఖండిస్తామ'ని మొయిత్రా ఎక్స్లో పోస్ట్ చేశారు.మొయిత్రా వ్యాఖ్యలపై కళ్యాణ్ బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. 'ఆమె నన్ను మహిళా వ్యతిరేకి అంటుందా? ఆమె ఏమిటి? ఆమె ఏం చేసింది? ఆమె తన హనీమూన్ నుంచి తిరిగి వచ్చింది. ఆమె 40 సంవత్సరాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె నన్ను స్త్రీ ద్వేషి అంటుందా?' అని బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాతో మొయిత్రా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.చదవండి: ఖర్గేజీ.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉందా?మొయిత్రా వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించేలా ఉందని బెనర్జీ విమర్శించారు. కలిగంజ్ ఉప ఎన్నికల సమయంలో తనను ప్రచారం చేయనీయకుండా ఆమె అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడుతున్న ఆమె.. పార్టీలో మహిళా నాయకులను ఎదగనీయకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే మొయిత్రా, బెనర్జీ మధ్య విభేదాలు కొత్త కాదు. గతంలోనూ వీరిద్దరూ బహిరంగంగా పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. -
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై ఆ పార్టీ స్పందించింది. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదని.. రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు లేఖ ఇవ్వాలి. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నాం’’ అని బీజేపీ పేర్కొంది.కాగా, రాజాసింగ్ తీసుకున్న సంచలన నిర్ణయం.. తెలంగాణ బీజేపీలో కల్లోలం రేపుతోంది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాంచందర్రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా.. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా.. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు. -
రేపు వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో రేపు (మంగళవారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. రేపు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమవనున్నారు. ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొంటారు. వీరితో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
Raja Singh: ఆ గ్యాప్ కొనసాగుతూనే వచ్చింది..
రాజాసింగ్.. నిన్న మొన్నటి వరకూ బీజేపీలో ఓ సంచలనం. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేసిన నాయకుల జాబితాలో రాజాసింగ్ కచ్చితంగా ఉంటారు. అయితే పార్టీకి ఉన్నపళంగా రాజీనామా చేశారు రాజాసింగ్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించి నామినేషన్ వేయడానికి బీజేపీ కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్.. ఆపై కొద్ది సేపటికే పార్టీకి గుడ్ బై అంటూ ప్రకటించారు. ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ రాంచందర్రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా’ అని రాజాసింగ్ ప్రకటించారు. అసలు బీజేపీ అధిష్టానంతో రాజాసింగ్కు గ్యాప్ ఎలా ఏర్పడింది.. ఎక్కడ ఏర్పడింది అనే అంశాల్లో కొన్నింటిని పరిశీలిస్తే..ఆనాటి గ్యాప్.. కొనసాగుతూనే వచ్చింది..!రాజాసింగ్ అంటే బీజేపీ అధిష్టానానికి నమ్మకం. అది ఒకప్పుడు మాట. అది క్రమేపీ దూరం అయ్యింది. మూడేళ్ల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు రాజాసింగ్. 2022లో నుపూర్ శర్మ ఇస్లాం మత ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై ఆమెను బీజేపీ సస్పెండ్ చేసిన తర్వాత, రాజాసింగ్ ఆమెను సమర్థిస్తూ వీడియో విడుదల చేశారు. ఇది బీజేపీ అధిష్టానం వైఖరిని తప్పుబట్టినట్లయ్యింది. అధిష్టానాన్ని చాలెంజ్ చేసినట్లు ఉండటంతో రాజాసింగ్ను వివరణ ఇవ్వాలని కోరింది అధిష్టానం. ఈ క్రమంలోనే రాజాసింగ్ సస్పెన్షన్కు గురయ్యారు. 2022 ఆగస్టు 23వ తేదీన రాజాసింగ్ను బీజేపీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత 2024 అక్టోబర్ 22వ తేదీన రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరికింది రాజాసింగ్కు. అయితే అప్పట్నుంచి అధిష్టానంతో గ్యాప్ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా నడిచింది. అధిష్టానం రాజాసింగ్ను హైదరాబాద్ నుంచి పోటీ చేయించాలని చూసింది. ఇక్కడ రాజాసింగ్ మాత్రం ఎంపీగా విముఖత వ్యక్తం చేసిన కారణంగానే ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేశారనేది మరో చర్చ. సస్పెన్షన్ గురైన సందర్భంతో పాటు తరచూ వివాదాలు కూడా రాజాసింగ్-అధిష్టానం మద్య గ్యాప్కు కారణమైంది. ఇటీవల కాలంలో పార్టీ లైన్కు భిన్నంగా రాజాసింగ్ వ్యవహరించడంతో ఆయన్ను అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ప్రధానంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సైతం రాజాసింగ్ మద్దతు పలికారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్ధించారు. ఇవన్నీ కూడా అధిష్టానానికి కోపం తెప్పించాయి. రాజాసింగ్ రాజీనామా చేసే క్రమంలో అధిష్టానం పెద్దలు ఎవరూ కూడా ఆయన్ను బుజ్జగించే పని చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. ప్రధానంగా చూసుకుంటే 2022 నుంచే అధిష్టానంతో రాజాసింగ్కు సఖ్యత చెడిపోతూ వచ్చిందని, అదే ఇంతవరకూ తెచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. -
సంక్షేమానికి నిజమైన అర్థం.. వైఎస్ జగన్ పాలన: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ మైనారిటీ విభాగం ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అ«ధ్యక్షులతో పాటు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పట్టిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యంమన్నారు. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలేనని.. మన నాయకుడు వైఎస్ జగన్ శక్తి కూడా కార్యకర్తలేనని.. పార్టీ తన ప్రస్థానంలో అనేక రికార్డులు సృష్టించిందన్నారు.‘‘వైఎస్ జగన్ తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్ చేయడంతో పాటు, విద్య, వైద్యం వంటి కోర్ సెక్టార్స్ను ప్రతి గడపకు తీసుకెళ్ళారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు, ఏమేం చేయాలో ఆలోచించి, వాటిని అమలు చేశారు. సంక్షేమానికి నిజమైన అర్థం చెప్పిన పాలన మనది. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది’’ అని సజ్జల పేర్కొన్నారు.అడ్డుకుంటూ.. అరాచకం:మరో వైపు జగన్ ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా, స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇటీవల పలు ఆంక్షలతో జగన్ పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే, సాధ్యం కాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు. పొలీసులను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.అప్రకటిత ఎమర్జెన్సీ:కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ప్రశ్నించే గొంతులు నొక్కుతోంది. ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణితో పని చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపే తప్పుడు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతోంది. అయితే ఆ కేసులు ఎదుర్కొనే సత్తా మన నాయకుడికి ఉంది. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒక్క పథకం కూడా అమలు చేయకున్నా, లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ.. మైనారిటీ సంక్షేమం:ఎన్నికలు ఎప్పుడొచ్చినా, మనం ధీటుగా ఎదుర్కోగలం. మనం సంస్థాగతంగా ఇంకా బలపడాలి. పార్టీ నెట్వర్క్ అనేది కేంద్ర కార్యాలయం నుంచి గ్రామస్థాయి వరకు వెళ్ళాలి. పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తయితే 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులవుతారు. అప్పుడు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, రాష్ట్రానికి చేస్తున్న నష్టాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయగలం. అలాగే మన పార్టీపై అదే పనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ధీటుగా ఎదుర్కోగలగుతాం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం గతంలో ఏనాడూ లేని విధంగా గత ప్రభుత్వంలో కొనసాగింది. మన పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షాన నిలబడింది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మైనారిటీలంతా మన వెంటే ఉండేలా, మీరంతా కృషి చేయాలి. చొరవ చూపాలి. ఇంకా వైఎస్సార్సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ముస్లింలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సజ్జల.. పార్టీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమం కోరుకుంటుందని స్పష్టం చేశారు. -
చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారని నిన్నటి పొలిట్ బ్యూరో సమావేశానికి 56 మంది గైర్హాజరు అయ్యారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ చేస్తూ, మద్యం కమిషన్లు దండుకుంటూ వారంతా బిజీగా ఉన్నారు. అబద్దాలను నిజం చేయటానికి ఎల్లోమీడియా ద్వారా విషం చిమ్ముతున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.2014-2019 మధ్య జనాన్ని మోసం చేసినందునే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. రైతు రుణమాఫీ సహా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే జనం ఓడించారు. 2024లో గెలిచాక కూడా మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నారు. జగన్ ఖజానాని ఖాళీ చేశారనీ అందుకే సంక్షేమాలను అమలు చేయలేదని అబద్దాలు మొదలు పెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ లోకేష్ కమీషన్లు తీసుకుని టెండర్లు పిలుస్తున్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ ఒక్క ఏడాదే దుర్మార్గపు పాలన చేశారు. రానున్న రోజుల్లో ఇంకా పరమ దుర్మార్గపు పాలన చేస్తారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కుప్పంలోనే ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే ఏం చేశారు?. డైలాగులు చెప్పినంత సీరియస్గా పరిపాలన చేయటం లేదు. లోకేష్ కు సిగ్గు ఉంటే టెన్త్ మూల్యాంకనం తప్పిదాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లోకేష్కు అలాంటి సిగ్గు లేదు. చంద్రబాబు చేతిలో పాలన లేదు.. అంతా లోకేషే. ఇన్నేసి దుర్మార్గాలు చేస్తూ సుపరిపాలన అని ఎలా చెప్తారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘జగన్ అంటే చంద్రబాబుకు విపరీతమైన ఈర్ష్య, భయం. కూటమి ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని ఎల్లో మీడియానే చెప్తోంది. ఎమ్మెల్యేలేమో చంద్రబాబు గ్రాఫే పడిపోయిందని చెప్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవటం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికే పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఎండీయూ వాహనాలు, వాలంటీర్లను తొలగించి సామాన్యులను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు మాటలను ఆయన పార్టీ వారే వినిపించుకోవటం లేదు. చంద్రబాబుకు తెలియకుండా 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకి వెళ్లిపోయారంటే ఆయనకు పార్టీ మీద ఏమాత్రం పట్టు లేదని తేలిపోయింది..జగన్ నెల్లూరు వెళితే టీడీపీ వారికి ఏంటి ఇబ్బంది?. హెలికాఫ్టర్ కాకపోతే కారులోనో లేదంటే నడుచుకుంటూ అయినా వెళ్తారు. జగన్కు 40 నుండి 60 శాతం ఆదరణ పెరిగింది. ఇది టీడీపీ సర్వేలోనే తేలిందని చంద్రబాబు, లోకేష్, పవన్ మాటలు వింటుంటేనే అర్థం అయింది. అందుకే జగన్ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకే ఊడిగం చేస్తానని పవన్ అంటున్నారు. వ్యతిరేకత పెరిగితే కూటమికైనా ఓటమి తప్పదు. జగన్ని కట్టడి చేయటానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం నీచ సంస్కృతి’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
‘ఖర్గేజీ.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉందా?.. మీరు హైకమాండ్ కాదా?
బెంగళూరు: కాంగ్రెస్లో హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకే కట్టుబడి ఉండాలనేది ఎప్పట్నుంచో వస్తుంది. రాష్ట్రాల్లో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలొ అది హైకమాండ్ ఫైనల్ చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర సీఎంలు కూడా హైకమాండ్ మాటకు ఎదురుచెప్పకూడదు. ఈ తరహా పరిణామాలను తరుచూ చూస్తూనే ఉన్నాం. మరి హైకమాండ్ అంటే ఎవరు?, ఏఐసీసీ అధ్యక్షుడే కాంగ్రెస్ హైకమాండ్ కదా.. మరి పార్టీ చీఫ్ అయిన మల్లిఖార్జున ఖర్గే నోట నుంచే హైకమాండ్ చూసుకుంటుంది అనే మాట వస్తే ఏమనాలి?ఇప్పుడు అదే జరిగింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే.. ‘హైకమాండ్ చేతుల్లో ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లొ ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా> సీఎంను మార్చబోతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే ఒక్క ముక్కలో తెగ్గొట్టి చెప్పేశారు. అది హైకమాండ్ చేతుల్లో ఉంది అంటూ దాటవేత ధోరణి అవలంభించారు. ఇది బీజేపీకి మంచి టానిక్లా దొరికింది. అటు కాంగ్రెస్ను, ఇటు ఖర్గేపై విమర్శలు చేయడానికి అవకాశం దొరికినట్లయ్యింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సెటైర్లతో విరుచుపడ్డారు. ‘ ఇక్కడ హైకమాండ్ అంటే ఎవరు? మీరు కాదా?, కాంగ్రెస్ చీఫ్గా ఉన్న మీరు హైకమాండ్ కాదా?, మరి ఇంకా హైకమాండ్ ఎవరు? అని తేజస్వి సూర్య పంచ్లు వేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కనపడదు.. అది మనకు కనిపించదు.. వినిపించని దెయ్యంలా ఉంటుందేమో. మనం మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఉందని ఫీలవుతూ ఉండాలి’ అని సెటైరికల్ పంచ్లు విసిరారు.The Congress High Command is like a ghost. It is unseen, unheard, but always felt. Even the Congress President, who people thought is the high command, whispers its name and says it’s not him. So eerie! https://t.co/GpcdHWQbSs— Tejasvi Surya (@Tejasvi_Surya) June 30, 2025 -
బదిలీల పేరుతో ఉద్యోగులకు కూటమి సర్కార్ వేధింపులు: చంద్రశేఖర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: బదిలీల పేరుతో కూటమి సర్కార్ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీలను సైతం కూటమి ఎమ్మెల్యేలు తమ అక్రమార్జనకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్న దారుణమైన పరిస్థితి ఏపీలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా గ్రామస్థాయికి పాలనను అందించేందుకు వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేస్తూ, అందులోని సిబ్బంది సంఖ్యను కుట్రపూరితంగా తగ్గించివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ఎవరు డబ్బులిస్తే వారికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వేగంగా బదిలీలు జరిగిపోతున్నాయి. అనధికారికంగా బదిలీలకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను తప్పనిసరి చేస్తూ రాజకీయ జోక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దాదాపు 95 శాతం బదిలీలు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 1.40 లక్షల మంది ఉద్యోగుల బదిలీల కోసం జీవోఎంస్ నెంబర్ 5 ని విడుదల చేశారు. వైయస్సార్సీపీ హయాంలో చివరి ఏడాది నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీలు జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చాక నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బదిలీల పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారు.సచివాలయ వ్యవస్థపై కక్షసాధింపువైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థకు మంచి పేరు రావడంతో దాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఇప్పుడు సచివాలయాల్లో బదిలీల పేరుతో ఉద్యోగులను వేరే మండలాలకు బలవంతంగా పంపించి వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఒక రూల్, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లో పనిచేసేవారికి వేరే రూల్ వర్తింపజేస్తున్నారు. బదిలీల పేరుతో చిన్నస్థాయి ఉద్యోగులను డబ్బుల కోసం ఒత్తిడికి గురిచేస్తున్నారు. ప్రభుత్వమే ఉద్యోగుల చేత తప్పులు చేయించే కార్యక్రమానిక ఉసిగొల్పుతున్నట్టుంది.పనివేళల్లోనే బదిలీలు పూర్తిచేయాలిభర్త చనిపోయి వితంతువులుగా ఉన్న ఉద్యోగులకు, కేన్సర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడేవారికి, స్పౌస్ కేస్ల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నా, వారి అభ్యర్థనలను పట్టించుకోవడం లేదు. గ్రామ సచివాలయాల బదిలీలకు జూన్ 30తో గడువు ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని వైయస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో 12 రోజుల కిందట డెలివరీ అయిన ఒక బాలింతరాలు, ఒక మహిళా ఉద్యోగిని కౌన్సిలింగ్ పేరుతో ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకూ కుర్చోబెట్టి వేధించడంతో ఆమె అస్వస్థతకు గురై ఇంటికెళుతూ మార్గమధ్యలో చనిపోయింది. ఆమె కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? నిబంధనల ప్రకారమే ఆఫీసు వేళల్లోనే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలి. రాత్రింబవళ్లు తిప్పించుకుని వేధించడం ఆపాలి. -
‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.రాంచందర్రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే వచ్చా. నాకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజాసింగ్ మా పార్టీ సింబల్ మీద గెలిచాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదని, సస్పెండ్ చేయాలని కిషన్రెడ్డే స్పీకర్ను కోరాలి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు. -
అవకాశవాదులకు బైబై.. సొంత కార్యకర్తలకు జైజై
భారతీయ జనతా పార్టీ తెలుగువ రాష్ట్రాల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించే విషయంలో పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని స్వచ్ఛమైన సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే పట్టంగట్టింది. ఈ విషయంలో పైరవీలు రికమండేషన్లకు తావు లేకుండా నికార్సైన బిజెపి కార్యకర్తలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణకు ఎన్ రామచంద్రరావుని అధ్యక్షునిగా నియమించగా ఆంధ్ర ప్రదేశ్కు పివిఎన్ మాధవ్ ను సారధిగా నియమించారు. ఈ నియామకం విషయంలో పార్టీ ఢిల్లీ పెద్దలు పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి అవకాశవాదాన్ని కేంద్రంలోని బిజెపి పెద్దలు క్షమించే ఉద్దేశంలో లేకపోబట్టి ఆవిన్ను పక్కకు తప్పించారు. వాస్తవానికి ఆవిడ టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమార్తె అయినప్పటికీ కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎంపీగా కేంద్రంలో మంత్రిగా పనిచేశారు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో బిజెపిలో చేరారు. ఇక్కడ ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఆమె మనసు ఆలోచనలు అన్నీ కూడా ఆమె సామాజిక వర్గం వ్యాపార వర్గంతోబాటు ముఖ్యంగా తెలుగుదేశం అనుకూలంగానే ఉంటూ వచ్చారు తప్ప బీజేపీకి ఆమె ఏనాడు ఉపయోగపడలేదు. బిజెపి పేరు చెప్పుకొని ఆమె తన సొంత పరపతిని పెంచుకొని రాజకీయంగా ఎదిగారు తప్ప పార్టీని ఆమె ఎదగనివ్వలేదు. ఏదైతేనేం మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటినుంచి అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పురందేశ్వరిని తప్పించాలని హార్డ్ కోర్ బిజెపి కార్యకర్తలు కోరుతూ వస్తున్నారు. పురందేశ్వరి ఎంత సేపు తన కుటుంబ పార్టీ ఆయన చంద్రబాబుకు తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలే తీసుకున్నారు తప్ప బిజెపి బలోపేతానికి వీసమెత్తు కృషి కూడా చేయలేదు. ఆమె వైఖరిని మొదటి నుంచి గమనిస్తూ వస్తున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఆమెను పక్కకు తప్పించి జన్మతః బిజెపి కార్యకర్త ఆయన మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.విశాఖనగరానికి చెందిన పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ టర్మ్ పదవి ముగిసాక 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. వాస్తవానికి మాధవ తండ్రి పీవీ చలపతిరావు సీనియర్ బిజెపి నాయకుడు. అద్వానీ వాజ్పేయి వంటి దిగ్గజాలతో కలిసి నడిచిన వాడు. చలపతిరావు అంటే మోడీ ఇతర బిజెపి పెద్ద నాయకులకు కూడా అపారమైన గౌరవం. నికార్సైన చలపతిరావు కుటుంబానికి న్యాయం చేయాలి అనే భావనతో ఉన్న ఢిల్లీ పెద్దలు ఆయన కుమారుడు మాధవ్ కు ఇప్పుడు బిజెపి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. ఈ నియామకం తెలుగుదేశంతోపాటు అవకాశవాద రాజకీయాలు నేరిపే పురందేశ్వరికి షాకింగ్ అని చెప్పాలి.పార్టీ ఆలోచనలు పార్టీ గీత దాటి అడుగు వేయని నిబద్ధత కలిగిన మాధవ్ ఏ విషయంలోనూ తెలుగుదేశానికి తలవంచకుండా పార్టీ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారు అని బిజెపి కార్యకర్తలు నమ్ముతున్నారు. అన్నిటికి మించి చంద్రబాబు బంధువు అయిన పురందేశ్వరి కబ్జా నుంచి బిజెపిని విడిపించడం అతి పెద్ద అడుగు అని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. బిజెపిని చంద్రబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాలు పరపతి పెంచుకున్న పురందేశ్వరికి ఈ నిర్ణయం చేదుగానే ఉంటుంది కానీ నిజమైన బిజెపి కార్యకర్తలకు మాధవ నియామకం తీపి కబురు అని చెప్పాలి.-సిమ్మాదిరప్పన్న -
‘బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఫిక్సింగ్లో భాగమే’
ఢిల్లీ : తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం బీజేపీ-బీఆర్ఎస్ల మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి. బీజేపీ-బీఆర్ఎస్లు మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నాయనే విషయం దీని ద్వారా నిరూపితమైందంటూ సెటైర్లు వేశారు. ఈరోజు(సోమవారం, జూన్ 30) ఢిల్లీ నుంచి మాట్లాడిన చామల.. కేసీఆర్ గెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, అటువంటప్పుడు దోచుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు కిరణ్కుమార్రెడ్డి‘మీరు(కేంద్రం) ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుపుకోసం బీఆర్ఎస్ చేసింది అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ఆ రెండు పార్టీలు అదే రూట్ మ్యాచ్తో ముందుకు వెళ్లనున్నాయి. హైదరాబాద్లో మెట్రోకు పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్రెడ్డి.. తెలంగాణ, హైదరాబాద్ సమస్యల విషయంలో నోరు విప్పరు. హైదరాబాద్ నగర ప్రజకు కిషన్రెడ్డి చేసిందేమిటి?, ఈ ఏడాది కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. హైదరాబాద్ మెట్రో కోసం ఐదారుసార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వచ్చారు. మనం కట్టిన ట్యాక్సుల్లో మన వాటా వెనక్కి రావడం లేదు. సీఎం రేవంత్ తన ప్రయత్నం తాను చేస్తున్నారు.. కిషన్రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలి’ అని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సూచించారు. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే.. -
జేసీ వర్గీయుల దాష్టీకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు రామకృష్ణ, రేవతి ఇళ్లపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త రామకృష్ణ కిరాణా షాపును జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతు ఇవ్వొద్దని జేసీ నిన్న వార్నింగ్ ఇచ్చారు. మద్దతు ఇచ్చిన వారిపై జేసీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు.కాగా, ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యానించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’ అంటూ జేసీ వ్యాఖ్యానించారు. -
హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హైడ్రాపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తోందని.. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.హైదరాబాద్, సాక్షి: మాదాపూర్ సున్నం చెరువు దగ్గర హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం గరం అయ్యారు. చెరువును బఫర్ జోన్ చేయకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ హైడ్రా అధికారులపై మండిపడ్డారాయన. ‘‘చెరువులు కబ్జాకు గురికాకుండా అభివృద్ధి చేయాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఆలోచన. కానీ, హైడ్రా తీరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సున్నం చెరువు బఫర్ జోన్ చేయకుండా కూల్చివేతలు చేపట్టారు. ఈ అంశంపై సీఎం రేవంత్ను కలుస్తా’’ అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఇదిలా ఉంటే.. సున్నం చెరువు హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పలువురు ప్రొక్లెయిన్కు అడ్డం పడి హైడ్రా డౌన్ డౌన్.. హైడ్రా కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించారు. -
పాశమైలారంలో ఇది మూడో ఘటన: హరీష్రావు
పాశమైలారం ఘటన ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బాధితులకు భారీగా పరిహారం అందించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై మాజీ మంత్రి హరీష్రావు స్పందించారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారాయన. సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాశమైలారంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఇది మూడో ఘటన. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలి. ఎంత మంది చనిపోయారో కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. గాయపడిన వాళ్లకు రూ. 50 లక్షలు అందించాలి’’ అని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. గాయపడ్డ 26 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. వాళ్లకు మెరుగైన వైద్యం అందాలి. అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి అని హరీష్ రావు కోరారు. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా చాలా ప్రాంతం కుప్పకూలిపోగా.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
ఆ నలుగురిపైనే.. బాబు ఫోకస్..!
ప్రజాప్రతినిధుల పనితీరుపై టీడీపీ అధిష్టానం చేయించిన ఐవీఆర్ఎస్ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం.. గతం కన్నా మిన్నగా పాలన సాగిస్తున్నాం అని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సర్వే ఫలితాలు షాక్కు గురి చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధ్వానపు పనితీరుతో ప్రజాప్రతినిధులు ఆదరణ కోల్పోయిన విషయం స్పష్టమైంది. సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రజాప్రతినిధులు ఏడాదికే ప్రజలకు బేజారయ్యారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఏడాది పాలనలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పనితీరుపై టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) సర్వే చేపట్టింది. ఏ ప్రభుత్వానికైనా కనీసం మూడేళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏడాదికే ప్రజలు విసుగు చెందడం గమనార్హం. ఆ నలుగురిపైనే ఎక్కువగా.. జిల్లాలో సగం మంది ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్వే చేపట్టింది. పుట్టపర్తిలో పల్లె సింధూరరెడ్డి బదులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పెత్తనం చెలాయిస్తుంటారు. మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బదులు మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామిదే హవా సాగుతోంది. పెనుకొండలో మంత్రి సవిత బదులు ఆమె భర్త వెంకటేశ్వర్లు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎంపీగా పార్లమెంటు వ్యాప్తంగా పర్యటించాల్సిన బీకే పార్థసారథి పెనుకొండ నియోజకవర్గంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. దీంతో ఆ నలుగురిపై ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అడ్రెస్ లేకున్నా.. అడగరా? సీఎం చంద్రబాబు బావమరిది, సినీనటుడు నందమూరి బాలకృష్ణ చుట్టపుచూపుగా హిందూపురం నియోజకవర్గానికి వస్తుంటారు. ఏ మండలంలో ఏ నాయకుడు ఉన్నాడో కూడా గుర్తించలేరని చెబుతుంటారు. అంతేకాకుండా తన పీఏలు హిందూపురం వ్యాప్తంగా దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సీఎంకు బావమరిది కావడంతో ఆయన పనితీరుపై ఎలాంటి సర్వేలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. అరాచకాలను అడ్డుకోరా? ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తోన్న రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో అరాచకాలు వెలుగు చూశాయి. ఆమె పనితీరుపై ఎలాంటి సర్వే చేయకపోవడంపై సొంత పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి రేగింది. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు వెలుగు చూసినా పరిటాల కుటుంబానికి అధిష్టానం నుంచి ఎలాంటి హెచ్చరికలూ రాలేదని కూటమి నేతలు వాపోతున్నారు. కదిరిలో వన్మ్యాన్ షో కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వన్మ్యాన్ షో చేస్తున్నారు. కిందిస్థాయి నాయకులను ఎదగనీయకుండా.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన నాయకులను దగ్గరకు కూడా రానీయడం లేదని వాపోతున్నారు. అయినా అధిష్టానం వద్ద మంచి మార్కులు ఎలా వచ్చాయని నాయకులు ఆలోచనలో పడ్డారు. జిల్లా కేంద్రానికి రాని మంత్రి శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తికి ఓ మంత్రి రావడమే లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒకట్రెండు సార్లు మినహా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే వ్యవహారం నచ్చలేదా? లేక అధికారులు తనకు నచ్చిన వారు లేరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీ బీజేపీ కొత్త బాస్గా PVN మాధవ్
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వైపు మొగ్గు చూపించింది అధిష్టానం. దీంతో ఈ మధ్యాహ్నాం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఇవాళ నామినేషన్స్ జరుగుతున్నాయి. అంతకు ముందు అధిష్టానం ఏకగ్రీవంగా పీవీఎన్ మాధవ్ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సంప్రదాయబద్దంగా జరగనున్న ప్రక్రియలో భాగంగా.. సోము వీర్రాజు, జీవీఎల్తో కలిసి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం మాధవ్ పేరును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పీవీఎన్ మాధవ్.. పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలిలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గానూ ఆయన వ్యవహరించారు. ఆయన పదవీకాలం 2019 మార్చి 30 నుండి 2025 మార్చి 29 వరకు కొనసాగింది. అయితే..ఈ మధ్యలో.. 2023లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయ జీవితానికి తోడు సామాజిక కార్యక్రమాల్లోనూ మాధవ్ చురుకుగా పాల్గొంటారు. 2024లో విశాఖపట్నంలో జరిగిన "ఆర్గానిక్ మేళా"ను నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. -
బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. బీజేపీ అధ్యక్షుడి నియామకంపై కాషాయ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్ను టార్గెట్ చేసి రాజాసింగ్ విమర్శలు గుప్పించారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును అధిష్టానం ఖరారు చేసింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మాట్లాడుతూ..‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాలి. అంతేకానీ, పార్టీలో మావాడు, మీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేసి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ వీడియోలో రాజాసింగ్.. ‘నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకో అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా. నన్ను నియమిస్తే.. పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తా. గోరక్షణకు పాటుపడే కార్యకర్తలకు రక్షణగా నిలబడతా. బీజేపీ అవసరాన్ని గడపగడపకు చాటిచెబుతా. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు. వీఐపీలా ఉండే వారు కాకుండా.. హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తినే నియమిస్తే బాగుంటుంది. రాజాసింగ్ అధ్యక్షుడు కావొద్దని అడ్డుకునే ఒక బృందం పనిచేస్తోంది’ అంటూ ఆరోపణలు చేశారు. -
బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే సస్పెన్స్కు తెరపడినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం ఉదయం హైకమాండ్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే.. అందరి సమ్మతితో ఎన్నిక జరిపే విధంగా హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.మరోవైపు.. తెలంగాణలో బీజేపీలోని కీలక నేతలకు హైకమాండ్ నుంచి ఫోన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు అధికారికంగా అధ్యక్ష అభ్యర్థికి సమాచారం ఇస్తామన్న హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అందరూ అందుబాటులో ఉండాలంటూ పలువురు నేతలకు సమాచారం ఇచ్చారు. దీంతో, సదరు నేతలంతా 11 గంటలకు వచ్చే కాల్ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది.అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. -
కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్!
సాక్షి, వరంగల్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి రాజకీయ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరంగల్ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి తరుణంలో కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.తాజాగా వరంగల్లో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొండా మురళి మాట్లాడుతూ..‘గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చుపెట్టి విజయం సాధించాం. నాకు 500 ఎకరాల భూమి ఉంది.. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే నా పోటీ ఉంటుంది. వాసవి కన్యక పరమేశ్వరీ సాక్షిగా చెబుతున్నా నాకు ఎవరి పైసా అవసరం లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. అలాగే, నేను ఎవరికీ భయపడను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్లో కొండా దంపతుల రాజకీయంపై ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన శనివారం గాంధీభవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీభవన్కు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు.అనంతరం కొండా మురళి మాట్లాడుతూ.. ‘‘నా వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చాను. కాంగ్రెస్ నేతలంటే నాకు గౌరవం ఉంది. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవద్దు. నేను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరాను. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావాలి. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన మా అందరిలో ఉంది’’ అని పేర్కొన్నారు. -
నై.. తెలంగాణ అన్న వ్యక్తి సీఎం గద్దెనెక్కారు: హరీశ్రావు
అమరచింత: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో ‘నై తెలంగాణ’అన్న వ్యక్తి, నేడు తెలంగాణ సీఎంగా గద్దెనెక్కి ఇక్కడి వనరులను ఆంధ్రకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, తన పాటల తూటాలతో రేవంత్ను అక్కడి నుంచి తరిమికొట్టిన ఘనత సాయిచంద్కే దక్కిందన్నారు.అలాంటి సాయి మన మధ్య లేకపోవడంతోనే ఈనాడు నై తెలంగాణ అన్న వ్యక్తులు రాజ్యమేలుతు న్నారని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రతి తెలంగాణ వాది అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. కేసీఆర్ను నామరూపాలు లేకుండా చేస్తా అని ప్రగల్భాలు పలుకుతు న్న సీఎం రేవంత్రెడ్డి.. కేసీఆర్ ఒక శక్తి అనే విషయాన్ని మరచిపోతున్నార న్నారు. ఆసరా పెన్షన్ల పెంపు ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ యెండల లక్ష్మీనారాయణ ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకునేవారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు పార్టీ పెద్దలు ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయ కత్వానికి దిశానిర్దేశం చేశారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే..అందరి సమ్మతితో ఎన్నిక జరిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియలో అందరి సమ్మతితో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేసేలా క్షేత్రస్థాయి నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నామినేషన్ వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నామినేషన్ పరిశీలన నిర్వహిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే... విత్డ్రాకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియంతా నామమాత్రమేనని పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలను కలిసి అవకాశం కల్పించాలంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయి నాయకత్వంతో సమాలోచనలు చేసి అభిప్రాయాలను సైతం స్వీకరించినట్టు తెలిసింది. అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తారు.నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పోటీలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు పేరు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి అధ్యక్ష స్థానాన్ని బీసీకే ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే ప్రచారముంది. -
కాంగ్రెస్కు ఏటీఎం: అమిత్షా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. రేవంత్రెడ్డి సర్కార్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వానికి ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సింగరేణి నియామకాల వంటి వాటి ద్వారా రాష్ట్రాన్ని భారీగా లూటీ చేసి, ఏటీఎంలా మార్చి దోచేసుకుందని ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి అమిత్షా ప్రారంభించారు. పసుపు రైతులతో మాట్లాడారు. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించారు. రైతు మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.అధికారం మారినా అవినీతి మారలేదు‘రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ అవినీతి మారలేదు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి. ఆపరేషన్ సిందూర్కు ఆధారాలు చూపించాలంటూ రాహుల్బాబా ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పాకిస్తాన్కు భారత్ తడాఖా ఏంటో చూపించింది. పదేళ్లలో మూడుసార్లు ఆ దేశంపై దాడి చేసింది. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. యూరి, పుల్వామా, పహల్గామ్ దాడులకు ధీటైన బదులు ఇచ్చాం. ఆపరేష¯న్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి దాడి చేశాం. అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టింది. కానీ గతంలో కాంగ్రెస్ సర్కార్.. పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది..’ అని అమిత్షా విమర్శించారు. 2026 మార్చిలోగా నక్సల్స్ ఏరివేత‘దేశ భద్రతను మోదీ ప్రభుత్వం పటిష్టం చేçస్తోంది. దేశంలో అశాంతికి కారణమైన నక్సల్స్ ఏరివేతకు అపరేషన్ కగార్ చేపట్టాం. (ఆపరేషన్ కగార్ చేయాలా.. వద్దా అని సభికులను ప్రశ్నించారు) దశాబ్దాలుగా నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. లొంగిపోవాలని గతంలోనే హెచ్చరించినా లొంగిపోలేదు. అందుకే కగార్ చేపట్టాం. 2026 మార్చిలోగా దేశంలో నక్సల్స్ లేకుండా చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి..’ అని కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. పసుపు పంటకు రాజధానిగా ఇందూరు‘తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సంప్రదాయాల్లో, ఔషధాల తయారీలో వినియోగించే పసుపు పంటను నిజామాబాద్ జిల్లా రైతాంగం అధికంగా సాగు చేస్తోంది. అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్లో పసుపు బోర్డును నెలకొల్పారు. ఇప్పుడు నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని నగరంగా మారింది. నిజామాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా లాభాలు సమకూరడం లేదు. ప్రస్తుతం బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో క్వింటాలుకు అదనంగా కనీసం రూ.7 వేల వరకు ఎక్కువ ధర దక్కుతుంది. ఎగుమతులు భారీగా పెరిగితే ధర కూడా భారీగా పెరిగిపోతుంది. పసుపు బోర్డు ద్వారా రైతులకు నాణ్యమైన పంటను సాగు చేసేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు దళారుల ప్రమేయం లేకుండా చేయడం జరుగుతుంది. 2030 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతోంది..’ అని అమిత్షా వెల్లడించారు.స్థానిక రైతుల పోరాటం ఫలించింది: తుమ్మలతెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయిందని అన్నారు. బోర్డు ద్వారా అధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతుల వంటి వసతులతో పసుపు రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తోందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పారు. బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి, అమిత్షాకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
‘నేను కూడా అధ్యక్ష పదవి అడగాలనుకుంటున్నా’
హైదరాబాద్: మరో రెండు రోజుల్లో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రేపు(సోమవారం, జూన్ 30వ తేదీ) నామినేషన్ ప్రక్రియ ఉండబోతుందని, ఎవరికి వారే తానే ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నారని రాజాసింగ్ అన్నారు. తనకు అనేక మంది కార్యకర్తలు ఫోన్లు, మెసేజ్లు చేస్తున్నారన్నారు. మనం ఎందుకు ప్రెసిడెంట్గా పోటీ చేయకూడదని చాలా మంది అడుగుతున్నారన్నారు. అందుకే తాను కూడా అధ్యక్ష పదవి అడగాలని అనుకుంటున్నానని తెలిపారు. చాలా మంది కార్యకర్తల మనస్సులో ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలో అనుకునే విషయాన్ని రాజాసింగ్ పేర్కొన్నారు‘బీజేపీకి వీఐపీ లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఉండకూడదు. కార్యకర్తలు అన్న అని పిలిచే ప్రజల మనిషి అయిన వారు ప్రెసిడెంట్ గా ఉండాలి. నేను ప్రెసిడెంట్ అయితే గోరక్ష కోసం ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేస్తా. బీజేపీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అండగా ఉండేలా ఏర్పాట్లు చేస్తా.. నేరుగా కలిసే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్టైల్ లో ముందకు వెళ్తాం. యోగి పేరు వింటే దొంగలు, గూండాలు, రౌడీలు యూపీ వదలి వేరే రాష్ట్రానికి పారిపోతున్నారు. ఆ సిస్టమ్ ను తెలంగాణలో అమలు చేస్తాం. రాజాసింగ్ ప్రెసిడెంట్ కావాలి అనుకునే వాళ్లు నా పేరును కేంద్ర నాయకులకు చెప్పండి’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి... మోసపు మహారాజు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సల్ రాష్ట్ర అధ్యక్షడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మోసపూరిత, దగాకోరు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబన్నారు.తనకున్న మీడియా బలంతో లేనిది ఉన్నటల చూపించడంలో సమర్ధడు చంద్రబాబు అంటూ విమర్శించారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని కబ్జా చేసి.. నందమూరి వారసులను తొక్కేశారని, చంద్రబాబు ఓ కబ్జా నాయకుడని ఆరోపించారు. ‘ చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి...మోసపు మహారాజు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అబద్ధాలతోనే గడిపేశాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను పవిత్రగ్రంధంగా భావించిన వ్యక్తి జగన్. ఇచ్చిన ప్రతీ హామీని జగన్ నెరవేర్చారు. ప్రజలను వంచించి ..అబద్ధాలతో ఓట్లను కొల్లగొట్టడంలో చంద్రబాబు పీహెచ్.డీ చేశాడు. ఏం చెప్పుకుని తొలి అడుగు...ఇంటింటికీ తెలుగుదేశం చేపడతారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబు మురికి మాటలు మానుకోవాలి. 24 గంటలూ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి సిగ్గులేదా మీకు. వివేకానందరెడ్డి హత్య ఎవరి హయాంలో జరిగింది...ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు?, వివేకా కేసులో ఎఫ్ఐఆర్ లో ఏముందో..ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీకు తెలియదా?, మీ ప్రభుత్వం వచ్చి ఏడాదైంది కదా...ఎందుకు సునీతకు న్యాయం చేయలేకపోయారు. కోడికత్తి కేసు అని అవహేళన చేస్తున్నారు. కోడికత్తి ఘటన జరిగింది నీ హయాంలోనే కదా?, ఆ కేసును ఏడాదైనా ఎందుకు నువ్వు పట్టించుకోలేదు. 40 ఏళ్ల అనుభవం, హైటెక్ సీఎం అని చెప్పుకునే నువ్వెందుకు పరిశీలించలేకపోయావ్?, జగన్ సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో రాయితో దాడి జరిగింది నిజంకాదా?, ఆ ఘటన పై ఎఫ్ఐఆర్ నమోదైంది నిజం కాదా ... ఆ దోషుల సంగతి నువ్వే చూడు. డ్రామా ఆడించారో..నీ ఉపన్యాసాలతో ఆవేశానికి గురై రాయివేశాడో తేల్చు. సత్తెనపల్లి జగన్ పర్యటనలో గుర్తుతెలియని కారు ఢీకొట్టిందని మీ ఎస్పీనే చెప్పాడు. జగన్ పర్యటలను అడ్డుకోవడానికి ఏఐ టెక్నాలజీతో దొంగవీడియోను సృష్టించారు. జగన్ సత్తెనపల్లి పర్యటన పై బురదజల్లాలని చూస్తున్నారు. పొదిలి , సత్తెనపల్లి పర్యటలను చూసి చంద్రబాబు అండ్ కోకు చెమటలు పడుతున్నాయి. ఏడాదికాలంలోనే ఉప్పెనలా వ్యతిరేకత రావడంతో నేరారోపణలు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడా...చంపేశారా తేల్చండి. మీ హయాంలోనే కదా పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు...ఎందుకు ఈరోజు వరకూ తేల్చలేకపోయారు. క్రిస్టియన్ సమాజాన్ని దారుణంగా అవమానించింది మీరు కాదా?, ఈరోజుకీ ప్రవీణ్ కుటుంబాన్ని బయటకు రాకుండా చేస్తుంది మీరుకాదా?, తిరుపతి లడ్డూ వివాదం సృష్టించింది ఎవరు?, దేవదేవుడిని అవమాన పరిచింది మీరు కాదా?, సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగజార్చింది నువ్వుకాదా చంద్రబాబు’ అని ప్రశ్నించారు. టీజే సుధాకర్ ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు వెంకటేశ్వరస్వామితో ఆడుకున్నావ్ఈ పాపం నిన్ను ...నీ పిల్లలను ..వారి తరాన్ని కచ్చితంగా వెంటాడుతుందివేంకటేశ్వరస్వామి అన్నా...హైందవ సమాజం మనోభావాలన్నా ఏమాత్రం గౌరవం లేదుచంద్రబాబు, పవన్ కలిసి తిరుమలను రాజకీయంగా వాడుకున్నారుస్థానికసంస్థల ఎన్నికల్లో హీనాతిహీనంగా దిగజారిపోయారుకౌన్సిలర్లను కిడ్నాప్ చేసి...కొట్టి ...తప్పుడు కేసులు పెట్టించావ్ వైఎస్సార్సీపీ కార్యకర్తలను అతి దారుణంగా నరికి చంపించారుఏడాది కాలంలో ఘోరాతి ఘోరంగా విఫలమయ్యావ్వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పై పదే పదే దాడులు చేయించావ్మీరు చేసే కుళ్లు రాజకీయాలను మేం కచ్చితంగా గుర్తుంచుకుంటాంజగన్ పర్యటన ఉంది...వేలాది మంది వస్తున్నారు...అంటే రక్షణ కల్పించావాజగన్ మోహన్ రెడ్డి వాహనం పై దాడి జరిగే అవకాశముందని మేం చెప్పినా నువ్వు పట్టించుకోలేదుసత్తెనపల్లి జగన్ పర్యటనలో దళితుడి మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేప్రజలు నీకు 94 శాతం స్ట్రైక్ రేట్ ఇస్తే... నువ్వు 99 శాతం జనాన్ని ముంచేశావ్ఈ ఏడాదికాలంలో నువ్వు చెప్పుకోవడానికి ఏముంది గుండు సున్నా తప్ప2014-19 మధ్య జరిగింది కూడా మోసపూరిత పాలనేడ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టారునిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అన్నారు ఎగ్గొట్టేశారుబాహుబలి గ్రాఫిక్స్ చూపించి రాజధానిలో శాశ్వతంగా చిన్న రోడ్డు నిర్మించలేదురియల్ ఎస్టేట్ కోసం రాజధాని నాటకం ఆడుతున్నారుపోలవరం పూర్తిచేస్తానన్నావ్ ... ఎందుకు చేయలేకపోయావ్విభజన హామీలన్నీ సాధించుకొచ్చేది నువ్వే అన్నావ్ కదా..ఏం చేశావ్ఓటుకు నోటు కేసులో దొరికిపోయి తెలంగాణ నుంచి పారిపోయి వచ్చావ్గోదావరి పుష్కరాల్లో 32 మందిని సినిమా షూటింగ్ పిచ్చితో చంపింది నువ్వు కాదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 చంద్రబాబు జేబు సంస్థలుసమాజంలో అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడంలో సాక్షి మీడియాకు భాగస్వామ్యం ఉందినీతికి, నిజాయితీకి కట్టుబడి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచిని సాక్షి మీడియా ప్రజలకు తెలియజేస్తోంది జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించారుజగన్ ఆర్బీకే సెంటర్లు తెచ్చాడు ...రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాడుజగన్ పాలనలో ఏ పథకంలోనూ పక్షపాతం చూపలేదు ఈ ఏడాది కాలంలో నువ్వేం సాధించావో సమాధానం చెప్పు చంద్రబాబు జగన్ తెనాలి వెళ్లి యువకులను పరామర్శిస్తే గంజాయి బ్యాచ్ అని విమర్శిస్తున్నారుమరో మారు తెనాలి యువకులను గంజాయి బ్యాచ్ అంటే చంద్రబాబు పై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాప్రకాశం జిల్లాలో ఏడు కేసులున్న ఓ రౌడీ షీటర్ చనిపోతే నువ్వు,నీ కుమారుడు వెళ్లారుఆయనే ఏ బ్యాచ్ .. అతని పైన సమాజంలో ఏమైనా క్లీన్ చిట్ ఉందానీ కార్యకర్త కాబట్టి ...నువ్వు పరామర్శించడానికి వెళ్లావ్...అతని పై ఎన్నికేసులు ఉన్నా పర్లేదాఅగ్రకులంలో పుట్టాడు కాబట్టి ఆయన గొప్పోడు..తెనాలి యువకులు మాత్రం రౌడీలా నీ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఈరోజు నేను పెట్టలేకపోవచ్చుకానీ నాకంటూ ఒకరోజు వస్తుంది...అప్పుడు కచ్చితంగా బదులిస్తా -
‘అందరికీ ఇచ్చారు అవకాశం.... ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’
నిజామాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇవ్వాలని కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యమని, అందుచేత బీజేపీకి అధికారం ఇవ్వాలని బండి సంజయ్ విన్నవించారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్షా ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. ‘ రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యం. పసుపు బోర్డు సాధించుకున్న ఇందూర్ రైతులు హీరోలు. ధర్మపురి అరవింద్ పసుపు అరవింద్ అయ్యారు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.బండి సంజయ్న ప్రసంగానికి ఆహ్వానించిన క్రమంలో సభ చఘ్పట్లతో దద్దరిల్లింది. ప్రజా స్పందనను ఆస్వాదిస్తూ బండి సంజయ్ ప్రసంగాన్ని ఆలకించారు అమిత్ షా. దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్ షా -
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు: వైఎస్ జగన్
తాడేపల్లి: ఏపీ ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు సర్కారును నిలదీశారు ఇది ఏపీ విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్.‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’ అంటూ విమర్శించారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025 -
కాంగ్రెస్లో ‘కొండా’ కల్లోలం.. ఆ పార్టీ ఎమ్మెల్యేల అత్యవసర భేటీ
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ రాజకీయాలు.. అధికార కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నాయి. కొండా మురళీ లేఖ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్తో సహా పలువురు భేటీ అయ్యారు.కాగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్కు వచ్చి, నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమైన సంగతి తెలిసిందే. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది.ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి, తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.పొంగులేటి మాపై కక్షగట్టారు!: కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని తెలిపారు.ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్రెడ్డి.. అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చి, ఆ కోపంతో తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొనట్లు సమాచారం.జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లు తెలిసింది. వర్ధన్నపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో సత్సంబంధాలున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా టీడీపీ నుంచి వచ్చిన గండ్ర సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. -
‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం’.. ఎంపీ రఘనందన్కు మరో బెదిరింపు కాల్
సాక్షి,హైదరాబాద్: రోజుల వ్యవధిలో మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం. ఆపరేషన్ కగార్ ఆపండి. లేదంటే నీ ప్రాణాలు తీస్తాం. ఇప్పటికే మా టీంలు హైదరాబాద్లో ఉన్నాయి. దమ్ముంటే కాపాడుకో’ అంటూ అగంతకులు రెండు నెంబర్ల నుంచి రఘనందన్ బెదిరింపులకు దిగారు. దీంతో అప్రమత్తమైన రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత వారం బెదిరింపు కాల్గత వారం ఎంపీ రఘునందన్కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు.బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
జూబ్లీహిల్స్లో విజయం మాదే: పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. విజయం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటి నుండి గ్రౌండ్ లెవెల్లో ప్రణాళిక ద్వారా ముందుకు పోవాలని సూచించారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి అని అన్నారు.ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘జూలై నాలుగో తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యటిస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలి. హైదరాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి ముఖ్య నేతలు సభలో పాల్గొనాలి. సభ ఏర్పాట్లపై నేతలు, కార్యకర్తలు యాక్టివ్గా ఉండాలి. హైదరాబాద్లో పార్టీకి సంబంధించిన ఇష్యూ నా దృష్టికి వచ్చాయి.దేవాలయ కమిటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, బోనాల చెక్కుల పంపిణీ తదితర ప్రోటోకాల్ సమస్యలపై చర్చించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి నామినేటెడ్ పోస్టులు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. ప్రభుత్వ సంక్షేమమే కాంగ్రెస్ను గెలిపిస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
పెద్దారెడ్డితో ఉంటారా.. వాళ్ల సంగతి చూస్తా: జేసీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో రెడ్బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరూ తిరగొద్దు. పెద్దారెడ్డికి మద్దతుగా ఉండే వారిని గుర్తిస్తాం.. ఫోటోలు తీస్తున్నాం. పెద్దారెడ్డిని మద్దతు ఇచ్చే వారిని రప్పా..రప్పా.. అని నరికేస్తాం’ అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు మండిపతున్నారు.ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం నుంచి తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అనంతరం పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు.ఈ సందర్బంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు.. టీడీపీ జేసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాజీ మంత్రి శైలజానాథ్ కామెంట్స్..పోలీసుల తీరును ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?. పెద్దారెడ్డిపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?. ఓ మాజీ ఎమ్మెల్యేని లాక్కొని వస్తారా?. ఇప్పటికైనా పోలీసులు చట్టాన్ని కాపాడాలి. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలి. ఎస్పీ జగదీష్ బాధ్యతగా ప్రవర్తించాలి.. ఏకపక్షంగా వ్యవహరించవద్దు.మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కామెంట్స్..ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన రాక్షస ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చేంతవరకు పోరాడతాం. బాండ్లు ఇచ్చి మరీ హామీ ఇచ్చారు.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తాం. పోలీసులు కేసు నమోదు చేస్తారా?. రాజ్యాంగ విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను పీడిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో మైనింగ్ వ్యాపారులను బెదిరించి , కేసులు , జరిమానాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
‘తాడిపత్రిలో ఆటవిక రాజ్యం.. పోలీసులు అడ్డుకోవడమేంటి?’
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించటం లేదు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొద్దని ఏవైనా ఆదేశాలు ఉన్నాయా?. మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రిలోకి అనుమతించకపోవడం ఏం న్యాయం?. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
బీహార్లో ప్లాన్ మార్చిన ఎంఐఎం ఒవైసీ.. బీజేపీ ఓటమే టార్గెట్గా..
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. ప్రతిపక్ష కూటమి ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత ఒవైసీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని ఒవైసీ చెప్పుకొచ్చారు.ఎంపీ, ఎంఐఎం అధినేత ఒవైసీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు ప్రతిపక్ష మహాఘటబంధన్తో ఎంఐఎం కలిసి పనిచేయాలని నిర్ణయించింది. మహాఘటబంధన్ నాయకులతో సంప్రదింపులు జరిగాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మా పార్టీ బీహార్ చీఫ్ అఖ్తరుల్ ఇమాన్, కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతరులతో కూడిన మహాఘటబంధన్ నాయకులను సంప్రదించారు. బీహార్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని మేం కోరుకోవడం లేదు.ఇప్పుడు బీహార్లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావాలా? వద్దా? అనేది ఈ రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంది. బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం బలమైన ఉనికిని కలిగి ఉంది. గత ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత వారిలో నలుగురు ఆర్జేడీలో చేరడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మా పార్టీ సీమాంచల్ నుంచే కాకుండా బయట కూడా అభ్యర్థులను నిలబెడుతుంది. ఒకవేళ వారు (మహాఘట్బంధన్) తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేకుంటే.. ప్రతీ స్థానంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు.#WATCH | Hyderabad | AIMIM chief Asaduddin Owaisi, says, "Our State President, Akhtarul Iman, has spoken to some leaders in the Mahagathbandhan and he has categorically stated that we do not want the BJP or NDA to come back in power in Bihar. Now it is up to these political… pic.twitter.com/08iNw1QZjI— ANI (@ANI) June 29, 2025ఇదే సమయంలో ఓటర్ల జాబితాపై ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలో “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్”ను వ్యతిరేకిస్తూ ఒవైసీ భారత ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఒవైసీ..‘ఇది చట్టబద్ధంగా ప్రశ్నార్థకమైన చర్య. ఇది రాబోయే ఎన్నికలలో నిజమైన ఓటర్లకు స్వరం లేకుండా చేస్తుంది. ఓటరు జాబితాలో నమోదు కావడానికి, ప్రతి పౌరుడు ఇప్పుడు వారు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో నిరూపించే పత్రాలను మాత్రమే కాకుండా, వారి తల్లిదండ్రులు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో కూడా చూపించాల్సి ఉంటుంది. దీంతో, ఓటర్లకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది వారి రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంది’ అని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి,గుంతకల్లు: ‘ఎవరేమనుకున్నా..నాకేంటి! ఈ గుమ్మనూరు జయరాంకు ఏమన్నా లెక్కా’ అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గుంతకల్లులోని పరిటాల శ్రీరాములు కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి క్లస్టర్ యూనిట్, బూత్ కార్యకర్తల సమావేశంతోపాటు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ రోజు గుత్తిలో నిర్వహించిన సమావేశంలో అన్న మాటలు (వైఎస్సార్సీపీ నాయకులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోగా టీడీపీలో చేరితే సరి.. లేదంటే తోకలు కత్తిరించి సున్నం అంటిస్తాం) రాష్ట్రమంతా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా గుంతకల్లు వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం. నేనేమన్నా దౌర్జన్యాలు చేస్తానని చెప్పలేదే! ఉన్న మాట అంటే ఉలుకు అన్న చందంగా వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్నారు. సరే.. వారు, ఎవరేమనుకున్నా నాకేంటి?! ఈ గుమ్మనూరు జయరాంకు ఏమన్నా లెక్కా’ అని వ్యాఖ్యానించారు. -
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తున్న తరుణంలో.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కుట్రకు దిగింది. బలవంతంగా అరెస్ట్ చేయించింది.ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, రహస్య ప్రాంతానికి తరలించగా.. ఇప్పటికే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొచ్చన్న హైకోర్టు అనుమతిచ్చిన విషయాన్ని పోలీసులకు పెద్దారెడ్డి గుర్తు చేశారు. దీంతో చేసేది లేక పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?అనంతపురం రాంనగర్లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రికత్తత నెలకొంది. అంతకుముందు, పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మునిసిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు తన ఇంటి కొలతలు తీసుకున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. అదే సమయంలో పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్ట నివ్వడం లేదు. అడుగడుగునా కూటమి నేతలు అడ్డు తగులుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి హైకోర్టులో అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ కూటమి నేతలు పదేపదే బెదిరింపులు, దాడులతో కక్ష సాధింపు చర్యలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో పెద్దారెడ్డి మరోమారు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. -
తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ.. కొత్త నాయకుడెవరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోంది. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ మధ్యే పోటీ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక, జూలై ఒకటో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది.కాగా, నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికకి నోటిఫికేషన్ విడుదల కానుంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రేపు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జూలై ఒకటో తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన చేస్తారు. అయితే, తెలంగాణ బీజేపీ ప్రముఖంగా ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ మధ్యే పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరిని సారథ్య బాధ్యతలు వరించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.ఇదిలా ఉండగా.. ఈరోజు సాయంత్రం వరకు కొత్త అధ్యక్షుడి అభ్యర్థికి అధిష్టానం సంకేతాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లతో ఓటరు జాబితా రెడీ అయ్యింది. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. నామినేషన్ వేయాలా వద్దా అనేదానిపై తర్వాత నిర్ణయించుకుంటానని రాజాసింగ్ తెలిపారు.అయితే, అధ్యక్ష పదవి కోసం పార్టీలోని ముఖ్య నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేశారు. కానీ సుదీర్ఘ కసరత్తు, అనేక సమీకరణాలు, వడపోతల తర్వాత.. చివరగా రేసులో ఇద్దరే ఇద్దరు నేతలు మిగిలారు. వాళ్లే ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్. అధ్యక్ష పదవిపై బయటికి చెప్పకపోయినప్పటికీ.. పార్టీలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామని ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు.ఈటల Vs అరవింద్..బీజేపీ పార్టీకి విధేయుడిగా ధర్మపురి అరవింద్కు గుర్తింపు ఉంది. ఇక బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్షాకు సన్నిహితుడిగాను ఆయన ముద్ర వేసుకున్నారు. తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సూటిగా విమర్శలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. మిగతా నేతల నుంచి పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, బలమైన రాజకీయ నేపథ్యం ఆయనకు కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఇక ఈటల రాజేందర్ను తీసుకుంటే.. తెలంగాణలో బలమైన బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉద్యమ నాయకుడిగా ప్రజాదరణ ఉంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు ఉండడంతో పాటు ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై అవగాహన ఉంది. పార్టీలో చేరినప్పుడు అధిష్టానం ఇచ్చిన హామీ కూడా ఆయనకు అనుకూలమైన అంశమే అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో, కొత్త నాయకుడు ఎవరు అనే చర్చ మొదలైంది. -
వైఎస్ జగన్ హెలికాప్టర్ను దిగనివ్వం.. కోటంరెడ్డి అనుచరుల అరాచకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డితో ములాఖత్కు వైఎస్ జగన్ జూలై 3న నెల్లూరుకు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం వైఎస్సార్సీపీ నాయకులు స్థలాన్ని పరిశీలిస్తుండగా నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అనుచరులు అడ్డుపడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు మూడు వేర్వేరు ప్రైవేటు స్థలాలను చూడగా.. కోటంరెడ్డి అనుచరులు ఆయా భూముల యజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్న నిర్మాణాలతో పాటు భూములపై వివాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్సీపీ నేతలు శనివారం కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేశారు. స్కూల్ యాజమాన్యం అనుమతితో జిల్లా అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. ట్రస్ట్ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటూ హడావుడి చేశారు. భవనాలను కూల్చేస్తామంటూ రాద్ధాంతానికి దిగారు. దీంతో స్కూల్ సంబం«దీకులు భయాందోళనకు గురై హెలిప్యాడ్కు స్థలం ఇవ్వబోమని చెప్పాల్సి వచ్చింది. వైఎస్ జగన్ జనాదరణ చూసి భయపడి..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 143 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ కూటమి ఆ హామీలు నెరవేర్చలేక తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. దీనిని నిలదీస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తుండడంతో రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ఆయన నెల్లూరు జిల్లాకు వస్తున్నారని తెలియగానే సంఘీభావం తెలిపేందుకు వేలాదిమంది తరలివస్తారని టీడీపీ నేతల్లో భయం పుట్టింది. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారు. హెలిప్యాడ్కు స్థలాలు ఇవ్వకుండా యజమానులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.