breaking news
Putta Mahesh Yadav
-
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ.. పోలీసులపై ఒత్తిడి మొదలైందా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. వీఐపీలతో పాటు ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. అయితే, పుట్టా మహేష్ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పుట్టా మహేష్ను తప్పించడానికి పెద్ద తలకాయలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ‘‘హైదరాబాద్ పోలీసులపై అప్పడే ఒత్తిడి మొదలైందా?. పుట్టా మహేష్ను తప్పించడానికి రాజకీయ, ఆర్థిక బలాలు ఉపయోగిస్తున్నారా?. పుట్టా మహేష్ను కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారా?. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఆరుగురిపై పోలీసుల నెక్ట్స్ ఎలా ఉండబోతుంది’’ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ పాజిటివ్గా తేలిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిన్న రాత్రి 7.30 సమయంలో మాకు సమాచారం అందింది. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లాం. 11మందికి టెస్టులు చేశాం.. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. మేం లోపలికి వెళ్లేటప్పుడే గన్ ఫైర్ సౌండ్స్ వచ్చాయి. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్టు గుర్తించాం. ఎంపీ అయినా.. ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవు’’ అని ఎస్పీ స్పష్టం చేశారు. -
టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీగా మారింది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పుట్టా మహేష్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ.. తెలుగు డ్రగ్ పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్సభకు పంపారు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్కు లేదు’’ అంటూ టీజేఆర్ మండిపడ్డారు.‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకటం సిగ్గుచేటు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు. ఎంపీ మహేష్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎంపీ పదవి నుండి తొలగించాలి. డ్రగ్స్ నెట్వర్క్తో ఎంపీ పుట్టాకు సంబంధం ఉంది. రాజస్థాన్కి చెందిన మాజీ ఎమ్మెల్యేని డ్రగ్స్ పార్టీకి పిలవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతలు బరితెగించారు...తప్పులు చేసి కూడా అయితే ఏంటంటా? అంటున్నారు. ఎంపీ పుట్టా మహేష్ అనేకమంది యువత జీవితాలను పెడదోవ పట్టించేలా వ్యవహరించారు. టీటీడీకి ఛైర్మన్గా పని చేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఎంపీ మహేష్. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వీడియోలతో దొరికాడు. అయినాసరే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు...ఇప్పుడు పుట్టా మహేష్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు. పుట్టా మహేష్ యాదవ్ కు పార్లమెంటులోకి ప్రవేశించే అర్హత లేదు. ఆయన్ను ఎంపీ పదవి నుండి వెంటనే తొలగించాలి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో ఇటీవల డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతోంది. అయినాసరే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు రేవంత్, రాహుల్ గాంధీతో హాట్ లైన్ సంబంధం ఉంది. కాబట్టి రేవంత్తో మాట్కాడి పుట్టా కేసును నీరుగార్చుతారనే అనుమానం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎలా నమ్ముతున్నారో బీజేపీ, జనసేనకే తెలియాలి. రాయలసీమ లిఫ్టును కాంగ్రెస్ సీఎం అడిగాడని చంద్రబాబు ఆపేశారు. చంద్రబాబుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నిజాయితీకి ఇది పరీక్ష. రెండు రాష్ట్రాలను డ్రగ్స్ రాష్ట్రాలుగా మార్చటం సిగ్గుచేటు’’ అంటూ టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. -
ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్
సాక్షి,హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ వీకెండ్ పార్టీలో ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అతని సోదరుడు పలువురు డ్రగ్స్ తీసుకున్నట్ల నిర్ధారించారు. వారందరికి ప్రస్తుతం డ్రగ్స్ టెస్టులు జరుగుతున్నాయన్న పోలీసులు.. వాళ్లు తీసుకున్నది ఎలాంటి డ్రగ్స్ అనేది పూర్తిస్థాయిలో టెస్టులు ఫలితాల తరువాతే తెలుస్తాయని చెప్పారు. డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలుఅయితే మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూరిన్ టెస్ట్ విషయంలో ఎంపీ పుట్టా మహేష్ నాటకం ఆడినట్లు తేలింది. యూరిన్ శాంపిల్ బదులు వాటర్ ఇచ్చారు. అనుమానం రావడంతో శాంపిల్ బాటిళ్లను టెస్టు చేయగా..శాంపిల్ బాటిల్లో ఉంది యూరిన్ కాదని నీళ్లని గుర్తించారు. దీంతో ఎంపీ పుట్టాపై పోలీసులు సీరియస్ అయ్యారు. టెస్టులు కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వాలని.. నీళ్లు కాదని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్పై పోలీసులు సీరియస్ అయ్యారు. అనంతరం పుట్టా మహేష్ నుంచి యూరిన్ సేకరించి టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో ఎంపీ పుట్టా మహేష్ బ్లడ్ టెస్టులో పాజిటీవ్గా నిర్ధారణైంది.డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్..డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి 3గంటల నుంచి ఫాం హౌస్లో పార్టీ జరుగుతోంది. రాత్రి 7.30 సమయంలో ఎంపీ పుట్టా మహేష్ ఫాం హౌస్కు వచ్చారు. సోదాల సమయంలో కాల్పులు జరిపారు. గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం.డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 11మందిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించాం’అని పేర్కొన్నారు.


