హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసుల ప్రకటించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పందిస్తూ పుట్టా మహేష్ తీరుపై మండిపడ్డారు.
‘చంద్రబాబు బ్రాండ్.. డ్రగ్స్ బ్రాండ్. డ్రగ్స్ మాఫియాను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు. సామాన్యుడికి ఒక రూల్.. ఎంపీకి మరో రూల్ ఉండకూడదు. పుట్టా మహేష్ను రక్షించడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. పుట్టా మహేష్కు ఎంపీగా కొనసాగే అర్హత లేదు’ అని కాకాణి అన్నారు. కాగా, వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫాంహౌస్లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు.


