breaking news
	
		
	
  Business
- 
      
                   
                                                     
                   
            ఎయిర్టెల్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 8,651 కోట్లను తాకింది. పోస్ట్పెయిడ్ కనెక్షన్లు, స్మార్ట్ఫోన్ కస్టమర్ల నుంచి అధిక చెల్లింపులు ఇందుకు దోహదపడ్డాయి. ఆఫ్రికా లాభం సైతం భారీగా దూసుకెళ్లి రూ. 969 కోట్లయ్యింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 4,153 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం జంప్చేసి రూ. 52,145 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 41,473 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఆదాయంలో దేశీ టర్నోవర్ ఇండస్ టవర్స్ వాటాతో కలసి 23 శాతం ఎగసింది. రూ. 38,690 కోట్లను తాకింది. త్రైమాసికంగా సైతం ఆదాయం 5.4 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వైస్చైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ఆఫ్రికా ఆదాయం 36 శాతం జంప్చేసి రూ. 13,680 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఏఆర్పీయూ అప్ ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 10 శాతం మెరుగుపడి రూ. 256కు చేరింది. గత క్యూ2లో రూ. 233 మాత్రమే. ఈ కాలంలో స్మార్ట్ఫోన్ కస్టమర్లు 51 లక్షలమంది జత కలవగా, పోస్ట్పెయిడ్ విభాగంలో 10 లక్షల మంది చేరినట్లు విఠల్ వెల్లడించారు. కాగా.. కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 11 శాతం బలపడి 62.35 కోట్లను తాకింది. దేశీ వినియోగదారుల సంఖ్య 11 శాతం పెరిగి 44.97 కోట్లకు చేరింది. పోస్ట్పెయిడ్ విభాగంలో కస్టమర్ల సంఖ్య 2.75 కోట్లను తాకినట్లు విఠల్ పేర్కొన్నారు. ఒక్కో కస్టమర్ మొబైల్ డేటా వినియోగం 27 శాతం అధికంగా నెలకు 28.3 జీబీకి చేరింది. దేశీ పెట్టుబడులు రూ. 9,643 కోట్ల తో కలసి మొత్తం పెట్టుబడి వ్యయాలు రూ. 11,362 కోట్లను తాకాయి. కంపెనీ నికర రుణ భారం 5 శాతం తగ్గి రూ. 1,94,713 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 1 శాతం లాభపడి రూ. 2,074 వద్ద ముగిసింది. - 
      
                   
                                                     
                   
            యూపీఐ కొత్త రికార్డు!
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అక్టోబర్లో రూ.27.28 లక్షల కోట్ల విలువ చేసే 2,070 కోట్ల లావాదేవీలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో నమోదైన రూ.25.14 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు గత గరిష్ట రికార్డు కావడం గమనార్హం. సంఖ్యా పరంగా గత ఆగస్ట్లో నమోదైన 2,000 కోట్ల లావాదేవీలు గరిష్ట స్థాయిగా ఉన్నాయి. అక్టోబర్లో అటు విలువ పరంగా, ఇటు సంఖ్యా పరంగా యూపీఐ కొత్త రికార్డులు సృష్టించింది. క్రితం ఏడాది అక్టోబర్లో రూ.23.49 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. దీంతో పోలి్చతే విలువ పరంగా 16 శాతం పెరుగుదల కనిపించింది. ఇక ఈ ఏడాది సెపె్టంబర్ నెలలోనూ రూ.24.90 లక్షల కోట్ల విలువ చేసే 1,963 కోట్ల లావాదేవీలు జరిగాయి. అక్టోబర్లో రోజువారీ సగటు లావాదేవీలు 66.8 కోట్లుగా ఉన్నాయి. సగటు లావాదేవీ విలువ రూ.87,993గా ఉంది. పండుగల సీజన్ కావడంతో యూపీఐ లావాదేవీలు పెద్ద మొత్తంలో పెరిగినట్టు తెలుస్తోంది. మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 85 శాతం యూపీఐ ద్వారానే కొనసాగుతున్నాయి. పట్టణాల్లోని ప్రజల నిత్య జీవితంలో డిజిటల్ చెల్లింపులు భాగంగా మారాయని స్పైస్మనీ సీఈవో దిలీప్ మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్లోనూ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.మలేసియాలోనూ యూపీఐ చెల్లింపులు యూపీఐ యూజర్లు ఇకపై మలేసియాలోనూ చెల్లింపులు చేసుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. ఇందుకు వీలుగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్, రేజర్పే కర్లక్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. దీంతో యూపీ ఐ మరో కొత్త దేశంలోకి అడుగుపెట్టినట్టయింది. - 
      
                   
                                                     
                   
            చిక్కుల్లో అనిల్ అంబానీ
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది!. ఆర్కామ్ రుణ ఎగవేతలు, నిధుల మళ్లింపు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, వాటితో సంబంధం ఉన్న కంపెనీలకు చెందిన రూ.7,545 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు ఈడీ సీజ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద 42 ప్రాపరీ్టలను అటాచ్ చేస్తూ అక్టోబర్ 31న ఈడీ ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా నవీ ముంబైలోని ధీరూభాయి అంబానీ నాలెడ్జ్ సిటీ (డీఏకేసీ)కి చెందిన రూ.4,462 కోట్ల విలువ చేసే 32 ఎకరాల విలువైన భూమిని సోమవారం అటాచ్ చేసింది. ఢిల్లీలోని రంజిత్ సింగ్ మార్గ్లో ఉన్న రిలయన్స్ సెంటర్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఇతర కంపెనీలకు చెందిన ఆస్తులు సీజ్ చేసిన వాటిల్లో ఉన్నాయి. ఇందులో రిలయన్స్ సెంటర్, డీఏకేసీ దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఆర్కామ్కు చెందినవిగా కంపెనీ వర్గాల సమాచారం. కాగా, ఈడీ చర్యలు కంపెనీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపించబోవని రిలయన్స్ ఇన్ఫ్రా ప్రకటించింది. - 
      
                   
                                                     
                   
            అంబానీ ఇంట్లో కనిపించని ఏసీ: యాంటిలియాలో ఎందుకిలా?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన అంబానీ గురించి, వారు నివసించే భవనం యాంటిలియా గురించి చాలా విషయాలు తెలిసుంటాయి. కానీ సుమారు రూ. 15,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ నివాసంలో ఒక్క ఔట్ డోర్ ఏసీ కూడా లేకపోవడం గమనార్హం. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంతకీ అంతపెద్ద భవనంలో ఔట్ డోర్ ఏసీ లేకపోవడానికి కారణం ఏమిటి? దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ముంబై నగరంలో నిర్మించిన.. ముకేశ్ & నీతా అంబానీల కలల సౌధం సుమారు 27 అంతస్తులలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఇళ్లలో ఒకటి కూడా. దీనిని లగ్జరీ, లేటెస్ట్ వాస్తుశిల్పానికి, భారతీయ సంప్రదాయానికి నెలవుగా నిర్మించుకున్నారు. ఈ లగ్జరీ భవనంలో.. 49 బెడ్ రూములు, ఐస్ క్రీం పార్లర్, గ్రాండ్ బాంకెట్ హాల్, ఒక స్నో రూమ్, ఒక ప్రైవేట్ థియేటర్, తొమ్మిది లిఫ్టులు, మూడు హెలిప్యాడ్లు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి కావలసిన ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి.ప్రత్యేకమైన టెక్నాలజీఇక ఔట్ డోర్ ఏసీ ఎందుకు లేదు? అనే విషయానికి వస్తే.. సాధారణ ఏసీ ఉపయోగించడం వల్ల, భవనం అందం తగ్గిపోతుందని.. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించినట్లు సమాచారం. ఇది భవనంలో పువ్వులు, ఇంటీరియర్, పాలరాతిని కాపాడుతుంది. యాంటిలియాలో ఎవరు అడుగుపెట్టినా.. ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ఏసీ అనేది వ్యక్తిగత సౌకర్యం కోసం కాకుండా.. భవంతి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. కాబట్టి ఇక్కడ ఔట్ డోర్ ఏసీ కనిపించదు.యాంటాలియా చల్లగాముంబై నగరం వేడిగా ఉన్నప్పటికీ.. యాంటాలియా మాత్రం చల్లగానే ఉంటుంది. ఒకసారి నటి శ్రేయా ధన్వంతరి ఫ్యాషన్ షూట్ కోసం కొన్నాళ్లు యాంటాలియాలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒకరోజు, తనకు బాగా చలిగా అనిపించిందని, ఏసీ తగ్గించమంటే.. అక్కడి సిబ్బంది.. ఆ భవనం నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఏసీని తగ్గించకూడదని ఆమెకు వివరించినట్లు.. ఆమె తన అనుభవాన్ని వెల్లడించారు.ఇదీ చదవండి: అలాంటి ప్రాజెక్టులు ఆపేయండి: మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ - 
      
                   
                                                     
                   
            అలాంటి ప్రాజెక్టులు ఆపేయండి: మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాబోయే రోజుల్లో ప్రమాదమని చాలామంది.. గతకొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ 'ముస్తఫా సులేమాన్' కీలక వ్యాఖ్యలు చేశారు.ఏఐ తెలివిగా రోజురోజుకు మారుతోంది. గూగుల్, ఓపెన్ఏఐ, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీలు.. దీనిని మరింత కొత్తగా మార్చడానికి బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అంతేకాకుండా.. ఏఐ ఇప్పటికే మనుషులు చేసే పనులను చేసేస్తోంది. కానీ ప్రస్తుతానికి మనుషులు మాదిరిగా ఆలోచించే జ్ఞానం మాత్రం పొందలేదు. రానున్న రోజుల్లో ఇది మరింత స్మార్ట్గా తయారయ్యే అవకాశం ఉంది. దీనికోసం చాలా కంపెనీలు కృషి చేస్తున్నాయని ముస్తఫా సులేమాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్లనిజానికి.. ఎంత ఖర్చు చేసినా.. మనిషిలా ఆలోచించే జ్ఞానం, తెలివితేటలు ఏఐకు ఎప్పటికీ రావు. దీనికోసం దిగ్గజ కంపెనీలు చేసే ప్రయత్నాలను ఆపాలని ముస్తఫా సులేమాన్ అన్నారు. ఆఫ్రోటెక్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. జీవసంబంధమైన జీవులు మాత్రమే నిజమైన భావోద్వేగం.. బాధలను అనుభవించగలవు. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించాలి అనే ప్రాజెక్టులు మానేసి.. మనిషికి సహాయం చేసే ఏఐ ప్రాజెక్టులపై పనిచేయడం ఉత్తమం అని డెవలపర్లకు సూచించారు. - 
      
                   
                                                     
                   
            డిజిటల్ యుగంలో.. ఏఐ హవా!
‘నేటి డిజిటల్ యుగంలో.. మేనేజ్మెంట్ రంగంలో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం పెరుగుతోంది. తాజా క్యాంపస్ ఆఫర్లను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. కాబట్టి మేనేజ్మెంట్ విద్యార్థులు టెక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది’ అంటున్నారు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–బెంగళూరు డైరెక్టర్ (ఇన్ఛార్జ్) ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్. ఐఐటీ–ముంబైలో పీహెచ్డీ, యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పూర్తి చేసి.. దాదాపు మూడు దశాబ్దాలుగా అధ్యాపక రంగంలో కొనసాగుతూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న దినేశ్ కుమార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ..మేనేజ్మెంట్ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం గురించి చెప్పండి?ఫైనాన్స్, హెచ్ఆర్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో ఏఐ ప్రధాన్యం పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే కీలకమైన రికార్డ్స్ నిర్వహణ, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఏఐ ఆధారిత కార్యకలాపాలు మొదలయ్యాయి. మన దేశంలోనూ బిగ్ డేటా, డేటా అనలిటిక్స్లో ఏఐ ప్రమేయం ఎక్కువగా ఉంది. మిగతా విభాగాల్లోనూ రానున్న రోజుల్లో ఇది కనిపిస్తుంది. దీంతో మేనేజ్మెంట్ పీజీ విద్యార్థులు అకడమిక్గా టెక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది.బిజినెస్ స్కూల్స్ ఏఐకు సంబంధించిన బోధన పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?ఇండస్ట్రీ వర్గాలతో చర్చించి డిమాండ్ నెలకొన్న ఏఐ టూల్స్ను గుర్తించాలి. విద్యార్థులకు సదరు ఏఐ నైపుణ్యాలు అందించేలా పరిశ్రమ వర్గాలతో కలిసి పని చేయాలి. ఐఐఎం–బెంగళూరు మూడేళ్ల క్రితమే ఎస్ఏపీ ల్యాబ్స్తో ఒప్పందం చేసుకుంది. ఏఐ ఫర్ మేనేజర్స్ పేరుతో 16 నెలల లాంగ్టర్మ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను అందుబాటులోకి తెచ్చాం. దీనిద్వారా విద్యార్థులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నైపుణ్యాలతోపాటు, ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ లభిస్తాయి.మేనేజ్మెంట్ విద్యార్థులకు సలహా?అందుబాటులోని సీట్ల సంఖ్య, పోటీ కారణంగా కొద్దిమందికే ఐఐఎంలలో ప్రవేశం లభిస్తుంది. అంతమాత్రాన నిరాశ చెందక్కర్లేదు. దేశంలో మరెన్నో ప్రతిష్టాత్మక బి–స్కూల్స్ ఉన్నాయి. విద్యార్థులు తమ దృక్పథాన్ని విస్తృతం చేసుకోవాలి. ఐఐఎంలతోపాటు ఉన్న ఇతర అవకాశాలపై దృష్టి సారించాలి. ఇక కోర్సులో అడుగు పెట్టాక.. విస్తృతమైన ఆలోచన దృక్పథంతో అడుగులు వేయాలి. ఒత్తిడి వాతావరణంలోనూ నిర్ణయాలు తీసుకునే ఆత్మస్థైర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావడం వంటివి సహజ లక్షణాలుగా అలవర్చుకోవాలి. అప్పుడే క్లాస్రూంలో పొందిన నైపుణ్యాలకు సరైన వాస్తవ రూపం లభించి చక్కటి కెరీర్ సొంతమవుతుంది.నియామకాల్లో ఏఐ నైపుణ్యాలపై కంపెనీల దృక్పథం ఎలా ఉంది?కంపెనీలు సహజంగానే లేటెస్ట్ స్కిల్స్పై అవగాహన ఉన్న వారి కోసం అన్వేషణ సాగిస్తాయి. కొన్ని కంపెనీలు.. ఏఐ కార్యకలాపాలు నిర్వహించగలిగే వారిని గుర్తించి వారికి శిక్షణనిచ్చి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. తాజాగా ఐఐఎం– బెంగళూరు సమ్మర్ ప్లేస్మెంట్స్లో బీసీజీ, బెయిన్ అండ్ కో, టీసీఎస్ వంటి సంస్థలు ఏఐ సంబంధిత విభాగాల్లో ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేశాయి.విద్యార్థుల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్పై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా దేశంలో సదుపాయాలు ఉన్నాయా?వాస్తవానికి దేశంలో స్టార్టప్స్ కోణంలో గత పదేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా గత అయిదారేళ్ల కాలంలో స్టార్టప్ల దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. స్వయం ఉపాధి గురించి ఆలోచించే యువతకు ఎన్నో ప్రోత్సాహకాలు, అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. చక్కటి వ్యాపార ఐడియాలు ఉంటే ఆర్థికపరమైన అంశాల గురించి ఆందోళన చెందక్కర్లేదు.స్టార్టప్స్ ఏర్పాటు కోసం అకడమిక్ స్థాయి నుంచే అడుగు వేయాల్సిన అవసరం ఉందా?అకడమిక్ స్థాయిలో స్టార్టప్స్కు సంబంధించిన నైపుణ్యాలను బోధించడం వల్ల విద్యార్థులకు థియరీ నాలెడ్జ్ ఏర్పడుతుంది. కాని క్షేత్ర స్థాయిలో అడుగు పెడితేనే వాస్తవాలు తెలుస్తాయి. ఇటీవల కాలంలో స్టార్టప్స్కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో పలు ఇన్స్టిట్యూట్లు అకడమిక్ స్థాయిలో ప్రత్యేకంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సులతో తమ వ్యాపార ఆలోచనలను సరైన దిశలో కార్యాచరణలో పెట్టేందుకు అవసరమైన మార్గ నిర్దేశం విద్యార్థులకు లభిస్తుంది.ఇటీవల కాలంలో డేటా అనలిటిక్స్ జాబ్ ప్రొఫైల్స్కు డిమాండ్ పెరగడానికి కారణమేంటి?విస్తృతంగా ఏర్పాటవుతున్న సంస్థలు, వాటి మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో.. ప్రొడక్ట్ డిజైన్ నుంచి ఎండ్ యూజర్స్ వరకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు.. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తుల పట్ల ఆదరణ ఎలా ఉంది.. సమస్యలు ఏమిటి.. ఇలా అన్ని కోణాల్లో సమాచారాన్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం బిగ్ డేటా అనలిటిక్స్ ఎంతో కీలకంగా మారుతోంది. అందుకే బిగ్డేలా నైపుణ్యాలు కలిగిన వారికి డిమాండ్ నెలకొంది. ఒకప్పుడు ఆపరేషన్స్ రీసెర్చ్లో భాగంగానే ఈ విభాగం ఉన్నప్పటికీ.. ఇప్పుడు ప్రత్యేక కోర్సుగా రూపొందడమే దీనికి పెరుగుతున్న డిమాండ్కు నిదర్శనం.మేనేజ్మెంట్ విద్యార్థులు అకడమిక్స్తోపాటు ఏఏ అంశాలపై దృష్టి సారించాలి?మేనేజ్మెంట్ విద్యార్థులు అకడెమిక్ నైపుణ్యాల సాధనకే పరిమితమవడం సరికాదు. నైతిక విలువలు, సామాజిక స్పృహ కూడా కలిగుండాలి. కోర్సు, కెరీర్, ఇండస్ట్రీ.. ఏదైనా తుది లక్ష్యం సామాజిక అభివృద్ధికి దోహదపడటమే. కాబట్టి విద్యార్థులు కేవలం క్లాస్ రూం లెక్చర్స్కే పరిమితం కాకుండా.. సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా దృష్టి సారించాలి. నాయకత్వం, నిర్వహణ నైపుణ్యాలు అనేవి తరగతి బోధనతోనే లభించవు. వీటిని ప్రతి విద్యార్థి సొంతంగా క్షేత్రస్థాయి ప్రాక్టీస్ ద్వారా అందిపుచ్చుకోవాలి.మేనేజ్మెంట్ పీజీలో ఇప్పటికీ టెక్ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి ప్రవేశ పరీక్ష విధానమే కారణమంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న క్యాట్ ఇంజనీరింగ్ విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం అపోహ మాత్రమే. ఐఐఎంలలోని విద్యార్థుల నేపథ్యాలే ఇందుకు నిదర్శనం. ఐఐఎం– బెంగళూరులో డాక్టర్స్, ఫ్యాషన్ టెక్నాలజీ ఉత్తీర్ణులు, హ్యుమానిటీస్ అభ్యర్థులు.. ఇలా విభిన్న నేపథ్యాలున్న విద్యార్థులు చదువుతున్నారు. క్యాట్ అనేది సామర్థ్యాన్ని పరిశీలించే పరీక్ష మాత్రమే. ఐఐఎంలలో ప్రవేశానికి క్యాట్ కంటే విద్యార్థుల ఆలోచన శైలి కీలకంగా నిలుస్తుంది. - 
      
                   
                                                     
                   
            ముగిసిన స్టడ్స్ ఐపీఓ
హెల్మెట్ల తయారీ కంపెనీ స్టడ్స్ యాక్సెసరీస్ ఐపీఓ అక్టోబర్ 30న ప్రాభమై.. నేటితో (నవంబర్ 3)న ముగిసింది. బిడ్డింగ్ చివరి రోజు (సోమవారం) కంపెనీ బలమైన పెట్టుబడిదారుల ఆసక్తిని సంపాదించింది.ప్రారంభ వాటా అమ్మకం బిడ్డింగ్ మూడవ రోజున 73.25 రెట్ల సబ్స్క్రిప్షన్ను పొందింది. సంస్థాగతేతర పెట్టుబడిదారుల నుంచి 77 రెట్లు సబ్స్క్రిప్షన్ను పొందగా, రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల వర్గం 23 రెట్లు సబ్స్క్రయిబ్ పొందింది. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల కోటా 160 రెట్లు సబ్స్క్రిప్షన్ను పొందింది. అంతకుముందు, కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ.137 కోట్లు సేకరించింది.స్టడ్స్ యాక్సెసరీస్ ఐపీఓ ప్రారంభం కావడానికి ముందే.. ఒక్కో షేరుకు రూ.557-585 ధరల శ్రేణిని నిర్ణయించింది, దీని విలువ దాదాపు రూ.2,300 కోట్లుగా ఉంది. కాగా స్టడ్స్ యాక్సెసరీస్ షేర్లు నవంబర్ 7న ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడతాయి, అయితే కేటాయింపు నవంబర్ 4 నాటికి జరుగుతుందని సమాచారం. - 
      
                   
                                                     
                   
            ఫెస్టివ్ సీజన్లో రికార్డ్ షాపింగ్ రూ.6 లక్షల కోట్లు, ఎందుకో?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుండి దాదాపు 400 వర్గాల ఉత్పత్తులకు జీఎస్టీ టాక్స్ను తగ్గించింది. ఈ టాక్స్ తగ్గింపు పుణ్యమా అని మనోళ్లు తెగ షాపింగ్ చేసేశారుట. పైగా ఫెస్టివ్ సీజన్ కావడంతో ఈ అవకాశాన్ని వినియోగదారులుబాగా వాడుకున్నారు. కార్ల నుండి వంట సామాగ్రి వరకు వస్తువులపై విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించారు. ఫలితంగా అమెరికా ట్రంప్ ప్రభుత్వం విధించిన 50 శాతం దిగుమతి సుంకం ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది అంటున్నారు ఆర్థిక నిపుణులు.రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ బిజోమ్ బ్లూమ్బెర్గ్ న్యూస్తో పంచుకున్న డేటా ప్రకారం వరుసగా దసరా, దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా 6 లక్షల కోట్లు( 67.6 బిలియన్ డాలర్లు) అమ్మకాలు నమోదైనాయి. ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫర్నిషింగ్ మరియు స్వీట్లు వంటి వస్తువులకు అత్యధిక డిమాండ్ ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు బి.సి. భార్టియా ఒక ప్రకటనలో తెలిపారు.సెప్టెంబర్ 22- అక్టోబర్ 21 మధ్య వచ్చిన నవరాత్రి, దీపావళి మధ్య కాలంలో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 8.5శాతం పెరిగాయి. పండుగ షాపింగ్ సమయంలో ప్రెషర్ కుక్కర్లు వంటి ఉత్పత్తులు పన్ను తగ్గింపు వల్ల ప్రయోజనం పొందాయట. మరో విషయం ఏమిటంటే జీఎస్టీ తగ్గింపు వార్తలతో ఆగస్టు మధ్యకాలం నుండి సెప్టెంబర్ చివరి దాకా కొనుగోలుదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారట.భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీదారులు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మరియు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ . నెలవారీ అమ్మకాలు పెరిగాయి, దాదాపు దశాబ్దంలో తొలిసారిగా పన్ను తగ్గింపు కారణంగా కార్ల ధరలు దిగివచ్చాయి. ఇది ఆయాకంపెనీలకు బాగా లాభించాయి.గత సంవత్సరంతో పోలిస్తే బంగారంతో సహా పెద్ద టికెట్ వస్తువులను షాపింగ్ చేయడానికి శుభ దినమైన ధన్తేరాస్ రోజున అమ్మకాలు పుంజుకున్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గత సంవత్సరంతో పోలిస్తే ధన్తేరస్ రోజున అమ్మకాలు 20 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ నవరాత్రి , ధన్తేరాస్ మధ్య లక్ష కంటే ఎక్కువ కార్లను డెలివరీ చేసింది.హెల్మెట్లు లెక్కలేకపోయారటమహాంద్రా ట్రాక్టర్ అమ్మకాలలో 27శాతం పుంజుకున్నాయిమంచి రుతుపవనాలు గ్రామీణ ఆదాయాలను పెంచాయి, దీనికి తోడు పన్ను తగ్గింపు మహీంద్రా ఉత్పత్తుల కొనుగోళ్లకు ఊతమిచ్చాయి. మహీంద్రా ఉత్పత్తి బృందం ఆదివారాల్లో బుకింగ్ల పెరుగుదలను నిర్వహించడానికి పని చేస్తోందని మార్కెటింగ్ , అమ్మకాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ గత వారం పోస్ట్-ఎర్నింగ్స్ కాల్లో తెలిపారు. ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో వంటి ఎంట్రీ-లెవల్ మోడళ్లకు డిమాండ్ ఎంతగా ఉందంటే, మారుతి డీలర్లు ఇప్పుడు ద్విచక్ర వాహనదారులు కార్లకు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు తమ షోరూమ్లలో వదిలిపెట్టిన హెల్మెట్లను లెక్కిస్తున్నారని బెనర్జీ చమత్కరించారు.మరోవైపు పన్ను మార్పులు కొన్ని భారతీయ వ్యాపారాల సప్లయ్ చైన్ కూడా దెబ్బతీసాయని, పాత ధరలకు వస్తువులను ఆఫ్లోడ్ చేయడానికి తొందరపడటంతో అమ్మకాలను దెబ్బతీశాయంటున్నారు మార్కెట్ నిపుణులు. అక్టోబర్ 27నాటి నోట్లో అమ్మకాల పెరుగుదలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అన్నారునోమురా ఆర్థికవేత్తలు సోనాల్ వర్మ , ఆరోదీప్ నంది. ఎందుకంటే దానిలో కొంత భాగం సాధారణం కంటే ఎక్కువగా ఉన్న డిమాండ్ కారణంగా ఉంటుందన్నారు. - 
      
                   
                                                     
                   
            యాక్సిస్ కొత్త మ్యూచువల్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. నవంబర్ 11 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ప్రధానంగా డెట్ ఆధారిత ఫండ్ స్కీముల్లో 50–65 శాతం వరకు, ఆర్బిట్రేజ్ ఫండ్స్లో 35–50 శాతం వరకు, మిగతాది మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.ఈ ఫండ్ స్థిరంగా మెరుగైన రాబడిని, పన్ను ఆదా ప్రయోజనాలను అందిస్తుందని సంస్థ ఎండీ బి. గోప్కుమార్ తెలిపారు. తక్కువ రిస్కుతో, పన్నులు పోగా మరింత మెరుగైన రాబడిని కావాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువుగా ఉంటుందని వివరించారు. దేవాంగ్ షా, ఆదిత్య పగారియా, హార్దిక్ సత్రా, కార్తీక్ కుమార్ ఈ ఫండ్ని నిర్వహిస్తారు. - 
      
                   
                                                     
                   
            స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాలు
భారతదేశంతో పాటు.. చాలా దేశాలలో బంగారానికి భారీ డిమాండ్ ఉంది. అయితే ప్రపంచంలో స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశాల సంఖ్య చాలా తక్కువే. ఈ కథనంలో ఆ దేశాల గురించి తెలుసుకుందాం.చైనాప్రపంచంలో ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన చైనా.. స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశాల జాబితాలో కూడా ఒకటి. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా.. 99.9 శాతం ప్యూర్ గోల్డ్ తయారు చేస్తుంది. బంగారాన్ని బయటకు తీసిన దగ్గర నుంచి.. శుద్దీకరణ వరకు అనేక దశలలో ఎలెక్ట్రోలిటిక్ రిఫైనింగ్ అనే పద్దతులను ఉపయోగిస్తుంది. తద్వారా శుద్ధమైన బంగారం తయారు చేస్తుంది.స్విట్జర్లాండ్స్విట్జర్లాండ్ కేవలం అందమైన దేశం మాత్రమే కాదు.. అత్యంత స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశం కూడా. ఈ దేశంలో తవ్వకం ద్వారా లభించే గోల్డ్ చాలా తక్కువ. అయితే.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి బంగారాన్ని.. ఇక్కడున్న శుద్ధి కర్మాగారాల సాయంతో 99.9 శాతం స్వచ్ఛమైనదిగా తయారు చేస్తారు. గోల్డ్ బార్లను ప్రాసెస్ చేసి తిరిగి ఎగుమతి చేస్తుంది.ఆస్ట్రేలియాస్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో.. ఆస్ట్రేలియా కూడా ఒకటి. ఇక్కడ తవ్వకాల ద్వారా అధిక బంగారం లభ్యమవుతుంది. గనుల నుంచి ముడి పదార్థంగా లభించిన బంగారాన్ని ప్రాసెస్ చేసి.. 99.9 శాతం స్వచ్ఛమైన గోల్డ్ రూపంలోకి మారుస్తారు. ప్యూర్ గోల్డ్ తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీ ఈ దేశంలో అందుబాటులో ఉంది.యునైటెడ్ స్టేట్స్అమెరికాలోని నెవాడా, అలాస్కా, క్యాలిఫోర్నియా, కొలరాడో వంటి ప్రాంతాల్లో బంగారం విరివిగా లభిస్తుంది. ఇక్కడ ముడి పదార్థంగా లభించే బంగారాన్ని.. వివిధ దశల్లో రసాయన పద్దతులను ఉపయోగించి శుద్ధి చేస్తారు. తరువాత నాణేలు, కడ్డీల రూపంలోకి మార్చి ఎగుమతులు చేయడం జరుగుతుంది. యూఎస్ బంగారు ఉత్పత్తులు స్థిరమైన స్వచ్ఛత & కఠినమైన పరీక్షకు ప్రసిద్ధి చెందాయి.కెనడాకెనడా పశ్చిమ ప్రాంతాలలోని బంగారు గనుల నుంచి ముడి పదార్థాలను తవ్వి తీస్తారు. సయనైడ్ లీచింగ్ పద్దతి తరువాత బంగారం వెలుపలికి తీసి.. ఎలెక్ట్రోలిటిక్ రిఫైనింగ్ పద్దతుల ద్వారా శుద్ధి చేస్తారు. ఇక్కడ తయారైన బంగారానికి ప్రపంచంలోని చాలా దేశాల్లో డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో ఊహించని మార్పులురష్యాస్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన రష్యా.. ప్రస్తుతం ఎక్కువ బంగారం ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. రష్యాలో బంగారాన్ని వెలికితీసేందుకు ప్రధానంగా సయనైడ్ లీచింగ్, గ్రావిటీ సెపరేషన్ పద్ధతులను ఉపయోగిస్తారు. బంగారం ఉన్న రాయిని బాగా పొడిచేసి, సోడియం సయనైడ్ ద్రావణంతో కలిపి సయనైడ్ లీచింగ్ ద్వారా ద్రవ రూపంలో వెలికితీస్తారు. తరువాత కార్బన్ పుల్ లేదా జింక్ ప్రిసిపిటేషన్ పద్ధతులు ద్వారా బంగారం తిరిగి ఘనరూపంలో మారుస్తారు. ఇలా అనేక పద్దతుల ద్వారా 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం తయారు చేస్తారు. - 
      
                   
                                                     
                   
            హైదరాబాద్లో స్టీల్ స్ట్రక్చర్స్ యూనిట్
ప్రముఖ స్ట్రక్చరల్ స్టీల్ సంస్థ ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ తమ రెండవ తయారీ యూనిట్ను తెలంగాణలో ప్రారంభించింది. హైదరాబాద్ సమీపంలోని చిట్యాల్ వద్ద రూ.120 కోట్ల పెట్టుబడితో 40 ఎకరాల్లో ఈ తయారీ కేంద్రం ఏర్పాటైంది.నూతన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏటా 50 వేల మెట్రిక్ టన్నుల అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. దీంతో కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం రెండు యూనిట్లలో కలిపి లక్ష మెట్రిక్ టన్నులకు పెరగనుంది.ఈ ఫాబెక్స్ సంస్థ ప్రీ-ఇంజినీర్డ్ నిర్మాణాలు, ఉక్కు అమరికల రూపకల్పన, డిటైలింగ్, తయారీ, ఇన్స్టాలేషన్ వంటి విభాగాల్లో పనిచేస్తుంది. కంపెనీ ప్రస్తుతం విజయవాడలోని యూనిట్ ద్వారా దేశీయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచే ఉత్పత్తుల ఎగుమతులు సైతం చేస్తోంది.ప్రస్తుతం రూ.463 కోట్ల టర్నోవర్ కలిగిన ఫాబెక్స్, 400 మందికి ఉపాధి కల్పిస్తోంది. కార్యకలాపాల విస్తరణతో, ఈ సంఖ్యను 800 మందికి పెంచాలని యోచిస్తోంది. తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రాబోయే 2–3 ఏళ్లల్లో మరో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ వేణు చావా తెలిపారు. - 
      
                   
                                                     
                   
            నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 39.78 పాయింట్లు లేదా 0.047 శాతం లాభంతో.. 83,978.49 వద్ద, నిఫ్టీ 41.25 పాయింట్లు లేదా 0.16 శాతం లాభంతో 25,763.35 వద్ద నిలిచింది.డాల్ఫిన్ ఆఫ్షోర్ ఎంటర్ప్రైజెస్, తంగమైల్ జ్యువెలరీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా, లాంకోర్ హోల్డింగ్స్, బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పంజాబ్ కెమికల్స్ & క్రాప్ ప్రొటెక్షన్, ది గ్రోబ్ టీ కంపెనీ లిమిటెడ్, ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, స్టవ్ క్రాఫ్ట్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) - 
      
                   
                                                     
                   
            సేవింగ్స్ బ్యాంక్ ఖాతా: ఏఐతో వాత!
నాకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఒకటే ఉంది. అందులో జీతమే పడుతుందని కొందరు.. పెన్షన్ తప్ప ఇంకేమీ వేయనని ఇంకొందరు.. మార్చి నెలాఖరుకల్లా చాలా తక్కువ.. అంటే మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంటుందని మరికొందరు చెప్తుంటారు. అక్షరాలా ఇదే నిజమైతే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు వ్యవహారాల మీద ఎలాంటి నిఘా ఉండదు. కేవలం ఫిక్సిడ్ డిపాజిట్ల మీదే దృష్టి ఉంటుందని కొందరి పిడివాదన.డిపార్టుమెంటు వారికి అవేమీ పట్టవు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా అన్ని బ్యాంకులు, అన్ని బ్రాంచీలు ప్రతి సంవత్సరం విధిగా, మీకు సంబంధించిన అన్ని సేవింగ్స్ ఖాతాల వ్యవహారాలను కొన్ని నిబంధనలకు లోబడి డిపార్టుమెంటుకు చేరవేస్తాయి. ఆ చేరవేత, ఆ తర్వాత ఏరివేత.. మెదడుకి మేత.. కృత్రిమ మేథస్సుతో వాత.. వెరసి మీకు నోటీసుల మోత! అసాధారణమైన నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్ వారి దృష్టిలో పడతాయి. వివిధ సంస్థలు, ఏజెన్సీలు ప్రతి సంవత్సరం ‘‘నిర్దేశిత ఆర్థిక వ్యవహారాల’’ను ఒక రిటర్ను ద్వారా తెలియజేస్తాయి.పది లక్షలు దాటిన నగదు డిపాజిట్లుఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి కాని, దఫదఫాలుగా కానీ వెరసి నగదు డిపాజిట్లు రూ. 10,00,000 దాటితే మీ ఖాతా వ్యవహారాలు.. సేవింగ్స్ ఖాతాలో పడినట్లు కాదు.. డిపార్టుమెంటు వారి చేతిలో పడ్డట్లే.విత్డ్రాయల్స్కొందరు తమ ఖాతాల నుంచి పెద్ద మొత్తాలు విత్డ్రా చేస్తారు. వ్యాపారం నిమిత్తం, పెళ్లి ఖర్చుల నిమిత్తం.. ఇలా చేయడం చట్టపరంగా తప్పు కాకపోవచ్చు. అసమంజసంగా అనిపిస్తే ఆరా తీస్తారు. ‘సోర్స్’ గురించి కూపీ లాగుతారు.క్రెడిట్ కార్డులపై భారీ చెల్లింపులుఅకౌంటు ద్వారా పెద్ద పెద్ద మొత్తాలు క్రెడిట్ కార్డుల చెల్లింపులకు వెళ్తుంటాయి. వీటి మీద నిఘా, విచారణ ఉంటాయి.రూ. 30,00,000 దాటిన క్రయ విక్రయాలు..ఇలాంటి క్రయవిక్రయాలను సబ్రిజిస్టార్ వాళ్లు ప్రతి సంవత్సరం రిపోర్ట్ చేస్తారు. వెంటనే బ్యాంకు అకౌంట్లను చెక్ చేస్తారు. సాధారణ పద్దులు/రొటీన్ పద్దులు ఉండే అకౌంట్లలో పెద్ద పెద్ద పద్దులుంటే, వారి అయస్కాంతంలాగా వారి దృష్టికి అతుక్కుపోతాయి.విదేశీయానం.. విదేశీ మారకం..విదేశీయనం నిమిత్తం, విదేశీ చదువు కోసం, విదేశాల్లో కార్డుల చెల్లింపులు... ఇలా వ్యవహారం ఏదైనా కానీ రూ. 10,00,000 దాటితో పట్టుకుంటారు. దీనికి ఉపయోగించిన విదేశీ మారకం, చట్టబద్ధమైనదేనా లేక హవాలానా అనేది ఆరా తీస్తారు.నిద్రాణ ఖాతాల్లో నిద్ర లేకుండా చేసే వ్యవహారాలుకొన్ని సంవత్సరాలపాటు ఎటువంటి లావాదేవీలు ఉండని ఖాతాలను నిద్రాణ లేదా ని్రష్కియ ఖాతాలని అంటారు. వాటిలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద వ్యవహారాలేమైనా జరిగాయంటే.. అధికారుల కళ్లల్లో పడతాయి. ఇలాంటి వ్యవహారాలు అధికారుల దృష్టిని ఆకట్టుకుంటే.. వారు వెంటనే పట్టుకుంటారు.డిక్లేర్ చేయని వ్యవహారాలు చనిపోయిన మావగారు, పెళ్లప్పుడు ఇచ్చిన స్థలాన్నో, ఇళ్లనో ఇప్పుడు అమ్మేసి, వచి్చన ఆ పెద్ద మొత్తాన్ని అకౌంటులో వేసి, ఆయన ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తే అది మౌనరాగం కాదు. గానాబజానా అయిపోతుంది. ఖజానాకి చిల్లులు పడతాయి. పొంతన లేని డివిడెండ్లు.. వడ్డీ.. కొన్న షేర్లు భారీగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్లు కొండంత ఉన్నా డివిడెండ్లు, వడ్డీల రూపంలో ఆదాయం ఆవగింజంత కనిపిస్తోందంటే ..తస్మాత్ జాగ్రత్త.ఎన్నో అకౌంట్లు .. కానీ ఒక్కదాన్నే..కొందరికి ఎన్నో అకౌంట్లు ఉంటాయి. తప్పు లేదు. కానీ వారు ఇన్కంట్యాక్స్ రిటర్నుల్లో ‘ఏకో నారాయణ’ అన్నట్లు ఒక దాన్ని మాత్రమే డిక్లేర్ చేస్తారు. డిపార్టుమెటు వారి దగ్గర మీ పది అకౌంట్ల వివరాలు పదిలంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.వేరే వ్యక్తుల సహాయార్థం.. ఏదో, సహాయమని, బంధువులు, స్నేహితుల పెద్ద పెద్ద వ్యవహారాలను మీ అకౌంట్లలో నడిపించకండి. వివరణ మీరు ఇవ్వాల్సి వస్తుంది.. ఇవ్వగలరా? అప్పులను తిరిగి చెల్లించేటప్పుడే ఆశగా ఎక్కువ వడ్డీ చూపించి, పెద్ద మొత్తాన్ని మీ అకౌంట్లో వేసి, ‘నా పేరు చెప్పకు గురూ’ అని అంటారు.. కానీ, వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేంటి అనే అటలాగా, వీళ్ల వ్యవహారాలేంటి.. వాళ్ల వ్యవహారాలేంటి అని ఆరా తీస్తూ, దొంగ లావాదేవీలు లేదా డిక్లేర్ చేయని లావాదేవీలను డిపార్టుమెంటు వారు కళ్లు మూసుకుని సైతం పట్టేస్తారనే విషయాన్ని అర్థం చేసుకుని మనం కళ్లు తెరుచుకుని ఉండాలి. - 
      
                   
                                                     
                   
            ఎయిర్బ్యాగ్ ఇష్యూ.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం!
పోర్స్చే (Porsche) కంపెనీ భారతదేశంలోని పనామెరా కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ ఈ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, రీకాల్ ప్రభావం ఎన్ని కారుపై ప్రభావం చూపుతుంది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.పనామెరా కారును పోర్స్చే స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 158 యూనిట్లపై ప్రభావం చూపుతుంది. SIAM వెబ్సైట్లో ప్రచురించిన నోటీస్ ప్రకారం.. కారులోని ఎయిర్బ్యాగ్ వ్యవస్థకు సంబంధించిన లోపం కారణంగా రీకాల్ జారీ చేయడం జరిగిందని కంపెనీ స్పష్టం చేసింది.పోర్స్చే పనామెరా యజమానులు.. బ్రాండ్ అధికారిక రీకాల్ పోర్టల్కు వెళ్లి వారి వాహన గుర్తింపు సంఖ్య (VIN)ను ఇన్పుట్ చేసి వారి కారు రీకాల్ జాబితాలో ఉందో.. లేదో అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. 2023 జులై 19 నుంచి 2025 సెప్టెంబర్ 02 మధ్య తయారైన వాహనాలు రీకాల్ జాబితాలో ఉన్నాయి. ఈ సమస్య ప్రమాదంలో వాహన వినియోగదారులపై ప్రభావం చూపిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ రీకాల్ జారీచేయడం జరిగింది.ఇదీ చదవండి: కొత్త స్కూటర్ అమ్మకాల నిలిపివేత!రీకాల్ యూనిట్లలో సమస్యను.. సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది. కాబట్టి దీనికోసం కస్టమర్లు లేదా వినియోగదారులు డబ్బు చెల్లించాల్సిన అవసరామ్ లేదు. కాగా పోర్స్చే గతంలో ఆస్ట్రేలియాలోని పనామెరా కార్లలో కూడా.. ఇలాంటి సమస్యను గుర్తించి వాటికి కూడా రీకాల్ జారీ చేసింది. - 
      
                   
                                                     
                   
            ఉచితంగా ఏఐ సర్వీసులు ఇస్తే లాభమేంటి?
భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో ఉచితంగా ఏఐ (కృత్రిమ మేధస్సు) సేవలు అందుబాటులో ఉండటం అనేది రెండు వైపులా పదునున్న కత్తితో సమానమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఇది వినియోగదారులకు, సాంకేతిక అభివృద్ధికి గొప్ప అవకాశాలను అందిస్తుంది. మరోవైపు, దేశీయ జనరేటివ్ AI ఆవిష్కరణ, స్థానిక డెవలపర్ల దీర్ఘకాలిక పోటీతత్వానికి ఇది తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తుంది.ఉచిత AI సర్వీసులుఖర్చు లేకుండా ఏఐ సాధనాలను ఉపయోగించే అవకాశం లభించడం వల్ల సామాన్య ప్రజలకు కూడా అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. చిన్న వ్యాపారాలు, విద్యార్థులు, కంటెంట్ సృష్టికర్తలు తమ పనులను మెరుగుపరచుకోవడానికి, సృజనాత్మకతను పెంచుకోవడానికి దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఉచిత ప్లాట్ఫామ్లు విద్యార్థులకు, ఔత్సాహిక డెవలపర్లకు ఏఐ మోడల్లతో ప్రయోగాలు చేయడానికి, నేర్చుకోవడానికి, కొత్త పరిష్కారాలను ఆవిష్కరించడానికి ఒక పరీక్షా వేదికలా పనిచేస్తున్నాయి.ఉదాహరణకు, ఉచిత జనరేటివ్ ఏఐ టూల్స్ ద్వారా నివేదికలు రాయడం, ఈమెయిల్లకు సమాధానాలు ఇవ్వడం లేదా కోడింగ్లో సహాయం పొందడం వంటివి పనిలో వేగం, సామర్థ్యాన్ని పెంచుతాయి.లాభాలు ఉన్నప్పటికీ..ఉచిత సేవలను ఉపయోగించేటప్పుడు వినియోగదారులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన డేటాను ఆయా కంపెనీలకు తెలియకుండానే ఏఐకి ఇస్తున్నారు. ఈ డేటాను ఏఐ మోడల్ శిక్షణకు లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు. ఉచిత సంస్కరణలు తరచుగా పరిమిత ఫీచర్లు, తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. క్లిష్టమైన పనులకు లేదా మెరుగైన ఫలితాల కోసం వినియోగదారులు తరచుగా పెయిడ్ (చెల్లింపు) సేవలకు మారవలసి వస్తుంది. ఉచితంగా లభించే కొన్ని AI మోడళ్లు ట్రెయినింగ్ డేటాలోని అంశాలను కూడా యూజర్లకు అందించే అవకాశం ఉంది. దీని వల్ల వినియోగదారులు తప్పుడు ఫలితాలను పొందవచ్చు.కంపెనీలపై ప్రభావంభారతదేశంలో కొత్తగా జనరేటివ్ ఏఐ మోడళ్లను లేదా ఉత్పత్తులను సృష్టిస్తున్న స్థానిక స్టార్టప్లు, డెవలపర్లకు ఇది సవాలుగా మారవచ్చు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు (ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్) తమ ఏఐ సేవలను ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు అందించినప్పుడు స్థానిక స్టార్టప్లు తమ సర్వీసులకు ధర నిర్ణయించలేవు. అధిక పెట్టుబడి, వనరులు, మెరుగైన మోడళ్లను కలిగి ఉన్న అంతర్జాతీయ సంస్థలతో పోటీపడటం అసాధ్యం. కొత్త కంపెనీ ఉత్పత్తుల ద్వారా లాభాలు సంపాదించడం కష్టమని పెట్టుబడిదారులు గ్రహించినప్పుడు స్థానిక ఏఐ స్టార్టప్లకు నిధులు సమకూర్చడం తగ్గిపోతుంది. లాభదాయకత లేకపోవడం వల్ల స్థానిక కంపెనీలు ఆర్ అండ్ డీపై తగినంత పెట్టుబడి పెట్టలేక దేశీయ ఆవిష్కరణకు, ప్రపంచ స్థాయి AI మోడళ్లను నిర్మించడానికి ఆటంకం ఏర్పడుతుంది.ఏఐ సేవలు వాడేటప్పుడు యూజర్లు అనుసరించాల్సినవి..ఉచిత AI సాధనాలు తరచుగా వినియోగదారుల డేటాను శిక్షణ కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాయి. కాబట్టి బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, సున్నితమైన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమాచారం వంటి అత్యంత గోప్యమైన డేటాను ఎప్పుడూ AI సిస్టమ్లలో నమోదు చేయకూడదు.ఏఐ సేవలను ఉపయోగించే ముందు ఆ టూల్స్ డేటా వినియోగ విధానాలు తెలుసుకోవాలి. వారు మీ డేటాను ఎలా నిల్వ చేస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు, ఎవరితో పంచుకుంటారు అనే దానిపై అవగాహన కలిగి ఉండాలి.కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు లేదా ముఖ్యమైన పత్రాల్లో ఈ సమాచారాన్ని ఉపయోగించే ముందు ఏఐ డేటాను విశ్వసనీయ మూలాల ద్వారా ధ్రువీకరించాలి.ఇదీ చదవండి: ‘అడ్డంకులు తొలిగాయి.. లెజెండ్స్ పుట్టారు’ - 
      
                   
                                                     
                   
            ‘నెల జీతాల ఉద్యోగాలు ఉండవ్..’
దేశంలో నెల జీతాల ఉద్యోగాలు ఉండబోవంటూ ఓ ఆర్థిక నిపుణుడు చేసిన హెచ్చరిక కలవరపెడుతోంది. భారతదేశ వైట్ కాలర్ జాబ్ యంత్రం ఆగిపోయే దశకు వచ్చిందని మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరిస్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే “భారతదేశంలో స్థిరమైన జీతం పొందే ఉపాధి యుగం ముగుస్తోంది”ఇటీవలి పాడ్కాస్ట్లో మాట్లాడిన ముఖర్జియా.. “ఉపాధి వృద్ధి ప్రధానంగా ఆగిపోయింది. ఈ పరిస్థితి కనిపించడమే కాదు.. కోలుకోలేనిదిగా ఉంది” అన్నారు. గత ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాల పెరుగుదల తక్కువగా ఉండటమే కాక, భవిష్యత్తులో కూడా వాటి పునరుజ్జీవనం “దాదాపు అసంభవం” అని ఆయన అభిప్రాయపడ్డారు.కారణం ఆటోమేషన్..ఈ పరిణామానికి ప్రధాన కారణాలు ఆటోమేషన్, కార్పొరేట్ సామర్థ్యం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు, ఇప్పుడు ఉద్యోగులను పెంచుకోకుండానే తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నాయి. “ఈ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం చాలా తక్కువ. ఆటోమేషన్ వల్ల ఉద్యోగుల సంఖ్యను పెంచకుండానే ఎదగడం సాధ్యమవుతోంది” అని సౌరభ్ ముఖర్జియా అన్నారుగ్రాడ్యుయేట్ల వెల్లువ.. అవకాశాల కొరతప్రతి సంవత్సరం సుమారు 80 లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్లు భారత శ్రామికశక్తిలోకి ప్రవేశిస్తున్నారు. కానీ వీరికి తగిన అవకాశాలు ఉండటం లేదు. “అధికారిక కార్పొరేట్ నిర్మాణం లేకుండా ఈ కొత్త తరం యువతకు జీవనోపాధి కల్పించడం ఎలా అన్నదే దేశం ఎదుర్కొనే సవాలు” అని ఆయన చెప్పారు. రానున్న సంవత్సరాల్లో దేశంలో పని విధానం పూర్తిగా మారిపోతుందని సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు.గిగ్ ఎకానమీ వైపు ప్రయాణంసాంప్రదాయ వేతన ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతాయనేది సౌరభ్ ముఖర్జియా అంచనా. “డ్రైవర్లు, కోడర్లు, పాడ్కాస్టర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు అందరూ స్వయం ఉపాధి వైపు వెళ్తున్నారు,” అని ఆయన చెప్పారు. “మనం గిగ్ ఉద్యోగాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. జీతం ఆధారిత ఉపాధి యుగం చరిత్రలో కలిసిపోతోంది” అన్నారు.గిగ్ ఎకానమీ భారత్కు కలిసివస్తుందని ముఖర్జియా ఆశాజనకంగా కూడా ఉన్నారు. 29 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న యువ జనాభా, ప్రపంచంలోనే చౌకైన మొబైల్ బ్రాడ్బ్యాండ్, అలాగే ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ వ్యవస్థలు.. ఇవన్నీ భారత్ను “గిగ్ ఎకానమీ” యుగంలో బలంగా నిలబెడతాయని ఆయన నమ్మకం.“సాంప్రదాయ వైట్ కాలర్ ఉద్యోగాలు సవాలుగా మారతాయి. మన జీవితంలో ఎక్కువ భాగం గిగ్ కార్మికులుగా గడపాల్సిన భవిష్యత్తు కోసం మనమూ, మన పిల్లలూ సిద్ధం కావాలి” అని ఆయన స్పష్టం చేశారు. - 
      
                   
                                                     
                   
            ‘అడ్డంకులు తొలిగాయి.. లెజెండ్స్ పుట్టారు’
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల సమక్షంలో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా జట్టుపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో భారత్ మొదటిసారి ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టెక్ పరిశ్రమ దిగ్గజాలు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోషల్ మీడియా వేదికగా ఇండియా జట్టును అభినందించారు.భారతదేశం ప్రతిష్టాత్మక క్రికెట్ విజయాలను గుర్తుచేస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ఫైనల్ను ఉత్కంఠభరితమైన మ్యాచ్గా అభివర్ణించారు. ‘భారత క్రికెట్ మహిళల జట్టుకు అభినందనలు. ఈ విజయంతో 1983, 2011నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ విజయం మొత్తం తరానికి స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా టీమ్కు కూడా ఇదో గొప్ప టోర్నమెంట్’ అని తన ఎక్స్ ఖాతాలో టీమ్ ఇండియాను అభినందించారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ విజయంపై స్పందిస్తూ..‘ఉమెన్ ఇన్ బ్లూ = ప్రపంచ ఛాంపియన్లు! మహిళల క్రికెట్కు నిజంగా చారిత్రక రోజు. కొత్త అధ్యాయాలు లిఖించారు. అడ్డంకులు తొలిగాయి. లెజెండ్స్ పుట్టుకొచ్చారు. ఈ ఫార్మాట్లో తొలిసారి ఫైనల్కు చేరిన దక్షిణాఫ్రికాకు ప్రశంసలు’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్పై ఈడీ చర్య - 
      
                   
                                                     
                   
            ఎన్నడూ లేనన్ని కార్లు ఒక్క నెలలో కొనేశారు..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గత అక్టోబర్ నెలలో దేశంలో అత్యధిక వాహనాలు విక్రయించిన ఆటోమేకర్ టైటిల్ను సంపాదించింది. ఆ నెలలో 2,20,894 యూనిట్ల డిస్పాచ్తో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది.పండుగ సీజన్లో బలమైన డిమాండ్, బ్రాండ్ కాంపాక్ట్ కార్లు, యుటిలిటీ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి కారణంగా అమ్మకాల పనితీరు పెరిగింది. దేశీయ అమ్మకాలు 180,675 యూనిట్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇందులో ప్యాసింజర్, లైట్ కమర్షియల్ వాహనాలు రెండూ ఉన్నాయి. కంపెనీ ఇతర ఓఈఎంలకు 8,915 యూనిట్లను పంపిణీ చేయగా, ఎగుమతులు 31,304 యూనిట్లు.దేశీయ ప్యాసింజర్ వాహనాల విభాగంలో, మారుతి సుజుకి అక్టోబర్లో 176,318 యూనిట్లను విక్రయించింది. బాలెనో, స్విఫ్ట్, వేగనార్, డిజైర్, సెలెరియో, ఇగ్నిస్ వంటి మోడళ్లను కలిగి ఉన్న కాంపాక్ట్ కార్ శ్రేణి గణనీయమైన అమ్మకాలను పెంచింది. 76,143 యూనిట్ల అమ్మకాలతో ఇది చిన్న-కార్ల రంగంలో బలమైన డిమాండ్ను సూచిస్తోంది. ఇక ఆల్టో, ఎస్-ప్రెస్సోలను కలిగి ఉన్న మినీ విభాగంలో 9,067 యూనిట్లు అమ్ముడయ్యాయి.బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, విక్టోరిస్, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లు సమిష్టిగా 77,571 యూనిట్లను అందించడంతో కంపెనీ యుటిలిటీ వెహికల్ లైనప్ గణనీయమైన వృద్ధి చోదకంగా కొనసాగింది. ఈకో వ్యాన్ నెలవారీ మొత్తానికి 13,537 యూనిట్లను జోడించగా, సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వెహికల్ మరో 4,357 యూనిట్లను అందించింది. - 
      
                   
                                                     
                   
            భారత్ బయోటెక్ యజమాన్య సంస్థగా న్యూసిలియన్ థెరప్యూటిక్స్
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (CRDMO) అయిన న్యూసిలియన్ థెరప్యూటిక్స్ను తన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసింది. జీనోమ్ వ్యాలీలో ఉన్న ఈ సీఆర్డీఎంఓ క్యాన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అరుదైన జన్యుపరమైన వ్యాధులకు అధునాతన చికిత్సల కోసం వరల్డ్ లైఫ్ సైన్స్ ఆవిష్కర్తలకు మద్దతు ఇస్తోంది. ఈ కంపెనీ ప్లాస్మిడ్ డీఎన్ఏ, వైరల్ వెక్టార్స్, ఆటోలోగస్, అల్లోజెనిక్ సెల్ థెరపీ విభాగాల్లో కొత్త చికిత్సలను అభివృద్ధి చేస్తుంది.సెల్ అండ్ జీన్ థెరపీ(CGT)లపై దృష్టి‘ఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలో భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయి. అందులో సెల్ అండ్ జీన్ థెరపీలు కీలకంగా ఉంటాయి. అధునాతన థెరపీ ప్లాట్ఫామ్లను భారతదేశ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలో ఏకీకృతం చేయడం, సంక్లిష్టమైన, అరుదైన వ్యాధులకు పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని న్యూసిలియన్ థెరప్యూటిక్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా ఒక ప్రకటనలో తెలిపారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..న్యూసిలియన్ థెరప్యూటిక్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘు మాలపాక మాట్లాడుతూ..‘ఈ కొత్త కంపెనీ క్లినికల్ నుంచి కమర్షియల్ సమస్యలకు సంబంధించిన ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలను అందిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు(FDA, EMA) అనుగుణంగా ఉంటుంది. అరుదైన జన్యు రుగ్మతలు, క్యాన్సర్ వంటి వ్యాధుల కట్టడికి పరిష్కారాలు అందిస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్పై ఈడీ చర్య - 
      
                   
                                                     
                   
            అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్పై ఈడీ చర్య
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై మనీలాండరింగ్ ఆరోపణల దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగవంతం చేసింది. సుమారు రూ.3,084 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. అక్టోబర్ 31న జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.జప్తు చేసిన ఆస్తుల వివరాలుమనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్లో ఉన్న అనిల్ అంబానీ కుటుంబ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్ ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఎనిమిది నగరాల్లోని ఆస్తులు జప్తు అయ్యాయి. సుమారు రూ. 3,084 కోట్లు విలువ చేసే ఆ ఆస్తులు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో నివాస భవనాలు, కార్యాలయ ప్రాంగణాలు, భూములున్నాయి.అసలు కేసు ఏంటి?అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ యెస్ బ్యాంక్ నుంచి సమీకరించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాలకు మళ్లించి మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సేకరించిన నిధుల మళ్లింపుపై దర్యాప్తు జరుగుతోంది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ RHFLకు రూ.2,965 కోట్లు, RCFLకు రూ.2,045 కోట్లు ఇచ్చింది. అయితే వీటిని తిరిగి చెల్లించడంలో అనిల్ అంబానీ, తన ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థలు విఫలమయ్యాయి.ఈడీ దర్యాప్తులో అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ లింక్డ్ సంస్థలకు పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, రుణాల మంజూరు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారాన్ని ఈడీ ఉద్దేశపూర్వక, స్థిరమైన నియంత్రణ వైఫల్యాలుగా అభివర్ణించింది. కొన్ని కంపెనీలు దరఖాస్తు చేసిన అదే రోజున రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపింది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు సమర్పించడానికి ముందే రుణాలు అడ్వాన్స్ చేసినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ఆల్ఫాబెట్, అమెజాన్ల పంట పండించిన స్టార్టప్ - 
      
                   
                                                     
                   
            ఒక్క రూపాయికే జియో హాట్స్టార్!?
మనలో చాలా మంది వినియోగించే స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అదీ ప్రీమియం ఫీచర్లతో ఒక్క రూపాయికే వస్తే.. సూపర్ ఆఫర్ అనుకుంటున్నారు కదా.. ఇలాంటి ఆఫరే సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అనేక మంది వినియోగదారులు రూ.1కే డిస్నీ+ హాట్స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ పొందినట్లు పోస్ట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన పేమెంట్ స్క్రీన్షాట్లు కూడా షేర్ చేయడంతో ఈ ఆఫర్పై ఉత్సుకత మరింత పెరిగింది.అయితే, జియో లేదా డిస్నీ+ హాట్స్టార్ మాత్రం ఇప్పటివరకు ఈ ఆఫర్పై అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా జియో ఇలాంటి ఆఫర్లు పరిమితంగా ఎంపిక చేసిన కొంత కస్టమర్లకు మాత్రమే ఇస్తుంటుంది. ఇది కూడా అలాంటి పరిమిత ట్రయల్ లేదా అంతర్గత టెస్టింగ్ దశలో భాగం కావచ్చని అంచనా.ఏముంది ప్లాన్లో?ఈ ఆఫర్ను పొందిన వినియోగదారుల చెబుతున్నదాని ప్రకారం.. జియోస్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్లో ఉన్న అన్ని ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, స్పోర్ట్స్, షోలను ప్రకటనలు లేకుండా చూడొచ్చు. డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్ 4కే నాణ్యతతో వీడియోలు ఏకకాలంలో నాలుగు డివైజ్లలో వరకు చూసే అవకాశం. మొబైల్, టీవీ, టాబ్లెట్, ల్యాప్ టాప్లలో సబ్స్క్రిప్షన్ను పంచుకునే అవకాశం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోంది.కొన్ని స్క్రీన్షాట్ల ప్రకారం.. 1 రూపాయికి 3 నెలల సబ్స్క్రిప్షన్ అని ఉండగా మరొకొన్నివాటిల్లో వార్షిక సబ్స్క్రిప్షన్గా కూడా ఉంది. అయితే, ట్రయల్ కాలం 30 రోజులు మాత్రమే ఉండవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్ రిన్యూవల్ సమయంలో పూర్తి చార్జీలు వర్తించవచ్చు.ఈ ఆఫర్ జియో సిమ్ వినియోగదారులు మాత్రమే కాకుండా కొంతమంది నాన్-జియో యూజర్లు కూడా వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది యూజర్లు రూ.1కే ఒక సంవత్సరం ప్రీమియం ప్లాన్ యాక్టివేట్ అయినట్లు చెబుతున్నారు. ఇది యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే కనిపించే ప్రమోషన్ కావచ్చని భావిస్తున్నారు. - 
      
                   
                                                     
                   
            ఆల్ఫాబెట్, అమెజాన్ల పంట పండించిన స్టార్టప్
టెక్ దిగ్గజాలు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, అమెజాన్ ఇటీవల ప్రకటించిన తమ మూడో త్రైమాసికం (క్యూ3) లాభాల్లో అద్భుతమైన వృద్ధి సాధించాయి. దీనికి ప్రధాన కారణం ఈ రెండు కంపెనీలు ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్లో చేసిన పెట్టుబడులు గణనీయంగా పెరగడమే. క్లాడ్ చాట్బాట్ సర్వీసులు అందిస్తున్న ఆంత్రోపిక్ లాభాలు పెరగడం ఈ కంపెనీలకు కలిసొచ్చింది.క్యూ3లో భారీ లాభాలుగత వారం వెలువడిన ఫలితాల ప్రకారం ఆల్ఫాబెట్ తన లాభంలో ఈక్విటీ సెక్యూరిటీలపై నికరంగా 10.7 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా ఆంత్రోపిక్ వాటా విలువ పెరిగినట్లు చెప్పింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ క్యూ3 లాభం 38% పెరిగింది. ఆంత్రోపిక్లో దాని పెట్టుబడి నుంచి వచ్చిన 9.5 బిలియన్ డాలర్లు నాన్-ఆపరేటింగ్ ఆదాయంలో ప్రతిబింబించింది.ఆంత్రోపిక్ అందించే సేవలుక్లాడ్ (Claude) - జనరేటివ్ ఏఐ అసిస్టెంట్క్లాడ్ అనేది ఆంత్రోపిక్ ప్రధాన ఉత్పత్తి. ఇది నెక్స్ట్ జనరేషన్ ఏఐ అసిస్టెంట్. దీన్ని సంభాషణాత్మక, టెక్స్ట్ ప్రాసెసింగ్ పనుల కోసం రూపొందించారు. ఇది లార్జ్ డాక్యుమెంట్లు లేదా సంభాషణల సారాంశాన్ని అందిస్తున్నారు. కథనాలు, కంటెంట్, కోడ్ రాయడంలో సహాయం చేస్తుంది. రాసిన కోడింగ్ను డీబగ్గింగ్ చేస్తుంది. ఇది చాట్ ఇంటర్ఫేస్ ద్వారా (Claude.ai), డెవలపర్ల కోసం ఏపీఐ ద్వారా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా? - 
      
                   
                                                     
                   
            బంగారం ధరలు మళ్లీ రివర్స్.. ఒక్క గ్రాము..
పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త పెరిగాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) - 
      
                   
                                                     
                   
            నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు తగ్గి 25,664కు చేరింది. సెన్సెక్స్(Sensex) 276 పాయింట్లు నష్టపోయి 83,645 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) - 
      
                   
                                                     
                   
            ఇన్వెంటరీ ఆధారిత ఈ–కామర్స్లోకి ఎఫ్డీఐ
ఇన్వెంటరీ ఆధారిత ఈ–కామర్స్ ఎగుమతుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించే ప్రతిపాదనను కేంద్ర వాణిజ్య శాఖ తీసుకొచ్చింది. దీనిపై పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలను అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. దీనివల్ల ఈ–కామర్స్ ఎగుమతులను గణనీయంగా పెంచుకోవచ్చని, అదే సమయంలో దేశీయంగా చిన్న వర్తకుల ప్రయోజనాలను కాపాడుకోవచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. దేశంలో తయారైన వాటికి సంబంధించి దీన్ని అమలు చేయాలనుకుంటోంది.ప్రస్తుతం ఇన్వెంటరీ ఆధారిత ఈ–కామర్స్ రంగంలో ఎఫ్డీఐలకు అనుమతి లేదు. ఇన్వెంటరీ నమూనా అంటే.. విక్రేతల (సెల్లర్స్) స్థానంలో ఈ–కామర్స్ సంస్థలు ఉత్పత్తులను తమ రెవెన్యూ పుస్తకాల్లో కలిగి ఉంటాయి. దీంతో ఈ–కామర్స్ సంస్థలు కేవలం ప్లాట్ఫామ్ మాదిరిగా కాకుండా విక్రతలుగానూ వ్యవహరించొచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు మార్కెట్ప్లేస్ (కొనుగోలుదారులు, విక్రయదారులకు మధ్యవర్తిత్వ వేదిక)గానే వ్యవహరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల్లోకి 100 శాతం ఎఫ్డీఐకి ఆటోమేటిక్ మార్గంలో (అనుమతులు అవసరం లేని) అనుమతి ఉంది.ఈ–కామర్స్ సంస్థలు కేవలం ఎగుమతులకు సంబంధించిన ఇన్వెంటరీ కలిగి ఉంటే తమకు అభ్యంతరం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్ గత నెలలో ప్రకటించడం గమనార్హం. ఈ–కామర్స్ ఎగుమతులు ప్రస్తుతం 2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. అదే చైనా నుంచి ఈ–కామర్స్ ఎగుమతులు 350 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. దీంతో కేంద్ర ప్రభుత్వం.. తాజా ప్రతిపాదన తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా? - 
      
                   
                                                     
                   
            సమతూకమైన పోర్ట్ఫోలియోకు ఇన్కం–ఆర్బిట్రేజ్ ఫండ్స్
ధరల పెరుగుదల, మారిపోతున్న ఆర్థిక లక్ష్యాలు, అంతటా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇటు స్థిరంగా ఉంటూ అటు సమర్ధంగా పనిచేయగలిగే విధంగా సమతౌల్యతను పాటించే సాధనాల కోసం ఇన్వెస్టర్లు అన్వేషిస్తున్నారు. సాంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో సాధారణంగా, – అయితే భద్రత, లేకపోతే వృద్ధి – ఇలా ఏదో ఒక దాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) హైబ్రిడ్ విధానాన్ని అందిస్తాయి. మార్కెట్ టైమింగ్పై లేదా డైనమిక్ మార్పులపైన ఆధారపడకుండా ఇటు డెట్ అటు ఆర్బిట్రేజ్ వ్యూహాల సామర్థ్యాల మేళవింపుగా ఇది ఉంటుంది. తక్కువ ఒడిదుడుకులతో మెరుగైన రాబడులు అందిస్తాయని వీటికి పేరుంది. కాబట్టే, మధ్యకాలిక వ్యవధికి లిక్విడిటీ, పన్ను ఆదా ప్రయోజనాలు, పెట్టుబడి సంరక్షణను కోరుకునే ఇన్వెస్టర్లకు ఇవి ఆసక్తికరంగా ఉండగలవు. ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఎఫ్వోఎఫ్లుఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) స్వరూపం ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి ప్రధానంగా నిర్దిష్ట డెట్ ఆధారిత ఫండ్స్లో (65 శాతం వరకు), మిగతా మొత్తాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ సాధనాల స్థిరత్వాన్ని, అలాగే ఈక్విటీ మార్కెట్లలో ధరల్లో స్వల్పకాలిక తేడాలను ఒడిసిపట్టుకుని, అధిక రాబడులు అందించగలిగే ఆర్బిట్రేజ్ వ్యూహాన్ని కలగలిపి మెరుగైన ఫలితాలను అందించడం ఈ వ్యూహం లక్ష్యం. ఫైనాన్స్ చట్టం 2024 (నం.2) కింద ఏదైనా ఎఫ్వోఎఫ్ తన పోర్ట్ఫోలియోలో 35 శాతం నుంచి 65 శాతం వరకు మొత్తాన్ని ఆర్బిట్రేజ్ స్కీములకు (పన్ను విధింపునకు సంబంధించి వీటిని ఈక్విటీగా పరిగణిస్తారు) కేటాయిస్తే, దాన్ని నాన్–స్పెసిఫైడ్ మ్యుచువల్ ఫండ్గా వ్యవహరిస్తారు.ఈ వర్గీకరణ వల్ల ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్స్ ప్రత్యేకమైన పన్నుపరమైన ప్రయోజనాన్ని కూడా అందిస్తాయి. అదేమిటంటే, యూనిట్లను రెండేళ్లు లేదా అంతకు మించిన వ్యవధికి అట్టే పెట్టుకునే ఇన్వెస్టర్లకు ఇండెక్సేషన్ ప్రయోజనాలతో 12.5% ట్యాక్స్ రేటు వర్తిస్తుంది. సాధారణంగా హోల్డింగ్ పీరియడ్తో సంబంధం లేకుండా ఇన్వెస్టర్ శ్లాబ్ రేట్కి తగ్గట్లుగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తించే సంప్రదాయ సాధనాలతో పోలిస్తే ఇది పన్ను ఆదా ప్రయోజనాలను కల్పిస్తుంది. 2–5 ఏళ్ల మధ్యకాలిక పెట్టుబడి వ్యవధికి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్స్ అనువైనవి. ఎవరికి మేలంటే..ఒక మోస్తరు సంపద వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంటూనే, మూలధనాన్ని కాపాడుకునేందుకు తక్కువ రిస్కులున్న సాధనాల కోసం అన్వేషించే మదుపరులకు ఇవి ఉపయోగకరం. పెద్దగా రిస్క్ తీసుకోకుండా, ఫిక్సిడ్ ఇన్కం సాధనాల్లో పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని కోరుకునే వారు పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ఇవి సహాయకరం. ప్రస్తుతం వడ్డీ రేట్లు మారుతుండటం, అంతర్జాతీయంగా అనిశ్చితులు, ఆర్థిక విధానాలు మారిపోతుండటం తదితర పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకెళ్లే క్రమంలో ఇన్వెస్టర్లకు ఈ పెట్టుబడి వ్యూహం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.స్థిరమైన ఆదాయం: మార్కెట్ షాక్లను తట్టుకునేందుకు డెట్ సాధనం ఉపయోగపడుతుంది. నమ్ముకోతగిన ఆదాయ వనరుగా నిలుస్తుంది. అలాగే ఈక్విటీల్లో పెట్టుబడులపరంగా ఎదురయ్యే ఒడిదుడుకులను తగ్గిస్తుంది. సరళతరం, లిక్విడిటీ: లాకిన్ పీరియడ్లు ఉండే సంప్రదాయ సొల్యూషన్స్తో పోలిస్తే ఈ ఫండ్స్ సాధారణంగా మరింత మెరుగైన లిక్విడిటీని ఆఫర్ చేస్తాయి. భారీ పెనాల్టీల భారం లేకుండా కావాల్సినప్పుడు తమ యూనిట్లను రిడీమ్ చేసుకునేలా ఇన్వెస్టర్లకు వెసులుబాటు కల్పిస్తాయి.ప్రాక్టికల్ ప్రయోజనాలు: నిర్దిష్ట డెట్, ఆర్బిట్రేజ్ స్కీముల మధ్య కేటాయింపులను ఫండ్ మేనేజరే అటూ, ఇటూ మారుస్తుండటం వల్ల (ఫండ్ ఆఫ్ ఫండ్ స్వభావరీత్యా) ఇన్వెస్టరుపై ట్యాక్స్ లయబిలిటీ ఉండకపోవడమనేది ఈ తరహా ఫండ్ ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. ఎఫ్ఓఎఫ్ స్వరూపరీత్యా అంతర్గతంగానే ఈ మార్పులు జరగడం వల్ల, యూనిట్లను రిడీమ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్టర్లకు ట్యాక్స్ భారం పడుతుంది. ఆ విధంగా ఇది తక్కువ వ్యయాలతో కూడుకున్న, పన్ను ఆదాపరమైన ప్రయోజనాలను కల్పించే విధంగా ఉంటుంది. ఫిక్సిడ్ ఇన్కం పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని కోరుకునే ఇన్వెస్టర్లు, మధ్యకాలిక లక్ష్యాలకు ప్లాన్ వేసుకుంటున్న వారు, పోర్ట్ఫోలియోకి మరింత రక్షణ కవచాన్ని ఏర్పర్చుకోదల్చుకున్న వారు ఈ ఫండ్స్ను తప్పక పరిశీలించవచ్చు.ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా? - 
      
                   
                                                     
                   
            పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?
నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జయ్దేవ్ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. రాబడితోపాటు పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ప్రతీ పెట్టుబడి ఆప్షన్లో ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో రాబడులు ఇస్తాయని కచ్చితంగా చెప్పలేం. రాబడులు ఇవ్వొచ్చు. నష్టాలూ ఇవ్వొచ్చు. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. పెట్టుబడి అవసరమైన సమయంలో మార్కెట్లు దిద్దుబాటును చూస్తే రాబడిని నష్టపోవాల్సి రావచ్చు.స్వల్పకాలం కోసం అయితే అస్థితరల రిస్క్ను అధిగమించేందుకు డెట్ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఐదేళ్లు, అంతకుమించిన కాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల అస్థిరతల ప్రభావాన్ని అధిగమించొచ్చు. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, రాబడుల అంచనాల ఆధారంగా డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. నేను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో రూ.4 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. మూడేళ్లు అయింది. ఇప్పుడు నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? – శ్యామ్ ముఖర్జీసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. 8.2 శాతం వార్షిక రాబడిని మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షిస్తుంటుంది. అయినప్పటికీ డిపాజిట్ చేసే రోజు ఉన్న రేటు ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లకు ముందుగానే వైదొలగాలంటే అందుకు ఫారమ్–2 సమర్పించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన కాలవ్యవధి ఆధారంగా కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటి వరకు మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు.ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద మినహాయించి, మిగిలినది చెల్లిస్తారు. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మీరు మూడేళ్ల తర్వాత డిపాజిట్ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు. కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్సీఎస్ఎస్ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించిన కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా ఎలాంటి పెనాల్టీ పడదు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలా? - 
      
                   
                                                     
                   
            ఫలితాలు, ట్రేడ్ డీల్స్ కీలకం
ఇకపై వడ్డీ రేట్ల కోతకు చెక్ పెట్టనున్నట్లు యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడంతో గత వారం చివర్లో మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే గత నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాలు వీడి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం సైతం క్యూ2 ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నట్లు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం..– సాక్షి బిజినెస్ డెస్క్దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ఈ వారం నాలుగు రోజులకే పరిమితంకానుంది. గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం(5న) మార్కెట్లు పనిచేయవు. ఇప్పటికే జోరందుకున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు రానుంది. ఈ వారం సైతం పలు దిగ్గజాలు జూలై–సెపె్టంబర్(క్యూ2) పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, పీఎస్యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాసహా.. అదానీ పోర్ట్స్, టైటన్ కంపెనీ, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఆటో, హిందాల్కో తదితరాలు చేరాయి. దీంతో దిగ్గజాల క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. పీఎంఐ గణాంకాలు దేశీయంగా అక్టోబర్ నెలకు హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసులు తదితర పీఎంఐ గణాంకాలు ఈ వారం వెలువడనున్నాయి. మరోపక్క యూఎస్ వ్యవసాయేతర ఉపాధి, తయారీ పీఎంఐ, సర్వీసుల ఐఎస్ఎం గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ వారం మార్కెట్ల ట్రెండ్లో గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్ టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్.పొన్మూడి తెలియజేశారు. ఈ గణాంకాలతోపాటు యూఎస్తో చైనా, భారత్ నిర్వహిస్తున్న వాణిజ్య టారిఫ్లపై చర్చలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఇతర అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లపై క్యూ2 ఫలితాలు, ఆర్థిక గణాంకాలు, వాణిజ్య చర్చలతోపాటు.. పలు ఇతర అంశాలు సైతం ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు వివరించారు. రష్యా చమురుపై యూఎస్ ఆంక్షలు, ఒపెక్ ఉత్పత్తి ప్రణాళికలు వంటి అంశాలు ముడిచమురు ధరలను ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు క్రమంగా బలపడుతున్న అంశాన్ని ప్రస్తావించారు. డాలరు ఇండెక్స్ 99.72ను తాకడం ద్వారా 100కు చేరువైనట్లు తెలియజేశారు. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతోంది. డాలరుతో మారకంలో 89 సమీపానికి నీరసించింది. చమురు ధరలు పుంజుకోవడానికితోడు రూపాయి బలహీనపడితే దిగుమతుల బిల్లు పెరిగి వాణిజ్య లోటు మరింత పెరిగేందుకు దారితీస్తుందని వివరించారు. గత వారమిలా పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా బలహీనపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 273 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 83,939 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ సైతం 73 పాయింట్ల(0.3 శాతం) నష్టంతో 25,722 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1 శాతం బలపడగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పుంజుకుంది.పెట్టుబడులవైపు ఎఫ్పీఐలుఅక్టోబర్లో రూ. 14,610 కోట్లు గత మూడు నెలలుగా దేశీ స్టాక్స్లో విక్రయాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత నెల(అక్టోబర్)లో నికర కొనుగోలుదారులుగా యూటర్న్ తీసుకున్నారు. వెరసి అక్టోబర్లో రూ. 14,610 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. యూఎస్ వడ్డీ రేట్ల కోత అంచనాలు, యూఎస్, భారత్ మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు, దేశీ కార్పొరేట్ల పటిష్ట ఫలితాలు వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అంతకుముందు నెల(సెపె్టంబర్)లో ఎఫ్పీఐలు నికరంగా దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 23,885 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఆగస్ట్లో రూ. 35,000 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్లు చొప్పున విక్రయాలు చేపట్టారు. అయితే జీఎస్టీ సంస్కరణలు తదితర పలు సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్పీఐలు గత వారం తిరిగి దేశీయంగా పెట్టుబడుల బాట పట్టినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ చూస్తే ఎఫ్పీఐలు నికరంగా దేశీ స్టాక్స్లో రూ. 1.4 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం!సాంకేతిక అంచనాలివీగత వారం కార్పొరేట్ ఫలితాలు, జీఎస్టీ సంస్కరణలు, ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలతో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే ఫెడ్ తదుపరి రేట్ల కోతకు చెక్ పెట్టనున్నట్లు తాజా పాలసీ సమీక్షలో సంకేతమివ్వడంతో సెంటిమెంటు బలహీనపడింది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే పటిష్ట కార్పొరేట్ ఫలితాలు, ప్రోత్సాహకర గణాంకాలు వంటి అంశాలు మార్కెట్లకు బలాన్నివ్వనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతికంగా చూస్తే నిఫ్టీ ఇటీవల 26,100 పాయింట్ల వద్ద అవరోధాలు(రెసిస్టెన్స్) ఎదుర్కొంటోంది. వెరసి 26,000 పాయింట్లకు ఎగువన బలమైన కొనుగోళ్ల మద్దతు లభించడం లేదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా మరోసారి ఈ స్థాయిలో బలహీనపడితే.. 25,600 దిగువకు చేరవచ్చని తెలియజేశారు. 25,400–350 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించవచ్చని అంచనా వేశారు. ఇక సెన్సెక్స్ సైతం 85,100 పాయింట్ల నుంచి వెనకడుగు వేసింది. అయితే మరోసారి 85,000 స్థాయిని అధిగమించేందుకు వీలుంది. ఒకవేళ బలహీనపడితే సమీప భవిష్యత్లో 83,300–83,000 పాయింట్లకు చేరవచ్చు. - 
      
                   
                                                     
                   
            రిటర్నులకు ఇంకా చాన్సుంది..!
ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు (ఐటీఆర్) గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. ఏదైనా కారణాలతో గడువు లోపు రిటర్నులు సమర్పించలేకపోతే.. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కొంత పెనాల్టీ చెల్లించడం ద్వారా ఆదాయపన్ను చట్టం నిబంధనల కింద రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఇందుకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉంది. ఇక గడువు ముగియడానికి చివరి గడియల్లో హడావుడిగా రిటర్నులు దాఖలు చేసిన వారు సైతం, అందులో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిచేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలన్నది చూద్దాం. – సాక్షి, బిజినెస్ డెస్క్ఈ ఏడాది రిటర్నుల దాఖలుకు ఆదాయపన్ను శాఖ అదనపు సమయం ఇచ్చింది. జూలై 31గా ఉన్న గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. చివరి రోజుల్లో ఈ–ఫైలింగ్ పోర్టల్పై సాంకేతిక సమస్యలు రావడంతో సెప్టెంబర్ 16 వరకు రిటర్నులు సమర్పించేందుకు అవకాశం ఇచ్చింది. అయినా సరే సకాలంలో రిటర్నులు సమర్పించని వారు ఇప్పుడు బిలేటెడ్ (ఆలస్యంగా) ఐటీఆర్ను సెక్షన్ 139(1) కింద సమర్పించొచ్చు. ఇందుకు డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంటుంది. కాకపోతే పెనాల్టీ కట్టాలి. అంతేకాదు, ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే, వడ్డీతోపాటు కట్టేయాలి. సెక్షన్ 234ఎఫ్ కింద.. ఆదాయం రూ.5 లక్షలకు మించని వారు రూ.1,000 బిలేటెడ్ రిటర్నుల ఫీజు కింద చెల్లించాలి. ఆదాయం రూ.5 లక్షలు మించితే రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు.. సెక్షన్ 234ఏ కింద నికరంగా చెల్లించాల్సిన పన్నుపై, గడువు ముగిసిన నాటి నుంచి నెలవారీ ఒక శాతం చొప్పున వడ్డీని చెల్లించాలి. అప్పటికే సంబంధిత పన్ను చెల్లింపుదారు పాన్పై నమోదైన టీడీఎస్, ముందస్తు పన్ను చెల్లింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నికరంగా చెల్లించాల్సిన మొత్తంపైనే వడ్డీ పడుతుందని బీడీవో ఇండియా ఎల్ఎల్పీ ట్యాక్స్ పార్ట్నర్ ప్రీతి శర్మ తెలిపారు. అసలు చెల్లించాల్సిన తేదీ నుంచి, రిటర్నులు సమర్పించే తేదీ వరకు ఈ వడ్డీని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద పన్ను బాధ్యత రూ.10,000కు మించి ఉంటే అందులో 90 శాతాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగియక ముందే చెల్లించాలని (ముందస్తు పన్ను) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రకారం.. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నికర పన్ను మొత్తంలో 90 శాతాన్ని ముందుగా చెల్లించడంలో విఫలమైతే అప్పుడు సెక్షన్ 234బీ కింద నిబంధనలు అమలవుతాయి. వీటి కింద ఆర్థిక సంవత్సరం ముగిసిన మర్నాటి నుంచి (ఏప్రిల్ 1) పన్ను మొత్తంపై వడ్డీ రేటు అమల్లోకి వస్తుంది. ఇక సెక్షన్ 234సీ కింద సంబంధిత త్రైమాసికం చివరి తేదీ నాటికి ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైనా, లేదా తక్కువ చెల్లించినా.. అప్పుడు క్వార్టర్ వారీ పరిశీలన తర్వాత వడ్డీ రేటు అమలు చేస్తారు. ఒకవేళ త్రైమాసికం వారీ ముందస్తు పన్ను చెల్లింపుల్లో విఫలమై, ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా గడువులోపు రిటర్నులు సమర్పించి, పన్ను బకాయిని వడ్డీ సహా చెల్లించలేకపోతే.. అలాంటి సందర్భాల్లో ఈ మూడు సెక్షన్ల (234ఏ, బీ, సీ) కింద మూడు రెట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ప్రీతి శర్మ వివరించారు. దీంతో చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోతుంది. ఈ భారం వద్దనుకుంటే నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించడమే చక్కని మార్గం. జాప్యం చేస్తే నష్టమే.. గడువులోపు రిటర్నులు దాఖలు చేసినట్టయితే పాత, కొత్త పన్ను విధానాల్లో తమకు అనుకూలమైన దాన్ని (తక్కువ పన్ను భారం పడే) ఎంపిక చేసుకోవచ్చు. కానీ, గడువు దాటితే విధిగా కొత్త పన్ను విధానం కిందే సమర్పించగలరు. అంతేకాదు సెక్షన్ 10ఏ, 10బీ, 80–1ఏ, 80–ఐబీ, 80–ఐసీ, 80–ఐడీ, 80–ఐఈ కింద వ్యాపార, మూలధన నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకోవడం కుదరదు. గడువులోపు రిటర్నులు సమర్పించిన వారికే ఈ నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ‘‘గడువు తర్వాత కొత్త పన్ను విధానం కింద రిటర్నులు వేసేట్టు అయితే స్వీయ నివాసానికి సంబంధించి నష్టాలను లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు లేదా తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉండదు. అద్దెకు ఇచ్చిన నివాసం రూపంలో నష్టం ఏర్పడితే, కేవలం క్యారీ ఫార్వార్డ్ (తదుపరి ఆర్థిక సంవత్సరాలకు ) చేసుకునేందుకే అవకాశం ఉంటుంది’’ అని ప్రీతి శర్మ తెలిపారు. అలస్యంగా డిసెంబర్ 31లోపు దాఖలు చేసినప్పటికీ, సాధారణ ఐటీఆర్ మాదిరే మదింపు చేస్తారు. నికరంగా పన్ను చెల్లించాల్సిన వారే రిటర్నులు వేయాలని లేదు. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు సైతం బిలేటెడ్ రిటర్నుల పత్రాన్ని సమర్పించడం ద్వారా నిబంధనలను పాటించొచ్చు. దీనివల్ల టీడీఎస్ లేదా టీసీఎస్లు ఉంటే నిబంధనల కింద పెనాల్టీ చెల్లించి, వాటి రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.ఇలా సమర్పించొచ్చు.. ఈ–ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. ‘ఈ–ఫైల్’ విభాగంలో ‘ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్’ అన్న దగ్గర క్లిక్ చేయాలి. అక్కడ అసెస్మెంట్ సంవత్సరాన్ని ఎంపిక చేసుకుని, ‘రివైజ్డ్ రిటర్న్ అండ్ సెక్షన్ 139(5)’పై క్లిక్ చేయాలి. తొలుత సమర్పించిన ఐటీఆర్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను పేర్కొనడం మర్చిపోవద్దు. ఆఫ్లైన్లో పేపర్ రూపంలో (80 ఏళ్లకు పైబడిన వారు) రిటర్నులు దాఖలు చేసిన వారు ఆన్లైన్లో సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. తిరిగి భౌతిక రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది. సవరణ రిటర్నులను డిసెంబర్ 31 (2024–25 సంవత్సరానికి సంబంధించి) వరకు ఎన్ని పర్యాయాలు అయినా సమర్పించొచ్చు. ఇందుకు ఎలాంటి పెనాల్టీ చెల్లించక్కర్లేదు. రిఫండ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. సాధారణ రిటర్నుల మాదిరే సవరణ రిటర్నులు వేసిన తర్వాత 30 రోజుల్లోపు ధ్రువీకరించడం తప్పనిసరి. అప్పుడే అది మదింపునకు వెళుతుంది.వివిధ వర్గాల వారికి రిటర్నుల గడువు → వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్), ఆడిటింగ్ అవసరం లేని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (ఏవోపీ), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీవోఐ) రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. → ఆడిట్ అవసరమైన వ్యాపార సంస్థలు రిటర్నుల సమర్పణ గడువు అక్టోబర్ 31. → సవరణ, బిలేటెడ్ రిటర్నుల సమర్పణ గడువు డిసెంబర్ 31. → 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి అప్డేటెడ్ రిటర్నుల దాఖలు గడువు 2030 మార్చి 31. డిసెంబర్ 31నాటికి దాఖలు చేయకపోతే..? డిసెంబర్ 31లోపు ఆలస్యపు రిటర్నులు సమర్పించడంలోనూ విఫలమైతే ఏమవుతుంది? అన్న సందేహం ఏర్పడొచ్చు. అలాంటి కేసుల్లో ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు జారీ కావొచ్చు. సకాలంలో రిటర్నులు వేయడం ద్వారానే చట్టపరిధిలో ఎన్నో మినహాయింపులు, ప్రయోజనాలకు అర్హత ఉంటుంది. లేదంటే వీటిని కోల్పోయినట్టే. రుణాలకు, ఆదాయ ధ్రువీకరణకు, వీసా ప్రాసెసింగ్కు ఐటీ రిటర్నులు రుజువుగా పనికొస్తాయన్నది గుర్తు పెట్టుకోవాలి. రిటర్నుల్లో సవరణలు.. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు ఇటీవలి కాలంలో కొంత సులభంగా మారినప్పటికీ, ఇంకా కొంత సంక్లిష్టమనే చెప్పుకోవాలి. అన్ని ఆర్థిక లావాదేవీలు, ఆదాయం, పెట్టుబడులు, మూలధన లాభాలు/నష్టాలు, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, విదేశీ పెట్టుబడులు ఇలా ఎన్నో వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. టీడీఎస్, టీసీఎస్ ఏవైనా ఉంటే సరిచూసుకోవాలి. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)ను చూసుకున్న తర్వాత అందులో ఏవైనా తప్పులుంటే ఆదాయపన్ను శాఖకు రెక్టిఫికేషన్ (దిద్దుబాటు) అభ్యర్థన నమోదు చేయాలి. ఇంత సుదీర్ఘ ప్రక్రియలో కొన్ని తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. లేదా ఫలానా ఆదాయం లేదా ఆర్థిక లావాదేవీల వివరాలను వెల్లడించడం మర్చిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కనుక రిటర్నులు సమర్పించిన అనంతరం ప్రతి ఒక్కరూ ఒక్కసారి సమగ్రంగా పరిశీలించుకోవడం మంచిది. ఏవైనా తప్పులుంటే, వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31లోపు ఈ పనిచేయొచ్చు. ఐటీఆర్ పత్రం సరైనది ఎంపిక చేసుకోకపోవడం, వ్యక్తిగత వివరాల్లో తప్పులు, బ్యాంక్ ఖాతా వివరాల్లో తప్పులు, కొన్ని ఆదాయాలను వెల్లడించకపోవడం, మినహాయింపులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోకుండా పన్ను రిటర్నులు వేసి, అధిక పన్ను చెల్లించడం.. విదేశీ పెట్టుబడులు, ఆదాయాలు, ఇ–సాప్లు.. ఎలాంటి ఆధారాల్లేకుండా మినహాయింపులను క్లెయిమ్ చేసుకున్న సందర్భాల్లో సవరణ రిటర్నులు సమర్పించొచ్చు. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయాలను వెల్లడించకపోతే ‘బ్లాక్మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015’ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అప్పటికే సమర్పించిన రిటర్నులను ఆదాయపన్ను శాఖ మదింపు చేయడం ముగిసిపోతే సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. → సెక్షన్ 143 (1) కింద ఐటీఆర్ ప్రాసెస్ (ఇనీíÙయల్/ప్రాథమిక) అయినప్పుడే సవరణ రిటర్నులను డిసెంబర్ 31లోపు లేదా తుది ప్రాసెసింగ్కు ముందు సమర్పించుకునేందుకు అనుమతి ఉంటుంది. → ఒకవేళ డిసెంబర్ 31 కంటే ముందుగానే సెక్షన్ 143 (3) కింద ఐటీఆర్ తుది మదింపు ముగిసినట్టయితే సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో సెక్షన్ 139(8ఏ) కింద ఐటీఆర్–అప్డేటెడ్ సమర్పించుకోవచ్చు.డిసెంబర్ 31 తర్వాత కూడా.. గడిచిన ఆర్థిక సంవత్సరానికి తర్వాతి ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. 2024–25కు 2025–26 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. అసెస్మెంట్ సంవత్సరం డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్నులు లేదా సవరణ రిటర్నులు సమర్పించుకోవచ్చు. అప్పటికీ అది చేయలేకపోతే, ఆ తర్వాత ఉన్న ఏకైక మార్గం అప్డేటెడ్ రిటర్నులు (ఐటీఆర్–యూ) సమర్పించడం. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి 48 నెలల వరకు (నాలుగేళ్లు) ఇందుకు అవకాశం ఉంటుంది. అసలు టర్నులు దాఖలు చేయకపోయినా లేక సమర్పించిన రిటర్నుల్లో తప్పులను గుర్తించినా లేదా ఏవైనా ఆదాయ, ఆస్తుల వివరాలు వెల్లడించడం మర్చిపోయినా లేదా సవరణ రిటర్నుల్లోనూ తప్పులను గుర్తించిన సందర్భాల్లో.. ఐటీఆర్–యూ దాఖలు చేసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139(8ఏ) ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా ఆదాయపన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగి, రిటర్నులు సమర్పించని వారు లేదా సమర్పించినా సమగ్ర వివరాలు వెల్లడించని వారు తప్పకుండా ఐటీఆర్–యూ దాఖలు చేసి, పెనాల్టీ, వడ్డీ సహా పన్నును చెల్లించడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులను ఎంత ఆలస్యంగా దాఖలు చేశారు, చెల్లించాల్సిన పన్ను ఎంతన్నదాని ఆధారంగా.. అసలుకి 25 శాతం, 50 శాతం, 60 శాతం లేదా 70 శాతం వరకు అదనపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా అంతకాలానికి వడ్డీ, పెనాల్టీలను కూడా సమర్పించుకోవాలి. - 
      
                   
                                                     
                   
            లాంచ్కు సిద్దమవుతున్న మరో కవాసకి బైక్
జపనీస్ వాహన తయారీ సంస్థ కవాసకి.. 2026 జెడ్900ఆర్ఎస్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ ఈ బైకులోని పవర్ట్రెయిన్, ఛాసిస్, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ వంటి వాటిని చాలా వరకు అప్డేట్ చేసింది.2026 Z900RS బైక్ 948 సీసీ ఇన్లైన్ ఫోర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. అయితే కవాసకి అన్ని గేర్లలో ఎలక్ట్రానిక్ త్రాటెల్ వాల్వ్స్, గేర్స్ వంటి వాటిని జోడించింది. కాబట్టి ఇంజిన్ 9,300 rpm వద్ద 116 hp & 7,700 rpm వద్ద 98 Nm టార్క్ అవుట్పుట్ అందిస్తుంది. ఈ గణాంకాలు స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ.చూడటానికి.. మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కవాసకి కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్తో కూడిన ఐఎంయూ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ సూట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: కొత్త స్కూటర్ అమ్మకాల నిలిపివేత!సస్పెన్షన్ విషయానికి వస్తే.. 41 మిమీ USD ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ హార్డ్వేర్ ముందు భాగంలో 300 మిమీ ట్విన్ డిస్క్లు, వెనుక భాగంలో 250 మిమీ డిస్క్ పొందుతుంది. ఈ బైక్ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాగా కంపెనీ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. - 
      
                   
                                                     
                   
            బ్యాంక్ హాలిడేస్: నాలుగు రోజులు వరుస సెలవులు!
నవంబర్ నెలలో బ్యాంకు సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే ప్రకటించింది. ఇందులో వచ్చే వారంలో (3 నుంచి 9) నాలుగు రోజులు హాలిడేస్ ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. జాతీయ, ప్రాంతీయ & మతపరమైన ఆచారాల ఆధారంగా సెలవులు నిర్ణయిస్తారు.నవంబర్ 5 (బుధవారం): గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ & రహస్ పూర్ణిమ సందర్భంగా.. ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్కతా, న్యూ ఢిల్లీ, నక్పూర్, కోల్కతా, రాంచీ, సిమ్లా మరియు శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.నవంబర్ 6 (గురువారం): బీహార్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలు 2025 కారణంగా పాట్నాలోని బ్యాంకులకు సెలవు.నవంబర్ 7 (శుక్రవారం): వంగాల పండుగను పురస్కరించుకుని షిల్లాంగ్లోని అన్ని బ్యాంకులకు సెలవు.నవంబర్ 8 (శనివారం): బెంగళూరులో కనకదాస జయంతి జరుపుకుంటారు, కాబట్టి ఈ ప్రాంతంలోని బ్యాంకులకు సేవలు.అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. - 
      
                   
                                                     
                   
            ఆదిత్య బిర్లా క్యాపిటల్: రూ.855 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి రూ.855 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.834 కోట్లతో పోలి్చతే 3 శాతం పెరిగింది.ఆదాయం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.10,362 కోట్ల నుంచి రూ.10,609 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం రూ.5,003 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.4,141 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు సైతం రూ.9,034 కోట్ల నుంచి రూ.9,475 కోట్లకు ఎగిశాయి. కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏఎంసీ, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ సహా) 10 శాతం పెరిగి రూ.5,50,240 కోట్లకు చేరింది. - 
      
                   
                                                     
                   
            ఐదేళ్లలో.. 5 లక్షల ఉద్యోగాలు: నితిన్ గడ్కరీ
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో.. వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను స్థానిక పరిశ్రమలు సృష్టించాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ, సాధించవచ్చని ఆయన అన్నారు. 'నాగ్పూర్ స్కిల్ సెంటర్' ప్రారంభోత్సవంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఐదేళ్లలో నైపుణ్య శిక్షణ.. ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించడం అనే లక్ష్యం చాలా పెద్దది అయినప్పటికీ లక్ష్యాన్ని చేసుకోవచ్చు. నాగ్పూర్లోని మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ విమానాశ్రయంతో సహా.. పెద్ద ఎత్తున ఉద్యోగాలను అందించిన వివిధ ప్రాజెక్టుల ఉదాహరణలను ఆయన వివరించారు, ఇవి లక్ష ఉపాధి అవకాశాలను సృష్టించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారికి శిక్షణ అందించడానికి నాగ్పూర్ నైపుణ్య కేంద్రాన్ని కోర్సులు ప్రారంభించాలని ఆయన సూచించారు.టాటా స్ట్రైవ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) అమేయా వంజరి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాల కోసం పరిశ్రమ-సంబంధిత శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. సంస్థ వందలాది మంది యువతకు ఉపాధి కల్పించడంలో సహాయపడుతుంది, గత 11 సంవత్సరాలలో 2.5 మిలియన్లకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందారని ఆయన వివరించారు.ఇదీ చదవండి: నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్లమేము తయారీ, విద్యుత్, సౌర, ఐటీ, బ్యాంకింగ్ రంగాలలో రెండు నుంచి మూడు నెలల కోర్సులను రూపొందించాము. వీటి తర్వాత ఉద్యోగ శిక్షణ.. నియామక అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను నాగ్పూర్ యువతను కోరుతున్నానని అమేయా వంజరి అన్నారు. - 
      
                   
                                                     
                   
            'బంగారం ధరల్లో ఊహించని మార్పులు'
డాలర్ విలువ పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు వంటివన్నీ బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమయ్యాయి. దీంతో గోల్డ్ రేటు వరుసగా రెండోవారం కూడా తగ్గుతూనే ఉంది. డిసెంబర్ నాటికి ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా.రూ. 1,25,000 దాటేసిన 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతూ.. ఈ రోజు (నవంబర్ 02) రూ. 1,23,000 వద్ద నిలిచింది. ధరల తగ్గుదల ఇదే విధంగా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో గరిష్ట స్థాయి నుంచి ఔన్సుకు 4,000 డాలర్ల స్థాయికి చేరిందని.. స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అండ్ వెల్త్ ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు & సీఈఓ స్నేహ జైన్ అన్నారు.ధరలు తగ్గడానికి కారణమైన అంశాలుఅక్టోబర్ ప్రారంభంలో బంగారం కొంతకాలం జీవిత కాల గరిష్టాలను తాకిన తర్వాత ఈ తగ్గుదల నమోదైంది. ఈ వారం పరిణామాలు బంగారం విషయంలో చాలావరకు ప్రతికూలంగా ఉన్నాయని రిటైల్ బ్రోకింగ్ & డిస్ట్రిబ్యూషన్ సీఈఓ అండ్ పీఎల్ క్యాపిటల్ డైరెక్టర్ సందీప్ రైచురా అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి, ట్రంప్-జిన్పింగ్ చర్చలు సానుకూలంగా ఉన్నాయి. భారతదేశంలో పండుగ సీజన్ కూడా ముగిసింది. ఈ అంశాలన్నీ స్వల్పకాలంలో బంగారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని ఆయన పేర్కొన్నారు.ఊహకందని మార్పులురెండు వారాల పాటు ఒడిదుడుకుల తర్వాత వెండి ధరలు తిరిగి స్థిరత్వాన్ని ప్రదర్శించాయి. అక్టోబర్ నెలలో రూ. 2 లక్షలు దాటేసిన సిల్వర్ రేటు రూ. 1.66 లక్షలకు చేరింది. ఈ ధర మరింత తగ్గుతుందని వెల్త్ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్కు చెందిన జైన్ పేర్కొన్నారు. కాగా భవిష్యత్తులో రేట్ల తగ్గుదల అనేది.. స్థూల ఆర్థిక డేటాపై ఆధారపడి ఉంటాయని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు లోహాల ర్యాలీని చల్లబరిచాయని వెంచురాలోని కమోడిటీస్ & సీఆర్ఎం హెడ్ ఎన్ఎస్ రామస్వామి అన్నారు. మొత్తం మీద పసిడి ధరలలో ఊహకందని మార్పులు జరిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.తగ్గిన దిగుమతి ధరలుకేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. బంగారం దిగుమతి ధర 10 గ్రాములకు 42 డాలర్లకు తగ్గింది. వెండి దిగుమతి ధర కేజీకి 107 డాలర్లకు తగ్గింది. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా తీసుకున్నది. దీని ఉద్దేశం దేశీయ మార్కెట్లో ధరలను స్థిరంగా ఉంచడం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. తద్వారా ధరలలో వ్యత్యాసం కనిపిస్తోంది.ఇదీ చదవండి: పెళ్లిళ్ల సీజన్: రూ.6.5 లక్షల కోట్ల బిజినెస్! - 
      
                   
                                                     
                   
            కొత్త స్కూటర్ అమ్మకాల నిలిపివేత!
ఓలా ఎలక్ట్రిక్ ట్రేడ్ సర్టిఫికేట్ను సస్పెండ్ చేస్తూ గోవా రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. సరైన సర్వీస్ లేకపోవడం, మరమ్మత్తు జాప్యాలపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని కొత్త స్కూటర్ల అమ్మకాలను కూడా నిలిపివేసింది. గోవాలోని మూడు సర్వీస్ సెంటర్లలో దాదాపు 2,000 ఓలా స్కూటర్లకు సరైన మరమ్మత్తులు చేయకపోవడమే కాకుండా.. సిబ్బంది నుంచి సరైన స్పందన రావడం లేదని కస్టమర్లు చెబుతున్నారు.అస్పష్టమైన ప్రతిస్పందనలు & రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఆలస్యమయ్యాయని కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై చర్య తీసుకోవాలని.. రవాణా శాఖకు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్కు ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులు మెమోరాండం సమర్పించారు. దీంతో రాష్ట్ర వాహన్ పోర్టల్లోని అన్ని ఓలా ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్లను బ్లాక్ చేస్తూ సంబంధిత శాఖ నిర్ణయం తీసుకుంది.ఈ సస్పెన్షన్ తాత్కాలికమని.. సమస్యలను పరిష్కరించిన తరువాత, దీనిని ఎత్తివేయనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ చర్య గోవాలోని ఎలక్ట్రిక్ వాహన యజమానులలో చర్చలకు దారితీసింది. చాలామంది ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు బాధ్యత అలవాడాలని, జవాబుదారీతనం ఉండాలనే కఠినమైన చర్య తీసుకోవడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి! - 
      
                   
                                                     
                   
            స్మార్ట్ ఫ్రిజ్: ఫ్రెష్.. ఫ్రెష్గా!
ఫ్రిజ్ అంటే కేవలం చల్లగా ఉంచే పెట్టెగా మాత్రమే కాదు. ఇప్పుడది స్మార్ట్, ఫ్రెష్, ఫన్నీ అసిస్టెంట్గా కూడా మారింది.రోలింగ్ ఎగ్స్!ఫ్రిజ్ నుంచి గుడ్లను పగిలిపోకుండా బయటకు తీసేటప్పుడు పడే టెన్షన్ కోడి గుడ్డు పెట్టేటప్పుడు కూడా పడి ఉండదేమో అని అనిపిస్తుంటుంది! ఎందుకంటే, ఫ్రిజ్లో గుడ్లను పెట్టడం, తీయటం ఒక పెద్ద పని, పైగా వాటికి స్థలం కూడా చాలా కావాలి. ఇక ఆ కష్టాలు మర్చిపోండి! రింకిఫై ఆటోమాటిక్ ఎగ్ రోల్డౌన్ వచ్చింది. ఇది నాలుగు లేయర్ల ఆటోమాటిక్ రోల్డౌన్ సిస్టమ్, గ్రావిటీ ఫీడ్ డిజైన్తో వస్తుంది. అందుకే, ఒక చివరి గుడ్డు తీసుకున్న వెంటనే మరో గుడ్డు మీ ముందుకు వస్తుంది. కాబట్టి గుడ్లను తీసుకోవడం చాలా సులభం. ఇందులో ముప్పై గుడ్ల వరకు భద్రంగా నిల్వ చేస్తుంది. వర్టికల్ స్టాక్ డిజైన్ వల్ల ఫ్రిజ్లో స్థలం ఎక్కువ సేవ్ అవుతుంది. హై–క్వాలిటీ ప్లాస్టిక్తో తయారవడంతో, దీన్ని క్లీనింగ్ చేయడం కూడా సులభం. ధర: రూ. 300.స్మార్ట్ ఫ్రిజ్!రోజూ ఉదయాన్నే పాలు అయిపోయాయి అని ఫ్రిజ్ డోర్ తెరిస్తే కాని తెలియడం లేదా? దీంతో, ఉదయం పాలకోసం వాకింగ్ తప్పడం లేదా. బాధ పడకండి. ఇప్పుడు ఈ విషయాన్ని ఫ్రిజ్ గమనిస్తుంది. ‘బ్రో, ఉదయం కాఫీకి పాలు లేవు!’ అని ఎప్పటికప్పుడు మీకు ఫోన్లో నోటిఫికేషన్ పంపిస్తుంది. ఇంకా పెరుగు, గుడ్లు, కూల్ డ్రింక్స్ అన్నీ చెక్ చేసి, ఏవి లేవో వాటన్నింటితో కలిపి షాపింగ్ జాబితాను కూడా పంపిస్తుంది. ఇలా ఫ్రిజ్ తలుపు తెరవకుండానే, లోపల ఏముందో అన్నది ఫోన్లోనే చూసుకోవచ్చు! అంతేకాదు, ఎవరు చివరి చాక్లెట్ తిన్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇదంతా ఎలా సాధ్యమయ్యిందంటే? ఇందులో వై–ఫై, టచ్ స్క్రీన్, వాయిస్ కంట్రోల్ ఉన్నాయి. ‘ఫ్రిజ్, కూల్ చెయ్!’ అని చెబితే అది వినేస్తుంది కూడా! వివిధ బ్రాండ్ల ఆధారంగా ధర రూ. 50,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉండొచ్చు.ఫ్రెష్.. ఫ్రెష్గా!ఫ్రిజ్ తెరిస్తే కొత్తిమీర, పుదీనా, పాలకూర ఇలా ఆకుకూరలు వాడిపోతున్నాయా? పైగా ఎప్పుడూ కొత్త ఆకులు కొనుకోవడం మర్చిపోతుంటారా? టెన్షన్ వద్దు! వేకిజ్ హెర్బ్ కీపర్ తీసుకోండి. ఎందుకంటే ఇది సాధారణ కంటైనర్ కాదు. వేకిజ్ హెర్బ్ కీపర్ ఏబీఎస్ గ్రేడ్ ప్లాస్టిక్ తో తయారైంది, స్ట్రాంగ్ అండ్ సేఫ్. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏదైనా ఆకుకూర పెట్టి, కొంచెం నీరు వేసి మూత పెట్టండి అంతే! ఇది ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల లోపల ఏముందనేది స్పష్టంగా చూడొచ్చు. పైగా, ఎయిర్ గ్రూవ్ ఉన్న మూత వల్ల ఆకులు తడిగా, పచ్చగా, ఫ్రెష్గా ఉంటాయి. ప్రతి మూడు నుంచి ఐదు రోజుల్లో నీరు మార్చినపుడు, ఆకులు మూడు వారాల వరకు పచ్చగా ఉంటాయి. ధర రూ. 350. - 
      
                   
                                                     
                   
            నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్ల
ఇప్పటి వరకు ఉద్యోగులను తొలగిస్తున్న దిగ్గజ కంపెనీలు.. ఉద్యోగ నియమకాలను చేపట్టడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను మళ్ళీ విస్తరించడానికి సిద్ధంగా ఉందని సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో.. కంపెనీ మరింత వృద్ధి చెందడమే లక్ష్యంగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. బీజీ2 పాడ్కాస్ట్లో వెల్లడించారు. కొత్తగా చేరే ఉద్యోగులకు ఏఐ గురించి బాగా అవగాహన ఉండాలని, వారికి మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్హబ్ ఏఐ కోడింగ్ హెల్పర్ వంటి వాటికి సంబంధించిన యాక్సెస్ ఇవ్వనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు ఏఐ సాయంతో.. మరింత వేగంగా పనిచేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందన్న భయం: రోజుకు రెండు గంటలే నిద్ర!2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల సంఖ్య 2,28,000గా ఉంది. అంటే అంతకు ముందు కంపెనీ సుమారు 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. 2022 తరువాత కంపెనీ నియమాలను బాగా తగ్గించింది. అయితే ఇప్పుడు ఏఐ రంగంలో దూసుకెళ్లడానికి.. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తోంది. అయితే ఎంత మందిని నియమించుకోనుందనే విషయాన్ని వెల్లడించలేదు. - 
      
                   
                                                     
                   
            బ్యాంకులో డబ్బు సేఫేనా? ‘రిచ్ డాడ్’ అబద్ధాలు!
ప్రఖ్యాత రచయిత, ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. తన బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad)కు ప్రసిద్ధి చెందారు. డబ్బు, భద్రత, విజయంపై సమాజం దీర్ఘకాల నమ్మకాల గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చను రేకెత్తించారు.రాబర్ట్ కియోసాకి తాజాగా ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ చేశారు. "ఇప్పటివరకు చెప్పిన అతిపెద్ద అబద్ధాలు" ఇవే అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి. "వాళ్లు ఎప్పటికీ సంతోషంగా ఉంటున్నారుబాండ్లు సురక్షితం.బ్యాంకులో డబ్బు సురక్షితం.నాకు ఉద్యోగ భద్రత ఉంది.కళాశాల డిగ్రీ ఆర్థిక విజయానికి కీలకం"ఈ ట్వీట్ వెంటనే వైరల్ అయింది. ఆయన ప్రస్తావించిన ప్రతి పాయింట్ ను చర్చించడంతో వేలాది లైక్లు, షేర్లు వచ్చాయి. కియోసాకి సందేశం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ప్రధాన తత్వాన్ని ప్రతిధ్వనిస్తుంది. సాంప్రదాయ ఉపాధి విద్య వ్యవస్థల కంటే ఆర్థిక స్వాతంత్ర్యం పెట్టుబడి అక్షరాస్యత సంపదకు మరింత నమ్మదగిన మార్గాలు అన్నది కియోసాకి అభిప్రాయం.👉 ఇది చదవలేదా ఇంకా: అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!BIGGEST LIES EVER TOLD:1: “They lived happily ever after.”2: “Bonds are safe.”3: “Safe as money in the bank.”4: “I have job security.”5: “ A college degree is the key to financial success.”— Robert Kiyosaki (@theRealKiyosaki) November 2, 2025 - 
      
                   
                                                     
                   
            ఇంటికి వాస్తు బాగుంటేనే సరిపోదు..
సాక్షి, సిటీబ్యూరో: వాస్తు.. ఇంటి ఎంపికలో కీలకం. వాస్తును విశ్వసించేవారు అన్నీ అనుకూలంగా ఉంటే తప్ప కొనేందుకైనా, అద్దెకుండేందుకైనా నిర్ణయానికి రారు. అయితే ఇంటికి వాస్తు బాగుంటేనే సరిపోదని, పరిసరాల ప్రభావం కూడా ఇంటిపై, అందులోని నివాసితులపై ప్రభావం చూపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇంటి చుట్టుపక్కల, సమీపంలో శ్మశానం, ఆస్పత్రులు ఉంటే కొందరిలో మానసిక ఆందోళనలకు దారితీయవచ్చు. ఏదో రూపంలో ఏదో ఒక సమయంలో మనసుపై ప్రభావం చూపే వీలుంది. లేనిపోని భయాందోళనలకు గురవుతుంటారు. ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే మురుగు కాల్వలు, భారీ శబ్ధాలు చేసే కాలుష్య కర్మాగారాలు వంటివి కూడా నివాసితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకూ వీటికి దూరంగా ఉండటమే ఉత్తమమని చెబుతుంటారు. - 
      
                   
                                                     
                   
            బంగారం, వెండి రేట్లు తగ్గుతాయా.. ప్రభుత్వ చర్య ఏంటి?
కేంద్ర ప్రభుత్వం తాజాగా బంగారం, వెండి బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. బంగారం (Gold) దిగుమతి ధర 10 గ్రాములకు 42 డాలర్లకు తగ్గింది. అలాగే వెండి (Silver) దిగుమతి ధర కిలోకు 107 డాలర్లకు తగ్గింది. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా తీసుకున్నది. దీని ఉద్దేశం దేశీయ మార్కెట్లో ధరలను స్థిరంగా ఉంచడం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం.బేస్ ఇంపోర్ట్ ధర అంటే..బేస్ ఇంపోర్ట్ ప్రైస్ (Base Import Price) అనేది ప్రభుత్వం నిర్ణయించే సూచిక ధర. ఇది కస్టమ్స్ సుంకాలు (Import Duty) లెక్కించడానికి ఉపయోగిస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వం ఈ ధరను అప్డేట్ చేస్తుంది. బేస్ ధర తగ్గితే దిగుమతిదారులపై పన్ను భారం తగ్గుతుంది. అందువల్ల మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా స్థిరంగా లేదా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.బంగారం దిగుమతుల్లో భారత్ స్థానంచైనా ప్రపంచంలో అతిపెద్ద బంగారం దిగుమతిదారు. భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ప్రజలు ఆభరణాలు, పెట్టుబడుల కోసం బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. బేస్ ధర తగ్గడం వల్ల బంగారం దిగుమతి ఖర్చు తగ్గి వినియోగదారులకు లాభం కలగవచ్చు. వెండి విషయంలో , భారత్ ప్రపంచంలోనే అత్యధిక దిగుమతిదారు.పసిడి దిగుమతులు ఇక్కడి నుంచే..పలు నివేదికల ప్రకారం.. భారత్ తన బంగారంలో ఎక్కువ భాగం స్విట్జర్లాండ్ నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇది దాని దిగుమతుల్లో 40 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత అధికంగా పసిడి దిగుమతి చేసుకునేది యూఏఈ నుంచి. ఇది మొత్తం దిగుమతుల్లో 16 శాతం. ఇక దక్షిణాఫ్రికా సుమారు 10 శాతంతో మూడవ స్థానంలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 48 దేశాల నుండి పసిడి లోహాన్ని దిగుమతి చేసుకుంది. 2024-25లో బంగారం దిగుమతులు 27.3 శాతం పెరిగి 58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ప్రస్తుత బంగారం, వెండి ధరలుభారత్లో ప్రస్తుతం (నవంబర్ 2న) బంగారం, వెండి ధరలు (Gold and Silver Price) ఇలా ఉన్నాయి.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,23,150 వద్ద, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,12,900 వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.1,52,000 వద్ద ఉంది.👉 ఇది చదవలేదా ఇంకా? అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్! - 
      
                   
                                                     
                   
            ఇరుకు ఇళ్లకు ఇదే కిటుకు..!
ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గ ఫర్నిచర్ను సమకూర్చుకోకుండా ఉండలేం కదా? ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇందుకు పరిష్కారం. దాని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. తలుపు తీయగానే పెద్దపెద్ద వస్తువులు కనిపిస్తే.. మీ ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి.లివింగ్ రూమ్కు ఉన్న ద్వారాల మధ్య తిరగడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి. అంటే.. మధ్యలో కుర్చీలు ఉంటే వాటి చుట్టూ తిరిగి వెళ్లడం లాంటివి అన్నమాట.సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికోటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి పది అడుగుల దూరంతో ఉంటే బాగుంటుంది. బరువుగా ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్ ఏర్పాటులో సమతుల్యత దెబ్బతింటుంది. కాఫీ టేబుల్, సెంటర్ టేబుల్ వాడకం లివింగ్ రూమ్లో సాధారణమే. మ్యాగజైన్లు, వార్త పత్రికలు పెట్టుకునేందుకు వీలుగా వీటికోసం ప్రత్యేకంగా షెల్ఫ్ ఉండే టేబుళ్లను ఎంచుకోండి. లివింగ్రూమ్లో ఉపయోగించే టేబుళ్లు ఒకదాంట్లో మరోటి అమరిపోయే విధంగా ఉంటే మంచిది. గదిని పెద్దదిగా కన్పించేలా చేయడంలో అద్దాన్ని మించిన సాధనం మరోటి లేదు. వెనకవైపు పచ్చని మొక్కలున్న కిటికీకి ఎదురుగా అద్దం అమరిస్తే.. ఇంటి వెలుపుల ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని లోపలికి తీసుకువస్తున్న భావన కలుగుతుంది. టేబుల్ కింద ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా.. షెల్ఫ్ ఏర్పాటు చేసుకుంటే, ఏవైనా పెట్టుకోవడానికి అక్కరకొస్తుంది. అవి బయటకు కన్పించకుండా పైన ఓ టేబుల్ క్లాత్ వేయండి.గది చిన్నదిగా ఉంటే పార్టిషన్ జోలికి వెళ్లకండి. ఇలా చేస్తే మరింత చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్లో మడిచిపెట్టడానికి అనువుగా ఉండే కుర్చీలు, టేబుళ్లు, సోఫాకమ్ బెడ్, బీన్ బ్యాగ్లు వంటి ఫర్నిచర్ నప్పుతాయి.ఇదీ చదవండి: ఇంటి విలువ పెరగాలంటే.. - 
      
                   
                                                     
                   
            బెర్క్షైర్ భారీ నగదు నిల్వలు.. దేనికి సంకేతాలు?
లాభాలు పెరిగినప్పటికీ, మార్కెట్లపై అప్రమత్త ధోరణిని చూపిస్తూ బెర్క్షైర్ (Berkshire) హాతవే సంస్థ రికార్డు స్థాయి నగదు నిల్వలను ప్రకటించింది. కంపెనీ నగదు నిల్వలు మూడవ త్రైమాసికంలో 381.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది బెర్క్షైర్ చరిత్రలో అత్యధికం.వారెన్ బఫెట్ (Warren Buffett) సీఈఓ హోదాలో తన చివరి త్రైమాసిక నివేదికను విడుదల చేసిన సందర్భంలో ఈ ప్రకటన వచ్చింది. 95 ఏళ్ల బఫెట్ ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనున్నారు.స్టాక్ విక్రయాలు, బైబ్యాక్ నిలిపివేతబెర్క్షైర్ వరుసగా 12వ త్రైమాసికంలో కొనుగోలు కంటే ఎక్కువ స్టాక్స్ను విక్రయించింది. దాని 283.2 బిలియన్ డాలర్ల ఈక్విటీ పోర్ట్ఫోలియోలో యాపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్ వంటి హోల్డింగ్స్ ఉన్నాయి. కంపెనీ ఐదవ వరుస త్రైమాసికంగా తన సొంత స్టాక్ బైబ్యాక్ను నిలిపివేసింది. అయినప్పటికీ దాని షేర్ ధర విస్తృత మార్కెట్ను మించకపోవడం గమనార్హం.లాభాల్లో పెరుగుదల, కానీ వృద్ధి మందగింపుతక్కువ బీమా నష్టాలు మూడవ త్రైమాసిక ఆపరేటింగ్ లాభాన్ని 34% పెంచి 13.49 బిలియన్ డాలర్లకు చేర్చాయి. ఇది విశ్లేషకుల అంచనాలను మించిపోయింది. నికర లాభం 17% పెరిగి 30.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే మొత్తం ఆదాయం కేవలం 2% మాత్రమే పెరిగింది. ఇది అమెరికా ఆర్థిక వృద్ధి రేటుకంటే తక్కువ.కంపెనీ ప్రకారం.. ఆర్థిక అనిశ్చితి, వినియోగదారుల విశ్వాసం తగ్గడం ప్రధాన అవాంతరాలుగా మారాయి. ఈ ప్రభావం క్లేటన్ హోమ్స్, డ్యూరాసెల్, ఫ్రూట్ ఆఫ్ ది లూమ్, స్క్విష్మాలోస్ తయారీదారు జాజ్వేర్స్ వంటి అనుబంధ వ్యాపారాలపై కనిపించింది.నాయకత్వ మార్పు దిశగా..వారెన్ బఫెట్ వైదొలుగుతున్న తరుణంలో, 63 ఏళ్ల గ్రెగ్ అబెల్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బఫెట్ మాత్రం చైర్మన్గా కొనసాగుతారు. కాగా అబెల్.. బఫెట్ కంటే కూడా “మరింత హ్యాండ్-ఆన్” మేనేజర్గా ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో బెర్క్షైర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.👉 ఇది ఇంకా చదవలేదా? అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్! - 
      
                   
                                                     
                   
            ఇంటి విలువ పెరగాలంటే..
గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లు.. గ్రేటర్ నగరానికే వన్నె తెచ్చాయి. వేల చదరపు అడుగుల్లో ఉండే క్లబ్హౌస్, ఏసీ జిమ్, స్విమ్మింగ్పూల్ వంటి సౌకర్యాల్ని సక్రమంగా నిర్వహించడం కత్తిమీద సామే. అయితే నగరానికి చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల్ని స్వయంగా నిర్వహిస్తే.. మరికొన్నేమో.. సదుపాయాల నిర్వహణ సంస్థలకు అప్పగిస్తున్నాయి. నిర్వహణ పక్కాగా ఉండటం వల్ల ఫ్లాట్ల రేట్లు రెట్టింపవుతున్నాయి.నెలసరి నిర్వహణ సక్రమంగా ఉంటేనే ఫ్లాటు విలువ పెరుగుతుంది. క్లబ్హౌస్లోని జిమ్, టెన్నిస్ వంటి సదుపాయాల కోసం విడిగా రుసుముల్ని చెల్లించాలి. హౌస్కీపింగ్, భద్రత, పార్కింగ్, కామన్ ఏరియాలు, విద్యుత్తు, లిఫ్టులు, తాగునీరు వంటి నిర్వహణ పనుల్ని నిర్వహణ సంస్థలే నిర్వహిస్తాయి.ఆధునిక సదుపాయాలు.. ఆహ్లాదకర వాతావరణం.. చిన్నారులు, పెద్దలు, మహిళలు, అందరికీ కావల్సిన అన్ని సౌకర్యాల్ని ఏర్పాటు చేయగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. 2006లో జీవో నం.86 అందుబాటులోకి వచ్చాక నగరంలో ఆకాశహర్మ్యాల సంఖ్య పెరిగింది. ఇవి పూర్తవ్వడానికి మరో మూడేళ్లు పట్టింది.కొన్ని ప్రాజెక్టుల్లో ఆయా సంస్థలు సదుపాయాలు, సౌకర్యాల నిర్వహణను చూసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం.. నగరంలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవల్ని పక్కగా అందించే సంస్థలు పెద్దగా లేకపోవడమే. అయితే ఇలాంటి సంస్థలకు నిర్వహణ బాధ్యతను అప్పచెబితే నివాసితులపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో కొంతమంది బిల్డర్లే నిర్వహణ బాధ్యతల్ని చేపట్టారు. - 
      
                   
                                                     
                   
            ఐపీవోకి ఫిన్టెక్ కంపెనీ.. రూ.2,080 కోట్లు టార్గెట్
ఫిన్టెక్ దిగ్గజం పైన్ ల్యాబ్స్ తమ పబ్లిక్ ఇష్యూ (IPO) కోసం సిద్ధమైంది. ఈ ఇష్యూ నవంబర్ 7న ప్రారంభమై 11న ముగియనుంది. దీని ద్వారా కంపెనీ రూ. 2,080 కోట్లు సమీకరించనుంది. డీఆర్హెచ్పీ ప్రకారం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 8.23 కోట్ల షేర్లను పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్, పేపాల్, మాస్టర్కార్డ్ ఏషియా/పసిఫిక్, ఇన్వెస్కో మొదలైన ఇన్వెస్టర్లు, సహ వ్యవస్థాపకుడు లోక్వీర్ కపూర్ విక్రయించనున్నారు.ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించి నిధులను రుణాల చెల్లింపు, ఐటీ అసెట్స్లో పెట్టుబడులకు, క్లౌడ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు మొదలైన వాటికి కంపెనీ వినియోగించుకోనుంది. తాజా ఇష్యూ ద్వారా కంపెనీ ముందుగా రూ. 2,600 కోట్లు సమీకరించాలని భావించింది. డిజిటల్ చెల్లింపుల ప్రాసెసింగ్ సేవలందించే పైన్ ల్యాబ్స్కి భారత్తో పాటు మలేషియా, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా కార్యకలాపాలు ఉన్నాయి. సెబీకి షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ ప్రాస్పెక్టస్.. లాజిస్టిక్స్ సేవల సంస్థ షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి సంబంధించి అప్డేట్ చేసిన ముసాయిదా ప్రాస్పెక్ట్స్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,000 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ కింద రూ. 1,000 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, మరో రూ. 1,000 కోట్ల విలువ చేసే షేర్లను ప్రస్తుత షేర్హోల్డర్లు.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. తాజా ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను నెట్వర్క్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకుంటుంది. - 
      
                   
                                                     
                   
            కొత్త ఇంటికి ఏం రంగులేద్దాం.. ఉందిగా ట్రెండింగ్ కలర్!
ఇంటికి రంగులు వేయడం ఒక కళ. జీవితకాలం కష్టపడి సొంతం చేసుకునే సొంతింటికి రంగుల ఎంపిక ఆషామాషీ వ్యవహారం కాదు. కలర్స్ ఇంటికి అందాన్ని, అనుభూతిని తీసుకురావడమే కాదు యజమాని అభిరుచిని, మానసిక స్థితిని తెలియజేసేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.కంటికి, మనసుకు ఆహ్లాదకరమైన రంగులతో రోజువారీ జీవితం రంగులమయం అవుతుంది. మనిషి ఇంద్రియాలు రంగులతో కనెక్ట్ అవుతాయి. స్పర్శ, రుచి, సువాసనలు మనలో భావోద్వేగాలను కలిగిస్తాయి. అందుకే ఇంటీరియర్లో రంగులు, వాటి ఎంపికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రకృతి, ఆహార్యం, సువాసన, మృదుత్వం, ప్రకాశవంతం వంటి వాటితో రంగులు నివాసితులు, చూపరులకు సరికొత్త అనుభూతులను అందిస్తుంది.సోలార్ ఎల్లో.. సోలార్ ఎల్లోగా పిలవబడే ఈ రంగు ప్రస్తుతం ఇంటీరియర్లో ట్రెండ్గా మారింది. సూర్యుని నిజమైన రంగు తెలుపు. కానీ, మన వాతావరణం, దాని కాంతిని వెదజల్లే విధానం కారణంగా భూమి నుంచి చూస్తే సూర్యుని రంగు పసుపు, నారింజ, ఎరుపు రంగులలో కనిపిస్తుంది. అలాగే సోలార్ ఎల్లో రంగు కూడా వాతావరణాన్ని బట్టి రంగులు మారుతున్న అనుభూతిని కల్పిస్తుంది.స్వచ్ఛమైన కాంతి, ప్రకాశవంతంగా ఉత్తేజకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. లక్కర్డ్ ఫర్నిచర్, గాజు ఫినిషింగ్తో కఠినమైన, కాంతిని ప్రతిబింబించే ఉపరితలంగా సోలార్ ఎల్లో అందంగా ఉంటుంది. దీని మెరుపులు, మృదుత్వం ఉల్లాసభరితంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్! - 
      
                   
                                                     
                   
            నెమ్మదించిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: అక్టోబర్లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన వృద్ధి 4.6 శాతానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే అత్యల్ప వృద్ధి కావడం గమనార్హం. నిత్యావసరాల నుంచి ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్స్ వరకు దాదాపు 375 ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించడం దీనికి నేపథ్యం. శనివారం కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం గతేడాది అక్టోబర్లో నమోదైన రూ. 1.87 లక్షల కోట్ల వసూళ్లతో పోలిస్తే ఈసారి అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు 4.6 శాతం వృద్ధితో రూ. 1.96 లక్షల కోట్లకు చేరాయి. స్థానిక అమ్మకాల తీరుతెన్నులను సూచించే స్థూల దేశీ ఆదాయం 2 శాతం పెరిగి రూ. 1.45 లక్షల కోట్లకు చేరగా, దిగుమతులపై పన్నులు 13 శాతం పెరిగి రూ. 50,884 కోట్లకు ఎగిశాయి. జీఎస్టీ రిఫండ్లు వార్షికంగా 39.6% పెరిగి రూ. 26,934 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లను కూడా సర్దుబాటు చేయగా నికర జీఎస్టీ ఆదాయం 0.2 % వృద్ధితో రూ. 1.69 లక్షల కోట్లుగా నమోదైంది. పండగ సీజన్ దన్ను.. పండగ సీజన్ అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి పేరుకుపోయిన డిమాండ్ను అక్టోబర్ జీఎస్టీ గణాంకాలు ప్రతిబింబించాయి. దీపావళికి ముందు జీఎస్టీ రేట్లను తగ్గించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవం నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో, రేట్లు తగ్గే వరకు వేచి చూద్దామనే ఉద్దేశంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటూ వచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా జీఎస్టీ రేట్లను తగ్గించడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జీఎస్టీ వసూళ్ల సగటు వృద్ధి సుమారు 9 శాతంగా నమోదైంది. ఆగస్టులో వసూళ్లు 6.5 శాతం పెరిగి రూ. 1.86 లక్షల కోట్లుగా, సెప్టెంబర్లో 9.1 శాతం వృద్ధితో రూ. 1.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. క్రమంగా పెరుగుతున్న డిమాండ్.. దేశీయ జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా పెరగడాన్ని బట్టి చూస్తే, డిమాండ్ క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోందని ప్రైస్ వాటర్హౌస్ అండ్ కో పార్ట్నర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జీఎస్టీ రిఫండ్లు నిలకడగా పెరగడాన్ని చూస్తే, భవిష్యత్తులో కూడా జీఎస్టీ వసూళ్ల వృద్ధి సానుకూలంగా ఉంటుందని ఆదాయ పన్ను శాఖ విశ్వసిస్తోన్నట్లుగా భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. రేట్ల క్రమబదీ్ధకరణ, పండగ సీజన్కి ముందు వినియోగదారులు ఖర్చులను వాయిదా వేసుకోవడమనేది జీఎస్టీ వసూళ్ల వేగం నెమ్మదించడంలో ప్రతిఫలించినట్లు ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ తెలిపారు. ఇది ముందుగా ఊహించినదేనని, తదుపరి నెలలో మళ్లీ పుంజుకోవచ్చని పేర్కొన్నారు. నిబంధనలను పాటించడంలో (కాంప్లియెన్స్) క్రమశిక్షణ మెరుగుపడుతుండటాన్ని, వ్యాపారాలకు రుణలభ్యత సులభతరం కావడాన్ని రీఫండ్ల పెరుగుదల సూచిస్తోందని ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్ పార్ట్నర్ వివేక్ జలాన్ తెలిపారు. దిగుమతి ఆధారిత ఐజీఎస్టీ వసూళ్లు సుమారు 12 శాతం పెరగడమనేది ముడి వస్తువులు, క్యాపిటల్ గూడ్స్కి ఆరోగ్యకరమైన డిమాండ్ నెలకొనడాన్ని, పారిశ్రామికోత్పత్తి పటిష్టతను సూచిస్తోందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, హర్యానా, ఉత్తర్ప్రదేశ్లాంటి పెద్ద రాష్ట్రాలు ఈ వృద్ధికి దన్నుగా నిల్చాయని వివరించారు. చిన్న వ్యాపారాలకు 3 రోజుల్లోనే రిజి్రస్టేషన్.. తక్కువ రిసు్కలు ఉండేవి, చిన్న వ్యాపారాలు 3 పని దినాల్లోనే జీఎస్టీ రిజి్రస్టేషన్ పొందే విధంగా జీఎస్టీ విభాగం నవంబర్ 1 నుంచి సరళతర విధా నాన్ని అమల్లోకి తెచ్చింది. డేటా అనాలిసిస్ ఆధారంగా జీఎస్టీ సిస్టం గుర్తించిన చిన్న వ్యాపారులు, తమ ఔట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ నెలకు రూ. 2.5 లక్షలకు మించదని సెల్ఫ్–అసెస్మెంట్ చేసుకున్న వారు ఈ స్కీమ్ని ఎంచుకోవచ్చు. స్వచ్ఛందంగానే దీన్ని ఎంచుకోవచ్చు. దీన్నుంచి వైదొలగవచ్చు. సరళతరమైన కొత్త జీఎస్టీ రిజి్రస్టేషన్ స్కీముతో 96 శాతం మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం జీఎస్టీ కింద 1.54 కోట్ల వ్యాపారాలు నమోదు చేసుకున్నాయి. - 
      
                   
                                                     
                   
            ఆర్బీఐకి చేరిన 98% రూ. 2 వేల నోట్లు
ముంబై: ప్రస్తుతం రూ. 5,817 కోట్ల విలువ చేసే రూ. 2,000 కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డేటాలో వెల్లడైంది. ఈ నోట్లను ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. అప్పట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు ఉండగా.. 2025 అక్టోబర్ 31 నాటికి రూ. 5,817 కోట్లకు తగ్గినట్లు ఆర్బీఐ శనివారం తెలిపింది. 2023 మే 19 నుంచి చూస్తే 98.37 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించినప్పటికీ రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతున్నాయి. - 
      
                   
                                                     
                   
            మెరుగ్గా రిటైర్మెంట్ సన్నద్ధత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా రిటైర్మెంట్ సన్నద్ధతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్కోరు 2022లో 44గా ఉండగా 2025లో 48కి పెరగడం దీనికి నిదర్శనం. భారతీయుల్లో ఆరోగ్యం, ఆర్థికాంశాలపై అవగాహన పెరుగుతుండటం ఇందుకు కారణంగా నిలుస్తోంది. డేటా అనలిటిక్స్ కంపెనీ కాంటార్తో కలిసి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని సగం మంది ప్రజలు రిటైర్మెంట్ ప్లానింగ్ను సాధ్యమైనంత ముందుగా, 35 ఏళ్ల లోపు నుంచే ప్రారంభించాలని విశ్వసిస్తున్నారు. ఇందుకోసం ఫిట్నెస్ అలవాట్లను పెంపొందించుకోవడం, తరచుగా హెల్త్ చెకప్లు చేయించుకోవడం వంటివి చేస్తున్నారు. సర్వే ప్రకారం ఆరోగ్య బీమాను తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే, సరిపోయేంత స్థాయిలో ఆర్థికంగా బలంగా ఉండే విషయంలోనే సవాళ్లు ఉంటున్నాయి. తాము దాచుకున్న సొమ్ము రిటైర్మెంట్ తర్వాత పదేళ్ల లోపే అయిపోవచ్చేమోనని 63 శాతం మంది భావిస్తున్నారు. 37 శాతం మంది మాత్రమే రిటైర్మెంట్ పొదుపు లక్ష్యాల్లో కనీసం 25 శాతాన్ని సాధించారు. ముందు వరుసలో మహిళలు.. రిటైర్మెంట్ సన్నద్ధతలో మహిళలు, గిగ్ వర్కర్లు ముందువరుసలో ఉంటున్నారు. అయితే, ఒంటరితనం, కుటుంబంపై ఆర్థికంగా ఆధారపడాల్సి రావడంలాంటి విషయాల్లో ప్రజల్లో ఆందోళన ఉంటోంది. ఈ అంశాలపై వరుసగా 71 శాతం, 72 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా చూస్తే పూర్తి స్థాయి సన్నద్ధతలో తూర్పు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండగా, కోవిడ్ తర్వాత ఆరోగ్యపరమైన రికవరీలో ఉత్తరాది మెరుగ్గా ఉంది. ఆర్థిక విషయాల్లో పశి్చమ రాష్ట్రాలు పటిష్టంగా ఉన్నాయి. అవగాహన పెరుగుతున్నప్పటికీ, సన్నద్ధత విషయంలో మాత్రం వెనుకబాటుతనం ఉంటోందని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్లు, మహిళలు, తిరిగి వచ్చిన వలసదార్లలాంటి వివిధ వర్గాల కోసం తగిన విధమైన రిటైర్మెంట్ సొల్యూషన్స్, సలహా సేవలు అవసరమని సర్వే పేర్కొంది. - 
      
                   
                                                     
                   
            టాప్ గేర్లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగ సీజన్కు తోడు జీఎస్టీ 2.0 సంస్కరణలు కలిసిరావడంతో అక్టోబర్లో రిటైల్ వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, కియా మోటార్స్ ఆటో కంపెనీల విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. స్కోడా ఆటో, టయోటా కిర్లోస్కర్ మోటార్లు సైతం చెప్పుదగ్గ స్థాయిలో వాహనాలను విక్రయించాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అక్టోబర్లో 1,80,675 వాహనాలు విక్రయించింది. గత ఏడాదిలో అమ్ముడైన 1,63,130 వాహనాలతో పోలిస్తే ఇది 11% అధికం. విదేశాలకు చేసిన ఎగుమతులు(31,304), ఇతర సంస్థలకు అమ్మకాలు(8,915) కలిపి మొత్తం విక్రయాలు 2,20,894 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘మునుపెన్నడూ లేనంతగా ఒక్క అక్టోబర్లోనే 2,42,096 యూనిట్లు రిటైల్ అమ్మకాలు జరిపాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 20% అధికం. నవరాత్రుల ప్రారంభం నుంచి పండగ సీజన్ 40 రోజుల్లో 5 లక్షల బుకింగ్స్, 4.1 లక్షల రిటైల్ వాహనాలు విక్రయించాము. గతేడాది మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఇవి రెట్టింపు. జీఎస్టీ సంస్కరణలకు ముందు తొలిసారిగా కార్లు కొనే కస్టమర్లకు కొన్ని సవాళ్లు ఉండేవి. సంస్కరణల అమలు తర్వాత అధిక సంఖ్యలో వినియోగదారలు షోరూంలను సందర్శిస్తున్నారు’’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. → మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా రికార్డు స్థాయిలో 71,624 ఎస్యూవీలను విక్రయించింది. గతేడాది అక్టోబర్లో అమ్మకాలు 54,504 యూనిట్లతో పోలిస్తే ఇవి 31% అధికం. ఎస్యూవీలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారి అని కంపెనీ నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. → టాటా ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మొత్తం 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 26.6% వృద్ధి నమోదైంది. ఇందులో 47 వేల యూనిట్లు ఎస్యూవీలున్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 69,894 వాహనాలను విక్రయించింది. గతేడాది అక్టోబర్లో అమ్మిన 53,792 యూనిట్లతో పోలిస్తే ఇవి 30% అధికం. దేశీయ విక్రయాలు మాత్రం 3% క్షీణించి 55,568 నుంచి 53,792 యూనిట్లకు దిగివచ్చాయి. అయితే మార్కెట్లోని డిమాండ్కు తగ్గట్లు క్రెటా, వెన్యూ విభాగంలో 30,119 ఎస్యూవీలను విక్రయించింది. ‘‘దసరా, ధన్తేరాస్, దీపావళి పండుగలతో డిమాండ్ నెలకొంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలు కూడా వీటికి తోడు కావడంతో అక్టోబర్లో భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ మరింత కాంతులీనింది’’ అని హెచ్ఎంఐఎల్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. → కియా ఇండియా కూడా మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధితో 29,556 పాసింజర్ వాహనాలను విక్రయించింది. సోనెట్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ, సెల్టోస్ మెరుగైన విక్రయాలకు దోహదపడ్డాయి. ‘‘కియా ఇండియా ప్రయాణంలో 2025 అక్టోబర్ ఒక చారిత్రాత్మక మైలురాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మా ఉత్పత్తుల పోర్ట్ఫోలియో ఉంటుంది’’ అని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సోద్ తెలిపారు. → స్కోడా ఆటో ఇండియా 8,252 యానిట్ల కార్లను విక్రయించింది. ఈ ఏడాది తొలి పదినెలల్లో (జనవరి–అక్టోబర్) 61,607 యూనిట్లను అమ్మింది. కంపెనీ ఒక ఏడాదిలో అత్యధిక అమ్మకాలు (2022లో) 53,721 యూనిట్లను అధిగమించడం విశేషం. - 
      
                   
                                                     
                   
            ట్రైడ్కు టై 50 ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టార్టప్’ అవార్డ్
కృత్రిమ మేధస్సు ఆధారిత ఐఓటి ఎకోసిస్టమ్స్లో ముందంజలో ఉన్న ట్రైడ్ సంస్థ.. ప్రతిష్టాత్మక టై50‘మోస్ట్ ప్రామిసింగ్ స్టార్టప్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. విమానయాన, ఇంధన, మొబిలిటీ రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలకుగాను ఈ గుర్తింపు లభించింది.విమానయాన రంగంలో చిన్న లోపం కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. పునరావృతమయ్యే సాంకేతిక లోపాలు లేదా గుర్తించని లోపాలు విమానాలను నేలమట్టం చేయగలవు, భారీ ఆర్థిక నష్టం కలిగించగలవు, అలాగే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు కలిగించగలవు. ఈ సవాళ్లను డేటా సాంకేతికతో పరిష్కరించడమే ట్రైడ్ ప్రధాన లక్ష్యం.ట్రైడ్ అభివృద్ధి చేసిన డేటా-ఇంటెలిజెంట్ ప్లాట్ఫారమ్ వివిధ విమానయాన, మొబిలిటీ వ్యవస్థలను అనుసంధానం చేసి, సంస్థలు మరింత సమర్థవంతమైన, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. విమానాశ్రయ డిజిటలైజేషన్, ఏఐ ఆధారిత లోపాల నిర్వహణ, విమాన సంస్థల్లో దీర్ఘకాలిక లోపాల పరిష్కారాలు వంటి ఆవిష్కరణల ద్వారా ట్రైడ్ విమానయాన రంగంలో విశ్వసనీయత, సామర్థ్యం, భద్రతలో కొత్త ప్రమాణాలను స్థాపిస్తోంది.ఆసియాలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ట్రైడ్.. ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలకు, యూరప్ వైపు విస్తరిస్తోంది. ట్రైడ్ పరిష్కారాలు సంస్థలకు ప్రీడిక్టివ్ ఇన్సైట్స్, సస్టైనబుల్ పనితీరు, రియల్టైమ్ నిర్ణయ మద్దతు అందించి ప్రతిరోజూ లక్షలాది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. - 
      
                   
                                                     
                   
            రిలయన్స్ ఫౌండేషన్ కృషికి ప్రశంసలు
'మోంథా' తుఫాను సమయంలో బలహీన వర్గాల ప్రజలను రక్షించడంలో మరియు ఆర్థిక నష్టాన్ని తగ్గించడంలో రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసించారు.తుఫానులు, వరదలు, ఇతర ప్రమాదాల గురించి అప్రమత్తం చేసి, వారి ప్రాణాలను, జీవనోపాధిని రిలయన్స్ ఫౌండేషన్ కాపాడుతుంది. 'మోంథా' తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సమీపిస్తున్న సమయంలో, తుఫాను తీరం దాటడానికి మూడు రోజుల ముందు, అంటే అక్టోబర్ 25 నుంచే, రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖలు, ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, INCOIS & IMDతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ సకాలంలో హెచ్చరిక సందేశాలను, జాగ్రత్త సలహాలను అందించింది. తుఫాను ప్రభావం తగ్గించడానికి కృషి చేసిన అన్ని సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు.తుఫాను సమయంలో తమ ప్రయత్నాలలో భాగంగా, రిలయన్స్ ఫౌండేషన్ 1.65 లక్షల మంది రైతులు & సముద్ర మత్స్యకారులను చేరుకుంది. వీరిలో అప్పటికే సముద్రంలో ఉన్నవారు కూడా ఉన్నారు. తుఫాను సమీపిస్తున్న తీరు, గాలి, సముద్ర పరిస్థితుల గురించి వారికి నిర్దిష్ట సమాచారం అందించింది. తుఫాను మార్గంలో ఉన్న మత్స్యకారులకు ఒడ్డుకు తిరిగి రావడానికి, వారి పడవలు, వలలు మరియు ఇతర ఆస్తులను భద్రపరచడానికి సహాయపడే లక్ష్యంగా మొబైల్ ఆధారిత సలహాలను అందించారు.రియల్ టైమ్ సమాచారాన్ని అందించడానికి 24/7 పనిచేసిన టోల్-ఫ్రీ హెల్ప్లైన్ అక్టోబర్ 26 - 28 మధ్య 600 పైగా కాల్స్కు స్పందించింది. భారతదేశం అంతటా గ్రామీణ సమాజాల సంక్షేమానికి కట్టుబడి ఉన్న రిలయన్స్ ఫౌండేషన్, ఒక దశాబ్దానికి పైగా, ప్రమాదాల సమయంలో ప్రాణ, జీవనోపాధి నష్టాన్ని నివారించడానికి కీలక సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది. - 
      
                   
                                                     
                   
            పెళ్లిళ్ల సీజన్: రూ.6.5 లక్షల కోట్ల బిజినెస్!
భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 14 వరకు దేశంలో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా. ఈ సీజన్లో సుమారు రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తన నివేదికలో వెల్లడించింది.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT).. తన పరిశోధన విభాగం సీఏఐటీ రీసెర్చ్ & ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ (CRTDS) ద్వారా విడుదల చేసిన నివేదికలో.. పెళ్లిళ్ల సీజన్ భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు భారీ ఊరటను ఇవ్వనుంది. బంగారం, రత్నాలు, దుస్తులు, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్, ట్రావెల్స్ & హాస్పిటాలిటీ, డెకరేషన్ మొదలైన రంగాల వ్యాపారాలు గణనీయంగా పెరుగుతాయని స్పష్టం చేసింది.ఈ సంవత్సరం ఢిల్లీలో మాత్రమే 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్లు వ్యాపారం జరుగుతుందని అంచనా. గత సంవత్సరం ఇదే కాలంలో దేశంలో జరిగిన మొత్తం వివాహాల సంఖ్య సమానంగా ఉన్నప్పటికీ.. ఈసారి ఖర్చు మాత్రం గణనీయంగా పెరుగుతుంది. దీనికి కారణం వస్తువులు, బంగారు ఆభరణాల ధరలు పెరగడమే అని CAIT సెక్రటరీ జనరల్ అండ్ చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.గతంలో జరిగిన వివాహాలు & వ్యాపారం➤2024: 48 లక్షల వివాహాలు, రూ. 5.9 లక్షల కోట్ల వ్యాపారం➤2023: 38 లక్షల వివాహాలు, రూ. 4.74 లక్షల కోట్ల బిజినెస్➤2022: 32 లక్షల వివాహాలు, రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారంఇదీ చదవండి: తండ్రి మత్స్యకారుడు.. కొడుకు బుర్జ్ ఖలీఫా ఓనర్ - 
      
                   
                                                     
                   
            క్రియేటివిటీ హబ్గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాదు, భారతదేశపు క్రియేటివిటీ హబ్గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) సంయుక్తాధ్వర్యంలో హైటెక్ సిటీలోని హెచ్ఐఐసీలో రెండ్రోజుల పాటు 'ఇండియాజాయ్ 2025' పేరిట నిర్వహించనున్న ఇండియాస్ ప్రీమియర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కాంగ్రెగేషన్ ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.సాంకేతికత, సృజనాత్మకత కలిసే చోటుగా హైదరాబాద్ పిక్సెల్, కవిత్వం, అవకాశాల నగరంగా ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. క్రియేటివ్ రంగానికి చేయుతనిచ్చేలా క్రియేటివ్ ఫ్యూచర్స్ ఫండ్, ఈస్పోర్ట్స్ అకాడమీ, మహిళా క్రియేటర్ల కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ను ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 3.1 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ గేమింగ్ పరిశ్రమ విలువ 20 శాతం సీఏజీఆర్ తో 2028 నాటికి 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.భారతదేశ మొత్తం వీఎఫ్ఎక్స్ అవుట్పుట్లో మన వాటా సుమారు 25 శాతం ఉండటం మనకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ ఓటీటీ కంటెంట్ ప్రొడక్షన్ లో 35 శాతం వృద్ధి రేటు నమోదు కావడం ఇక్కడి ఎకో సిస్టంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఇమేజ్ టవర్, ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ సిటీ తదితరాల అందుబాటులోకి వస్తే ఈ ఎకో సిస్టం మరింత పటిష్టం అవుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇమేజ్ టవర్ను వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తెస్తామన్నారు.క్రియేటివిటీలో సానుభూతి, వైవిధ్యం, సస్టైనబులిటీ, భారతీయ గుర్తింపు ప్రతిబింబించేలా చొరవ తీసుకోవాలని యువ క్రియేటర్స్ కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం నియంత్రించేదిగా కాకుండా "కో క్రియేటర్"గా మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, యువ కథానాయకుడు తేజ సజ్జా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, టీవీఏజీఏ ప్రెసిడెంట్ రాజీవ్ చిలక, కార్యదర్శి మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                                                     
                   
            మారుతి విక్టోరిస్.. 33వేల బుకింగ్స్
భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి ప్రవేశించిన.. మారుతి సుజుకి విక్టోరిస్ ఇప్పటి వరకు 33,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందింది. ఇందులో 30 శాతం కంటే ఎక్కువ బుకింగ్స్ CNG వేరియంట్ సొంతం చేసుకుంది. దీనికి కారణం బూట్ స్పేస్ అనే చెప్పాలి.మారుతి సుజుకి తన విక్టోరిస్ కారులో.. సాధారణ కారులో అందించేంత బూట్ స్పేస్ అందిస్తోంది. ఇది CNG వేరియంట్ అమ్మకాలను పెంచడంలో దోహదపడిందని.. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ పేర్కొన్నారు. విక్టోరిస్ CNG వేరియంట్లకు ఇప్పటి వరకు దాదాపు 11,000 బుకింగ్లు వచ్చాయని వెల్లడించారు.మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: భారత్కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!మైల్డ్-హైబ్రిడ్ టెక్తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి. - 
      
                   
                                                     
                   
            జియో-బీపీ మొబిలిటీ హబ్: ఒకేచోట 28 చార్జింగ్ పాయింట్స్
జియో–బీపీ తాజాగా వివిధ రకాల ఇంధనాలతో పాటు చార్జింగ్ పాయింట్లు కూడా ఒకే చోట అందుబాటులో ఉండేలా బెంగళూరులో భారీ స్థాయి సమగ్ర మొబిలిటీ హబ్ను తీర్చిదిద్దింది. ఇందులో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విక్రయిస్తుండగా, ఈవీ చార్జింగ్ హబ్ను కూడా ఏర్పాటు చేసింది.ఈ ఔట్లెట్లో 28 చార్జింగ్ పాయింట్లు, కేఫ్ ఉంటాయని సంస్థ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. 360 కిలోవాట్ల సూపర్ఫాస్ట్ చార్జర్లతో వేగవంతంగా వాహనాన్ని చార్జ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. భారత్లో ఈ తరహా భారీ సమగ్ర హబ్ ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని సంస్థ తెలిపింది. జియో–బీపీకి దేశవ్యాప్తంగా 1,000 ప్రాంతాల్లో 7000 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. - 
      
                   
                                                     
                   
            ఆర్థిక అనిశ్చితి.. స్థిరాస్తి రంగంపై ప్రభావం!
సాక్షి, సిటీబ్యూరో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు, పలు దేశాల నడుమ యుద్ధాలు, ముడి చమురు, బంగారం ధరలు వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. దీని ప్రభావం భారత స్థిరాస్తి రంగంపై పడింది. దేశీయ రియల్టీ రంగంలో విదేశీ పెట్టుబడులు భారీగా తగ్గాయని వెస్టియాన్ నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశీయ రియల్టీలోకి 1.76 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. అయితే 2025 క్యూ2లోని 1.80 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లతో పోలిస్తే ఇది 2 శాతం తగ్గుదల కాగా.. గతేడాది క్యూ3లోని 0.96 బిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్ మెంట్స్తో పోలిస్తే మాత్రం 83 శాతం అధికం.2025 క్యూ3లోని సంస్థాగత పెట్టుబడులలో అత్యధికం వాణిజ్య సముదాయంలోకి వచ్చాయి. 79 శాతం వాటాతో ఈ విభాగంలోకి 1,397.21 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇక, 11 శాతం వాటాతో నివాస సముదాయంలోకి 191.67 మిలియన్ డాలర్లు, 5 శాతం వాటాతో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకి 85.79 మిలియన్ డాలర్లు, 5 శాతం వాటాతో డైవర్సివైడ్ విభాగంలోకి 84.82 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. - 
      
                   
                                                     
                   
            జియోమార్ట్లో ఐఫోన్పై భారీ తగ్గింపు!
యాపిల్ హాలిడే సేల్ను మిస్ అయ్యారా? ఆందోళన అవసరం లేదు. జియోమార్ట్ ఇప్పుడు ఐఫోన్ ప్రేమికుల కోసం అత్యంత లాభదాయకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) (128బీజీ)మోడల్ ఇప్పుడు జియోమార్ట్లో కేవలం రూ.65,990లకే లభిస్తోంది.ఐఫోన్ 16 ప్లస్ 128బీజీ వేరియంట్ అసలు ధర రూ.89,900 కాగా నేరుగా రూ. 23,910 తగ్గింపు అందిస్తోంది. అదనంగా ఎస్బీఐ కో-బ్రాండెడ్ ప్లాటినం క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ (EMI) లావాదేవీలపై 5% క్యాష్ బ్యాక్ (రూ.1,000 వరకు) లభిస్తుంది. తద్వారా ఫోన్ ధర రూ.64,990 లకు తగ్గుతుంది.అంతేకాకుండా పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మరింత అదనపు తగ్గింపు పొందవచ్చు. యాపిల్ అధికారికంగా ఐఫోన్ 17 (iPhone 17) విడుదల నేపథ్యంలో ఐఫోన్ 16 సిరీస్ ధరను తగ్గించినప్పటికీ, జియోమార్ట్ ధరలు అధికారిక స్టోర్ సవరించిన ధర రూ.79,900 కంటే గణనీయంగా తక్కువగా ఉన్నాయి.ఐఫోన్ 16 ప్లస్ ప్రధాన స్పెక్స్డిస్ప్లే: 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ, సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ప్రాసెసర్: యాపిల్ ఏ18 చిప్, 6-కోర్ సీపీయూ, 5-కోర్ జీపీయూకెమెరా సెటప్: 48MP మెయిన్ ఫ్యూజన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 2x ఆప్టికల్ క్వాలిటీ టెలిఫోటో జూమ్, కొత్త కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా త్వరిత యాక్సెస్బ్యాటరీ: 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్డిజైన్: అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్కలర్ ఆప్షన్లు: బ్లాక్, వైట్, పింక్, టీల్, అల్ట్రామెరైన్స్టోరేజ్ ఆప్షన్లు: 128GB / 256GB / 512GB - 
      
                   
                                                     
                   
            తండ్రి మత్స్యకారుడు.. కొడుకు బుర్జ్ ఖలీఫా ఓనర్
దుబాయ్ అంటే అందరికీ 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనంగా ప్రసిద్ధి చెందిన ఈ బుర్జ్ ఖలీఫాను ఒక మత్స్యకారుడి కుమారుడు నిర్మించారనే విషయం బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.బుర్జ్ ఖలీఫాను.. దుబాయ్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించింది. ఈ కంపెనీ ఫౌండర్ 'మహమ్మద్ అలబ్బర్' (Mohamed Alabbar). ఈయనే బుర్జ్ ఖలీఫా యజమాని.తండ్రి మత్స్యకారుడుమహమ్మద్ అలబ్బర్.. దుబాయ్లో ఒక సాధారణ, మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఒక మత్స్యకారుడు. చిన్నప్పుడు తన తండ్రి చేసే పనిలో సహాయం చేసేవాడు. పట్టుదల, క్రమశిక్షణ, వినయాన్ని నా తండ్రి నుంచే నేర్చుకున్నానని అలబ్బర్ అనేక ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.ప్రాధమిక విద్యను దుబాయ్లో పూర్తిచేసిన మహమ్మద్ అలబ్బర్.. ఆ తరువాత ప్రభుత్వం అందించిన స్కాలర్షిప్ ద్వారా అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత 1981లో స్వదేశానికి (దుబాయ్) తిరిగి వచ్చాడు. అలబ్బర్ అమెరికా నుంచి కేవలం డిగ్రీతో రాలేదు. జీవితంలో ఎదగడానికి ఎదో ఒకటి చేయాలనే లక్ష్యంతో వచ్చాడు.బ్యాంక్లో ఉద్యోగంఅలబ్బర్ తన కెరియర్ను యుఎఈ సెంట్రల్ బ్యాంక్లో ప్రారంభించి, ఆర్థిక వ్యవస్థల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. పనితనంతో అందరి దృష్టినీ ఆకసారిస్తూ.. చాలా తక్కువ కాలంలోనే ఆయన దుబాయ్ ఆర్థిక అభివృద్ధి విభాగానికి డైరెక్టర్ జనరల్ అయ్యారు. ఆ సమయంలోనే దుబాయ్ దార్శనిక పాలకుడు 'షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్'తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాతే భవిష్యత్తును ఊహించాడు.1997లో అలబ్బర్ ఎమ్మార్ ప్రాపర్టీస్ను స్థాపించినప్పుడు. ఆ సమయంలో చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఒక దశాబ్దంలోనే దీనికి ఎనలేని గుర్తింపు లభించింది. ఆ తరువాత దుబాయ్ ఫౌంటెన్, డౌన్టౌన్ దుబాయ్, దుబాయ్ మాల్ వంటి నిర్మాణాలను పూర్తిచేసి.. ఈ రంగంలో అలబ్బర్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు.బుర్జ్ ఖలీఫా గురించిప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా.. అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ భవనాల్లో కూడా ఒకటి. ఇందులో సింగిల్ బెడ్ రూమ్ అద్దె ఏడాదికి 180000 – 250000 దిర్హామ్లు (రూ. 40 లక్షల నుంచి రూ. 55 లక్షలు).బుర్జ్ ఖలీఫా ఎత్తు 829.8 మీటర్లు (2,722 అడుగులు). ఇందులో 163 అంతస్తులు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణం 2010కి పూర్తయింది. 95 కిలోమీటర్ల నుంచి కూడా కనిపించే ఈ భవనంలో 304 విలాసవంతమైన హోటల్ రూల్స్, 900 హై-ఎండ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బిల్డింగ్ బయటివైపు శుభ్రం చేయడానికే సుమారు మూడు నెలల సమయం పడుతుందని సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందన్న భయం: రోజుకు రెండు గంటలే నిద్ర! - 
      
                   
                                                     
                   
            రియల్టీకి గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది!
‘ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలేదు. వచ్చింది’ ఇది ఓ పాపులర్ సినిమా డైలాగ్. ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం! ప్రతీ ఆరేడేళ్లకు రియల్టీకి విరామ దశ సాధారణమే. తెలంగాణ ఉద్యమం, సత్యం స్కామ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లెమాన్ బ్రదర్స్ కుప్పకూలడం వంటి వాటితో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో 2007లో మొదలైన హైదరాబాద్ స్థిరాస్తి రంగ పతనం.. 2014 వరకూ కొనసాగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం వరకూ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది. కొత్త రాష్ట్రం, ప్రభుత్వ విధానాలు, కార్యచరణ లపై అస్పష్టత వంటి కారణాలనేకం. ఆ తర్వాత 2015 ప్రారంభంలో మొదలైన రియల్ బూమ్ 2022 వరకూ కొనసాగింది.ఈ మధ్యకాలంలో మార్కెట్లో ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. 2023లో ఎన్నికలతో స్థిరాస్తి రంగంలో మొదలైన సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్లు, అపరిమిత సరఫరా, ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేకపోవడం, అధిక ధరలు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ ప్రతికూల విధానాల వంటి కారణంగా వచ్చే మూడేళ్ల వరకూ విరామ దశలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రియల్టీ రంగంలో ఈ విరామం మంచిదే అంటున్నారు. బిల్డర్లతో రాయితీలు, ఆఫర్లు వంటి బేరసారాలకు అవకాశం ఉంటుందంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇప్పుడు కొనుడే కరెక్ట్పడేటప్పుడు కొంటేనే తక్కువ రేటుకు వస్తుంది. షేర్లలో పెట్టుబడులకు వర్తించే ఈ సూత్రం రియల్టీకి వర్క్ఔట్ అవుతుందని ఓ బడా బిల్డర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్కెట్ బాగాలేనప్పుడు గృహ కొనుగోలుదారులకు మంచి సమయం. బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. మాడ్యులర్ కిచెన్, ఫర్నీచర్, కార్లు వంటి ఆఫర్లు, ఉచిత రిజిస్ట్రేషన్, ధరలో రాయితీలు వంటివి అందుకునే వీలుంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో రెండు రకాల కస్టమర్లు ఉంటారు. ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), పెట్టుబడిదారులైన మొదటి రకంలో వీళ్లంతా పెద్దస్థాయిలో భూములు, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోళ్లు చేస్తుంటారు.ఇక, రెండో రకం రిటైల్ కస్టమర్లు. వీళ్లు సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేస్తుంటారు. మొదటి రకం కొనుగోలుదారులేమో మార్కెట్ బాగాలేనప్పుడు కొనుగోలు చేసి, బాగున్నప్పుడు ఎక్కువ ధరకు విక్రయించేసుకుంటారు. రెండో రకమేమో మార్కెట్ బాగాలేనప్పుడు ధరలు తగ్గుతాయేమోనని భ్రమలో వేచి చూసి, మార్కెట్ బాగున్నప్పుడు ఎక్కువ ధర పెట్టి మరీ కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి స్థిరాస్తి మార్కెట్లో లాభాలు అర్జించాలంటే మొదటి రకాన్ని ఫాలో అవడమే కరెక్ట్. అందుకే ప్రస్తుత సందిగ్ధ వాతావరణంలో గృహాలను కొనుగోలు చేయడమే మంచి నిర్ణయం. ఇలాంటి ప్రతికూల మార్కెట్లోనే ధర, వసతుల విషయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశాలుంటాయి.కొత్త ప్రాజెక్ట్లపై పునరాలోచన..విక్రయాలు అంతంతమాత్రంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో కొత్త ప్రాజెక్ట్లు చేపట్టేందుకు బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొని పెట్టుకోవడం, నిర్మాణ అనుమతులు తీసుకోవడం చేస్తున్నారే తప్ప ప్రాజెక్ట్ లాంచింగ్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఊహాజనిత మార్కెట్లో భూముల ధరలు పెరుగుతాయే తప్ప అపార్ట్మెంట్ల చ.అ. రేట్లు పెరగవు. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీ ఉంది. నిర్మాణంలో ఉన్న, రెడీగా ఉన్న ఇన్వెంటరీ పోతేగానీ కొత్త యూనిట్లకు అవకాశం ఉండదు. అలాగే ప్రీలాంచ్ ప్రాజెక్ట్లు, డెవలపర్లు కూడా భూముల రేట్లు పెరగడానికి కారణమే. ఎప్పుడైనా సరే స్థిరాస్తి ధరలు స్థిరంగా పెరగాలే తప్ప అమాంతం పెరగకూడదు. రాత్రికి రాత్రే పెరిగే ధరలు గాలిబుడగ వంటివే. ఎప్పటికైనా పడిపోవాల్సిందే లేకపోతే తుది కొనుగోలుదారుల మీద అదనపు భారం తప్పదు.వేలంతో సామాన్యుడిపైనే భారం..హైదరాబాద్లో సొంతంగా భూమి కొనుగోలు చేసి, భవన నిర్మాణాలు చేపట్టే డెవలపర్లు చాలా తక్కువ. భూయజమానితో ఒప్పందం చేసుకొని చేపట్టే జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లే ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రాజెక్ట్కైనా విక్రయాలు చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని డెవలపర్లు తమ జేబులోంచి వెచ్చించరు. ప్రాజెక్ట్ రుణం, కొనుగోలుదారులకు అపార్ట్మెంట్ల విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతోనే నిర్మాణ పనులు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ మార్కెట్లో 50 వేల యూనిట్ల అపార్ట్మెంట్లు అవసరం ఉంటాయి. సొంత నిధులతో స్థలం భూమి కొనుగోలు చేసి ప్రాజెక్ట్లు చేపట్టే వాళ్లు ఎంత వరకు సప్లై చేయగలరు. ఎక్కువ రేటుకు భూములు కొన్నవారు ఆ మేరకు లాభాలపైనే ఫోకస్ చేస్తారు. వేలం వెర్రిగా భూముల వేలంతో మార్కెట్లో సానుకూలత ఏర్పడినా అంతిమంగా ఆ భారం గృహ కొనుగోలుదారులపైనే పడుతోంది. సామాన్య, మధ్యతరగతికి ఇళ్లు అందుబాటులో ఉండవు.ప్రభుత్వం ఏం చేయాలంటే?ఏ పట్టణ ప్రాంతం అభివృద్ధికైనా కావాల్సింది విద్యా, వైద్యం, వినోదం, ఉద్యోగ అవకాశాలు. నగరవాసుల నాణ్యమైన జీవితాన్ని నిర్ణయించేవి ఈ నాలుగే. వీటిల్లో భాగ్యనగరం కేంద్ర బిందువనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెడికల్ టూరిజం, ఎడ్యుకేషనల్ హబ్, ఎంటర్టైన్మెంట్ జోన్లకు పెట్టింది పేరైన హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరానికి ఉన్న మరో అద్భుతమైన అవకాశం మెరుగైన మౌలిక వసతులున్న అపారమైన భూముల లభ్యత, ఔటర్, మెట్రోలతో కనెక్టివిటీ. దీంతో నగర రియల్టీ మార్కెట్కు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి. - 
      
                   
                                                     
                   
            సామాన్యులకు తెలియని నగదు సూత్రాలు
ధనవంతులుగా మారడం కేవలం అదృష్టం లేదా అధిక జీతం వల్ల మాత్రమే సాధ్యం కాదు. నిరంతర కృషి, తెలివైన ఆర్థిక నిర్ణయాలు, కొంతమందికి తెలియని ఆర్థిక రహస్యాలు తెలుసుకొని వాటిని అనుసరించడం వంటివి ఉంటాయి. భారీగా డబ్బు సంపాదించే వారు పాటించే కొన్ని ఆర్థిక రహస్యాలను తెలుసుకుందాం.ముందు పెట్టుబడి తర్వాతే ఖర్చుసామాన్య ప్రజలు జీతం వచ్చిన తర్వాత ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బును పొదుపు చేస్తారు. కానీ ధనవంతులు దీనికి పూర్తి విరుద్ధమైన సూత్రాన్ని పాటిస్తారు. ముందే పొదుపు తర్వాతే ఖర్చు నియమాన్ని అనుసరిస్తారు. జీతం/ఆదాయం రాగానే తమ ఆర్థిక లక్ష్యాల కోసం నిర్దిష్ట శాతాన్ని (ఉదాహరణకు 20% లేదా అంతకంటే ఎక్కువ) వెంటనే పెట్టుబడికి మళ్లిస్తారు. ఆ తర్వాతే మిగిలిన మొత్తంతో తమ ఖర్చులను ప్లాన్ చేసుకుంటారు. అత్యంత ధనవంతుడైన వారెన్ బఫెట్ కూడా ఈ సూత్రాన్నే సిఫార్సు చేస్తారు. ఇది ఖర్చులను నియంత్రించడమే కాక, ప్రతి నెలా సంపద సృష్టికి తప్పనిసరిగా నిధులు కేటాయించే క్రమశిక్షణను అలవాటు చేస్తుంది.అప్పులో మంచి-చెడుఅప్పు అంటేనే ఆర్థిక సమస్యలకు మూలం అని సామాన్యులు భావిస్తారు. కానీ ధనవంతులు అప్పును ఒక ఆర్థిక సాధనంగా ఉపయోగిస్తారు. మంచి అప్పు.. ఇది ఆదాయాన్ని సృష్టించే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించే అప్పు. ఉదాహరణకు, అద్దెకు ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనడానికి తీసుకునే రుణం లేదా వ్యాపారం విస్తరణకు తీసుకునే రుణం. ఈ అప్పు ద్వారా వచ్చే ఆదాయం, రుణం వడ్డీ కంటే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తారు.చెడు అప్పు వినియోగ వస్తువుల కోసం లేదా త్వరగా విలువ తగ్గే వస్తువుల కోసం తీసుకునే అప్పు. ఉదాహరణకు, క్రెడిట్ కార్డు రుణాలు, ఖరీదైన కార్ల ఈఎంఐలు, విలాసవంతమైన విహారయాత్రలకు తీసుకునే రుణాలు. ధనవంతులు ఇలాంటి చెడు అప్పులకు దూరంగా ఉంటారు.సంపద సృష్టికి ఆదాయ మార్గాలుసామాన్య ఉద్యోగులు కేవలం ఒకే ఒక్క ఆదాయ వనరుపై (ఉద్యోగం) ఆధారపడతారు. అందుకే వారి ఆర్థిక ఎదుగుదల పరిమితంగా ఉంటుంది. ధనవంతులు తమ ప్రధాన ఆదాయంతో పాటు అదనంగా కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయ వనరులను సృష్టిస్తారు. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, అద్దె ఆదాయం ఇచ్చే ఆస్తులు, రాయల్టీలు, లేదా ఒక సైడ్ బిజినెస్ వంటివి నిర్వహిస్తారు.దీర్ఘకాలిక పెట్టుబడులుత్వరగా ధనవంతులు అవ్వాలనే ఆశతో సామాన్యులు షార్ట్ కట్లు లేదా ఊహాజనిత పెట్టుబడుల్లో డబ్బును కోల్పోతారు. ధనవంతులు తక్కువ సమయంలో అధిక లాభాల కోసం వెంపర్లాడకుండా దీర్ఘకాలిక వృద్ధిని లక్ష్యంగా చేసుకుని పెట్టుబడి పెడతారు. వారు పెట్టుబడి పెట్టే కంపెనీలు, ఆస్తుల గురించి లోతుగా పరిశోధన చేస్తారు.వడ్డీపై వడ్డీదీర్ఘకాలంలో పెట్టుబడులను అలాగే ఉంచడం ద్వారా వారు కేవలం అసలుపై మాత్రమే కాక, అప్పటి వరకు వచ్చిన లాభాలపై కూడా రాబడిని పొందుతారు. ఇది సంపదను భారీగా పెంచే అసలైన రహస్యం.ఆర్థిక అక్షరాస్యత, నిరంతర అభ్యాసండబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ధనవంతుల ముఖ్య రహస్యం. ధనవంతులు ఎప్పుడూ ఆర్థిక అంశాల గురించి తెలుసుకుంటూనే ఉంటారు. వారు పన్ను నియమాలు, పెట్టుబడి పోకడలు, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై నిరంతరం అప్డేట్ అవుతారు. సరైన ఆర్థిక ప్రణాళికలు, పన్ను ఆదా వ్యూహాల కోసం వారు మంచి ఆర్థిక సలహాదారులను, అకౌంటెంట్లను నియమించుకుంటారు. ఇది వారి డబ్బును మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.ఇదీ చదవండి: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు వాడకూడదు - 
      
                   
                                                     
                   
            ఉద్యోగం పోతుందన్న భయం: రోజుకు రెండు గంటలే నిద్ర!
2025లో కూడా అనేక దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. తాజాగా అమెజాన్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ సంఖ్య 30,000 వరకు చేరే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇది సంస్థలో పనిచేసే ఉద్యోగులలో భయాన్ని కలిగిస్తోందని.. ఒక రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు.నా దగ్గరి స్నేహితుల్లో ఒకరు అమెజాన్లో పనిచేస్తున్నారు. అతడు మంచి ప్రతిభావంతుడు. ఇతరులు సరిగ్గా పదాలను కూడా చెప్పలేని ఎన్నో సాంకేతిక సమస్యలను పరిష్కరించే వ్యక్తి. కానీ లేఆఫ్స్ వార్తలు అతనిని భయాందోళనకు గురి చేసిందని రెడ్డిట్ యూజర్ వెల్లడించారు.తన ఫోనుకు నోటిఫికేషన్ వచ్చినా.. కాల్ వచ్చినా ఎక్కువ ఆందోళనకు గురవుతున్నాడు. ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఈమెయిల్ వస్తుందేమో అని భయంతో బిక్కుబిక్కుమంటున్నాడు. అతడు రాత్రి 2-3 గంటలు మాత్రమే నిద్రపోతాడు. ఇప్పటికే ఉద్యోగం కోల్పోయిన వారు రాత్రి సమయంలోనే.. లేఆఫ్ మెయిల్ పొందడంతో అతడు నిద్రపోవడానికి కూడా భయపడుతున్నాడు.నాకు ఖచ్చితంగా లేఆఫ్ మెయిల్ వస్తుందని చెబుతున్నాడు. దీనికి కారణం తక్కువ మాట్లాడటమే. నేను పని చేస్తాను.. కానీ ఎవరితో ఎక్కువగా మాట్లాడను. ఒకసారి మేనేజర్ తనను పిలిచి.. కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచుకోవాలని చెప్పినట్లు పేర్కొన్నాడు. పనిలో గొప్పగా రాణిస్తున్న వ్యక్తి.. ఉద్యోగం పోతుందేమో అని భయపడటం చాలా బాధగా ఉందని రెడ్దిట్ యూజర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: యూట్యూబ్ ఉద్యోగులకు ఎగ్జిట్ ప్లాన్ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ''నాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.. భయాందోళనలు, తినలేకపోవడం, మెసేజ్ కోసం చూడటం, గుండె వేగంగా కొట్టుకోవడం అన్నీ నిజమే'' అని యూజర్ పేర్కొన్నారు. ''మా కంపెనీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే.. 50శాతం మంది ఉద్యోగులను తొలగించిందని, ఆ సమయంలో చాలాకాలం నేను భయపడుతూనే ఉన్నానని'' మరొక యూజర్ పేర్కొన్నారు.అమెజాన్ లేఆఫ్స్అమెజాన్ కంపెనీ తమ మొత్తం కార్పొరేట్ ఉద్యోగులలో 10 శాతం తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించడంలో భాగంగానే.. సంస్థ ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. హెచ్ఆర్ విభాగంలో సుమారు 15 శాతం తగ్గించనున్నారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడం వల్ల.. మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీసే అవకాశం ఉందని జూన్లో సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 15.5 లక్షలు. - 
      
                   
                                                     
                   
            అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టింగ్ గురూ రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల గురించి మరోసారి హెచ్చరించారు. అంతర్జాతీ మార్కెట్ల ఒడిదొడుకుల నేపథ్యంలో ‘భారీ క్రాష్ మొదలంది’ అంటూ ‘ఎక్స్’లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ పెట్టారు.లక్షల మంది ఇన్వెస్టర్లు ఆర్థికంగా వినాశనానికి గురవుతారని అంచనా వేశారు. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలు హాని కలిగిస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు. వెండి (silver), బంగారం (gold) వంటి విలువైన లోహాలు, బిట్ కాయిన్, ఎథేరియం లాంటి క్రిప్టోకరెన్సీలు తిరోగమనం సమయంలో రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయని సూచించారు.‘భారీ క్రాష్ మొదలంది. కోట్ల కొద్దీ పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోతాయి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం పెట్టుబడులే మిమ్మల్ని కాపాడేదది’ అంటూ తన ట్వీట్లో రాబర్ట్ కియోసాకి రాసుకొచ్చారు.కియోసాకి (Robert Kiyosaki) ఇలా హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. 2025 ప్రారంభం ఫిబ్రవరిలో కూడా ఇలాగే "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" రాబోతోందంటూ అంచనా వేస్తూ ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.MASSIVE CRASH BEGININING: Millions will be wiped out. Protect yourself. Silver, gold, Bitcoin, Ethereum investors will protect you. Take care— Robert Kiyosaki (@theRealKiyosaki) November 1, 2025 - 
      
                   
                                                     
                   
            ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు వాడకూడదు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వాడకూడదని, అందుకు బదులుగా స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన ఈ నోట్లో పర్యావరణం పట్ల బాధ్యత, స్వదేశీ ఉత్పత్తుల ప్రచారం పట్ల రాష్ట్రం నిబద్ధతను ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.ఈ ఆదేశాల అమలులో భాగంగా సచివాలయంలో జరిగే సమావేశాలు, అధికారిక కార్యక్రమాల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఆధ్వర్యంలో ‘నందిని’ ఉత్పత్తులను తప్పనిసరిగా ఉపయోగించాలని సీఎం ప్రత్యేకంగా ఆదేశించారు. గతంలో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీటి కోసం ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాజా ఆదేశాలు ఈ చర్యను మరింత కఠినంగా అమలు చేయడానికి వీలవుతాయి.ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించడం ద్వారా..ప్లాస్టిక్ వ్యర్థాలు, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు పర్యావరణానికి, జల వనరులకు, నేలకు తీవ్రనష్టం కలిగిస్తాయి. వీటిపై నిషేధం దీర్ఘకాలిక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తిరిగి ఉపయోగించగల సీసాలు, గాజు కంటైనర్లు లేదా స్థానికంగా లభించే ఇతర పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వాడకానికి ఇది దారి తీస్తుంది. ప్రభుత్వమే ఈ పద్ధతులను అవలంబించడం ద్వారా ప్రజలకు, ప్రైవేట్ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుంది.నందిని పాల ఉత్పత్తులపై ప్రభావంముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అధికారిక కార్యక్రమాలలో ‘నందిని’ ఉత్పత్తులను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ నిర్ణయం కేవలం పర్యావరణ పరమైన నిర్ణయమే కాకుండా రాష్ట్రంలోని స్థానిక ఆర్థిక వ్యవస్థ, పాడి పరిశ్రమకు మద్దతు ఇచ్చే ఒక వ్యూహాత్మక చర్యగా ఉంటుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నందిని బ్రాండ్కు ఈ నిర్ణయం అనేక రకాలుగా లబ్ధి చేకూరుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో నందిని ఉత్పత్తులను (ఉదాహరణకు, టీ/కాఫీ కోసం పాలు, లస్సీ/మజ్జిగ, నీటి కోసం పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్లోని ఉత్పత్తులు) తప్పనిసరిగా ఉపయోగించడం వల్ల కంపెనీకి స్థిరమైన, పెద్ద మొత్తంలో డిమాండ్ ఏర్పడుతుంది. ప్రభుత్వమే తమ ఉత్పత్తులను వినియోగించడంతో నందిని బ్రాండ్ విశ్వసనీయత, జాతీయ స్థాయి ఇమేజ్ పెరుగుతుంది.స్థానిక పాడి పరిశ్రమ అభివృద్ధిఈ ఆదేశాల వల్ల కర్ణాటకలోని పాడి రైతులకు, పాడి పరిశ్రమకు లబ్ధి చేకూరుతుంది. KMF రాష్ట్రంలోని లక్షలాది మంది పాడి రైతులకు, గ్రామీణ ప్రాంతాల మహిళలకు జీవనోపాధి కల్పిస్తుంది. నందిని ఉత్పత్తుల డిమాండ్ పెరిగితే KMF పాల సేకరణను పెంచుతుంది. తద్వారా పాడి రైతులకు స్థిరమైన, మెరుగైన ధర, ఆదాయ భద్రత లభిస్తుంది. పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, పంపిణీ రంగాల్లో పెరిగే కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతాయి.ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలా? - 
      
                   
                                                     
                   
            ఆఫీసు అద్దెలు పెరిగాయ్.. ఖాళీలు తగ్గాయ్..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల అద్దెలు 6 శాతం మేర పెరిగాయి. గతేడాది సెప్టెంబర్లో అద్దె చ.అ.కు రూ.85గా ఉండగా.. ఇప్పుడది రూ.90కి చేరింది. అత్యధికంగా బెంగళూరులో 9 శాతం మేర ఆఫీసు అద్దెలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఆఫీసు వేకన్సీలు గతేడాది 16.70 శాతంగా ఉండగా.. ఇప్పుడది 16.20 శాతానికి తగ్గింది.ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ తొమ్మిది నెలల్లో ఏడు నగరాల్లో 4.2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలోని 3.1 కోట్ల చ.అ. లీజులతో పోలిస్తే 34 శాతం అధికం. అలాగే కొత్తగా ఏడు నగరాల్లో 3.9 కోట్ల చ.అ. ఆఫీసు నిర్మాణం పూర్తయింది. గతేడాది 9 నెలల కాలంలోని 3.4 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ.ఐటీ హబ్ హైదరాబాద్లో..ఐటీ హబ్గా పేరొందిన హైదరాబాద్లో ఆఫీసు స్పేస్ లీజులు బాగానే ఉన్నా కొత్త నిర్మాణాలలో క్షీణత నమోదైంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో నగరంలో 57 లక్షల ఆఫీసు లావాదేవీలు జరిగాయి. గతేడాది 9 నెలల్లో 44.2 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే 29 శాతం అధికం. అలాగే భాగ్యనగరంలో కొత్తగా 59 లక్షల చ.అ. ఆఫీసు నిర్మాణాలు పూర్తయ్యాయి. గతేడాది ఇదే కాలంలో పూర్తయిన 96.8 లక్షల చ.అ.లతో పోలిస్తే 39 శాతం క్షీణించింది. ప్రస్తుతం నగరంలో ఆఫీసు వేకెన్సీ 26.50 శాతంగా ఉంది. - 
      
                   
                                                     
                   
            ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలా?
ఉద్యోగులు తమ అత్యవసర ఆర్థిక అవసరాల కోసం పీఎఫ్ (PF) నిధులను పొందే ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) విప్లవాత్మకంగా మార్చింది. క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఈ ఏడాది జూన్లో రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దాంతో క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం అయింది. దీనివల్ల లక్షలాది మంది సభ్యులు ఇకపై తమ అడ్వాన్స్ క్లెయిమ్లను కేవలం 72 గంటల్లో పరిష్కరించుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ఈపీఎఫ్ సెటిల్మెంట్ విధానాన్ని పరిశీలిద్దాం.పీఎఫ్ క్లెయిమ్ చేసుకునే విధానంEPF సభ్యులు (ఉద్యోగులు) ఆన్లైన్లో అడ్వాన్స్ లేదా తుది సెటిల్మెంట్ క్లెయిమ్ను సమర్పించడానికి ఈ కింది దశలను అనుసరించాలి.మీ UAN యాక్టివ్గా ఉండాలి.UANతో ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా (IFSCతో సహా) లింక్ అయి ఉండాలి.KYC వివరాలు EPFO రికార్డుల్లో ధ్రువీకరించుకోవాలి.ముందుగా EPFO అధికారిక యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను సందర్శించాలి.UAN, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి.హోం పేజీలో ఆన్లైన్ సేవలను ఎంచుకోవాలి.Online Services టాబ్పై క్లిక్ చేసి, డ్రాప్డౌన్ మెనూలో ‘Claim (Form-31, 19, 10C)’ ఎంచుకోవాలి.ఏ ఫారమ్ ఎందుకోసమంటే.. Form-31: అనారోగ్యం, విద్య, ఇల్లు మొదలైన వాటి కోసం పాక్షిక ఉపసంహరణ.Form-19: తుది సెటిల్మెంట్ - ఉద్యోగం మానేసిన తర్వాత.Form-10C: పెన్షన్ ఉపసంహరణ - ఉద్యోగం మానేసిన తర్వాత.తరువాత పేజీలో మీ బ్యాంక్ ఖాతా నంబర్ను నమోదు చేసి ‘Verify’పై క్లిక్ చేయాలి.నిబంధనలను అంగీకరించి ‘Proceed for Online Claim’పై క్లిక్ చేయండి.క్లెయిమ్ ఫారం వివరాలు నింపాలి.‘I Want To Apply For’ విభాగంలో మీకు అవసరమైన క్లెయిమ్ రకాన్ని ఎంచుకోవాలి.ఆన్లైన్ ఫామ్లో Amount (కావలసిన మొత్తం), ‘Employee Address (ఉద్యోగి చిరునామా)’ వంటి వివరాలను నింపాలి.డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.షరతులకు అంగీకరించడానికి టిక్ బాక్స్ను ఎంచుకుని, ‘Get Aadhaar OTP’పై క్లిక్ చేయాలి.మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన OTPని ఎంటర్ చేసి Submit చేయాలి.భవిష్యత్తు క్లెయిమ్ ట్రాకింగ్ కోసం ప్రాసెస్ను ధ్రువీకరిస్తూ పీడీఎఫ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి.ఇదీ చదవండి: ఆటోమేషన్తో క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతం - 
      
                   
                                                     
                   
            గ్యాస్ సిలిండర్పై ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధర
దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధరపై (LPG gas price) ఊరట లభించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రిటైల్ ధరను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. నవంబర్ 1న కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..ధరల సవరణ తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ రిటైల్ ధర రూ.5 తగ్గి రూ.1,590.50గా ఉంది. అంతకుముందు ఇది 1595.50గా ఉండేది.కోల్కతాలో 19 కిలోల సిలిండర్ ధర రూ.6.5 క్షీణించి రూ.1694 లకు వచ్చింది. మునుపటి ధర రూ.1700.50 గా ఉండేది.ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.5 తగ్గి రూ.1542గా ఉంది. అంతకుముందు ధర రూ.1547.చెన్నైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.4.5 మేర తగ్గి రూ.1750 లకు వచ్చింది. మునుపటి ధర రూ.1754.50హైదరాబాద్లో 19 కిలోల సిలిండర్ ధర రూ.4.5 క్షీణించి రూ.1,647.50 లుగా ఉంది. అంతకుముందు ధర రూ.1,652.విశాఖపట్నంలో 19 కిలోల సిలిండర్ ధర రూ.4.5 మేర తగ్గి రూ.1,647.50 లకు వచ్చింది. మునుపటి ధర రూ.1,652గా ఉండేది.19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర గత సెప్టెంబర్లో రూ .15.50 పెరిగిన తరువాత, నవంబర్ 1 నుండి మళ్లీ ధరలు తగ్గడంతో వీటిని వినియోగించే హోటల్ వ్యాపారులు, క్యాటరింగ్ నిర్వాహకులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. అయితే సాధారణంగా ఇళ్లలో వినియోగించి డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.అయితే కమర్షియల్ ఎల్పీజీ ధరలను తగ్గించినా దేశీయ విమానాల్లో వినియోగించే ఇంధనం ఏటీఎఫ్ రేట్లను మాత్రం చమురు సంస్థలు పెంచాయి. ఢిల్లీలో దేశీయ విమానయాన సంస్థల ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు రూ .777 పెరిగి రూ .94,543.02 కు చేరుకుంది. - 
      
                   
                                                     
                   
            ఆటోమేషన్తో క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతం
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. సభ్యులకు వారి నిధులను త్వరగా అందుబాటులోకి తీసుకురావడంలో గణనీయమైన ముందడుగు వేసినట్లు చెప్పింది. EPFO అడ్వాన్సుల కోసం ఆటో-సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం సంస్థ ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో కీలకమని పేర్కొంది. ఈ పరిమితి పెంపు, ఆటోమేషన్ విధానం ద్వారా ఈపీఎఫ్ఓ క్లెయిమ్ సెటిల్మెంట్లలో వేగం, సామర్థ్యం పారదర్శకతను పెంచినట్లు ఎక్స్ ఖాతాలో పేర్కొంది.2025-26 ఆర్థిక సంవత్సరంలో (30.10.2025 వరకు) మొత్తం EPF అడ్వాన్సు క్లెయిమ్లలో 71.22% ఆటోమేషన్ ద్వారా పరిష్కరించినట్లు చెప్పింది. అంతకుముందు సంవత్సరం ఇది 59 శాతంగా ఉందని స్పష్టం చేసింది. మానవ ప్రమేయం లేకుండా వేగంగా క్లెయిమ్లు సెటిల్ అవుతున్నాయనడానికి ఇది నిదర్శనంగా ఉందని తెలిపింది. ఆటోమేటెడ్ విధానంలో క్లెయిమ్లు నిర్దిష్ట అల్గారిథమ్లు, ప్రమాణాల ఆధారంగా ప్రాసెస్ అవుతాయి. తద్వారా వ్యక్తిగత ప్రమేయాలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ విధానం సాగుతోంది.క్లెయిమ్లు త్వరగా సెటిల్ కావడానికి కారణాలుEPF క్లెయిమ్లు వేగంగా పరిష్కారం కావడానికి ప్రధాన కారణం సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడమేనని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను ఆటోమేట్ చేయడం సంస్థకు ఎంతో తోడ్పడిందటున్నారు. అందుకోసం ఈపీఎఫ్ఓ సాఫ్ట్వేర్ AI (కృత్రిమ మేధ), మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగిస్తుంది. క్లెయిమ్ దరఖాస్తులను సభ్యుని కేవైసీ వివరాలు (ఆధార్, బ్యాంకు ఖాతా), ఇతర ప్రమాణాలను ఇది స్వయంచాలకంగా ధ్రువీకరిస్తుంది.Faster Claim Settlements!Auto-settlement limit for EPF Advances raised from ₹1 Lakh to ₹5 Lakh.✅ 71.22% of EPF Advance claims settled automatically (FY 2025–26 up to 30.10.2025). Ensuring speed, efficiency & transparency.EPFO – Social Security for All#73YearsOfEPFO pic.twitter.com/2S90D6WzMo— Ministry of Information and Broadcasting (@MIB_India) November 1, 2025పరిమితి (ప్రస్తుతం రూ.5 లక్షలు) లోపు ఉన్న, నిబంధనలకు అనువుగా ఉన్న అన్ని క్లెయిమ్లు మానవ ప్రమేయం లేకుండా సెటిల్ అవుతాయి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ద్వారా సభ్యుని వివరాలు, KYC డాక్యుమెంట్లు, సర్వీస్ హిస్టరీ అన్నీ ఒకే వేదికపై అనుసంధానం అవుతాయి. క్లెయిమ్ల కోసం ఇప్పుడు ఆన్లైన్లో ఫామ్-31 (అడ్వాన్స్), ఫామ్-19 (తుది సెటిల్మెంట్), ఫామ్-10C (పెన్షన్) అందుబాటులో ఉన్నాయి. ఇవి దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రూ.44 వేలకోట్లు రుణ మోసం - 
      
                   
                                                     
                   
            రూ.44 వేలకోట్లు రుణ మోసం
భారత సంతతికి చెందిన అమెరికా టెలికాం పారిశ్రామికవేత్త బంకిం బ్రహ్మభట్పై భారీ రుణ మోసం ఆరోపణలు చర్చనీయాంశం అవుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) నివేదిక ప్రకారం ఆయనపై 500 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.44 వేలకోట్లు) భారీ రుణ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో నకిలీ ఆదాయం, రుణాల పెంపు వంటి అంశాలు ఉన్నాయి. ఈ వివాదం వేగంగా విస్తరిస్తున్న ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్లోని ప్రమాదాలపై ఆందోళనలను పెంచుతోంది.ప్రధాన ఆరోపణలు, దావా వివరాలుబ్రాడ్బ్యాండ్ టెలికాం, బ్రిడ్జ్ వాయిస్ విభాగాల్లోని సంస్థలకు సారథ్యం వహిస్తున్న బంకిం బ్రహ్మభట్ అమెరికన్ రుణదాతల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందడానికి నకిలీ కస్టమర్ ఖాతాలు, రిసీవబుల్స్ను సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్లో ఒకటైన బ్లాక్ రాక్ మద్దతుతో కూడిన పెట్టుబడి సంస్థ హెచ్పీఎస్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ ఈ రుణదాతల్లో ఉంది.బ్రహ్మభట్ తమను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ హెచ్పీఎస్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ నేతృత్వంలోని రుణదాతలు ఆగస్టులో దావా వేశారు. లెక్కల్లో చూపని ఆదాయ మార్గాలను రుణాలు తిరిగి చెల్లించడానికి తాకట్టు(Collateral) పెట్టినట్లు ఆరోపించారు. బ్రహ్మభట్ సంస్థలు ప్రస్తుతం చాప్టర్ 11 దివాలా (Bankruptcy) ప్రక్రియలో ఉన్నాయి. సమష్టిగా ఈ సంస్థలు రుణదాతలకు 500 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంది. బ్రహ్మభట్ కూడా ఆగస్టు 12న వ్యక్తిగత దివాలా కోసం దాఖలు చేశారు. ఈ రుణాలు మొదట్లో సెప్టెంబర్ 2020లో ప్రారంభమయ్యాయి. హెచ్పీఎస్, దాని భాగస్వామి అయిన బీఎన్పీ పరిబాస్ ద్వారా నిధులు అందించారు. ఆగస్టు 2024 నాటికి ఈ రుణం మొత్తం 430 మిలియన్ డాలర్లకు పెరిగింది.ఆఫీస్కు తాళం..వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయంపై వివరాలు సేకరించేందుకు న్యూయార్క్లోని గార్డెన్ సిటీలో ఉన్న బ్రహ్మభట్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు తాళం వేసినట్లు తెలిపింది. కొంతకాలం నుంచి ఆఫీస్ ఖాళీగానే ఉందని చుట్టుపక్కల వారు చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు బ్రహ్మభట్ అమెరికాను విడిచిపెట్టి ఉండవచ్చని హెచ్పీఎస్ భయపడుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్కి చెప్పారు. అయితే, ఈ ఆరోపణలను బ్రహ్మభట్ న్యాయవాది ఖండించారు. దావాలోని వాదనలు నిరాధారమైనవని తెలిపారు. - 
      
                   
                                                     
                   
            బంగారం ధర మళ్లీ తగ్గినా..
పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుదలతో ఊగిసలాడుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) - 
      
                   
                                                     
                   
            హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. యమా స్పీడు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అపార్ట్మెంట్ల విక్రయాలు, లాంచింగ్స్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని ప్రాప్టైగర్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (క్యూ3)లో నగరంలో 17,658 యూనిట్లు అమ్ముడుపోయాయని, గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయమైన 11,564 యూనిట్లతో పోలిస్తే ఇది 52.7 శాతం పెరుగుదల అని పేర్కొంది.అలాగే ఈ క్యూ3లో 12,530 యూనిట్లు లాంచింగ్ అయ్యాయని, గతేడాది ఇదే కాలంలో 8,546 ఫ్లాట్ల లాంచింగ్స్తో పోలిస్తే ఇది 46.6 శాతం ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం నగరంలో అపార్ట్మెంట్ల చ.అ. ధర సగటున రూ.7,750గా ఉంది. 2024 క్యూలో ఇది రూ.6,858గా ఉంది.భవిష్యత్తు ఆశాజనకంగా..హైదరాబాద్ స్థిరాస్తి రంగ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని ప్రాప్టైగర్ సర్వే అభిప్రాయపడింది. బలమైన, స్థిరమైన ఆర్థిక పునాదులు, ఐటీ రంగ వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి చోదకాలుగా నిలుస్తున్నాయని వివరించింది.అలాగే డిజిటలైజ్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ విధానంతో పారదర్శకత, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతున్నాయని పేర్కొంది. అలాగే పాత బస్తీ మెట్రో కారిడార్, రీజినల్ రింగ్ రోడ్లతో భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది. - 
      
                   
                                                     
                   
            టిక్టాక్, ఇన్స్టాగ్రామ్కు పోటీగా కొత్త యాప్.. పూర్తి వివరాలు..
డిజిటల్ యుగం మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ప్రతి రోజూ మనం ఎన్నో యాప్లు ఉపయోగిస్తూ ఉంటాం. అందులో కొన్ని చాటింగ్ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం.. వాడుతుంటాం. అయితే ఒకే వేదికపై ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరీల్స్(Vreels-Virtually Relax, Explore, Engage, Live, Share) రూపొందించారు. ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేశారు.ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా దశలో ఉంది. Play Store, App Storeలో Vreelsను డౌన్లోడ్ చేసుకుని ఈ కొత్త అనుభవాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.వెబ్సైట్: www.vreels.comసృజనాత్మకతతో..Vreels ఒకే చోట కంటెంట్ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా మారింది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్గా మారొచ్చు. చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్ స్టోరీస్ను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులకు సరిపోయేలా రూపొందించుకోవచ్చు. ఇందులోని ఫీడ్ యూజర్లు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ మరింత పర్సనల్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది. యాప్లోని కొన్ని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.Reels, Pixమీ భావాలు, ప్రయాణాలు, ఆలోచనలు.. అన్నీ ఒక క్లిక్లో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ఆకస్తి కరంగా యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. ఫిల్టర్లు, టెక్స్ట్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్త్తో Vreels క్రియేటర్లకు మెరుగైన అనుభవం ఇస్తుంది.Pix Pouches.. డిజిటల్ నోట్బుక్Pix Pouches అనేది డిజిటల్ నోట్బుక్. ఇష్టమైన ఫొటోలను లేదా ఆలోచనలను వర్గాల వారీగా స్టోర్ చేసుకోవచ్చు. మిత్రులతో కలిసి కలెక్షన్లు సృష్టించి, మంచి ప్రాజెక్టులను ప్లాన్ చేయవచ్చు.Chats, Calls — కనెక్ట్ అయ్యేందుకు..స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్లో చాట్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్లు అవసరం లేదు. Vreelsలోనే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. వీరీల్స్ క్రియేటివ్ వేదికగా ఉన్నందున ఇది సాధ్యపడింది. మీరు మాట్లాడుతూనే మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చు.V Map — లొకేషన్ షేరింగ్మీ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో V Mapతో సులభంగా తెలుసుకోవచ్చు. లొకేషన్ షేరింగ్ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది.V Capsules — మధుర జ్ఞాపకాలుఈ ప్రత్యేక ఫీచర్లో భావోద్వేగ జ్ఞాపకాలను డిజిటల్గా ఒక ‘క్యాప్సూల్’లో ఉంచి ఒక నిర్దిష్ట తేదీన దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. బర్త్డే, యానివర్సరీ, లేదా మైల్స్టోన్.. వంటి ముధుర జ్ఞాపకాలను భద్రపరుచుకొని తిరిగి ఆ మెమొరీని చూసుకోవడం ఆనంద క్షణంగా ఉంటుంది.Vreels Shop/Bid — మీ అవసరాలన్నీ ఒకే చోటVreels షాప్/బిడ్ త్వరలో రాబోతోంది. యూజర్లకు కావాల్సిన ప్రతి ఉత్పత్తిని ఇందులో కొనుగోలు చేయవచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారు. యూజర్లు నమ్మకంగా ఇందులో బిడ్ చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఇది అంతా ఒకే సురక్షితమైన, సౌకర్యవంతమైన వేదికలో జరుగుతుంది. నమ్మకం, నాణ్యత, విశ్వాసం ఇవే Vreels షాప్/బిడ్ పునాది సూత్రాలని నిర్వాహకులు చెబుతున్నారు.భద్రత.. యూజర్ విశ్వాసమే ప్రాధాన్యంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మన డేటా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు వాడుతారో అన్న సందేహం సహజం. కానీ Vreelsలో మీరు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూజర్ల డేటాకు అధిక భద్రత ఉంటుంది.టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, యూజర్ నియంత్రిత ప్రైవసీ సెట్టింగులు.. ఇవన్నీ యూజర్ల వ్యక్తిగత డేటాను కాపాడటానికి ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా యూజర్ పోస్టులు, ప్రొఫైల్, లొకేషన్.. ఎవరు చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా యూజర్ పరిధిలోనే ఉంటుంది.Vreels ఆవిష్కరణల వేదికVreels ఒక యాప్ మాత్రమే కాదు. అమెరికన్ వ్యాపార స్పూర్తిని, భారతీయ స్వయం ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించే ఒక వేదిక. ప్రతి అప్డేట్తో కొత్త సాంకేతిక పరిణామాలు, స్థానిక భాషల సపోర్ట్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే మార్పులు తెస్తోంది. ఇది Made for the World అనే స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే Vreels బృందం వినూత్న సాంకేతిక పేటెంట్లను దాఖలు చేసింది. ఇవి ప్రస్తుతం ఆమోద దశలో ఉండగా, త్వరలోనే మంజూరు అవుతాయని అంచనా. ఈ పేటెంట్లు ఆమోదం పొందిన తర్వాత Vreels సాంకేతిక సామర్థ్యం మరింత బలపడటమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు లభించనుంది.Vreels యాప్ డౌన్లోడ్ చేసుకోనే లింక్లు కింద ఉన్నాయి.ఆండ్రాయిడ్ యూజర్లుhttps://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsయాపిల్ యూజర్లుhttps://apps.apple.com/us/app/vreels/id6744721098 కింది క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. - 
      
                   
                                                     
                   
            మహీంద్రా ఈఎస్యూవీకి శాంసంగ్ డిజిటల్ కీ
ఎలక్ట్రిక్ ఎస్యూవీలో డిజిటల్ కీ ఫీచర్ను అందించేలా మహీంద్రా అండ్ మహీంద్రా, శాంసంగ్ జట్టు కట్టాయి. ఈ భాగస్వామ్యం కింద శాంసంగ్ వాలెట్తో మహీంద్రా ఈఎస్యూవీలను అనుసంధానం చేస్తారు. దీనితో ఫిజికల్ కీ అవసరం లేకుండా డిజిటల్గానే కారును లాక్, అన్లాక్ చేసేందుకు వీలవుతుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీ వల్ల ఒకవేళ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ మొత్తం అయిపోయినా కూడా డిజిటల్ కీ పని చేస్తుందని శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ మధుర్ చతుర్వేది తెలిపారు.ఈ ఫీచర్ అంతర్గతంగా పొందుపర్చిన మహీంద్రా ఈఎస్యూవీ అమ్మకాలు నవంబర్ నుంచి ప్రారంభమవుతాయని, దశలవారీగా ప్రస్తుతమున్న ఇతర కార్లకు కూడా దీన్ని విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. 2020 తర్వాత ప్రవేశపెట్టిన గెలాక్సీ జెడ్, ఎస్ సిరీస్ డివైజ్ల్లో శాంసంగ్ వాలెట్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎ సిరీస్ డివైజ్లలో కూడా ఈ ఫీచర్ను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. ప్రస్తుత కార్ ఓనర్లు.. మహీంద్రా సరీ్వస్ సెంటర్లలో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్లో విక్రయించే బీఎండబ్ల్యూ, బీవైడీ, మెర్సిడెస్ బెంజ్ లాంటి విదేశీ కార్లలో ఇప్పటికే డిజిటల్ కీస్ సదుపాయం ఉండగా, ఈ ఫీచరును అందించే తొలి భారతీయ ఆటోమొబైల్ కంపెనీగా మహీంద్రా నిలుస్తుంది. డిజిటల్ కార్ కీ కోసం శాంసంగ్తో జట్టు కట్టడంపై మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ డివిజన్) నళినికాంత్ గొల్లగుంట హర్షం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు - 
      
                   
                                                     
                   
            ద్రవ్యలోటు నియంత్రణలోనే..
కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు (ఏప్రిల్–సెప్టెంబర్) రూ.5,73,123 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతంగా (రూ.15.69 లక్షల కోట్లు) ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. ఈ ప్రకారం చూస్తే మొత్తం లక్ష్యంలో ద్రవ్యలోటు 36.5 శాతానికి చేరినట్టు తెలుస్తోంది.సరిగ్గా క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 29 శాతంగానే ఉండడం గమనించొచ్చు. ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య రూ.12.29 లక్షల కోట్ల ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వానికి వచి్చంది. రూ.4.66 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం కాగా, రూ.34,770 కోట్లు రుణేతర మూలధనం రూపంలో సమకూరింది. ఇందులో రూ.6.31 లక్షల కోట్లను రాష్ట్రాలకు (పన్నుల వాటా కింద) కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రూ.86,948 కోట్లు అధికంగా బదిలీ అయింది. మొత్తం వ్యయం రూ.23 లక్షల కోట్లుగా ఉంది. రెవెన్యూ వ్యయాల్లో రూ.5.78 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకు ఖర్చు కాగా, రూ.2.02 లక్షల కోట్లు సబ్సిడీలపై వెచి్చంచింది. ప్రభుత్వ మూలధన వ్యయం 40% పెరగడాన్ని (రూ.5.7 లక్షల కోట్లు) ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ స్వాగతించారు.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు - 
      
                   
                                                     
                   
            హోండా నుంచి 10 కొత్త మోడల్స్
భారత్లో అమ్మకాలు, మార్కెట్ వాటాను మరింతగా పెంచుకోవడంపై జపాన్ ఆటో దిగ్గజం హోండా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా 2030 నాటికి దేశీ మార్కెట్లో 10 కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఏడు ఎస్యూవీలు ఉండనున్నాయి. తమ వ్యాపార వృద్ధికి అమెరికా, జపాన్ తర్వాత భారత్ అత్యంత కీలకమైన మార్కెట్ అని హోండా మోటర్స్ డైరెక్టర్ తొషిహిరో మిబె తెలిపారు.ప్రస్తుతం ఏటా 43 లక్షల యూనిట్లుగా ఉన్న మార్కెట్ 2030 నాటికి 60 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందని అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ వా టాను పెంచుకునే క్రమంలో మరిన్ని ప్రీమియం అంతర్జాతీయ వాహనాలు, స్థానికంగా తయారు చేసిన మోడల్స్ను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. టూ– వీలర్ల తరహాలోనే కార్ల తయారీకి సంబంధించి కూడా భారతీయ సరఫరాదార్లతో కలిసి పని చేసే వ్యూహంపై కసరత్తు చేస్తున్నట్లు మిబె చెప్పారు.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు - 
      
                   
                                                     
                   
            ఫారెక్స్ నిల్వలు 7 బిలియన్ డాలర్లు డౌన్
ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు అక్టోబర్ 24తో ముగిసిన వారంలో 6.925 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. 695.355 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం వారంలో నిల్వలు 4.496 బిలియన్ డాలర్లు పెరిగి 702.28 బిలియన్ డాలర్లకు చేరాయి. తాజాగా అక్టోబర్ 24తో ముగిసిన వారంలో రిజర్వ్లలో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ 3.862 బిలియన్ డాలర్లు తగ్గి 566.548 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. పసిడి నిల్వల విలువ 3.01 బిలియన్ డాలర్లు క్షీణించి 105.536 బిలియన్ డాలర్లకు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 58 మిలియన్ డాలర్లు తగ్గి 18.664 బిలియన్ డాలర్లకు నెమ్మదించాయి. - 
      
                   
                                                     
                   
            పన్నుల సరళీకరణ, క్రమబద్ధీకరణ
న్యూఢిల్లీ: పన్నుల సరళీకరణ, క్రమబద్దీకరణతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే తయారీ యూనిట్లకు రాయితీ పన్ను రేటుతో కూడిన పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసోచామ్ కోరింది. బడ్జెట్కు ముందు తమ సూచనలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవకు సమరి్పంచింది. సెక్షన్ 115బీఏబీ కింద కొత్తగా ఏర్పాటు చేసే తయారీ యూనిట్లకు రాయితీతో కూడిన 15 శాతం పన్నును తిరిగి పునరుద్ధరించాలని అసోచామ్ కోరింది. దీనివల్ల తాజా పెట్టుబడులను ఆకర్షించొచ్చని, ఇది దేశ ఆర్థిక వృద్ధికి, ఎగుమతులకు సాయం చేస్తుందని అభిప్రాయపడింది. దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద రుణ మాఫీని ప్రతిపాదించింది. టీడీఎస్కు సంబంధించి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ నిర్వచనం ఇవ్వాలని, డీమెర్జర్లు (వ్యాపారాల విభజన) వేగవంతానికి వీలుగా ట్యాక్స్ నూట్రాలిటీ వర్తింపజేయాలని కోరింది. కస్టమ్స్ విధానం కింద సమగ్రమైన పన్ను మాఫీ పథకాన్ని తీసుకురావాలని కోరింది. తద్వారా వివాదాల భారం తగ్గుతుందని అభిప్రాయపడింది. జీఎస్టీలోని సెక్షన్ 74ఏకు మాదిరే కస్టమ్స్ చట్టం కింద నిరీ్ణత గడువుల క్రమబదీ్ధకరణకు చర్యలు తీసుకోవాలని కోరింది. బడ్జెట్ 2025లో ప్రవేశపెట్టిన స్వచ్ఛంద వెల్లడి నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ప్రభుత్వం దృష్టికి అసోచామ్ తీసుకెళ్లింది. - 
      
                   
                                                     
                   
            యాపిల్ ఆదాయం రికార్డ్
వాషింగ్టన్: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ4)లో 102.5 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది. వార్షిక ప్రాతిపదికన ఇది 8 శాతం అధికంకాగా.. తద్వారా కంపెనీ చరిత్రలో తొలిసారి ఒక క్వార్టర్లో 100 బిలియన్ డాలర్ల టర్నోవర్ను అధిగమించింది. ప్రధానంగా ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ అమ్మకాలు దన్నుగా నిలిచినట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ తెలియజేశారు. ప్రపంచంలోనే రెండో పెద్ద స్మార్ట్ఫోర్ మార్కెట్గా నిలుస్తున్న భారత్లోనూ రికార్డ్ అమ్మకాలు సాధించినట్లు కుక్ పేర్కొన్నారు. యూఎస్, కెనరా, లాటిన్ అమెరికా, పశి్చమ యూరప్, మధ్యప్రాచ్యం, జపాన్ తదితర పలు ప్రాంతాలలో అమ్మకాలు జోరందుకున్నట్లు వెల్లడించారు. గత కొద్ది నెలలుగా భారత్, యూఏఈ తదితర వర్ధమాన మార్కెట్లలో కొత్త స్టోర్లను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఆదాయంలో ఐఫోన్ల విక్రయాల ద్వారా 49 బిలియన్ డాలర్లు అందుకున్నట్లు కంపెనీ సీఎఫ్వో కెవన్ పరేఖ్ పేర్కొన్నారు. ఇది 6 శాతం వృద్ధి కాగా.. పూర్తి ఏడాదికి మొత్తం ఆదాయం 416 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. కంపెనీ అక్టోబర్–సెపె్టంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. - 
      
                   
                                                     
                   
            పట్టాలు కాదు.. పనిలో నైపుణ్యం కావాలి
న్యూఢిల్లీ: టెక్నాలజీ పరంగా వేగవంతమైన పరివర్తన నేపథ్యంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలు, పోటీతత్వంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు టాగ్డ్ సీఈవో దేవాశిష్ శర్మ తెలిపారు. సంప్రదాయ డిగ్రీలకు బదులు సంభాషణ నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్కు ప్రాధాన్యం పెరుగుతున్నట్టు చెప్పారు. మారుతున్న వాతావరణం నేపథ్యంలో యాజమాన్యాలు ప్రత్యక్ష నైపుణ్యాలు, అప్పగించిన పనిని వేగంగా చేయగలిగే సామర్థ్యాలను అభ్యర్థుల్లో చూస్తున్నట్టు తెలిపారు. సంభాషణ, క్రిటికల్ థింకింగ్, సమస్యల పరిష్కారం, సృజనాత్మకత, ఉద్యోగం చేయడానికి సన్నద్ధతపై ఉద్యోగార్థులు దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. డేటా ఆధారిత సామర్థ్యాల గుర్తింపు, ఇంటర్న్షిప్లు, చేపట్టిన ప్రాజెక్టుల ఆధారంగా వారి సన్నద్ధతను యాజమాన్యాలు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యా సంస్థలతో కలసి కరిక్యులమ్ రూపొందించడం, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా నైపుణ్యాల కొరత నేపథ్యంలో విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం, సమన్వయంతో గ్రాడ్యుయేట్లు పని ప్రదేశాల్లో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందన్నారు. ఐఐటీ ఢిల్లీలో ఐఎన్ఏఈ–ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు.. పరిశోధన, ఆవిష్కరణలపై ఐఐటీ హైదరాబాద్–రెనెసెస్ మధ్య భాగస్వామ్యాలను శర్మ ప్రస్తావించారు. ప్రభుత్వం సైతం ఉద్యోగ అర్హతలను మెరుగుపరచడంపై దృష్టి సారించిందని.. నేషనల్ అప్రెంటిస్íÙప్ ప్రమోషన్ స్కీమ్ను ప్రవేశపెట్టిందని చెప్పారు. దీని కింద 2023–24లో 9.3 లక్షల అభ్యర్థులను చేరుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 46 లక్షల మంది అప్రెంటిస్íÙప్ల లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. - 
      
                   
                                                     
                   
            టెక్స్టైల్స్, రత్నాభరణాల ఎగుమతుల్లో వైవిధ్యం
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్, రత్నాభరణాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అమెరికా కాకుండా ఇతర మార్కెట్లకు మెరుగుపడినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది. యూఏఈ, వియత్నాం, బెల్జియం, సౌదీ అరేబియాకు ఈ రంగాల నుంచి ఎగుమతులు పెరిగాయి. ఆసియా, యూరప్, పశి్చమాసియా దేశాల్లో డిమాండ్ భారత ఎగుమతులకు కలిసొస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ మధ్య సముద్ర ఉత్పత్తుల (రొయ్యలు, చేపలు తదితర) ఎగుమతులు 15.6 శాతం పెరిగి 4.83 బిలియన్ డాలర్లకు చేరాయి. 1.44 బిలియన్ డాలర్లతో అమెరికా భారత సముద్ర ఉత్పత్తులకు ఈ కాలంలో అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఈ కాలంలో వియత్నాంకు 100 శాతం, బెల్జియంకు 73 శాతం, థాయిలాండ్కు 54 శాతం చొప్పున క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎగుమతులు పెరిగాయి. చైనాకు 10 శాతం, మలేసియాకు 64 శాతం, జపాన్కు 11 శాతం వరకు ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. ఇలా ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం వల్ల అమెరికా తదిర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆగస్ట్ నుంచి భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లు అమలు చేస్తుండడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాలకు ఎగుమతులు విస్తృతం కావడం వల్ల టారిఫ్ల ప్రభావాన్ని అధిగమించే వెసులుబాటు లభిస్తుంది. టెక్స్టైల్స్ ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ కాలంలో టెక్స్టైల్స్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 1.23 శాతం పెరిగి 28 బిలియన్ డాలర్లకు చేరాయి. యూఏఈకి ఎగుమతులు అత్యధికంగా 8.6 శాతం పెరిగి 136.5 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. నెదర్లాండ్స్కు 12 శాతం, పోలండ్కు 24 శాతం, స్పెయిన్కు 9 శాతం, ఈజిప్్టకు 25 శాతం చొప్పున టెక్స్టైల్స్ ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. ఇక రత్నాభరణాల ఎగుమతులు సైతం 1.24 శాతం పెరిగి 22.73 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఈకి 38 శాతం అధికంగా 1.93 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. దక్షిణ కొరియాకు 134 శాతం, సౌదీ అరేబియాకు 68 శాతం, కెనడాకు 41 శాతం చొప్పున రత్నాభరణాల ఎగుమతులు పెరిగినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది. - 
      
                   
                                                     
                   
            రూ.28 లక్షల స్ట్రీట్ఫైటర్ వీ4: దీని గురించి తెలుసా?
మల్టీస్ట్రాడా V2 & పానిగేల్ V2లను లాంచ్ చేసిన తర్వాత, డుకాటి 2026 స్ట్రీట్ఫైటర్ వీ4 బైకును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 28.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది అప్డేట్ డిజైన్, పెద్ద వింగ్లెట్ పొందుతుంది. కాబట్టి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.2026 స్ట్రీట్ఫైటర్ వీ4 బైక్ 1,103cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 13500 rpm వద్ద 214 హార్స్ పవర్, 11250 rpm వద్ద 120 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా బ్రెంబో మాస్టర్ సిలిండర్తో జత చేసిన బ్రెంబో టాప్-స్పెక్ హైప్యూర్ కాలిపర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: భారత్కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!ఈ బైక్ పూర్తిగా కొత్త ఎల్ఈడీ హెడ్లైట్ పొందుతుంది. 15.8-లీటర్ ఇంధన ట్యాంక్.. సీటును కలిసే చోటు వరకు విస్తరించి ఉంటుంది. బాడీ-రంగు వింగ్లెట్లు ఉన్నాయి. 6.9 ఇంచెస్ TFT డాష్.. బైకుకు సంబంధించిన చాలా వివరాలను తెలియజేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్ వంటి ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. - 
      
                   
                                                     
                   
            ఒకేరోజు రెండుసార్లు.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు
బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది.. శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం గరిష్టంగా రూ. 1200 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1800లకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి 600 రూపాయలు పెరిగిందన్న మాట. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ నగరం గోల్డ్ రేటు ఎలా ఉంది? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1800 పెరిగి రూ. 1,23,280 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,000 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 పెరిగి రూ. 123430 వద్ద ఉంది. 10 గ్రామ్స్ 22 క్యారెట్ల రేటు రూ. 1600 పెరిగి రూ. 1,13,150 వద్ద ఉంది.చెన్నైలో మాత్రం బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఉదయం స్థిరంగా ఉన్న రేటు సాయంత్రానికి కూడా స్థిరంగానే ఉంది. ఇక్కడ 10 గ్రామ్స్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,280 వద్ద ఉండగా.. 10 గ్రామ్స్ 24 క్యారెట్ల రేటు రూ. 1,13,000 వద్దనే ఉంది.వెండి ధరలువెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రేటు రూ. 1,65,000 వద్ద ఉంది. అంటే ఒక గ్రామ్ సిల్వర్ ధర 165 రూపాయలన్నమాట. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 151000 వద్ద నిలిచింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి ధర కొంత తక్కువే అని తెలుస్తోంది. - 
      
                   
                                                     
                   
            భారత్కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!
అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ (Ford).. తమిళనాడులోని చెన్నై ప్లాంట్లో తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్ను ఏర్పాటు చేయనుంది. ఇది నాలుగు సంవత్సరాల విరామం తర్వాత.. భారతదేశంలో ఉత్పత్తికి పునరాగమనాన్ని సూచిస్తుంది. ఒప్పందం ప్రకారం.. ఫోర్డ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.ఫోర్డ్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత 600 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంస్థకు చెందిన కొత్త సౌకర్యంలో సంవత్సరానికి 2,35,000 ఇంజిన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ఉత్పత్తి 2029లో ప్రారంభం కానుంది. కాగా ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంజిన్లను కంపెనీ.. ఎగుమతి చేయనుంది. కాబట్టి ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉంటాయి.ఇదీ చదవండి: ఏడేళ్లుగా వెయిటింగ్.. నా డబ్బు రీఫండ్ చేయండి: శామ్ ఆల్ట్మాన్2021లో ఫోర్డ్.. భారతదేశంలో వాహనాల తయారీని నిలిపివేసింది. దీనికి కారణం కంపెనీ ఊహకందని నష్టాలను చవిచూడటమే. ఒకప్పుడు ఎకోస్పోర్ట్, ఎండీవర్, ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసిన మరైమలై నగర్ ప్లాంట్.. అప్పటి నుంచి (2021 నుంచి) ఖాళీగానే ఉంది.Hard work and dedicated follow up of #TeamCMMKStalin pays off !#Ford is officially back to Chennai! 🎊Today, Ford and the Government of Tamil Nadu signed an MoU in the presence of Honourable @CMOTamilNadu Thiru. @MKStalin avargal and our Honourable DyCM Thiru @Udhaystalin… pic.twitter.com/NDwFyz4Utf— Dr. T R B Rajaa (@TRBRajaa) October 31, 2025 - 
      
                   
                                                     
                   
            లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 465.75 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో.. 83,938.71 వద్ద, నిఫ్టీ 155.75 పాయింట్లు లేదా 0.60 శాతం నష్టంతో 25,722.10 వద్ద నిలిచాయి.ఫైనోటెక్స్ కెమికల్, లాంకోర్ హోల్డింగ్స్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, ముఫిన్ గ్రీన్ ఫైనాన్స్, ది గ్రోబ్ టీ కంపెనీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, నెల్కాస్ట్, మాన్ అల్యూమినియం లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) - 
      
                   
                                                     
                   
            ఏడేళ్లుగా వెయిటింగ్.. నా డబ్బు రీఫండ్ చేయండి
గ్లోబల్ మార్కెట్లో టెస్లా కార్లకు మంచి డిమాండ్ ఉంది. సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఈ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ (Sam Altman) 2018 జూలైలో 50000 డాలర్లతో టెస్లా రోడ్స్టర్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకుని ఇన్నాళ్లయినా.. ఇప్పటికీ కారు డెలివరీ జరగలేదు, డబ్బు కూడా రీఫండ్ కాలేదు. ఈ విషయాన్ని ఆల్ట్మాన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసారు.శామ్ ఆల్ట్మాన్.. టెస్లా రోడ్స్టర్ బుకింగ్స్, రీఫండ్ కోసం అభ్యర్థించిన మెయిల్ స్క్రీన్షాట్లను కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో 2018 జులై 11న కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను చెల్లించిన డబ్బును రీఫండ్ చేయమని కూడా మెయిల్ చేశారు. కానీ అతనికి అడ్రస్ నాట్ ఫౌండ్ అనే రిప్లై వచ్చింది.''టెస్లా రోడ్స్టర్ కారును కొనుగోలు చేయడానికి.. నేను ఉత్సాహంగా ఉన్నాను. కంపెనీ కారును డెలివరీ చేయడంలో జరిగిన ఆలస్యాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ 7.5 సంవత్సరాలు వేచి ఉండటం చాలా కాలంగా అనిపించింది'' అని కూడా శామ్ ఆల్ట్మాన్ మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు.రద్దు చేసుకోవడం కష్టంటెస్లా రోడ్స్టర్ కారును బుక్ చేసుకున్న తరువాత.. బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్న వారిలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ మాత్రమే కాకుండా, ప్రముఖ యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీ కూడా ఉన్నారు. ఈయన 2017లో రెండు టెస్లా రోడ్స్టర్లను రిజర్వ్ చేసుకున్నట్లు వెల్లడించారు. బుకింగ్ ప్రక్రియ సులభంగా జారిపోయింది. కానీ రిజర్వేషన్ను రద్దు చేసుకోవడం ఊహించిన దానికంటే చాలా కష్టమని బ్రౌన్లీ అన్నారు.టెస్లా రోడ్స్టర్టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. 2017లో రోడ్స్టర్ను పర్ఫామెన్స్ బేస్డ్ ఈవీగా ఆవిష్కరించారు. ఇది 1.9 సెకన్లలో 0 నుంచి 96 కి.మీ వేగాన్ని అందుకోగలదని.. గంటలు 402 కి.మీ గరిష్ట వేగంతో 997 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ స్పోర్ట్స్ కారు ఉత్పత్తిలోకి రాలేదు. 2024లో కూడా రోడ్స్టర్ బయటకు రాలేదని మస్క్ పేర్కొన్నారు. కాగా దీనిని ఎప్పుడు అధికారికంగా లాంచ్ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.A tale in three acts: pic.twitter.com/ClRZBgT24g— Sam Altman (@sama) October 30, 2025 - 
      
                   
                                                     
                   
            నష్టాల కంపెనీలు.. ఐపీవోకి ముందే లాభాలు!
దేశ స్టార్టప్ వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన నమూనా ఉద్భవిస్తోంది. ఏళ్లుగా నష్టాల్లో కొట్టుమిట్టాడిన డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) బ్రాండ్లు ఐపీవోలను ప్రారంభించే సమయంలో అకస్మాత్తుగా లాభదాయకంగా మారుతున్నాయి. నాలుగు హై-ప్రొఫైల్ కంపెనీలు మామాఎర్త్, లెన్స్కార్ట్, బోట్, షుగర్ కాస్మెటిక్స్ అన్నీ పబ్లిక్ లిస్టింగ్కి దాఖలు చేసిన ఒక సంవత్సరంలోనే లాభాలను నివేదించాయి. మామాఎర్త్ మాతృ సంస్థ హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో నష్టాలను నివేదించింది. కానీ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.98.84 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ నవంబర్ 2023 లో షేరుకు రూ.325 వద్ద పబ్లిక్కి వెళ్లింది. నేడు ఇది రూ.271 వద్ద ట్రేడ్ అవుతోంది.మూడేళ్లుగా నష్టాల్లో ఉన్న కళ్లజోడు కంపెనీ లెన్స్కార్ట్ 2025లో ఉన్నట్టుండి లాభాల్లోకి వచ్చింది. దాని రూ.7,278 కోట్ల ఐపీవోకి ముందు 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.61 కోట్ల లాభాన్ని నివేదించింది. ఇక నష్టాల ఒడిదుడుకులు ఎదుర్కొన్న బోట్ కూడా 2025లో లాభాల్లోకి వచ్చింది. ఇప్పుడే ఐపీవోకి వచ్చేందుకు ప్రణాళిక వేస్తోంది. అలాగే 2023 చివరి వరకు నష్టాల్లో ఉన్న షుగర్ కాస్మెటిక్స్ ఇప్పుడు లాభదాయకంగా ఉంది. 2026లో ఐపీవోను ప్లాన్ చేస్తోంది.కాగా ఈ నాలుగు కంపెనీలు మరొక లక్షణాన్ని పంచుకుంటున్నాయి. వాటి వ్యవస్థాపకులు షార్క్ ట్యాంక్ ఇండియాషోలో జడ్జ్లుగా వ్యవహరించడం గమనార్హం. ఇది వ్యాపార నీతి, స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించే టీవీ షో. - 
      
                   
                                                     
                   
            ఎగుమతుల్లో రికార్డ్: భారత్ నుంచి 12 లక్షలు!
జపనీస్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan).. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్. ఈ కంపెనీ తన ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలకు మన దేశం నుంచే ఎగుమతి చేస్తోంది. ఇప్పటి వరకు నిస్సాన్ 12 లక్షల వాహనాలను ఎగుమతి చేసినట్లు ప్రకటించింది.భారతదేశంలో నిస్సాన్ కంపెనీ మాగ్నైట్ కారును మాత్రమే విక్రయిస్తోంది. కాగా ఎక్స్-ట్రైల్ మోడల్ దిగుమతి చేసుకుంటోంది. అయితే మాగ్నైట్ కారును మనదేశం నుంచి.. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియా, యూరప్ వంటి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. కాగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రాంతానికి నిర్దేశించిన 1.2 మిలియన్ల మాగ్నైట్ వాహనాన్ని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స తమిళనాడులోని ఎన్నూర్లోని కామరాజర్ పోర్టులో ఆవిష్కరించారు.నిస్సాన్ కంపెనీ మాగ్నైట్తో పాటు.. గతంలో సన్నీ, కిక్స్ & మైక్రా వంటి వివిధ మోడళ్లను ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా & ఆగ్నేయాసియా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేసింది. ఇప్పుడు కేవలం మాగ్నైట్ కారును మాత్రమే ఎగుమతి చేస్తోంది. ఎగుమతి చేయడానికే సంస్థ వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తోంది. కాబట్టి ఇందులో స్టీరింగ్ వీల్ ఎడమవైపు ఉంటుంది. ప్రస్తుతం మాగ్నైట్ 65 దేశాలకు ఎగుమతి అవుతోంది.ఇదీ చదవండి: 25 ఏళ్లు.. 3.5 కోట్లు: అమ్మకాల్లో యాక్టివానిస్సాన్ మాగ్నైట్ ఫేస్లిఫ్ట్గత సంవత్సరం డిసెంబర్లో, నిస్సాన్ మాగ్నైట్ను కంపెనీ ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ చేసింది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందింది. కానీ యాంత్రికంగా ఎలాంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి అదే 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ & 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి.#NissanMotorIndia celebrates 1.2 million exports from India, with the Big. Bold. Beautiful. #NissanMagnite leading the way!A proud moment for our teams as we continue to bring Japanese innovation from India to 65+ countries.#OneCarOneWorld pic.twitter.com/yMqk9K4gHq— Nissan India (@Nissan_India) October 30, 2025 - 
      
                   
                                                     
                   
            స్టడ్స్ రూ.455 కోట్ల ఐపీవో
న్యూఢిల్లీ: హెల్మెట్ల తయారీ కంపెనీ స్టడ్స్ యాక్సెసరీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 557–585 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 30న ప్రారంభమైన ఇష్యూ నవంబర్ 3న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 455 కోట్ల విలువైన 77.86 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేస్తున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకి అందబోవు. యాంకర్ ఇన్వెస్టర్లకు 29న షేర్లను ఆఫర్ చేయనుంది.1975లో ఏర్పాటైన కంపెనీ ద్విచక్ర వాహన హెల్మెట్ల డిజైన్, తయారీ, మార్కెటింగ్ తదితరాలను చేపడుతోంది. స్టడ్స్, ఎస్ఎంకే బ్రాండ్లతో వీటిని విక్రయిస్తోంది. అంతేకాకుండా మోటార్సైకిల్ సంబంధ లగేజీ, గ్లోవ్స్, రెయిన్ సూట్స్, రైడింగ్ జాకెట్స్, ఐవేర్ తదితర యాక్సెసరీస్ను రూపొందిస్తోంది. స్టడ్స్తో మాస్ మార్కెట్పై దృష్టి పెట్టగా.. ప్రీమియం విభాగంలో ఎస్ఎంకేను 2016లో ప్రవేశపెట్టింది. కంపెనీ ఇంతక్రితం 2018 చివర్లో ఐపీవోకు దరఖాస్తు చేసి సెబీ నుంచి అనుమతి పొందింది. అయితే ఇష్యూకి రాకపోవడం గమనార్హం! - 
      
                   
                                                     
                   
            ఒక్క నిర్ణయం.. జుకర్బర్గ్ సంపదలో భారీ పతనం
మెటా (Meta) సంస్థ ప్రకటించిన 30 బిలియన్ డాలర్ల రుణ విక్రయం ప్రణాళిక ఇన్వెస్టర్లలో ఆందోళన రేపింది. దీని ఫలితంగా కంపెనీ షేర్లు 11 శాతం వరకు పడిపోయాయి. ఈ పతనం కారణంగా కంపెనీ చీఫ్ మార్క్ జుకర్బర్గ్ వ్యక్తిగత సంపద 235.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ఆయన ఐదవ స్థానానికి పడిపోయారు. రెండేళ్లలో ఇదే ఆయనకు కనిష్ఠ స్థానం.మెటా ఈ నిధులను ప్రధానంగా కృత్రిమ మేధస్సు (AI) పరిశోధన, మౌలిక సదుపాయాలపై వ్యయం చేయడానికి ఉపయోగించనున్నట్లు తెలిపింది. అయితే, పెరుగుతున్న ఏఐ ఖర్చులు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. కంపెనీ ఈ ఏడాది మూలధన వ్యయాలు 118 బిలియన్ డాలర్ల వరకు పెరగవచ్చని, 2026 నాటికి మరింత ఖర్చు చేయవచ్చని తెలిపిన తరువాత కనీసం ఇద్దరు విశ్లేషకులు మెటా షేర్ల రేటింగ్ను తగ్గించారు.మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) సంపదలో జరిగిన 29.2 బిలియన్ డాలర్ల నష్టాన్ని బ్లూమ్బర్గ్ ఇప్పటివరకు నమోదైన నాల్గవ అతిపెద్ద ఒక్కరోజు మార్కెట్ ఆధారిత పతనంగా పేర్కొంది.ఇదే సమయంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆల్ఫాబెట్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్లు.. జుకర్బర్గ్ను సంపద పరంగా అధిగమించారు. ఏఐ, క్లౌడ్ సేవలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆల్ఫాబెట్ షేర్లు 2.5% పెరిగాయి. విశ్లేషకుల అంచనాలను మించి ఆదాయం నమోదైంది. - 
      
                   
                                                     
                   
            రూ. 6,632 కోట్ల ఐపీవో.. ఒక్కో షేరు ధర రూ. 95–100
స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘గ్రో’ (Groww IPO) మాతృ సంస్థ బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్, పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 6,632 కోట్లు సమీకరించనుంది. నవంబర్ 4న ఇష్యూ ప్రారంభమై 7న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నవంబర్ 3 బిడ్డింగ్ తేదీగా ఉంటుంది. ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 95–100గా ఉంటుంది. రూ. 61,700 కోట్ల (సుమారు 7 బిలియన్ డాలర్లు) వేల్యుయేషన్ను కంపెనీ అంచనా వేస్తోంది.ఐపీవోలో భాగంగా రూ. 1,060 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుుండగా, ప్రమోటర్లు..ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు 55.72 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. ప్రమోటర్లలో లలిత్ కేష్రి, హర్ష్ జైన్ మొదలైన వారు ఉన్నారు. వ్యవస్థాపకులకు కంపెనీలో 27.97 శాతం వాటా ఉంది.ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను టెక్నాలజీ, వ్యాపార విస్తరణకు కంపెనీ వినియోగించుకోనుంది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, మరింతమంది కస్టమర్లను ఆకర్షించేలా టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయడం, మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి కొనసాగిస్తామని గ్రో సహ–వ్యవస్థాపకుడు హర్ష్ జైన్ తెలిపారు.2016లో ఏర్పాటైన గ్రో.. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. 2025 జూన్ నాటికి 1.26 కోట్ల మంది యాక్టివ్ క్లయింట్లు, 26 శాతం పైగా మార్కెట్ వాటా ఉంది. ఇటీవలే వెల్త్ మేనేజ్మెంట్, కమోడిటీస్ మొదలైన విభాగాల్లోకి విస్తరించింది. ఈ ఏడాది మే నెలలో మార్కెట్ల నియంత్రణ సెబీకి కాన్ఫిడెన్షియల్ విధానంలో ప్రాస్పెక్టస్ను సమర్పించింది. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో గ్రో లాభం మూడు రెట్లు పెరిగి రూ. 1,824 కోట్లకు చేరింది. - 
      
                   
                                                     
                   
            హైదరాబాద్లో ఎదుగుతున్న ఈ కంపెనీలు బెస్ట్: లింక్డ్ఇన్ లిస్ట్
హైదరాబాద్: అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ హైదరాబాద్లో 2025 గానూ టాప్ స్టార్టప్ల జాబితాను విడుదల చేసింది. కెరీర్లు వృద్ధి చెందగల, అభివృద్ధి చెందుతున్న కంపెనీల వార్షిక ర్యాంకింగ్ ఇది. ఉద్యోగుల ఎదుగుదల, అనుసంధానిత ఆసక్తి, ఉద్యోగ ఆసక్తి , అగ్రశ్రేణి ప్రతిభావంతుల ఆకర్షణపై ప్రత్యేకమైన లింక్డ్ఇన్ డేటా ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.ఏరోస్పేస్ మార్గదర్శి స్కైరూట్ ఏరోస్పేస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా ఆ తరువాత రీసైక్లింగ్ ప్లాట్ఫామ్ రీసైకల్, సాస్ సంస్థ స్వైప్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టాప్ 10 జాబితాలో ఈసారి ఏడు సంస్థలు కొత్తగా ప్రవేశించాయి. వైవిధ్యమైన ఆవిష్కరణ కేంద్రంగా హైదరాబాద్ ఎంత వేగంగా ఎదుగుతోందో ఈ జాబితాను బట్టి తెలుస్తోంది.హైదరాబాద్లో 2025 టాప్ స్టార్టప్లు ఇవే..ర్యాంక్స్టార్టప్ పేరు1స్కైరూట్ ఏరోస్పేస్2రీసైకిల్3స్వైప్4జెహ్ ఏరోస్పేస్5విజెన్ లైఫ్ సైన్సెస్6క్రెడ్జెనిక్స్7ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్8భాంజు9లిక్విడ్నిట్రో గేమ్స్10కోస్కూల్లింక్డ్ఇన్ లిస్ట్లోని టాప్ స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగం ఎలా పొందాలో లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్ , లింక్డ్ఇన్ ఇండియా న్యూస్ సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరాజిత బెనర్జీ అందిస్తోన్న కొన్ని చిట్కాలు..ఏ కంపెనీలు ఉద్యోగాలిస్తున్నాయని మాత్రమే కాకుండా.. స్టార్టప్ల విస్తరణను కూడా ట్రాక్ చేయాలి. ఎందుకంటే రెండేళ్లలోనే 14 కొత్త సంస్థలు జాతీయ స్థాయికి ఎదిగాయి. దీన్ని ఉద్యోగ బోర్డులలో చూడలేరు. ముందుగానే ఊపును గుర్తించడానికి నిధులు, ఉత్పత్తి ఆవిష్కరణలు, మార్కెట్ విస్తరణను గమనించాలి.భవిష్యత్ ఎంట్రాప్రెన్యూర్షిష్కు అవకాశాలను అంచనా వేయాలి. అధిక-వృద్ధి చెందుతున్న స్టార్టప్లలో నాయకత్వం మీ వృద్ధిని టైటిల్ కంటే ఎక్కువగా నిర్దేశిస్తుంది. ఎంట్రాప్రెన్యూర్లు టీమ్స్ను ఎలా నిర్మిస్తారు.. కమ్యూనికేట్ చేస్తారు.. ప్రతిభను నిలుపుకుంటారు అని చూడటానికి లింక్డ్ఇన్ని ఉపయోగించండి. హైప్ కంటే నమ్మకం, స్పష్టత ముఖ్యమైనవి.కేవలం ఆవిష్కరణలతో కాకుండా క్రమశిక్షణతో కూడిన వ్యాపార నమూనాల కోసం చూడాలి. ఈ సంవత్సరం అగ్రశ్రేణి స్టార్టప్లు ఆవిష్కరణలను అమలుతో జత చేయడం ద్వారా విజయాన్ని అందుకుంటున్నాయి. క్విక్ కామర్స్ కొత్త వర్గాలలోకి ప్రవేశిస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నాయి. ఫిన్టెక్ రంగం మరింత అభివృద్ధి చెందుతోంది.సమస్యా పరిష్కారాలకు ప్రాధాన్యత ఉన్న రంగాలు, సంస్థల దృష్టి సారించాలి. ఈ సంవత్సరం అగ్రశ్రేణి స్టార్టప్లు ప్రాబ్లమ్ సొల్యూషన్స్పైనే దృష్టి సారించి ముందుకెళ్తున్నాయి. ఆ కంపెనీలు నిమగ్నమై ఉన్న సమస్యను మీరు అర్థం చేసుకుంటే, ఎల్లప్పుడూ రిలేటెడ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. - 
      
                   
                                                     
                   
            పసిడి ధరలు రివర్స్.. 22 క్యారెట్ల బంగారం ఏకంగా..
పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుదలతో ఊగిసలాడుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Rate) ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. మరోవైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) - 
      
                   
                                                     
                   
            లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ కంపెనీల క్యూ2 ఫలితాలపై మదుపరుల అంచనాల మధ్య భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు అస్థిరంగా ఉన్నాయి. ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు వెంటనే పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 146 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 84,550 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా, నిఫ్టీ 50 సూచీ 33 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 25,911 వద్ద కదులుతోంది.మారుతి సుజుకి, టీసీఎస్, బీఈఎల్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ పీవీ, ఎల్ అండ్ టీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం మార్కెట్ రికవరీలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు కూడా లాభాల వైపు పయనిస్తున్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.61 శాతం, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.06 శాతం క్షీణించాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.8 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.5 శాతం, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) - 
      
                   
                                                     
                   
            ఏస్ ఇన్వెస్టర్ డాలీ ఖన్నా పోర్ట్ఫోలియో చూశారా?
స్టాక్ మార్కెట్లో టాప్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కదలికలను మదుపరులు, మార్కెట్ ఔత్సాహికులు నిశితంగా గమనిస్తుంటారు. వారి ఇన్వెస్ట్ శైలి, పోర్ట్ఫోలియో గురించి ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏస్ ఇన్వెస్టర్ డాలీ ఖన్నా ఆసక్తికరమైన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో గురించి తెలుసుకుందామా..డాలీ ఖన్నా షేర్ హోల్డింగ్ డేటా ఆధారంగా 2025 సెప్టెంబర్ త్రైమాసికం నుండి 2025 అక్టోబర్ 30 నాటికి సుమారు రూ. 484 కోట్ల విలువైన 11 స్టాక్స్ను ఆమె బహిరంగంగా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు పరంగా, ఈ స్టాక్స్ లో సగం ఘనమైన రాబడిని అందించాయి. 2025లో 101% వరకు ర్యాలీ చేశాయి. అదే సమయంలో మిగిలినవి తక్కువ పనితీరు కనబరిచాయి. 10% నుంచి 40% క్షీణించాయి.టాప్ గెయినర్లు ఇవే..మంగళూరు కెమికల్స్ & ఫెర్టిలైజర్స్: ఈ షేరు 101 శాతం పెరిగి రూ.154 నుంచి రూ.309కి పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 3.99%. దీని విలువ సుమారు రూ .146 కోట్లు.కాఫీ డే ఎంటర్ప్రైజెస్: ఈ స్టాక్ 86% పెరిగి రూ .23 నుండి రూ .42 కు పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.19% వాటా ఉంది. దీని విలువ సుమారు రూ .20 కోట్లు.సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్: ఈ షేరు 26 శాతం లాభపడి రూ.73 నుంచి రూ.92కు చేరుకుంది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.98%. దీని విలువ సుమారు రూ .51 కోట్లు.సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్: ఈ స్టాక్ 18% పెరిగి రూ .110 నుండి రూ .129 కు పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.43%. విలువ దాదాపు రూ .65 కోట్లు.ప్రకాష్ ఇండస్ట్రీస్: ఈ స్టాక్ 7% పెరిగి రూ .154 నుండి రూ .165 కు పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.94%. దీని విలువ సుమారు రూ .87 కోట్లు.రాణించని స్టాక్స్ ఇవే..ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్: స్టాక్ రూ .315 వద్దే ఉంది. ఎలాంటి మార్పు లేదు. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.73%. దీని విలువ సుమారు రూ .22 కోట్లు.సావేరా ఇండస్ట్రీస్: ఈ స్టాక్ 3% క్షీణించి రూ .167 నుండి రూ .161 కు పడిపోయింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.14%. దీని విలువ దాదాపు రూ .2 కోట్లుజీహెచ్సీఎల్: ఈ షేరు 11 శాతం పడిపోయి రూ.724 నుంచి రూ.648కి పడిపోయింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.21%. దీని విలువ సుమారు రూ .75 కోట్లు.నేషనల్ ఆక్సిజన్: ఈ స్టాక్ 19% పడిపోయింది. రూ .134 నుండి రూ .109 కి తగ్గింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.22%. దీని విలువ సుమారు రూ .67 లక్షలు.కె.సి.పి. షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్: ఈ స్టాక్ 30 శాతం క్షీణించి రూ.45 నుంచి రూ.31కి చేరుకుంది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.8%. దీని విలువ సుమారు రూ .6 కోట్లు.ప్రకాష్ పైప్స్: ఈ స్టాక్ 41 శాతం పడిపోయి రూ.509 నుంచి రూ.298కి తగ్గింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.69%. దీని విలువ సుమారు రూ .12 కోట్లు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) - 
      
                   
                                                     
                   
            ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా
ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 4,774 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4,015 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 34,721 కోట్ల నుంచి రూ. 38,598 కోట్లకు బలపడింది.నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ. 9,315 కోట్ల నుంచి రూ. 9,141 కోట్లకు స్వల్పంగా నీరసించింది. నికర వడ్డీ మార్జిన్లు 2.88 శాతం నుంచి 2.52 శాతానికి బలహీనపడ్డాయి. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.73 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.98 శాతం నుంచి 0.54 శాతానికి దిగివచ్చాయి.మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,587 కోట్ల నుంచి రూ. 1,504 కోట్లకు భారీగా తగ్గాయి. ప్రస్తుత స్థాయిలో వృద్ధిని కొనసాగించేందుకు అవసరమైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో కె.సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. దీంతో అదనపు పెట్టుబడుల ఆవశ్యకత లేనట్లు తెలియజేశారు.యూనియన్ బ్యాంక్ లాభం డౌన్ప్రభుత్వ రంగ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 4,249 కోట్లకు పరిమితమైంది. కీలక వడ్డీ ఆదాయంతోపాటు, రిటెనాఫ్ ఖాతాల నుంచి రికవరీలు తగ్గడం ప్రభావం చూపింది.నికర వడ్డీ ఆదాయం 3 శాతం నీరసించి రూ. 8,812 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 2.9 శాతం నుంచి 2.67 శాతానికి బలహీనపడ్డాయి. పెట్టుబడుల విక్రయ లాభం 70 శాతం పడిపోయి రూ. 192 కోట్లకు పరిమితంకాగా.. రిటెన్ఆఫ్ ఖాతాల నుంచి రికవరీ 36 శాతం క్షీణించి రూ. 913 కోట్లను తాకింది. దీంతో ఇతర ఆదాయం 6 శాతం తక్కువగా రూ. 4,996 కోట్లకు చేరింది.స్థూల స్లిప్పేజీలు వార్షికంగా రూ. 5,219 కోట్ల నుంచి రూ. 2,151 కోట్లకు భారీగా తగ్గాయి. దీంతో మొత్తం ప్రొవిజన్లు రూ. 3,393 కోట్ల నుంచి రూ. 2,565 కోట్లకు క్షీణించాయి. కనీస మూలధన నిష్పత్తి 17.07 శాతంగా నమోదైంది. ఆదాయంలో వృద్ధిని పెంచుకోవడంతోపాటు.. లాభాలను పరిరక్షించుకోవడంలో సమన్వయం పాటించనున్నట్లు బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా ఎంపికైన ఆశీష్ పాండే పేర్కొన్నారు. - 
      
                   
                                                     
                   
            దేశంలో డేటా సెంటర్ల దూకుడు.. త్వరలోనే డబుల్..
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటే దేశీయంగా డేటా సెంటర్ల (డీసీ) సామర్థ్యం 2027 నాటికి రెట్టింపు కానుంది. ప్రాజెక్టులను వేగవంతం చేస్తే 2030 నాటికి అయిదు రెట్లకు పెరగనుంది. డేటా లోకలైజేషన్ చట్టాలు, సానుకూల నియంత్రణ విధానాలు, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.మెక్వారీ ఈక్విటీ రీసెర్చ్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం ప్రస్తుతం భారత్లో 1.4 గిగావాట్ల డీసీ సామర్థ్యం ఉండగా, 1.4 గిగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 5 గిగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ వచ్చే అయిదేళ్లలో భారత్లో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది.దీనికి తోడు టీసీఎస్ సైతం 6.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మెటా–గూగుల్ భాగస్వాములుగా జామ్నగర్లో సమగ్ర ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు జియో ఇటీవల ప్రకటించింది. అలాగే ఏడబ్ల్యూఎస్ భారత్లో క్లౌడ్ కెపాసిటీని 2030 నాటికి 13 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు పెట్టనుంది. - 
      
                   
                                                     
                   
            యూపీఐ లావాదేవీల్లో గుత్తాధిపత్యం!
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీల్లో 80 శాతాన్ని కేవ లం 2 సంస్థలు (ఫోన్పే, జీపే) నియంత్రిస్తున్నాయంటూ.. ఈ ఏకాగ్రత రిస్క్ను తగ్గించేందుకు చ ర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ, ఆర్బీఐని ఇండి యా ఫిన్టెక్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) కోరింది. ఫిన్ టెక్ పరిశ్రమకు స్వీయ నియంత్రణ మండలిగా వ్య వహరిస్తున్న ఐఎఫ్ఎఫ్.. ఇందుకు సంబంధించి వి ధాపరమైన సూచనలు చేసింది. ఐఎఫ్ఎఫ్లో భాగమైన ఫిన్టెక్ సంస్థలతో విస్తృతమైన సంప్రదింపుల అనంతరం వీటిని రూపొందించినట్టు తెలిపింది. → యూపీఐపై 30 థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (టీపీఏపీలు) ఉండగా.. 80 శాతానికిపైగా లావాదేవీలు రెండు సంస్థల నియంత్రణల్లోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలు దోపిడీ ధరలతో (భారీ తగ్గింపులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు)తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటాయి. ముఖ్యంగా చిన్న సంస్థలు, దేశీ పోటీదారులను పోటీపడకుండా చేస్తాయి. → ప్రభుత్వానికి చెందిన భీమ్ ప్లాట్ఫామ్ సైతం ఈ ద్వందాధిపత్యం దెబ్బకు మార్కెట్ వాటాను కోల్పోయింది. → యూపీఐ లావాదేవీలను నగదుగా మార్చుకునే అవకాశం (ఎండీఆర్ చార్జీలు) లేకపోవడం, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు ఉన్న నిధుల వెసులుబాటు.. కొత్త సంస్థలు, చిన్న సంస్థల ప్రవేశానికి గట్టి అవరోధంగా నిలుస్తాయి. పోటీని అణచివేస్తాయి. → ఒక సంస్థ గరిష్టంగా 30 శాతం లావాదేవీలకే సేవలు అందించాలన్న పరిమితిని అమలు చేయడంలో ఎన్పీసీఐ జాప్యం చేస్తుండడం నిర్వహణపరమైన సవాళ్లను, ఏకాగ్రత రిస్్కను తెలియజేస్తుంది. ఎన్పీసీఐ ఈ పరిమితి అమలు చేయడానికి ముందుగానే ఈ సంస్థలు మరింత పెద్దవిగా అవతరించేందుకు అనుమతించడం.. వ్యూహాత్మకమే అనిపిస్తోంది. → ఈ ఏకాగ్రత రిస్్కను తగ్గించేందుకు బడా రెండు యూపీఐ సంస్థలు (టీపీఏపీలు) కాకుండా మిగిలిన వాటికి యూపీఐ ప్రోత్సాహకాల్లో అధిక వాటా అందుకునేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సదరు రెండు అతిపెద్ద టీపీఏపీలు ప్రోత్సాహకాల్లో అధిక భాగాన్ని పొందుతాయి. ఒక టీపీఏపీకి ప్రోత్సాహకాల్లో 10 శాతం గరిష్ట పరిమితి విధించాలి. - 
      
                   
                                                     
                   
            పసిడి డిమాండ్కు ధరాఘాతం
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ, అదే పనిగా పెరుగుతూ పోతుండడం డిమాండ్పై ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో భారత్లో బంగారం డిమాండ్ 16 శాతం తగ్గి 209.4 టన్నులకు పరిమితమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో డిమాండ్ 248.3 టన్నులు ఉండడం గమనార్హం. ధరలు పెరగడంతో వినియోగ డిమాండ్ తగ్గినట్టు, మరోవైపు సురక్షిత సాధనంగా పెట్టుబడుల పరమైన డిమాండ్ పెరిగినట్టు వివరించింది. పరిమాణం పరంగా డిమాండ్ తగ్గినప్పటికీ, విలువ పరంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 2,03,240 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విలువ పరంగా డిమాండ్ 1,65,380 కోట్లతో పోల్చి చూస్తే 23% పెరిగింది. ధరలు అధికంగా ఉండడం వల్ల కొనుగోలు పరిమాణం తగ్గినప్పటికీ, విలువ అదే స్థాయిలో ఉన్నట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. → ఆభరణాల డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 117.7 టన్నులుగా ఉంది. 2024 సెప్టెంబర్ క్వార్టర్లో డిమాండ్ 171.6 టన్నులతో పోల్చి చూస్తే 31 శాతం తగ్గింది. ఆభరణాల కొనుగోలు విలువ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.1,14,270 కోట్ల స్థాయిలో ఉంది. ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులు తమ స్తోమత మేరకు పరిమాణం తగ్గించి కొనుగోలు చేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. → పెట్టుబడుల పరంగా పసిడి డిమాండ్ 20 శాతం పెరిగి 91.6 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే 74 శాతం పెరిగి రూ.88,970 కోట్లకు చేరింది. → సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం సగటు ధర 10 గ్రాములకు రూ.97,075గా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.66,614గా ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా ఔన్స్ ధర 3,456 డాలర్ల వద్ద ఉంది. 2024 సెప్టెంబర్లో ఇది 2,474 డాలర్ల స్థాయిలో ఉంది. → బంగారం దిగుమతులు సెప్టెంబర్ త్రైమాసికంలో 194.6 టన్నులకు పడిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 308.2 టన్నులతో పోల్చితే దిగుమతులు 37 శాతం తగ్గాయి. → పసిడి రీసైక్లింగ్ డిమాండ్ సైతం 7 శాతం తగ్గి 21.8 టన్నులకు పరిమితమైంది. పెట్టుబడుల డిమాండ్.. దీర్ఘకాలంలో విలువ పెరిగే సాధనంగా బంగారం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి ఈ గణాంకాలు నిదర్శనమని డబ్ల్యూజీసీ భారత సీఈవో సచిన్జైన్ పేర్కొన్నారు. పరిమాణం పరంగా డిమాండ్ 16 శాతం తగ్గినప్పటికీ, విలువ పరంగా 23 శాతం పెరగడాన్ని విస్మరించకూడదన్నారు. పండుగలు, వివాహాల సీజన్లో డిమాండ్ బలంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలి నెలల్లో ధరలు పెరగడంతో పెళ్లిళ్లకు సంబంధించి కొనుగోళ్లను కొందరు వాయిదా వేసుకున్నారని, దీంతో డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ సానుకూలంగా ఉండొచ్చన్నారు. పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గడానికి.. గతేడాది దిగుమతి సుంకం తగ్గించడం కారణంగా పెద్ద ఎత్తున దిగుమతులు నమోదు కావడాన్ని ప్రస్తావించారు. గతేడాది గరిష్ట బేస్ కారణంగా దిగుమతులు పెద్ద మొత్తంలో తగ్గిపోయినట్టు కనిపిస్తోందన్నారు. ఈ ఏడాది మొత్తానికి పసిడి డిమాండ్ 600–700 టన్నులుగా ఉండొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. మొదటి తొమ్మిది నెలల్లో 462 టన్నులుగా ఉన్నట్టు తెలిపింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 1,313 టన్నులుగా నమోదైంది. - 
      
                   
                                                     
                   
            ఐటీసీ లాభం ప్లస్
కోల్కతా: డైవర్సిఫైడ్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్లో నికర లాభం 3% వృద్ధితో రూ. 5,187 కోట్లకు చేరింది. జీఎస్టీ సవరణలు, అధిక వర్షాల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ విభాగం సవాళ్లు ఎదుర్కొంది. గతేడాది ఇదే కాలంలో రూ. 5,054 కోట్లు ఆర్జించింది. ఇబిటా స్వల్పంగా(2%) బలపడి రూ. 6,695 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 21,536 కోట్ల నుంచి రూ. 21,256 కోట్లకు స్వల్పంగా క్షీణించింది. నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ను డైరెక్టర్, స్వతంత్ర డైరెక్టర్గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. 2026 జనవరి నుంచి కాంత్ ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఎఫ్ఎంసీజీ గుడ్ క్యూ2లో సిగరెట్లుసహా బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతోకూడిన ఎఫ్ఎంసీజీ విభాగం ఆదాయం 7% పుంజుకుని రూ. 15,473 కోట్లను అధిగమించినట్లు ఐటీసీ వెల్లడించింది. అగ్రి బిజినెస్ ఆదాయం రూ. 5,845 కోట్ల నుంచి రూ. 4,038 కోట్లకు క్షీణించగా.. పేపర్ బోర్డులు, ప్యాకేజింగ్ టర్నోవర్ స్వల్ప వృద్ధితో రూ. 2,220 కోట్లకు చేరింది. ఐటీసీ షేరు బీఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 419 వద్ద ముగిసింది. - 
      
                   
                                                     
                   
            అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్లో వేల కోట్లు స్వాహా!
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ (అడాగ్) వేల కోట్ల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఇన్వెస్టిగేటివ్ పోర్టల్ కోబ్రాపోస్ట్ సంచలన ఆరోపణలు చేసింది. 2006 నుంచి గ్రూప్ కంపెనీల ద్వారా రూ. 41,921 కోట్ల నిధులు మళ్లించినట్లు ఓ నివేదికలో తెలిపింది. అయితే, తమ గ్రూప్ సంస్థల షేర్ల ధరలను కుదేలు చేయడానికి జరుగుతున్న విషప్రచారంగా అడాగ్ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. వివరాల్లోకి వెళ్తే .. రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తదితర లిస్టెడ్ గ్రూప్ సంస్థలు బ్యాంక్ రుణాలు, ఐపీవోలు, బాండ్లు తదితర రూపాల్లో సమీకరించిన రూ. 28,874 కోట్లను ప్రమోటర్కి చెందిన కంపెనీలకు మళ్లించినట్లు కోబ్రాపోస్ట్ పేర్కొంది. అలాగే అనుబంధ సంస్థలు, డొల్ల కంపెనీల నెట్వర్క్ ద్వారా సింగపూర్, మారిషస్, సైప్రస్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల నుంచి 1.535 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 13,047 కోట్లు) మోసపూరిత విధానాలతో భారత్లోకి మళ్లించినట్లు వివరించింది. ‘బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్, సైప్రస్, మారిషస్ మొదలైన దేశాలకు చెందిన డజన్ల కొద్దీ సంస్థలు, సబ్సిడరీలు, డొల్ల కంపెనీల్లాంటి వాటి ద్వారా రూ. 41,921 కోట్ల పైగా నిధుల మళ్లింపు జరిగింది‘ అని కోబ్రాపోస్ట్ తెలిపింది. ఈ పరిణామాలతో ఆరు కీలకమైన లిస్టెడ్ కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని పేర్కొంది. సింగపూర్ కనెక్షన్.. సింగపూర్కి చెందిన ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్కి నెక్స్జెన్ క్యాపిటల్ అనే ఒక ’రహస్యమయ లబ్దిదారు’ నుంచి 750 మిలియన్ డాలర్లు లభించగా, అటు తర్వాత ఎమర్జింగ్ మార్కెట్ సంస్థను మూసివేయడానికి ముందు ఆ నిధులు రిలయన్స్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన రిలయన్స్ ఇన్నోవెంచర్స్కి బదిలీ అయ్యాయని కోబ్రాపోస్ట్ వెల్లడించింది. ఇది ’మనీ లాండరింగ్’ లావాదేవీ అయి ఉండొచ్చని పేర్కొంది. కంపెనీల చట్టం, ఫెమా, పీఎంఎల్ఏ, సెబీ చట్టం, ఆదాయ పన్ను చట్టం మొదలైన వాటిని ఉల్లంఘిస్తూ అనేక లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ, సెబీ, ఎన్సీఎల్టీ, ఆర్బీఐ మొదలైన వాటి దగ్గరున్న ఫైలింగ్స్, ఆదేశాల్లో ఉన్న వివరాల ఆధారంగా ఈ విషయాలు తమ విచారణలో వెల్లడైనట్లు కోబ్రాపోస్ట్ ఎడిటర్ అనిరుద్ధ బెహల్ తెలిపారు. వీటి వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్, మొండిబాకీలు మొదలైన రూపాల్లో మొత్తం రూ. 3.38 లక్షల కోట్ల ప్రజా సంపద పోయిందని ఆయన ఆరోపించారు.తోసిపుచ్చిన అడాగ్.. కోబ్రాపోస్ట్ నివేదికలో ఆరోపణలను అడాగ్ కొట్టిపారేసింది. గ్రూప్ అసెట్స్ను దక్కించుకోవాలనే దురాలోచన గల సంస్థలు.. ఎప్పుడో పాతబడిన, బహిరంగంగా ఉన్న, సీబీఐ.. ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పరిశీలించిన సమాచారాన్ని తిరగతోడి ఈ ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఇది తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, సంబంధిత భాగస్వాములను తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న విషప్రచారమని పేర్కొంది. కోబ్రాపోస్ట్కి నిర్దిష్ట ఎజెండాను పెట్టుకుని స్టింగ్ ఆపరేషన్ చేస్తుందనే ట్రాక్ రికార్డు ఉందని అడాగ్ తెలిపింది. ‘రిలయన్స్ గ్రూప్, అనిల్ అంబానీ, 55 లక్షల మంది వాటాదారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు, స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ గ్రూప్ సంస్థల షేర్లను కుదేలు చేసి, ఆయా కంపెనీలను దక్కించుకునేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం ఇది‘ అని అడాగ్ వ్యాఖ్యానించింది. అటు గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ ఇటీవల తమ షేర్ల ట్రేడింగ్ ధోరణుల్లో మార్పులు చోటు చేసుకోవడంపై విచారణ జరపాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిర్యాదులు చేశాయి. - 
      
                   
                                                     
                   
            కార్పొరేట్ ఆర్ధిక ఫలితాలు ఇలా..
ప్రముఖ కంపెనీలు ఎట్టకేలకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో క్యూ2 ఫలితాలని విడుదల చేశాయి. ఈ ఫలితాలను పరిశీలిస్తే..హ్యాట్సన్పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోని హ్యాట్సన్ ఆగ్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలానికి ఆకర్షణీయమైన పనితీరు చూపించింది. లాభం ఏకంగా 70 శాతం ఎగసి రూ.109 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.64 కోట్లుగానే ఉంది. ఆదాయం సైతం 17 శాతం వృద్ధి చెంది రూ.2,072 కోట్ల నుంచి రూ.2,427 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,991 కోట్ల నుంచి రూ.2,284 కోట్లకు చేరాయి.రేమండ్ లైఫ్స్టైల్బ్రాండెడ్ దుస్తులు, టెక్స్టైల్స్ కంపెనీ రేమండ్ లైఫ్స్టైల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 75 కోట్లను అధిగమించింది. బ్రాండెడ్ టెక్స్టైల్స్, దుస్తుల అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 42 కోట్లు ఆర్జించింది. రేమండ్ గ్రూప్ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 1,708 కోట్ల నుంచి రూ. 1,832 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,758 కోట్లకు చేరాయి. పార్క్ ఎవెన్యూ, కలర్ప్లస్, పార్క్స్, ఎతి్నక్స్ తదితర బ్రాండ్ల కంపెనీ నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 259 కోట్లను తాకగా.. 13.9 శాతం మార్జిన్లు సాధించింది. డీసీఎం శ్రీరామ్డైవర్సిఫైడ్ దిగ్గజం డీసీఎం శ్రీరామ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం రెండు రెట్లుపైగా జంప్చేసి రూ. 159 కోట్లకు చేరింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 63 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 3,184 కోట్ల నుంచి రూ. 3,531 కోట్లకు బలపడింది. కెమికల్స్, వినైల్, అగ్రికల్చర్ తదితర విభాగాలు కలిగిన కంపెనీ మొత్తం వ్యయాలు సైతం రూ. 3,796 కోట్ల నుంచి రూ. 4,873 కోట్లకు పెరిగాయి. కెమికల్స్, వినైల్ విభాగాల ఆదాయం రూ. 777 కోట్ల నుంచి రూ. 1,108 కోట్లకు ఎగసింది. ధనలక్ష్మీ బ్యాంక్ప్రయివేట్ రంగ సంస్థ ధనలక్ష్మీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 23 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 26 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 380 కోట్ల నుంచి రూ. 418 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం రూ. 329 కోట్ల నుంచి రూ. 384 కోట్లకు పెరిగింది. కాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.82 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు నిలకడను చూపుతూ 1.12 శాతంగా నమోదయ్యాయి.వరుణ్ బెవరేజెస్గ్లోబల్ పానీయాల దిగ్గజం పెప్సీకోకు బాట్లర్గా వ్యవహరించే వరుణ్ బెవరేజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ3)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 745 కోట్లను అధిగమించింది. ఫైనాన్స్ వ్యయాలు తగ్గడం, ఇతర ఆదాయం పుంజుకోవడం, కరెన్సీ లాభాలు ఇందుకు సహకరించాయి. గతేడాది(2024) ఇదే కాలంలో రూ. 629 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,932 కోట్ల నుంచి రూ. 5,048 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 4,156 కోట్ల నుంచి రూ. 4,253 కోట్లకు పెరిగాయి. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే విషయం విదితమే. అమ్మకాలు 2.4 శాతం పుంజుకుని 27.38 కోట్ల కేసులకు చేరాయి. - 
      
                   
                                                     
                   
            జియో యూజర్లకు బంపరాఫర్: రూ.35000 విలువైన సర్వీస్ ఫ్రీ!
అన్లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉపయోగించే.. 18-25 సంవత్సరాల వయసు కలిగిన జియో వినియోగదారులు 18 నెలల పాటు రూ.35,100 విలువైన గూగుల్ జెమిని AI ప్రో సేవను ఉచితంగా పొందవచ్చు. దీనికోసం రిలయన్స్ కంపెనీ.. గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో ఏఐ స్వీకరణను వేగవంతం చేయడానికి.. యువ సబ్స్క్రైబర్లకు గూగుల్ జెమినీ AI ప్రోను ఉచితంగా అందించడానికి కంపెనీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఇది అక్టోబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే.. అర్హత కలిగిన యూజర్లు అన్లిమిటెడ్ 5G ప్లాన్లపై గూగుల్ AI ప్రో ఉచితంగా పొందవచ్చు. ఇది అపరిమిత చాట్, 2TB క్లౌడ్ స్టోరేజ్, Veo 3.1 లో వీడియో జనరేషన్, నానో బనానాతో ఇమేజ్ జనరేషన్ వంటివెన్నో అందిస్తుంది.రూ. 349 నుంచి ప్రారంభమయ్యే 5జీ అన్లిమిటెడ్ ప్లాన్లకు (ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్) ఉచిత జెమినీ ప్రో లభిస్తుంది. ఇది యాక్టివేషన్ చేసుకున్న రోజు నుంచి 18 నెలల వరకు అందుబాటులో ఉంటుంది (అపరిమిత 5G ప్లాన్ యాక్టివ్లో ఉండాలి). యువ భారతీయులలో సృజనాత్మకత, విద్య & ఆవిష్కరణలకు ఆజ్యం పోసేందుకు కంపెనీ దీనిని ప్రత్యేకంగా రూపొందించింది. దీనిని మైజియో యాప్ ద్వారా నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు.1.45 బిలియన్ భారతీయులకు ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్ వంటి వ్యూహాత్మక & దీర్ఘకాలిక భాగస్వాములతో మా సహకారం ద్వారా, భారతదేశాన్ని అల్-ఎనేబుల్డ్ కాకుండా అల్-ఎంపవర్డ్ గా మార్చాలని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.FREE BENEFITS WORTH ₹35,100 🎉FREE pro plan of Google Gemini for 18-months (worth ₹35,100) for Jio users aged 18–25 years (early access) using an eligible Unlimited 5G plan.Enjoy unlimited chats, 2TB cloud storage, video generation on Veo 3.1, image generation with Nano… pic.twitter.com/O5Pqpo2K4r— Reliance Jio (@reliancejio) October 30, 2025 - 
      
                   
                                                     
                   
            ముందు బీమా చెల్లించండి.. తర్వాతే ఏమైనా!: సుప్రీంకోర్టు
ఈ రోజుల్లో దాదాపు అందరూ బీమా తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరిగినప్పుడు.. కొన్ని కారణాలను చూపిస్తూ బీమా సంస్థలు పరిహారం చెల్లించకుండా తప్పించుకుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 'వాహనం రూట్ ఉల్లంఘన జరిగినా కూడా, ప్రమాద బాధితుడికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిందే' అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ప్రమాదం జరిగిన సమయంలో.. వాహనం రూట్ మారిందని ప్రమాద బాధితులకు బీమా కంపెనీ పరిహారాన్ని తిరస్కరించకూడదు. సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని బీమాను తిరస్కరించలేరు. ప్రమాద బాధితుడికి న్యాయం చేయడమే బీమా ముఖ్య ఉద్దేశం. బీమా చెల్లించిన తరువాత.. ఏవైనా అవకతవకలు ఉంటే.. రూల్స్ ఉల్లంఘించిన వాహన యజమానిపై లేదా డ్రైవర్ నుంచి రికవరీ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. - 
      
                   
                                                     
                   
            మెరుగైన భారత్ కోసం ఏఐ: రూ.1 కోటి బహుమతి
భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్.. తన జాతీయ విద్యా కార్యక్రమం ‘శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో 2025’ నాల్గవ ఎడిషన్ విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమం యువ విద్యార్థులు సాంకేతికతను వినియోగించి తమ స్థానిక కమ్యూనిటీల్లోని వాస్తవ ప్రపంచ సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుంది.మొదటి నాలుగు విజేత జట్లుపెర్సెవియా (బెంగళూరు)నెక్ట్స్ప్లే.ఏఐ (ఔరంగాబాద్)పారస్పీక్ (గురుగ్రామ్)పృథ్వీ రక్షక్ (పలాము)ఐఐటి ఢిల్లీకి చెందిన ఎఫ్ఐటీటీ ల్యాబ్స్లో మెంటర్షిప్ మద్దతుతో, తమ ఆవిష్కరణాత్మక ప్రోటోటైప్లను స్కేలబుల్ రియల్-వరల్డ్ పరిష్కారాలుగా అభివృద్ధి చేయడానికి రూ. 1 కోటి విలువైన ఇంక్యుబేషన్ గ్రాంట్లు అందుకున్నారు. జ్యూరీ ప్యానెల్లో.. శామ్సంగ్ మాత్రమే కాకుండా, విద్యా సంస్థలు, ప్రభుత్వం & పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్యానెల్ నాలుగు ప్రధాన నేపథ్య ట్రాక్లలో ఫైనలిస్టుల పరిష్కారాలను అంచనా వేసింది.అత్యుత్తమ ప్రపంచాన్ని నిర్మించడంలో తమ సృజనాత్మకత & అంకితభావాన్ని ప్రతిబింబించినందుకు టాప్ 20 ఫైనలిస్ట్ జట్లు ఒక్కొక్కటి రూ 1 లక్ష నగదు బహుమతితో పాటు తాజా శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్ఫోన్లను కూడా అందుకున్నాయి. అదనంగా, ఈ కార్యక్రమం ఐదు ప్రత్యేక అవార్డుల కింద బహుమతులను అందించింది - 
      
                   
                                                     
                   
            ఒంటినిండా నగలు ధరిస్తే.. రూ. 50వేలు జరిమానా!
బంగారు నగలు ఉంటే.. ఎవరికైనా ధరించుకోవాలని, ఓ నలుగురికి చూపించుకోవాలని ఉంటుంది. అయితే ఇలాంటి ఆడంబరాలకు స్వస్తి పలకడానికి.. ఉత్తరాఖండ్లోని జౌన్సర్-బావర్ గిరిజన ప్రాంతంలోని కంధర్ గ్రామ నివాసితులు ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఉల్లంఘించిన వారికి రూ. 50వేలు జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.ఆడంబరాలను అరికట్టడానికి మాత్రమే కాకుండా.. ఆర్ధిక అసమానతలను తగ్గించడానికి గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి మహిళలు కూడా స్వాగతించారు. ఇకపై అక్కడి మహిళలు వివాహాది శుభకార్యాలకు వెళ్లినా.. కేవలం చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలి. ఇవి కాదని ఎవరైనా ఇతర బంగారు నగలను ధరిస్తే.. వారికి రూ. 50,000 జరిగిమానా విధించనున్నట్లు గ్రామపెద్దలు హెచ్చరించారు.బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. డబ్బున్నవారు గోల్డ్ కొనుగోలు చేస్తారు. పేదరికంలో ఉన్నవారికి ఇది సాధ్యం కాదు. బంగారం కొనాలని అప్పులు చేస్తే.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో అప్పులు పెరుగుతాయని కంధర్ గ్రామపెద్దలు.. కొత్త నిర్ణయం తీసుకున్న సందర్భంగా వివరించారు.వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారం. అది ప్రదర్శించడానికి వేదిక కాదు. ఆడంబరాలు/ప్రదర్శనలు అనే గోడలను కూల్చివేసినప్పుడే.. నిజమైన సమానత్వం సాధించబడుతుందని అక్కడి నివాసితులు నమ్ముతున్నారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం.. ధనిక & పేద కుటుంబాల మధ్య పోల్చుకోవడం కొంత తగ్గుతుంది. అనవసరమైన ఖర్చులను అరికట్టవచ్చు. ఇది సామాజిక ఐక్యతను పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి - 
      
                   
                                                     
                   
            పడిపోయిన టాప్ ఐటీ కంపెనీ లాభాలు
దేశీయంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను కలిగిన ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2025) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్(క్యూ3)లో యూఎస్ కంపెనీ నికర లాభం 53 శాతం క్షీణించి 27.4 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఈ కాలంలో 39 కోట్ల డాలర్లమేర నగదేతర ఆదాయ పన్ను వ్యయాల కారణంగా లాభాలు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది.గతేడాది(2024) క్యూ3లో 58.2 కోట్ల డాలర్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 7 శాతంపైగా ఎగసి 541.5 కోట్ల డాలర్లను తాకింది. ఏఐలో పెట్టుబడులు ఇందుకు సహకరించగా.. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను తాజాగా మెరుగుపరచింది. వెరసి ఇంతక్రితం ప్రకటించిన 20.7–21.1 బిలియన్ డాలర్లను 21.05–21.1 బిలియన్ డాలర్లకు సవరించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే.ఈ బాటలో చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో 5.27–5.33 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఈ క్యూ3లో ఆర్డర్ల బుకింగ్స్ 5 శాతం నీరసించగా.. 6,000 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,49,800ను తాకింది. ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించే బాటలో సాగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. - 
      
                   
                                                     
                   
            కాపర్కు పెరుగుతున్న డిమాండ్..
దేశీయంగా కాపర్కు డిమాండ్ బలపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 1,878 కిలో టన్నులకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ 1,718 కిలో టన్నులతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా (ఐసీఏ ఇండియా) ఈ వివరాలను నివేదిక రూపంలో విడుదల చేసింది.ఆర్థికంగా పురోగమిస్తుండడం, కీలక రంగాల్లో కాపర్ వినియోగం పెరుగుతుండడం డిమాండ్కు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ విద్యుత్ సామర్థ్యాల విస్తరణ వంటివి డిమాండ్ను అధికం చేస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణ రంగం నుంచి కాపర్కు డిమాండ్ 11 శాతం పెరగ్గా, మౌలిక సదుపాయాల రంగం నుంచి 17 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది.‘‘భారత్లో ఆర్థిక, పారిశ్రామిక పురోగతికి అనుగుణంగా కాపర్ డిమాండ్ పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన వనరులు, సుస్థిర రవాణా పరిష్కారాలు, మౌలిక వసతుల అభివృద్ధి కాపర్ డిమాండ్ను పెంచుతున్నాయి. దేశ అభివృద్ధికి కీలక వనరుగా కాపర్ తనవంతు పాత్రను తెలియజేస్తోంది’’అని ఐసీఏ ఇండియా తెలిపింది.అయితే వికసిత్ భారత్ ఆకాంక్షకు అనుగుణంగానే ప్రస్తుత కాపర్ డిమాండ్ ఉందా? అని ప్రశ్నించుకోవాలని ఏసీఏ ఇండియా ఎండీ మయాంక్ కర్మార్కర్ పేర్కొన్నారు. కాపర్ నిల్వలను అభివృద్ధి చేసుకోవడం, దేశీ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా భవిష్యత్ డిమాండ్ను చేరుకోవచ్చని సూచించారు.భవిష్యత్తు బంగారంబంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకో కొత్త ధరకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరంగా జరిగిపోతోంది పసిడి. ఇన్వెస్టర్లు సైతం స్వర్ణంపై సంపూర్ణ విశ్వాసం పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘భవిష్యత్ బంగారం’గా మరో లోహం ఆశలు పూయిస్తోంది. అదే ‘రాగి’ (Copper). మల్టీ నేషనల్ మైనింగ్ సంస్థ వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కాపర్ను 'తదుపరి బంగారం'గా అభివర్ణించారు. ఇది క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ఎక్కువగా ప్రాముఖ్యతను పొందుతోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు, ఏఐ, రక్షణ పరికరాలలో కాపర్కు పెరుగుతున్న డిమాండ్ను ఆయన ప్రస్తావించారు. కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్ పదాన్ని తొలగించి కేవలం 'బారిక్'గా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపై దృష్టి మారే సంకేతంగా ఆయన పేర్కొన్నారు.The world's second largest gold producer, Barrick Gold is rebranding to just Barrick. That is because it sees its future in copper.Copper is the new super metal which is being heavily used in every advanced technology, whether EVs, renewable energy infrastructure, AI or defence… pic.twitter.com/YUDC5Rid4r— Anil Agarwal (@AnilAgarwal_Ved) April 17, 2025 - 
      
                   
                                                     
                   
            250 మెగావాట్స్ పవర్ ప్లాంట్ సొంతం చేసుకున్న ఎంఈఐఎల్
తమిళనాడులో నేవేలి వద్ద 250 మెగావాట్ల లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొనుగోలు చేసింది. అబుదాబి కేంద్రంగా ఉన్న సంస్థ నుంచి వందశాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎంఈఐఎల్ గురువారం ప్రకటించింది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఎంఈ ఐఎల్ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈఐఎల్ ఎనర్జీ) తమిళనాడులోని నేవేలిలో ఉన్న టిఏక్యూఏ నేవెలీ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (టిఏక్యూఏ నేవెలీ) సంస్థను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ పిజెఎస్సి (టిఏక్యూఏ) నుంచి 100 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది.ఈ స్వాధీన ప్రక్రియ ఎంఈఐఎల్ గ్రూప్ వ్యూహాత్మక పరిణామంగా చెప్పవచ్చు. ఒక పెద్ద ఈపీసి కాంట్రాక్టర్ నుంచి అంతర్గతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యాజమాన్యం, నిర్వహణలో నిమగ్నమైన సమగ్ర ఇన్ఫ్రా డెవలపర్గా మారే దిశలో కీలకమైన అడుగుగా ఎంఈఐఎల్ చేసిన ఈ కొనుగోలు నిలుస్తోంది.టిఏక్యూఏ నేవెలీ 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన లిగ్నైట్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని తమిళనాడులోని నేవెలీ ప్రాంతంలో నిర్వహిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రానికి ఆ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిరంతర, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించడంలో ఈ యూనిట్ స్థిరమైన పనితీరు రికార్డును ఇప్పటికే నెలకొల్పింది.ప్రస్తుతం ఇంధన రంగంలో 5.2 గిగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యాన్ని ఎంఈఐఎల్ కలిగి ఉంది. తమిళనాడు ప్లాంట్ కొనుగోలు ద్వారా ఈ రంగంలో తన స్థానాన్ని సంస్థ మరింత బలపరుచుకుంటోంది. అలాగే, దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు స్థిరమైన, భారీ స్థాయిలో పనిచేసే ఉత్పత్తి ఆస్తుల పోర్ట్ఫోలియోను నిర్మించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.టిఏక్యూఏ నేవెలీని తన ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి ఆపరేషన్లలో సులభంగా సమన్వయం చేయడాన్ని ఎంఈఐఎల్ ఎనర్జీ ప్రాధాన్యంగా తీసుకుంటోంది. దీని ద్వారా ఆపరేషనల్ ఎక్సలెన్స్, సమర్థవంతమైన ఆస్తి నిర్వహణ తదితరాలకు సంస్థ కట్టుబడింది.ఈ సందర్భంగా ఎంఈఐఎల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సలిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ''ఉన్నత నాణ్యత గల విద్యుత్ ఉత్పత్తి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఈపీసీ రంగంలో మా అత్యుత్తమ నైపుణ్యాన్ని మౌలిక సదుపాయాల యాజమాన్యంతో కలిపి వ్యూహాత్మక మార్పు సాధించడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుంది. మా ప్రధాన దృష్టి, దేశీయ ఇంధన భద్రతను పెంపొందించే, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించే, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధికి మద్దతు ఇచ్చే వ్యూహాత్మక పెట్టుబడులపై కొనసాగుతుంది. థర్మల్, హైడ్రో, పునరుత్పాదక శక్తి రంగాలను సమన్వయం చేసే సమతులిత, స్థిరమైన విద్యుత్ ఉత్పత్తి పోర్ట్ఫోలియో నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాము'' అని అన్నారు. టిఏక్యూఏ నేవెలీ స్వాధీనం మా ఆర్గానిక్, ఇనార్గానిక్ వృద్ధి వ్యూహాలకు అనుగుణంగా ఉంది. భారత విద్యుత్ రంగంపై మాకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోంది అని అన్నారు.ఎంఈఐఎల్ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి, చమురు, సహజ వాయువు, పునరుత్పాదక శక్తి, మౌళిక సదుపాయాలు, తయారీ, నీటి నిర్వహణ తదితర రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. భవిష్యత్తులో భారత ఇంధన స్వావలంబన, ఆర్థిక స్థిరత్వంకు తోడ్పడే అవకాశాలను పరిశీలించి ముందుకు సాగుతోంది. - 
      
                   
                                                     
                   
            రూ.240 కోట్ల లాటరీ.. మరి ట్యాక్స్ ఎంత కట్టాలి?
యూఏఈలో ఇటీవల ఒక భారతీయ వ్యక్తి 100 మిలియన్ దిర్హమ్ల (రూ.240 కోట్లు) భారీ లాటరీని గెలుచుకున్నారు. ఇది విన్నవారందరూ ఆశ్చర్యచకితులై ఉంటారు. ‘వామ్మో అన్ని కోట్లు గెలిచాడా.. మరి దీనిపై ట్యాక్స్ కట్టాలా.. కడితే ఎంత కట్టాలి.. గెలిచిన లాటరీ సొమ్మును ఇండియాకు తెచ్చుకోవచ్చా?’ అందిరికీ వెంటనే ఇవే సందేహాలు వచ్చి ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం..యూఏఈలో నో ట్యాక్స్లాటరీ గెలిచింది అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల ప్రవాస భారతీయ యువకుడు అనిల్ కుమార్ బొల్లాగా గుర్తించారు. లాటరీ సొమ్ముపై ట్యాక్స్ అన్నది ఆయన ఎక్కడ పన్నులు చెల్లిస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశంలో ఇప్పటివరకు గెలిచిన అతిపెద్ద జాక్ పాట్ ఇదే అయినప్పటికీ, అక్కడ అటువంటి లాటరీలపై స్థానిక యూఏఈ పన్నులేవీ ఉండవు. అంటే ఆయన మొత్తం డబ్బును యూఏఈలోని తన బ్యాంకు ఖాతాలో జమవుతుంది.మరి భారత్లో..భారతదేశంలో లాటరీ బహుమతులపై ఫ్లాట్ 30% పన్ను వర్తిస్తుంది. అదనంగా ఈ పన్ను మొత్తంపై 15% సర్ఛార్జ్ (రూ .1 కోటి కంటే ఎక్కువ గెలుపొందినవారికి), అలాగే మొత్తంపై 4% ఆరోగ్య, విద్యా సెస్ చెల్లించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి భారతదేశంలో నివాసి హోదాను కలిగి ఉంటే ఈ పన్నుకు లోబడి ఉంటాడు.ఒక వ్యక్తి భారతదేశంలో నివాసిగా పరిగణించబడాలంటే.. గడిచిన సంవత్సరంలో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండాలి. లేదా గడిచిన సంవత్సరంలో 60 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం, అలాగే అంతకుముందు నాలుగు సంవత్సరాలలో మొత్తం 365 రోజులు భారత్లో నివసించి ఉండాలి.ఈ రెండు సందర్భాల పరిధిలోకి లాటరీ విజేత రాకపోతే నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) హోదాను కలిగి ఉంటారు. కాబట్టి భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ నివాస హోదా ఉంటే, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం.. ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా.. అది భారతదేశంలోకి తీసుకురాకపోయినా భారతదేశంలో ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది.అనిల్ కుమార్ బొల్లా దీర్ఘకాలంగా అబుదాబి నివాసి. ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ఆయన యూఏఈలో నివసిస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. అంటే ఆయన భారతీయ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇక ఆయన గెలుచుకున్న లాటరీ సొమ్మును భారతదేశానికి తీసుకురాగలడా అంటే.. తీసుకొచ్చేందుకు నిబంధనలు అనుమతించవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ), ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ప్రకారం, బయటి దేశాల్లో లాటరీ ద్వారా గెలుచుకున్న సొమ్మును భారత్లోకి తేవడం నిషేధం. - 
      
                   
                                                     
                   
            ఏఐ ఎఫెక్ట్.. యూట్యూబ్ ఉద్యోగులకు ఎగ్జిట్ ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాలలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే లెక్కకు మించిన ఉద్యోగులు ఏఐ వల్ల ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పుడు తాజాగా.. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఈ జాబితాలోకి చేరింది. అయితే ఈ సంస్థ ఉద్యోగులను బలవంతంగా తొలగించడంలేదు, కానీ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించింది.ఏఐ టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో.. యూట్యూబ్లో తప్పకుండా కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ 'నీల్ మోహన్' ప్రస్తావించారు. కాగా పదేళ్ళలో మొదటిసారి తన ప్రొడక్ట్ డివిజన్లో మార్పులు చేస్తున్నారు.అమెరికాలో పనిచేస్తున్న యూట్యూబ్ ఉద్యోగులు.. స్వచ్చందంగా తమ ఉద్యోగాన్ని వదులుకుంటే, పరిహారం కింద వారికి నిష్క్రమణ ప్యాకేజీలను అందించనున్నట్లు వెల్లడించారు. కంటెంట్ క్రియేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్ వంటి వాటిని ఏఐ ప్రభావితం చేయనుంది. కొత్త మార్పులు 2025 నవంబర్ 05 నుంచి అందుబాటులో రానున్నాయి.ఇదీ చదవండి: కొత్త రూల్: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం!యూట్యూబ్ మాతృ సంస్థ.. గూగుల్ తన ఉత్పత్తులు, సేవలలో కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ పునర్నిర్మాణం జరిగింది. ఏఐ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని సీఈఓ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తమ బృందాలను కోరారు. - 
      
                   
                                                     
                   
            నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి.సెన్సెక్స్ 592.67 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో 84,404.46 వద్ద, నిఫ్టీ 176.05 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో.. 25,877.85 వద్ద నిలిచాయి.యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రూవరీస్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్ప్లోరేషన్, సార్థక్ మెటల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గీకే వైర్స్, ఓసీసీఎల్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ, ZIM లాబొరేటరీస్, షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) - 
      
                   
                                                     
                   
            8వ పేకమిషన్ ఛైర్పర్సన్గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన నిర్మాణంలో మార్పులను సమీక్షించి సిఫార్సు చేయడానికి ఉద్దేశించిన 8వ కేంద్ర వేతన సంఘం (CPC) ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నియామకానికి ఆమోదం తెలిపింది.దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల అలవెన్సులు, పింఛన్ల అంశాలను ఈ కమిషన్ సమీక్షిస్తుంది. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కమిషన్ తన తుది నివేదికను త్వరలో సమర్పించాలని భావిస్తున్నారు.జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్కేంద్ర వేతన సంఘం చరిత్రలో మహిళా ఛైర్పర్సన్గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులవ్వడం విశేషం.సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి 2014లో రిటైర్ అయ్యారు.ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి (UCC) ముసాయిదా కమిటీకి ఛైర్పర్సన్గా నేతృత్వం వహించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఉత్తరాఖండ్ యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.జమ్మూ-కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ (Delimitation Commission)కు కూడా అధ్యక్షురాలిగా పనిచేశారు.ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI)కు ఛైర్పర్సన్గా సేవలు అందించారు.8వ పే కమిషన్8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు జరిపింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి త్వరగానే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.ఎవరిపై ప్రభావం?ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)కు తాజాగా ఆమోదం తెలిపింది. ఇది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.ఇదీ చదవండి: వీసా, మాస్టర్ కార్డుకు రూపే గట్టి పోటీ.. కారణాలు.. - 
      
                   
                                                     
                   
            25 ఏళ్లు.. 3.5 కోట్లు: అమ్మకాల్లో యాక్టివా
ప్రముఖ టూ వీలర్ కంపెనీ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI).. యాక్టివా 110, యాక్టివా 125, యాక్టివా-ఐలతో సహా దాని ప్రసిద్ధ యాక్టివా శ్రేణి.. మొత్తం 35 మిలియన్ (3.5 కోట్లు) అమ్మకాల మైలురాయిని సాధించింది. దీన్నిబట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ స్కూటర్లకు ఉన్న డిమాండ్ స్పష్టంగా అర్థమవుతోంది.హోండా మోటార్సైకిల్.. తన యాక్టివా శ్రేణి స్కూటర్లను 3.5 కోట్ల యూనిట్లను విక్రయించడానికి 25 ఏళ్ల సమయం పట్టింది. 2001లో యాక్టివా స్కూటర్ దేశీయ విఫణిలో ప్రారంభమైంది. 2015 నాటికి 10 మిలియన్ సేల్స్.. 2018 నాటికి 20 మిలియన్ సేల్స్, 2025 నాటికి 35 మిలియన్ సేల్స్ రికార్డ్ సాధ్యమైంది.యాక్టివా స్కూటర్ భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి.. అనేక అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో డిజైన్ అప్డేట్స్, అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొనుగోలుదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉండటం చేత అమ్మకాలలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది.ఇదీ చదవండి: ఉన్న కారుకే.. రేంజ్ రోవర్ పేరు: నవ్వుకుంటున్న జనం!హోండా యాక్టివా వారసత్వాన్ని కొనసాగించడంలో భాగంగా.. కంపెనీ 2025 ఆగష్టులో యాక్టివా & యాక్టివా 125 యానివర్సరీ ఎడిషన్స్ లాంచ్ చేసింది. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడం మాత్రమే కాకుండా.. బలమైన డీలర్ నెట్వర్క్ను కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో యాక్టివా ఈ, యాక్టివా క్యూసీ1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. - 
      
                   
                                                     
                   
            ఈపీఎఫ్వో భారీ మార్పునకు సన్నద్ధం! 11 ఏళ్ల తర్వాత..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) భారీ మార్పునకు సన్నద్ధమవుతోంది. ఈపీఎఫ్, ఈపీఎస్ అర్హత కోసం జీతం పరిమితిని పెంచే ప్రతిపాదనపై చర్చించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో సమావేశం కానుంది.ప్రస్తుతం, నెలకు బేసిక్ వేతనం రూ .15,000 వరకు (డీఏతో కలిపి) ఉన్న ఉద్యోగులు మాత్రమే తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పరిధిలోకి వస్తారు. ఈపీఎఫ్వో ఇప్పుడు ఈ పరిమితిని రూ .25,000 లకు పెంచాలని యోచిస్తోంది. ఇది 2014 అనంతరం అంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత భారీ మార్పు కాబోతోంది.ఇది అమల్లోకి వస్తే భారతదేశ శ్రామిక శక్తిలో చాలా మంది ఈపీఎఫ్ ఈపీఎస్ ప్రయోజనాలను పొందుతారు. అంటే ఇప్పుడు పదవీ విరమణ, పెన్షన్ భద్రత కోల్పోతున్న లక్షలాది మంది మళ్లీ వాటి పరిధిలోకి వస్తారు.ప్రస్తుత వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే.. ఉద్యోగి, యాజమాన్యం ఇద్దరూ ఉద్యోగి నెలవారీ బేసిక్ జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. ఇక్కడ యాజమాన్యం వాటా మళ్లీ విభజిస్తారు. 3.67 శాతం ఈపీఎఫ్కు వెళుతుంది. 8.33 శాతం ఈపీఎస్కు కేటాయిస్తారు.ఇక నెలవారీ జీతంలో బేసిక్ పే రూ .15,000 దాటినవారికి ఈపీఎఫ్ కవరేజీ తప్పనిసరి కాదు. అంటే ఈపీఎఫ్ కవరేజీ కావాలంటే తీసుకోవచ్చు. వద్దనుకుంటే విరమించుకోవచ్చు.ఈపీఎఫ్ఓ ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.6 కోట్ల క్రియాశీల సభ్యులతో రూ .26 లక్షల కోట్ల భారీ నిధిని నిర్వహిస్తోంది. ఈ మార్పు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. జీతాలతోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో పాత నిబంధనలు నేటి వాస్తవికతకు సరిపోవు. కొత్త పరిమితి అమల్లోకి వస్తే మరింత మంది కార్మికులకు పదవీ విరమణ అనంతర రక్షణను పొందడానికి సహాయపడుతుంది. - 
      
                   
                                                     
                   
            నైజీరియాలో ఐఐటీ క్యాంపస్ ఏర్పాటు
భారతదేశంలోని అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) అంతర్జాతీయ విస్తరణలో భాగంగా 2026 నాటికి నైజీరియాలో క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో భారతదేశానికి చెందిన మొదటి ఐఐటీ క్యాంపస్ కానుంది.నైజీరియాలో ఎందుకు?నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 అమలులో భాగంగా విదేశాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేయాలని భారతీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ విస్తరణ ద్వారా భారతదేశం తన అకడమిక్ సామర్థ్యాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ క్యాంపస్ ద్వారా భారత్, నైజీరియా మధ్య విద్యా, సాంకేతిక రంగాల్లో సహకారం మరింత పెరుగుతుంది.ఆఫ్రికా ఖండంలో శాస్త్ర, సాంకేతిక విద్యను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని భారత్ భావిస్తోంది.నైజీరియా ప్రభుత్వం తమ దేశాన్ని ప్రాంతీయ సాంకేతిక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి విద్యాసంస్థ అయిన ఐఐటీ ఏర్పాటుతో ఈ లక్ష్యం వేగవంతమవుతుందని నైజీరియా విశ్వసిస్తోంది.నైజీరియా విద్యార్థులకు స్వదేశంలోనే నాణ్యమైన ఇంజినీరింగ్, సాంకేతిక విద్యను అందించడానికి భారత ఐఐటీ ఉపయోగపడుతుంది. ఇది ‘బ్రెయిన్ డ్రెయిన్’(ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడం) సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.ఈ క్యాంపస్ పనులు ఏ దశలో ఉన్నాయి?నైజీరియాలో ఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రణాళిక దశలో ఉన్నాయి. ఈ క్యాంపస్ సులేజాలోని ఫెడరల్ గవర్నమెంట్ అకాడమీ (FGA)లో ఏర్పాటు కానుంది. ఈ ప్రాంతాన్ని ‘నైజీరియన్ అకాడమీ ఫర్ ది గిఫ్టెడ్’ అని కూడా పిలుస్తారు. ఈ అకాడమీని భారత్ సహకారంతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మార్చనున్నారు. ఈ క్యాంపస్లో అధ్యాపకుల నియామకం, కోర్సుల రూపకల్పనను పర్యవేక్షించడానికి ఇండియా, నైజీరియాకు చెందిన సంయుక్త బృందం పని చేస్తుంది. 🚨 India is opening a IIT campus in Nigeria in 2026. pic.twitter.com/oPocRgVNhJ— Indian Tech & Infra (@IndianTechGuide) October 29, 20252026 నాటికి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల మొదటి బ్యాచ్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. క్యాంపస్ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ను నైజీరియా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి ఈ క్యాంపస్లో ప్రవేశానికి సంబంధించిన కచ్చితమైన తుది వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే నవంబర్ 2023లో టాంజానియాలో భారత్ ఐఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేసింది.ఇదీ చదవండి: వీసా, మాస్టర్ కార్డుకు రూపే గట్టి పోటీ.. కారణాలు.. - 
      
                   
                                                     
                   
            వీసా, మాస్టర్ కార్డుకు రూపే గట్టి పోటీ.. కారణాలు..
భారతదేశం సొంత పేమెంట్ నెట్వర్క్ అయిన రూపే (RuPay) దశాబ్ద కాలంలోనే దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఈ వ్యవస్థలోని అంతర్జాతీయ దిగ్గజాలైన మాస్టర్ కార్డ్ (Mastercard), వీసా (Visa) కార్డులకు రూపే గట్టి పోటీని ఇస్తోందనే అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), భారతీయ బ్యాంకుల మద్దతుతో రూపే కార్డులు డెబిట్ కార్డు విభాగంలో గణనీయమైన వాటా సాధిస్తున్నాయి. రూపే ఇలా భారత మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడానికి కారణాలేమిటో చూద్దాం.జన ధన్ యోజన (PMJDY)2014లో ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా తెరిచిన కోట్లాది బ్యాంకు ఖాతాలకు రూపే డెబిట్ కార్డులను జారీ చేశారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న అసంఘటిత వర్గాలకు సైతం కార్డులను అందించడం ద్వారా రూపే వినియోగదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.తక్కువ నిర్వహణ ఖర్చురూపే అనేది దేశీయ చెల్లింపు నెట్వర్క్ కావడం వల్ల లావాదేవీల ప్రాసెసింగ్ అంతా భారతదేశంలోనే జరుగుతుంది. దీనివల్ల విదేశీ నెట్వర్క్లతో పోలిస్తే బ్యాంకులు చెల్లించాల్సిన నిర్వహణ, లావాదేవీల రుసుములు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బ్యాంకులకు ఆర్థికంగా లాభదాయకం.ప్రాసెసింగ్, భద్రతలావాదేవీలు దేశీయంగా ప్రాసెస్ అవ్వడంతో వీసా లేదా మాస్టర్ కార్డ్ నెట్వర్క్ల ద్వారా జరిగే లావాదేవీల కంటే రూపే లావాదేవీలు వేగంగా పూర్తవుతాయి. రూపే లావాదేవీలకు సంబంధించిన కస్టమర్ డేటా, లావాదేవీల వివరాలు భారతదేశంలోనే నిల్వ చేస్తారు. ఈ డేటా లోకలైజేషన్ విధానం వల్ల రూపే మరింత సురక్షితమైనదని భావిస్తున్నారు.ప్రభుత్వ ప్రోత్సాహకాలురూపే డెబిట్ కార్డులు తక్కువ విలువ గల భీమ్-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోంది. ఇది బ్యాంకులు, వ్యాపారులు రూపే వినియోగాన్ని పెంచేందుకు దోహదపడుతుంది.రూపే ప్రత్యేకంగా అందిస్తున్న సేవలురూపే ఇటీవల ప్రవేశపెట్టిన అత్యంత ముఖ్యమైన సేవల్లో యూపీఐ లింక్ చేసుకునే వీలుండే క్రెడిట్ కార్డులు ఒకటి.రూపే క్రెడిట్ కార్డులను నేరుగా యూపీఐ యాప్లతో లింక్ చేసి స్కాన్ చేసి చెల్లింపు చేసుకోవచ్చు. ఇది క్రెడిట్ కార్డు వినియోగాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. ఎందుకంటే వీసా/ మాస్టర్ కార్డ్లకు ఈ సదుపాయం ఇంకా అందుబాటులో లేదు.రూపే ప్లాటినం, సెలెక్ట్ వంటి ప్రీమియం కార్డులు దేశీయ విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ను అందిస్తాయి. ఇది దేశంలో తరచుగా ప్రయాణించే వారికి ఒక అదనపు ప్రయోజనం.కొన్ని రూపే కార్డులు పెట్రోల్ పంపుల్లో ఇంధనం కొనుగోలుపై సర్ఛార్జ్ మినహాయింపులను అందిస్తున్నాయి.రూపే ఏటీఎం, POS (పాయింట్ ఆఫ్ సేల్) లావాదేవీల కోసం ప్రత్యేక భద్రతా ప్రమాణాలను, రూపే పేసెక్యూర్(RuPay PaySecure) అనే ఈ-కామర్స్ పరిష్కారాన్ని కలిగి ఉంది. ఇది దేశీయ ఆన్లైన్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తుంది.ఇదీ చదవండి: మొదటి స్వదేశీ డ్రైవర్లెస్ కారు ఆవిష్కరణ! - 
      
                   
                                                     
                   
            ఎన్విడియా విశ్వరూపం.. దేశాల జీడీపీలనే మించి..
యుఎస్ చిప్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) కొత్త మైలురాయిని తాకింది. 5 ట్రిలియన్ డాలర్ల (రూ.442 లక్షల కోట్లు) మార్కెట్ విలువను చేరుకున్న ప్రపంచంలోని మొదటి సంస్థగా నిలిచింది. సాధారణ గ్రాఫిక్స్-చిప్ డిజైనర్ నుండి ప్రారంభమైన ఎన్విడియా అనతి కాలంలోనే ఏఐ టైటాన్గా ఎదిగింది. పెరుగుతున్న ఏఐ బూమ్ దాని చిప్స్ కోసం డిమాండ్ను పెంచుతోంది. ఎన్విడియా స్టాక్స్ను రికార్డు గరిష్టాలకు నడిపిస్తోంది.ఎన్విడియా కంపెనీ 2023 జూన్లో మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకుంది. తర్వాత వేగంగా పెరుగుతూ మూడు నెలల క్రితం 4 ట్రిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్కును తాకింది. ఈ చిప్ మేకర్ షేర్ ధర బుధవారం (అక్టోబర్ 29) ఉదయం 5.6% పెరిగి 212 డాలర్లకు చేరుకుంది. చైనాలో ఎన్విడియా అమ్మకాల గురించి మదుపరుల్లో ఆశావాదం ఈ పెరుగుదలకు కారణమైంది.ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచిన ఎన్విడియా.. ఏఐ వ్యయ కేళిలో అతిపెద్ద విజేతగా అవతరించింది. సాంకేతిక రంగంలో ప్రత్యర్థులను అధిగమించింది. అనేక ఏఐ కంపెనీలకు ఎన్విడియా చిప్లే మూలం కావడంతో ఓపెన్ ఏఐ, ఒరాకిల్తో సహా ప్రముఖ ఏఐ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.దేశాల జీడీపీలను మించిన మార్కెట్ విలువప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం.. ఎన్విడియా మార్కెట్ విలువ ఇప్పుడు యూఎస్, చైనా మినహా ప్రతి దేశం జీడీపీనీ మించిపోయింది. అలాగే యూఎస్ స్టాక్ మార్కెట్లోని ఎస్అండ్పీ 500 సూచీలో మొత్తం రంగాల విలువ కంటే ఎక్కువ.మైక్రోసాఫ్ట్, యాపిల్ కూడా ఇటీవల 4ట్రిలియన్ డాలర్ల విలువ మార్కును దాటాయి. ఏఐ ఖర్చు గురించి వాల్ స్ట్రీట్ లో పెరుగుతున్న ఆశావాదంతో విస్తృత టెక్ ర్యాలీని బలోపేతం చేశాయి. ఈ సంవత్సరం అమెరికన్ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన లాభాలు గడించిన సంస్థల్లో ఏఐ-సంబంధిత సంస్థలే 80% వాటాను కలిగి ఉన్నాయి.ఇదీ చదవండి: అదానీ గ్రూప్ షేర్లదే అదృష్టం! - 
      
                   
                                                     
                   
            మొదటి స్వదేశీ డ్రైవర్లెస్ కారు ఆవిష్కరణ!
భారతదేశంలో డ్రైవర్లెస్ కారు.. ఇదేదో అంతర్జాతీయ కంపెనీ తయారు చేసిన కారు అనుకుంటే పొరపడినట్లే. టెక్నాలజీ, ఆవిష్కరణల్లో భారత్ దూసుకుపోతోందనడానికి నిదర్శనంగా ఇటీవల దేశీయంగా డ్రైవర్లెస్ కారు ఆవిష్కరించారు. విరిన్(WIRIN) ప్రాజెక్ట్ పేరుతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro), ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (RVCE) సంయుక్తంగా మొట్టమొదటి స్వదేశీ డ్రైవర్లెస్ కారు(Driverless Car)ను ఆవిష్కరించారు.సాధారణ ట్రాఫిక్ నిబంధనలు సరిగా లేని ఇరుకైన, గుంతలతో నిండిన భారతీయ రోడ్లకు అనుగుణంగా అటానమస్ వాహనాన్ని రూపొందించడం పెద్ద సవాలు. ఈ కారు ఆవిష్కరణ భారతదేశపు రవాణా వ్యవస్థలో సురక్షితమైన, సమర్థవంతమైన మొబిలిటీ పరిష్కారాల వైపు ఒక ముఖ్యమైన ముందడుగుగా కొందరు భావిస్తున్నారు.ప్రత్యేకతలివే..విదేశీ అటానమస్ వాహనాలు భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారు చేసేవి కావు. కానీ ఈ కొత్త కారును దేశీ రోడ్ల నిర్మాణానికి అనువుగా తయారు చేశారు.రోడ్డుపై ఉంటే గుంతలు, ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా గుర్తించి, అందుకు అనువుగా స్పందించేలా రూపొందించారు.ఈ WIRIN ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్లో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ వాహనం అడ్వాన్స్డ్ సెన్సార్ల సహాయంతో రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, పాదచారులు, ఇతర అడ్డంకులను గుర్తించి, సురక్షితంగా ప్రయాణించగలదని తయారీదారులు తెలిపారు.ఈ డ్రైవర్లెస్ కారు రూపకల్పనకు ఆరేళ్లు సమయం పట్టింది. దీన్ని అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి తయారు చేశారు. ఈ ప్రాజెక్ట్ 2019లో విప్రో, ఐఐఎస్సీ మధ్య సహకారంతో మొదలైంది. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థుల బృందం ఇంజినీరింగ్, రూపకల్పన సహాయాన్ని అందించింది. అటానమస్ డ్రైవింగ్ కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ ట్రాఫిక్ నమూనాల నుంచి నిరంతరం నేర్చుకునేలా మెషిన్ లెర్నింగ్ వ్యవస్థను తీర్చిదిద్దారు. కెమెరాలు, సెన్సార్ల నుంచి వచ్చే దృశ్య డేటాను విశ్లేషించి పరిసరాలను అర్థం చేసుకునేలా విజువల్ కంప్యూటింగ్ను ఉపయోగించారు.🚨 India’s first driverless car has been unveiled by IISc, Wipro, and RV College in Bengaluru. pic.twitter.com/AlnNvnAPkc— Indian Tech & Infra (@IndianTechGuide) October 30, 2025ఈ వాహనం ప్రస్తుతం పరీక్ష దశలో(Testing Phase) ఉంది. పరిశోధకులు భారతీయ రోడ్ పరిస్థితులను పూర్తిగా మ్యాపింగ్ చేసి అధ్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్వదేశీ డ్రైవర్లెస్ టెక్నాలజీని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని ఈ బృందం లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: యూఎస్లో ఈఏడీ ఆటోమెటిక్ పొడిగింపు రద్దు - 
      
                   
                                                     
                   
            యూఎస్లో ఈఏడీ ఆటోమెటిక్ పొడిగింపు రద్దు
అమెరికాలో వలస కార్మికుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన కీలక నిబంధనను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిలిపివేసింది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇది అమెరికాలోని ప్రవాస శ్రామిక శక్తిలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులతో సహా వేలాది మంది విదేశీ సిబ్బందిపై, ముఖ్యంగా H-4 వీసాదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన ఈ ప్రకటన ప్రభావం అక్టోబర్ 30, 2025 (గురువారం) లేదా ఆ తర్వాత తమ ఈఏడీను రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే సిబ్బందిపై పడనుంది. ఇకపై స్వయంచాలకంగా(ఆటోమెటిక్గా) ఈఏడీ పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. నిర్దిష్ట తేదీకి ముందే దాఖలు చేయబడిన దరఖాస్తుల ఈఏడీని పొడిగించనున్నట్లు చెప్పారు.ఈఏడీ అంటే..అమెరికాలో పనిచేయడానికి అనుమతులున్న వలసదారులకు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జారీ చేసే పత్రం. దీన్ని సాధారణంగా ఫారం I-766 / EAD కార్డు అంటారు. ఈ కార్డు ఒక నిర్దిష్ట కాల వ్యవధి కోసం యూఎస్లో పనిచేయడానికి ఒక వ్యక్తికి అనుమతి ఉన్నట్లు నిరూపించడానికి ఉపయోగపడుతుంది.జాతీయ భద్రతే లక్ష్యంగతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లోని విధానం ప్రకారం సకాలంలో రెన్యువల్ దరఖాస్తు చేసుకుని, ఈఏడీ అర్హత కలిగి ఉన్నట్లయితే వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు పనిచేయడానికి అనుమతించేవారు. అయితే, కొత్త నిబంధనతో జాతీయ భద్రతను పరిరక్షించడానికి మరింత తనిఖీలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అందులో భాగంగానే ఈమేరకు యూఎస్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వలసదారులు తమ ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సిఫార్సు చేస్తున్నారు.ఇదీ చదవండి: నేటి నుంచి స్టార్లింక్ సర్వీసుల డెమో - 
      
                   
                                                     
                   
            బంగారం జాక్పాట్! తులం ఎంతకు తగ్గిందంటే..
పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుదల బాట పట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు కూడా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) - 
      
                   
                                                     
                   
            400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 132 పాయింట్లు తగ్గి 25,920కు చేరింది. సెన్సెక్స్(Sensex) 414 పాయింట్లు నష్టపోయి 84,583 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) - 
      
                   
                                                     
                   
            నేటి నుంచి స్టార్లింక్ సర్వీసుల డెమో
స్టార్లింక్ అక్టోబర్ 30 (నేడు), 31న తమ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల సెక్యూరిటీ, సాంకేతిక ప్రమాణాల పరీక్షలను ముంబైలో నిర్వహించనుంది. కంపెనీకి ప్రొవిజనల్గా కేటాయించిన స్పెక్ట్రం ఆధారంగా ప్రభుత్వ ఏజెన్సీల సమక్షంలో వీటిని నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్లో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభించేందుకు స్టార్లింక్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.స్టార్లింక్కు సంబంధించి కొన్ని అంశాలు..ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్గా ఉండొచ్చు.మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు.వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.హార్డ్ వేర్ కిట్లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.ఇంటర్నెట్ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్టెల్, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.2025 చివరి నాటికి భారత్లో ఈ సర్వీసులు లాంచ్ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ‘ఆదాయపన్ను తగ్గించాలి’ - 
      
                   
                                                     
                   
            ‘ఆదాయపన్ను తగ్గించాలి’
ఆదాయపన్ను భారాన్ని గణనీయంగా తగ్గించాలని, 30% గరిష్ట పన్ను రేటును రూ.50 లక్షలకు మించిన ఆదాయానికే వర్తింపజేయాలని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ) కేంద్రాన్ని కోరింది. వ్యక్తులు, పార్ట్నర్షిప్ సంస్థలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లకు సంబంధించి ఈ సూచన చేసింది. రూ.30 లక్షల వరకు ఆదాయంపై పన్ను 20% మించకూడదని, రూ.30–50 లక్షల ఆదాయంపై 25%గా ఉండాలని కోరింది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.24 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు అమల్లో ఉంది. అదే పాత పన్ను విధానంలో రూ.10 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాలి. బడ్జెట్కు ముందు పీహెచ్డీసీసీఐ తమ సూచనలను కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్ శ్రీవాస్తవకు సమర్పించింది.ఆదాయం తగ్గదు..‘‘కార్పొరేట్ పన్నును సర్చార్జీ 35% నుంచి 25 శాతానికి తగ్గించినప్పటికీ.. 2018–19లో రూ.6.63 లక్షల కోట్ల పన్ను ఆదాయం కాస్తా 2024–25 నాటికి రూ.8.87 లక్షల కోట్లకు పెరిగింది. మోస్తరు పన్ను రేట్ల వల్ల నిబంధనల అమలు పెరుగుతుంది. ఇది మరింత ఆదాయానికి దారితీస్తుంది’’అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వ్యక్తులకు 30 % గరిష్ట పన్నుకు సర్చార్జీ 5–25 శాతం కలుపుకుని చూస్తే నికర పన్ను రేటు కొన్ని కేసుల్లో 39 % వరకు వెళుతున్నట్టు తెలిపింది. ఆదాయంలో 40 శాతం ప్రభుత్వానికే వెళుతోందని, దీంతో స్వీయ వినియోగానికి 60 శాతమే మిగులుతున్నట్టు పేర్కొంది.ఇదీ చదవండి: వేతనాలు.. అమెరికాలో పెరుగుదల Vs భారత్లో తగ్గుదల - 
      
                   
                                                     
                   
            బ్రోకరేజీ, ఏఎంసీ చార్జీల్లో కోత!?
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు /ఏఎంసీలు) ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీలు (ఎక్స్పెన్స్ రేషియో), బ్రోకరేజీ చార్జీలపై సెబీ కీలక మార్పులను ప్రతిపాదించింది. క్యాష్ మార్కెట్ లావాదేవీలపై బ్రోకరేజీ చార్జీ ఇప్పటివరకు గరిష్టంగా 12 బేసిస్ పాయింట్లకు అనుమతి ఉండగా, 2 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. డెరివేటివ్స్కు బేసిస్ పాయింట్ల గరిష్ట పరిమితిని ఒక బేసిస్ పాయింట్కు కుదించింది.ఇక ప్రతీ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిదారుల నుంచి ఏఎంసీలు టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) వసూలు చేస్తుంటాయి. అయితే, బ్రోకరేజీ, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీసీ), జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ వంటి చార్జీలు ఇప్పటి వరకు టీఈఆర్లో కలసి ఉంటుండగా, ఇకపై వీటిని విడిగా చూపించాల్సి ఉంటుంది. దీనివల్ల అసలు పెట్టుబడుల నిర్వహణపై ఎంత చార్జీ పడుతుందో ఇన్వెస్టర్లకు తెలుస్తుందన్నది సెబీ ఉద్దేశం.టీఈఆర్ గరిష్ట పరిమితిలోనూ 15–20 బేసిస్ పాయింట్లను తగ్గించాలన్నది మరొక ప్రతిపాదన. పనితీరు ఆధారిత టీఈఆర్ను కూడా ప్రతిపాదించింది. 2018లో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 5 బేసిస్ పాయింట్ల మేర అదనంగా వసూలు చేసుకునేందుకు సెబీ అనుమతించింది. ఇప్పుడు దీన్ని తొలగించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై సూచనలకు సెబీ ఆహ్వానించింది.ఇన్వెస్టర్లకు ప్రయోజనంసెబీ ప్రతిపాదనలతో ఇన్వెస్టర్లకు వ్యయాలు తగ్గి, రాబడులు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘బ్రోకరేజీ చార్జీలను క్రమబద్ధీకరించడం వల్ల ఇన్వెస్టర్లు పరిశోధన, అడ్వైజరీల కోసం రెట్టింపు చెల్లించాల్సిన అవసరం తప్పుతుంది’’అని ఆనంద్రాఠీ వెల్త్ జాయింట్ సీఈవో ఫెరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ, ఎస్టీటీ, స్టాంప్ డ్యూటీలను టీఈఆర్లో కాకుండా విడిగా పేర్కొనడం వల్ల వివిధ పథకాల మధ్య అసలు వ్యయాలు ఎంతన్నది పోల్చుకోవడం సులభం అవుతుందన్నారు. ‘‘నికరంగా ఇన్వెస్టర్లకు టీఈఆర్ తగ్గుతుంది. దీంతో రాబడులు అధికం కావడం వల్ల అదనపు ప్రయోజనం పొందుతారు’’అని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ బగ్లా తెలిపారు.ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు - 
      
                   
                                                     
                   
            ఐపీవోకి బోట్.. సెబీకి డీఆర్హెచ్పీ దాఖలు
వేరబుల్స్ బ్రాండ్ ‘బోట్’ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి సంబంధించి అప్డేట్ చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను (యూడీఆర్హెచ్పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. దీని ప్రకారం కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 1,000 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు.తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 225 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రూ. 150 కోట్ల మొత్తాన్ని బ్రాండ్..మార్కెట్ వ్యయాల కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది. 2013లో అమన్ గుప్తా, సమీర్ మెహతా ప్రారంభించిన బోట్ సంస్థ ఆడియో పరికరాలు, స్మార్ట్ వేరబుల్స్, మొబైల్ యాక్సెసరీలు మొదలైనవి విక్రయిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 60 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూ కోసం బోట్ ప్రయత్నించడం ఇది రెండోసారి. రూ. 2,000 కోట్ల ఐపీవో కోసం 2022 జనవరిలో ముసాయిదా పత్రాలు సమర్పించింది. అప్పట్లో రూ. 900 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేసేట్లు, ఓఎఫ్ఎస్ కింద రూ.1,100 కోట్ల షేర్లు విక్రయించేట్లు ప్రతిపాదించింది.ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు - 
      
                   
                                                     
                   
            ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు పరపతి సమీక్షను చేపట్టిన యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) ఈ ఏడాది రెండోసారి వడ్డీ రేట్లలో కోతకు మొగ్గుచూపింది.సెప్టెంబర్లో నిర్వహించిన గత సమావేశంలో ఎఫ్వోఎంసీ.. 2024 డిసెంబర్ తదుపరి మళ్లీ ఫండ్స్ రేట్లను 0.25 శాతంమేర తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకూ ఫెడ్ ఫండ్స్ రేట్లు 4–4.25 శాతంగా అమలవుతున్నాయి. కాగా.. సెప్టెంబర్ చివరికల్లా వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 3 శాతానికి బలపడగా.. ఆగస్ట్లో నిరుద్యోగిత 4.3 శాతానికి పెరిగింది. మరోపక్క ప్రభుత్వ షట్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫెడ్ తాజా సమీక్షలో మరో పావు శాతం వడ్డీ రేటు కోతకే మొగ్గుచూపినట్లు ఆర్థికవేత్తలు విశ్లేషించారు.ఇదీ చదవండి: వేతనాలు.. అమెరికాలో పెరుగుదల Vs భారత్లో తగ్గుదల - 
      
                   
                                                     
                   
            భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ముంబై: స్థిరమైన సంస్కరణలు, ఆర్థిక బలాలతో భారత్ భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్గుప్తా అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడారు. రూపాయి మారకం విలువ అన్నది మార్కెట్ ఆధారితమని పేర్కొన్నారు. ‘‘బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్లో వైవిధ్యం మనకున్న బలం. కరెంట్ ఖాతాలో వస్తు వాణిజ్య లోటును సేవల ఎగుమతులు భర్తీ చేస్తున్నాయి. మొత్తం మీద కరెంట్ ఖాతా బలంగా ఉంది’’అని పూనమ్ గుప్తా పేర్కొన్నారు. కరోనా విపత్తు వంటి సందర్భాలను మినహాయిస్తే మిగిలిన కాలాల్లో భారత్ ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. విధానపరమైన సంస్కరణలతో జీడీపీలో తలసరి ఆదాయ వృద్ధి వేగాన్ని అందుకున్నట్టు తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు ప్రపంచంలోనే గరిష్ట స్థాయిలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సమీప కాలానికి సైతం వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నట్టు తెలిపారు. - 
      
                   
                                                     
                   
            అయిదేళ్లలో 8 ఎస్యూవీలు
టోక్యో: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విభాగంలో మళ్లీ 50 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవడంపై ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో ఎనిమిది ఎస్యూవీలను ప్రవేశపెట్టనుంది. దీంతో మొత్తం మోడల్స్ శ్రేణి 28కి చేరుతుంది. జపాన్ మొబిలిటీ షోను సందర్శిస్తున్న భారతీయ విలేఖరులకు సుజుకీ మోటర్ కార్పొరేషన్ రిప్రజెంటేటివ్ డైరెక్టర్ తొషిహిరో సుజుకీ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో మారుతీ సుజుకీ మార్కెట్ వాటా సుమారు 39 శాతంగా నమోదైంది. దీన్ని 50 శాతానికి పెంచుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో అగ్రస్థానం దక్కించుకునే లక్ష్యాలకు కంపెనీ కట్టుబడి ఉన్నట్లు సుజుకీ వివరించారు. ఇందుకోసం వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుకుంటున్నట్లు చెప్పారు. 2030–31 నాటికి రూ. 70,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించినట్లు చెప్పారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్జీ సహా అన్ని రకాల కార్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. బయోగ్యాస్ ఆధారిత వాహనాలను కూడా ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నామని, గుజరాత్లో తొమ్మిది బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయని సుజుకీ చెప్పారు. యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దన్నుతో యూరోపియన్ దేశాలకి ఎగుమతులకు భారత్ హబ్గా మారగలదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తమ కార్ల ఎగుమతులు 4 లక్షల యూనిట్లకు చేరగలవని సుజుకీ తెలిపారు. ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో ఇప్పటికే రెండు లక్షల యూనిట్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2024లో కంపెనీ రికార్డు స్థాయిలో 3.3 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. - 
      
                   
                                                     
                   
            ఎఫ్డీఐల్లో అమెరికా, సింగపూర్ టాప్
ముంబై: గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారత్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్డీఐ) మూడో వంతు వాటాతో అమెరికా, సింగపూర్ అగ్రస్థానంలో నిల్చాయి. మొత్తం రూ. 68,75,931 కోట్ల ఎఫ్డీఐలు రాగా అమెరికా వాటా 20 శాతంగా, సింగపూర్ది 14.3 శాతంగా ఉంది. మారిషస్ (13.3 శాతం), బ్రిటన్ (11.2 శాతం), నెదర్లాండ్స్ (9 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఫారిన్ లయబిలిటీస్, అసెట్స్ (ఎఫ్ఎల్ఏ)పై రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన వార్షిక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 45,702 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో 41,517 సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్స్లో ప్రస్తావించాయి. ఇందులో నాలుగింట మూడొంతుల సంస్థలు విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. మార్కెట్ వేల్యూ ప్రకారం మొత్తం ఎఫ్డీఐ ఈక్విటీ పెట్టుబడుల్లో తయారీ రంగం అత్యధిక వాటా దక్కించుకోగా, సర్వీసుల రంగం రెండో స్థానంలో నిల్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీఐల పరిమాణం రూ. 61,88,243 కోట్లుగా నమోదైంది. మరోవైపు, తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో చేసిన ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం రూ. 11,66,790 కోట్లుగా నమోదైంది. ఇందులో సింగపూర్ వాటా 22.2 శాతంగా, అమెరికా వాటా 15.4 శాతంగా ఉంది. బ్రిటన్ (12.8 శాతం), నెదర్లాండ్స్ (9.6 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. - 
      
                   
                                                     
                   
            రూ.కోటితో ఉల్లాసంగా విశ్రాంత జీవనం
న్యూఢిల్లీ: పదవీ విరమణ (రిటైర్మెంట్) తర్వాత సౌకర్యవంతమైన జీవనానికి రూ.కోటి సరిపోతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ప్రతి పది మందికి గాను ఏడుగురు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే విశ్రాంత జీవన అవసరాలకు ఎంత నిధి కావాలన్న విషయమై ఇప్పటికీ అవగాహనన తక్కువగానే ఉందని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం ‘ఐరిస్ 5.0’లో తెలిసింది. → ఐరిస్ ఇండెక్స్ స్కోరు 2022లో 44గా ఉంటే 2025లో 48కి చేరింది. ఈ సూచీ రిటైర్మెంట్ సన్నద్ధతను సూచిస్తుంది. నిజానికి గతేడాది 49 పాయింట్ల స్థాయిలో ఉండగా, అక్కడి నుంచి ఒక పాయింట్ తగ్గినట్టు తెలుస్తోంది. → ఆరోగ్యపరమైన సన్నద్ధత మెరుగుపడింది. పదవీ విరమణానంతరం సురక్షిత జీవనానికి ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. → 25–65 ఏళ్ల వసులోని 2,242 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. వీరిలో 50 శాతం మంది వేతన జీవులు కాగా, మిగిలిన వారు స్వయం ఉపాధిపై ఆధారపడి ఉన్నారు. → ఆర్జన ఆరంభమైన వెంటనే లేదా 35 ఏళ్లలోపే రిటైర్మెంట్ ప్రణాళిక మొదలు కావాలని 50 శాతం మంది చెప్పారు. → తమ విశ్రాంత జీవన ప్రణాళికను ఎలా ఆరంభించాలన్న దానిపై కొందరు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. వీరికి విశ్వసనీయమైన సలహాలు అవసరమని ఈ సర్వే పేర్కొంది. ‘‘వివేకమైన, సమగ్రమైన పదవీ విరమణ ప్రణాళిక వైపు స్పష్టమైన మార్పును ఐరిస్ 5.0 సూచిస్తోంది. ఆరోగ్యం పట్ల నేడు మంచి అవగాహన పెరుగుతోంది. ఉత్పత్తులపై అవగాహన, స్థిరమైన ఆర్థిక విశ్వాసం కనిపిస్తోంది’’అని యాక్సిస్ మ్యాక్స్లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుమిత్ మదన్ తెలిపారు. - 
      
                   
                                                     
                   
            భారత్ వస్తున్న రష్యా చమురు నౌక యూటర్న్!
రష్యా చమురుపై అమెరికా ఆంక్షల నడుమ రష్యా నుంచి ముడి చమురును తీసుకుని భారత్ వస్తున్న నౌక అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుంది. షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. 'ఫ్యూరియా' అనే ఈ పెద్ద నౌక మంగళవారం డెన్మార్క్, జర్మనీ మధ్య మార్గం ద్వారా భారత్ వైపు వెళుతోంది. ఈ ఓడ రష్యా ప్రభుత్వ చమురు సంస్థ రోస్ నెఫ్ట్ విక్రయించిన చమురును తీసుకువెళుతోంది.రష్యా చమురు కంపెనీలు రోస్ నెఫ్ట్, లుకోయిల్లను అమెరికా బ్లాక్ లిస్ట్ చేసిన వారం తర్వాత ఈ యూ-టర్న్ సంఘటన జరిగింది. ఈ రెండు కంపెనీలపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ అక్టోబర్ 22న ఆంక్షలు విధిస్తూ కంపెనీలు, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.కాగా బ్లూమ్బర్గ్ ప్రకారం.. ఫ్యూరియా ట్యాంకర్ అక్టోబర్ 20న రష్యాలోని బాల్టిక్ నౌకాశ్రయమైన ప్రిమోర్స్క్ నుండి సుమారు 7,30,000 బ్యారెళ్ల చమురును లోడ్ చేసుకుని బయలుదేరింది. తొలుత రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం ఉపయోగిస్తున్న గుజరాత్లోని సిక్కా పోర్ట్ను ఈ నౌక తన గమ్యస్థానాన్ని ప్రకటించింది. ఈ నౌక నవంబర్ మధ్యలో భారత్ చేరుకుంటుందని భావించారు.తరువాత, నౌక తన గమ్యాన్ని ఈజిప్టులోని పోర్ట్ సైద్కు మార్చింది. రష్యా నుండి భారత్కు వేగవంతమైన మార్గం సూయజ్ కాలువ గుండా ఉంటుంది. కాబట్టి నౌకలు తరచుగా సూయజ్ కాలువ గుండా వెళ్లే ముందు పోర్ట్ సైద్ను తమ గమ్యస్థానంగా ప్రకటిస్తుంటాయి.అయితే ఈ ఫ్యూరియా నౌక వయస్సు కూడా సమస్య కావొచ్చు. ఫ్యూరియా ట్యాంకర్ను ఇప్పటికే యూరోపియన్ యూనియన్, యూకే నిషేధించాయి. ఈ ట్యాంకర్కు ఈ ఏడాది 23 ఏళ్లు నిండుతాయి. చమురు ట్యాంకర్ల సాధారణ పరిమితి 18 సంవత్సరాలు. అంతేకాకుండా డెన్మార్క్తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పుడు తమ జలాల గుండా వెళుతున్న పాత ట్యాంకర్ల తనిఖీలను ముమ్మరం చేశాయి. - 
      
                   
                                                     
                   
            అదానీ గ్రూప్ షేర్లదే అదృష్టం!
అదానీ గ్రూపు సంస్థల షేర్లు మెరుపులు మెరిపించాయి. ఒక్కరోజులో దాదాపు రూ.40వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను పెంచుకున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ నాయకత్వంలోని కీలక గ్రూప్ కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు మదుపరుల ఉత్సాహాన్ని పెంచాయి. పునరుత్పాదక, ఇంధన రంగాల ఫ్లాగ్షిప్ సంస్థల ప్రదర్శనతో ప్రేరణ పొందిన ఈ ర్యాలీ, గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీల్లో విస్తృత స్థాయి పెరుగుదలకు దారి తీసింది.అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఒక్కరోజులో రూ.14,521 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదలకను సాధించింది. బీఎస్ఈలో కంపెనీ షేర్లు 14% పెరిగి రూ.1,145 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి, రూ.1,113.05 వద్ద ముగిశాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 111% పెరిగి రూ.583 కోట్లకు చేరుకోగా, మొత్తం ఆదాయం 4% తగ్గి రూ.3,249 కోట్లుగా నమోదైంది.అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎనర్జీస్తో జాయింట్ వెంచర్) షేర్లు 8.7% పెరిగి రూ.675 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి, రూ.634.50 వద్ద ముగిశాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.1,468 కోట్ల మేర పెరిగింది. ఇక ఈ కంపెనీ త్రైమాసిక నికర లాభం ఏడాది ప్రాతిపదికన 9% తగ్గినప్పటికీ, ఇన్పుట్ గ్యాస్ ఖర్చులు 26% పెరగడం వల్ల వచ్చిన ఒత్తిడిని మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదు.పునరుత్పాదక, గ్యాస్ వ్యాపారాల బాటలోనే ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు కూడా ర్యాలీలో భాగమయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 2% పెరిగి, మార్కెట్ విలువలో రూ.5,592 కోట్లు జోడించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ స్టాక్ 3 శాతం పెరగడంతో రూ.8,500 కోట్ల విలువ జతకలిసింది.అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 5% పెరిగి రూ.5,592 కోట్ల విలువను చేర్చుకుంది.ఇక అంబుజా సిమెంట్స్ రూ.4,041 కోట్లు, ఏసీసీ లిమిటెడ్ రూ.261 కోట్లు, అదానీ విల్మార్ రూ.936 కోట్లు, ఎన్డీటీవీ రూ.33 కోట్లు, సంఘి ఇండస్ట్రీస్ రూ.32 కోట్లు మార్కెట్ విలువ పెరుగుదల నమోదు చేశాయి. మొత్తం మీద, బుధవారం ఒక్క రోజులో అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.39,640 కోట్ల మేర పెరిగింది. - 
      
                   
                                                     
                   
            ‘ఆ భయంతోనే ఇంకా పేదలవుతున్నారు’
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి బిట్కాయిన్పై తన విశ్వాసాన్ని ‘రెట్టింపు’ చేశారు. క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ విలువ ఈ ఏడాది రెట్టింపు అవుతుందని, బహుశా 2 లక్షల డాలర్లకు చేరవచ్చని అంచనా వేశారు. అలాగే ఎందుకు చాలామంది నష్టాల్లోనే మిగిలిపోతున్నారన్నది కూడా వివరించారు.రాబర్ట్ కియోసాకి బిట్ (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో మరో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘బిట్ కాయిన్ ధర ఈ సంవత్సరం రెట్టింపు కావచ్చు.. బహుశా 2 లక్షల డాలర్లకు చేరవచ్చు’, ‘నష్టపోతున్నవారు నష్టపోతూనే ఉంటారు ఎందుకంటే వారిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదా "ఈక్యూ" లోపించింది’ అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తన మిత్రునితో జరిగిన వ్యక్తిగత అనుభవాన్ని కియోసాకి పంచుకున్నారు. కొన్నేళ్ల క్రితంఓసారి తన స్నేహితుడికి తన కాయిన్ బేస్ యాప్ను చూపించానని, అదప్పడు అంత మెరుగ్గా లేదని రాసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ అకౌంట్లో లక్షల బిట్ కాయిన్లు (Bitcoin) ఉన్నాయని వివరించారు. అయితే అతనప్పుడు చూడగలిగింది వేలల్లో నష్టాలనే.. కానీ మిలియన్లలో లాభాలను అతను చూడలేకపోయాడని తాను గుర్తించినట్లు రాసుకొచ్చారు.ధనిక, పేద, మధ్యతరగతి మధ్య తేడా అదే..‘ఆ మానసిక భావోద్వేగ వ్యత్యాసమే ధనిక, పేద, మధ్యతరగతి మధ్య కీలకమైన వ్యత్యాసం’ అని కియోసాకి పేర్కొన్నారు. "దీనినే ఈక్యూ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు" అని వివరాంచారు. కియోసాకి అభిప్రాయం ప్రకారం.. "పేదలకు తక్కువ ఈక్యూ ఉంటుంది. వారు భయం అనే భావోద్వేగంలో ఉంటున్నారు". అదే "ధనవంతులకు 'భయం', ఆశ' రెండింటి గురించీ తెలుసు. ఈ రెండు ఈక్యూలు మనందరికీ ఉండేవే. సంపన్నులు, విజేతలు ఈ రెండు ఈక్యూలను గౌరవిస్తారు"."ఈక్యూ.. ఐక్యూ కంటే శక్తివంతమైనది. అందుకే నా ‘పూర్ డాడ్’ వంటి చాలా మంది ఉన్నత విద్యావంతులు కూడా పేదలుగానే గతిస్తున్నారు" అని కియోసాకి ఉదహరించారు. "ఆర్థిక ప్రపంచంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఐక్యూ కంటే ముఖ్యమైనది" అన్నారు.ఇదీ చదవండి: ‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’యు.ఎస్. ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, యూఎస్-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితికి ముందు లిక్విడేషన్ల ద్వారా స్వల్పకాలిక అస్థిరతతో బిట్ కాయిన్ విలువ బుధవారం (అక్టోబర్ 29) 1,13,125 డాలర్ల వద్ద కదులుతున్న నేపథ్యంలో కియోసాకి నుంయి ఈ బుల్లిష్ వ్యాఖ్యలు వచ్చాయి.WHY LOSERS lose:I was showing a friend my coin base app, explaining that a few years ago it was pathetic. Today my app showed my friend I have millions in Bitcoin…. and I think Bitcoin will double in price this year…. Possibly a high of $200k.Although my coin base showed I…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 29, 2025 - 
      
                   
                                                     
                   
            హైదరాబాద్లో మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్
హైదరాబాద్: ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ చెయిన్ మెక్ డోనాల్డ్ తన గ్లోబల్ ఆఫీస్ను హైదరాబాద్లో తెరిచింది. టీ హబ్ సమీపంలో ఏర్పాటైన మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రతిభపై విశ్వాసం, పరిపాలనపై నమ్మకానికి మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ఒక ప్రతీక అన్నారు. మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ కోసం హైదరాబాదును కేంద్రంగా ఎంచుకోవడం తెలంగాణ అద్భుత ప్రతిభకు నిదర్శనం అన్నారు. జీసీసీలకు రాజధానిగా హైదరాబాద్ నిలిచిందన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ మొదలుకొని ఆ తర్వాత పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహా నేతలు దూరదృష్టితో చేపట్టిన చర్యల మూలంగా హైదరాబాద్ కు మరింత బలం చేకూరిందని డిప్యూటీ సీఎం వివరించారు.మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ నాయకత్వ బృందాన్ని, సిబ్బందిని హైదరాబాద్కు స్వాగతించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. 1940లలో మెక్డొనాల్డ్స్ ప్రారంభమైనప్పుడు, అది కేవలం ఆహారం గురించి మాత్రమే కాదు.. పరిమాణం, సామర్థ్యం, అనుసంధానమైన ప్రపంచం అనే భావనకు ప్రతీకగా నిలిచిందన్నారు.మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఈ నూతన కేంద్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న కొత్త పరిణామంలో కీలక అధ్యాయం అని అభివర్ణించారు. గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్ ఇటువంటి అనేక సెంటర్లకు రాజధానిగా మారిందని, వందలాది గ్లోబల్ కేపబిలిటీ హబ్లు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. - 
      
                   
                                                     
                   
            రోజుకు రూ.60 వేలు, నెలకు రూ.10 లక్షలు.. నమ్మేదేనా?
ఆధునిక సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కొన్ని నమ్మశక్యం కానీ సమాచారాలను కూడా ఏఐ సాయంతో అవలీలగా వ్యాప్తి చేస్తున్నారు. అలాంటిదే ఇది.. 24 గంటల్లో రూ.60 వేలు.. ‘నెలకు రూ.10 లక్షలు సంపాదించే పెట్టుబడి పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.నకిలీ వార్తను ఛేదించిన పీఐబీకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గురించి చెబుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీని గురించి పూర్తి అవగాహన లేనివారు ఎటువంటి ధ్రువీకరణ లేకుండానే వ్యాప్తి చేస్తున్నారు. అయితే ఇది ఏఐ మానిప్యులేటెడ్ వీడియో అని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ తేల్చింది.'ఈజీగా రోజువారీ ఆదాయం వచ్చే 'పెట్టుబడి పథకం' కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు అంటూ ఫేస్బుక్లో ఒక వీడియో చలామణిలో ఉంది. ఆర్థిక మంత్రి లేదా భారత ప్రభుత్వం అటువంటి పథకాన్ని ప్రారంభించలేదు లేదా ఆమోదించలేదు" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ‘ఎక్స్’ (ట్విటర్)లో అధికారిక పోస్ట్లో తెలిపింది."అలాంటి త్వరగా ధనవంతులవుతారని చెప్పే ఉచ్చులలో పడకండి! అప్రమత్తంగా ఉండండి. సమాచారం ఇవ్వండి. మీరు షేర్ చేసే ముందు ధృవీకరించుకోండి" అని పీఐబీ తెలిపింది. యూజర్లు అప్రమత్తంగా ఉండటానికి, స్కామ్లను గుర్తించడానికి కొన్ని సూచనలను చేసింది.ఇదీ చదవండి: ‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’ఇలాంటి వీడియోల్లో మాట్లాడుతున్నవారి పెదవుల కదలిక, అసహజమైన వాయిస్ సింక్ గమనించాలి. వీడియోల్లో చూపిస్తున్న తేదీ, బ్యాక్గ్రౌండ్, లోగో వంటివి సరిపోలాయా లేదా అన్నది పరిశీలించాలి. అధికారిక ప్రభుత్వ డొమైన్లు ఎల్లప్పుడూ .gov.in అనే ఎక్స్టెన్షన్తో ముగుస్తాయి. షేర్ చేసేముందు ఆ లింక్లను ధ్రువీకరించుకోవడం అవసరం. 💥 Earn ₹60,000 in 24 hours & ₹10 Lakhs a month! 🚨Sounds tempting❓ 💸 Think Again‼️A video on Facebook falsely shows Union Finance Minister @nsitharaman promoting an 'investment program' that promises easy daily income.#PIBFactCheck ✅❌ FAKE ALERT!👉The video is… pic.twitter.com/QsUkFkrYYW— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2025 - 
      
                   
                                                     
                   
            లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు సానుకూల ప్రపంచ సంకేతాలు, ఆశావాదం మధ్య భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఎగిశాయి. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తారనే వార్తలు కూడా మదుపరుల సెంటిమెంట్ను పెంచాయి.ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 368.97 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 84,977.13 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 117.7 పాయింట్లు లేదా 0.45 శాతం లాభపడి 26,053.9 పాయింట్ల వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.64 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.43 శాతం లాభపడ్డాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ప్రతికూలంగా స్థిరపడ్డాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 2.12 శాతం లాభపడగా, ఎనర్జీ, మెటల్, మీడియా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ లో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఎటర్నల్, మహీంద్రా & మహీంద్రా, మారుతి సుజుకీ, బజాజ్ ఫైనాన్స్ వెనుకబడినవాటిలో అగ్రస్థానంలో ఉన్నాయి. - 
      
                   
                                                     
                   
            అమెరికాలో పెరుగుదల Vs భారత్లో తగ్గుదల
ఒకవైపు అమెరికన్ టెక్ నిపుణుల వేతనాల వృద్ధి పండుగ వాతావరణాన్ని తలపిస్తుంటే, మరోవైపు భారతీయ టెక్ ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ సాంకేతిక రంగంలో ఈ విచిత్రమైన వైరుధ్యం ఏర్పడడానికి కారణాలను కొన్ని సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఒకే పరిశ్రమలో, ఒకే రకమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు రెండు భిన్నమైన వేతన ధోరణులను ఎందుకు ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ పేరోల్ అండ్ కంప్లయన్స్ ప్లాట్ఫామ్ డీల్ (Deel), ఈక్విటీ మేనేజ్మెంట్ సంస్థ కార్టా (Carta) సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ఈ విశ్లేషణకు దారితీసిన ప్రధాన కారణాలను, ముఖ్యంగా అమెరికాలో వేతనాలు పెరగడానికి, భారత్లో వేతన పరిహారం తగ్గడానికి గల అంశాలను పరిశీలిద్దాం.భారత్లో వేతన పరిహారం తగ్గుదలకు కారణాలుభారతీయ టెక్ నిపుణుల వేతనాలు 2025లో భారీగా తగ్గాయి. ఇంజినీరింగ్, డేటా సంబంధిత ఉద్యోగుల సగటు పరిహారం 40% తగ్గి 22,000 డాలర్లకు(సుమారు రూ.19.5 లక్షలు) చేరుకుంది. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం కూడా 23,000కు పడిపోయింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు కింది విధంగా ఉన్నాయి.వేతన పెంపులో ఒత్తిడిభారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సంప్రదాయ వేతన పెరుగుదల ఆశించినంత ఉండడంలేదు. కంపెనీలు ప్రస్తుతం ఈక్విటీ-హెవీ పరిహార నమూనాల (Equity-heavy compensation models) వైపు మొగ్గు చూపుతున్నాయి. టెక్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల మొత్తం పరిహారాన్ని పెంచడానికి ఈక్విటీ-ఆధారిత వేతనం (Equity-based pay) ఒక సాధనంగా మారుతోంది. కొన్ని కంపెనీల్లో టాప్ ఎగ్జిక్యూటివ్ల స్థూల వేతనం తగ్గినా ఈక్విటీ గ్రాంట్లు పెరగడం దీనికి సంకేతం.అధిక టాలెంట్ సప్లైభారతదేశంలో టెక్ గ్రాడ్యుయేట్లు, నైపుణ్యం కలిగిన ఇంజినీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిమాండ్ను మించి సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు వేతనాలపై సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా తక్కువ వేతనాలతో నాణ్యమైన టాలెంట్ను పొందడానికి భారత్ వంటి మార్కెట్లపై దృష్టి పెడుతున్నాయి.అమెరికాలో వేతనాల పెంపునకు కారణాలుభారత్లో వేతనాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ యూఎస్ టెక్ ఉద్యోగుల సగటు జీతాలు 1,22,000 డాలర్ల నుంచి 1,50,000కు పెరిగాయి. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం 1,38,000 వద్ద ఉంది. ఈ పెరుగుదలకు దారితీసిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.అధిక డిమాండ్యూఎస్ మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక రంగాల్లో(AI, మెషిన్ లెర్నింగ్ వంటివి) అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత కారణంగా కంపెనీలు అధిక జీతాలను, ఆకర్షణీయమైన పరిహారాన్ని చెల్లించడానికి సిద్ధపడుతున్నాయి.ఈక్విటీ-ఆధారిత పరిహారంనివేదిక ప్రకారం, ఈక్విటీ ఆధారిత వేతనం ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షిస్తోంది. యూఎస్లోని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యంలో వాటాను (ఈక్విటీ) పెద్ద మొత్తంలో అందిస్తున్నాయి. దీని వల్ల మొత్తం పరిహారం (జీతం + ఈక్విటీ) గణనీయంగా పెరుగుతోంది.ద్రవ్యోల్బణం, జీవన వ్యయంఅమెరికాలో అధిక జీవన వ్యయం, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు తమ ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి వేతనాలను పెంచడం అనివార్యమవుతోంది.ఇదీ చదవండి: తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్పై ప్రభావం ఎంతంటే.. - 
      
                   
                                                     
                   
            ఉపాధిలో సేవల రంగం వాటా 30 శాతం
ఉపాధి కల్పనలో సేవల రంగం 30 శాతంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. అయితే అంతర్జాతీయ సగటు 50 శాతం కంటే తక్కువేనని, నిర్మాణాత్మక పరివర్తన నిదానంగా కొనసాగుతుండడం ఇందుకు కారణమని పేర్కొంది. నిర్మాణాత్మక సంస్కరణలు, సామాజిక భద్రతను వేగవంతం చేయడం, అసంఘటిత రంగ కార్మికుల నమోదును డిజిటైజ్ చేయడం, సంరక్షణ చర్యల ద్వారా సేవల రంగంలో ఉపాధి కల్పనను మరింత పెంచొచ్చని సూచించింది.2011–12 నాటికి ఉపాధి కల్పనలో సేవల రంగం వాటా 26.9 శాతం ఉంటే, 2023–24 నాటికి 29.7 శాతానికి పెరిగినట్టు నీతి ఆయోగ్ తెలిపింది. ముఖ్యంగా గడిచిన ఆరేళ్లలో ఈ రంగంలో 4 కోట్ల ఉపాధి అవకాశాలు ఏర్పడినట్టు తాజా నివేదికలో పేర్కొంది. దేశ ఉపాధి కల్పన వృద్ధికి సేవల రంగం కీలకంగా నిలుస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా దేశ ఉత్పాదకతలో సేవలు సగం వాటా పోషిస్తుంటే, ఉపాధి కల్పన పరంగా మూడింట ఒక వంతులోపే ఉండడాన్ని నీతి ఆయోగ్ ప్రస్తావించింది. అది కూడా ఎక్కువ మంది అసంఘటిత రంగంలో, తక్కువ వేతనాలకు పనిచేస్తున్నట్టు తెలిపింది. వృద్ధికి, ఉపాధి కల్పనకు మధ్య అంతరం దేశ సేవల ఆధారత అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. పట్టణాల్లోనే అధికం..సేవల రంగంలో ఉపాధి పరంగానూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య నెలకొన్న అంతరాన్ని నీతి ఆయోగ్ నివేదిక ఎత్తి చూపింది. పట్టణాల్లో 60 శాతం మంది ఉపాధి పొందుతుంటే, పల్లెల్లో ఇది 20 శాతంగా ఉన్నట్టు తెలిపింది. స్త్రీ–పురుషుల పరంగానూ అంతరం నెలకొందని.. గ్రామీణ మహిళలు 10.5 శాతం మంది సేవల రంగంలో పనిచేస్తుంటే, పట్టణాల్లో 60 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. సేవల రంగంలో ఉద్యోగాల నాణ్యతకు, విద్యార్హతలకు మధ్య అంతరం అధికంగా ఉంటోందని.. ఈ రంగం అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాల కల్పన అవసరమని సూచించింది. పెద్ద రాష్ట్రాల్లో రిటైల్ షాపులు, రవాణా సేవలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయినప్పటికీ ఉత్పాదకత తక్కువగా ఉంటోంది. ఐటీ, ఫైనాన్స్, నిపుణుల సేవలకు దక్షిణాది, పశ్చిమాది రాష్ట్రాలు కేంద్రంగా ఉంటున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అధిక ఉత్పాదకతతో పటిష్టమైన సేవల కేంద్రాలను ఏర్పాటు చేసుకోగలిగినట్టు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాలు తక్కువ విలువ కలిగిన సంప్రదాయ సేవల విభాగాలపై ఆధారపడినట్టు పేర్కొంది. వీటిపై దృష్టి పెట్టాలి..సేవలు అన్నింటినీ సంఘటితం చేయడం, తాత్కాలిక, స్వయం ఉపాధిలోని వారికి సామాజిక భద్రత కల్పించడం, ఎంపిక చేసిన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, మహిళలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల విస్తృతికి డిజిటల్ సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను నీతి ఆయోగ్ నివేదిక సూచించింది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను! తులం ఎంతంటే.. - 
      
                   
                                                     
                   
            వృద్ధి, ఉపాధికి ఎంఎస్ఎంఈలు కీలకం
భారత ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కీలకమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు రుణ వితరణను మరింత బలోపేతం చేయనున్నట్టు చెప్పారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (యూఎల్ఐ), అకౌంట్ అగ్రిగేటర్ కార్యాచరణ, శాండ్బాక్స్ సదుపాయం, నగదు ప్రవాహాల ఆధారిత (ఆదాయం) రుణ సదుపాయం దిశగా తీసుకున్న చర్యలను గుర్తు చేశారు.ఎంఎస్ఎంఈ రంగానికి రుణ వితరణపై ఏర్పాటైన స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ (ఎస్ఏసీ) 30వ సమావేశాన్ని ఉద్దేశించి స్వామినాథన్ మాట్లాడారు. ఫ్లోటింగ్ రేటు (ఎప్పటికప్పుడు మారే) రుణాలను ముందుగా తీర్చివేస్తే చెల్లించాల్సిన చార్జీలను ఎత్తివేసినట్టు చెప్పారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి వెల్లడించాల్సిన సమాచారం విషయంలోనూ నిబంధనలను సడలించినట్టు గుర్తు చేశారు. సామర్థ్యాలను విస్తరించుకోవడం, సంఘటిత ఆర్థిక సంస్థల నుంచి రుణ సాయం పొందే దిశగా సంస్థల్లో నెలకొన్న సమాచార అంతరాన్ని తగ్గించేందుకు ఎంఎస్ఎంఈ సంఘాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.ఇదీ చదవండి: తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్పై ప్రభావం ఎంతంటే.. - 
      
                   
                                                     
                   
            బంగారం ధరల తుపాను! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) - 
      
                   
                                                     
                   
            తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్పై ప్రభావం ఎంతంటే..
Cyclone Montha Impact On Stock Market: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మోంథా తుపాను ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం అర్థరాత్రి తర్వాత నరసాపురం సమీపంలో తీరం దాటిన ఈ తుపాను.. తీర ప్రాంతాన్ని కల్లోలంలో ముంచెత్తింది. ప్రస్తుతం సుమారు రెండు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతుండగా, రాబోయే ఆరు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ పరిణామం భారీ వర్షాలకు దారితీసి, సాధారణ జనజీవనాన్ని, తీరప్రాంత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.పారిశ్రామిక, పోర్ట్లపై ప్రభావంమోంథా ధాటికి తీరప్రాంతంలో లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. బలమైన గాలులు, వర్షాల కారణంగా రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతినడం, వంతెనలు కొట్టుకుపోవడం వంటివి జరిగి రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. ముఖ్యంగా ఓడరేవుల కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవడం వల్ల సరుకుల రవాణాకు (లాజిస్టిక్స్) తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.మోంథా తుపాను కారణంగా విశాఖపట్నం (వైజాగ్) పోర్ట్, మచిలీపట్నం, కాకినాడ పోర్ట్ల్లో షిప్పింగ్, లాజిస్టిక్స్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. తుపాను తీవ్రతను బట్టి పోర్ట్ కార్యకలాపాలు మూడు ప్రధాన అంశాలలో ప్రభావితమవుతాయి.పోర్ట్ కార్యకలాపాల నిలిపివేతతీవ్ర తుపాను హెచ్చరికల నేపథ్యంలో నష్టం జరగకుండా పోర్ట్ అధికారులు తక్షణమే అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తారు. బంగాళాఖాతంలో అలలు తీవ్రంగా ఎగసిపడుతుండటం (2 మీటర్ల ఎత్తు), బలమైన గాలుల కారణంగా నౌకల రాకపోకలు పూర్తిగా రద్దు చేస్తారు. పోర్టులో ఉన్న నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేదా లంగరు వేసి నిలిపేస్తారు.కార్గో నిలిపివేతకంటైనర్లు, బల్క్ కార్గో, ఇతర సరుకులను ఎగుమతి/దిగుమతి చేసే ప్రక్రియలు పూర్తిగా నిలిచిపోతాయి. కాకినాడ పోర్ట్ ఎక్కువగా బల్క్ కార్గో (ముడిసరుకు, వ్యవసాయ ఉత్పత్తులు)ను హ్యాండిల్ చేస్తుంది కాబట్టి, సరుకు పాడయ్యే ప్రమాదం ఉంది.పోర్టులలోని భారీ క్రేన్లు, కన్వేయర్ బెల్ట్లు, ఇతర కార్గో హ్యాండ్లింగ్ పరికరాలు తీవ్రమైన గాలులు, ఉప్పెన వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.సప్లై-చెయిన్ అంతరాయంపోర్ట్ గేట్లు మూసివేయడం, రోడ్డు రవాణా దెబ్బతినడం వల్ల పూర్తి లాజిస్టిక్స్ సరఫరా గొలుసు దెబ్బతింటుంది. తుపాను ప్రభావంతో రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతినడం లేదా వరదలకు గురికావడం వల్ల పోర్ట్ నుంచి లోతట్టు ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాల నుంచి పోర్ట్లకు సరుకుల రవాణా పూర్తిగా ఆగిపోతుంది. దీనివల్ల ఎగుమతి చేసేందుకు సరుకు పోర్టుకు చేరదు, దిగుమతి సరుకు బయటకు వెళ్లదు.స్టోరేజ్ సమస్యలుపోర్ట్ టెర్మినల్స్లో లేదా చుట్టుపక్కల నిల్వ ఉన్న కంటైనర్లు, వ్యవసాయ ఉత్పత్తులు (మచిలీపట్నం, కాకినాడ పోర్ట్లలో) నీటిలో మునిగి లేదా గాలులకు పడిపోయి నష్టపోతాయి. దీనివల్ల సరుకు యజమానులకు భారీ నష్టం వాటిల్లుతుంది. పోర్ట్ కార్యకలాపాలు సాధారణ స్థితికి రావడానికి, రవాణా మార్గాలను పునరుద్ధరించడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. దీనివల్ల సరఫరా గొలుసులో ఆలస్యం ఏర్పడి, పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడవచ్చు.ఆర్థిక, దీర్ఘకాలిక ప్రభావాలుపోర్ట్ కార్యకలాపాల నిలిపివేత వల్ల ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. ప్రతి పోర్ట్లో రోజువారీ కార్యకలాపాల విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుంది. ఈ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ఆయా పోర్ట్లకు, కస్టమ్స్ రెవెన్యూకు భారీ నష్టం వాటిల్లుతుంది. తుపాను వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను (డాక్స్, జెట్టీలు, రోడ్లు), క్రేన్లను మరమ్మతు చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. పోర్ట్ టెర్మినల్స్, నౌకలు, సరుకుపై (కార్గో) నష్ట పరిహారం కోసం భారీగా బీమా క్లెయిమ్లు పెరుగుతాయి.మౌలిక సదుపాయాలుమోంథా తుపాను వల్ల భారీ గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, టవర్లు, టెలిఫోన్ లైన్లు కూలిపోయి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. తాగునీటి సరఫరా వ్యవస్థలు కలుషితం కావచ్చు. పారిశ్రామిక భవనాలు, గిడ్డంగులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వీటితోపాటు తీర ప్రాంతంలోని వైజాగ్ ఎయిర్పోర్ట్ ద్వారా రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ, దేశీయ విమాన ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. కోస్తా జిల్లాల్లోని మత్స్య పరిశ్రమ, నౌకాశ్రయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ రంగం భారీ నష్టంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితి వల్ల ఉపాధి కోల్పోతారు.గత తుపానుల ప్రభావం ఇలా..గతంలో వచ్చిన తిత్లీ వంటి తీవ్ర తుపానులు తీర ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించాయి. ఆ సమయంలో ఇళ్లు, పశువులు, పెంపుడు జంతువులు, పంటలకు భారీగా నష్టం జరిగింది. సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి రావడం వల్ల వ్యవసాయ భూములు దీర్ఘకాలికంగా పంటలు పండించడానికి పనికిరాకుండా పోయాయి. కొన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి.తుపాను నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలుప్రస్తుత మోంథా తుపాను తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు చేపట్టాలి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలి. నిత్యావసర సరుకులు, తాగునీరు, మందులు సిద్ధంగా ఉంచాలి. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు రియల్టైమ్లో తెలియజేయాలి. విద్యుత్ అంతరాయం కలగకుండా మొబైల్ టవర్ల వద్ద పవర్ బ్యాకప్(జనరేటర్లు) ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలి. రైతుల కోసం టార్పాలిన్లు సిద్ధం చేయాలి.తక్షణ, సహాయ చర్యలువిద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. NDRF, SDRF బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలను వేగవంతం చేయాలి. పారిశుద్ధ్యంపై దృష్టి సారించి వ్యాధులు(మలేరియా, డయేరియా) వ్యాప్తిని అరికట్టాలి. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి 108, 104 వంటి అత్యవసర సేవలను అప్రమత్తం చేయాలి.స్టాక్ మార్కెట్పై ప్రభావం ఎలా?మోంథా తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇండియన్ స్టాక్ మార్కెట్పై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పారిశ్రామిక కార్యకలాపాలు ఆగిపోవడం, రవాణా అంతరాయం, ఆస్తుల నష్టం వంటి అంశాల వల్ల ఈ విభాగంలో సర్వీసులు అందించే కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్, సిమెంట్, లాజిస్టిక్స్, పోర్ట్ సంబంధిత స్టాక్స్ ప్రభావితం కావొచ్చు.పెట్టుబడి విధానం - దీర్ఘకాలిక లక్ష్యాలుతుపాను వల్ల ఏర్పడే పరిస్థితులు తాత్కాలికమే అని గమనించాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న పెట్టుబడిదారులు ఈ తాత్కాలిక పతనంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఇలాంటి సందర్భాల్లో షేర్లను హడావిడిగా అమ్మడం వల్ల నష్టపోతారు. తుపాను వంటి సంఘటనల ప్రభావం కొన్ని రోజుల్లో సద్దుమణుగుతుంది. బేసిక్ ఫండమెంటల్స్ బలంగా ఉన్న నాణ్యమైన కంపెనీల షేర్లు మార్కెట్ అస్థిరత కారణంగా తక్కువ ధరలో లభించినప్పుడు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడానికి, స్థిరమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి క్రమానుగుత పెట్టుబడి విధానాన్ని(సిప్) అనుసరించడం ఉత్తమం.ఒకే రంగంలో కాకుండా నష్టాలను తట్టుకోగల ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, టెక్నాలజీ, ఇన్ప్రా.. వంటి ఇతర రంగాలతో పాటు దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ వల్ల లాభపడే రంగాల్లో పెట్టుబడిని వైవిధ్యపరచాలి.ఇదీ చదవండి: ఆర్బీఐ ఖజానాలో బంగారం ధగధగలు - 
      
                   
                                                     
                   
            26వేల మార్కు వద్ద నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు పెరిగి 26,004కు చేరింది. సెన్సెక్స్(Sensex) 201 పాయింట్లు పుంజుకొని 84,802 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) - 
      
                   
                                                     
                   
            ఆర్బీఐ ఖజానాలో బంగారం ధగధగలు
ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు ధగధగా మెరిసిపోతున్నాయి. సెప్టెంబర్ చివరికి ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. గత 12 నెలల్లోనే 25.45 మెట్రిక్ టన్నుల మేర పసిడి నిల్వలను ఆర్బీఐ పెంచుకుంది. ఇందులో 575.82 మెట్రిక్ టన్నుల బంగారం దేశీయంగా నిల్వ చేసుకోగా, మిగిలినది విదేశాల్లోని వాల్టుల్లో భద్రపరిచింది.బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వద్ద 290.37 టన్నుల బంగారం నిల్వ ఉంది. 13.99 టన్నుల మేర బంగారం డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. ఆర్బీఐ వద్ద విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాటా 13.92 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చినాటికి ఇది 11.70 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల కాలంలో 600 కిలోల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది.అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళికపరమైన తీవ్ర అనిశ్చితులు నెలకొన్న తరుణంలో, డాలర్ రిస్క్ను తగ్గించుకునేందుకు ఆర్బీఐ ఇటీవలి సంవత్సరాల్లో తన విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుకోవడం గమనార్హం. సెప్టెంబర్ చివరికి మొత్తం విదేశీ మారకం నిల్వలు 700 బిలియన్ డాలర్లకు చేరాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇవి 705.78 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు - 
      
                   
                                                     
                   
            ఇక విద్యుత్ షేర్ల వెలుగు
విద్యుత్ రంగంలోని యుటిలిటీస్ షేర్లు ప్రస్తుతం పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత 12 నెలల్లో విద్యుత్ రంగ కౌంటర్లు అమ్మకాలతో బలహీనపడటమే దీనికి కారణమని ప్రస్తావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో అంతంత మాత్ర ఫలితాలు ప్రకటించిన పలు విద్యుత్ రంగ కంపెనీలు ఈ ఏడాది(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లోనూ నిరుత్సాహకర పనితీరు చూపడం ప్రభావం చూపినట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం(2025 అక్టోబర్–మార్చి 2026)లో విద్యుత్ డిమాండ్ పుంజుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన విద్యుత్ రంగ షేర్లు బలపడే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. దీర్ఘకాలిక ట్రెండ్ ఎలాఉన్నప్పటికీ బొగ్గు ఆధారిత విద్యుత్(థర్మల్) ప్లాంట్ల సామర్థ్య పెంపు ప్రణాళికలకు తెరలేవనుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక డిమాండుకు అనుగునంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్(బీఈఎస్ఎస్), పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు(పీఎస్పీ) పుంజుకోనున్నాయి. మరోపక్క పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సైతం జత కలవనుంది. అయితే బీఈఎస్ఎస్తోపాటు.. సోలార్కు విదేశీ పరికరాలపై ఆధారపడవలసి ఉంటుంది. దీంతో రాజకీయ భౌగోళిక, సరఫరా చైన్ రిసు్కలు పెరగనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ అధిక వర్షపాతం కారణంగా డిమాండ్ మందగించింది. దీర్ఘకాలిక డిమాండ్ పటిష్టంగా కనిపిస్తోంది. ప్రణాళికలుసహా, వివిధ దశలలో ఉన్న ప్రాజెక్టులరీత్యా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2025–35 మధ్య కాలంలో 86 గిగావాట్లమేర జత కలవనుంది. 68 గిగావాట్ల తొలి అంచనాలకంటే ఇది అధికంకాగా.. వీటికి అనుగుణంగా కనీసం 26 గిగావాట్లమేర పరికరాలకు ఆర్డర్లు ఇవ్వవలసి ఉంటుంది. బీఈఎస్ఎస్ సామర్థ్య విస్తరణకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకాలు, జాతీయ స్థాయిలో ప్రసార చార్జీల రద్దు దన్నుగా నిలవనున్నాయి. ఇక 2032కల్లా 32 గిగావాట్ల పీఎస్పీ సామర్థ్య లక్ష్యాలలో ఎలాంటి మార్పులేదు. అయితే వీటిలో చాల ప్రాజెక్టులు ఎగ్జిక్యూషన్ దశకు చేరుకున్నాయి.షేర్లకు జోష్ఈ ఏడాది ద్వితీయార్థంలో విద్యుత్కు డిమాండ్ పెరగడం ద్వారా ఈ రంగంలో దెబ్బతిన్న కౌంటర్లకు జోష్ లభించనుంది. పీఎస్యూ దిగ్గజం ఎన్టీపీసీ త్వరలో 6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుకు తెరతీయనుంది. మర్చంట్ పవర్ ఆధారిత జేఎస్డబ్ల్యూ, టాటా పవర్కంటే రెగ్యులేటెడ్ యుటిలిటీ సంస్థలు ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, సీఈఎస్సీ మెరుగైన పనితీరు చూపనున్నాయి. భారీ జలవిద్యుత్(హైడ్రో) ప్రాజెక్టులతో ఎన్హెచ్పీసీ ఏడాదికి నిలకడగా 20 శాతానికిమించిన వృద్ధిని అందుకోనున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ప్రారంభంకానున్న సోలార్ మాడ్యూల్ ప్లాంట్ ద్వారా సీఈఎస్సీ సోలార్ మాడ్యూల్స్, సెల్స్ తయారీలోకి ప్రవేశించనుంది. మర్చంట్ పవర్ మార్కెట్ బలహీనపడటంతో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఫలితాలు నీరసించవచ్చు. వరదల కారణంగా ఎన్హెచ్పీసీపట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవచ్చు. మరోవైపు భారీ హైడ్రో ప్రాజెక్టులు ఆలస్యంకావడం, కొత్తగా ఏర్పాటు చేస్తున్న థర్మల్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు కోసం ఒప్పందం కుదుర్చుకోకపోవడం ఎస్జేవీఎన్పై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు.వీక్ డిమాండ్ ఈ ఏడాది ఆగస్ట్వరకూ డిమాండ్లో వృద్ధి 0.6 శాతానికి పరిమితంకావడంతో సెపె్టంబర్లో విద్యుదుత్పత్తి 3 శాతానికి మందగించింది. బొగ్గు నిల్వలు ఏడాది క్రితం నమోదైన 14 రోజులతో పోలిస్తే 20 రోజులకు చేరాయి. దీంతో పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా బొగ్గు విక్రయాల పరిమాణం 2025 ఆగస్ట్వరకూ 4 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ పవర్ ఇండెక్స్ వార్షికంగా 22 శాతం క్షీణించింది. విద్యుత్ సరఫరాలవైపు చూస్తే జల విద్యుత్లో 9 శాతం, సోలార్లో 25 శాతం, పవన విద్యుత్లో 9 శాతం చొప్పున ఉత్పత్తి జరిగింది. థర్మల్ విద్యుదుత్పత్తి యథాతథంగా నమోదైంది. 496 గిగావాట్లు2025 ఆగస్ట్కల్లా మొత్తం ఇంధన స్థాపిత సామర్థ్యం 496 గిగావాట్లను తాకింది. గత ఏడాది కాలంలోనే 45 గిగావాట్లు జత కలసింది. దీనిలో పునరుత్పాదక సామర్థ్య వాటా 89 శాతంకాగా.. మొత్తం సామర్థ్యంలో 39 శాతానికి ఎగసింది. ఆగస్ట్లో కోల్ ఇండియా విక్రయాలు వార్షికంగా 9 శాతం పుంజుకుంది. గత ఆగస్ట్లో అమ్మకాలు తక్కువగా నమోదుకావడం దీనికి కారణం.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు - 
      
                   
                                                     
                   
            ఏడాది పాటు ‘చాట్జీపీటీ గో’ ఉచితం
క్వెరీలు, ఇమేజ్ జనరేషన్ పరిమితులు కొంత తక్కువగా ఉండే ‘చాట్జీపీటీ గో’ను భారత్లోని యూజర్లకు ఏడాదిపాటు ఉచితంగా అందించనున్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించింది. నవంబర్ 4 నుంచి పరిమితం కాలం పాటు నిర్వహించే ప్రమోషనల్ క్యాంపెయిన్లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ను పొందవచ్చని పేర్కొంది.భారత్లో తొలిసారిగా బెంగళూరులో నవంబర్ 4న డెవ్డే ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ సందర్భంగానే ఉచిత ఆఫర్ను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతమున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఏడాది ఉచిత ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. కాస్త అందుబాటు స్థాయి చార్జీలతో అడ్వాన్స్డ్ ఫీచర్లను అందించాలన్న యూజర్ల డిమాండ్ మేరకు చాట్జీపీటీ గోని ఓపెన్ఏఐ ఈ ఏడాది ఆగస్టులో భారత్లో ఆవిష్కరించింది.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు 


