breaking news
Business
-
అమెజాన్లోనే కొంటున్నారా? అమ్మో జాగ్రత్త!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ 2025 నడుస్తోంది. జూలై 12-14 వరకు అమ్మకాలు జరుగుతుండగా దీనికి సంబంధించిన హడావుడి నాలుగు రోజుల ముందు హడావుడి ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 కోసం ఓ వైపు కొనుగోలుదారులు సిద్ధమవుతుండగా, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా వినియోగదారులను మోసం చేసేపనిలో పడ్డారు.అమెజాన్ లానే 1000 సైట్లుమెరుపు డీల్స్, డిస్కౌంట్ల కోసం లక్షలాది మంది లాగిన్ అవుతారని భావిస్తున్న నేపథ్యంలో ఈ షాపింగ్ ఉత్సుకత ఆన్లైన్ మోసాలకు తెరలేపుతుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, అమెజాన్ను పోలిన 1,000 కొత్త వెబ్సైట్లు 2025 జూన్లో నమోదయ్యాయి. వీటిలో 87% అనుమానాస్పదమైనవి లేదా పూర్తిగా హానికరమైనవిగా గుర్తించారు. ఈ సారూప్య డొమైన్లు చిన్న అక్షర తేడాలు లేదా ".టాప్" లేదా ".ఆన్వైన్" వంటి అసాధారణ ఎక్స్టెన్షన్లను కలిగి ఉంటాయి. ఇలా వినియోగదారులను నమ్మించి మోసగించడానికే వీటిని రూపొందించినట్లు కనిపిస్తోంది.వినియోగదారులను మోసగించడానికి స్కామర్లు సాధారణంగా రెండు ప్రధాన ట్రిక్స్పై ఆధారపడతారు. అవి ఒకటి నకిలీ వెబ్సైట్లు, రెండోది ఫిషింగ్ ఈమెయిల్స్. అమెజాన్ చెక్అవుట్ లేదా లాగిన్ పేజీలను అనుకరించడానికి నకిలీ డొమైన్లు సృష్టిస్తున్నారు. అవి మొదటి చూసినప్పుడు అసలైన వెబ్సైట్ల లాగానే అనిపిస్తాయి. దీంతో వీటి ద్వారా కొనగోళ్లకు ప్రయత్నిస్తే మొత్తానికి మోసం వస్తుంది. పాస్వర్డ్లు, ఇతర వివరాలు కూడా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది.ఇక మరో మార్గంలో "రీఫండ్ డ్యూ" లేదా "అకౌంట్ ప్రాబ్లమ్" వంటి విషయాలతో ఫిషింగ్ ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ సందేశాలు మామూలుగా అమెజాన్ సపోర్ట్ టీమ్ నుండే వచ్చినట్లు అనిపిస్తాయి. అక్కడ కనిపించిన లింక్లను క్లిక్ చేస్తే స్కామ్ వెబ్సైట్లకు దారితీసే అవకాశం ఉంది. ప్రైమ్ డే సందర్భంగా కొనుగోలుదారులు హడావుడిగా ఉంటారని సైబర్ నేరగాళ్లకు తెలుసు. వారు మీ అత్యవసరతను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు.కొన్ని జాగ్రత్తలుసురక్షితంగా ఉండటానికి నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఇవి సాధారణమైనవే కానీ శక్తివంతమైనవి. అవి..అధికారిక అమెజాన్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే షాపింగ్ చేయండిమీ ఖాతాను అప్డేట్ చేయమని లేదా రీఫండ్ క్లెయిమ్ చేయమని కోరే ఈమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.ఆకర్షణీయంగా అనిపించే ఫ్లాష్ డీల్స్ జోలికి పోవద్దు.టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి.మీ సాఫ్ట్వేర్, బ్రౌజర్లను అప్డేట్ చేసుకోండి. -
ఐటీ షేర్లు టపటప.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
టీసీఎస్ త్రైమాసిక (క్యూ1) రాబడులు ఆశించిన దానికంటే బలహీనంగా ఉండటంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం ఐటీ షేర్లలో అమ్మకాలతో నష్టాల్లో ముగిశాయి. దీనికి తోడు కెనడాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వాణిజ్య సుంకాలు విధించిన తర్వాత పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు కూడా సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 689.81 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 82,500.47 స్థాయిలలో ముగియగా, నిఫ్టీ 50 కూడా 205.4 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 25,149.85 స్థాయిలలో స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.88 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.02 శాతం చొప్పున నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో దాదాపు 1.8 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ క్యూ1 రాబడులు ఊహించిన దానికంటే తక్కువగా ఉండటంతో ఐటీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, ఎనర్జీ, బ్యాంక్, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 23 షేర్లు రెడ్లోనే ముగిశాయి. టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, టైటాన్ షేర్లు 3.5 శాతం వరకు నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.24 శాతం లాభపడి 11.81 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
తెలంగాణ కోసం ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులు
హైదరాబాద్: తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల కోసం ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్ఎస్ ఇండియా) వెల్లడించింది. ఆప్టిగల్ ప్రైమ్, ఆప్టిగల్ పినకిల్ వీటిలో ఉన్నట్లు వివరించింది.తుప్పు నుంచి మూడు రెట్లు అధిక రక్షణ కల్పించేలా ఇవి ఆరు వేరియంట్స్లో ఉంటాయి. దేశీయంగా, ముఖ్యంగా దక్షిణాదిన కలర్ కోటెడ్ ఉక్కు ఉత్పత్తుల విభాగంలో గణనీయంగా మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ డైరెక్టర్ రంజన్ ధర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ మార్కెట్ 3.4 మిలియన్ టన్నులుగా ఉండగా, దక్షిణాది మార్కెట్ వాటా సుమారు 0.6 మిలియన్ టన్నులుగా ఉంటుందని పేర్కొన్నారు.హైదరాబాద్ కంపెనీకి ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీప్టెక్ ఆవిష్కరణలతో పంటల సంరక్షణ ఉత్పత్తులపై కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డ్ పురస్కారం లభించినట్లు ఏటీజీసీ బయోటెక్ సంస్థ వెల్లడించింది. అగ్రికల్చర్ టుడే నిర్వహించిన 16వ అగ్రికల్చర్ లీడర్షిప్ సదస్సులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ దీన్ని ప్రదానం చేసినట్లు వివరించింది.తమ సంస్థకు 26 పేటెంట్లు, 50కి పైగా ఉత్పత్తులు ఉన్నట్లు కంపెనీ చైర్మన్ మార్కండేయ గోరంట్ల, ఈడీ వీబీ రెడ్డి తెలిపారు. బియ్యం, పత్తి తదితర పంటల్లో ఫెరోమోన్ టెక్నాలజీని విస్తరించడంలో తమ కంపెనీని కేస్ స్టడీగా పరిగణించవచ్చని 2024లో ప్రపంచ ఆర్థిక ఫోరం సైతం సూచించినట్లు పేర్కొన్నారు.ఎన్ఎండీసీ గనులకు 5 స్టార్ రేటింగ్మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీకి చెందిన గనులకు ప్రతిష్టాత్మక 5 స్టార్ రేటింగ్ లభించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను చత్తీస్గఢ్లోని మూడు ఇనుప ఖనిజ గనులకు, కర్ణాటకలోని ఒక గనికి ఇది లభించినట్లు సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. పర్యావరణ అనుకూల విధంగా మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని ముఖర్జీ చెప్పారు. కేంద్ర గనుల శాఖ, ఐబీఎం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ పురస్కారాన్ని అందించారు. -
అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..
విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్ కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్.. ఇజ్రాయెల్, తైవాన్లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు. -
యూపీఐతో చెల్లింపుల్లో మనమే సూపర్ఫాస్ట్
యూపీఐ దన్నుతో, మిగతా ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారత్లో చెల్లింపుల విధానం అత్యంత వేగవంతంగా ఉంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ విధానం చాలా వేగంగా వినియోగంలోకి వచ్చిందని ఫిన్టెక్ నోట్లో పేర్కొంది. అదే సమయంలో నగదుకు ప్రత్యామ్నాయాలైన డెబిట్, క్రెడిట్ కార్డుల్లాంటి ఇతరత్రా సాధనాల వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించింది.ప్రస్తుతం యూపీఐ ప్రతి నెలా 1,800 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేస్తోందని ఐఎంఎఫ్ పేర్కొంది. వివిధ పేమెంట్ ప్రొవైడర్స్ సేవలు ఉపయోగించుకునే యూజర్ల మధ్య నిరాటంకంగా చెల్లింపు లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు క్లోజ్డ్ లూప్ సిస్టమ్లతో పోలిస్తే యూపీఐలాంటి ఇంటర్ఆపరబుల్ పేమెంట్ సిస్టమ్లు సమర్ధవంతంగా ఉంటాయని తెలిపింది. అయితే, ఇది మరింత వినియోగంలోకి వచ్చే కొద్దీ ప్రైవేట్ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి కూడా దారి తీయొచ్చని, అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
భారత్లో టెస్లా షోరూం ప్రారంభం ఈ వారంలోనే..
ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత్లో తన తొలి షోరూంను ఈ వారంలోనే ప్రారంభించనుంది. టెస్లా భారత్లో తన మొదటి "ఎక్స్పీరియన్స్ సెంటర్" ను జూలై 15న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో ప్రారంభించనుందని, ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించడంలో కీలక అడుగు అని రాయిటర్స్ నివేదించింది. ఇందుకోసం టెస్లా 4,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని మార్చిలో లీజుకు తీసుకుంది. ఈ ప్రాంతం యాపిల్ స్టోర్ కు సమీపంలో ఉంది.భారత్లో విస్తృత విస్తరణ వ్యూహంలో భాగంగా టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ లో ముంబైలోని కుర్లా వెస్ట్ లో ఒక వాణిజ్య స్థలాన్ని కంపెనీ లీజుకు తీసుకుంది. ఇది వాహన సర్వీస్ కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పుణెలో ఇంజనీరింగ్ హబ్, బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) సమీపంలో తాత్కాలిక కార్యాలయంతో సహా భారతదేశంలో టెస్లా మొత్తం వాణిజ్య ఆస్తులు నాలుగుకు చేరుకున్నాయి.కాగా కంపెనీ ఇండియా హెడ్ ప్రశాంత్ మీనన్ తొమ్మిదేళ్ల తర్వాత గత నెలలో రాజీనామా చేశారు. బ్లూమ్బెర్గ్ న్యూస్ ప్రకారం.. ప్రస్తుతానికి భారత కార్యకలాపాలను చైనాకు బృందం నిర్వహిస్తోంది. అయితే టెస్లా ప్రస్తుతం భారత్లో తయారీని స్థాపించడానికి ఆసక్తి చూపడం లేదని, కేవలం షోరూమ్లు తెరిచి దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించాలనుకుంటోందని కేంద్రమంత్రి కుమారస్వామి గత నెలలో చెప్పారు.షోరూం ప్రారంభానికి ముందు కంపెనీ దాదాపు 1 మిలియన్ డాలర్ల (రూ.8.58 కోట్లు) ఎలక్ట్రిక్ వాహనాలు, సంబంధిత వస్తువులను దిగుమతి చేసుకుంది. జనవరి - జూన్ మధ్య వాణిజ్య షిప్పింగ్ రికార్డుల డేటా ప్రకారం.. టెస్లా భారత్కు వాహనాలు, సూపర్ ఛార్జర్లు, ఇతర ఉపకరణాలను దిగుమతి చేసుకుంది. ఇందులో ప్రధానంగా చైనా, అమెరికాల నుండి దిగుమతి చేసుకున్న ఆరు కార్లలో మోడల్ వై కార్లు ఉన్నాయి. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుమారు 70% దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ టెస్లా ఈ వాహనాలను తీసుకువస్తోంది. -
ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం అదుర్స్
ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ జూన్లో రూ.5,313 కోట్లు ప్రీమియం ఆదాయాన్ని సమకూర్చుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఆదాయంతో పోల్చి చూస్తే 14.60 శాతం పెరిగింది. ప్రైవేటు జీవిత బీమా సంస్థలతో పోల్చి చూసినా 12 శాతం పెరిగినట్టు ఎల్ఐసీ ప్రకటించింది. జూన్లో 25 ప్రైవేటు జీవిత బీమా సంస్థలు సంయుక్తంగా వసూలు చేసిన ఇండివిడ్యువల్ పాలసీల ప్రీమియం ఆదాయం రూ.8,408 కోట్లుగా ఉంది.ఈ ఏడాది జూన్లో ఎల్ఐసీ 12.49 లక్షల కొత్త పాలసీలను జారీ చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇలా జారీ చేసిన కొత్త పాలసీలు 14.65 లక్షలుగా ఉండడం గమనార్హం. ఇందులో వ్యక్తులకు సంబంధించిన పాలసీలు 12.48 లక్షలగా ఉంటే, గ్రూప్ పాలసీలు 1,290గా ఉన్నాయి. ఎల్ఐసీకి గ్రూప్ పాలసీల ప్రీమియం ఆదాయం జూన్ నెలలో రూ.22,087 కోట్లుగా ఉంది.గతేడాది జూన్ కంటే 7 శాతం తక్కువ. ప్రైవేటు జీవిత బీమా కంపెనీల గ్రూప్ ప్రీమియం ఆదాయం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి రూ.5,315 కోట్లుగా ఉంది. ఎల్ఐసీ మొత్తం ప్రీమియం (ఇండివిడ్యువల్, గ్రూప్ కలసి) ఆదాయం జూన్ నెలలో 3.43 శాతం తక్కువగా రూ.27,395 కోట్లుగా నమోదైంది. ప్రైవేటు కంపెనీల మొత్తం ప్రీమియం ఆదాయం సైతం 2.45 శాతం తగ్గి రూ.13,722 కోట్లకు పరిమితమైంది. -
వాట్సప్కు పోటీగా త్వరలో బిట్చాట్
ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్స్ టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వాట్సప్ తరహా మెసేజింగ్ యాప్ను.. అందునా ఆఫ్లైన్లో పనిచేసేలా త్వరలో జనాలకు అందుబాటులోకి తేనున్నారు. దీనిపేరు.. బిట్చాట్. ఇంటర్నెట్తో అవసరం లేకుండా మెసేజ్లు పంపించుకునే ఈ యాప్ ఎలా పని చేస్తుందో ఓ లుక్కేద్దాం..బిట్చాట్ అంటే అనే బ్లూటూత్తో పనిచేసే పీర్-టు-పీర్ వ్యవస్థ. సర్వర్లతో దీనికి పని ఉండదు. బ్లూటూత్ ఆన్లో ఉంటే సరిపోతుంది. బిట్చాట్ యూజర్లు ఏదైనా మెసేజ్ చేయాలంటూ బ్లూటూత్ ఆన్ చేసి మెసేజ్లు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ సమస్యలు, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఘర్షణ వాతావారణ నెలకొన్న సమయాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. సర్వర్లు, అకౌంట్లు, ట్రాకింగ్ విధానాలు ఇందులో లేకపోవడంతో.. యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవచ్చనే అంచనా వేస్తున్నారు.ప్రైవసీకి ది బెస్ట్?బిట్చాట్ అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆఫ్లైన్ మెసేజింగ్ యాప్లో యూజర్లు అవతల వ్యక్తికి పంపే ప్రతి మెసేజ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. మెసేజ్ టూ మెసేజ్ మధ్యలో ఎలాంటి సర్వర్ వ్యవస్థ ఉండదు కాబట్టి యూజర్లకు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని డోర్స్ అంటున్నారు. సింపుల్గా.. డివైజ్ టూ డివైజ్ కనెక్షన్. ఫోన్లో బ్లూటూత్ ద్వారా బిట్చాట్ పనిచేస్తోంది నో సెంట్రల్ సర్వర్: వాట్సప్,టెలిగ్రాం తరహా ఒక యూజర్కు పంపిన మెసేజ్ సర్వర్లోకి వెళుతుంది. సర్వర్ నుంచి రిసీవర్కు మెసేజ్ వెళుతుంది. బిట్చాట్లో అలా ఉండదు.. నేరుగా సెండర్నుంచి రిసీవర్కు మెసేజ్ వెళుతుంది. మెష్ నెట్వర్కింగ్: బ్లూట్తో పనిచేసే ఈ బిట్చాట్ యాప్ ద్వారా రిసీవర్ సమీపంలో లేనప్పటికీ మెసేజ్ వెళుతుంది. ఈ టెక్నిక్ను మెష్ రూటింగ్ అంటారు ఇది మెసేజ్ బ్లూటూత్ పరిధికి మించి 300 మీటర్లు (984 అడుగులు) వరకు పంపడానికి వీలవుతుంది. ప్రూప్స్ అవసరం లేదు: ఈ యాప్లో లాగిన్ అయ్యేందుకు ఎలాంటి వ్యక్తిగత యూజర్ వివరాలు అవసరం లేదు. అంటే ఫోన్ నెంబర్,ఈమెయిల్తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలతో పనిలేదు. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ : బిట్చాట్ కొన్నిసార్లు పీట్ టూ పీర్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే సర్వర్ లేకుండా నెట్వర్క్లోని యూజర్ టూ యూజర్ల మధ్య డేటా మార్పిడి జరుగుతుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్: గ్రూప్ చాట్స్ను ‘రూమ్లు’ అని పిలుస్తారు. ఇవి పాస్వర్డ్తో రక్షితంగా ఉంటాయియూజర్ ఇంటర్ఫేస్: యాప్ను ఇన్ స్టాల్ చేసి, అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఎవరితోనైనా చాట్ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్స్ అండ్ రూమ్స్: హ్యాష్ట్యాగ్లతో పేర్లు పెట్టి, పాస్వర్డ్లతో సెక్యూర్ చేయవచ్చు. ఉపయోగపడే సందర్భాలు: రద్దీ ప్రదేశాల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని సమయంలో విపత్తుల సమయంలో (disaster zones). సెన్సార్ ఉన్న ప్రాంతాల్లో కమ్యూనికేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బిట్చాట్ బీటా వెర్షన్లో టెస్ట్ఫ్లైట్ మోడ్లో ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.టెస్ట్ ఫ్లైట్ మోడ్ అనేది యాపిల్ అందించే బీటా టెస్టింగ్ ప్లాట్ఫారమ్. యాప్లను విడుదలకు ముందు దీని ద్వారా iOS, iPadOS, watchOS, tvOS పరీక్షించేందుకు డెవలపర్లు ఉపయోగించుకుంటారు. తద్వారా ఫీడ్బ్యాక్తో సంబంధిత యాప్ను ఎలా అంటే అలా మార్పులు చేర్పులు చేస్తారు. -
అమాంతం ఎగిసిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు అమాంతం ఎగిశాయి. క్రితం రోజున ఫ్లాట్గా ఉన్న పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గోల్డ్ ఈటీఎఫ్లు.. జిగేల్! ఏకంగా రూ.2,081 కోట్లు
బంగారం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు జూన్లో బలమైన డిమాండ్ కనిపించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవలి కాలంలో స్థిరమైన ర్యాలీ చేస్తుండడం ఇన్వెస్టర్లను మరింతంగా ఆకర్షిస్తోంది. జూన్ నెలలో ఏకంగా రూ.2,081 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.ఈ ఏడాది మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.292 కోట్లతో పోల్చి చూస్తే జూన్లో ఏడింతలైనట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.6 కోట్లు, మార్చిలో రూ.77 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ కాలాన్ని పరిశీలించి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.8,000 కోట్లుగా ఉన్నాయి.ఈ ఏడాది జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్లు రూ.3,751 కోట్లను ఆకర్షించగా, ఆ తర్వాత తిరిగి జూన్లోనే గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం గమనించొచ్చు. జూన్లో రెండు గోల్డ్ ఈటీఎఫ్లు మొదటిసారి మార్కెట్లోకి వచ్చి (ఎన్ఎఫ్వోలు) ఇన్వెస్టర్ల నుంచి రూ.41 కోట్లను సమీకరించాయి. జూన్ చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తుల విలువ మే చివరితో పోల్చి చూసినప్పుడు 4%పెరిగి (మే చివరి నుంచి) రూ.64,777 కోట్లకు చేరింది.స్థిరమైన ధరలు, అనిశ్చిత పరిస్థితులు..‘‘జూన్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి బలమైన పెట్టుబడులు రావడం సెంటిమెంట్లో మార్పునకు నిదర్శనం. ధరలు స్థిరంగా ఉండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఈక్విటీ, డెట్ సాధనాల్లో అస్థిరతలు ఇందుకు కారణమై ఉండొచ్చు’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ తెలిపారు. కొత్త పథకాల ద్వారా నిధుల సమీకరణ కూడా మెరుగ్గానే ఉన్నట్టు చెప్పారు.గోల్డ్ ఈటీఎఫ్ల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. గోల్డ్ ఈటీఎఫ్లకు సంబంధించి ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) జూన్లో 2.85 లక్షలు పెరిగాయి. మొత్తం ఫోలియోలు 76.54 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్ల ధరలు బంగారం మార్కెట్ ధరలనే ప్రతిఫలిస్తుంటాయి. ఒక ఈటీఎఫ్ యూనిట్ గ్రాము బంగారంతో సమానం. కానీ, కొన్ని ఫండ్స్ సంస్థలు ఇంతకంటే తక్కువ పరిమాణంలోనూ పెట్టుబడులకు అనుమతిస్తున్నాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
టీసీఎస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) షేరు ధర బలహీనమైన జూన్ త్రైమాసిక ఫలితాల మధ్య బిఎస్ఇలో ప్రారంభ ఒప్పందాలలో 2 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ సహా ఇతర ఐటీ షేర్లు కూడా 3 శాతం వరకు క్షీణించాయి.ఉదయం 9.46 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్లు లేదా 0.23% నష్టపోయి82,996.41 పాయింట్ల వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు లేదా 0.22% నష్టంతో 25,299.55 వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్ఎం, టెక్ ఎం, ఎటర్నల్ (జొమాటో), బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో కొనసాగుతుండగా హెచ్యూఎల్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్గా కొనసాగుతున్నాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.03 శాతం, 0.14 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.8 శాతం, నిఫ్టీ ఆటో 0.15 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, పీఎస్యూ బ్యాంక్ సూచీలు వరుసగా 0.57 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి. -
వేదాంతా 3డీ వ్యూహం
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ దిగ్గజం వేదాంతా బిజినెస్ను రెట్టింపునకు పెంచుకునేందుకు వీలుగా 3డీ వ్యూహానికి తెరతీయనుంది. దీనిలో భాగంగా విడదీత, వివిధీకరణ(డైవర్సిఫికేషన్), రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టనుంది. కంపెనీ 60వ సాధారణ వార్షిక సమావేశంలో కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ సెపె్టంబర్లోగా వివిధ బిజినెస్ల విడదీతను పూర్తిచేగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాటాదారులనుద్దేశించి ప్రసంగిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రతీ బిజినెస్ 100 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా ఆవిర్భవించేందుకు వీలున్నట్లు పేర్కొన్నారు. 3డీ వ్యూహం కంపెనీ పరిమాణాన్ని రెట్టింపు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా వాటాదారులకు గరిష్ట ప్రయోజనం చేకూరనున్నట్లు తెలియజేశారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణ చివరి దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందుకు 99.5 శాతం వాటాదారులు, రుణదాతల అనుమతి పొందినట్లు తెలియజేశారు. విడదీత పూర్తయితే వేదాంతా వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ విడదీసిన 4 బిజినెస్ల నుంచి ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నట్లు వివరించారు. కాగా.. యూఎస్ షార్ట్సెల్లర్ సంస్థ వైస్రాయ్ రీసెర్చ్.. ఒక రోజు ముందు వేదాంతా రిసోర్సెస్ ఒక పారసైట్ వంటిదని, దేశీ యూనిట్(వేదాంతా లిమిటెడ్)ను వ్యవస్థాగతంగా బలహీనపరుస్తున్నదంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అనిల్ అగర్వాల్ ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే వైస్రాయ్ రీసెర్చ్ ఆరోపణలకు ఎలాంటి ప్రాతిపదికలేదని వేదాంతా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. -
లార్జ్క్యాప్ విభాగంలోకి కొత్తగా 11 కంపెనీలు
న్యూఢిల్లీ: లార్జ్క్యాప్, మిడ్క్యాప్ విభాగంలో కంపెనీలకు స్థానచలనం చోటుచేసుకోనుంది. లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పరంగా సవరించిన జాబితాను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. ఈ సందర్భంగా ఇండియన్ హోటల్స్, సోలార్ ఇండస్ట్రీస్, మజగాన్ డాక్ షిప్బిల్డర్స్, అపోలో హాస్పిటల్స్ తదితర కంపెనీలు మిడ్క్యాప్ నుంచి లార్జ్క్యాప్ విభాగం కిందకు రానున్నాయి. సీమెన్స్ ఎనర్జీ నేరుగా లార్జ్క్యాప్లోకి ఎంట్రీ ఇస్తోంది. దీంతో లార్జ్క్యాప్ విభా గం నుంచి మిడ్క్యాప్ కిందకు రైల్ వికాస్ నిగమ్ (ఆర్వీఎన్ఎల్), హీరో మోటోకార్ప్, స్విగ్గీ, పాలీ క్యాబ్ ఇలా 11 కంపెనీలు చేరనున్నాయి. దీనిపై నువమా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఒక నివేదికను విడుదల చేసింది. 9 స్మాల్ క్యాప్ కంపెనీలు మిడ్క్యాప్ విభాగం కిందకు అప్గ్రేడ్ కానున్నాయి. అలాగే, మిడ్క్యాప్ కిందకు కొ త్తగా హెక్సావేర్ టెక్నాలజీస్, ఐటీసీ హోటల్స్ చేరనున్నాయి. ఇవి ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ కావడం గమనార్హం. ఏటా జనవరి, జూలైలో యాంఫి (ప్రతి 6 నెలలకు ఒకసారి) కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా జాబితాను ప్రకటిస్తుంటుంది. ఫిబ్రవరి1, ఆగస్ట్ 1 నుంచి మార్పులు అమల్లోకి వస్తాయి. యాంఫి వర్గీకరణకు అనుగుణంగా ఫండ్స్ సంస్థలు తమ పెట్టుబడుల కోసం స్టాక్స్ను ఎంపిక చేసుకుంటాయి. లార్జ్క్యాప్ ఫండ్స్, లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్, మిడ్క్యాప్ ఫండ్స్, స్మాల్క్యాప్, మలీ్టక్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఈ వర్గీకర జాబితాకు అనుగుణంగా పోర్ట్ఫోలియోలో మార్పులూ చేస్తుంటాయి. కనుక ఫండ్స్ పెట్టుబడులకు ఈ జాబితా కీలకంగా పనిచేస్తుంటుంది. ఫండ్స్ పెట్టుబడులకు అనుగుణంగా ఆయా స్టాక్స్ ధరల్లోనూ మార్పులు చూడొచ్చు.మిడ్క్యాప్ నుంచి లార్జ్క్యాప్ విభాగంలోకి ఇండియన్ హోటల్స్ సోలార్ ఇండస్ట్రీస్ మజ్గాన్ షిప్ బిల్డర్స్ మ్యాక్స్ హెల్త్కేర్ శ్రీ సిమెంట్స్ మ్యాన్కైండ్ ఫార్మా అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లుపిన్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ సీమెన్స్ ఎనర్జీ (కొత్త చేరిక)లార్జ్ క్యాప్ నుంచి మిడ్క్యాప్ విభాగంలోకి ఆర్వీఎన్ఎల్ హీరో మోటోకార్ప్ ఇండియన్ ఓవర్సీ బ్యాంక్ కమిన్స్ ఇండియా స్విగ్గీ పాలీక్యాబ్ ఇండియా బోష్ లిమిటెడ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్లైఫ్ డాబర్ ఇండియా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ మార్కెట్ విలువ కటాఫ్ తగ్గింపుమార్కెట్ విలువ పరంగా టాప్–100 కంపెనీలు లార్జ్క్యాప్ కిందకు వస్తాయి. మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250 వరకు మొత్తం 150 కంపెనీలు మిడ్క్యాప్ కిందకు పరిగణనలోకి తీసుకుంటారు. మిగిలినవి స్మాల్క్యాప్ కిందకు వస్తాయి. గత ఆరు నెలల కాలంలో స్టాక్ వారీ సగటు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ‘‘గత ఆరు నెలల్లో మార్కెట్ ఎంతో అస్థితరలను చూసింది. దీంతో 2024 డిసెంబర్ నుంచి చూస్తే మార్కెట్ విలువ కటాఫ్ తగ్గింది. లార్జ్క్యాప్ విభాగం కటాఫ్ విలువ 2024 డిసెంబర్ చివరికి ఉన్న రూ.లక్ష కోట్లు నుంచి రూ.91,600 కోట్లకు దిగొచి్చంది. మిడ్క్యాప్ విభాగం కటాఫ్ (గరిష్ట విలువ) సైతం రూ.33,200 కోట్ల నుంచి రూ.30,800 కోట్లకు తగ్గింది’’అని నువమా నివేదిక తెలిపింది. గత నాలుగేళ్లలో లార్జ్క్యాప్ విభాగం కటాఫ్ విలువ గణనీయంగా తగ్గడం ఇదే మొదటిసారి. స్టాక్స్ విలువలు దిద్దుబాటునకు గురి కావడమే ఇందుకు దారితీసింది. -
గ్రామీణ రంగంలో పెట్టుబడులకు చేయూత
న్యూఢిల్లీ: గ్రామీణ రంగంలోకి మరిన్ని ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావడానికే తమ ప్రాధాన్యతని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ) ప్రెసిడెంట్ అల్వారో లారియో తెలిపారు. మరే ఇతర రంగంతో పోల్చి చూసినా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా పేదరిక నిర్మూలనకు సాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయన్నారు. 1977లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీ, ఆర్థిక సంస్థగా ఏర్పాటైన ఐఎఫ్ఏడీ గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక, ఆకలి బాధల నిర్మూలన కోసం కృషి చేస్తుంటుంది. గ్రామీణ ప్రాంతాల కోసం దీర్ఘకాలిక రుణాలను సమీకరించడం, తద్వారా దీర్ఘకాల ఫలితాలను సాధించడం ఐఎఫ్ఏడీ ప్రాధాన్యతగా లారియో చెప్పారు. భారత్తో 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, ఐఎఫ్ఏడీ వ్యవస్థాపక సభ్య దేశాల్లో భారత్ కూడా ఒకటని గుర్తు చేశారు. అతిపెద్ద రుణ గ్రహీతతోపాటు నిధుల విరాళంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్ ముందు మూడు కీలక ప్రశ్నలు.. ‘‘భారత్ ముందు మూడు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. రైతులకు వ్యవసాయం మరింత లాభదాయకంగా ఎలా మార్చగలం? వాతావరణపరమైన ఎన్నో సవాళ్ల మధ్య ఉత్పాదకతను పెంచడం ఎలా? ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత దిశగా ఎలా ముందుకు వెళ్లాలి?’’అని అల్వారో లారియో ప్రశ్నలు సంధించారు. ఉష్ణోగ్రతలు పెరగడం, అసహజ వర్షపాతం తదతర వాతావరణపరమైన మార్పులు ప్రపంచ ఆహార భద్రతకు అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విధమైన మార్పులు పంట దిగుబడులు, ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపారు. భారత్లో సీజన్వారీ నీటి కరువు, ఉష్ణోగ్రతల పెరుగుదల, కరువు సమస్యలున్నట్టు చెప్పారు. భారత జీడీపీలో వ్యవసాయం 20 శాతం వాటాతో, 42 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో పురోగతి సాధించినప్పటికీ.. పేదలను సైతం ఆర్థిక సేవల్లో భాగం చేయడం, చిన్న ఉత్పత్తిదారులకు మార్కెట్ అనుసంధానత కల్పించడం కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ప్రైవేటు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. -
రూ.కోట్ల లగ్జరీ ప్రాపర్టీ.. రిజిస్టర్ చేసుకున్న జొమాటో అధినేత
జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ గురుగ్రామ్లో రూ.కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.డీఎల్ఎఫ్కు చెందిన ది కామెలియాస్లో అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ను మూడేళ్ల క్రితం రూ.52.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు జాప్కీకి లభించిన డాక్యుమెంట్లు చెబుతున్నాయి.మార్చిలో కన్వెన్షన్ డీడ్ ను చేసుకున్నారని, స్టాంప్ డ్యూటీ కింద గోయల్ రూ.3.66 కోట్లు చెల్లించారని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. 10,813 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ లో ఐదు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ నుంచి 2022 ఆగస్టులో ఈ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారని, 2025 మార్చి 17న కన్వెన్షన్ డీడ్ రిజిస్టర్ అయిందని డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.గురుగ్రామ్లో డీఎల్ఎఫ్ ఫేజ్ -5 లో ఉన్న కామెలియాస్లో అన్నీ అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లే. దీపిందర్ గోయల్ మూడేళ్ల క్రితం కొన్న లాంటి అపార్ట్ మెంట్ ఇప్పుడు కొనాలంటే రూ.140 కోట్లకు పైగా ఖర్చవుతుందని రియల్టీ బ్రోకర్లు చెబుతన్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో దీపిందర్ గోయల్కు మరో ప్రాపర్టీ కూడా ఉంది. 2024 ఫిబ్రవరిలో గోయల్ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో రూ .50 కోట్లకు ఒక ప్లాట్ను కొనుగోలు చేశారు. -
రూ.5.6 లక్షల కోట్ల కంపెనీకి కొత్త సీఈవో.. ఎవరీ ప్రియా నాయర్?
హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రియా నాయర్ నియమితులయ్యారు. ఆగస్టు 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నట్లు హెచ్యూఎల్ ప్రకటించింది. ఐదేళ్ల కాలానికి ఆమె నియామకానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.ప్రస్తుతం యూనిలీవర్ లో బ్యూటీ అండ్ వెల్ బీయింగ్ విభాగానికి బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ సేవలందిస్తున్న నాయర్ ప్రపంచ మార్కెట్లలో 13 బిలియన్ యూరోల పోర్ట్ ఫోలియోను పర్యవేక్షిస్తున్నారు. జూలై 31న పదవి నుండి వైదొలగనున్న రోహిత్ జావా స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. 2023లో హెచ్యూఎల్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జావా.. యూనిలీవర్లో 37 ఏళ్ల విశిష్ట కెరీర్ను ముగించి బోర్డుతో పరస్పర ఒప్పందం తర్వాత వైదొలగుతున్నారు.ఎన్నో బ్రాండ్లు..దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రియా నాయర్ హెచ్యూఎల్ లో అనేక ప్రముఖ పదవులను నిర్వహించారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ హోమ్ కేర్ అలాగే బ్యూటీ & పర్సనల్ కేర్ కూడా ఉన్నాయి. అక్కడ ఆమె డవ్, రిన్, కంఫర్ట్ వంటి ఫ్లాగ్ షిప్ బ్రాండ్ల వృద్ధికి నాయకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ అండ్ బ్రాండ్ పరివర్తన వ్యూహాలను నడిపిస్తూ, బ్యూటీ & వెల్బీయింగ్ విభాగానికి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు.ఇక నాయర్ విద్యార్హతల విషయానికి వస్తే.. సిడెన్హామ్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె పుణెలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశారు. హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.5.6 లక్షల కోట్లుగా ఉంది.హెచ్యూఎల్ గ్లోబల్ సీఎంఓగా నాయర్ సాధించిన విజయాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. ఆమె సోషల్-ఫస్ట్ మార్కెటింగ్ విధానాలను రూపొందించిందని, ప్రభావశీల-ఆధారిత ఆవిష్కరణలను విస్తరించిందని చెప్పుకొచ్చింది. యువ, డిజిటల్ అవగాహన ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి యూనిలీవర్ బ్యూటీ బ్రాండ్లను పునర్నిర్మించే లక్ష్యంతో గ్లోబల్ ప్రచారాలను ప్రారంభించిందని పేర్కొంది. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్.. రూ.200 లోపే అన్లిమిటెడ్..
దేశంలో ప్రముఖ ప్రైవేట్ టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్తోపాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. లాంచ్ను అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ ప్లాన్ ఇప్పటికే ఎయిర్టెల్ వెబ్సైట్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.రూ .200 లోపు బేసిక్, షార్ట్ టర్మ్ వాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులను, ముఖ్యంగా ఖరీదైన డేటా ప్యాక్లు కాకుండా మొబైల్ నంబర్ను యాక్టివ్గా ఉంటే చాలనుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రూ.189 విలువైన ఈ ప్లాన్లో ఏయే ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.రూ.189 ప్లాన్ బెనిఫిట్స్ఎయిర్టెల్ రూ.189 ప్లాన్ వాలిడిటీ 21 రోజులు. ఈ వ్యవధిలో వినియోగదారులు అన్ని నెట్వర్క్లకు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్లాన్ మొత్తానికి 1 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. అలాగే మొత్తం 300 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు.ఈ ప్లాన్ భారీ డేటా వినియోగదారులు లేదా స్ట్రీమింగ్ ఆస్వాదించేవారి కోసం రూపొందింది కాదు. ఎక్కువగా కాలింగ్, అప్పుడప్పుడు ఎస్ఎంఎస్లు చేసుకునేవారికి ఇది అనువుగా ఉంటుంది.ఇదే ధర విభాగంలో రిలయన్స్ జియో వంటి ప్రత్యర్థి ఆపరేటర్లలోనూ రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. రూ .200 కంటే తక్కువ రీఛార్జ్ చేయాలనుకునేవారికి, ఎయిర్టెల్ ఇప్పుడు రెండు ప్రధాన ఎంపికలను అందిస్తుంది. అవి కొత్తగా ప్రారంభించిన రూ .189 ప్లాన్, అలాగే ఇప్పటికే ఉన్న రూ .199 ప్లాన్. ఇది 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఏదేమైనా రూ .199 ప్లాన్ కొంచెం ఎక్కువ వ్యవధితో ఇలాంటి ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా మరో రూ .10 ఖర్చు చేయడానికి ఇష్టపడే వినియోగదారులకు ఇది మంచి డీల్. -
టీసీఎస్ ఫలితాలు: అంచనాలకు అటూ ఇటు..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక (Q1FY26) ఫలితాలను వెల్లడించింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి రూ.12,760 కోట్లకు చేరుకుంది. లాభం అంచనాలను మించి వచ్చింది. టీసీఎస్ ఏప్రిల్-జూన్ నికర లాభం వృద్ధి స్వల్పంగా 1.9 శాతంతో రూ.12,263 కోట్లకు పరిమితమతుందని విశ్లేషకుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా బ్లూమ్బర్గ్ అంచనా వేసింది.ఇక ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 1.3 శాతం పెరిగి రూ.63,437 కోట్లకు చేరుకుందని భారత అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ తెలిపింది. ఇది బ్లూమ్బర్గ్ ఏకాభిప్రాయ అంచనా రూ.64,636 కోట్ల కంటే తక్కువ.డివిడెంట్ ప్రకటనరూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.11 మధ్యంతర డివిడెండ్ ను టీసీఎస్ ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ ను 2025 ఆగస్టు 4వ తేదీ కంపెనీ ఈక్విటీ వాటాదారులకు చెల్లిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. డివిడెండ్ చెల్లింపు కోసం లబ్ధిదారులను నోట్ చేసుకోవడానికి సంస్థ జూలై 16ను రికార్డు తేదీగా నిర్ణయించింది.కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లు వరుసగా పెరిగాయి. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈబీఐటీ మార్జిన్ 30 బేసిస్ పాయింట్లు పెరిగి 24.5 శాతానికి చేరుకుంది. అంతర్జాతీయ స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు డిమాండ్ క్షీణతకు కారణమయ్యాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కె.కృతివాసన్ తెలిపారు.2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొత్తగా 6,071 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. దీంతో మొత్తం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 2025 జూన్ 30 నాటికి 6,13,069కి చేరింది. కంపెనీ ఐటీ సేవల అట్రిషన్ రేటు (గత పన్నెండు నెలల ప్రాతిపదికన) తొలి త్రైమాసికంలో 13.8 శాతానికి పెరిగింది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో అట్రిషన్ 13 శాతంగా ఉండేది. టీసీఎస్ కు టాలెంట్ డెవలప్ మెంట్ కీలకమని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ అన్నారు. టీసీఎస్ ఇప్పుడు 1,14,000 మంది హై ఆర్డర్ ఏఐ స్కిల్స్ ఉన్నవారు ఉండటం సంతోషకరమన్నారు.ఆదాయ ప్రకటనకు ముందు టీసీఎస్ షేరు ధర 0.4 శాతం లాభంతో రూ.3,397.1 వద్ద ముగిసింది. -
వందేళ్లయినా AI ఈ పని చేయలేదు: బిల్గేట్స్
విస్తృతంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (ఏఐ) మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని, కోట్లాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న అంచనాలు ఆందోళనలు పెంచుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రోగ్రామింగ్కు ఏఐ ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. మానవ సృజనాత్మకతతోనే ప్రోగ్రామింగ్ రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించిన ఆయన ప్రోగ్రామర్లను ఏఐ ఇప్పుడే కాదు.. వందేళ్లయినా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ఇటీవల ఎకనమిక్ టైమ్స్తోపాటు టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బిల్ గేట్స్ దీని గురించి మాట్లాడారు. కోడింగ్ కు మానవ మేధస్సు అవసరమని గేట్స్ చెప్పారు. ప్రోగ్రామింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలదు కానీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రోగ్రామింగ్లో నిజమైన సవాలు సంక్లిష్ట సమస్యను సృజనాత్మకతతో పరిష్కరించడమేనన్న ఆయన ఇది యంత్రాలు చేయలేవన్నారు.‘కోడ్ రాయడం అంటే కేవలం టైపింగ్ మాత్రమే కాదు. లోతుగా ఆలోచించడం’ అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విభిన్న పరిశ్రమల్లో అనేక ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయని, లేదా కనుమరుగవుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రోగ్రామింగ్ మాత్రం మానవ ఉద్యోగంగానే ఉంటుందని గేట్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి విచక్షణ, ఊహాశక్తి, అడాప్టబిలిటీ అవసరం. ఈ లక్షణాలు ఏఐకి ఉండవని అంటున్నారాయన.మరోవైపు 2030 నాటికి కృత్రిమ మేధ 8.5 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. ఈ ద్వంద్వ ప్రభావాన్ని గేట్స్ అంగీకరిస్తూ, కృత్రిమ మేధ పర్యవసానాల గురించి తాను కూడా భయపడుతున్నానని అంగీకరించారు. అయితే తెలివిగా ఉపయోగిస్తే కృత్రిమ మేధ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు.ఏఐ ప్రభావం గురించి కొన్ని నెలల క్రితమే బిల్గేట్స్ మాట్లాడారు. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రభావం చూపినా, ఎన్ని మార్పులు తెచ్చినా, కోడింగ్ నిపుణులు, జీవ శాస్త్రవేత్తలు, ఇంధన రంగంలో పనిచేసేవారికి ఎలాంటి ఢోకా ఉండదని తన అభిప్రాయాన్ని చెప్పారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు, జూన్ త్రైమాసికం (క్యూ1 ఎఫ్వై 26) రాబడులపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండటంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యూ1 త్రైమాసిక ఫలితాలు నేడు ప్రకటించనున్న నేపథ్యంలో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 345.8 పాయింట్లు లేదా 0.41 శాతం క్షీణించి 83,190.28 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 కూడా 120.85 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 25,355.25 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.32 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.3 శాతం నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఐటీ 0.8 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ క్యూ1 ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూడడంతో ఐటీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 22 షేర్లు ఎడ్లో ముగిశాయి. అదేసమయంలో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు 2.6 శాతం వరకు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.24 శాతం క్షీణించి 11.6 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
శాంసంగ్ నుంచి 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు
శాంసంగ్ ఎల్రక్టానిక్స్ సంస్థ ప్రీమియం ఫోల్డబుల్ గెలాక్సీ సిరీస్లో మూడు కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, ఫ్లిప్ 7, ఫ్లిప్7 ఎఫ్ఈ వీటిలో ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్లో ఇవి ఏడో జనరేషన్ ఫోన్లు. మరింత వెడల్పాటి స్క్రీన్, తక్కువ బరువు, 200 మెగాపిక్సెల్ వైడ్–యాంగిల్ కెమెరా, కృత్రిమ మేథపరంగా కొత్త ఫీచర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఫోన్ను బట్టి స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్లు, 8.5 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ మెయిన్ డిస్ప్లే, 16 జీబీ వరకు మెమరీ, 1 టీబీ స్టోరేజీ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి.శాంసంగ్ ఈసారి స్లిమ్ ఫోల్డబుల్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇది ఫ్లాగ్షిప్ మార్కెట్లో ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. జెమినీ లైవ్, నౌ బార్, నౌ బ్రీఫ్ వంటి మరెన్నో కొత్త ఏఐ సామర్థ్యాలను తీసుకువస్తున్నందున శాంసంగ్ ఈ ఫోన్లను "గెలాక్సీ ఏఐ ఫోన్లు" అని పిలుస్తోంది. వీటి ధరలను ప్రకటించిన కొరియన్ స్మార్ట్ఫోన్ మేకర్ ప్రీ బుకింగ్లను ప్రారంభించింది.శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 బ్లూ షాడో, సిల్వర్ షాడో, జెట్బ్లాక్, మింట్ (Samsung.com మాత్రమే) అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.12జీబీ+256జీబీ ధర రూ.1,74,99912జీబీ+512జీబీ ధర రూ.1,86,99916జీబీ+1టీబీ ధర రూ.2,10,999శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 బ్లూ షాడో, జెట్బ్లాక్, కోరల్ రెడ్, మింట్ (Samsung.comలో మాత్రమే) రంగుల్లో లభిస్తుంది.12జీబీ+256జీబీ ధర రూ.1,09,99912జీబీ+512జీబీ ధర రూ.1,21,999శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈగెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ బ్లాక్ లేదా వైట్ కలర్లలో లభిస్తుంది.8జీబీ+128జీబీ: రూ.89,9998జీబీ+256జీబీ: రూ.95,999ఈ స్మార్ట్ ఫోన్లు భారత్లో శాంసంగ్ (Samsung.com), అమెజాన్ (Amazon.in), ఫ్లిప్కార్ట్ (Flipkart.com)లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రీ ఆర్డర్లకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ప్రీ-ఆర్డర్ చేస్తే రూ.12,000 విలువైన ఉచిత స్టోరేజ్ అప్ గ్రేడ్ లభిస్తుంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ప్రీ ఆర్డర్పై రూ.6,000 విలువైన స్టోరేజ్ అప్గ్రేడ్ ఉచితంగా అందిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు ఈ మూడు మోడళ్లపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు. కొత్త ఫోల్డబుల్ అధికారిక సేల్ జూలై 25న మొదలుకానుంది. -
మస్క్ కంపెనీకి భారత్లో అనుమతులు
ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్లింక్ భారత్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని అడ్డంకులను అధిగమించింది. భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఈ సంస్థకు అనుమతులు ఇచ్చింది. దాంతో దేశంలో స్టార్లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అడ్డంకులు తొలగినట్లయింది.2022 నుంచి భారతదేశంలో స్టార్లింక్ తన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) నుంచి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కూడా పొందింది. ఇప్పుడు, ఇన్-స్పేస్ ఆమోదంతో స్టార్లింక్ భారత్లోని కంపెనీ ప్రణాళికలకు లైన్ క్లియర్ అయింది.ఐఎన్-స్పేస్ స్టార్లింక్ తన జెన్ 1 ఉపగ్రహ సమూహాన్ని భారతదేశంపై నిలిపేందుకు అనుమతిస్తుంది. ఈ అనుమతులు జులై 7, 2030 వరకు చెల్లుబాటు అవుతాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఆమోదంలో భాగంగా IN-SPACe యూజర్లు ఉపయోచించేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా ఖరారు చేస్తుంది. గేట్ వే బీమ్ల కోసం స్టార్లింక్ 27.5–29.1 గిగాహెర్జ్ట్, 29.5–30 గిగాహెర్జ్ట్ అప్లింక్ బ్యాండ్లను, 17.8–18.6 గిగాహెర్జ్ట్, 18.8–19.3 గిగాహెర్జ్ట్ డౌన్లింక్ బ్యాండ్లను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. సరళంగా చెప్పాలంటే స్టార్లింక్ దాని వినియోగదారులు, గ్రౌండ్ స్టేషన్ల నుంచి భారతదేశం అంతటా ఇంటర్నెట్ డేటాను పంపించేందుకు నిర్దిష్ట ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించేలా అధికారిక అనుమతులు పొందింది.ఇదీ చదవండి: పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!గేట్వే స్టేషన్లు నిర్మాణం..ఇదిలాఉండగా, ఈ ఆమోదం పొందడం వల్ల స్టార్లింక్ వెంటనే భారత్లో సర్వీసులు ప్రారంభిస్తుందని కాదు. సంస్థ ఇంకా భారత ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ను పొందాల్సి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, భద్రతా అవసరాలను తీర్చడానికి పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కనీసం మూడు గేట్వే స్టేషన్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ వ్యవస్థ పూర్తయితే స్టార్లింక్ కూడా త్వరలో ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కంపెనీ భారతదేశ సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ట్రయల్ స్పెక్ట్రమ్ను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం. -
‘మెటాలో పని.. క్యాన్సర్ అంత ప్రమాదం’
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సూపర్ ఇంటలిజెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ముందుకుసాగుతున్న తరుణంలో కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి. కంపెనీలో ఉద్యోగం మానేసి బయటకు వస్తున్న సమయంలో అంతర్గతంగా ఆ ఉద్యోగి ఈమెయిల్ పంపించాడు. దీనిలో కంపెనీ కృత్రిమమేధ విభాగం గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తాడు.ది ఇన్ఫర్మేషన్లో టిజ్మెన్ బ్లాంకెవర్ట్ రాసిన కథనంలో మెటాలోని సంస్కృతిని సంస్థ అంతటా వ్యాపిస్తున్న ‘మెటాస్టాటిక్ క్యాన్సర్’తో పోల్చాడు. మెటా ఎల్ఎల్ఏఎంఏ మోడళ్లపై పనిచేసే బృందంలో బ్లాంకెవర్ట్ కూడా కొంతకాలం పని చేశాడు. ఉద్యోగం నుంచి నిష్క్రమించే ముందు అతడు మెటా నాయకత్వాన్ని, అక్కడి పని విధానాన్ని విమర్శిస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశాడు.‘మెటాలో పని చేస్తున్నన్ని రోజులు చాలా మంది ఉద్యోగులు ఎంతో నష్టపోయారు. అక్కడ భయంతో కూడిన సంస్కృతి ఉంది. తరచుగా పనితీరు సమీక్షలు, తొలగింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, సృజనాత్మకతను దెబ్బతీశాయి. ప్రస్తుతం 2 వేల మందికిపైగా బలంగా ఉన్న ఏఐ విభాగానికి దిశానిర్దేశం కొరవడింది. చాలా మందికి మెటాలో పని చేయడం ఇష్టం లేదు. తమ మిషన్ ఏమిటో కూడా వారికి తెలియదు. పదేపదే అంతర్గత విభేదాలు, అస్పష్టమైన లక్ష్యాలు నిర్దేషిస్తారు. ఇది జట్టు నూతన ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో పనిచేయకపోవడం మాత్రమే కాదు. మెటాస్టాటిక్ క్యాన్సర్లా ఇది సంస్థను ప్రభావితం చేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైట్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మెటా తన ఏఐ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) నిర్మాణంపై దృష్టి సారించే సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగాన్ని కంపెనీ ఇటీవల సృష్టించింది. మెటా పరిశ్రమ అంతటా అగ్రశ్రేణి ప్రతిభావంతులను నియమించుకుంటోంది. అందుకు కంపెనీ ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడడంలేదు. -
తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate)లు ఊగిసలాడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు చాలా స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!
ఇంట్లో నాన్న తీసుకొచ్చిన కిడ్డీబ్యాంక్ గుర్తుందా.. అమ్మ, నాన్న, ఎప్పుడైనా బంధువులు వస్తూపోతూంటే ఇచ్చే చిల్లర డబ్బులు దాచుకునేందుకు కిడ్డీబ్యాంకు ఉపయోగిస్తారు. ఏదైనా అత్యవసర సమయాల్లో పిల్లలు ఆ డబ్బును వాడుకుంటారు. చిన్నప్పటి నుంచే డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకోయాలని అలా చేస్తారు. స్కూల్కు వెళ్లే దారిలోనో..సండే అలా పేరెంట్స్తో సరదాగా బయటకు వెళ్లే సమయంలోనే ఎస్బీఐ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ అని పేర్లు కనిపిస్తుంటాయి. ఇంట్లో ఉన్న కిడ్డీబ్యాంకు గురించి తెలుసుకానీ.. ఇవేం బ్యాంకులని చిన్నారుల్లో ఎన్నో అనుమానాలు ఉంటాయి.ఈ బ్యాంకులు కూడా ఇంట్లోని కిడ్డీ బ్యాంకుల్లాగే పని చేస్తాయి. పిల్లలు నిత్యం ఎలాగైతే డబ్బు పొదుపు చేసి అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారో.. అదే మాదిరిగా సేవింగ్స్, ఎఫ్డీ వంటి ఖాతాలో డబ్బు దాచుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. కాదంటే.. కిడ్డీ బ్యాంకులో ముందుగా ఎంతైతే డబ్బు వేస్తామో చివరిదాకా అంతే మొత్తం ఉంటుంది. కానీ బయట చూసే బ్యాంకుల్లో డబ్బు దాస్తే కొంత అధిక మొత్తం కలిపి ఇస్తారు. ఇలా బ్యాంకువారు కలిపి ఇచ్చే మొత్తాన్నే వడ్డీ అంటారు. కాబట్టి ప్రాథమికంగా కిడ్డీబ్యాంకులో డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకొని, తర్వాత బ్యాంకుల్లో దాచుకోవడం నేర్చుకోవాలి. దాన్నివల్ల అదనంగా వడ్డీ సమకూరుతుంది కదా!పిల్లలే నేరుగా బ్యాంకు ఖాతాను తెరిచేందుకు వెళ్తే పాటించాల్సినవి..బ్యాంకులోకి ఎంటర్ అయ్యే ముందు గేట్వద్దే తుపాకీ పట్టుకొని బారుమీసాలతో గంభీరంగా ఒక వ్యక్తి ఉంటాడు. చిన్నారులూ.. అతడిని చూసి భయపడకండి. ఆ మీసాల మామ మనోడే.. మీ ఇంట్లోనీ కిడ్డీ బ్యాంకును ఎలాగైతే జాగ్రత్తగా ఒకచోట దాస్తారో.. అలాగే ఆ బ్యాంకుకు తాను నిత్యం భద్రత అందిస్తూ కాపలాకాస్తాడు. కాబట్టి మీరు వేసే డబ్బులు మరింత భద్రంగా ఉంటుంది.మామకు గుడ్మార్నింగ్ చెప్పి బ్యాంకులోకి వెళితే చాలామంది ఉంటారు. వారిలో చాలావరకు బ్యాంకులో ఏదోఒక పని కోసం వచ్చినవారే. కంగారు పడకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్లో కూర్చున్నవారిని గమనించండి. వారే బ్యాంకు సిబ్బంది.బ్యాంకులో డిపార్ట్మెంట్ల వారీగా చాలా మంది సిబ్బంది పని చేస్తారు. అంటే.. డబ్బులు మన నుంచి తీసుకునే వారు కొందరు ఉంటే.. ఇప్పటికే బ్యాంకులో డబ్బు వేస్తే తిరిగి ఇచ్చేవారు ఇంకొందరుంటారు. దాంతోపాటు ప్రత్యేకంగా లోన్లు ఇచ్చే వారుంటారు. మీ తరగతిలో లీడర్ ఎలాగైతే ఉంటాడో.. బ్యాంకులోనూ వీరందరినీ మ్యానేజ్ చేసే లీడర్ ఉంటారు. అతడే మేనేజర్.ప్రతి బ్యాంకులో ‘మే ఐ హెల్త్ యూ’ అని లేదా ‘ఎంక్వైరీ’ సైన్ బోర్డుతో ఒక క్యాబిన్ ఉంటుంది. అందులో ఉన్న అంకుల్ దగ్గరకు వెళ్లి.. ‘బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయానుకుంటున్నాను.. ప్రాసెస్ ఏంటి’ అని అడిగితే తాను ఖాతా ఓపెన్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్ల గురించి చెబుతారు. దాంతోపాటు ఎలాంటి రకాల ఖాతాలున్నాయో వివరిస్తారు.పిల్లల కోసం బ్యాంకులు అందిస్తున్న కొన్ని ఖాతాలు..యూత్ లేదా మైనర్ అకౌంట్: ఇది మైనర్ల కోసం రూపొందించిన ప్రామాణిక పొదుపు ఖాతా. ఇది సాధారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఖాతాకు జోడించబడి ఉంటుంది. ఈ ఖాతాలను చిన్న మొత్తాలను నిర్వహించవచ్చు.కస్టోడియల్ అకౌంట్: ఈ ఖాతా పిల్లల పేరు మీదే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు పిల్లల వయసు (సాధారణంగా 18 లేదా 21) వచ్చే వరకు ఖాతాను నిర్వహిస్తాడు.జాయింట్ అకౌంట్: కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులు తమ పిల్లలతో జాయింట్ అకౌంట్ తెరిచేందుకు అనుమతిస్తాయి. ఈ ఖాతాలో పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి నిర్వహించవచ్చు.బ్యాంకు ఎంచుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..అన్ని బ్యాంకులు పిల్లల ఖాతాలకు ఒకే రకమైన ప్రయోజనాలు అందించవు. ఆన్లైన్ సహాయంతో పిల్లల ఖాతాలు తెరిచేందుకు అనువైన బ్యాంకులను సెర్చ్ చేయాలి.నెలవారీ రుసుము లేకుండా.. నెలవారీ రుసుము వసూలు చేయని బ్యాంకులను ఎంచుకోవాలి. ఎందుకంటే దీని వల్ల పిల్లల చిన్నపాటి పొదుపు హరించుకుపోతుంది.తక్కువ లేదా నో మినిమమ్ డిపాజిట్.. కొన్ని బ్యాంకుల్లో ఖాతా తెరవడానికి కనీస డిపాజిట్ అవసరం ఉంటుంది. కాబట్టి తక్కువ లేదా ఎలాంటి డిపాజిట్ అవసరంలేని బ్యాంకులను ఎంచుకోవాలి.ఆన్లైన్ బ్యాంకింగ్.. చాలా బ్యాంకులు యువ ఖాతాదారుల కోసం మొబైల్ యాప్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ను అందిస్తున్నాయి. అలాంటి సదుపాయం ఉన్న బ్యాంకుల తలుపు తట్టండి.ఎడ్యుకేషనల్ టూల్స్.. కొన్ని బ్యాంకులు పిల్లలకు పొదుపు, బడ్జెట్, డబ్బు నిర్వహణ గురించి నేర్పడానికి రూపొందించిన సాధనాలను అందిస్తాయి. అలాంటి ఆర్థిక అక్షరాస్యత నేర్పే వాటిని ఎంచుకోవాలి.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు..తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఐడీకార్డులు (డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ మొదలైనవి).చిరునామా రుజువు (యుటిలిటీ బిల్లు, లీజు ఒప్పందం మొదలైనవి).పిల్లల జనన ధ్రువీకరణ పత్రం లేదా పాస్పోర్ట్ (వయసును ధ్రువీకరించడానికి అవసరం)చిరునామా రుజువు (పిల్లవాడి పేరు మీద శాశ్వత చిరునామా ఉంటే ఇవ్వాలి)కొన్ని బ్యాంకులు అదనపు డాక్యుమెంట్లను అడగవచ్చు. కాబట్టి ఆయా బ్యాంకు వెబ్సైట్లలో ముందుగా వివరాలు తనిఖీ చేయడం మంచిది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు తగ్గి 25,452కు చేరింది. సెన్సెక్స్(Sensex) 69 ప్లాయింట్లు దిగజారి 83,473 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తెలుగులోనూ ట్యాక్స్ ఫైలింగ్
ఫిన్టెక్ సంస్థ క్లియర్ట్యాక్స్ తాజాగా ఐటీ రిటర్నులను ఫైలింగ్ చేసేందుకు సంబంధించి తెలుగు తదితర 7 భాషల్లో సహాయం పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. బహు భాషల్లో పని చేసే కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత క్లియర్ట్యాక్స్ ఏఐ అసిస్టెంట్ను ఆవిష్కరించింది. దీనితో వాట్సాప్, స్లాక్ తదితర మాధ్యమాల ద్వారా తమకు కావాల్సిన భాషలో చాటింగ్ చేస్తూ, మూడు నిమిషాల వ్యవధిలోనే ఫైలింగ్ చేయొచ్చని సంస్థ వివరించింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ఫైల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. దీనితో కొత్తగా 1 కోటి మంది ట్యాక్స్ ఫైలర్లను వ్యవస్థ పరిధిలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్ఐటీఆర్ కొత్త నిబంధనలు..కఠినమైన జరిమానాలు: తప్పుదారి పట్టించే లేదా తప్పుడు ఐటీఆర్ దాఖలు చేసిన వారికి 200 శాతం జరిమానా, 24 శాతం వార్షిక వడ్డీ, సెక్షన్ 276సి ప్రకారం శిక్ష కూడా విధిస్తారు.పన్ను చెల్లింపుదారుల బాధ్యత: సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినా కూడా పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి.అందరికీ వర్తింపు: ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్ అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.సాధారణ తప్పులు: తప్పు ఐటీఆర్ ఫారమ్ ఎంపిక, తప్పుడు మినహాయింపులు, ఆదాయాన్ని ప్రకటించకపోవడం జరిమానాలకు దారి తీస్తాయి.రివైజ్డ్ రిటర్న్తోనూ లాభం లేదు: ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందని పన్ను శాఖ గుర్తిస్తే, రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసినా జరిమానా తప్పదు.సరైన ఐటీఆర్ ఫారమ్ ఎంపిక: ITR-1 (సాధారణ ఆదాయం), ITR-3 (వ్యాపార ఆదాయం) వంటి వివిధ ఫారమ్లు ఆదాయ రకాన్ని బట్టి ఎంచుకోవాలి.తప్పు క్లెయిమ్లు చేయొద్దు: వ్యాపార ఖర్చులుగా వ్యక్తిగత ఖర్చులను చూపడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్లు జరిమానాలకు దారి తీస్తాయి.పన్ను చెల్లింపుదారులకు జాగ్రత్తలు: వార్షిక సమాచార ప్రకటనలోని వివరాలతో సరిపోల్చుకోవడం, సరైన రికార్డులు నిర్వహించడం, పన్ను నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జరిమానాలను నివారించవచ్చు. -
రైల్వే పరికరాల తయారీపై టాటా, స్కోడా దృష్టి
ఆటో విడిభాగాల దేశీ కంపెనీ టాటా ఆటోకాంప్ తాజాగా యూరోపియన్ దిగ్గజం స్కోడా గ్రూప్తో చేతులు కలిపింది. తద్వారా రైల్వే రంగ పరికరాల తయారీకి వీలుగా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నాయి. జేవీ దేశీయంగా రైల్వే ప్రొపల్షన్ సిస్టమ్స్, కంపోనెంట్స్ తయారు చేయనుంది. దీంతో భారత్కు మల్టీ మిలియన్ యూరో పెట్టుబడులు లభించనున్నాయి.ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్తాజా భాగస్వామ్యం వృద్ధిలో ఉన్న దేశీ రైల్వే, మొబిలిటీ మార్కెట్లకు మద్దతివ్వనున్నట్లు టాటా ఆటోకాంప్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూరోపియన్ దిగ్గజం స్కోడా గ్రూప్ ప్రధానంగా ప్రజా రవాణాకు వినియోగించే వాహన విడిభాగాల తయారీలో పేరొందింది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల సిస్టమ్స్, విడిభాగాల మార్కెట్లో టాటా ఆటోకాంప్ పటిష్ట వాటాను కలిగి ఉంది. జేవీ ప్రధానంగా మీడియం, హైస్పీడ్ ప్రాంతీయ రైళ్లు, మెట్రోలు, లైట్ రైల్ వాహనాల తయారీలో వినియోగించే కన్వెర్టర్లు, డ్రైవ్స్, ఆగ్జిలరీ కన్వెర్టర్లు తదితరాలను రూపొందించనుంది. -
ఐపీవోకు ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను యూకే ప్రమోటర్ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ విక్రయానికి ఉంచనుంది. కొత్తగా ఈక్విటీ జారీ లేకపోవడంతో ఐపీవో నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఇది. ఈ భాగస్వామ్య సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 51 శాతంకాగా.. ప్రుడెన్షియల్ కార్పొరేషన్కు 49 శాతం వాటా ఉంది. కాగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీలో 2 శాతం అదనపు వాటా కొనుగోలుకి బోర్డు అనుమతించినట్లు మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. తద్వారా సంస్థలో మెజారిటీ వాటాను నిలుపుకోనున్నట్లు తెలియజేసింది. ఐపీవో ద్వారా దేశీయంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఐదో అసెట్ మేనేజ్మెంట్ సంస్థగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిలవనుంది.బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 0.7 శాతం నష్టంతో రూ. 1432 వద్ద ముగిసింది. -
ఇండిగో వెంచర్స్కు పెట్టుబడులు
ముంబై: విమానయాన దిగ్గజం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్ విభాగం ఇండిగో వెంచర్స్ తొలి ఫండ్ ద్వారా రూ. 450 కోట్లు సమీకరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతితో గతేడాది ఆగస్ట్లో రూ. 600 కోట్ల సమీకరణ లక్ష్యంగా తొలిసారి ఫండ్కు తెరతీసింది. తొలి దశలో రూ. 450 కోట్లు సమకూర్చుకున్నట్లు ఇండిగో వెంచర్స్ తెలియజేసింది. కాగా.. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఏరోస్పేస్ స్టార్టప్ జే ఏరోస్పేస్లో తొలి పెట్టుబడికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. నిధులను అడ్వాన్స్డ్ డిజిటల్ తయారీ మౌలికసదుపాయాలు, ఏఐ ఆధారిత ఉత్పాదకత పెంపు(ప్రొడక్షన్ ఆప్టమైజేషన్), సరఫరా చైన్ వ్యవస్థలను ఏకంచేసే ప్లాట్ఫామ్స్ అభివృద్ధి, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ నిపుణులను ఆకట్టుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ఇండిగో వెంచర్స్ వివరించింది. విమానయానం, తత్సంబంధిత రంగాలలో స్టార్టప్లకు ప్రాథమిక దశలో పెట్టుబడులను సమకూర్చేందుకు ఇండిగో వెంచర్స్ ఫండ్కు తెరతీసింది. బీఎస్ఈలో ఇండిగో షేరు 0.8 శాతం బలపడి రూ. 5,847 వద్ద ముగిసింది. -
అదానీ ఎంటర్ప్రైజెస్కు నిధులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ బాండ్ల జారీ విజయవంతమైంది. బాండ్ల ఇష్యూ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పూర్తి సబ్ర్స్కిప్షన్ లభించింది. వెరసి మారి్పడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించింది. బుధవారం(9న) ప్రారంభమైన ఎన్సీడీ ఇష్యూ ఈ నెల 22న ముగియనుంది. అయితే అధిక స్పందన కారణంగా గడువుకంటే ముందుగానే ముగించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నిర్ధారిత(ఫిక్స్డ్) వడ్డీ రేటుతో ఇన్వెస్టర్లకు బాండ్లను(ఎన్సీడీలు) జారీ చేయడం ద్వారా కంపెనీలు నిధులు సమీకరించే సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా 9.3 శాతం వార్షిక వడ్డీతో ఎన్సీడీలను ఆఫర్ చేసింది. ఇష్యూకి మధ్యాహా్ననికల్లా రూ. 1,400 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు స్టాక్ ఎక్సే్ఛంజీల డేటా వెల్లడించింది. ముందుగా వచ్చినవారికి ముందుగా పద్ధతిలో కంపెనీ బాండ్ల ఇష్యూని చేపట్టడం గమనార్హం! ఇది రెండో ఇష్యూకాగా.. కంపెనీ ఇంతక్రితం గతేడాది సెప్టెంబర్లోనూ రూ. 800 కోట్ల విలువైన ఎన్సీడీలను జారీ చేసింది. రూ. 500 కోట్ల ప్రాథమిక విలువతో ప్రస్తుత ఆఫరింగ్ను చేపట్టింది. అధిక స్పందన లభిస్తే మరో రూ. 500 కోట్ల విలువైన బాండ్ల జారీకి వీలుగా గ్రీన్షూ ఆప్షన్తో ఇష్యూకి తెరతీసింది. ఒక్కో ఎన్సీడీ ముఖవిలువ రూ. 1,000కాగా.. ఇన్వెస్టర్లు కనీసం 10 బాండ్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధుల్లో కనీసం 75 శాతాన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఎన్సీడీలను 24, 36, 60 నెలల గడువుతో జారీ చేస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 2,582 వద్ద ముగిసింది. -
మళ్లీ ఈక్విటీ ఫండ్స్ జోరు..
న్యూఢిల్లీ: గత ఐదు నెలలుగా దిగజారుతూ వస్తున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడుల ప్రతికూల ట్రెండ్కు ఎట్టకేలకు బ్రేక్ పడింది. జూన్లో ఈక్విటీ ఫండ్స్లోకి నికరంగా రూ.23,587 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. మే నెలలో వచ్చిన రూ.19,013 కోట్లతో పోలిస్తే 24 శాతం జంప్ చేశాయి. స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకోవడంతో అన్ని ఫండ్ విభాగాలకూ దన్నుగా నిలుస్తోంది. కాగా, ఈక్విటీ ఫండ్స్ విభాగంలోకి వరుసగా 52వ నెలలోనూ నికర పెట్టుబడులు నమోదయ్యాయి. మరోపక్క, ఇన్వెస్టర్ల సానుకూల ధోరణితో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు కూడా జోరుందుకున్నాయి. జూన్లో వివిధ పథకాల్లోకి రూ. 27,269 కోట్లు సిప్ రూపంలో వచ్చి చేరాయి. మే నెలలో ఈ మొత్తం రూ.26,688 కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలివీ... → గతేడాది నవంబర్లో రూ.35,943 కోట్ల నుంచి డిసెంబర్లో రూ.41,156 కోట్లకు ఎగబాకిన ఈక్విటీ ఎంఎఫ్ పెట్టుబడులు... ఆ తర్వాత నెల నుంచి అంతకంతకూ పడిపోతూనే వచ్చాయి. మే నెలలో ఏకంగా రూ.20,000 కోట్ల దిగువకు చేరాయి. జూన్లో దీనికి అడ్డుకట్టపడటం మార్కెట్లో సానుకూల ధోరణికి నిదర్శనం. → ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లోకి జూన్లో రికార్డు స్థాయిలో రూ.5,733 కోట్లు వచ్చి పడ్డాయి, తర్వాత స్థానాల్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ (రూ.4,024 కోట్లు), మిడ్ క్యాప్ ఫండ్స్ (రూ.3,754 కోట్లు), లార్జ్ క్యాప్ ఫండ్స్ (రూ.1,694 కోట్లు) నిలిచాయి. → ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)లోకి జూన్లో రూ.566 కోట్ల నిధులు వచ్చాయి. → ఈక్విటీల మాదిరిగానే హైబ్రిడ్ ఫండ్స్లోకి కూడా దండిగానే పెట్టుబడులు ప్రవహించాయి. రూ.23,223 కోట్లు లభించాయి. మే నెలలో ఇది రూ.20,765 కోట్లుగా నమోదైంది. → మొత్తంమీద మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు జూన్లో రూ.49,000 కోట్ల నిధులు లభించాయి. మే నెలలో ఈ మొత్తం రూ.29,000 కోట్లుగా ఉంది. → బంగారం ధరల పటిష్ట ధోరణికి అద్దం పడుతూ గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదారణ భారీగా పెరిగింది. మే నెలలో కేవలం రూ.292 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్లలోకి రాగా... జూన్లో ఏకంగా రూ. 2,081 కోట్ల నికర పెట్టుబడులు వచ్చిపడ్డాయి. జనవరి తర్వాత మళ్లీ ఈ స్థాయిలో నిధులు వెల్లువెత్తడం ఇదే తొలిసారి. → మరోపక్క, డెట్ ఫండ్స్ నుంచి నిధుల ఉపసంహరణ వేగం కూడా తగ్గింది. జూన్లో రూ.1,711 కోట్లు బయటికెళ్లాయి. మే నెలలో ఈ మొత్తం రూ.15,908 కోట్లుగా ఉంది. దీనికి ముందు ఏప్రిల్లో డెట్ ఫండ్స్ ఏకంగా రూ.2.2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. → తాజా నిధుల జోరుతో జూన్ చివరి నాటికి ఎంఫ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ రూ. 74.4 లక్షల కోట్లకు ఎగబాకింది. మే చివరికి ఏయూఎం రూ.72.2 లక్షల కోట్లుగా నమోదైంది.సిప్ దన్ను... ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) వృద్ధి పథంలో పయనించడానికి రిటైల్ ఇన్వెస్టర్ల బలమైన భాగస్వామ్యమే కారణం. సిప్ పెట్టుబడులు స్థిరంగా నమోదవుతుండటం ఫండ్ పథకాలకు దన్నుగా నిలుస్తోంది. – వెంకట్ చలసాని, యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్పరిశ్రమకు సానుకూలం... ఈక్విటీ ఫండ్స్లోకి నిధుల ప్రవాహం క్రమంగా పుంజుకోవడం... ఇన్వెస్టర్లలో మళ్లీ విశ్వాసం నెలకొందనడానికి నిదర్శనం. ఎంఎఫ్ పరిశ్రమకు, దేశీ స్టాక్ మార్కెట్లకు ఇది అత్యంత సానుకూలాంశం. – అఖిల్ చతుర్వేది, మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ ఈడీ, సీబీఓస్టాక్ మార్కెట్ జోరుతో దేశీయంగా స్టాక్ మార్కెట్లు మళ్లీ పరుగులు పెడుతుండటంతో అన్ని విభాగాలూ కళకళలాడుతున్నాయి. నిఫ్టీ50తో పాటు మిడ్, స్మాల్ క్యాప్ సూచీలూ పటిష్టమైన ర్యాలీ చేశాయి. ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మళ్లీ ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. – హిమాన్షు శ్రీవాస్తవ, మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ -
డీల్స్ డీలా
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగిపోతుండటం, పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్ఏ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) డీల్స్పై ప్రభావం పడింది. లావాదేవీలు ఏకంగా 48 శాతం పడిపోయాయి. 17 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. పరిమాణంపరంగా 2025 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే రెండో త్రైమాసికంలో ఎంఅండ్ఏ, పీఈ డీల్స్ 13 శాతం క్షీణించి 582కి పరిమితమయ్యాయి. 2023 రెండో క్వార్టర్ తర్వాత త్రైమాసికాలవారీగా డీల్ విలువ ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అనిశ్చితి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న బంగారం ధరలు మొదలైన భౌగోళికరాజకీయాంశాల వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. అయితే, మందగమనంలోనూ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు నిలకడగా వస్తుండటం, కొత్త యూనికార్న్లు ఆవిర్భవిస్తుండటం మొదలైనవి సానుకూలాంశాలని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ (గ్రోత్) శాంతి విజేత తెలిపారు. మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్లాంటి రంగాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనపరుస్తున్నారని వివరించారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → జూన్ త్రైమాసికంలో 5.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 197 ఎంఅండ్ఏ లావాదేవీలు నమోదయ్యాయి. 2023 క్యూ2 తర్వాత ఇది కనిష్ట స్థాయి. తాజా క్యూ2లో బిలియన్ డాలర్ డీల్ ఒకే ఒక్కటి (యస్ బ్యాంక్లో సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ 1.57 బిలియన్ డాలర్ల పెట్టుబడి) నమోదైంది. 2025 క్యూ1లో ఇలాంటి డీల్స్ నాలుగు ఉన్నాయి. → పీఈ కార్యకలాపాలు, గత త్రైమాసికంతో పోలిస్తే తగ్గినప్పటికీ 2022 నాలుగో త్రైమాసికం తర్వాత అత్యధిక స్థాయిలో 7.5 బిలియన్ డాలర్ల విలువ చేసే 357 డీల్స్ నమోదయ్యాయి. → క్యూ2లో పబ్లిక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ పెద్దగా జరగలేదు. వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఐపీవో కార్యకలాపాలు నెమ్మదించాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీలు 12 ఐపీవోల ద్వారా 1.9 బిలియన్ డాలర్లు సమీకరించాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే డీల్స్ పరిమాణం 25 శాతం, విలువ 26 శాతం తగ్గింది. → అయితే, జూన్లో పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించాయి. నెలలవారీగా చూస్తే, ఈ ఏడాది మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ఐపీవోలు, నిధుల సమీకరణ విషయంలో జూన్ రెండో స్థానంలో నిల్చింది. లీలా హోటల్స్ (407 మిలియన్ డాలర్లు), ఏథర్ ఎనర్జీ (343 మిలియన్ డాలర్లు), ఏజిస్ వొప్యాక్ టెరి్మనల్స్ (326 మిలియన్ డాలర్లు) లాంటి పెద్ద లిస్టింగ్లు నమోదయ్యాయి. → దాదాపు క్రితం త్రైమాసికం తరహాలోనే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్కి (క్యూఐపీ) సంబంధించి 2.2 బిలియన్ డాలర్ల విలువ చేసే 16 ఇష్యూలు నమోదయ్యాయి. -
వేదాంత గ్రూప్ ఓ పేకమేడ..!
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ను హిండెన్బర్గ్ రీసెర్చ్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా తాజాగా మరో దిగ్గజం వేదాంత గ్రూప్ను ఇంకో అమెరికన్ షార్ట్సెల్లింగ్ సంస్థ వైస్రాయ్ రీసెర్చ్ టార్గెట్ చేసింది. వేదాంత గ్రూప్ అనేది భారీ అప్పులు, కొల్లగొట్టిన ఆస్తులు, కల్పిత అకౌంటింగ్ గాధలతో కట్టిన ఓ పేకమేడలాంటిది అని ఓ సంచలన నివేదికలో ఆరోపించింది. హోల్డింగ్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ (వీఆర్ఎల్), భారత అనుబంధ సంస్థను పారసైట్లాగా భ్రష్టు పట్టిస్తోందని 85 పేజీల రిపోర్టులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘వేదాంత రిసోర్సెస్ ఓ పారసైట్లాంటి హోల్డింగ్ కంపెనీ. అదొక పోంజీ స్కీము నడిపిస్తోంది. దానికంటూ చెప్పుకోతగ్గ కార్యకలాపాలేమీ లేవు. భారతీయ విభాగం వేదాంత లిమిటెడ్ను (వీఈడీఎల్) కొల్లగొడుతూ బతికేస్తోంది‘ అని వీఆర్ఎల్ బాండ్లలో షార్ట్ పొజిషన్లు తీసుకున్న వైస్రాయ్ రీసెర్చ్ పేర్కొంది. మాతృ సంస్థకు డివిడెండ్ల రూపంలో వేల కోట్లు సమర్పించుకున్నాక వీఈడీఎల్ దగ్గర నగదు నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయాయని, ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపింది. ఇంతగా నిధులు వస్తున్నప్పటికీ, వీఆర్ఎల్ వడ్డీ వ్యయాలు వార్షికంగా 200 మిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు వివరించింది. కంపెనీ 9–11 శాతం వడ్డీ రేటుతో బాండ్లను ఇష్యూ చేయగా, వడ్డీ భారాన్ని చూస్తుంటే ఏకంగా 15.8 శాతం స్థాయిలో కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఇదంతా చూస్తుంటే ఓ స్థాయిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఉందని వివరించింది. వేరే ఖర్చులను వడ్డీల రూపంలో మోసపూరితంగా చూపిస్తుండటం, సిసలైన రుణభారం తెలియకుండా అధిక వడ్డీ రేట్లకు స్వల్పకాలిక రుణాలను తీర్చేస్తుండటం, లేదా రుణ రేట్లు .. షరతులను సరిగ్గా వెల్లడించకపోవడంలాంటివి కారణాలుగా ఉండొచ్చని పేర్కొంది. నిరాధార ఆరోపణలు: వేదాంత గ్రూప్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వేదాంత లిమిటెడ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పాల్గొనడానికి ఒక రోజు ముందు ఈ నివేదిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రిపోర్టును బైటపెట్టిన సమయం చూస్తే, వైస్రాయ్ రీసెర్చ్ తీరు సందేహాలకు తావిచ్చేదిగా ఉందని వేదాంత గ్రూప్ పేర్కొంది. ఇదంతా నిరాధార ఆరోపణలు, వారికి అనువైన సమాచారాన్ని ఉపయోగించుకుని చేస్తున్న విషపూరిత ప్రచారమని తెలిపింది. వివరణ కోసం వైస్రాయ్ రీసెర్చ్ తమను కనీసం సంప్రదించకుండానే రిపోర్ట్ తయారైందని పేర్కొంది. అయితే, దీనికి వైస్రాయ్ రీసెర్చ్ కౌంటర్ ఇచ్చింది. తమ రిపోర్టును వేదాంత గ్రూప్ తోసిపుచ్చలేదని, ప్రశ్నలేవైనా ఉంటే సమాధానాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. వైస్రాయ్ రీసెర్చ్ రిపోర్ట్ దెబ్బతో వేదాంత షేర్లు బుధవారం బీఎస్ఈలో 6 శాతం పడిపోయింది. తర్వాత కొంత కోలుకుని 3.4 శాతం నష్టంతో రూ. 440.80 వద్ద క్లోజయ్యింది. -
ఐటీ అంతంత మాత్రమే!
వివిధ విభాగాలవ్యాప్తంగా డిమాండ్ నెమ్మదించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీ ఐటీ కంపెనీల ఆదాయాల వృద్ధి ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే, మధ్య స్థాయి కంపెనీలు మాత్రం మెరుగ్గా రాణించవచ్చని విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు లెక్కలు వేస్తున్నాయి. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనపడటమనేది సీక్వెన్షియల్గా 100–200 బేసిస్ పాయింట్ల మేర ఆదాయాల వృద్ధికి కలిసి రావచ్చనే అభిప్రాయం నెలకొంది. ఐటీ దిగ్గజాల ఆర్థిక ఫలితాల సీజన్ గురువారం నుంచి ప్రారంభమవుతోంది. జూలై 10న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), 14న హెచ్సీఎల్ టెక్, 16న టెక్ మహీంద్రా.. ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అలాగే జూలై 17న ఎల్టీఐమైండ్ట్రీ, 23న ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు వస్తాయి. ‘క్యూ2లో ఐటీ రంగం ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉండొచ్చు. ప్రథమ శ్రేణి సంస్థల ఆదాయ వృద్ధి స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావచ్చు. అదే సమయంలో మధ్య స్థాయి కంపెనీలు పటిష్టమైన వృద్ధి సాధించవచ్చు’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ 2026 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు గతంలో ప్రకటించిన గైడెన్స్నే కొనసాగించే అవకాశం ఉందని వివరించింది. అమెరికా టారిఫ్లు, స్థూల ఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు మొదలైన అంశాలు క్లయింట్ల వ్యయాలపై ప్రభావం చూపవచ్చని, కాకపోతే త్రైమాసికం ప్రారంభంలో భావించినంతగా డిమాండ్ పడిపోలేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ‘చేసే ఖర్చుకు తగ్గట్లుగా పనితీరును మెరుగుపర్చుకోవడం, మౌలిక సదుపాయాలను ఆధునీకరించుకోవడం, ఏఐ తదితర అంశాలకు సంబంధించిన డీల్స్ గణనీయంగానే ఉన్నాయి’ అని వివరించింది. 90 రోజుల విరామం సానుకూలం.. టారిఫ్ల వడ్డనకు అమెరికా 90 రోజులు విరామం ప్రకటించడమనేది, ఐటీ కంపెనీలకు అతి పెద్ద మార్కెట్పై గల భయాలను కాస్త తగ్గించిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. గత రెండు నెలలుగా నిఫ్టీ ఐటీ 10 శాతం పైగా ర్యాలీ చేయడం ఇందుకు నిదర్శనమని వివరించింది. అయినప్పటికీ కొత్త డీల్స్కి పెద్దగా ఊతం లభించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోఫోర్జ్, పర్సిస్టెంట్ మినహా ఐటీ కంపెనీలు, ఈఆర్అండ్డీ (ఇంజనీరింగ్ రీసెర్చ్, డెవలప్మెంట్) సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. డాలర్ల మారకంలో ఆదాయం కొంత మెరుగ్గా ఉంటుందని వివరించింది. ఆదాయాల వృద్ధిపరంగా మిడ్–క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీల మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. ‘కన్జూమర్, తయారీ, ఆటో, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ విభాగాల్లో డిమాండ్ నెమ్మదించింది’ అని తెలిపింది.ఇతర బ్రోకరేజీల అంచనాలు.. మోతీలాల్ ఓస్వాల్: భౌగోళిక రాజకీయ పరిస్థితులు, టారిఫ్లపరంగా అనిశ్చితి వల్ల కొత్తగా భారీ డీల్స్ కుదుర్చుకోవడంపై ప్రతికూల ప్రభావం పడినప్పటికీ, ప్రస్తుత ఒప్పందాలు యథాప్రకారంగానే అమలవుతున్నాయి. క్లయింట్లు ప్రాజెక్టులను వాయిదా వేయడం, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పరిధిని కుదించడం గానీ చేయలేదు. క్యూ1 ఫలితాల్లో ఇది ప్రతిఫలించవచ్చు. లార్జ్–క్యాప్స్కి సంబంధించి త్రైమాసికాలవారీగా ఆదాయాలు, కాంట్రాక్టుల విలువ పెద్ద ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. త్రైమాసికాలవారీగా లార్జ్ క్యాప్స్ వృద్ధి ‘మైనస్ 2.5% నుంచి ప్లస్ 1.5%’ మధ్యలో ఉండొచ్చు. ‘మైనస్ 2.0% నుంచి ప్లస్ 7% మధ్య వృద్ధి’తో మిడ్–క్యాప్స్ మరోసారి ఆకర్షణీయమైన పనితీరు కనపర్చవచ్చు. బలహీన డాలరు వల్ల 100–200 బేసిస్ పాయింట్ల మేర ప్రయోజనం లభించవచ్చు. ప్రభుదాస్ లీలాధర్: టారిఫ్లపరమైన అనిశ్చితి కాస్త తగ్గినప్పటికీ, వాటి ప్రభావం పడే విభాగాల్లో డిమాండ్ పుంజుకోలేదు. ప్ర స్తుత పరిస్థితులరీత్యా ఆదాయాల వృద్ధి బలహీనంగానే ఉండొచ్చు. -
స్వయం శక్తి
ఆకాశమంతా నాదే... అంటూ విహరించే విహంగాన్ని ఒక మూల పంజరంలో బంధిస్తే ఎలా ఉంటుంది! స్మిను జిందాల్కు కూడా అలాగే అనిపించింది. పదకొండు సంవత్సరాల వయసులో యాక్సిడెంట్కు గురైంది. అలా అని వీల్చైర్కే పరిమితం కాలేదు. ఎన్నో పరిమితులు అధిగమించి పారిశ్రామిక వేత్తగా ఎదిగింది. ‘ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్–2025’ జాబితాలో చోటు సాధించింది...దిల్లీలో ఎలిమెంటరీ స్కూల్ చదువు పూర్తయిన తరువాత జైపూర్లోని ప్రతిష్ఠాత్మకమైన మహారాణి గాయత్రీ దేవి స్కూల్లో చేరిన స్మిను కారు ప్రమాదంలో ప్రాణా పాయం నుంచి బయటపడింది. చదువు, ఆటలు, పాటలతో ఎప్పుడూ చురుగ్గా ఉండే అమ్మాయికి కొన్ని నెలల పాటు వీల్చైర్కే పరిమితం కావడం సంకెళ్లతో బంధించినట్లుగా అనిపించింది. తన రెక్కలు ఎవరో కత్తిరించినట్లుగా అనిపించింది.స్మినుకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కథక్ నృత్యంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘ఇక నేను డ్యాన్స్ చేయలేనా?’ అనే బాధ ఉండేది. అయితే తల్లిదండ్రులు మాత్రం ‘నీకేం జరగలేదు. అన్నీ సర్దుకుంటాయి’ అంటూ ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. స్మినులో ఆత్మవిశ్వాసం పెంచేలా ఎంతోమంది వ్యక్తుల నిజజీవిత గాథలు చెబుతుండేది తల్లి ఆర్తి. బిడ్డను నార్మల్ స్కూల్కే పంపించేది. ‘అమ్మానాన్నలు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అలా అని అతి గారాబం చేసేవారు కాదు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది స్మిను. కొంతకాలం తరువాత తల్లిదండ్రులు స్మిను కోసం ఒక మెషిన్ తీసుకువచ్చారు. ఆ మెషిన్ సహాయంతో రోజుకు కొన్ని గంటలు నిలబడేది. దిల్లీలోని శ్రీరామ్ కాలేజి ఆఫ్ కామర్స్లో డిగ్రీ చేసిన స్మిను ‘జిందాల్ సా లిమిటెడ్’లో మేనేజ్మెంట్ ట్రైనీ స్థాయి నుంచి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరింది. స్మిను జిందాల్ పేరు పక్కన ‘ప్రముఖ పారిశ్రామికవేత్త’ అనే గౌరవం రావడానికి ఎంతోకాలం పట్టలేదు.దివ్యాంగులకు దిశానిర్దేశం, సహాయపడడం లక్ష్యంగా ‘స్వయం’ అనే సంస్థను ప్రారంభించింది. ప్రభుత్వసంస్థలు, విద్యాసంస్థలు, రవాణా సంస్థలతో కలిసి పని చేస్తోంది స్వయం. ‘దివ్యాంగులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటి గురించి చాలామందికి తెలియదు. స్వయం పోర్టల్ ద్వారా దివ్యాంగులకు ఉపయోగడే ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తున్నాం. టూరిజం, స్పోర్ట్స్, శానిటేషన్... మొదలైన రంగాలలో ఇప్పుడు స్వయం పనిచేస్తోంది’ అంటుంది స్మిను. దివ్యాంగులకు మాత్రమే కాదు వృద్ధులు, గర్భిణులు... మొదలైనవారికి ‘స్వయం’ సహాయపడుతోంది. ‘విమానాశ్రయాలు, హోటల్స్, స్టేడియంలాంటి ఎన్నో బహిరంగ ప్రదేశాలలో దివ్యాంగులకు కనీస సదు పాయాలు లేవు’ అంటున్న స్మిను జిందాల్ ‘యాక్సెసబిలిటీ చాంపియన్’గా పేరు తెచ్చుకుంది.‘క్షణం తీరిక లేని వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు?’ అనే ప్రశ్నకు జిందాల్ ఇచ్చిన సమాధానం... ‘పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే పనే పాషన్గా మారినప్పుడు అలసటగా అనిపించదు. నన్ను అర్థం చేసుకునే కుటుంబం దొరకడం నా అదృష్టం. సరిౖయెన ప్రణాళిక ఉంటే వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కష్టమేమీ కాదు’. ఎన్నో సవాళ్లు... అయినా సరే...ఒకటి రెండు అని కాదు... ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. యాక్సిడెంట్ తరువాత జీవనశైలిని పునర్నిర్మించుకోవడం నుంచి పురుషాధిపత్య రంగాలుగా భావించే స్టీల్, ఆయిల్, గ్యాస్ సెక్టార్లలో విజయం సాధించడం వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఒక విధంగా చెప్పాలంటే నన్ను ప్రోత్సహించిన వారే కాదు నిరాశ పరిచిన వారు కూడా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి తోడ్పడ్డారు. ‘నీ వల్ల కాదు’ అని ఎవరైనా అంటే ఆ మాటలను సవాలుగా తీసుకొని చేసి చూపించేదాన్ని.– స్మిను జిందాల్ -
మస్క్కు బిగ్ షాక్.. ‘ఎక్స్’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ సీఈవో పదవి నుంచి లిండా యాకరినో(Linda Yaccarino) వైదొలిగారు. 2023 మే నుంచి రెండేళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి ‘ఎక్స్’ (అంతకముందు ట్విటర్) వెళ్లిన తర్వాత తొలి సీఈవోగా లిండానే కావడం తెలిసే ఉంటుంది. తన రాజీనామా విషయాన్ని స్వయంగా లిండా యాకరినో ఎక్స్వేదికగా ప్రకటించారు. మే 2023 నుంచి జూలై 2025 వరకు ఆమె సీఈవోగా కొనసాగారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ‘ఎక్స్’ బృందంతో కలిసి సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు ‘xAI’తో కలిసి సంస్థ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది అని ఆమె పేర్కొన్నారు.After two incredible years, I’ve decided to step down as CEO of 𝕏. When @elonmusk and I first spoke of his vision for X, I knew it would be the opportunity of a lifetime to carry out the extraordinary mission of this company. I’m immensely grateful to him for entrusting me…— Linda Yaccarino (@lindayaX) July 9, 2025xAI అనేది ఎలాన్ మస్క్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది Grok(గ్రోక్) అనే చాట్బాట్ను అభివృద్ధి చేసింది. అయితే లిండా రాజీనామా సమయంలో Grokపై వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆమె రాజీనామా వాటికి సంబంధం లేదని సమాచారం. ఇక ఎక్స్ కొత్త తదుపరి సీఈవో ఎవరనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎలాన్ మస్క్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
రూల్స్ పాటించాల్సిందే.. ఈ-కామర్స్ సంస్థలకు హెచ్చరిక
ఆహార భద్రత ప్రొటోకాల్స్ను పాటించడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఈ–కామర్స్ సంస్థలను నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. ఉల్లంఘనల విషయంలో కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ–కామర్స్ ప్లాట్ఫాంలకు చెందిన 70 మందికి పైగా ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో జి.కమల వర్ధనరావు ఈ విషయాలు తెలిపారు.ఈ–కామర్స్ సంస్థలన్నీ వినియోగదారులకు ఇచ్చే ప్రతి రసీదు, ఇన్వాయిస్లలో తమ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు/రిజిస్ట్రేషన్ నంబర్లను స్పష్టంగా ముద్రించాలని ఆయన ఆదేశించారు. గిడ్డంగులు, స్టోరేజ్ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రత ప్రొటోకాల్స్ పాటించాలని రావు సూచించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. -
ఎన్విడియా.. ఎన్ని వందల లక్షల కోట్లయ్యా!!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంటూ ఎన్విడియా కార్పొరేషన్ చరిత్ర సృష్టించింది. 4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ .342 లక్షల కోట్లు) మార్కెట్ విలువను చేరుకున్న మొదటి పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా నిలిచింది. అత్యాధునిక ఏఐ ప్రాసెసర్లకు డిమాండ్ పెరగడంతో షేరు ధర 164 డాలర్లను దాటడంతో బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఈ మైలురాయిని సాధించింది.ఈ వాల్యుయేషన్ తో మైక్రోసాఫ్ట్ (3.75 ట్రిలియన్ డాలర్లు), యాపిల్ (3.19 ట్రిలియన్ డాలర్లు)లను అధిగమించి ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2023 జూన్లో తొలిసారి ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిన ఈ చిప్ తయారీ కంపెనీ తర్వాత ఒక్క ఏడాదిలోనే తన మార్కెట్ వ్యాల్యూను ఏకంగా మూడు రెట్లు పెంచుకుంది. అలా 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీల సరసన నిలిచిన ఎన్విడియా వేగంగా 4 ట్రిలియన్ డాలర్ల మార్క్నూ దాటేసి టాప్ కంపెనీగా నిలిచింది.తోడైన కృత్రిమ మేధ విప్లవంగ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ)ల్లో ఎన్విడియా ఆధిపత్యం ఏఐ మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా నిలిచింది. జనరేటివ్ ఏఐ మోడల్స్ నుంచి అటానమస్ వెహికల్స్, డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ వరకు అన్నింటికీ ఈ కంపెనీ తయారు చేసిన చిప్స్ను వినియోగిస్తున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో ఎన్విడియా 70% ఆదాయ పెరుగుదలను నమోదు చేసింది. 44 బిలియన్ డాలర్లను దాటింది. ఇది విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ విపరీతంగా ఉందని, మనం కొత్త పారిశ్రామిక యుగ ఆవిర్భావాన్ని చూస్తున్నామని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చెబుతున్నారు.ప్రపంచ మార్కెట్లపై ప్రభావంఎన్విడియా ఇప్పుడు ఎస్ అండ్ పీ 500 లో 7.3% వాటాను కలిగి ఉంది. ఇది వారసత్వ టెక్ దిగ్గజాలను అధిగమించింది. దీని పెరుగుదల పెట్టుబడి పోర్ట్ఫక్షలియోలు, టెక్ రంగ డైనమిక్స్ను పునర్నిర్వచించింది.ఓ వైపు ఎగుమతి ఆంక్షలు, పెరుగుతున్న పోటీ ఉన్నప్పటికీ, ఎన్విడియా వృద్ధి "స్థితిస్థాపకంగా, అంతర్జాతీయంగా" ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఇండియన్ బడ్డెట్కు 10 రెట్లుఎన్విడియా మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ .342.66 లక్షల కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి భారతీయ సంస్థల మార్కెట్ విలువను కలిపినా దీని కంటే తక్కువే. ఇది కేంద్ర బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. -
లిస్టింగ్కి రెడీ.. ఆరు కంపెనీలకు సెబీ ఓకే
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీల లిస్టింగ్ సన్నాహాలకు ఓకే చెప్పింది. జాబితాలో రైట్ వాటర్ ల్యూషన్స్(ఇండియా), వీడా క్లినికల్ రీసెర్చ్, ఎల్సీసీ ప్రాజెక్ట్స్, శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర, సీడ్వర్క్స్ ఇంటర్నేషనల్ చేరాయి. ఈ ఐదు కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు వీలుగా 2025 జనవరి–ఫిబ్రవరి మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. మరోపక్క ఈ ఏడాది మార్చిలో వియ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఇష్యూపై నిర్ణయాన్ని పక్కనపెట్టిన సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెరసి ఆరు కంపెనీల నిధుల సమీకరణకు లైన్ క్లియరైంది. వివరాలు చూద్దాం.. ఎంబసీ గ్రూప్ దన్ను ప్రీమియం, ఫ్లెక్సిబుల్ కార్యాలయాల నిర్వహణ సంస్థ వియ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ పబ్లిక్ ఇష్యూకి అనుమతి లభించింది. ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేసిన కంపెనీ ఐపీవోలో భాగంగా 4.37 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. క్లీన్ టెక్ కంపెనీ వాటర్ యాక్సెస్ యాక్సెలరేషన్ ఫండ్ ఎస్ఎల్పీకి పెట్టుబడులున్న క్లీన్ టెక్ సంస్థ రైట్ వాటర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 445 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 745 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 225 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఆభరణాల తయారీ జ్యువెలరీ తయారీ కంపెనీ శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ఐపీవోకు సెబీ అనుమతించడంతో 2.43 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 250 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. ఈ బాటలో సీడ్వర్క్స్ ఇంటర్నేషనల్ సైతం లిస్టింగ్ సన్నాహాలు ప్రారంభించనుంది. దీనిలో భాగంగా కంపెనీలో ప్రస్తుత ఇన్వెస్టర్లు 5.19 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈ కంపెనీలన్నీ ఐపీవో ద్వారా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే యోచనలో ఉన్నాయి.ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలు ఈపీసీ కంపెనీ ఎల్సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించడంతో లిస్టింగ్ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు సైతం 2.29 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.క్లినికల్ రీసెర్చ్ సంస్థ ప్రధానంగా క్లినికల్ రీసెర్చ్ కార్యకలాపాలు సమకూర్చే గుజరాత్ కంపెనీ వీడా క్లినికల్ రీసెర్చ్ ఐపీవోకు రెడీ అవుతోంది. ఇందుకు వీలుగా రూ. 185 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.3 కోట్ల షేర్లను ప్రమోటర్, ఇతర వాటాదారులు ఆఫర్ చేస్తారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ కొనుగోలుతోపాటు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. -
ఈపీఎఫ్వో ఈఎల్ఐ స్కీమ్కు పటిష్ట వ్యవస్థ
ఉపాధి కల్పన లక్ష్యాల్లో భాగంగా ప్రకటించిన రూ.1.07 లక్షల కోట్ల ఉద్యోగాల ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్ఐ) స్కీమ్ అమలు కోసం డిజిటల్ సాధనాలతో పటిష్టమైన వ్యవస్థను కార్మిక శాఖ రూపొందించింది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్వో నిర్వహించే సామాజిక భద్రత స్కీముల ద్వారా దీన్ని అమలు చేయనుంది. ఇటు ఉద్యోగులు, అటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈఎల్ఐ స్కీమును తీర్చిదిద్దినట్లు కార్మిక శాఖ మన్సుఖ్ మాండవీయ తెలిపారు.ప్రయోజనాలను నేరుగా ఖాతాలకు బదిలీ చేసే విధంగా ఇది ఉంటుందని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన (ఏబీఆర్వై) అమల్లో అవినీతి, ఫేక్ క్లెయిమ్ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మళ్లీ అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా ఈ స్కీమును పటిష్టంగా తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు. తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో, వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగయోగ్యత, సామాజిక భద్రతను పెంపొందించడం ఈఎల్ఐ స్కీము ప్రధాన ఉద్దేశం. దీనితో వచ్చే రెండేళ్లలో 3.5 కోట్లకు ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల వేతనం (రూ.15,000 వరకు) ఈ స్కీము కింద లభిస్తుంది. అదనంగా ఉద్యోగాలను కల్పించనందుకు అటు వ్యాపార సంస్థలకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. తయారీ రంగానికి మరో రెండేళ్లు అదనంగా ప్రయోజనాలు అందుతాయి. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కల్పించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. -
ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం
పేరున్న కాలేజీలో పెద్ద పెద్ద డిగ్రీలు చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయన్న భావనకు కాలం చెల్లిపోతోంది. ఏఐ టెక్నాలజీ విస్తృతమవుతున్న నేపథ్యంలో కాలేజీలు, డిగ్రీలతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే చాలు రూ.లక్షల్లో జీతాలతో ఉద్యోగాలిస్తామంటూ ముందుకొస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ఓ స్టార్టప్ ఫౌండర్ సోషల్ మీడియాలో అసాధారణమైన జాబ్ లిస్టింగ్ను పోస్ట్ చేసి ఆన్లైన్లో విస్తృత చర్చను రేకెత్తించారు.‘స్మాల్ ఏఐ’ అనే ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ తన కంపెనీకి ఫుల్ స్టాక్ టెక్ లీడ్ కావాలంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ జాబ్కి ఆయన రూ .1 కోటి వార్షిక వేతన పరిహారాన్నిఆఫర్ చేశారు. ఈ ప్యాకేజీలో రూ.60 లక్షల ఫిక్స్డ్ వార్షిక వేతనం కాగా రూ.40 లక్షలు కంపెనీ యాజమాన్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి అభ్యర్థి కాలేజీ డిగ్రీలతో నిమిత్తం లేదని, రెజ్యూమ్ కూడా అక్కర్లేదని ప్రకటించడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.ఇంకా ఈ ఉద్యోగానికి ఏమేం కావాలన్నది కామత్ వివరించారు. ఆదర్శ అభ్యర్థికి "4-5 సంవత్సరాల అనుభవం" ఉండాలని, "నెక్ట్స్ జెఎస్, పైథాన్, రియాక్ట్ జెఎస్" గురించి బాగా తెలిసి ఉండాలని కామత్ పేర్కొన్నారు. అలాగే ఈ ఉద్యోగం బెంగళూరు కేంద్రంగా ఉంటుందని, ఎంపికైనవారు తక్షణమే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా జాబ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానంలో ఉంటుందని, వారానికి 5 రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాలని కూడా వివరించారు.ఈ జాబ్కు అప్లయి చేయడానికి రెజ్యూమె అవసరం లేదని, కేవలం 100 పదాలతో తమ గురించి తెలియజేస్తే చాలంటూ కంపెనీ ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. కామత్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందిస్తున్నారు.Hiring a cracked full-stack lead at Smallest AISalary CTC - 1 CrSalary Base - 60 LPASalary ESOPs - 40 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 4-5 years minimumLanguages - Next JS, Python, React JSWork from Office - 5 days a week (slightly…— Sudarshan Kamath (@kamath_sutra) July 7, 2025 -
ఐఫోన్ 17: చైనా టెకీలు వెళ్లిపోయినా పర్లేదు..
యాపిల్ వెండార్ల ప్లాంట్లలో పని చేసే చైనా టెకీలు స్వదేశాలకు వెళ్లిపోయినా భారత్లో ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తి ప్రణాళికలు యథాతథంగానే కొనసాగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి, ఐఫోన్ల తయారీలో కీలకమైన యంత్రపరికరాల దిగుమతులు ఇటీవలి కాలంలో మెరుగుపడ్డట్లు వివరించాయి.భారత్లో ఫాక్స్కాన్, టాటా ఎల్రక్టానిక్స్ సంస్థలు యాపిల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. గత రెండు నెలలుగా ఫాక్స్కాన్ ఇండియా యూనిట్లలో పని చేస్తున్న వందలకొద్దీ చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. వీరంతా అసెంబ్లీ లైన్స్, ఫ్యాక్టరీ డిజైన్, ఇతరత్రా సిబ్బందికి శిక్షణనిచ్చే విధులు నిర్వర్తించేవారు.దీనితో ఐఫోన్ల తయారీపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ, భారత్లో ఐఫోన్ల ఉత్పత్తిని 3.5–4 కోట్ల స్థాయి నుంచి ఈ ఏడాది 6 కోట్లకు పెంచుకోవాలన్న యాపిల్ టార్గెట్లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు వివరించాయి. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.రేంజిబౌండ్ సెషన్ తర్వాత దిశా సంకేతాలు లేకపోవడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు నష్టాల వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 176.43 పాయింట్లు (0.21 శాతం) క్షీణించి 83,536.08 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.4 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 25,476.10 వద్ద ముగిశాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.59 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 1.49 శాతం, 1.4 శాతం, 1.25 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, ఐటీ, మీడియా, పీఎస్యూ బ్యాంక్, హెల్త్కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికాకు చెందిన వైస్రాయ్ రీసెర్చ్ తన మాతృసంస్థ రుణభారం తగ్గించుకోవడంతో మైనింగ్ దిగ్గజం వేదాంత షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. అదేసమయంలో హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.09 శాతం క్షీణించి 11.9 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఈపీఎఫ్ వడ్డీ జమ.. ఈవారమే
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యుల ఖాతాల్లో పొదుపు నిధిపై.. 2024–25 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ జమను ఈ వారంలోనే పూర్తి చేయనున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ‘33.56 కోట్ల సభ్యులకు సంబంధించిన 13.88 లక్షల సంస్థల వార్షిక అకౌంట్ అప్డేషన్ పూర్తయింది. జులై 8 నాటికి 13.86 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేయడం ముగిసింది. అంటే ఇప్పటికే 96.51 సభ్యుల ఖాతాలకు వడ్డీ జమైంది’ అని మంత్రి వివరించారు.గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సభ్యుల నిధిపై, అంతకుముందు ఆర్థిక సంవత్సరం మాదిరే 8.25% వడ్డీ రేటును ఇవ్వాలని ఈపీఎఫ్వో ఫిబ్రవరి 28న నిర్ణయించగా.. కేంద్ర ప్రభుత్వం మే 22న ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో జూన్ 6 నుంచే వార్షిక ఖాతాల అప్డేషన్ మొదలైనట్టు తెలిపారు. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆగస్ట్–డిసెంబర్లో వడ్డీ జమ జరిగింది.వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..స్టెప్ 1: ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ( epfindia.gov.in )సందర్శించండిస్టెప్ 2: అవర్ సర్వీసెస్ > ఫర్ ఎంప్లాయీస్ > మెంబర్ పాస్బుక్కు వెళ్లండిలేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్ను క్లిక్ చేయండి.స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.స్టెప్ 5: పాస్బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండిపాస్బుక్లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. -
‘ఆధార్ పౌరుల తొలి గుర్తింపు కాదు’
బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కోసం ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల నుంచి ఆధార్ను మినహాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈఓ భువనేష్ కుమార్ స్పష్టతనిచ్చారు. ఆధార్ పౌరుల తొలి గుర్తింపు కాదని చెప్పారు. ప్రభుత్వ సర్వీసులు సులువుగా పొందేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు.ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన కుమార్ నకిలీ ఆధార్ కార్డులను తనిఖీ చేసి వాటిని గుర్తించేందుకు యూఐడీఏఐ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆధార్ కార్డులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటర్నల్ భద్రతా యంత్రాంగం ఉందని పేర్కొన్నారు. జారీ చేసిన అన్ని కొత్త ఆధార్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉందని, యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్ త్వరలో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డులోని వివరాలను క్యూఆర్ కోడ్లో పొందుపరిచిన వాటితో సరిపోల్చుకోవచ్చని చెప్పారు. ఎవరైనా నకిలీ ఆధార్ కార్డు చూపిస్తే దీని ద్వారా సులభంగా చెక్ చేయవచ్చని తెలిపారు.ఫొటోషాప్ లేదా ప్రింటెడ్ టెంప్లెట్లను ఉపయోగించి ప్రజలు నకిలీగా ఆధార్ కార్డులను సృష్టిస్తున్న సందర్భాలున్నాయని కుమార్ వివరించారు. కొత్త ఆధార్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందని వెల్లడించారు. ‘ఇప్పటికే ఈ యాప్కు డెమో నిర్వహించారు. ఇది పురోగతిలో ఉంది. అంతర్గతంగా దాన్ని చెక్ చేస్తున్నారు. ఈ యాప్ ప్రాథమికంగా ఆధార్ నంబర్ హోల్డర్ సమ్మతితో డిజిటల్ పద్ధతిలో ఐడెంటిటీని పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త యాప్ ద్వారా ప్రజలు తమ ఆధార్ కార్డుల ఫిజికల్ కాపీలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో మాస్క్డ్ వెర్షన్ కూడా ఉంటుంది’ అన్నారు.ఇదీ చదవండి: అంతా ఫేక్.. నమ్మొద్దు!జూన్ 24న ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జులై 25 నాటికి బిహార్లో దాదాపు 8 కోట్ల మంది ఓటర్లలో అనర్హుల పేర్లను తొలగించి, అర్హులైన పౌరుల జాబితానే సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రం అంతటా విస్తృతంగా ఉన్న ఆధార్, ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డులను గుర్తింపు రుజువుగా అంగీకరించకపోవడం వల్ల ఓటర్లు అసౌకర్యానికి గురవుతున్నారని రాష్ట్ర అసెంబ్లీలో ఆయన తెలిపారు. -
అంతా ఫేక్.. నమ్మొద్దు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించినట్లు వచ్చిన వార్తలపై అక్కడి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను త్వరలో జారీ చేయనున్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని యూఏఈ ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఈ కథనాలు పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేశాయి.లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తున్నట్లు రాయద్ గ్రూప్ తెలిపింది. దాంతో చాలా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. ఇవికాస్తా వైరల్గా మారడంతో దుబాయ్ ప్రభుత్వమే రంగంలోకి దిగి స్పష్టతనిచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఇలా వస్తున్న కథనాలను నమ్మకూడదని తేల్చి చెప్పాయి.UAE denies lifetime Golden Visa eligibility for Indians, Bangladeshis; dismisses ₹23 lakh reporthttps://t.co/FcxxTHOnpx— Hindustan Times (@htTweets) July 9, 2025ఇదీ చదవండి: యాపిల్ కొత్త సీఓఓ మనోడే..‘అన్ని గోల్డెన్ వీసా అప్లికేషన్లు అధికారిక యూఏఐ ప్రభుత్వ మార్గాలు, స్పష్టమైన విధానాల ద్వారానే ప్రాసెస్ అవ్వాలి. దరఖాస్తుదారులను నమ్మించేలా, వారి అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి లేదా నామినేట్ చేయడానికి ఏ బాహ్య కన్సల్టెన్సీకి లేదా ఏజెన్సీకి అధికారం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల ఆకాంక్షలను దుర్వినియోగం చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. ఖచ్చితమైన వివరాల కోసం దరఖాస్తుదారులు ఐసీపీ అధికారిక వెబ్సైట్ లేదా 600 522 222 హెల్ప్లైన్ను సంప్రదించాలని కోరింది. -
యాపిల్ కొత్త సీఓఓ మనోడే..
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ కొత్తగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్ను నియమించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో జెఫ్ విలియమ్స్ సేవలందించారు. 2015 నుంచి సీఓఓ పదవిలో ఉన్న జెఫ్ విలియమ్స్ ఇకపై కంపెనీ సీఈఓ టిమ్ కుక్కు రిపోర్ట్ చేస్తూ యాపిల్ వాచ్, డిజైన్ బృందాలను పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది చివర్లో విలియమ్స్ పదవీ విరమణ చేసిన తర్వాత డిజైన్ బృందం నేరుగా టిమ్కు నివేదిస్తుందని యాపిల్ పేర్కొంది.ఎవరీ సబీహ్ ఖాన్..యాపిల్ సంస్థలో 30 ఏళ్లుగా పనిచేస్తూ, ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్గా సేవలందిస్తున్న సబీహ్ ఖాన్ ఈ నెలాఖరులో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో 1966లో జన్మించిన ఖాన్ చదువుకునే రోజుల్లోనే సింగపూర్కు మకాం మార్చారు. టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్లో డ్యూయల్ బ్యాచిలర్ డిగ్రీలు పొందారు. రెన్సెలీర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ (ఆర్పీఐ) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ పట్టా సాధించారు.Many congratulations to Sabih Khan on being elevated as the COO of AppleI had the pleasure of meeting and interacting with Sabih a few years ago when he was leading Global supply chain operations for AppleOnwards and upwards my friend 👏 pic.twitter.com/TbsYffwLJv— KTR (@KTRBRS) July 9, 2025ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్జీఈ ప్లాస్టిక్స్లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన తరువాత ఖాన్ 1995లో యాపిల్లో చేరారు. అప్పటి నుంచి అతను గ్లోబల్ సప్లై చైన్, సప్లయర్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్, ఆపరేషనల్ స్ట్రాటజీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. యాపిల్ గ్లోబల్ స్ట్రాటజీలో కీలక మార్కెట్గా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో ఖాన్ ఈ పదవిని చేపట్టడం గమనార్హం. ఖాన్ భారాస నేత కేటీఆర్ స్నేహితుడు కావడంతో తన ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. -
కీలక ఉత్పత్తిపై ట్రంప్ 50 శాతం సుంకం
ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికాలు, పవర్ గ్రిడ్లలో విరివిగా ఉపయోగించే కాపర్ దేశీయ ఉత్పత్తిని పెంచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ దిగుమతి చేసుకునే కాపర్పై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ కేబినెట్ సమావేశంలో వివరాలు వెల్లడించారు. టారిఫ్ రేటును ప్రకటించినప్పటికీ, ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారో మాత్రం తెలియజేయలేదు.ఉక్కు, అల్యూమినియం, ఆటో విడిభాగాలపై ఇదే విధమైన సుంకాలను ఇప్పటికే విధించారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కాపర్ ధరలు రికార్డు గరిష్టాలకు పెరిగాయి. కమోడిటీ ఎక్స్చేంజీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ పౌండ్కు 10% పైగా పెరిగి 5.8955 డాలర్లకు చేరుకుంది. దిగుమతి సుంకం వల్ల యూఎస్లోని చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయనే అంచనాలతో యూఎస్ కాపర్ ఉత్పత్తిదారు ఫ్రీపోర్ట్ మెక్మోరాన్ షేర్లు 5% పెరిగాయి.ఫార్మాపై కూడా..అమెరికా ప్రస్తుతం తన కాపర్ వినియోగంలో దాదాపు సగం దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఎక్కువ భాగం చిలీ నుంచే సమకూరుతుంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ దేశంలో తయారయ్యే కాపర్పై ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. కేబినెట్ సమావేశంలో ట్రంప్ అదనంగా మరిన్ని సుంకాల గురించి కూడా సంకేతాలు ఇచ్చారు. ఫార్మాస్యూటికల్ దిగుమతులపై 200% సుంకం రావచ్చని, అయితే కంపెనీలు తమ ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తరలించడానికి 18 నెలల వరకు సమయం ఉండవచ్చని ఆయన సూచించారు.ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్కాపర్పై సుంకాలతో కీలక రంగాలపై ప్రభావంఎలక్ట్రిక్ వాహనాలు: బ్యాటరీలు, మోటార్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు రాగి అవసరం.నిర్మాణం, విద్యుత్ రంగం: పవర్ గ్రిడ్, నిర్మాణ రంగం రాగి వైరింగ్, ట్యూబ్లపై ఎక్కువగా ఆధారపడుతాయి. ఇది భవన ఖర్చులను పెంచుతుంది.ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్: ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాల్లో గణనీయంగా రాగిని ఉపయోగిస్తారు.డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్: సైనిక పరికరాల్లో వైరింగ్, ఎలక్ట్రానిక్స్ కోసం రాగిని ఎక్కువగా వాడుతారు. -
దేశాలు పిలుస్తున్నాయ్..
మనలో చాలామంది ఇతర దేశాల పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడాలనుకుంటారు. అయితే ఇది మధ్యతరగతి వారికి కొంత కష్టం కావొచ్చుకానీ, ధనవంతులకు మాత్రం సులువే. అందుకు అనుగుణంగా ప్రస్తుతం చాలా దేశాలు వాటి సిటిజన్షిప్ నియమాల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత మొన్నామధ్య ఆ దేశ పౌరసత్వం పొందాలంటే గోల్డ్కార్డు వీసా తీసుకోవాలని దాన్ని ప్రదర్శించారు. డబ్బు కడితే చాలా దేశాల పౌరసత్వం కార్డు మీ జేబులో ఉంటుంది. ఈ లిస్ట్లో కేవలం యూఎస్తోపాటు చాలా దేశాలే ఉన్నాయి. ప్రధానంగా ఏయే దేశాలు తమ పౌరసత్వం కోసం ఎలాంటి నిబంధనలు పెట్టాయో తెలుసుకుందాం.యూఎస్ఏఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు) విలువైన కొత్త గోల్డ్ కార్డు వీసాలు ప్రారంభించింది. సంపన్న విదేశీయులకు గోల్డ్ కార్డులను అందించడానికి ట్రంప్ ఈ కొత్త ప్రణాళికను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టారు. ఇది వారికి యూఎస్ రెసిడెన్సీ, పౌరసత్వానికి అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటు అమెరికా ఖజానాకు ట్రిలియన్ల ఆదాయాన్ని సృష్టించగలదని, ఇది దేశ రుణాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుందని తెలిపారు. కొత్త గోల్డెన్ కార్డు కొంత వరకు గ్రీన్ కార్డు మాదిరి వెసులుబాటు అందిస్తున్నా ప్రధానంగా సంపన్నులపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని ట్రంప్ మార్చాలని యోచించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేశారు. ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు)తో పొందాల్సి ఉంటుంది. యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెబ్సైట్ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ వీసాలను పొందారు.జన్మతః పౌరసత్వాన్ని గుర్తించరు..ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 8,00,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. దాంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చి వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది.సింగపూర్ గోల్డెన్ వీసావ్యాపార అవకాశాలు, అధిక జీవన నాణ్యతను కోరుకునే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులకు సింగపూర్ గమ్యస్థానంగా తోస్తుంది. సింగపూర్లో గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ (జీఐపీ) ద్వారా భారీ పెట్టుబడులు పెట్టేవారికి పౌరసత్వం కల్పిస్తున్నారు. దేశంలో శాశ్వత ఉనికిని చాటుకోవాలనుకునే అల్ట్రా-హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) కోసం ఈ వీసా ప్రోగ్రామ్ రూపొందించారు. ఈ వీసా ప్రాసెసింగ్ సమయం సాధారణంగా 9–12 నెలలుగా ఉంటుంది. జీఐపీలో పౌరసత్వం పొందాలంటే కనీసం 10 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ.67 కోట్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. జీఐపీకు అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి. టెక్, హెల్త్కేర్, లాజిస్టిక్స్ లేదా ఫైనాన్స్ వంటి ఆమోదించబడిన రంగాల్లో ఒకదానిలో బిజినెస్ చేస్తుండాలి.పౌరసత్వం ఎప్పుడు వస్తుందంటే..గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ కింద పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) హోదా పొందిన రెండేళ్ల తర్వాత, దరఖాస్తుదారులు ప్రత్యేకంగా సింగపూర్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో కీలకమైన షరతు ఉంది. సింగపూర్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. అందువల్ల ఆ దేశ పౌరసత్వం పొందడానికి దరఖాస్తుదారులు తమ ప్రస్తుత పౌరసత్వాన్ని వదులుకోవాలి.ప్రయోజనాలుసింగపూర్ గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ పెట్టుబడిదారులకు అందించే వీసా ఉంటే 190కి పైగా దేశాలకు ప్రత్యేకంగా వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సింగపూర్లో గరిష్టంగా 24% వరకు మాత్రమే వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ స్థాయి వైద్యం, విద్య, ఉన్నత జీవన ప్రమాణాలకు సింగపూర్ కీలకంగా మారింది.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంయూకేయూకేలో ఈ గోల్డ్కార్డ్ వీసాను అధికారికంగా ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాగా పిలుస్తారు. పెట్టుబడిదారులను, ప్రతిభావంతులైన ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి యూకే ప్రయత్నాల్లో భాగంగా 2020లో ఈ వీసాను ప్రవేశపెట్టింది. ఇది యూకేలో వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత శాశ్వత నివాసానికి ఇండెఫినెట్ లీవ్ టు రిమేన్(ఐఎల్ఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఐఎల్ఆర్ ప్రక్రియలో దరఖాస్తుదారులు కనీసం 5 సంవత్సరాలు (ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాపై గడిపిన సమయంతో సహా) యూకేలో నివసించినట్లు రుజువు చేయాలి. ఇతర నివాస, ఆదాయ ప్రమాణాలను చేరుకోవాలి. వ్యాపారంలో కనీసం 50000 పౌండ్లు(రూ.58,29,000) పెట్టుబడి పెట్టాలి.ఈ వీసాకు అర్హతలు..ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాకు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆమోదం పొందాలి. యూకే ప్రభుత్వం గుర్తించిన బిజినెస్ ఇంక్యుబేటర్, ఇన్వెస్టర్ ద్వారా ఆమోదం పొందాలి. మీ వ్యాపార ఆలోచన సృజనాత్మకమైనదని, ఆచరణీయమైనదని ఆ ఈ సంస్థ ధ్రువీకరించాలి. దరఖాస్తుదారులు బీ2 స్థాయి ఇంగ్లిష్ (సీఈఎఫ్ఆర్ స్కేల్) కలిగి ఉండాలి. ఇది అప్పర్ ఇంటర్మీడియట్ నైపుణ్యానికి సమానం. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా దీన్ని నిరూపించవచ్చు. -
ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) నిన్నటి సెషన్లో పెరిగి తిరిగి ఈరోజు మళ్లీ ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధర పడిపోయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: వయసు 34.. 10 ఏళ్లు ఉద్యోగం.. రూ.4 కోట్లు సంపద -
నేడే టారిఫ్ డెడ్లైన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు తగ్గి 25,481కు చేరింది. సెన్సెక్స్(Sensex) 177 ప్లాయింట్లు దిగజారి 83,522 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమెరికన్ సంస్థల్లో హైదరాబాద్ కంపెనీ విలీనం
హైదరాబాదీ ఏజెంటిక్ ఏఐ సంస్థ కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా అమెరికాకు చెందిన కోనాఏఐ, డీక్యూబ్ డేటా సైన్సెస్లో విలీనమైంది. ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఏజెంటిక్ ఏఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ఈ వ్యూహాత్మక విలీనం దోహదపడగలదని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.ఇదీ చదవండి: బడ్జెట్ ధరలో మోటో 5జీ ఫోన్ఏఐ ఆధారిత సర్వీసెస్ యాజ్ సాఫ్ట్వేర్ విభాగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. ఇకపై కోవాసెంట్కి అనిల్ కోనా సీవోవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వ్యవహరిస్తారు. కోనాఏఐ, డీక్యూబ్ వ్యవస్థాపకుడు అయిన అనిల్కి ఫోరెన్సిక్ అనలిటిక్స్.. సైబర్ సెక్యూరిటీలో అపార అనుభవం ఉంది. -
బడ్జెట్ ధరలో మోటో 5జీ ఫోన్
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా బడ్జెట్ ధరలో ‘మోటో జీ96’ 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. రూ.17,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ బడ్జెట్ ఫోన్ను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్ను స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 256 జీబీ స్టోరేజ్తో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంఫీచర్లు..144 హెచ్జెడ్ 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ని వాడారు. వెనుక 50 ఎంపీ సోనీ ఎల్వైటీ–700సీ కెమెరా ఉంది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128బీజీ స్టోరేజ్లతో 2 వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.17,999గా ఉంది. ఈ జూలై 16 నుంచి ఫ్లిప్కార్ట్, మోటోరొలా వెబ్సైట్లతో పాటు రిటైల్ షాపుల్లో అమ్మకాలు ప్రారంభవుతాయి. -
క్యాప్జెమిని చేతికి డబ్ల్యూఎన్ఎస్
సొంత అవసరాల కోసం దేశీయంగా మూడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ ఎయిర్వేస్ నెలకొల్పిన డబ్ల్యూఎన్ఎస్ చివరికి ఫ్రెంచ్ దిగ్గజం క్యాప్జెమిని చేతికి చిక్కింది. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(బీపీఎం) సంస్థ డబ్ల్యూఎన్ఎస్ను 330 కోట్ల డాలర్ల(సుమారు రూ. 28,250 కోట్లు) నగదు చెల్లింపు ద్వారా క్యాప్జెమిని సొంతం చేసుకోనుంది. బీపీఎం రంగంలో భారీ డీల్కు తెరతీస్తూ టెక్నాలజీ సేవల గ్లోబల్ దిగ్గజం క్యాప్జెమిని.. డబ్ల్యూఎన్ఎస్ను కొనుగోలు చేస్తోంది. ఒక్కో షేరుకీ 76.5 డాలర్లు చొప్పున ఆఫర్ చేసింది. ఇది గురువారం ముగింపు(ఎన్వైఎస్ఈ) ధరతో పోలిస్తే 17 శాతం అధికంకాగా.. నెల రోజుల సగటు ధరతో చూస్తే 27 శాతం ప్రీమియం చెల్లిస్తోంది. ఇందుకు నగదు రూపేణా మొత్తం 3.3 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. వెరసి బీపీఎం విభాగంలో అతిపెద్ద డీల్స్లో ఒకటిగా ఇది నిలవనుంది. తాజా డీల్కు రెండు సంస్థల బోర్డులు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు క్యాప్జెమిని వెల్లడించింది. రెండు కంపెనీలూ భారత్లో పటిష్ట కార్యకలాపాలు విస్తరించాయి. సంయుక్తంగా 2,00,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి. తాజా కొనుగోలుతో తమ క్లయింట్లకు బిజినెస్, టెక్నాలజీ ట్రాన్స్ఫార్మేషన్ కార్యకలాపాలను క్యాప్జెమిని.. మరింత సమర్థవంతంగా సమకూర్చగలుగుతుంది. సంప్రదాయ బిజినెస్ ప్రాసెస్ సర్వీసుల నుంచి ఆధునిక ఏఐ ఆధారిత మేథో కార్యకలాపాలను క్యాప్జెమిని అందించగలుగుతుంది.ఇదీ చదవండి: రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్డబ్ల్యూఎన్ఎస్ నేపథ్యమిదీ...1999లో బ్రిటిష్ ఎయిర్వేస్ ముంబైలో సొంత అవసరాల కోసం డబ్ల్యూఎన్ఎస్ను నెలకొలి్పంది. పుణేలో డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేసింది. 2002లో వార్బర్గ్ పింకస్ 40 కోట్ల డాలర్లకు మెజారిటీ వాటా కొనుగోలు చేసి కంపెనీ పేరును డబ్ల్యూఎన్ఎస్గా మార్చింది. 2006లో ఎన్వైఎస్ఈలో లిస్ట్ చేసింది. 2013లో వార్బర్గ్ పింకస్ 19.2 కోట్ల డాలర్లకు డబ్ల్యూఎన్ఎస్ను విక్రయించింది. కంపెనీ ప్రధానంగా బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్తోపాటు.. డేటా అనలిటిక్స్ సర్వీసులు అందిస్తోంది. 2025లో 1.27 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. -
భారతి సిమెంట్కు ఎస్డీఎఫ్ 5 స్టార్ రేటింగ్
సుస్థిర అభివృద్ధి ఫ్రేమ్వర్క్ (ఎస్డీఎఫ్) కింద 2023–24 ఏడాదికి గాను భారతి సిమెంట్ సున్నపు గనికి వరుసగా ఆరో ఏడాది కేంద్ర గనుల శాఖ నుంచి 5 స్టార్ రేటింగ్ దక్కింది.జైపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా కంపెనీ సీఎంవో ఎం సాయి రమేశ్, హెడ్ (మైన్స్) కె. సుధాకర్ పురస్కార పత్రాలను అందుకున్నారు. -
చివర్లో కొనుగోళ్లు
ముంబై: ట్రేడింగ్ చివర్లో బ్యాంకులు, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 270 పాయింట్లు పెరిగి 83,713 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు బలపడి 25,523 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. అమెరికా–భారత్ వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ 491 పాయింట్ల పరిధిలో 83,321 వద్ద కనిష్టాన్ని, 83812 వద్ద గరిష్టాన్ని తాకింది.నిఫ్టీ 25,424 – 25,548 శ్రేణిలో కదలాడింది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఆరు ప్రధాన కరెన్సీ విలువలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ బలహీనపడడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు బలపడి 85.73 వద్ద స్థిరపడింది. యూరప్ మార్కెట్లు అరశాతం లాభాల్లో ముగిశాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ కంపెనీ తొలి త్రైమాసిక వ్యాపార అప్డేట్ ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో టైటాన్ కంపెనీ షేరు 6% నష్టపోయి రూ.3,441 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఆరున్నర శాతం క్షీణించి రూ.3,435 వద్ద కనిష్టాన్ని తాకింది. షేరు పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.20,086 కోట్లు కోల్పోయి రూ.3.05 లక్షల కోట్లకు దిగివచి్చంది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా నష్టపోయి షేరు ఇదే. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘మినిమం’ చార్జీల ఎత్తివేత
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస నిల్వ(మినిమం బ్యాలెన్స్) పెనాల్టీ చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, కొన్ని రకాల డిపాజిట్లు, రుణ రేట్లను సైతం సవరించింది. 999 రోజులకు సంబంధించి గ్రీన్ డిపాజిట్పై వడ్డీ రేటును 7% నుంచి 6.7 శాతానికి తగ్గించింది. రూ.లక్ష నుంచి రూ.10 కోట్ల మధ్య డిపాజిట్లకు ఈ రేటు అమలవుతుంది. సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్లపై రేటును 2.7% (వార్షిక) నుంచి 2.5 శాతానికి తగ్గించింది. ఇక గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.ఇప్పటికే తీసుకున్న గృహ రుణాలతోపాటు కొత్తగా తీసుకునే గృహ రుణాలకు ఇది అమలవుతుందని తెలిపింది. సవరణ తర్వాత గృహ రుణాలపై వడ్డీ రేటు 7.35% నుంచి ప్రారంభమవుతుంది. రుణ గ్రహీత సిబిల్ స్కోరు ఆధారంగా ఈ రేటు మారుతుంది. ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేవారికి 7.5% రేటుకే విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాహన రుణాలపైనా అర శాతం రేటు తగ్గించినట్టు తెలిపింది. ఈ నిర్ణయాలు ఈ నెల 7 నుంచే అమల్లోకి వచి్చనట్టు పేర్కొంది. ఇప్పటికే ఎస్బీఐ, పీఎన్బీ, ఇండియన్ బ్యాంక్ సైతం సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస బ్యాలన్స్ పెనాల్టీ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. -
మళ్లీ మొబైల్ బిల్లుల మోత!
టెలికం యూజర్లు పెరుగుతున్న నేపథ్యంలో టెల్కోలు మరో విడత చార్జీల వడ్డనకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 10–12 శాతం మేర పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యస్తంగాను, అధిక మొత్తంలోను చెల్లించే వర్గాలు టార్గెట్గా ఈ పెంపు ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది జూలైలోనే బేస్ ప్లాన్లను 11–23 శాతం పెంచేసినందున, ఈసారి వాటి జోలికెళ్లకుండా డేటా అ్రస్తాన్ని వాడుకోవాలనే యోచనలో కంపెనీలు ఉన్నట్లు పేర్కొన్నాయి. బేస్ ప్లాన్లను మళ్లీ పెంచితే యూజర్లు.. ప్రత్యర్థి కంపెనీకి మారిపోయే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం.కాబట్టి ఈసారి డేటా ప్రయోజనాలను తగ్గించేసి, మరింత ఖరీదైన ప్లాన్ల వైపు మళ్లించేలా ఈ విడత పెంపు ఉండబోతోందని సంబంధిత వర్గాలు వివరించాయి. డేటా వినియోగం, డేటా స్పీడ్ లేదా డేటాను అత్యధికంగా వినియోగించే వేళలకు వర్తించే విధంగా ఈ పెంపు ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. టారిఫ్ల స్వరూపం మారాల్సిన అవసరం ఉందంటూ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టాప్ మేనేజ్మెంట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చార్జీల పెంపు వార్తలకు ఊతమిస్తున్నాయి. అందరికీ ఒకే రకం టారిఫ్ను వర్తింపచేయడమనేది సరి కాదంటూ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఈ మధ్య వ్యాఖ్యానించారు. ఇటువినియోగదారులు, అటు కస్టమర్లు బండిల్డ్ ప్లాన్లకు అప్గ్రేడ్ కావడం వల్ల దేశీ టెలికం పరిశ్రమ ఆదాయ వృద్ధి 2025–27 ఆర్థిక సంవత్సరాల్లో రెండంకెల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు బీఎన్పీ పారిబా ఒక నివేదికలో తెలిపింది. యాక్టివ్ యూజర్ల వృద్ధి.. మే నెలలో యాక్టివ్ యూజర్ల సంఖ్య 29 నెలల గరిష్టమైన 74 లక్షలకు ఎగియడంతో మొత్తం యాక్టివ్ యూజర్ల సంఖ్య 108 కోట్లకు చేరింది. దీనితో వరుసగా అయిదు నెలల పాటు కొత్త యూజర్ల సంఖ్య పెరిగినట్లయింది. మే నెలలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొత్త యూజర్ల సంఖ్య 55 లక్షలు పెరిగింది. దీంతో జియో యాక్టివ్ యూజర్ల సంఖ్య 150 బేసిస్ పాయింట్లు (సుమారు 1.5 శాతం) పెరిగి, పరిశ్రమవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ యూజర్లలో వాటా 53 శాతానికి చేరింది. అటు భారతి ఎయిర్టెల్ కొత్త యూజర్ల సంఖ్య 13 లక్షలు పెరిగింది.మొత్తం యాక్టివ్ యూజర్లలో ఎయిర్టెల్ వాటా 36 శాతానికి పెరిగింది. రాబోయే రోజుల్లో 5జీ సేవల విస్తరణ, వినియోగం ఆధారంగా కొత్త కనెక్షన్లు ఉంటాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జియోలాంటి టాప్ ఆపరేటర్ల యూజర్లు పెరగడమనేది భవిష్యత్తులో టారిఫ్ల పెంపునకు సానుకూల పరిస్థితులున్నట్లుగా కనిపిస్తోందని బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ పేర్కొంది. వొడాఫోన్ ఐడియా యూజర్లు తగ్గిపోయే కొద్దీ ఎయిర్టెల్, జియోల మా ర్కెట్ వాటా మరింతగా పెరుగుతుందని తెలిపింది. – సాక్షి, బిజినెస్డెస్క్ -
వయసు 34.. 10 ఏళ్లు ఉద్యోగం.. రూ.4 కోట్లు సంపద
మారుమూల గ్రామంలో పుట్టిన ఓ టెక్కీ చదువు పూర్తయిన తర్వాత 10 ఏళ్లు ఉద్యోగం చేసి తన 34వ ఏట ఏకంగా రూ.4 కోట్ల కార్పస్ సృష్టించాడు. ఈమేరకు ఆయన అనుసరించిన ఆర్థిక విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుపుతూ రెడ్డిట్లో వివరాలు పోస్ట్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్గా మారింది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ‘ఆర్/నోయిడా’ అనే రెడ్డిట్ కమ్యూనిటీలో వెలసింది. అందులో ‘ఈ రోజు నాకు 34 ఏళ్లు. వ్యక్తిగతంగా నేను రూ.4 కోట్లు పొదుపు చేశాను. ఎలాంటి ఆర్థిక వారసత్వం లేదు. లాటరీలు లేవు. పదేళ్లు నిరంతర కృషి, సహనం, క్రమశిక్షణతో కూడిన జీవనంతోనే ఇది సాధ్యమైంది. నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను. హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మా నాన్న రోజువారీ కూలీ. నిత్యం కుటుంబ పోషణకు సరిపడా మాత్రమే సంపాదించేవాడు. ఆ సమయంలో తాను ఎలాగోలా నాకు కొన్ని పుస్తకాలు కొని, ఎన్నో మంచి విషయాలు పంచుకున్నాడు. ఆయన ఒకసారి నాతో మాట్లాడుతూ.. నా వల్ల ప్రజలు మా నాన్నను గుర్తించినరోజే తనకు గర్వంగా ఉంటుందన్నారు. ఆ వాక్యం నా మనసులోనే ఉండిపోయింది’ అన్నారు.‘ఆకలి ఎలా ఉంటుందో నాకు ఇంకా గుర్తుంది. నేను అనుకోకుండా కంప్యూటర్లోని కొన్ని టెక్నాలజీలను కనుగొన్నాను. నేను వాటితో ప్రేమలో పడ్డాను. నెమ్మదిగా అవి నా చుట్టూ ఉన్న జీవితాన్ని మార్చడం ప్రారంభించాయి. దాంతో టెక్నాలజీ రంగంలో మంచి ఉద్యోగం వచ్చింది. చిత్తశుద్ధితో పనిచేశాను. అనవసర ఖర్చులను తగ్గించాను. తెలివిగా పొదుపు చేశాను. చివరికి పార్ట్ టైమ్గా ట్రేడింగ్ ప్రారంభించాను. నాకు గురువు లేడు. నా తప్పుల నుంచి, యూట్యూబ్లో ఉచిత కంటెంట్ ద్వారా, కొన్ని పుస్తకాల నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్ఎందుకు చెబుతున్నారంటే..‘ఎక్కడో ఒక చిన్న గ్రామంలో లేదా ఏదో పట్టణంలో ఎవరైనా నిస్సహాయతతో ఉండవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వ్యక్తి.. తమ ఇంగ్లిష్ బాగోలేదని నమ్మే వ్యక్తి.. కలలు కేవలం ధనవంతుల కోసమే అనుకునే వ్యక్తులు ఉండవచ్చు. నేను ఆర్థికంగా సాధించగలిగింది.. మీరూ సాధిస్తారు. మీరు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. పెద్ద డిగ్రీలు వద్దు. కానీ, జీవితంగా ఎదగాలంటే పట్టుదల, గెలుస్తామనే తపన, మీపై నమ్మకం ఉండాలి’ అన్నారు. -
రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్
ఉద్యోగులు మెషీన్లా పనిచేయాలని కొన్ని కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయి. అయితే తీరికలేకుండా నిర్ణీత పని గంటల కంటే ఎక్కువసేపు వర్క్ చేయించే కొన్ని కంపెనీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కంపెనీలో ఉద్యోగులు రోజుకు 12 గంటలు, వారానికి ఆరు రోజులు, చాలాసార్లు ఆదివారాల్లోనూ పనిచేస్తారని బహిరంగంగా చెప్పడం కార్పొరేట్ పని వాతావరణంపై ఆందోళనలు కలిగిస్తుంది.మొబైల్ గేమింగ్ స్టార్టప్ మాటిక్స్ప్లే సహ వ్యవస్థాపకుడు మోహన్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు. ‘మాకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్ కార్యకలాపాలుంటాయి. వారానికి 6 రోజులపాటు కఠినమైన ఆఫీస్ టైమింగ్స్ ఉన్నాయి. అయినా మా టీమ్లో 10 కంటే ఎక్కువ మంది ఆదివారాల్లో కూడా పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ప్రజలు ఈ విధానాన్ని విమర్శిస్తారు. కానీ వాస్తవం ఏంటంటే భారత్లో ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారు చేయాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. జాబ్ మైండ్సెట్ నుంచి బిల్డ్ మైండ్సెట్ను పెంపొందించుకోవాలి’ అని చెప్పారు.ఈ పోస్ట్పై ఆన్లైన్లో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది సంస్థ మొదటి నుంచి ఉత్పత్తిని నిర్మించే నిబద్ధతను ప్రశంసించారు. మరికొందరు బర్న్అవుట్, వర్క్-లైఫ్ సమతుల్యతపై ఆందోళన, పని దోపిడీ అని తెలిపారు. ఈ నేపథ్యంలో కుమార్ తన పాత పోస్టును డిలీట్ చేసి ‘బాయ్స్, కూల్, ఉదయం 10:00 గంటలకు ఎవరూ లోపలికి రారు. మేము ఆఫీసులో కలిసి పేకాట ఆడతాం. నెట్ఫ్లిక్స్ చూస్తాం. మేమందరం కెరియర్ మొదటి నుంచి నిర్మించుకుంటున్నాం. ఇక్కడ ఎవరూ కష్టంగా ఉద్యోగం చేయడం లేదు. సీనియర్లు, జూనియర్లు కలిసి ఒక ప్రాజెక్టులో పని చేస్తున్నాం. అది నూటికి నూరు శాతం ఫలితాలు ఇస్తుంది. కార్పొరేట్ కార్యాలయాల్లో మీరు ఊహించలేని ఒక రకమైన సరదా మా ఆఫీసులో ఉంది’ అని చెప్పారు.Guys, chill, no one comes in at 10:00 am. We play poker and watch Netflix together in the office.We’re all fresh out of college, building our careers and lives from scratch.No one’s just doing a job here, we’re all seniors and juniors working together on a project, giving it… https://t.co/ESWZ9BsqeN— Mohan is building @matiks_play (@themohment) July 6, 2025ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంహిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కుమార్ మాట్లాడుతూ.. కంపెనీ తన ఉద్యోగులను సిబ్బందిగా చూడదని, సంస్థ మిషన్లో వ్యవస్థాపక సభ్యులుగా పరిగణిస్తుందని చెప్పారు. జీతభత్యాల కోసమో, మనుగడ కోసమో తాము పనిచేయడం లేదన్నారు. చాలామందికి ఈ మనస్తత్వం ఉండదు. నిజంగా కష్టపడేవారికి ఇది ఒక ఉద్యోగంలా అనిపించదని చెప్పారు. తమ కలను వెంటాడుతున్నట్టు తోస్తుందని తెలిపారు. -
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
ఇటలీ ప్రస్తుతం కార్మిక కొరత, జనాభా క్షీణత సమస్యలతో సతమతమవుతోంది. వాటిని పరిష్కరించడానికి ఆ దేశం కొన్ని సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇటలీ ప్రభుత్వం 2026-2028 మధ్య యురోపియన్ యూనియన్యేతర పౌరులకు దాదాపు 5,00,000 వర్క్ వీసాలను జారీ చేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశ జనాభాను స్థిరపరుస్తూ, ఆర్థిక భవిష్యత్తుకు ఊతం ఇచ్చేలా ఉంటుందని నమ్ముతుంది.వర్క్ వీసా విస్తరణకు సంబంధించిన కీలక వివరాలువచ్చే మూడేళ్లలో ఈయూయేతర పౌరులకు మొత్తం 4,97,550 వర్క్ పర్మిట్లు జారీ చేయాలని ఇటలీ యోచిస్తోంది. ఇది దేశంలోకి వచ్చే వలసదారులను గణనీయంగా పెంచుతుంది. స్థానికంగా లేబర్ మార్కెట్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఈ విధానం ద్వారా సంవత్సరాల వారీగా కింద తెలిపినట్లు వర్క్ పర్మిట్లు జారీ చేయనున్నారు.2026: 164,850 వర్క్ పర్మిట్లు2027: 166,350 వర్క్ పర్మిట్లు2028: 166,350 వర్క్ పర్మిట్లుసిబ్బంది అవసరమయ్యే రంగాలు..దేశవ్యాప్తంగా క్లిష్టమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న వివిధ రంగాలకు ఈ వీసాలను పంపిణీ చేయనున్నారు. అందులోని కొన్ని పరిశ్రమలు కింద ఇస్తున్నాం.వ్యవసాయంనిర్మాణ రంగంఆరోగ్య సంరక్షణ (ముఖ్యంగా వైద్యులు, నర్సులు)టూరిజంతయారీ రంగంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్తో సహా డిజిటల్ సేవల రంగం.పైన తెలిపిన రంగాలు దేశీయ వీసా విధానం ద్వారా ఇటలీ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.ఎందుకు ఇలా చేస్తోందంటే..లేబర్ కొరతఇటలీ కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. వాస్తవానికి 70% కంటే ఎక్కువ ఇటాలియన్ కంపెనీలు కార్మికులను నియమించడంలో తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కొరత దేశీయంగా అనేక పరిశ్రమల్లో విస్తరించింది.రెస్టారెంట్లు, హోటళ్లు వంటి సర్వీసుల్లో 2,58,000 ఖాళీలు45,000 మంది వైద్యులు, 65,000 మంది నర్సులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడిని ఎత్తి చూపుతోంది.ఇంజినీరింగ్, గ్రీన్ ఎకానమీలో 2,80,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. ఈ విభాగంలో ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతోంది.డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్.జనాభా సంక్షోభంఇటలీ జననాల రేటు తగ్గుతోంది. దాంతో జనాభా కుంటుపడుతోంది. 2024లో జనాభా 37,000 తగ్గింది. జననాల కంటే 2,81,000 ఎక్కువ మరణాలు సంభవించాయి. 2050 నాటికి ఇటలీలో 34% మంది 65 ఏళ్లు పైబడి వయసు ఉంటారని అంచనా. స్థిరమైన శ్రామిక శక్తి, ఆర్థిక వ్యవస్థను కొనసాగించడానికి ఇటలీ 2050 నాటికి సుమారు 10 మిలియన్ల(ఒక కోటి) వలసదారులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన వర్క్ వీసా ప్రోగ్రామ్ ఈ లక్ష్యసాధనలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.భారత్ ఎలా అర్థం చేసుకోవాలంటే..వేగంగా పెరుగుతున్న శ్రామిక జనాభా ఉన్న భారతదేశం ఇటలీ వర్క్ వీసాలతో గణనీయంగా ప్రయోజనం పొందనుంది. భారత్లో ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి ‘ఇరు దేశాల మధ్య సమన్వయం’గా ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. ముఖ్యంగా హెల్త్ కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, ఐటీ వంటి రంగాల్లోని వారికి ఇటలీ లేబర్ మార్కెట్లో పుష్కలమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.ఏయే రంగాల్లో ఎవరికి అవకాశం..హెల్త్కేర్: డాక్టర్లు, నర్సులు, మెడికల్ ప్రొఫెషనల్స్కు మంచి డిమాండ్ ఉంది.ఇంజినీరింగ్: ఇటలీ పారిశ్రామిక రంగాలకు, గ్రీన్ ఎకానమీకి నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు అవసరం.హాస్పిటాలిటీ అండ్ టూరిజం: ఇటలీ గ్లోబల్ టూరిజం హబ్ కావడంతో ఆతిథ్య రంగంలోని కార్మికులకు గిరాకీ ఉంటుంది.డిజిటల్, ఐటీ: ఐటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ భారతీయ టెక్ ప్రతిభావంతులకు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అవకాశాలను సృష్టిస్తుంది.ఇటలీ ప్రభుత్వం చట్టపరమైన వలసదారుల హక్కులను సంరక్షించేదుకు కట్టుబడి ఉందని తెలిపింది. అదేసమయంలో అక్రమవలసలకు సహించబోమని తేల్చి చెప్పింది. సురక్షితమైన, నియంత్రిత వలసలను ప్రోత్సహించే మార్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. ఇటువంటి వలసలకు సహాయపడే దేశాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది.👉 వర్క్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియాలంటే క్లిక్ చేయండివీసా అప్లికేషన్ కోసం కావాల్సిన ధ్రువపత్రాలుజాబ్ ఆఫర్ లెటర్ఆమోదం పొందిన నూలా ఓస్టా(వర్క్ పర్మిట్)వీసా దరఖాస్తు ఫారంపాస్పోర్ట్ఇటలీలో వసతి రుజువు కోసం అద్దె ఒప్పందం లేదా మీరు చేరబోయే సంస్థ లేఖలో అక్కడ ఉండటానికి వసతి ఉందని ధ్రువీకరించుకోవాలి.ఆర్థిక భరోసా: మీరు సంపాదించడం ప్రారంభించే వరకు ఇటలీలో మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి తగినంత ఆర్థిక వనరులు మీకు ఉన్నాయని ధ్రువపరిచేలా పత్రాలు ఉండాలి. ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్ లేదా స్పాన్సర్ లెటర్ ఉండవచ్చు.హెల్త్ ఇన్సూరెన్స్: ఇటలీలో దరఖాస్తుదారుకు చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి.ఇటలీలో డిమాండ్లో ఉన్న ఉద్యోగాలుస్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు: భవన నిర్మాణ కార్మికులు (మేస్త్రీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్)ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లుమెకానికల్ హెల్పర్లుసేఫ్టీ ఆఫీసర్లుహెల్త్ కేర్: నర్సులు, వృద్ధుల సంరక్షణ సహాయకులు, మెడికల్ టెక్నీషియన్లుడిజిటల్, ఇంజినీరింగ్: సాఫ్ట్వేర్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, డేటా సైంటిస్టులు, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు, గ్రీన్ ఎనర్జీ టెక్నీషియన్లు.టూరిజం: హోటల్ సిబ్బంది, రెస్టారెంట్ కార్మికులు, గృహనిర్వహణ సిబ్బంది, రిటైల్ సిబ్బంది.ఇదీ చదవండి: టాటా మోటార్స్ నుంచి మినీ ట్రక్లు.. ధర ఎంతంటే..వీసా దరఖాస్తుదారులకు కొన్ని టిప్స్..బేసిక్ ఇటాలియన్ నేర్చుకోవాలి. అన్ని రంగాల్లో పని చేసేందుకు ఇటాలియన్ భాషలో ప్రావీణ్యం అవసరం లేనప్పటికీ, భాష ప్రాథమిక పరిజ్ఞానం అవకాశాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆతిథ్యం, సంరక్షణ, నిర్మాణ రంగంలో పని చేస్తున్నవారికి ఎంతో తోడ్పడుతుంది.త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఇటలీ వర్క్ వీసా ప్రోగ్రామ్ కోటా ఆధారిత వ్యవస్థ (డెక్రెటో ఫ్లూస్సీ) కింద పనిచేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో అనుమతులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముందే దరఖాస్తు చేసుకోవాలి.రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేదా ఎంప్లాయర్ టైఅప్లను పరిశీలించాలి. లైసెన్స్ పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేదా ఇటలీ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. -
టాటా మోటార్స్ నుంచి మినీ ట్రక్లు.. ధర ఎంతంటే..
వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా కార్గో రవాణా కోసం ఏస్ ప్రో పేరిట 4–వీల్ మినీ ట్రక్కులను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 750 కేజీల పేలోడ్ సామర్థ్యంతో, పెట్రోల్, బై–ఫ్యుయెల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో ఈ వాహనాలు లభిస్తాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ పినాకి హల్దార్ తెలిపారు. ఎలక్ట్రిక్ వెర్షన్ ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 125 కి.మీ. నుంచి 155 కి.మీ. వరకు మైలేజి ఇస్తుందని పేర్కొన్నారు. మారుతున్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో తేలికపాటి వాణిజ్య వాహనాల పరిశ్రమ వృద్ధి ప్రస్తుతం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ మధ్యకాలికం, దీర్ఘకాలికంగా మెరుగ్గా ఉంటుందని హల్దార్ చెప్పారు.క్యూ1లో జేఎల్ఆర్ అమ్మకాలు డౌన్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జాగ్వార్ ల్యాండ్రోవర్ (జేఎల్ఆర్) హోల్సేల్, రిటైల్ అమ్మకాలు తగ్గాయి. డీలర్లకు సరఫరా (టోకు విక్రయాలు) వార్షికంగా 11 శాతం క్షీణించి 87,286 యూనిట్లకు పరిమితమయ్యాయి. తొలి త్రైమాసికంలో ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్లో హోల్సేల్ అమ్మకాలు వరుసగా 12 శాతం, 14 శాతం, 25 శాతం తగ్గినట్లు జేఎల్ఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: రూ.100తో చోటాసిప్!ఇక రిటైల్ అమ్మకాలు 15 శాతం క్షీణించి 94,420 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంచనాలకు అనుగుణంగానే అమ్మకాలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వారసత్వంగా వస్తున్న మోడల్స్ను క్రమంగా నిలిపివేసి కొత్త జాగ్వార్ మోడల్సను ప్రవేశపెట్టనుండటం, అమెరికాలో దిగుమతి సుంకాల వ్యవహారం కారణగా ఏప్రిల్లో ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోవడం తదితర అంశాలు విక్రయాలు తగ్గడానికి కారణమని వివరించింది. -
రూ.100తో చోటాసిప్!
బజాజ్ ఫిన్సర్వ్ అస్సెట్ మేనేజ్మెంట్ చోటాసిప్ను తీసుకువచ్చే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. ఇందులో సాధ్యా సాధ్యాలను అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ఎండీ గణేష్ మోహన్ తెలిపారు. ఈ దిశగా టెక్నాలజీ పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.ఇదీ చదవండి: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..చోటాసిప్ అన్నది ఆసక్తికరమైన చొరవగా గణేష్ మోహన్ పేర్కొన్నారు. తగినంత అధ్యయనం అనంతరం దీన్ని ప్రారంభించేందుకు ఆరు నెలల సమయం తీసుకుంటుందన్నారు. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్లో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుగా సెబీ ఈ ఏడాది ఆరంభంలో మైక్రోసిప్ను ఆవిష్కరించడం గమనార్హం. ఎస్బీఐ, కోటక్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికే రూ.100 సిప్ను అందిస్తున్నాయి. మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో అయితే కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. -
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ రోజు పుంజుకుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
హైదరాబాద్లో ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రారంభం
గ్లోబల్ స్పోర్ట్స్, గేమింగ్ లీడర్గా ఉన్న ఎంటైన్ సంస్థకు చెందిన టెక్నాలజీ విభాగం ఐవీ అధికారికంగా ఎంటైన్ ఇండియాగా రీబ్రాండ్ అయి హైదరాబాద్లో డిజిటల్ ఇన్నోవేషన్ క్యాంపస్ను ప్రారంభించినట్లు తెలిపింది. కొత్త హైదరాబాద్ క్యాంపస్ ఎంటైన్ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారనుందని కంపెనీ పేర్కొంది.ఈ సంస్థలో పని చేసేందుకు హైబ్రిడ్ రోల్స్లో 3,400 మంది హైస్కిల్డ్ ప్రొఫెషనల్స్కు చోటు కల్పించేలా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ)ఫెసిలిటీని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఎంటైన్ హైదరాబాద్ క్యాంపస్ ద్వారా గ్లోబల్ టెక్ సేవల్లో 85% పైగా సర్వీసులు అందించడానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఇందులో సేవలందించే అడ్వాన్స్డ్ డొమైన్లు కింది విధంగా ఉన్నాయి.కృత్రిమ మేధప్లాట్ ఫాం ఇంజినీరింగ్రియల్ టైమ్ ట్రేడింగ్ సిస్టమ్స్గ్లోబల్ సస్టెయినబిలిటీ లక్ష్యాలకు అనుగుణంగా హైదరాబాద్ క్యాంపస్లోని సదుపాయాలు..స్మార్ట్ లైటింగ్ వ్యవస్థలుఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లుపర్యావరణహిత నిర్మాణ సామగ్రిఇదీ చదవండి: ట్రంప్ అదనపు డ్యూటీల ప్రస్తావన.. రూపాయి నేలచూపుఈ రీబ్రాండ్ వ్యూహాత్మక ప్రాముఖ్యతపై ఎంటైన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంతిల్ అన్బగన్ మాట్లాడుతూ..‘ఎంటైన్ ఇండియా ద్వారా హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ భవిష్యత్తును ఇక్కడి నుంచి శక్తివంతం చేయడం గర్వంగా ఉంది’ అన్నారు. ఎంటైన్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సాటీ బెన్స్ మాట్లాడుతూ..‘తదుపరి తరం వినోద వేదికలను నిర్మించాలనే మా ఆశయానికి భారతదేశం కేంద్రబిందువుగా మారింది. హైదరాబాద్లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడం ఆ దిశగా కంపెనీ వేసిన సాహసోపేతమైన ముందడుగు’ అని అన్నారు. -
ట్రంప్ అదనపు డ్యూటీల ప్రస్తావన.. రూపాయి నేలచూపు
డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ తాజాగా 54 పైసలు పతనమైంది. దాంతో 85.94 వద్ద ముగిసింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 85.53 వద్ద ప్రారంభమైంది. తదుపరి 85.51–86.03 మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ప్రపంచ కరెన్సీలతో డాలరు బలపడటం, యూఎస్ టారిఫ్ల గడువు దగ్గరపడటం తదితర అంశాలు రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆయా దేశాలపై 10% అదనపు డ్యూటీలను విధించనున్నట్లు ప్రకటించడం సైతం రూపాయిపై ప్రభావం చూపినట్లు తెలియజేశారు. కాగా, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.25 శాతం పుంజుకుని 97.41కు చేరింది. రూపాయి విలువ ఎలాంటి సందర్భాల్లో ఎలా ఉంటుందో నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ‘పాస్వర్డ్ సరైందే! ఎందుకు లాగిన్ అవ్వట్లేదు’టారిఫ్లు వేయడం రూపాయికి ప్రతికూలంగా మారుతుంది. ఎగుమతులు తగ్గిపోతాయి.కొత్తగా ఇతర దేశాలతో చేసుకునే కాంట్రాక్ట్లు రూపాయి విలువకు ఊతం ఇస్తాయి.భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు వాటి ధరలు పెరగడం నెగిటివ్గా ఉంటుంది.ఆర్బీఐ జోక్యం చేసుకొని రూపాయి విలువను స్థిరీకరిస్తుంది.గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తుంది.ట్రంప్ టారిఫ్ వైఖరి మళ్లీ కఠినతరంగా మారితే లేదా భారత్ విస్తృత వాణిజ్య ఉద్రిక్తతల్లోకి వెళితే రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. -
రేపే టారిఫ్ డెడ్లైన్.. ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:51 సమయానికి నిఫ్టీ(Nifty) 16 పాయింట్లు పెరిగి 25,479కు చేరింది. సెన్సెక్స్(Sensex) 76 ప్లాయింట్లు పుంజుకుని 83,522 వద్ద ట్రేడవుతోంది.ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్పై త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జులై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పెన్షన్ పథకాలకు పీవోపీలుగా మ్యూచువల్ ఫండ్స్
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) లేదా వాటి సబ్సిడరీలు ఎన్పీఎస్ మాదిరి పెన్షన్ స్కీమ్లకు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీ) సేవలు అందించేందే దిశగా సెబీ కీలక ప్రతిపాదన చేసింది. అలాగే, ఏఎంసీలు తాము నిర్వహిస్తున్న ఫండ్స్కు సంబంధించి అంతర్జాతీయ డి్రస్టిబ్యూటర్లు లేదా అడ్వైజర్లుగానూ సేవలు అందించొచ్చన్న ప్రతిపాదన తీసుకొచి్చంది. ప్రస్తుతం ఏఎంసీలు, వాటి సబ్సిడరీలు తాము నిర్వహిస్తున్న ఫండ్స్కు సంబంధించి మాత్రమే నిర్వహణ, అడ్వైజరీ సేవలు అందించేందుకు అనుమతి ఉంది. ఏఎంసీల సబ్సిడరీలు పెన్షన్ ఫండ్ మేనేజర్లుగా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా.. పీవోపీ సేవలను ఆఫర్ చేస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నుంచి కొంత పరిహారం అందుకోవచ్చని సెబీ తన తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది. అయితే, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఏఎంసీలు చూడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఏఎంసీల సబ్సిడరీలు పెన్షన్ ఫండ్కు డైరెక్ట్ ప్లాన్ రూపంలోనే పీవోపీలుగా పనిచేసేందుకు అనుమతి ఉంది. దీనివల్ల పెన్షన్ ఫండ్ అడ్వైజరీ సేవలపై వాటికి ఎలాంటి కమీషన్ లభించడం లేదు. దీంతో సెబీ కొత్త ప్రతిపాదనలు తీసుకొచి్చంది. ఇక అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ సేవలతోపాటు ఇతర సేవలను సైతం ఏఎంసీలు ఆఫర్ చేసేందుకు సెబీ ప్రతిపాదించింది. వీటిపై ఈ నెల 28 వరకు ప్రజాభిప్రాయాలను సెబీ ఆహ్వానించింది. -
స్కోడా ’గ్రూప్’లో బెంట్లీ
న్యూఢిల్లీ: భారత్లో స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) గొడుగు కిందికి మరో బ్రాండ్ వచ్చి చేరింది. బ్రిటన్కు చెందిన సూపర్ లగ్జరీ బ్రాండ్ బెంట్లీని ఆరో బ్రాండ్గా చేర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. దీంతో ఇకపై బెంట్లీ వాహనాల దిగుమతులు, విక్రయం, సరీ్వసింగ్ మొదలైనవన్నీ ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ చేపడుతుంది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. బెంట్లీ ఇండియా బ్రాండ్ డైరెక్టరుగా అబీ థామస్ నియమితులయ్యారు. భారత్లో పెరుగుతున్న అత్యంత సంపన్న వర్గాలకు(యూహెచ్ఎన్ఐ) ఈ డీల్తో ప్రయోజనం చేకూరుతుందని ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ ఎండీ పీయుష్ ఆరోరా తెలిపారు. -
ఎఫ్అండ్వోలో రిటైలర్లకు నష్టాలే..
న్యూఢిల్లీ: గతేడాది(2024–25) ఈక్విటీ డెరివేటివ్స్లో అత్యధిక శాతం రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అంతక్రితం ఏడాది నమోదైన రీతిలోనే డెరివేటివ్స్లో చిన్న ఇన్వెస్టర్లు భారీగా దెబ్బతిన్నట్లు తెలియజేసింది. ఈ విభాగంలో వ్యక్తిగత ఇన్వెస్టర్ల నికర నష్టాలు వార్షికంగా 41 శాతం పెరిగి రూ. 1,05,603 కోట్లను తాకినట్లు వెల్లడించింది. ఎఫ్అండ్వో విభాగంలో రిటైలర్లకు 2023–24లో రూ. 74,812 కోట్ల నష్టాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య సైతం 20 శాతం తగ్గినట్లు నివేదిక తెలియజేసింది. అంతకుపూర్వం రెండేళ్లలో ఈ విభాగంలో లావాదేవీలు చేపట్టే ప్రత్యేక రిటైలర్ల సంఖ్య 24 శాతం పుంజుకోవడం గమనార్హం! ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్ మార్గదర్శకాలను పటిష్టపరుస్తూ 2024 అక్టోబర్ 1 నుంచి కొత్త చర్యలు ప్రకటించాక ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో లావాదేవీలపై సెబీ విశ్లేషణ చేపట్టింది. ఇందుకు 2024 డిసెంబర్ నుంచి 2025 మే వరకూ మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ల వ్యక్తిగత లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంది. మొత్తం రిటైల్ ట్రేడర్ల లాభనష్టాలను విశ్లేíÙంచాక దాదాపు 91 శాతం మంది నష్టపోయినట్లు గుర్తించింది. 2024 బాటలోనే రిటైల్ ట్రేడర్లు భారీగా పెట్టుబడులను కోల్పోయినట్లు సెబీ నివేదిక వివరించింది. నష్టాల తీరిలా: గత ఆరు నెలల కాలంలో ఇండెక్స్ ఆప్షన్స్ టర్నోవర్ ప్రీమియంలవారీగా చూస్తే వార్షికంగా 9 శాతం క్షీణించినట్లు సెబీ నివేదిక పేర్కొంది. నోషనల్గా మదింపు చేస్తే 29 శాతం తగ్గింది. అయితే రెండేళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే ఇండెక్స్ ఆప్షన్స్ పరిమాణం ప్రీమియంలవారీగా 14 శాతం పుంజుకుంది. నోషనల్గా 42 శాతం ఎగసింది. ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో ప్రీమియంలవారీగా రిటైలర్ల టర్నోవర్ 11 శాతం క్షీణించింది. అయితే రెండేళ్ల క్రితం ఇదే కాలంలో 36 శాతం జంప్చేసింది. ఈ హెచ్చుతగ్గులు దేశీ మార్కెట్లో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ప్రధానంగా ఇండెక్స్ ఆప్షన్స్లో అధిక లావాదేవీలను పట్టిచూపుతున్నట్లు నివేదిక ప్రస్తావించింది. ఇన్వెస్టర్ల పరిరక్షణ, మార్కెట్ నిలకడ యోచనతో ఇండెక్స్ ఆప్షన్స్లో లావాదేవీలు, టర్నోవర్ను పర్యవేక్షిస్తున్నట్లు సెబీ వివరించింది. ఈ బాటలోనే 2025 మే 29న రిస్కుల పర్యవేక్షణా విధానాలు తదితరాలకు సెబీ తెరతీసింది. జేన్ స్ట్రీట్ లాంటి రిస్క్లు పెద్దగా లేవు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే 3ముంబై: మార్కెట్లో కలకలం రేపిన హెడ్జ్ ఫండ్ జేన్ స్ట్రీట్ తరహా రిసు్కలేమీ పెద్దగా కనిపించడం లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. నిఘాపరమైన సవాళ్ల వల్లే ఈ ఉదంతం చోటు చేసుకుందని, ఈ నేపథ్యంలో సర్వైలెన్స్పై సెబీ మరింతగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. నియంత్రణాధికారాలకు లోబడే జేన్ స్ట్రీట్పై చర్యలు తీసుకున్నామని, అయితే నిఘా, నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే నేరాలకు పాల్పడేవారిని కట్టడి చేయడానికి వీలవుతుందని పాండే పేర్కొన్నారు. డెరివేటివ్స్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నియంత్రణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి డేటా ఆధారితమైనవిగానే ఉంటాయని చెప్పారు. క్యాష్, డెరివేటివ్స్ విభాగాల్లో పొజిషన్లతో సూచీలను ప్రభావితం చేయడం ద్వారా రెండేళ్ల వ్యవధిలో అక్రమంగా ఆర్జించిన రూ. 4,800 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాకు బదలాయించాలని ఆదేశిస్తూ, జేన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలు భారత మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
డ్రోన్ మార్కెట్ @ రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: రక్షణ, వ్యవసాయం, లాజిస్టిక్స్, మౌలికం తదితర ఎన్నో రంగాల్లో డ్రోన్ల వినియోగంతో మంచి ఫలితాలు కనిపిస్తుండడంతో ఈ మార్కెట్ వచ్చే ఐదు సంవత్సరాల్లో గణనీయంగా వృద్ధి చెందనుందని నెక్స్జెన్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి దేశీ డ్రోన్ తయారీ పరిమాణం 23 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.96 లక్షల కోట్లు) చేరుకోవచ్చని పేర్కొంది. ఆధునిక యుద్ధ తంత్రాల్లో డ్రోన్లు కీలకంగా మారిన విషయాన్ని ప్రస్తావించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో డ్రోన్ల వినియోగం స్పష్టమైన మార్పునకు నిదర్శనంగా పేర్కొంది. 15 పట్టణాలకు చెందిన 150 కంపెనీల అభిప్రాయాలను నెక్స్జెన్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. ముఖ్యంగా వ్యవసాయం, కచ్చితమైన సాగు అవసరాలు 2030 నాటికి డ్రోన్ల డిమాండ్కు కీలకంగా నిలుస్తాయని 40 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత రక్షణ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుందని పేర్కొన్నాయి. స్మార్ట్ సాగు రూపంలో వచ్చే ఐదేళ్లో గ్రామీణ వ్యవసాయంలో డ్రోన్లు బూమ్ను సృష్టిస్తాయని నమ్ముతున్నట్టు సర్వేలో 20 శాతం కంపెనీల ప్రతినిధుల తెలిపారు. లాజిస్టిక్స్ (వస్తు రవాణా), ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు సైతం డ్రోన్ల తయారీకి చోదకంగా నిలుస్తాయని 15 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీలో అంతర్జాతీయ డ్రోన్స్ ప్రదర్శన ఈ డిమాండ్నకు మరింత మద్దతునిచ్చే చర్యల్లో భాగంగా ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 1 వరకు ఢిల్లీలో అతిపెద్ద ‘డ్రోన్ అంతర్జాతీయ ప్రదర్శన 2025’ నిర్వహించనున్నట్టు నెక్స్జెన్ తెలిపింది. నెక్స్జెన్ ఎగ్జిబిషన్స్ దీన్ని నిర్వహిస్తుండడం గమనార్హం. రష్యా, తైవాన్, కెనడా, ఉక్రెయిన్, భారత్ సహా ఆరు దేశాలు తమ నూతన డ్రోన్ ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నట్టు వెల్లడించింది. అలాగే, 50కు పైగాఅంతర్జాతీయ డ్రోన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్టు తెలిపింది. ‘‘ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్లు చూపించిన అద్భుత సామర్థ్యాలను యావత్ ప్రపంచం గమనించింది. దేశీ తయారీ డ్రోన్లను ప్రోత్సహించడం ‘భారత్లో తయారీ’ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుందని, పలు రంగాల్లో దేశ శ్రేయస్సుకు మేలు చేస్తుందని భావిస్తున్నాను’’అని నెక్స్జెన్ ఎగ్జిబిషన్స్ డైరెక్టర్ ఆధార్ బన్సాల్ తెలిపారు. వ్యవసాయంలో విత్తనాలు నాటడం, మందుల పిచికారీతోపాటు నిఘా, పంటల ఆరోగ్యం పరిశీలన సహా ఎన్నో రూపాల్లో డ్రోన్లు సేవలు అందిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయంగా వ్యవసాయ డ్రోన్ల మార్కెట్ 2030 నాటికి చేరుకోవచ్చని 6 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలను నెక్స్జెన్ నివేదిక ప్రస్తావించింది. -
ఆకాశ ఎయిర్తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ ఏరో టెక్నిక్ వెల్లడించింది. దీని కింద ఆకాశ ఎయిర్కి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు తమ అధునాతన ఎంఆర్వో కేంద్రంలో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్) మెయింటెనెన్స్ సేవలు అందించనున్నట్లు వివరించింది. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. తమ సాంకేతిక నైపుణ్యాలు, నిర్వహణ సామర్థ్యాలపై విమానయాన సంస్థలకు గల నమ్మకానికి ఈ డీల్ నిదర్శనమని జీఎంఆర్ ఏరో టెక్నిక్ ప్రెసిడెంట్ అశోక్ గోపీనాథ్ తెలిపారు. దేశీయంగా ఎంఆర్వో వ్యవస్థ అభివృద్ధి చెందడంలో మద్దతిచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆకాశ ఎయిర్ సహ–వ్యవస్థాపకుడు బెల్సన్ కొటిన్హో పేర్కొన్నారు. -
ల్యాబ్ వజ్రం.. జిగేల్!
కోట్ల కొద్దీ సంవత్సరాలుగా రసాయనిక చర్యలకు గురై, ఎక్కడో భూమి లోతుల్లో నిక్షిప్తమై అత్యంత అరుదుగా లభించే వజ్రాలు.. ఇప్పుడు ప్రయోగశాలల్లో కూడా తయారవుతున్నాయి. సహజమైన వజ్రాలకు చౌక ప్రత్యామ్నాయమైన ఈ వజ్రాలను ల్యాబ్ గ్రోన్ డైమండ్లుగా (ఎల్జీడీ) పిలుచుకుంటున్నారు. సహజ వజ్రాల ధరలు పెరుగుతుండటంతో, బడ్జెట్ గురించి ఆలోచించే వర్గాల్లోనూ, యువతలోనూ ఈ ఎల్జీడీలకు ఆదరణ పెరుగుతోంది. ల్యాబ్లలో తయారు చేసే ఈ వజ్రాల ధర, సహజ డైమండ్లతో పోలిస్తే దాదాపు 70–90 శాతం తక్కువగా ఉండటంతో పాటు పర్యావరణ అనుకూలమైన విధానంలో తయారు చేస్తుండటం కూడా ఇందుకు కారణాలు. ఫార్చూన్ బిజినెస్ ఇన్సైట్స్ ప్రకారం అంతర్జాతీయంగా ఈ మార్కెట్ 2024లో సుమారు 26 బిలియన్ డాలర్లుగా ఉండగా 2032 నాటికి 75 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఈ నేపథ్యంలో డైమండ్ కటింగ్, పాలిషింగ్కి పేరొందిన భారత్ ఇప్పుడు ఎల్జీడీ రంగంలో కూడా కీలకంగా మారుతోంది. దేశీయంగా ఏటా 8–10 శాతం పెరుగు తున్న రత్నాభరణాల మార్కెట్ దాదాపు 80–85 బిలియన్ డాలర్లుగా ఉండగా ఇందులో సహజ వజ్రాభరణాల వాటా సుమారు 10 శాతంగా ఉంటోంది. గతేడాది ఎల్జీడీల మార్కెట్ 600–700 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. ఇలా ఎల్జీడీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండటంతో పలు దిగ్గజ సంస్థలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఉదాహరణకు ట్రెంట్ ఇటీవలే తమ ఎల్జీడీ బ్రాండ్ ‘పోమ్’తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచి్చంది. సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా ఎల్జీడీ మార్కెట్లోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సెనెస్ ఫ్యాషన్ అనే అనుబంధ సంస్థ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో పాటు పర్ఫ్యూమ్లు, లెదర్ యాక్సెసరీల్లాంటి లగ్జరీ ఐటమ్స్పైనా దృష్టి పెడుతోంది. ఇలా ఎల్జీడీలకు ఆదరణ పెరగడం ఒక కోణం అయితే ఇవి మిగతా సెగ్మెంట్లకు పోటీ కావడం మరో కోణంగా మారుతోంది. ఎల్జీడీలతో వివాహ ఆభరణాల సెగ్మెంట్కి వచ్చే నష్టమేమీ పెద్దగా లేకపోయినా.. రోజువారీ ఉపయోగించుకునేందుకు కొనుగోలు చేసే ఆభరణాలకు ఇవి పోటీగా మారొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో దాదాపు రూ. 150 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో ఎల్జీడీలకు గత కొన్నాళ్లు గా డిమాండ్ పెరుగుతోంది. దీంతో లైమ్లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, లాదియా తదితర సంస్థలు కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం సుమారు రూ. 100–150 కోట్ల వరకు మార్కెట్ ఉంటుందని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టోర్స్ ఉన్న లైమ్లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ సంస్థ ఇన్వెస్టర్ నిపుణ్ గోయల్ తెలిపారు. ఇది ఏటా 15–17 శాతం వరకు వృద్ధి చెందుతోందని చెప్పారు. ఎక్కువగా 18–30 ఏళ్లు, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారు వీటిపై మక్కువ చూపిస్తున్నట్లు వివరించారు. సాధారణంగా రూ. 20–25 వేల వరకు సగటు ధర ఉండే రింగులు, పెండెంట్లు మొదలైన వాటికి డిమాండ్ ఉంటోందని పేర్కొన్నారు. తమ స్టోర్లు ఒక్కొక్కటి ప్రతి నెలా సుమారు రూ. 20–25 లక్షల వరకు సేల్స్ సాధిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ కూడా గణనీయంగా వృద్ధి చెందుతోందని వివరించారు. అక్కడి వినియోగ ధోరణులను పరిశీలిస్తే పొరుగు రాష్ట్రాన్ని కూడా త్వరలోనే అధిగమించే అవకాశం ఉందన్నారు. సిసలైన డైమండ్తో పోలిస్తే ఎల్జీడీలు దాదాపు పదో వంతుకే లభిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఉదాహరణకు సిసలైన డైమండ్ ఖరీదు రూ. 9 లక్షలుగా ఉంటే ఎల్జీడీ దాదాపు రూ. 1 లక్షకే లభిస్తుందని వివరించారు. ఎల్జీడీల కు ఎక్సే్చంజ్ ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు చెప్పా రు. ఇలా అందుబాటు ధరలో లభిస్తుండటం, పర్యావరణహితమైనవి కావడంలాంటివి ఎల్జీడీలకు సంబంధించి ఆకర్షణీయమైన అంశాలుగా ఉంటున్నాయి. ఆదరణ ఎందుకంటే .. → గనుల్లో నుంచి తవ్వి తీసే సహజ వజ్రాల కన్నా పర్యావరణానికి అనుకూలమైన, నైతికంగా తయారు చేసే ప్రత్యామ్నాయాలుగా ఎల్జీడీలు ఆదరణ పొందుతున్నాయి. → కొంత ఖర్చు చేయతగిన విధంగా ఆదాయాలు, విలువైన డైమండ్లపై పెట్టుబడి మీద అవగాహన పెరుగుతుండటం. → వినియోగదారుల్లో, ముఖ్యంగా యువత అభిరుచి మారుతుండటం, ఎల్జీడీలతో మరింత కస్టమైజ్డ్ జ్యుయలరీ డిజైన్లను తయారు చేసేందుకు వీలుండటం. → సహజమైన డైమండ్లతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యయాలకే, చాలా తక్కువ సమయంలోనే ఉత్పత్తి చేయడం వల్ల నాణ్యమైన ప్రత్యామ్నాయ వజ్రాలు చౌకగా లభ్యమవుతుండటం → ప్రభుత్వం కూడా వీటి తయారీని ప్రోత్సహించే దిశగా ఎల్జీడీ సీడ్స్పై కస్టమ్స్ సుంకాలను అయిదు శాతం నుంచి సున్నా స్థాయికి తగ్గించింది. ఏమిటీ ఎల్జీడీలు.. → కార్బన్తో కూడుకున్న సహజసిద్ధమైన వజ్రాలను గనుల నుంచి వెలికితీస్తా రు. డైమండ్ సీడ్ను ఉపయోగించి ఎల్జీడీలను హై–ప్రెజర్, హై టెంపరేచర్ (హెచ్పీహెచ్టీ), కెమికల్ వేపర్ డిపాజిషన్ (సీవీడీ) అనే పద్ధతుల్లో ప్రయోగశాలల్లో తయారు చేస్తారు. ఇవి అచ్చంగా సహజమైన డైమండ్లలాగే ఉంటాయి. ఒరిజినల్ డైమండ్ని, వీటిని పక్కపక్కన పెడితే పలు సందర్భాల్లో నిపుణులు సైతం ప్రత్యేక పరికరాలు లేకుండా వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టంగా ఉంటుంది. → సహజమైన రఫ్ డైమండ్ల సరఫరా ప్రస్తుతం సుమా రు ఏటా 125 మిలియన్ క్యారట్లుగా ఉండగా 2050 నాటికి 14 మిలియన్ క్యారట్లకు పడిపోతుందని అంచనా. మరోవైపు డిమాండ్ మాత్రం 292 మిలియన్ క్యారట్లకు పెరుగుతుందని అంచనా. → మన దగ్గర సూరత్, ముంబై ప్రధాన ఎల్జీడీ హబ్లుగా ఉంటున్నాయి. ఎల్జీడీ ఉత్పత్తిలో దాదాపు 98 శాతం వాటా వీటిదే ఉంటోంది. → డైమండ్ విలువను నిర్దేశించేవి 4 ఇలు. కలర్ (రంగు), క్లారిటీ (స్వచ్ఛత), కట్, క్యారట్ బరువు. ఈ అన్ని ప్రమాణాల్లోనూ సహజ వజ్రాలకు ఎల్జీడీలు గట్టి పోటీనిస్తున్నాయి. మలినాలు లేని, అత్యంత స్వచ్ఛమైన ‘టైప్ 2ఏ’ రకం డైమండ్ల తరహా వజ్రాలను కూడా తయారు చేస్తున్నారు. 2023లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్కు 7.5 క్యారట్ల ఎల్జీడీని బహూకరించారు. ఇది అత్యంత స్వచ్ఛమైనదిగా భావించే టైప్ 2ఏ కోవకు చెందిన వజ్రం. ఇలాంటివి ఎంత అరుదైనవంటే.. గనుల్లో నుంచి వెలికి తీసే వజ్రాల్లో 1–2 శాతం మాత్రమే ఈ కోవకి చెందినవై ఉంటాయి. → సహజమైన వజ్రాలు ఏర్పడటానికి 100 కోట్ల నుంచి 330 కోట్ల సంవత్సరాలు పట్టగా, ఎల్జీడీలను ల్యాబొరేటరీల్లో కేవలం 2 వారాల నుంచి 10 వారాల్లోనే తయారు చేయొచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బాబోయ్.. రీచార్జ్ ప్లాన్లు మళ్లీ పెరుగుతాయా?
దేశంలో మొబైల్ రీచార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్లను పెంచవచ్చని తెలుస్తోంది. ధరల పెరుగుదల 10 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ఓ వార్తా నివేదిక తెలిపింది. 2024 జూలైలో బేస్ ధరలను 11 నుండి 23 శాతం పెంచిన భారతీయ టెలికాం కంపెనీలు ఈసారి కొత్త విధానాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మే నెలలో బలమైన క్రియాశీలక యూజర్ల పెరుగుదలే ఈ పెంపునకు కారణమని చెబుతున్నారు.మళ్లీ మొబైల్ టారిఫ్ల పెంపుభారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాతో సహా భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్లపై తాజా పెంపును విధించవచ్చని ఈటీ టెలికాం నివేదిక తెలిపింది. ఈ పెరుగుదల 10-12 శాతం మధ్య ఉంటుందని, మిడ్-టు-హై-ప్రైస్ రీఛార్జ్ ప్లాన్లను కొనుగోలు చేసే వినియోగదారులను కంపెనీలు లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది.టారిఫ్ల పెంపుతో యాక్టివ్ సబ్స్క్రైబర్లు వేరే టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్కు మళ్లకుండా ఆపరేటర్లు టైర్డ్ విధానంపై దృష్టి సారించారు. మే నెలలో యాక్టివ్ సబ్స్క్రైబర్ల బలమైన వృద్ధి మరోసారి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ 31 రోజుల్లో భారతీయ టెలికాం రంగంలో 7.4 మిలియన్ల క్రియాశీల చందాదారులు పెరిగారు. 29 నెలల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1.08 బిలియన్లకు చేరింది. -
ఒక్క రూపాయి జీతం.. ఐటీ కంపెనీ ఫౌండర్ ఆనందం
జీవితంలో ఎవరైనా విజయం సాధించారనడానికి సంపాదించిన సంపద, బిరుదులు, పేరు ప్రఖ్యాతులతో కొలిచే ప్రపంచంలో, నిజమైన సంపద బ్యాంకు బ్యాలెన్స్లకు మించి ఉంటుందని గుర్తు చేశారు ప్రముఖ ఐటీ సంస్థ మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడు సుబ్రతో బాగ్చి. తనకు వార్షిక జీతం ఒక్క రూపాయి వచ్చిందని, అది తన జీవితంలో వెలకట్టలేని సంపదంటూ ఆ చెక్కును సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారాయన.ఈ చెక్కు ఆయన ఏదైనా కంపెనీకో.. స్టార్టప్ కు అందించిన సేవలకు వచ్చింది కాదు. ఇన్స్టిట్యూషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం ఒడిశా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఇది ఆయన చివరి జీతం. ఈ పాత్రలో సుబ్రతో బాగ్చి ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇందుకు ఆయన ఎటువంటి ఆర్థిక ప్రతిఫలాన్ని ఆశించలేదు. ఏడాదికి కేవలం ఒక్క రూపాయిని సింబాలిక్ వేతనంగా స్వీకరించారు."ఈ ఒక్క జన్మలో నేనెప్పుడూ వదులుకోలేని అతి పెద్ద సంపద ఏమిటంటే?" అంటూ తన సేవా ప్రయాణాన్ని బాగ్చి వివరించారు. "నేను ప్రభుత్వంతో చేసినందుకు నాకు ఏడాదికి రూ .1 జీతం. ఎనిమిదేళ్లకు 8 చెక్కులు వచ్చాయి. ఇదే నా చివరి జీతం" అంటూ తన ‘ఎక్స్’ పోస్ట్లో భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఎంతో మందిని హత్తుకుంటోంది. అభినందనలు కురిపిస్తోంది.సేవతోనే సంతృప్తిప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐటీ, కన్సల్టింగ్ సంస్థ మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడిగా బాగ్చీకి మంచి పేరుంది. ఆయన నాయకత్వం, దార్శనికత, దాతృత్వానికి ప్రశంసలు దక్కాయి. ఎన్ని వేల కోట్లు సంపాదించినా బాగ్చీ సామాజిక సేవలోనే సంతృప్తిని వెతుక్కున్నారు. సుబ్రతో బాగ్చీ తన సతీమణి సుస్మితతో కలిసి క్యాన్సర్ సంరక్షణ, నైపుణ్య అభివృద్ధి వంటి సేవా కార్యక్రమాల కోసం వందల కోట్ల రూపాయలను దానమిచ్చారు. ఇప్పుడాయన ఈ చిన్న చెక్కునే తన జీవితానికి అపురూపంగా భావిస్తున్నారంటే ఇదే సేవలో తనకున్న సంతృప్తికి నిదర్శనం.What is the biggest wealth in this one life that I would never ever part with? Well, for every year of the work I did with the government, the deal was, they pay me Rs 1. For the 8 years out there, I got 8 cheques & this one here was my last salary drawn 🙏 pic.twitter.com/nVx2EZWv7K— Subroto Bagchi (@skilledinodisha) July 5, 2025 -
‘కొత్త’గా ఇన్వెస్ట్ చేస్తారా.. ఇవిగో ఎన్ఎఫ్వోలు
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్.. ఇన్వెస్కో ఇండియా ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ను కొత్తగా తీసుకొచ్చింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ 2న ప్రారంభం కాగా.. 16వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. యాక్టివ్గా నిర్వహించే డెట్ ఫండ్స్, ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది.సంప్రదాయ డెట్ పథకాలకు ప్రత్యామ్నాయంగా ఈ పథకాన్ని రూపొందించి తీసుకొచ్చినట్టు ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ తెలిపింది. తక్కువ రిస్క్తో కూడిన రాబడి, పన్ను పరంగా మెరుగైన ప్రయోజనం కోరుకునే దీర్ఘకాల పెట్టుబడులకు ఈ పథకం అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో 60–65 శాతాన్ని ఇన్వెస్కో ఇండియా కార్పొరేట్ బాండ్ ఫండ్లో పెడుతుంది. 35–40 శాతం మధ్య ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంది.యాక్సిస్ సర్వీసెస్ ఆపర్చూనిటీస్ ఫండ్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా సర్వీసెస్ ఆపర్చూనిటీస్ ఫండ్ పేరిట ఓపెన్ ఎండెడ్ స్కీమును ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంకింగ్ నుంచి మొదలుకుని ఈ–కామర్స్, ఫిన్టెక్, హెల్త్కేర్ వరకు వివిధ రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది.భారీ స్థాయిలో వృద్ధి చెందగలిగి, పెట్టుబడులను సమర్థంగా వినియోగించుకుంటూ, పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగ్గా ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి ప్రయోజనాలను కల్పించడం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. సేవల రంగానికి అనుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక ప్రగతికి ఇది కీలకంగా ఉంటుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ బి. గోపకుమార్ తెలిపారు. -
సొంతంగా ఫ్లైఓవర్ కట్టుకుంటున్న రియల్ఎస్టేట్ కంపెనీ
సాధారణంగా ఎక్కడైనా ఫ్లైఓవర్లు ప్రభుత్వాలు నిర్మిస్తాయి. కానీ బెంగళూరులో మాత్రం ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ సొంతంగా ప్రైవేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకుంది. ఇందుకు ప్రభుత్వమూ అనుమతిచ్చింది. అయితే ఒక్కటే షరతు...బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ బెళ్లందూర్లో నిర్మాణంలో ఉన్న తమ టెక్ పార్క్ను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో అనుసంధానం చేయడానికి 1.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను నిర్మించనుంది. ఈ ఫ్లైఓవర్ పబ్లిక్ రోడ్డు పక్కగా, వర్షపునీటి కాలువ మీదుగా వెళ్తుంది.ఈ ప్రాజెక్టుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఆమోదం తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వ భూమిలో ఫ్లైఓవర్ నిర్మించుకుంటున్నందుకు గానూ దీనికి బదులుగా కరియమ్మన అగ్రహార రోడ్డు వెడెల్పునకు ప్రెస్టీజ్ గ్రూప్ ముందుకు వచ్చినట్లు తెలిసింది. అలాగే ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తామే సొంతంగా నిధులు సమకూర్చడానికి ఈ రియల్ ఎస్టేట్ సంస్థ కట్టుబడి ఉందని ‘హిందూస్థాన్ టైమ్స్’ వార్తా సంస్థ కథనం పేర్కొంది.ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రెస్టీజ్ గ్రూప్ మొదట 2022 ఆగస్టులో బెంగళూరు బెంగళూరు మహానగర పాలికెకు ప్రతిపాదనను సమర్పించింది. తరువాత 2023 నవంబర్ లో సవరించిన అభ్యర్థనను సమర్పించింది. తమ ప్రైవేట్ క్యాంపస్ కు ప్రత్యేక ఫ్లైఓవర్ అవసరాన్ని చెప్పేందుకు ఎమలూరు, కరియమ్మన అగ్రహార రోడ్డు మీదుగా ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని కంపెనీ కారణంగా పేర్కొంది.రాబోయే ప్రెస్టీజ్ బీటా టెక్ పార్క్ లో 5,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వీరి రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించినట్లు సమాచారం.👉హైదరాబాద్ వెస్ట్ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్ట్లు👈కొత్త ఫ్లైఓవర్పై కేవలం ప్రెస్టీజ్ ఉద్యోగులకే కాకుండా సాధారణ ప్రజల రాకపోకలకూ అవకాశం ఉండాలని బీబీఎంపీ అధికారులు షరతు విధించారు. అన్ని చట్టపరమైన ప్రమాణాలను చేరుకుంటే, రహదారి విస్తరణ కోసం అప్పగించిన భూమికి బదులుగా సంస్థ బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులకు (టీడీఆర్) కూడా అర్హత కలిగి ఉంటుంది. టెక్ పార్క్ బిల్డింగ్ ప్లాన్కు అనుమతులు వచ్చిన దాదాపు ఏడాది తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం లభించడం గమనార్హం. 70 ఎకరాలున్న ఈ స్థలానికి 2023 సెప్టెంబరులో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) నుంచి ప్రాథమిక అనుమతి లభించింది.బెంగళూరు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టు ఆమోదాన్ని ధృవీకరించారు. ఫ్లైఓవర్తో పాటు 40 అడుగుల వెడల్పుతో కనెక్టింగ్ రోడ్కు కూడా ప్రెస్టీజ్ సంస్థ నిధులు సమకూర్చనుంది. ఈ రోడ్డుతో సక్రా హాస్పిటల్ రోడ్డుకు ప్రయాణ దూరం 2.5 కిలోమీటర్లు తగ్గుతుంది. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం కోసం విస్తృత కృషిలో భాగంగానే ఈ ప్రాజెక్ట్ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. -
యువత కోసం కొత్త యులిప్ పథకం
యువతకు దీర్ఘకాలంలో సంపద సృష్టికి దోహదపడేలా ఐసీఐసీఐ ప్రూ స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ పేరిట మార్కెట్ ఆధారిత యులిప్ ప్లాన్ను ప్రవేశపెట్టింది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. దీన్ని నెలవారీగా రూ. 1,000 ప్రీమియంకే కొనుగోలు చేయొచ్చని సంస్థ తెలిపింది.ఇటు లైఫ్ కవరేజీతో పాటు అటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చీఫ్ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా తెలిపారు. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టి దీర్ఘకాలం కొనసాగించేలా యువతకు యులిప్ ప్లాన్లు ఉపయుక్తంగా ఉంటాయన్నారు.బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త ఫండ్జీవిత బీమా సంస్థ బజాజ్ అలియాంజ్ లైఫ్ తాజాగా నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ను (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. దీన్ని తమ యులిప్ పాలసీల కింద అందిస్తుంది. ఇది నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ MQVLV 50 ఇండెక్స్ను ట్రాక్ చేసే విధంగా ఉంటుంది. పాలసీదారులకు ఇటు లైఫ్ కవరేజీతో పాటు అటు మల్టీఫ్యాక్టర్ ఆధారిత ఈక్విటీ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఎన్ఎఫ్వో జూలై 14తో ముగుస్తుంది. -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్గా ముగిశాయి. ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోని దేశాలకు ఆగస్టు 1 నుంచి సుంకాలు అమలు చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్గా స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 9.61 పాయింట్లు (0.01 శాతం) స్వల్పంగా లాభపడి 83,442.50 వద్ద ముగియగా, నిఫ్టీ 50 25,461.3 స్థాయిలో ముగిసింది. విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 0.27 శాతం, ఎన్ఎస్ఈ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 0.44 శాతం నష్టపోయాయి.నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.68 శాతం లాభపడగా, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇమామీ, బ్రిటానియా, వరుణ్ బేవరేజెస్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ ఎనర్జీ కూడా గ్రీన్లో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, బ్యాంక్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, హెచ్సీఎల్ టెక్, మారుతి, ఇన్ఫోసిస్, ఎస్బీఐ 2.4 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్యూఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ 3 శాతం వరకు లాభపడ్డాయి. -
ఇక ఈ బ్యాంక్లోనూ మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు..
పేదలు, సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్కొక్కటిగా ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే విధించే చార్జీలను రద్దు చేస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ జాబితాలో చేరింది. ప్రామాణిక పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది.బ్యాంక్ ఆఫ్ బరోడాలో మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల తొలగింపు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మార్పు ప్రీమియం ఉత్పత్తులు మినహా అన్ని సాధారణ పొదుపు ఖాతాలకు వర్తిస్తుంది.కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లు ఇటీవలే పొదుపు ఖతాలకు కనీస బ్యాలెన్స్ ఛార్జీలు తొలగించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అనుసరించింది. ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ ఆవశ్యకతలను ఎత్తివేస్తూ ఈ దిశగా చర్యలు తీసుకుంది.మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై విధిస్తున్న జరిమానాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఈ మార్పు చోటు చేసుకుంది. చౌక కరెంట్, పొదుపు ఖాతాల డిపాజిట్ల వాటాలో తగ్గుదలను బ్యాంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశం దృష్టిని ఆకర్షించింది. -
‘పాస్వర్డ్ సరైందే! ఎందుకు లాగిన్ అవ్వట్లేదు’
బ్యాంక్, ఆఫీస్ పోర్టళ్లు, జాబ్ కోసం దరఖాస్తులు వంటి ఇతర ముఖ్యమైన వెబ్సైట్ల్లో చాలామంది లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు కొత్తగా క్రియేట్ చేసుకుంటుంటారు. కానీ తిరిగి లాగిన్ చేయాలంటే మాత్రం సైన్ఇన్ ఇవ్వొదు. ‘అదేంటి సరిగ్గానే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానే.. ఎందుకు అవ్వట్లేదు’ అనే అనుమానం వస్తుంది. దాంతో తిరికి ఫర్గాట్ పాస్ట్వర్డ్ అప్షన్కు వెళ్లాల్సి వస్తుంది. అందులోనూ కొన్ని సైట్లు పాత పాస్వర్డ్లు ఎంటర్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది.ఏవీ చూసుకోకుండా లాగిన్ చేస్తే..లాగిన్ పోర్టల్లో ఐడీ ఎంటర్ చేసేప్పుడు సదరు బ్లాక్లో ఎంటర్ చేసే అక్షరాలు యూజర్కు కనిపిస్తాయి. కానీ పాస్వర్డ్ ఎంటర్ చేసేప్పుడు మాత్రం సెక్యూరిటీ కారణాల వల్ల డాట్లు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అప్పర్కేస్, లోయర్ కేస్ ఇంగ్లీష్ అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్లు, క్యాప్స్లాక్ ఆన్ అవుతుంది. అవేవీ చూసుకోకుండా లాగిన్ చేస్తే అప్పటివరకు లాగిన్ అవుతుంది. కానీ లాగవుట్ చేసి తిరిగి లాగిన్ చేస్తే సైన్ఇన్ అవ్వదు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో టెక్ నిపుణులు సూచిస్తున్నారు.చెక్ చేయాల్సిందే..ఆన్లైన్లో ఖాతాలు ఓపెన్ చేసేప్పుడు లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు టైప్ చేయాల్సి వస్తుంది. ఐడీ బ్లాక్లో అక్షరాలు యూజర్కు కనిపిస్తాయి. కానీ పాస్వర్డ్ బ్లాక్లో ఎంటర్ చేసే అక్షరాలు కనిపించవు. బదులుగా డాట్స్ పడుతుంటాయి. ఆ సమయంలో ఒకవేళ కంప్యూటర్ ద్వారా సైన్ఇన్ అవుతుంటే నోట్పాడ్ ఓపెన్ చేసి అందులో ముందుగా పాస్వర్డ్ టైప్చేసి, ఎంటర్ చేయాల్సిన అన్ని అక్షరాలు సరిగ్గా పడుతున్నాయా? లేదా ఏదైనా బటన్ సమస్యలు, లేదా కేస్ సెన్సిటివ్ అక్షరాలు టైప్ అవుతున్నాయా చెక్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ బ్లాక్లో ఎంటర్ చేయడంతో సమస్య ఉండదు.ఇదీ చదవండి: ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?మొబైల్లో ఇలా..మొబైల్లో సైనప్ అవుతుంటే మాత్రం నోట్స్లో రాసుకోవచ్చు. దాంతోపాటు వెర్టికల్ వ్యూలో అక్షరాలు చిన్నగా ఉంటాయి. కాబట్టి పొరపాటున ఒక అక్షరం నొక్కితే పక్కన ఉన్న లెటర్లు ప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి పరిష్కారంగా మొబైల్లో స్క్రీన్ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఫోన్ రొటేట్ చేస్తే కీబోర్డ్ పెద్దగా కనిపిస్తుంది. మరింత స్పష్టంగా, ఎంటర్ చేయాలనుకునే పాస్వర్డ్ సదరు బ్లాక్లో ఇవ్వొచ్చు. -
ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?
సాంకేతిక పరిశ్రమలో పెరుగుతున్న కృత్రిమమేధ కోడింగ్ భవిష్యత్తుపై సందేహాలు కలిగిస్తోంది. ‘ఏఐ ఇప్పటికే తన కోడ్ను తానే వేగంగా, తక్కువ ఖర్చుతో, మరింత నాణ్యతతో రాయగలుగుతోంది. అలాంటప్పుడు పిల్లలకు ఈ నైపుణ్యం నేర్పించాల్సిన అవసరం ఏమిటి?’ అనే ఆందోళన ప్రస్తుతం తల్లిదండ్రుల్లో అధికమవుతోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో టెక్ విద్య కోసం పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తల్లిదండ్రులు అపారమైన సమయం, డబ్బు, శ్రమ, భావోద్వేగాలను పెట్టుబడిగా పెడుతున్నారు. ఇది కేవలం విద్యగా మాత్రమే కాకుండా ఉన్నత జీవనానికి నాందిగా చూస్తున్నారు.తల్లిదండ్రుల్లో భయంఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో తల్లిదండ్రుల్లో భయం పేరుకుపోతోంది. పిల్లల చదువు పూర్తయి ఉద్యోగాలు చేసే సమయానికి వారు ప్రస్తుతం నేర్చుకునే నైపుణ్యాలకు అప్పటి మార్కట్లో గిరాకీ ఉంటుందా?అనే సందేహం కలుగుతోంది. దానికి సమాధానం సంక్లిష్టమైనది. కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏటా భారతదేశంలో సుమారు 15 లక్షల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు పట్టాపొంది బయటకు వస్తున్నారు. కానీ 2025 నాటికి, వారిలో కేవలం 10% మందికే అర్థవంతమైన ఉద్యోగాలు దక్కుతున్నాయంటూ అంచనాలు వెలువడుతున్నాయి.ఊహాత్మక సంక్షోభమే..అంతేకాకుండా, గ్రాడ్యుయేట్లలో సగానికి పైగా, పోస్ట్ గ్రాడ్యుయేట్లలో దాదాపు 40% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దీనికి కోడింగ్ డిమాండ్ లేకపోవడం కారణమేమీ కాదు. మనం బోధిస్తున్న కోడింగ్ విధానం, ముఖ్యంగా ఆలోచనా సరళి మార్కెట్కు తగిన విధంగా లేదు. ఇది కంటెంట్ సంక్షోభం కాదు, ఊహాత్మక సంక్షోభమే. మళ్లీ ఒక్కసారి వెనక్కి వెళదాం. కాలిక్యులేటర్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు గణితం బోధించటం ఆపామా? గూగుల్ వచ్చినప్పుడు రాయడం నేర్పించటం మానామా? కాదుకదా. మనం బోధించే విధానాన్ని మార్చుకున్నాం. పఠనం కాకుండా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాం. కోడింగ్లో కూడా ఇదే మార్పు అవసరం అవుతుంది.కోడింగ్ కనుమరుగవ్వదు..భవిష్యత్తులో సరైన ప్రశ్నలు అడగడం, మానవులకు అనుగుణంగా ఉండేలా కోడింగ్ రూపొందించడం, బాధ్యతాయుతంగా మెలగడం, మెషీన్ వ్యవస్థలు ఎక్కడ తక్కువ పడుతున్నాయో అర్థం చేసుకోవడం ముఖ్యమవుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణ, ఎన్విరాన్మెంట్, డిజైన్, గవర్నన్స్, సాహిత్యం ఇంకా అనేక రంగాల్లో విస్తరించనుంది. కోడింగ్ కనుమరుగవ్వదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదు..అయితే భవిష్యత్తులో రాబోయే కోడింగ్ కేవలం సూచనలను అనుసరించే వారికే పరిమితం కాదు. ఇది విమర్శనాత్మకంగా ఆలోచించే, త్వరగా స్వీకరించే, సృజనాత్మకంగా రూపొందించే వ్యవస్థలకు విస్తరిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అనుసరిస్తున్న లెర్నింగ్ విధానాలు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అనే లక్ష్యాలు ఇకపై సరిపోవు.విద్య ఉపాధి సాధనం కాదు..ఇంజినీరింగ్ డిగ్రీ వల్ల పిల్లలకు ఉద్యోగం రాకపోవచ్చనే తల్లిదండ్రుల ఆందోళన తప్పేమీ లేదు. కానీ అందుకు పరిష్కారం కోడింగ్ను వదిలేయడం కాదు. విజయాన్ని నిర్వచించే సంకుచిత ప్రమాణాల నుంచి బయటపడటమే అసలు పరిష్కారం. విద్యను కేవలం ఉపాధి సాధనంగా పరిగణించే దశ దాటిపోయింది. ఇప్పుడు అంచనాలను పెంచాల్సిన సమయం వచ్చింది. ‘ఎలా?’ అని మాత్రమే కాదు, ‘ఎందుకు?’ అని కూడా ప్రశ్నించే ధోరణి, ఆసక్తిని పిల్లల్లో పెంపొందించాలి. కోడింగ్ను సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం లేదా భాషాశాస్త్రంతో కలిపి అన్వేషించాలనుకుంటే వారికి ప్రోత్సాహం అందించాలి. భవిష్యత్తులో వీటికి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంటుంది.‘ఇంటెలిజెన్స్’ అంటే..‘ఇంటెలిజెన్స్’ అంటే ఫార్ములాలను జ్ఞాపకం చేసుకోవడం, పరీక్షలు పాస్ అవడం కాదు. ఇవి పిల్లల తెలివితేటలకు సూచికలు కావు. కేవలం క్రమశిక్షణకు సంకేతాలు మాత్రమే. అయితే, నిజమైన మేధస్సు అనేది వివరణాత్మకమైనది. ఇది మనం నేర్చుకునే అంశాలను లోతుగా ఆలోచించమని, మెషీన్లు చేయలేని పనులను పూర్తి చేయాలని తెలుపుతుంది. ఇప్పటికే ఏఐ తెలిసిన అంశాలను క్షణ్లాలో ముందుంచుతుంది. క్రియేటివిటీతో ఎవరికీ తెలియని కొత్త అంశాలను అన్వేషించేలా నైపుణ్యాలు మలుచుకోవాలి. క్రియేటివిటీతో తెలియని సమస్యలకు అసలైన పరిష్కారాలు కనుగొనాలి. ఇప్పటివరకు ఎవ్వరూ రూపొందించని దాన్ని డిజైన్ చేయాలి.ఇతర దేశాల్లో ఇలా..జర్మనీలోని ఆర్డబ్ల్యూటీహెచ్ ఆచెన్ విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్ను భాషాశాస్త్రం, మీడియా అధ్యయనాలతో మిళితం చేస్తోంది. ఫిన్లాండ్లోని హెల్సింకి విశ్వవిద్యాలయం విద్యార్థులకు డేటా సైన్స్ను తత్వశాస్త్రం(ఫిలాసఫీ)తో కలిపి అభ్యసించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. స్వీడన్, డెన్మార్క్లో ఏఐ ప్రోగ్రాముల్లో విభిన్న మార్పులు చేస్తున్నారు. ఇవి కేవలం ప్రయోగాత్మక ఆలోచనలు కావు. ఇవే భవిష్యత్తు విద్యా మోడళ్లకు మార్గదర్శకాలు.భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలి..భారతదేశానికి ఇదో గొప్ప అవకాశం. అవుట్సోర్స్ కోడింగ్ సర్వీసులు అందించేలా ఎదిగేందుకు మార్గం ఉంది. లేదా రాబోయే కాలానికి సిద్ధంగా ఉన్న మేధావులను పెంపొందించే ప్రయోగశాలగా మారవచ్చు. అందుకోసం పిల్లల్లో పటిష్ట నైపుణ్యాలను పెంపొందించాలి. ఏఐ యుగంలో లోతుగా ఆలోచించగలిగే, నిర్మాణాత్మకంగా క్రియేటివిటీ కలిగిన వారే విజయం సాధిస్తారు. పిల్లలు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.కరుణ్ తాడేపల్లి, సీఈఓ బైటెక్సెల్(హైదరాబాద్లోని స్టార్టప్ సంస్థ). -
రిటర్నులు ఎవరు వేయక్కర్లేదంటే..
2025 సంవత్సరం మొదలైందంటే 31.3.2025 నాటి కల్లా ప్లానింగ్, సేవింగ్స్, టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ టాక్స్ చెల్లింపులు... అలాగే 1.4.2025 దాటిదంటే రిటర్ను వేయడానికి సన్నద్ధం కావాలి. ఏ ఫారం వేయాలి. గడువు తేదీ ఏమిటి..? ఎంత పన్ను చెల్లించాలి..? ఇలా ఉంటాయి అందరి అలోచనలు. ఈ వారం టాక్స్ కాలంలో వ్యక్తులు ఏయే సందర్భాలలో రిటర్నులు వేయనక్కర్లేదో వివరంగా తెలుసుకుందాం.టాక్స్బుల్ ఇన్కం లిమిట్ దాటని వ్యక్తులు నికర ఆదాయాన్ని టాక్స్బుల్ ఇన్కం అంటారు. నికర ఆదాయం టాక్సబుల్ ఇన్కం లిమిట్ లోపల ఉంటే రిటర్నులు వేయాల్సిన పనిలేదు. ఇది మీకు తెలిసిన విషయమే. కొత్త విధానంలో ఏ వయసువారికైనా బేసిక్ లిమిట్ రూ.3 లక్షలుగా ఉంటుంది. వయసు బట్టి మార్పు లేదు. కానీ పాత విధానంలో మార్పులు ఉన్నాయి. ఈ బేసిక్ లిమిట్ లోపల పన్నుభారం ఉండదు. అయితే కొత్త విధానంలో రిబేటుని ఇస్తారు. అంటే పన్ను భారంలోంచి తగ్గిస్తారు. ఆదాయంలోంచి కాదు. రిబేటుని రూ.60,000కు పెంచడం వలన రూ.12 లక్షల లోపల ఆదాయం ఉన్నవారికి పన్ను పడదు.కేవలం బ్యాంకు వడ్డీ / పెన్షన్ ఉండి, ఎటువంటి టీడీఎస్ లేకపోతే... మీ ఆదాయం కేవలం వడ్డీ అనుకొండి. సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఎఫ్డీలు కానీ లేదా పెన్షన్ కానివ్వండి లేదా ఈ రెండు కలిపి కానివ్వండి.. వెరసి మొత్తం టాక్సబుల్ ఇన్కం దాటకూడదు. అలాగే డివిడెండ్లు, టీడీఎస్ ఉండకూడదు. అటువంటి వారు నిశ్చింతగా ఉండొచ్చు. ఇదే ఉదాహరణలో టీడీఎస్ ఉంటే రిటర్ను వేయాలి.గృహిణులు, విద్యార్థులు కూడా వేయనవసరం లేదు. ఇంటి నిర్వహణ నిమిత్తం భర్త తన టాక్సబుల్ ఇన్కం నుంచి లేదా మిహాయింపు రశీదులో ఎంత ఇచ్చినా పన్ను పడదు. పోపుల డబ్బాలో మిగిలిన మొత్తానికి పన్ను ఉండదు. అలాగే పిల్లలకు ఇచ్చిన పాకెట్ మనీకి కూడా పన్ను పడదు.ఎన్నారైలకు ఇండియాలో టాక్స్బుల్ ఇన్కం లిమిట్ రూ.2.50 లక్షల లోపల ఉంటే రిటర్ను వేయక్కర్లేదు.సీనియర్స్ సిటిజన్లు... కానీ షరతులకు లోబడి సెక్షన్ 194 ... ఇదొక వరం లాంటిది. కానీ అందరూ లబ్ధిదారులు కాదు. 75 సంవత్సరాలు దాటిన వారికి వర్తిస్తుంది.రెసిడెంటు అవ్వాలి75 సంవత్సరాలు లేదా అంతకుపైబడిన వారికి మాత్రమేఆదాయంలో కేవలం పెన్షన్, ఒకే బ్యాంకు అకౌంటులోని వడ్డీ ఉండాలి. ఒకే బ్యాంక్ అకౌంటు ఉండాలి. అది కూడా నిర్దేశిత బ్యాంకు అయ్యి ఉండాలి. అందులోనే పెన్షన్ జమ అవ్వాలిపెన్షన్+వడ్డీ మీద టీడీఎస్... ఆ బ్యాంకు లెక్కించి రికవరీ చేయాలిబ్యాంకు 80 ఇ, 80 ఈ మొదలైన డిడక్షన్లు పరిగణలోకి తీసుకుంటుంది. ఇదీ చదవండి: పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలుఈ వెసులుబాటు మాత్రం ఎంగిలి చేత్తో కాకిని తోలినట్లే కొద్ది మందికే ఉపయోగపడవచ్చు. దానిని వక్రీకరించి చాలామంది, 75 ఏళ్ల వారికి పన్ను లేదని పిడివాదన చేస్తుంటారు. అది నమ్మకండి. -
పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈ రోజు వినియోగదారులకు ఊరట కల్పించింది. క్రితం ముగింపుతో పోలిస్తే సోమవారం బంగారం ధర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అధిక రాబడులకు మార్గం!
ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకునే వారు స్మాల్క్యాప్ ఫండ్స్కు తప్పకుండా చోటు కల్పించుకోవాలి. పెట్టుబడులు అన్నింటినీ స్మాల్ క్యాప్స్లో కాకుండా.. తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా కేటాయింపులను నిర్ణయించుకోవాలి. చిన్న కంపెనీల్లో అస్థిరతలు ఎక్కువ. కానీ, బలమైన ఆర్థిక మూలాలతో, మంచి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే చిన్న కంపెనీలు దీర్ఘకాలంలో మధ్య స్థాయి, బడా కంపెనీలుగా అవతరించగలవు. అటువంటి గొప్ప కంపెనీలను ముందుగా గుర్తించే నైపుణ్యాలు రిటైల్ ఇన్వెస్టర్లలో సాధారణంగా ఉండవు. కనుక ఇన్వెస్టర్లు స్మాల్క్యాప్ పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్పై ఆధారపడడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఈ విభాగంలో క్వాంట్ స్మాల్క్యాప్ ఫండ్ మంచి రాబడులను అందిస్తోంది.రాబడులుఈ పథకం గడిచిన ఏడాది కాలం మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ అద్భుతమైన రాబడులను అందించినట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఏటా 33 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఐదేళ్లలో ఏటా 46 శాతం, ఏడేళ్లలో 27.60 శాతం, పదేళ్లలో 21 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకంలో నమోదైంది. ఇదే కాలంలో స్మాల్క్యాప్ ఫండ్స్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే 10–12 శాతం వరకు వివిధ కాలాల్లో అధిక రాబడి వచ్చింది. ఈ పథకం 1996లో ప్రారంభమైంది. గతంలో క్వాంట్ ఇనకమ్ ఫండ్ పేరుతో కొనసాగింది. ఆరంభం నుంచి ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే 14.43 శాతం ఎక్స్ఐఆర్ఆర్ రాబడి ఆధారంగా రూ.4.08 కోట్లు సమకూరేది. పెట్టుబడుల విధానం..‘క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ తాను అనుసరించే డైనమిక్ అస్సెట్ అలోకేషన్ విధానం కారణంగా అధిక ఆల్ఫాతో బలంగా నిలబడగలిగింది. అలాగే స్టాక్స్ ఎంపిక కోసం అనుసరించే చురుకైన విధానాలు, అదే సమయంలో సానుకూల మార్కెట్ పనితీరుతో మంచి పనితీరు చూపించింది. అధిక వృద్ధి అవకాశాలు కలిగిన కంపెనీలను ముందుగానే గుర్తించే సామర్థ్యం ఫండ్ మేనేజర్లలో ఉండడం అనుకూలించింది’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. అయినప్పటికీ చిన్న కంపెనీలు స్వల్ప కాలంలో దిద్దుబాట్లకు గురవుతుంటాయని.. లిక్విడిటీ సమస్య కూడా ఉంటుందన్నారు. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి స్మాల్క్యాప్ ఫండ్స్లో పెట్టుబడులు కొనసాగించిన వారికి మెరుగైన రాబడులు వస్తాయని సూచించారు. ప్రధానంగా అధిక వృద్ధి సామర్థ్యాలను, రంగాల వారీ సానుకూల సైకిల్స్ను ఫండ్ మేనేజర్లు ఆరంభ దశలో గుర్తించి ఆయా స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రాబడుల దిశగా ప్రయతి్నంచడం ఈ పథకంలో గుర్తించొచ్చు. అధిక రిస్క్ ఉన్న వారికే ఈ తరహా స్మాల్క్యాప్ ఫండ్స్ అనుకూలమన్నది మర్చిపోవద్దు.ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా పోర్ట్ఫోలియోప్రస్తుతం రూ.28,205 కోట్ల పెట్టుబడులు ఈ పథకం నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 92.78 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ సాధనాల్లో 1.44% పెట్టుబడులు ఉన్నాయి. 5.79% మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పేరుకు స్మాల్క్యాప్ ఫండ్ అయినప్పటికీ స్మాల్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు ప్రస్తుతం 31% మేరే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 43% మేర ఇన్వెస్ట్ చేయగా, లార్జ్క్యాప్ కంపెనీల్లో 24% మేర ఎక్స్పోజర్ కలిగి ఉంది. అయితే ప్రస్తుతం స్మాల్క్యాప్ కంపెనీల విలువలు గరిష్ట స్థాయిలకు చేరినందున ఎక్స్పోజర్ తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఆయా విభాగాల వ్యాల్యూషన్ల ఆధారంగా ఈ పెట్టుబడులను మారుస్తుండడం గమనించొచ్చు. అత్యధికంగా 17.56% పెట్టుబడులను ఇంధన రంగ, యుటిలిటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 16%, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 15%, హెల్త్ కేర్ కంపెనీల్లో 14% చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. -
యూఎస్తో వాణిజ్య ఒప్పందంపై ఫోకస్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 25,423కు చేరింది. సెన్సెక్స్(Sensex) 126 ప్లాయింట్లు నష్టపోయి 83,313 వద్ద ట్రేడవుతోంది.మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే పలు కీలక సంఘటనలు ఈ వారంలో చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్పై కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒడిదొడుకుల మార్కెట్లో చేయాల్సింది ఇదే..
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో స్థూల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా కనిపిస్తున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలు, పాలసీపరంగా అనిశ్చితి, వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లడం తదితర అంశాల కారణంగా 2025 గ్లోబల్ జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి 2.8 శాతానికి కుదించింది. అయితే, ఇలాంటి అస్థిరత మధ్య కూడా భారత ఆర్థిక మూలాలు పటిష్టంగానే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక నియంత్రణకు కట్టుబడి ఉండటం, వృద్ధిని ప్రోత్సహించేలా ద్రవ్య విధానాలు ఉండటం వంటి అంశాలు దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటంలో కీలక పాత్ర పొషిస్తున్నాయి.2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ 6.5% వృద్ధి సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. గ్రామీణ డిమాండ్ స్థిరంగా ఉండటం, పట్టణప్రాంతంలో వినియోగం మెరుగుపడటం, పెట్టుబడులు స్థిరంగా పుంజుకోవడం ఇందుకు దోహదపడనున్నాయి. మే 2025 నాటికి ద్రవ్యోల్బణం 2.8 శాతానికి తగ్గింది. 2019 ఫిబ్రవరి తర్వాత ఇది అత్యల్ప స్థాయి. ఆహారపదార్థాల ధరలు తగ్గడంతో పాటు సానుకూల రుతుపవనాల అంచనాలు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. ఇవన్నీ సానుకూలమే అయినప్పటికీ మార్కెట్లో అస్థిరత పెరుగుతుండటంలాంటి అంశాల కారణంగా డైవర్సిఫికేషన్కి ప్రాధాన్యమిచ్చే మల్టీ అసెట్ ఫండ్స్ ఆవశ్యకత కనిపిస్తోంది. ఎందుకంటే, 2024లో ఈక్విటీ మార్కెట్లో అన్ని విభాగాలు మెరుగ్గా రాణించడంతో డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు ఒక స్థాయికే పరిమితమైనట్లు కనిపించింది. కానీ, మార్కెట్ అస్థిరత మళ్లీ పెరుగుతుండటం, వివిధ రంగాల మధ్య పనితీరులో అంతరాలు కనిపిస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో డైవర్సిఫికేషన్ వ్యూహాలకు మళ్లీ ప్రాధాన్యం పెరుగుతోంది.ఈక్విటీలకు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించి రాబడులు అందించే సామర్థ్యం ఉండగా, హైబ్రిడ్ ఫండ్లు స్థిరంగా, రిస్క్లకు తగ్గ అనుకూల రాబడిని అందించగలవు. ఇవి ముఖ్యంగా పెట్టుబడికి భద్రత, పోర్ట్ఫోలియోకి స్థిరత్వాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు అనువైనవిగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లాంటి హైబ్రిడ్ ఫండ్లు మదుపరులకు మెరుగ్గా నిలుస్తున్నాయి. ఇవి సందర్భాన్ని బట్టి వివిధ సాధనాలకు వివిధ రకాలుగా కేటాయించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈక్విటీలు, ఫిక్స్డ్ ఇన్కం, కమోడిటీల మధ్య పెట్టుబడులను అటూ, ఇటూ మారుస్తూ, రిస్క్లను సమర్ధవంతంగా అధిగమిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోగలిగే వెసులుబాటు వీటికి ఉంటుంది. ఈక్విటీ వేల్యుయేషన్స్ అధిక స్థాయిలో, బాండ్లపై రాబడులు స్థిరంగా ఉండగా.. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించే కమోడిటీలకు – ముఖ్యంగా బంగారానికి కూడా పోర్ట్ఫోలియోలో చోటు కల్పించడం కీలకంగా మారింది. ఎందుకంటే, సంక్లిష్టమైన స్థూలఆర్థిక పరిస్థితుల్లో రిసు్కలకు తగ్గ రాబడులను అందించే విషయంలో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇదీ చదవండి: ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..ఇలాంటి, అతి తక్కువ లేదా నెగిటివ్ కో–రిలేషన్ ఉన్న ఆర్థిక సాధనాలతో వైవిధ్యభరితంగా ఉండే పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడులు భారీగా పతనం కాకుండా కాస్త రక్షణ లభిస్తుంది. నెగటివ్ కో–రిలేషన్ అంటే, ఆర్థిక లేదా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఈక్విటీ మార్కెట్ క్షీణించినప్పటికీ, సురక్షితమైన సాధనాలుగా పరిగణించే డెట్, పసిడిలాంటి సాధనాలు పెరుగుతాయి. ఇలా ఒడిదుడుకులు నెలకొన్నప్పుడు, పరస్పర విరుద్ధంగా వ్యవహరించే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ఇన్వెస్టర్లకు రిసు్కలను తగ్గించి, మెరుగైన రాబడినిచ్చే విధంగా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉంటాయి. ఇవి వివిధ సాధనాలవ్యాప్తంగా కేటాయింపులను సత్వరం మార్చగలిగే విధంగా పనిచేస్తాయి. అయితే, నిబంధనల ప్రకారం ఈక్విటీలకు తప్పనిసరిగా కనీసం 65 శాతమైన నిధులు కేటాయించాలి కాబట్టి, వీటిపై వచ్చే మూలధన లాభాలకు శ్లాబ్ రేట్ల వారీగా కాకుండా ఈక్విటీ ట్యాక్సేషన్ వర్తిస్తుంది. కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల సాధన కోసం పన్నులు ఆదా అయ్యే మార్గాలను అన్వేషించే ఇన్వెస్టర్లు, ఈ ఫండ్స్ను పరిశీలించవచ్చు. ఇవి సమీప భవిష్యత్తులో క్షీణత నుంచి రక్షణ, అలాగే పన్నులపరంగా ప్రయోజనాలు కల్పిస్తూనే దీర్ఘకాలికంగా పెట్టుబడి వృద్ధి అవకాశాలను కూడా అందిస్తూ, ఇన్వెస్టర్లకు అనువుగా ఉంటాయి. -
లార్జ్క్యాప్ – మిడ్క్యాప్లో ఏది మెరుగు?
నేను ప్రతి నెలా రూ.5,000 చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలం కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఏవైనా ఉన్నాయా? – వాణిమీ పెట్టుబడులకు తగినంత దీర్ఘకాలం ఉంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు మంచి ఎంపిక అవుతుంది. ఈక్విటీ మార్కెట్లన్నవి ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటాయి. మీ సౌకర్యానికి అనుగుణంగా మంచి పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. మీరు మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్తో ఆరంభించొచ్చు. పెట్టుబడుల్లో మూడింట రెండొంతులను ఈక్విటీలకు, మిగిలిన ఒక వంతును డెట్ సాధనాలకు ఇవి కేటాయిస్తాయి. ఈక్విటీ విభాగం ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో డెట్ పెట్టుబడులు కుషన్గా పనిచేస్తాయి. అచ్చమైన ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులతో పోల్చి చూసినప్పుడు ఆటుపోట్ల ప్రభావం హైబ్రిడ్ పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి.నెలకు రూ.5,000 చొప్పున 20 ఏళ్ల పాటు సిప్ చేస్తూ వెళితే 12.18 శాతం రాబడుల ఆధారంగా (గత 20 ఏళ్ల సగటు రాబడి) రూ.51.25 లక్షలు సమకూరుతుంది. పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) సాధనాలకు కేటాయించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్లలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికావడం సహజం. ఆ సమయంలో నష్టాలకు సైతం ఈక్విటీ పెట్టుబడులు అమ్మేస్తుంటారు. అలాంటి తరుణంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడుల విలువ క్షీణతను పరిమితం చేస్తాయి. మార్కెట్ల ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం ఉన్నవారు.. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ను సైతం పరిశీలించొచ్చు. ఇవి లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో విభాగంలో పెట్టుబడులను మార్పులు చేర్పులు చేస్తుంటాయి. చారిత్రకంగా చూస్తే వీటి వార్షిక రాబడి గత 20 ఏళ్లలో 12.66 శాతం చొప్పున ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ కంటే కొంచెం అదనపు రాబడులను ఇవ్వగలవు.ఇదీ చదవండి: ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్క్యాప్, మిడ్క్యాప్ ఫండ్స్లో వేటిని ఎంపిక చేసుకోవాలి. – అనిరుధ్దీర్ఘకాలంలో ఏ విభాగం అధిక రాబడులను ఇస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ముఖ్యంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే మార్కెట్ సైకిల్ (దిద్దుబాటు) ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తే.. కొన్ని సందర్భాల్లో మిడ్క్యాప్ కంపెనీలు మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్క్యాప్ విభాగం అధిక రాబడులను ఇస్తుంటుంది. కనుక ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీక్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మేనేజర్కు ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకం ద్వారా ఆ సైకిల్ను చక్కగా అధిగమించగలరు. -
స్థిరమైన దీర్ఘకాలిక విధానాలు అవసరం
ప్యారిస్: భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి స్థిరమైన, దీర్ఘకాల విధానాలు.. రాష్ట్రాల వ్యాప్తంగా ఏకరూపత అవసమని ఫ్రాన్స్కు చెందిన కార్ల తయారీ సంస్థ స్టెల్లాంటిస్ ఇండియా సీఈవో శైలేష్ హజేలా అభిప్రాయపడ్డారు. అప్పుడే ఆటోమొబైల్ కంపెనీలు దీర్ఘకాల దృష్టితో వ్యాపార ప్రణాళికలను అమలు చేయగలవన్నారు. జీప్, సిట్రోయెన్ బ్రాండ్ల రూపంలో భారత మార్కెట్లో స్టెల్లాంటిస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్కు పెట్టుబడులతో వచ్చే వారు విధానాల పరంగా దీర్ఘకాల దృష్టిని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించింది ఏదైనా సరే, దేశవ్యాప్తంగా ఒకే మాదిరిగా, దీర్ఘకాలం పాటు అమలు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఈవీలకు సంబంధించి, పన్ను పరమైన ఏకీకృత విధానాలు ఉండాలన్నారు. అప్పుడే కంపెనీలు రాష్ట్రాల వారీగా కాకుండా మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోగలవన్నారు. ఈవీలకు సంబంధించి రాష్ట్రాలు వేర్వేరు విధానాలు అమలును ప్రస్తావించారు. సిట్రెయెన్ బ్రాండ్ విస్తరణ గత కొన్ని సంవత్సరాలుగా స్టెల్లాంటిస్ గ్రూప్ భారత్లో కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని శైలేష్ హజేలా తెలిపారు. ఇప్పుడు సిట్రోయెన్ బ్రాండ్ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. సేల్స్, నెట్వర్క్ విస్తరణపై దృష్టి సారించినట్టు తెలిపారు. వచ్చే ఏడాదిలో విక్రయ కేంద్రాలను రెట్టింపు చేసుకోనున్నట్టు (80 నుంచి 150కు) ప్రకటించారు. చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాలపై దృష్టి సారిస్తామన్నారు. టైర్4 పట్టణాల వరకు విస్తరిస్తామన్నారు. మార్కెట్ వాటాను వచ్చే 12 నెలల్లో రెట్టింపు చేసుకునే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. సిట్రోయెన్ బ్రాండ్పై రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు స్టెల్లాంటిస్ ఈ ఏడాదిలో ప్రకటించడం గమనార్హం. -
భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై ఫోకస్!
న్యూఢిల్లీ: మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే పలు కీలక సంఘటనలు ఈ వారంలో చోటు చేసుకోన్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్పై కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ముఖ్యంగా వాణిజ్య సంబంధ రంగాలకు ఈ ఒప్పందం బూస్ట్ ఇస్తుందని చెబుతున్నారు. ‘ఈ వారం ఒక్క భారత్ మార్కెట్లకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు చాలా కీలకం కానుంది. ఉత్కంఠ రేపుతున్న జూలై 9 అమెరికా టారిఫ్ డెడ్లైన్ దగ్గరకొచి్చంది. ప్రపంచ వాణిజ్య స్థితిగతులను ఇది మార్చేయనుంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ అదే రోజున విడుదల చేసే పాలసీ మినిట్స్ కూడా మార్కట్లపై ప్రభావం చూపుతుంది’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు.ఫలితాల సీజన్.. టీసీఎస్ బోణీ కార్పొరేట్ ఫలితాల సీజన్ మళ్లీ మొదలవుతోంది. ఈ నెల 10న టీసీఎస్ క్యూ1 (2025–26, ఏప్రిల్–జూన్ క్వార్టర్) ఫలితాల బోణీ కొట్టనుంది. అదే రోజున టాటా ఎలెక్సీ కూడా ఫలితాలను ప్రకటించనుంది. ఈ వారంలోనే 11న అవెన్యూ సూపర్మార్ట్, ఆదిత్య బిర్లా మనీ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా మార్కెట్ ఫోకస్ క్యూ1 ఫలితాల వైపు మళ్లనుంది. ‘భారత్–యూఎస్ మధ్య వాణిజ్య చర్చల్లో సానుకూల ఫలితం వెలువడితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ వంటి రంగాలకు ఇది జోష్ ఇస్తుంది. మార్కెట్లు ఇప్పుడు పై స్థాయిల్లోనే కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న క్యూ1 ఫలితాలు కూడా సూచీల గమనానికి దిశా నిర్దేశం చేస్తుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. క్రూడ్, రూపాయి ట్రెండ్... బ్రెంట్ క్రూడ్ ధరల ట్రెండ్, డాలర్తో రూపాయి మారకం విలువ కదలికలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. అదేవిధంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల ధోరణి కూడా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘ఎఫ్ఐఐలు మళ్లీ కొనుగోళ్ల బాట పట్టడానికి రెండు అంశాలు కీలకం కానున్నాయి. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదరితే మార్కెట్లకు సానుకూలాంశం. ఎఫ్ఐఐలు మళ్లీ పెట్టుబడులకు సై అంటారు. అలాగే క్యూ1 ఫలితాల్లో రికవరీ సంకేతాలు కనిపించడం కూడా సానుకూలంగా నిలుస్తుంది. ఈ రెండింటి విషయంలో నిరుత్సాహం ఎదురైతే మార్కెట్పైనా, ఎఫ్ఐఐల నిధుల ప్రవాహంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్కుమార్ పేర్కొన్నారు. మొత్తంమీద చూస్తే ఇండో–యూఎస్ వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కోసం వేచిచూసే ధోరణి, క్యూ1 ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మార్కెట్లు కన్సాలిడేషన్లో ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమ్కా వ్యాఖ్యానించారు.గత వారమిలా... దేశీ సూచీలు గత వారంలో రివర్స్ గేర్ వేశాయి. బీఎస్ఎస్ఈ సెన్సెక్స్ 626 పాయింట్లు (0.74%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 176 పాయింట్లు (0.68%) చొప్పున నష్ట పోయాయి.జూలైలో ఎఫ్పీఐలు ఆచితూచి... ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఆర్బీఐ రేట్ల కోత వంటి సానుకూలతల నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) గత నెలలోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. రూ.14,590 కోట్లు ఈక్విటీల్లో వెచ్చించారు. వెరసి వరుసగా మూడో నెలలోనూ పెట్టుబడుల బాటలోనే కొనసాగారు. అయితే, ఈ నెలలో మళ్లీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొలి వారంలో రూ.1,421 కోట్ల అమ్మకాలు జరిపారు. ముఖ్యంగా అమెరికా ట్రేడ్ వార్ డెడ్లైన్ దగ్గరపడటం, క్యూ1 ఫలితాల సీజన్పై అంచనా అంచనాల నేపథ్యంలో ఎఫ్పీఐలు ప్రస్తుతానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఏంజెల్ వన్ సీనియర్ ఫండమెంటల్ ఎనలిస్ట్ వకార్జావెద్ ఖాన్ తెలిపారు. స్వల్పకాలానికి విదేశీ నిధుల ప్రవాహంలో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని పేర్కొన్నారు. 2025లో ఇప్పటిదాకా రూ.79,322 కోట్లను ఎఫ్పీఐలు వెనక్కి తీసుకోవడం గమనార్హం. -
ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. పెరుగుతున్న వ్యాపార కార్యకలాపాలు, విస్తరణ నేపథ్యంలో సుమారు 50,000 మందిని భర్తీ చేసుకోనున్నాయి. ఇందులో 21,000 మంది ఆఫీసర్ స్థాయి వారు కాగా, మిగిలిన వారు క్లర్క్ తదితర ఉద్యోగాలకు సంబంధించి ఉండనున్నారు. ప్రభుత్వరంగంలో 12 బ్యాంకులు ఉండగా, ఒక్క ఎస్బీఐనే 20,000 మందికి అవకాశం కల్పించనుంది. ఇందులో భాగంగా ఎస్బీఐ ఇప్పటికే 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకుంది. అలాగే, 13,455 మంది జూనియర్ అసోసియేట్స్ భర్తీని సైతం చేపట్టింది. శాఖల స్థాయిలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తాజా నియామకాలు చేపట్టినట్టు ఎస్బీఐ ప్రకటించడం గమనార్హం. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని శాఖల స్థాయిలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంది. ఎస్బీఐలో మొత్తం ఉద్యోగులు 2025 మార్చి చివరికి 2,36,226 మంది ఉన్నారు. ఇందులో 1,15,066 మంది ఆఫీసర్ ర్యాంకుల్లోని వారే. ఉద్యోగుల వలసలను 2 శాతంలోపునకు పరిమితం చేసేందుకు ఎస్బీఐ చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగంలో రెండో అతిపెద్ద బ్యాంక్ పీఎన్బీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో రూ.5,500 మందిని కొత్తగా నియమించుకోనుంది. ఈ ఏడాది మార్చి నాటికి పీఎన్బీ వ్యాప్తంగా 1,02,746 మంది ఉద్యోగులున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4,000 మందిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియమించుకోనుంది. సబ్సిడరీల బలోపేతంపై దృష్టి.. సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరించి, వాటిని స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ చేయడం ద్వారా రాబడులు పెంచుకోవడంపై దృష్టి సారించాలని ప్రభుత్వరంగ బ్యాంక్లను కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల ఆదేశించడం గమనార్హం. అవసరాలకు అనుగుణంగా సబ్సిడరీ సంస్థల్లో బ్యాంక్లు అదనపు పెట్టుబడులు పెడతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యకలాపాల విస్తరణతో సబ్సిడరీల్లోనూ నియామకాలు పెరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. -
బ్యాంక్ లాకర్.. ఎంత భద్రం?
చాలా మందికి బ్యాంక్ లాకర్ నమ్మకమైన, భద్రమైన వేదిక. రక్షణ దృష్ట్యా విలువైన డాక్యుమెంట్లు, బంగారం, వెండి, వజ్రాభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుస్తుంటారు. కొందరు నగదును కూడా లాకర్లలో పెడుతుంటారు. బ్యాంకు లాకర్లపై కొండంత భరోసాతో ఉండేవారికి యూపీలోని మొరాదాబాద్లో 2023లో జరిగిన ఒక ఘటనను గుర్తు చేయాల్సిందే. ఒక మహిళ తన కుమార్తె వివాహ అవసరాల కోసం ఉద్దేశించిన రూ.18 లక్షల నగదును, ఆభరణాలతోపాటు లాకర్లో ఉంచగా.. చెదలు ఆ నోట్లను చిత్తు చిత్తు చేసేశాయి. ఈ కేసులో ఆమెకు ఒక్క రూపాయి పరిహారం ముట్టలేదు. అందుకే లాకర్ను వినియోగించుకునే ప్రతి ఒక్కరూ ముందుగా నియమ, నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. లాకర్లో ఉంచిన వాటికి నష్టం జరిగతే బ్యాంక్ బాధ్యత ఏ మేరకు అన్నది స్పష్టత తీసుకోవాలి. అవసరమైతే బీమా రక్షణతో భరోసా కల్పించుకోవాలి. బ్యాంకు లాకర్లో పెట్టేశాం కదా ఇక నిశ్చింతగా ఉండొచ్చనుకుంటే పొరపాటే. అధిక తేమ లేదా చెదలు లాకర్లో ఉంచిన డాక్యుమెంట్లు, కరెన్సీ నోట్లను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. దీనికితోడు వరదల కారణంగా లాకర్లలోకి నీరు చేరొచ్చు. భూకంపం కారణంగా నిర్మాణమే దెబ్బతినొచ్చు. చోరీ, దోపిడీలన్నవి అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి అన్ని రకాల నష్టాలకూ బ్యాంక్లు పరిహారం చెల్లించవన్న విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ‘‘విలువైన వాటిని స్టోర్ చేసుకునేందుకు బ్యాంక్ లాకర్లు భద్రమైన ఎంపికే. కానీ, ఇందులో రిస్క్ లు కూడా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకుని సరైన చర్యలు తీసుకోవడం ద్వారా అందులో ఉంచిన మీ వస్తువులను రక్షించుకోవచ్చు’’ అని సాల్వే బస్సెల్స్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ మేనేజ్మెంట్ క్వాంటిటేటివ్ అనలిస్ట్ స్నేహాశిష్ దాస్ తెలిపారు. వేటికి పరిహారం.. లాకర్ విషయంలో ఆర్బీఐ 2021లో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. లాకర్లలో ఉంచిన వాటికి నష్టం జరిగితే బ్యాంక్ బాధ్యత ఏ మేరకో ఇందులో స్పష్టత ఇచ్చారు. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా దొంగతనం, అగి్నప్రమాదం, భవనం కూలిపోవడం లేదా ఉద్యోగి మోసం కారణంగా లాకర్లలో ఉన్న వాటికి నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా బ్యాంక్ లాకర్ వార్షిక అద్దె/చార్జీకి గరిష్టంగా 100 రెట్ల వరకే బ్యాంక్లు చెల్లిస్తాయి. ఉదాహరణకు బ్యాంక్ లాకర్ చార్జీ ఏటా రూ.5,000 ఉందనుకుంటే.. లాకర్లలో ఉంచిన వాటికి నష్టం జరిగితే బ్యాంక్ గరిష్టంగా రూ.5 లక్షలను చెల్లిస్తుంది. బ్యాంక్లు సరైన చర్యలు తీసుకున్నప్పటికీ వరదలు, భూకంపాల కారణంగా లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే అలాంటి సందర్భాల్లో బాధ్యత వహించబోవని దాస్ తెలిపారు. అంతేకాదు డాక్యుమెంట్లను సరైన భద్రతతో కూడిన ప్యాకేజీతో ఉంచకపోయినా నష్టానికి బ్యాంక్లు బాధ్యత తీసుకోవని చెప్పారు. తేమకు దెబ్బతినని, నీటితో తడిసినా దెబ్బతినని పాలిథీన్ బ్యాగుతోపాటు చెదలు పట్టలేని ప్యాక్తో రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కస్టమర్ల నిర్ల క్ష్యం వల్ల వాటిల్లే నష్టానికి బ్యాంకులు పరిహారం చెల్లించవు. లాకర్ను సరైన విధంగా లాక్ చే యకుండా వెళ్లిపోయిన సందర్భాల్లో నష్టానికి కస్టమర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్పీ విశాల్ ధావన్ తెలిపారు. వీటికి అనుమతి.. బంగారం, వెండి, వజ్రాభరణాలు, బంగారం/వెండి వస్తువులు, బంగారం కాయిన్లు, బిస్కెట్లు లాకర్లలో ఉంచొచ్చు. చట్టబద్ధమైన డాక్యుమెంట్లు, బీమా పత్రాలు, వీలునామాలు, ప్రాపర్టీ రిజి్రస్టేషన్ పత్రాలు, బర్త్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉంచొచ్చు. షేరు సర్టిఫికెట్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర పెట్టుబడుల పత్రాలను కూడా భద్రంగా పెట్టుకోవచ్చు. ప్రముఖ బ్యాంక్లు లాకర్లలోనూ భిన్న రకాల సైజులను (నాలుగు రకాలు) ఆఫర్ చేస్తున్నాయి. వీటి చార్జీలు, సదుపాయాలు వేర్వేరుగా ఉన్నాయి. తమ అవసరాలకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. లాకర్ ఇన్సూరెన్స్.. లాకర్లో ఉంచిన వాటికి నష్టం జరిగితే కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి పరిహారం రాదు. కనుక లాకర్ సదుపాయం వినియోగించే ప్రతి ఒక్కరూ లాకర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్లు చెల్లించే పరిహారం సైతం వార్షిక అద్దెకు గరిష్టంగా 100 రెట్లకు మించదు. లాకర్లో అంతకుమించి విలువైన వాటిని ఉంచే వారు తప్పకుండా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. లాకర్లో ఉంచిన వస్తువుల విలువను తెలియజేసే సర్టిఫికెట్లు/ధ్రువీకరణలను జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవాలి. లాకర్లో ఉంచిన వాటి విలువకు తగ్గకుండా బీమా కవరేజీ తీసుకోవాలి. అగ్నిప్రమాదం, చోరీ, ఉగ్రవాదం, ప్రకృతి విపత్తుల కారణంగా లాకర్లోని వాటికి నష్టం వాటిల్లితే పరిహారం లభిస్తుంది. లాకర్లో విలువైన డాక్యుమెంట్లకు కవరేజీ కోసం రైడర్లు తీసుకోవాల్సి ఉంటుంది. లాకర్లో ఉంచిన వాటిని నిర్ధారించేందుకు వీలుగా ఫోన్లో ఫొటో తీసి పెట్టుకోవడం మంచిది. చాలా కంపెనీలు రూ. 3–40 లక్షల మధ్య సమ్ అష్యూర్డ్తో లాకర్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేస్తున్నాయి. హోమ్ ఇన్సూరెన్స్లోనూ లాకర్లో ఉంచిన వాటికి కవరేజీని భాగం చేసుకోవచ్చు. కాకపోతే హోమ్ ఇన్సూరెన్స్ మొత్తం కవరేజీలో లాకర్కు సంబంధించి 20% మించదు. వీటిని ఉంచడం చట్టవిరుద్ధమే.. → ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ నిషేధం. చెడిపోయే పదార్థాలు కూడా ఏవీ ఉంచకూడదు. హానికారకమైనవీ పెట్టకూడదు. → కరెన్సీ నోట్లను సైతం లాకర్లలో ఉంచకూడదు. ఒకవేళ ఉంచినట్టయితే వాటికి నష్టం వాటిల్లితే బ్యాంకులపై బాధ్యత ఉండదు. → బ్యాంక్లో శబ్ద కాలుష్యానికి దారితీసేవి, బ్యాంక్ లాకర్ల భద్రతకు ముప్పు కలిగించే వాటిని ఉంచడం నిబంధనలకు విరుద్ధం. భద్రత విషయంలో పూచీ ఉందా?లాకర్ల భద్రత విషయంలో బ్యాంక్లు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ అక్కడక్కడ లోపాలకు అవకాశం లేదని భావించకూడదు. లాకర్లను రీన్ఫోర్స్డ్ స్టీల్తో చేయించడమే కాకుండా, భద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో, యాక్సెస్ పరిమితంగా ఉండే చర్యలు తీసుకుంటాయి. వీటిని సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక అలారమ్ వ్యవస్థలతో పర్యవేక్షిస్తుంటాయి. బ్యాంక్ ఉద్యోగి, కస్టమర్ ఇద్దరి వద్ద ఉండే తాళం చెవులతో (డ్యుయల్ కీ) తెరవాల్సి ఉంటుంది. ఇది కూడా భద్రతా సదుపాయమే. తేమ, చెదలను తట్టుకునే విధంగా అధిక నాణ్యత కలిగిన లాకర్లను కొన్ని బ్యాంక్లు వినియోగిస్తున్నాయి. బ్యాంక్లు చెదల నివారణకు చర్యలు కూడా తీసుకుంటుంటాయి’’ అని దాస్ వివరించారు. బ్యాంక్ వైపు నుంచి భద్రతా పరంగా లోపాలను గుర్తించినట్టయితే వాటిని అధికారుల దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్లడం మంచిదే. ఈ నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో తమ లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే ఆధారంగా పనికొస్తుంది.కొత్త ఒప్పందంపై సంతకం చేశారా? కొన్నేళ్ల క్రితం లాకర్ తీసుకుని, 2021 ఆగస్ట్ తర్వాత బ్యాంక్తో కొత్త అగ్రిమెంట్పై సంతకం చేయని వారు.. వెంటనే ఆ పనిచేయాలి. సవరించిన లాకర్ ఒప్పందాలపై కస్టమర్ల అంగీకారం తీసుకోవాలంటూ ఆర్బీఐ నాడు ఆదేశించింది. ఇందుకు గడువును తొలుత 2023 జనవరి 1కి పొడిగించింది. తర్వాత అదే ఏడాది డిసెంబర్ 31 వరకు, తర్వాత 2024 మార్చి 31 వరకు పొడిగించడం గమనార్హం. కానీ, 2025 చివరి వరకు గడువు ఇవ్వాలని బ్యాంక్లు కోరుతున్నాయి. లాకర్ ఖాతాదారుల్లో 20 శాతం వరకు ఇంకా ఒప్పందాలపై సంతకాలు చేయకపోవడమే ఇందుకు కారణం. సవరించిన కొత్త లాకర్ ఒప్పందాలపై సంతకాలు చేయకపోతే అప్పటి వరకు లాకర్ వినియోగించుకునేందుకు బ్యాంక్లు అనుమతించకపోవచ్చని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి పేర్కొన్నారు. తుది నోటీసు జారీ చేసి, అప్పటికీ కస్టమర్ల నుంచి స్పందన లేకపోతే లాకర్లను సీల్ చేయొచ్చని ప్లాన్అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్పీ విశాల్ ధావన్ తెలిపారు. కొత్త లాకర్ నిబంధనల ప్రకారం బ్యాంక్లు.. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కస్టమర్లను కోరొచ్చు. గతంలో ఈ డిపాజిట్ ఎంత మొత్తం అన్న పరిమితి లేదు. ఇప్పడు లాకర్ మూడేళ్ల అద్దె, కస్టమర్ డిఫాల్ట్ అయితే లాకర్ తెరిచేందుకు అయ్యే చార్జీలకు సరిపడానే డిపాజిట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త అగ్రిమెంట్కు అయ్యే చార్జీలను బ్యాంకులే భరిస్తాయి. నామినేషన్ తప్పనిసరి.. లాకర్ తెరిచే సమయంలో సర్వైవర్షిప్ క్లాజును నమోదు చేయాలి. లేదా నామినేషన్ను అయినా తప్పకుండా నమోదు చేయాలి. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో నామినీని లాకర్ తెరిచేందుకు బ్యాంక్ అనుమతిస్తుంది. ఉమ్మడిగా మరొకరితో కలసి లాకర్ తెరిచినట్టయితే.. ఇద్దరి సంతకాల ఆమోదంతో నిర్వహించే ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు తమ వారసులను నామినీలుగా నమోదు చేయాలి. సర్వైవర్షిప్ క్లాజ్ ఎంపిక చేసుకుంటే. ఎనీవన్ లేదా సరై్వవర్ (ఎవరైనా లేక జీవించి ఉన్న వారు) ఆప్షన్ అనుకూలంగా ఉంటుంది. ఇవేమీ లేకుండా లాకర్ తీసుకుంటే.. దురదృష్టవశ్తాతూ మరణించిన సందర్భంలో లాకర్లో ఉన్న వాటిని పొందడానికి వారసులు ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. మరణ ధ్రువీకరణ సర్టి ఫికెట్, సక్సెషన్ సర్టిఫికెట్ లేదా లెటర్ ఆఫ్ అడ్మిని్రస్టేషన్ను సమర్పించాల్సి వస్తుంది. సాక్షులు, వారసుల సమక్షంలో లాకర్లో ఉన్న వాటిని బ్యాంక్ సిబ్బంది నమోదు చేయాల్సి వస్తుంది. కేవైసీ వివరాలతో క్లెయిమ్ సమర్పించాలి. ఈ ప్రక్రియలన్నీ ముగిసి లాకర్లో వాటిని పొందేందుకు చాలా సమయం పడుతుంది. ముందు జాగ్రత్తలు.. → డాక్యుమెంట్లను నీటికి తడవని, అగ్ని ప్రమాదంలో కాలిపోని విధంగా ప్యాక్ చేసి ఉంచుకోవాలి సురక్షితం. → నోట్లను లాకర్లో ఉంచకపోవడం మంచిది. దీనికి బదులు ఎఫ్డీ చేసుకోవడం వల్ల రక్షణతోపాటు రాబడి కూడా వస్తుంది. → లాకర్లో ఉంచిన ప్రతీ వస్తువు వివరాలను డైరీలో రాసుకోవాలి. ప్రతీ వస్తువును ఫొటో తీసి పెట్టుకోవాలి. → అవసరం లేకపోయినా సరే లాకర్లో ఉంచిన వాటిని నిర్ణీత కాలానికి ఒకసారి పరిశీలించుకోవాలి. కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా లాకర్ను తెరిచి చూడాలి. → లాకర్లో ఉంచే అన్నింటికీ కవరేజీ వర్తించే పాలసీ తీసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్లతో చౌకగా రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ట్రాయ్ కొద్ది రోజుల క్రితం అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోనాలతో రెండు చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. తన అధికారిక వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది. వీటిలో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వాలిడిటీని పొందుతారు. డేటా అవసరం లేని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్లకు, డేటా అవసరం లేని వారికి ఈ జియో ప్లాన్లు ప్రత్యేకం. వీటిలో ఒక దాని ధర రూ .458 కాగా మరొకటి రూ .1958. ఇవి వరసగా 84 రోజులు, 365 రోజుల వాలిడిటీతో వస్తాయి. ఇంకా ఈ రెండు జియో ప్లాన్లలో వినియోగదారులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.84 రోజుల ప్లాన్జియో కొత్త రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతోపాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్ల కోసం జియో ఈ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో దేశం అంతటా ఏ నెట్వర్క్లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం లభిస్తుంది.365 రోజుల ప్లాన్జియో కొత్త రూ .1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్లో వినియోగదారులు దేశం అంతటా ఏ నెట్వర్క్కు అయినా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. వీటితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. -
హైదరాబాద్లోనే విదేశీ మేలిమి గ్రానైట్..
ఇంటి అందం ద్విగుణీకృతం చేయడానికి.. కొందరు గృహ యజమానులు ఖర్చుకు వెనకాడట్లేదు. ఇంటి అలంకరణలో తమదైన ప్రత్యేక ముద్ర ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారికోసమే ప్రపంచంలో అరుదుగా దొరికే గ్రానైట్లు బోలెడు ఉన్నాయి. వీటిని ఎంచుకోవడానికి ఏ అమెరికాకో ఆఫ్రికాకో వెళ్లక్కర్లేదు. ఎంచక్కా మన నగరంలోనే ఇవి లభిస్తున్నాయి. చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రంలా దర్శనమిచ్చే గ్రానైట్ రకాలకు ప్రపంచ మార్కెట్లో ఎక్కడ్లేని గిరాకీ పెరుగుతోంది. వీటికోసం చదరపు అడుగుకి రూ.2,500 దాకా పెట్టాల్సి ఉంటుంది. వీటిని గోడలకు అమరిస్తే.. అచ్చం చిత్రకారుడు వేసిన బొమ్మల మాదిరిగానే కనిపిస్తాయి. – సాక్షి, సిటీబ్యూరోయూరప్, అమెరికా, సౌదీ అరేబియా, ఆఫ్రికా, అంగోలా, నమీబియా, మడగాస్కర్, నార్వే, ఫ్లిన్లాండ్, బ్రెజిల్, ఐస్ల్యాండ్ వంటి దేశాలకు చెందిన గ్రానైట్కు ప్రపంచ మార్కెట్లో ఎక్కడ్లేని గిరాకీ ఉంది. మరి ఇవి విదేశాల నుంచి ఇక్కడికి ఎలా చేరుకుంటాయనేది మీ సందేహమా? ఆయా దేశాల నుంచి ఇవన్నీ నౌకలో ముంబైకి దిగుమతి అవుతాయి. అక్కడి నుంచి రైలు మార్గంలో నగరానికి.. లారీల ద్వారా సిటీ చుట్టుపక్కల ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు చేరుకుంటాయి.ఒక్కో గ్రానైట్.. ఒక్కో గ్రానైట్ బ్లాకు 25 నుంచి 35 టన్నుల దాకా ఉంటుంది. మొదట్లో కాస్త ఎత్తుపల్లాలుగా ఉన్న గ్రానైట్ను.. బడా యంత్రాల సాయంతో డ్రెస్సింగ్ చేస్తారు. పాలిష్ చేసి ఎగుడుదిగుడు లేకుండా చేస్తారన్నమాట. ఆ తర్వాత స్టీల్ గ్రిట్ బ్లేడ్లతో కత్తిరించి డైమండ్ బ్రిక్సతో పాలిష్ చేస్తారు. బ్రెడ్డును ముక్కలుగా కోసినట్లే.. భారీ ఆకారం గల గ్రానైట్ బ్లాకును కోస్తారన్నమాట. ఈ ప్రక్రియ తర్వాత ఒక్కో ముక్కను వేడి చేసే ఓవెన్లో పెడతారు. ఫలితంగా గ్రానైట్లో ఉన్న నీరంతా ఆవిరవుతుంది. ఆ తర్వాత రెసిన్ పెడతారు. దీని వల్ల భవిష్యత్తులో గ్రానైట్ నీరు పీల్చుకోకుండా ఉంటుంది. తర్వాత ప్రక్రియ క్యూరింగే.. ఇదయ్యాక పాలిష్ అవ్వగానే గ్రానైట్ తళతళ మెరుస్తుంది. మొత్తం ఏడు రోజులు జరిగే ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. గ్రానైట్ ప్రపంచ దేశాలకు ఎగుమతికి సిద్ధమవుతుంది. ఇంటికే ప్రత్యేకం.. దాదాపు ఎనభై రంగులు గల గ్రానైట్.. వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు దిగుమతి అవుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ‘ట్రాపిక్ బ్రౌన్’ ధర చ.అ.కు 300 దాకా ఉంటుంది. అదే నార్వే ‘బ్లూ పెరల్’ రేటు రూ.500 వరకూ పలుకుతుంది. ఇక ఫిన్లాండ్ ‘బాల్టిక్ బ్రౌన్’ ధర కూడా ఇంచుమించు రూ.300లు ఉంటుంది. ఇవి కాకుండా ఖరీదైన రకాలు బోలెడున్నాయి. మేలిమి గ్రానైట్.. యూరప్ ఐస్లాండ్ల మధ్య.. అక్కడక్కడా విసిరేసినట్లు కనిపించే చిన్న చిన్న దీవుల్లో మేలిమి రకమైన గ్రానైట్ లభిస్తోంది. యూరప్ నుంచి అక్కడికి వెళ్లడానికే కనీసం మూడు రోజులైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘బ్లాక్ బ్యూటీ’ గ్రానైట్ కోసం చదరపు అడుగుకి రూ.2 వేల దాకా పెట్టాల్సి ఉంటుంది. బ్రెజిల్లో దొరికే ‘అమెజాన్’ రకం ధర.. చదరపు అడుగుకి రూ.1,600 ఉంటుంది. ఇదే రకాన్ని మీ ఇంట్లో వేయాలనుకుంటే మీకయ్యేది సుమారు వెయ్యి రూపాయలే. అదెలా అంటారా? మీకేం కావాలో గ్రానైట్ సంస్థలకు చెబితే వాటిని చిన్నచిన్న బ్లాకులుగా తీసుకొచ్చి అందజేస్తారు. కాకపోతే ఆర్డర్ ఇచ్చిన మూడు నెలల తర్వాతే ఇవి ఇంటికి చేరుతాయి. కాబట్టి, ఇంటి నిర్మాణం నాటి నుంచే గ్రానైట్కు సంబంధించి అవగాహనకు రావడం ఉత్తమం. -
ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా..
ప్రముఖ బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పక్కా బిజినెస్మ్యాన్గా మారిపోయారు. సినీ పరిశ్రమపై తనకు విరక్తి పెరిగిందని, అందుకే తన వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టానని ఆయన చెబుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ లో క్రియాశీలకంగా పనిచేసిన ఈ నటుడు ఇప్పుడు తన ప్రధాన జీవనాధారాన్ని పూర్తిగా బిజినెస్ వైపు మళ్లించారు.తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12 కంపెనీలకు ఒక్క ఏడాదిలోనే 1 బిలియన్ డాలర్లు (రూ.8,500 కోట్లు) సమీకరించినట్లు తెలిపారు. వీటిలో రెండు కంపెనీలు ఐపీవోకి కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయని వివేక్ ఓ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన నెట్వర్త్ రూ.1,200 కోట్లు ఉంటుందని అంచనా.భూమి మొదటి వ్యాపారంఇటీవల సీఎన్బీసీ టీవీ-18 ఇంటర్వ్యూలో మాట్లాడిన వివేక్ తన వ్యాపార సంగతులను పంచుకున్నారు. తన తండ్రి సురేష్ ఒబెరాయ్ వ్యాపారవేత్త కావడంతో తాను కూడా చిన్న వయసు నుంచే వ్యాపారం వైపు మొగ్గు చూపానని చెప్పారు. ‘ఇన్వెస్టర్ అయిన ఆయన (తండ్రి) ఎప్పుడూ భూములు కూడబెడుతూ కొనడం, అమ్మడం చేసేవారు. అలా డబ్బు సంపాదించేవారు. భూమి నాకు పరిచయమైన మొదటి వ్యాపారం. నాకు తొమ్మిది పదేళ్ల వయసున్నప్పుడు అకస్మాత్తుగా ఇన్వెంటరీతో వచ్చేవాడు. ఒక సంవత్సరం పెర్ ఫ్యూమ్స్, మరో ఏడాది ఎలక్ట్రానిక్స్... వాటిని నా బ్యాక్ ప్యాక్ లో నింపుకుని ఇంటింటికీ వెళ్లేవాన్ని. చివరిలో నా 'లెక్కలు' అడుగేవారు. లాభం మాత్రం నాకిచ్చి మిగిలింది తీసుకునేవారు' అని వివేక్ గుర్తు చేసుకున్నారు.సినిమాల్లో లోపించిందదే..కొన్నేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో గడిపిన వికేక్ ఒబెరాయ్ ఇంకా తాను మొదలుపెట్టిన చోటే ఉన్నానని గ్రహించారు. "అది (సినీ పరిశ్రమలో ఉండటం) నాకు నచ్చలేదు. అది ఎదుగుదల కాదు. నేను అక్కడ ఉండటం, కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. కానీ ఇది ఎదుగుదలకు తోడ్పడాలి. ఎవరైనా ప్రతిభ ఉన్నవారిని దగ్గరకు తీసి వారి ఎదుగుదలకు సహకారం అందించాలి. అక్కడ లోపించిందదే" అని చెప్పుకొచ్చిన వివేక్ నిరాశగా తల కొట్టుకుంటూ అక్కడే ఉండటం కన్నా వ్యాపారం వైపు రావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.పెట్టుబడుల విషయంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులకూ తాను వెనుకాడనని చెప్పిన వికేక్ ఒబెరాయ్.. ‘గత ఏడాదిలోనే నా కంపెనీలకు 1 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించగలిగాం. ఇది గణనీయమైన మొత్తం. అయినా అదేం సమస్య కాదు. అయితే ఆ నిధులను ఎక్కడ పెట్టాలి.. ఎలా ఆ వృద్ధి చేయాలన్నది తెలియాలి. అందుకు మార్వాడీ మనస్తత్వం అలవర్చుకోవాలి" అంటూ సూచించారు. బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు అంతర్జాతీయ చిత్రాలను 'కాపీ' చేసినా వాటికి 'దేశీ మసాలా' తగిలిస్తున్నామంటూ చెబుతుంటారు. "మరి దీన్ని వ్యాపారంలో ఎందుకు చేయకూడదు?" అంటూ ప్రశ్నిస్తున్నారు. -
ఈ డాక్యుమెంట్ కెమెరాతో ఆన్లైన్ క్లాస్ ఈజీ..
టీచర్లు టెక్తో టచ్లోకి రావాలన్నా, విద్యార్థులు విజ్ఞానంలో విండో ఓపెన్ చేయాలన్నా.. వారి వద్ద ఈ టెకీ టూల్ మాస్టార్లు ఉండాల్సిందే!క్లాస్లో స్క్రీన్ స్టార్ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థులు బయటకు కనబడేలా భయపడితే, టీచర్లు లోలోపల భయపడుతుంటారు. ఎందుకంటే ముందే పీపీటీలు సిద్ధం చేయకపోతే, ‘సార్, స్క్రీన్ షేర్ చేయండి’, ‘మిస్, స్లయిడ్ మిస్ అయింది’ అంటూ సందేశాల వర్షం కురిపిస్తారు విద్యార్థులు. ఇక నెట్ స్లో, లైట్ తక్కువ, ఫాంట్ చిన్నది లాంటి ఇతర సమస్యలతో ఆన్లైన్ క్లాస్ మొత్తం గాలిలో కలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లకు తోడుగా ఉండే నేస్తమే ఈ ‘డాక్యుమెంట్ కెమెరా’. దీని ముందు పుస్తకం పెడితే చాలు, స్పష్టంగా సమాచారాన్ని స్క్రీన్పై చూపిస్తుంది. టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, బటన్ నొక్కితే బ్లర్ లేకుండా చూసుకుంటుంది. మీరు పేజీ తిప్పితే ఇది కూడా తిప్పి చూపిస్తుంది. స్లయిడ్స్ అవసరం లేకుండా బుక్తోనే క్లాస్ పూర్తవుతుంది. ధర రూ. 2,999.ఆర్ట్ మాస్టర్!పిల్లలు బొమ్మలు గీస్తారు, కట్ చేస్తారు, స్టిక్ చేస్తారు. ఇలా చేస్తూ చేస్తూ చివరకు చేతికి బ్యాండేజ్ వేసుకుంటారు! ఇలాంటి చిన్న చిన్న గాయాలకు ఇకపై ఈ ‘స్కాన్ అండ్ కట్’ మెషిన్ గుడ్బై చెప్తుంది. బొమ్మ చూపిస్తే, ఏ మెటీరియల్పై అయినా కట్ చేయగలదు. కాగితం, ఫ్యాబ్రిక్, ఫోమ్.. ఏదైనా సరే, స్క్రీన్ మీద టచ్ చేస్తే చాలు, రెండు వందలకు పైగా రెడీ డిజైన్లతో సిద్ధంగా ఉంటుంది. ఒక్క క్లిక్తో కావాల్సిన ఆర్ట్ని రెడీ చేసి ఇస్తుంది. ఇది కేవలం కటింగ్ మెషిన్ కాదు. స్కానింగ్, డిజైనింగ్, కటింగ్ అన్నీ కలిపిన ఒక క్రాఫ్ట్ మాస్టర్. ఇంట్లోనైనా, క్లాస్రూమ్లోనైనా ఒక్కసారి పెట్టి చూడండి. అప్పుడు చిన్న చేతులు పెద్ద ఆర్ట్ చేయడం చూస్తారు. ధర రూ. 22,000. -
స్టూడియో అపార్ట్మెంట్లకు తగ్గుతున్న గిరాకీ
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కంటే ముందు ఇల్లు అంటే నాలుగు గోడల భవనం. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేద తీరాలనుకునే గూడు. కానీ, కోవిడ్ తర్వాత నుంచి ఇల్లే ప్రపంచమైపోయింది. తినడం, పడుకోవడం మాత్రమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ.. ఇంటి నుంచే! ఫలితంగా కోవిడ్ కంటే ముందు హాట్ కేకుల్లాంటి స్టూడియో అపార్ట్మెంట్లకు.. క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంలో విస్తీర్ణమైన గృహాలకు గిరాకీ పెరిగింది.బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ ఏడాది తొలి అర్ధ వార్షికం(జనవరి–జూన్)లో 1,063 ప్రాజెక్ట్లు లాంచింగ్ కాగా.. ఇందులో కేవలం 9 శాతం(91 ప్రాజెక్ట్లు) మాత్రమే స్టూడియో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లు ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,207 ప్రాజెక్ట్లు లాంచింగ్ కాగా.. ఇందులో 145 ప్రాజెక్ట్లు స్టూడియో పార్ట్మెంట్లున్నాయి. 2020లో 884 ప్రాజెక్ట్లు ప్రారంభం కాగా.. ఇందులో 15 శాతం వాటాతో 130 ప్రాజెక్ట్లు ఈ తరహా అపార్ట్మెంట్లున్నాయి. అలాగే 2019లో 1,921 ప్రాజెక్ట్లు లాంచింగ్ అయ్యాయి. 368 ప్రాజెక్ట్లు(19 శాతం) ఈ స్టూడియో ఇళ్లే..లొకేషన్ ముఖ్యం.. స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచిలర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాలు చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనరాక్ గ్రూప్ సంస్థ తెలిపింది. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగినట్లు చెప్పింది. మన దగ్గర తక్కువే.. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణే నగరాలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ నడుస్తోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణేలదే.. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో కేవలం 34 స్టూడియో ప్రాజెక్ట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది హెచ్–1లో 7 నగరాలలో ప్రారంభమైన 91 స్టూడియో ప్రాజెక్ట్లలో.. 71 ప్రాజెక్ట్లు ముంబైలోనే ఉన్నాయి. ఆ తర్వాత పుణేలో 18, బెంగళూరులో రెండు ప్రాజెక్ట్లు లాంచింగ్ అయ్యాయి. -
బజాజ్ కొత్త బైక్లు.. నాలుగు రైడింగ్ మోడ్లతో..
బజాజ్ ఆటో డామినార్ 400, డామినార్ 250 అప్ డేటెడ్ వెర్షన్ బైకులను లాంచ్ చేసింది. రెండింటిలో డామినార్ 250 ప్రారంభ ధర రూ .1.92 లక్షలు (ఎక్స్-షోరూమ్), డామినార్ 400 ప్రారంభ ధర రూ .2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). వీటికి సంబంధించిన వివరాలను బజాజ్ ఆటో ఇటీవల టీజ్ చేసింది. అప్డేట్లలో భాగంగా ఫీచర్లలో బజాబ్ సంస్థ మార్పులు చేసింది. మరిన్ని టూరింగ్ పరికరాలను జోడించింది. డిజైన్లో పెద్దగా మార్పులేమీ లేకుండా రైడర్ సౌకర్యం కోసం కొన్ని స్వల్ప సర్దుబాట్లు మాత్రం చేసింది.కొత్త ఫీచర్లురెండు డామినార్ బైక్లూ ఇప్పుడు నాలుగు రైడింగ్ మోడ్లతో వస్తాయి. అవి రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్-రోడ్. అవసరాన్ని బట్టి థ్రోటిల్ రెస్పాన్స్, ఏబీఎస్ ఇంటర్వెన్షన్ స్థాయిలను మార్చడం ద్వారా రైడర్కు ఈ మోడ్లు సహాయపడతాయి. ఇక డామినార్ 400 బైక్లో ప్రత్యేకంగా రైడ్-బై-వైర్ ఫీచర్ ఇచ్చారు. డామినార్ 250లో మాత్రం మెకానికల్ థ్రోటిల్ సెటప్, నాలుగు ఏబీఎస్ మోడ్స్ ఉన్నాయి.మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్లో లాంటి డిజిటల్ డిస్ప్లేను ఈ రెండు డామినార్ బైక్లలో ఇచ్చారు. ఇది కొత్త స్విచ్ గేర్ తో పనిచేసే కలర్ ఎల్సీడీ బాండెడ్ గ్లాస్ స్పీడోమీటర్. ఎక్కువ దూరం బైక్ నడిపే రైడర్లకు మరింత సౌలభ్యం కోసం హ్యాండిల్ బార్లను కూడా మార్చినట్లు బజాజ్ పేర్కొంది. రైడర్లు తమ జీపీఎస్ పరికరాలు లేదా స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేసుకునేందుకు జీపీఎస్ మౌంట్ను చేర్చింది.ఇక మెకానిక్స్ పరంగా చూస్తే ఎటువంటి మార్పులు లేవు. డామినార్ 400 బైకులో 373 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 8,800 ఆర్పీఎం వద్ద 39 బీహెచ్నపీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 35 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. అదేవిధంగా డొమినార్ 250 విషయానికి వస్తే 248 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 26 బీహెచ్పీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 23 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఈ ఇంజన్ కూడా 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో జతై ఉంటుంది. -
సిటీ రియల్ ఎస్టేట్కి ‘ఐటీ’ బూస్ట్..
రియల్ ఎస్టేట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం కీలకమైంది. మన సిటీ స్థిరాస్తికి ఐటీ బూస్ట్లాగా మారింది. ఐటీ ఉద్యోగులపై ఆధారపడి గృహ విక్రయాలు ఎంత జరుగుతాయో.. అంతకు రెట్టింపు స్థాయిలో ఐటీ సంస్థల లావాదేవీలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమాది ప్రాంతాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఆఫీస్ స్పేస్.. గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీతో నగరం నలువైపులా విస్తరించింది. – సాక్షి, సిటీబ్యూరోఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఔటర్ వెంబడి ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉన్న 11 పారిశ్రామిక పార్క్లను ఐటీ పార్క్లుగా మార్చింది. దీంతో పాటు కొంపల్లిలో ఐటీ టవర్, కొల్లూరులో ఐటీ పార్క్లను నిర్మిస్తోంది. ఫలితంగా పశ్చిమం వైపున కాకుండా ఇతర ప్రాంతాలలో కొత్తగా 3.5–4 కోట్ల చ.అ. ఐటీ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుందని జేఎల్ఎల్ తెలిపింది. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో హైదరాబాద్ దూసుకెళుతోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 9.04 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉన్న మన సిటీ.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 కోట్ల చ.అ. మైలురాయిని దాటనుందని జేఎల్ఎల్ సర్వేలో తేలింది.ఆఫీస్ స్పేస్ మార్కెట్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ తర్వాత హైదరాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. కొంత కాలంగా కొంపల్లి, బాచుపల్లి, మేడ్చల్ వంటి ఉత్తరాది ప్రాంతాలు, ఎల్బీనగర్, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలలో నివాస క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాలలోని అందుబాటు గృహాలను ఐటీ ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు.81 శాతం వృద్ధి రేటు..కొన్నేళ్లుగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ నగరం మెరుగైన స్థానాన్ని నమోదు చేస్తుంది. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉన్న బెంగళూరు గత ఆరేళ్లలో 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ విభాగంలో హైదరాబాద్ నగర భాగస్వామ్యం ఇటీవలి వరకు 12.7 శాతంగా ఉండగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్పేస్తో 25 శాతానికి పెరిగింది. గ్రిడ్ పాలసీ అమలుతో.. గ్రిడ్ పాలసీతో నగరం నలువైపులా ఐటీ విస్తరించింది. డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అమలు చేస్తోంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 500 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు యాంకర్ యూనిట్ ప్రోత్సాహకాలను అందిస్తోంది.ఇందులో సంబంధిత భూమిని 50 శాతం ఐటీ, ఐటీఈఎస్ ప్రయోజనాల కోసం వినియోగించగా.. మిగిలిన సగంలో నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించవచ్చనే వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ అనేది కేవలం రెండు ప్రధాన కారిడార్లలోనే కేంద్రీకృతమై ఉంది. హైటెక్సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. 96 శాతం స్పేస్ ఈ ప్రాంతాల నుంచే ఉంటుంది. -
టూ వీలర్స్ పెరుగుతాయ్.. ప్యాసింజర్ వాహనాలు తగ్గుతాయ్!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన హోల్సేల్(టోకు) అమ్మకాల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 1–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా రేటింగ్ సంస్థ అంచనా వేసింది. అధిక ఇన్వెంటరీ, ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే ‘రేర్ ఎర్త్ మాగ్నెట్’ వంటి కీలక ఉపకరణాల కొరత విక్రయాలపై ప్రభావాన్ని చూపొచ్చని పేర్కొంది.అంతకు ముందు.. ఇదే ఎఫ్వై 26లో అమ్మకాల వృద్ధి 4–7% ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్లు(ఓఈఎం)నుంచి స్థిరమైన మోడళ్ల ఆవిష్కరణలు పరిశ్రమ అమ్మకాలకు పాక్షిక మద్దతునిస్తాయని వివరించింది.మే అమ్మకాలు డిమాండ్ క్షీణతకు సంకేతాలు భారత్ – పాకిస్థాన్ యుద్ధంతో ఉత్తర భారతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు కస్టమర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా ఈ ఏడాది మే నెలలో 3,02,214 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే ఏడాది ఏప్రిల్ అమ్ముడైన 3,49,939 యూనిట్లతో పోలిస్తే ఇవి 13.6% తక్కువ. ఈ అమ్మకాలు డిమాండ్ క్షీణతకు సంకేతాలని ఇక్రా తెలిపింది. టూ వీలర్స్కు ‘గ్రామీణం’ దన్ను ఇదే ఎఫ్వై 26లో ద్విచక్రవాహన అమ్మకాల వృద్ధి 6–9 శాతంగా ఉండొచ్చని తెలిపింది. స్థిరమైన గ్రామీణ ఆదాయాలు, సాధారణ వర్షపాత నమోదు, పట్టణ మార్కెట్ పెరగడం తదితర అంశాలు టూ వీలర్స్కు డిమాండ్ను పెంచుతాయి. గ్రామీణ డిమాండ్, మెరుగైన సాగుతో ద్విచక్రవాహన రిటైల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదిన 7% వృద్ధి సాధించాయి. -
బ్యాంకులకు ఆర్బీఐ కీలక సూచనలు
ఆన్లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్)రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ) ప్లాట్ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను ఇది రియల్ టైమ్లో వర్గీకరిస్తుందని పేర్కొంది.ఆర్బీఐ ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని వివరించింది.డాట్లో భాగమైన డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) ఈ ఏడాది మే నెలలో ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఐని ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫోన్పే, పేటీఎ మొదలైన దిగ్గజ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్, డాట్కు చెందిన చక్షు ప్లాట్ఫాంలతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే డేటా ఆధారంగా ఎఫ్ఆర్ఐ పని చేస్తుంది. బ్యాంకుల మెరుగైన పనితీరుతో పరపతి మెరుగుగడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్లు మెరుగైన పనితీరు నమోదు చేయడం వాటి పరపతి ప్రొఫైల్కు, భవిష్యత్ వృద్ధికి అనుకూలమని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. నాలుగేళ్లలో తక్కువ రుణ వృద్ధి నమోదు అయినప్పటికీ.. మెరుగైన ఆస్తుల నాణ్యత, పటిష్టమైన నగదు నిల్వలు, స్థిరమైన లాభాలను చూపించినట్టు పేర్కొంది.‘‘ఇక ముందూ స్థిరమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, మిగులు నిల్వలతో నష్టాలను సర్దుబాటు చేసుకోగల సామర్థ్యం ఉండడం, గత సైకిల్తో పోల్చితే ఆర్థిక షాక్లను తట్టుకుని నిలబడే సామర్థ్యం.. ఇవన్నీ రేటెడ్ బ్యాంకుల స్టాండలోన్ రుణ పరపతికి సానుకూలం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది.2025–26లో రుణ పరపతి పరంగా బ్యాంక్లు స్థిరమైన పనితీరు చూపిస్తాయని పేర్కొంది. 2024–25లో ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1.41 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 26 శాతం ఎక్కువ. -
డైట్లో తగ్గిన తృణధాన్యాలు
న్యూఢిల్లీ: ప్రజల ఆహార అలవాట్లలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023–24లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారు రోజువారీ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు, పప్పు ధాన్యాల వాటా తగ్గిపోయింది. అదే సమయంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది. కుటుంబాల వినియోగ వ్యయాలపై నిర్వహించిన సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2022 ఆగస్టు – 2023 జూలై, 2023 ఆగస్టు – 2024 జూలై మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో పెద్దగా మార్పు లేనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెరిగింది. 2022–23లో పట్టణ ప్రాంతాల్లో ఆహారంలో తృణ ధాన్యాల వాటా 38.8 శాతంగా ఉండగా 2023–24లో 38.7 శాతానికి స్వల్పంగా తగ్గింది. గ్రామీణ భారతంలో ఇది 46.9 శాతం నుంచి 45.9 శాతానికి క్షీణించింది. అలాగే పప్పు ధాన్యాల విషయానికొస్తే పట్టణ ప్రాంతాల్లో వినియోగం 9.6 శాతం నుంచి 9.1 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 8.8 శాతం నుంచి 8.7 శాతానికి నెమ్మదించింది. → మరోవైపు, పట్టణ ప్రాంతాల ప్రజల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 12.8 శాతం నుంచి 12.9 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 10.6 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. → డైట్లో గుడ్లు, చేపలు, మాంసం వాటా గ్రామీణ ప్రాంతాల్లో 12.3 శాతం నుంచి 12.4 శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేకుండా 14.1 శాతం స్థాయిలోనే ఉంది. → గ్రామీణ ప్రాంతాల్లో ‘ఇతర ఆహార’ పదార్థాల వాటా 21.4 శాతం నుంచి 22 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 24.8 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగింది. → గ్రామాల్లో రోజుకు తలసరి కేలరీల సగటు వినియోగం, సర్వే నిర్వహించిన రెండేళ్లలో వరుసగా 2233 కిలోకేలరీలుగా, 2212 కిలోకేలరీలుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 2250 కిలోకేలరీలు, 2240 కిలోకేలరీలుగా నమోదైంది. → నెలవారీగా తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) పెరిగే కొద్దీ ప్రాంతాలకతీతంగా సగటు కేలరీల వినియోగం కూడా పెరిగింది. -
సిమెంట్ కంపెనీలకు సీసీఐ ఆదేశాలు
న్యూఢిల్లీ: పోటీ నిబంధనల ఉల్లంఘన దర్యాప్తులో భాగంగా ఆర్థిక ఫలితాల వివరాలను దాఖలు చేయమంటూ సిమెంట్ రంగ దిగ్గజాలు అ్రల్టాటెక్, దాల్మియా భారత్, శ్రీ దిగి్వజయ్ను కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆదేశించింది. ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలతోపాటు.. బ్యాలన్స్ షీట్, లాభనష్టాల ఖాతా వివరాలను 8 వారాలలోగా అందించాలని పేర్కొంది. పోటీ నిబంధనలు ఉల్లంఘించినట్లు డైరెక్టర్ జనరల్ గుర్తించిన నేపథ్యంలో మూడు సెమెంట్ రంగ కంపెనీలను సీసీఐ తాజాగా ఆదేశించింది. అయితే అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న ఇండియా సిమెంట్స్కు చెందిన ఐదేళ్ల వివరాల కోసం అల్ట్రాటెక్కు సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. 2015–19 ఆర్థిక సంవత్సరాల ఖాతాల వివరాలను వెల్లడించవలసి ఉంటుందని పేర్కొంది. ఈ బాటలో దాల్మియా భారత్ సిమెంట్స్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ను 2011 నుంచి 2019వరకూ తొమ్మిదేళ్ల కాలానికి ఆర్థిక వివరాలను దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా ఐదేళ్ల కాలానికి ఆదాయపన్ను రికార్డులు, ఆర్థిక వివరాలను సమూలంగా తెలియజేయవలసిందిగా ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్లను సైతం ఆదేశించింది. దర్యాప్తు నివేదికపై లాంచనప్రాయ సమాధానాలను సైతం సమరి్పంచమంటూ ఆదేశించింది. కాగా.. ఈ అంశాలపై అ్రల్టాటెక్, దాల్మియా భారత్ స్పందించలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తమ టెండర్లలో జట్టుకడుతున్నట్లు సిమెంట్ రంగ కంపెనీలపై ఇంధన రంగ పీఎస్యూ ఓఎన్జీసీ ఫిర్యాదు చేయడంతో సీసీఐ తాజా ఆదేశాలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో 2020 నవంబర్ 18న సీసీఐ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టవలసిందిగా డైరెక్టర్ జనరల్(డీజీ)ను ఆదేశించింది. 2025 ఫిబ్రవరి 18న డీజీ దర్యాప్తు నివేదికను సీసీఐకు అందించింది. తదుపరి 2025 మే 26న ఓఎన్జీసీకి సిమెంట్ అమ్మకాల ద్వారా అందుకున్న ఆదాయ వివరాలను దాఖలు చేయవలసిందిగా ఈ మూడు సిమెంట్ తయారీ కంపెనీలకు సూచించింది. 2024 డిసెంబర్లో ఇండియా సిమెంట్స్ ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటాను అ్రల్టాటెక్ సిమెంట్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. మార్కెట్ నుంచి మరో 22.77 శాతం వాటా సైతం సొంతం చేసుకుంది. వెరసి ఇండియా సిమెంట్స్కు ప్రమోటర్గా అ్రల్టాటెక్ అవతరించింది. -
ఎఫ్ఎంసీజీ కంపెనీలపై వాతావరణ ప్రభావం
న్యూఢిల్లీ: జూన్ త్రైమాసికంలో తమ ఆదాయం వృద్ధిపై వాతావరణ మార్పులు ప్రభావం చూపించి ఉండొచ్చని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు పేర్కొన్నాయి. అకాల వర్షాలు, వేసవి సీజన్ స్వల్పకాలం పాటే ఉండడం, కీలక ముడి సరుకులపై ద్రవ్యోల్బణం ప్రభావం ఆదాయం వృద్ధిపై ఉంటుందని తెలిపాయి. దీంతో సింగిల్ డిజిట్కే ఆదాయం వృద్ధి పరిమితం కావొచ్చని అంచనా వేశాయి. అయితే సీక్వెన్సియల్గా చూస్తే (మార్చి త్రైమాసికం నుంచి) డిమాండ్ జూన్ త్రైమాసికంలో కోలుకున్నట్టు చెప్పాయి. ముఖ్యంగా పట్టణ మార్కెట్లలో అమ్మకాలు పుంజుకున్నట్టు వెల్లడించాయి. భారత వ్యాపారం జూన్ త్రైమాసికంలో సాధారణం కంటే తక్కువ పనితీరును చూపించినట్టు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది. అయినప్పటికీ అమ్మకాల్లో అధిక సింగిల్ డిజిట్ వృద్ధిని సాధిస్తామని పేర్కొంది. స్టాండలోన్ వ్యాపారం ఎబిట్డా మార్జిన్ క్యూ1లో సాధారణ స్థాయి కంటే దిగువనే ఉండొచ్చని తెలిపింది. భారత్ తర్వాత తమకు అతిపెద్ద మార్కెట్గా ఉన్న ఇండోనేషియాలో ధరల పరమైన ఒత్తిళ్లు ఎదురైనట్టు గ్రోద్రేజ్ కన్జ్యూమర్ వెల్లడించింది. దీంతో అమ్మకాల్లో వృద్ధి ఫ్లాట్గా ఉండొచ్చని అంచనా వేసింది. తమ కన్సాలిడేటెడ్ ఆదాయం జూన్ త్రైమాసికలో తక్కువ సింగిల్ డిజిట్కు పరిమితం కావొచ్చని డాబర్ సైతం తెలిపింది. ఇక కన్సాలిడేటెడ్ ఆపరేటింగ్ మార్జిన్ ఆదాయ వృద్ధి కంటే తక్కువకే పరిమితం కావొచ్చొని పేర్కొంది. వ్యక్తిగత సంరక్షణ, గృహ ఉత్పత్తుల అమ్మకాలు మంచి పనితీరు చూపించొచ్చని తెలిపింది. అంతర్జాతీయ వ్యాపా రం మాత్రం డబుల్ డిజిట్ వృద్ధిని (స్థిర కరెన్సీ మారకంలో) నమోదు చేయొచ్చని పేర్కొంది. మోస్తరు వృద్ధి.. జూన్ త్రైమాసికంలో తమ నిర్వహణ లాభం మోస్తరు వృద్ధిని చూపించొచ్చని మారికో అంచనా వేసింది. కీలక ముడి సరుకు అయిన కొబ్బరి ధరలు అధికంగా ఉండడానికి తోడు అసాధారణ వర్షాలు ప్రభావం చూపించినట్టు తెలిపింది. స్థూల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని వివరించింది. గ్రామీణ మారెక్ట్ నుంచి జూన్ క్వార్టర్లో స్థిరమైన డిమాండ్ కనిపించినట్టు వెల్లడించింది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ తదితర ఛానళ్ల ద్వారా స్థిరమైన వృద్ధి కొనసాగినట్టు తెలిపింది. -
సారస్వత్ బ్యాంక్లో న్యూ ఇండియా కోపరేటివ్ విలీనం
ముంబై: సంక్షోభం ఎదుర్కొంటున్న న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్ (ఎన్ఐసీబీ)ను విలీనం చేసుకుంటున్నట్టు దేశంలోనే అతిపెద్ద పట్టణ సహకార బ్యాంక్ అయిన సారస్వత్ కోపరేటివ్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో ఎన్ఐసీబీకి చెందిన 1.22 లక్షల మంది డిపాజిటర్లు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని.. వారి పొదుపు నిధులన్నీ భద్రంగా ఉంటాయని సారస్వత్ బ్యాంక్ చైర్మన్ గౌతమ్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం ఎన్ఐసీబీ ఒక్కో కస్టమర్ గరిష్టంగా రూ.25,000 ఉపసంహరణకు పరిమితం చేయగా.. విలీనం తర్వాత వారి పూర్తి డిపాజిట్ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుందని చెప్పారు. ఈ విలీనం సెప్టెంబర్ చివరికి ముగుస్తుందన్నారు. ఎన్ఐసీబీ విలీనం కోసం తామే స్వచ్ఛందంగా ఆర్బీఐని సంప్రదించినట్టు చెప్పారు. సంక్షోభంలో పడిన ఏడు బ్యాంక్లను గతంలో విలీనం చేసుకున్నట్టు గుర్తు చేస్తూ.. ఇదే మాదిరి ఎన్ఐసీబీ విలీనంపైనా నమ్మకం వ్య క్తం చేశారు. ఎన్ఐసీబీలో యాజమాన్యం రూ.122 కోట్ల నిధులను దుర్వినయోగం చేసిన విషయం ఇటీవలే వెలుగులోకి రావడం గమనార్హం. -
కెమికల్స్ దిగ్గజంగా భారత్!!
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రపంచ స్థాయి కెమికల్ హబ్స్ను నెలకొల్పడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఒక నివేదికలో సూచించింది. అలాగే అత్యధిక సామర్థ్యాలుండే ఎనిమిది పోర్ట్–ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అప్పుడే గ్లోబల్ కెమికల్ తయారీ దిగ్గజంగా భారత్ ఎదగగలదని పేర్కొంది. ‘‘రసాయనాల పరిశ్రమ: అంతర్జాతీయ వేల్యూ చెయిన్లో (జీవీసీ) భారత భాగస్వామ్యానికి దన్ను’’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వివరించింది. 2040 నాటికి భారత్ 1 లక్ష కోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. నివేదిక ప్రకారం.. 2023లో జీవీసీలో 3.5 శాతంగా ఉన్న భారత్ వాటా 2040 నాటికి 5–6 శాతానికి పెరగనుందని, 2030 నాటికి అదనంగా 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించింది. గ్లోబల్ కెమికల్ వేల్యూ చెయిన్లో భారత్ వాటా 3.5 శాతమే ఉండటం, 2023లో రసాయనాల వాణిజ్య లోటు 31 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండటమనేది ముడి సరుకు, ఇతరత్రా స్పెషాలిటీ రసాయనాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్న విషయాన్ని తెలియజేస్తోందని రిపోర్ట్ పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → సమగ్ర ఆర్థిక, ఆర్థికేతర సంస్కరణలు అమలు చేస్తే భారత రసాయనాల పరిశ్రమ 2040 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరేందుకు, జీవీసీలో వాటాను 12 శాతానికి పెంచుకునేందుకు దోహదపడుతుంది. తద్వారా శక్తివంతమైన గ్లోబల్ కెమికల్ కేంద్రంగా భారత్ ఎదగవచ్చు. → కేంద్ర స్థాయిలో ఒక సాధికారిక కమిటీని వేయాలి. ఉమ్మడిగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, వీజీఎఫ్ మొదలైన వాటి కోసం బడ్జెట్ కేటాయింపులతో సాధికారిక కమిటీ కింద కెమికల్ ఫండ్ ఏర్పాటు చేయాలి. హబ్ స్థాయిలోని అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం, మొత్తం హబ్ నిర్వహణను పర్యవేక్షించాలి. → పోర్టుల్లో రసాయనాల ట్రేడింగ్కు సవాలుగా ఉంటున్న మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడంలో పోర్టులకు తగు సూచనలివ్వగలిగేలా కెమికల్ కమిటీ కూర్పు ఉండాలి. అత్యధిక సామర్థ్యాలున్న 8 పోర్ట్ క్లస్టర్స్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. → దిగుమతులు, ఎగుమతి సామర్థ్యాలు, సోర్సింగ్ కోసం ఒకే దేశంపై ఆధారపడటం, మార్కెట్ ప్రాధాన్యత తదితర అంశాల ఆధారంగా అదనంగా రసాయనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలివ్వాలి. → పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా పర్యావరణ అనుమతుల (ఈసీ) ప్రక్రియను వేగవంతం చేయాలి. కాల పరిమితులు, నిబంధనల అమలును పర్యవేక్షించేలా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కింద ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఈసీ క్లియరెన్స్ ప్రక్రియలను సరళతరం, వేగవంతం చేయాలి. తరచుగా నివేదికలను ప్రచురించాలి. ఈఏసీకి మరింత స్వయం ప్రతిపత్తినివ్వాలి. → స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్టీఏ) రసాయనాల పరిశ్రమ కోసం నిర్దిష్ట నిబంధనలను చేర్చేలా భారత్ చర్చలు జరపవచ్చు. పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించేలా టారిఫ్ కోటాలు లేదా కీలకమైన ముడిసరుకు, పెట్రోకెమికల్ ఫీడ్స్టాక్లపై సుంకాలపరంగా మినహాయింపులులాంటివి చేర్చే అవకాశాలను పరిశీలించవచ్చు. → అంతర్జాతీయంగా పోటీపడటంలో భారత రసాయన రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఫీడ్స్టాక్ కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం పెద్ద సవాలుగా ఉంటోంది. ఫలితంగా 2023లో 31 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య లోటు నమోదైంది. → అంతర్జాతీయంగా పోటీ సంస్థలతో పోల్చి చూసినప్పుడు మౌలిక సదుపాయాల్లో అంతరాలు, కాలం చెల్లిన పారిశ్రామిక క్లస్టర్లు, భారీ స్థాయి లాజిస్టిక్స్ వ్యయాలు మొదలైనవి దేశీ సంస్థలకు ప్రతికూలంగా ఉంటున్నాయి. → దీనికి తోడు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై భారత్ పెట్టే పెట్టుబడులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఇది సగటున 2.3 శాతంగా ఉండగా, భారత్లో 0.7 శాతంగానే ఉంది. అత్యంత విలువైన రసాయనాలను దేశీయంగా ఆవిష్కరించడానికి ఇది ఆటంకంగా ఉంటోంది. → నియంత్రణ సంస్థలపరమైన జాప్యాలు, ముఖ్యంగా పర్యావరణ అనుమతులపరంగా నెలకొన్న సవాళ్లు, పరిస్థితులకు తగ్గట్లు పరిశ్రమ ఎదగడంలో అవరోధాలుగా ఉంటున్నాయి. → పరిశ్రమలో నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్ కొరత 30 శాతం మేర ఉంది. ముఖ్యంగా గ్రీన్ కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ, ప్రాసెస్ సేఫ్టీ లాంటి కొత్త విభాగాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. → ప్రస్తుత సవాళ్లను పరిష్కరించి, ప్రతిపాదిత సంస్కరణలను అమలు చేస్తే, భారత్ అంతర్జాతీయంగా పోటీ పడే సామర్థ్యాలను పెంచుకోవచ్చు. పెట్టుబడులను ఆకర్షించవచ్చు. గ్లోబల్ వేల్యూ చెయిన్కి సారథ్యం వహించేలా రసాయనాల రంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు. -
ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
బ్యాంకులో డబ్బు ఉంటే పెద్దగా సంపద సృష్టి జరగదు. పైగా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి దాని విలువ తగ్గిపోతుంది. ప్రస్తుతం రూ.100కు కొనుగోలు చేసే వస్తువులను 10 ఏళ్ల తర్వాత కొనాలంటే అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సూత్రాన్ని తెలుపుతూ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కొన్ని విషయాలను తన ఎక్స్లో పంచుకున్నారు. కొన్ని విలువైన ఆర్థిక అంశాలను కొందరు చాలా శ్రద్ధతో విని పాటిస్తారని, ఇంకొందరు చాలా తేలికగా తీసుకుంటారని చెప్పారు.‘పందులకు పాడటం నేర్పకండి.. ఇది మీ సమయాన్ని వృథా చేస్తుంది. దాంతోపాటు మీ వల్ల పందికి కూడా చికాకు కలుగుతుంది. నేను ఒక స్నేహితురాలితో మాట్లాడుతుంటే పొదువు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆమె, తన భర్త స్థానిక బ్యాంకులో డాలర్ల రూపంలో పొదుపు చేశామని చెప్పారు. అందుకు ఆమె చాలా గర్వపడింది. తన పొదుపు విలువ రానున్న రోజుల్లో తగ్గుతుందని ఎంతో హెచ్చరించాను. ఆమె తీరు పాడటం నేర్చుకోవడానికి ఇష్టపడని పందిలా మారింది. ఈ సంఘటన 1973లో హవాయిలో జరిగింది’ అన్నారు.“DONT TEACH PIGS TO SING…. it wastes your time and you annoy the pig.”I was talking to a friend….about my age….and she was so proud that she and her husband are holding their financial future in dollars, in their local bank. When I attempted to caution her about the…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 4, 2025ఇదీ చదవండి: ధూళి రాకుండా ‘గాలి మేడ’‘అప్పటి నుంచి ఇప్పటివరకు డాలర్ విలువ 95 శాతం కోల్పోయింది. నేను గతంలో చేసిన హెచ్చరికలో భాగంగా ఆహారం ధర పెరుగుతుండడం గమనించారా అని ఆమెను అడిగాను. అప్పుడైనా అందులో దాగిఉన్న ద్రవ్యోల్బణ అంశాన్ని ఆమె గ్రహించలేకపోయింది. మీరందరూ నాతో ఏకీభవిస్తారని నేను ఆశించను. మీరు అనుసరిస్తున్న తీరును నేను అభినందిస్తాను. బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న నా స్నేహితుల గురించి నాకు దిగులు లేదు. డబ్బును దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్యాంకు ఖాతాల్లో సేవ్ చేసేవారు లూజర్స్తో సమానం. ఈ విషయాలు నా పుస్తకంలోనూ రాశాను’ అని తెలిపారు. -
ధూళి రాకుండా ‘గాలి మేడ’
మనలో చాలామంది తమ ఊహలకు రూపం వచ్చేలా కల్పించుకొని చాలాసార్లు చేతులతో ‘గాల్లో మేడలు’ కడుతుంటారు. నిజంగా అలా గాల్లో మేడలు వెలిస్తే అదో అద్భుతం. అంతలా కాకపోయినా చైనా నేరుగా గాలితోనే మేడ కట్టింది. అవును.. చైనాలోని జినాన్ అనే ప్రాంతంలో ఓ నిర్మాణ స్థలంలో ధూళి, నిర్మాణ సమయంలో వెలువడే శబ్దాలను కట్టడి చేసేందుకు 50 మీటర్ల ఎత్తు, 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గాలితో బుడగలాంటి డోమ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈమేరకు ఓ వీడియో వైరల్గా మారింది.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ అధికారిక ఫేస్బుక్ పోస్ట్ ద్వారా దీనికి సంబంధించిన అంశాలు పంచుకున్నారు. అందులోని వివరాల ప్రకారం.. 50 మీటర్ల ఎత్తు, 20,000 చదరపు మీటర్ల గాలితో కూడిన డోమ్ నిర్మాణాన్ని చైనా ఆవిష్కరించింది. జినాన్లోని ఒక నిర్మాణ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ డోమ్ శబ్ద కాలుష్యం, ధూళి నుంచి చుట్టుపక్కల పర్యావరణాన్ని రక్షిస్తుంది. ప్రధాన కట్టడం పూర్తయ్యాక దాన్ని తొలగిస్తారు. సోషల్ మీడియాలో దీని వీడియో ఒకటి వైరల్గా మారడంతో నెటిజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది యూజర్లు దీన్నో ‘చైనీస్ టెక్నోలాజియా’ అని అన్నారు.🚨 China has built a 50m-tall inflatable dome over a construction site in Jinan to protect the surroundings from dust and noise. pic.twitter.com/CLSrZAWS2g— Indian Tech & Infra (@IndianTechGuide) July 3, 2025ఇదీ చదవండి: టాటా కొత్త ఈవీ తయారీ ప్రారంభం.. ధర ఎంతంటే..‘చైనా ఇలాంటి నిర్మాణాలతో ప్రతిసారీ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది’ అని ఒక యూజర్ రిప్లై ఇచ్చారు. అయితే కొందరు మాత్రం ఈ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందులో పనిచేసే వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణం కింద కార్మికుల దుస్థితిని ఊహించండంటూ తెలుపుతున్నారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో లోపల ఉన్న కార్మికులను ఊపిరాడకుండా చేస్తుందని మరొకరు రాశారు. ఇది భూకంపం లేదా సునామీ కంటే ప్రాణాంతకం కావచ్చని మరొకరు రిప్లై ఇచ్చారు. -
టాటా కొత్త ఈవీ తయారీ ప్రారంభం.. ధర ఎంతంటే..
టాటా మోటార్స్ అధికారికంగా ‘హారియర్.ఈవీ’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. కంపెనీ తన పుణె ప్లాంటులో ఈమేరకు ప్రొడక్షన్ను మొదలు పెట్టినట్లు పేర్కొంది. హారియర్.ఈవీ డెలివరీలు 2025 జులైలోనే ప్రారంభం కానున్నాయి. దాంతో కంపెనీ ఈమేరకు తయారీని మొదలుపెట్టినట్లు స్పష్టం చేసింది.జూన్ 27న ఈ హారియర్.ఈవీ వేరియండ్ ధరలు ప్రకటించిన తరువాత వీటి కోసం బుకింగ్లను ప్రారంభించింది. జులై 2న అధికారికంగా ఈ కార్ల బుకింగ్లు స్వీకరించింది. ఇప్పటికే భద్రత పట్ల దాని నిబద్ధతను చూపుతూ హారియర్.ఈవీ భారత్ ఎన్సీఏపీ 5-స్టార్ రేటింగ్ను సాధించింది. వయోజనుల భద్రతతో 32/32, పిల్లల రక్షణకు 45/49 మార్కును సాధించింది. ఈ విభాగంలో అత్యధిక భద్రతా స్కోర్లలో ఇది ఒకటి.ఇదీ చదవండి: త్వరలో 50 శాతం వైట్కాలర్ జాబ్స్ కనుమరుగుహారియర్.ఈవీ వివిధ కాన్ఫిగరేషన్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో రెండు బ్యాటరీ 65 కిలోవాట్, 75 కిలోవాట్ వేరియంట్లు ఉన్నాయి. రెండింటిలోనూ డిఫాల్ట్గా రియర్ వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) సింగిల్ మోటార్ సెటప్ ఉంది. అయితే 75 కిలోవాట్ వేరియంట్ మెరుగైన పనితీరు కోసం ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యుడీ) డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్ అందిస్తున్నట్లు పేర్కొంది. వేరియంట్ను అనుసరించి ఈ ఈవీ ధర రూ.21.49 లక్షలు(ఎక్స్షోరూమ్) నుంచి రూ.28.99 లక్షలు వరకు ఉంది. -
త్వరలో 50 శాతం వైట్కాలర్ జాబ్స్ కనుమరుగు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొందరికి భవిష్యత్తుపై ఆశావహాన్ని పెంచితే ఇంకొందరి కొలువులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా ఏఐ వల్ల వివిధ పరిశ్రమల్లోకి వైట్ కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఫైనాన్స్, లా, హెల్త్ కేర్, టెక్నాలజీ వంటి పరిశ్రమల్లో వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించే అవకాశం ఉందని టెక్ లీడర్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాలోని వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం కృత్రిమ మేధతో భర్తీ అవతాయని ఫోర్డ్ మోటార్ సీఈఓ జిమ్ ఫార్లే తెలిపారు.ఆస్పెన్ ఐడియాస్ ఫెస్టివల్ కార్యక్రమంలో రచయిత వాల్టర్ ఐజాక్సన్తో ఫార్లే మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ అమెరికాలోని వైట్ కాలర్ కార్మికుల్లో సగం మందిని భర్తీ చేయబోతోంది. భవిష్యత్తులో కృత్రిమ మేధ కేవలం ఉత్పాదకతను పెంపొందించే సాధనంగా మాత్రమే ఉండబోదు. పరిపాలనా, నిర్వహణ, సాంకేతిక ఉద్యోగాల్లో సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!అంతకుముందు మే నెలలో జేపీ మోర్గాన్ ఛేజ్లో కన్జ్యూమర్ అండ్ కమ్యూనిటీ బ్యాంకింగ్ విభాగం అధిపతి మరియానే లేక్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. ఏఐ ఇంటిగ్రేషన్ కారణంగా కార్యకలాపాల హెడ్ కౌంట్ను 10 శాతం తగ్గించాలని బ్యాంక్ భావిస్తోందని చెప్పారు. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ కూడా భవిష్యత్తులో కార్పొరేట్ శ్రామిక శక్తి తగ్గిపోతుందని అంచనా వేశారు. -
లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!
డబ్బు లేదని బాధపడడం కంటే దాన్ని ఎలా వశం చేసుకోవాలనే దాని గురించి ఆలోచించేవారి సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ ఆర్థిక పరిమితులు ఇంతేనని.. తమ జీవితాలు ఏం చేసినా బాగోవు..అనే ధోరణికి వచ్చేస్తున్నారు. ఇందుకు బదులుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యతరగతివారు ఆర్థిక అంశాలపట్ల తమ నమ్మకాలను పరిమితంగా ఉంచుకుంటారని ఇన్వెస్టర్, పోర్ట్ఫోలియో స్ట్రాటజిస్ట్ శ్యామ్ శేఖర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ మనస్తత్వం నుంచి ఎలా బయటపడాలో కనీసం ఆలోచించేందుకు సైతం వారు నిరాకరిస్తున్నారని చెప్పారు.శ్యామ్ శేఖర్ ఎక్స్లో తెలిపిన వివరాల ప్రకారం..‘మధ్యతరగతి కుటుంబాలు తమ మనస్తత్వం మర్చుకోవు. అందుకే ఆర్థికంగా ఎదగలేవు. కనీసం ఆ దిశగా ఆలోచించడానికిసైతం నిరాకరిస్తారు. ఇంట్లో ఎయిర్ కండీషనర్, కారు ఉండాలని కలలు కనే మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అవసరాలు నిజంగా తమ సామర్థ్యాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉన్న పరిధిలో ఆర్థికంగా పుంజుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ఈ అవసరాలే వారికి పెద్ద లక్ష్యాలుగా తోస్తాయి’ అన్నారు.Why do middle class families stay middle class? It is because they refuse to think of what will make them break out of the middle class mindset.What is the middle class mindset?It is something which stops you from dreaming of what you feel is beyond your present reach. You…— Shyam Sekhar (@shyamsek) July 4, 2025ఇదీ చదవండి: ఉద్యోగుల్లో వేతన సంక్షోభం‘డబ్బు సంపాదనను కాంపౌండింగ్ దృష్టితో చూడాలి. దీర్ఘకాలంలో భారీ సంపద చేకూర్చే మార్గాలను కనుగొనాలి. ఇలాంటి ఆలోచనలతో మీరు జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తారు. రూ.కోటి చేరువలో ఉన్న వ్యక్తి రూ.20 కోట్లకు సులువుగా చేరుకోవచ్చు. కాంపౌండింగ్తో ఇది సాధ్యమే. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సంపదను సృష్టిస్తే తరాలు అది కొనసాగుతోంది. పర్సనల్ ఫైనాన్స్పై పరిమిత ఆలోచనల నుంచి బయటకురావాలి’ అన్నారు. -
ఉద్యోగుల్లో వేతన సంక్షోభం
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీడీపీల్లో భారత్ ఒకటిగా నిలవడం ఆశావాదానికి అద్దం పడుతోంది. అయితే దేశంలోని కార్పొరేట్ కంపెనీల లాభాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నప్పుడు అందులో పని చేసే ఉద్యోగుల జీవితాలు, జీతాల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. కార్పొరేట్ లాభాలను ఆయా యాజమాన్యాలు వ్యక్తిగతంగా ఎదగడానికి మాత్రమే ఖర్చు చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ‘ది గ్రేట్ ఇండియన్ శాలరీ క్రైసిస్’ అని పిలుస్తున్నారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని చంకలు చరిచేలోపే.. శ్రామిక శక్తి ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు నివ్వెర పరుస్తున్నాయి.దేశంలో ఆర్థిక పురోభివృద్ధి ఉన్నప్పటికీ సగటు కార్మికుడి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా, వేతనాలు స్తబ్దుగా ఉన్నాయి. వారి సంపాదనకు, ఖర్చులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఉద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం ఉండకపోవడంతో వారి ఆర్థిక ప్రణాళికలు అస్తవ్యస్తంగా మారి ప్రధాన నగరాల్లోని నిపుణులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.స్తబ్దుగా వేతనాలుభారత జీడీపీ విస్తరిస్తున్నప్పటికీ జీతాల వృద్ధి మాత్రం గణనీయంగా మందగించింది. 2023 లో సగటు వేతన పెరుగుదల కేవలం 9.2% మాత్రమే ఉండడం దీనికి నిదర్శనం. ఈ పెంపు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేదు. ద్రవ్యోల్బణం రేట్లు ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఇతర నిత్యావసరాల ధరలు వేతనాల పెరుగుదలను మించిపోయాయి. కంపెనీలు రికార్డు లాభాలను నమోదు చేసేందుకు దోహదపడే ఉద్యోగుల వేతన పెంపుపై యాజమాన్యాలు మొండి వైఖరి అనుసరిస్తున్నాయి. సంపన్నులు, సగటు కార్మికుడి మధ్య ఆర్థిక అంతరం విస్తృతంగా పెరుగుతోంది. అధిక వేతనం పొందే రంగాల్లో కొంతమంది ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇదీ చదవండి: పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం మూసివేతపట్టణాల్లో మరింత ఖర్చులునోయిడా, ఢిల్లీ, చెన్నై, పుణె, బెంగళూరు, హైదరాబాద్.. వంటి ప్రధాన పట్టణ కేంద్రాల్లో నివసిస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జీవన వ్యయం అదుపు తప్పడంతో నగరంలోని ఉద్యోగులు అధిక అద్దెలు, ఈఎంఐలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో సతమతమవుతున్నారు. ఓ పాతికేళ్ల కిందట మోస్తారు ఖర్చులతో కాలం వెళ్లదీసుకొచ్చినవారికి ఇప్పుడు అవే ఖర్చులు ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేస్తున్నాయి. -
రోబో ఇసుక.. ఇప్పుడిదే ప్రత్యామ్నాయం
సాక్షి, సిటీబ్యూరో: నది ఇసుక కొరత, అధిక ధరల కారణంగా గ్రేటర్ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇసుక రవాణా దారులు రేట్లు పెంచడం నిర్మాణ రంగానికి మరింత భారంగా పరిణమించింది. మహానగరంలో ఇసుక దొరకడం గగనమవడంతో బిల్డర్లు ప్రత్యామ్నాయంగా రోబో ఇసుక వినియోగాన్ని పెంచారు.ధర తక్కువే.. ఇప్పటికే కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్లలో రోబో ఇసుక (క్రష్డ్ రాక్ సాండ్)ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక రేట్లతో పోలిస్తే దీని ధర ఎంతో తక్కువ. అయితే రోబో ఇసుక విరివిరిగా దొరక్కపోవడం.. ప్రత్యేకంగా కొన్ని క్రషర్లలోనే ఇలాంటి ఇసుకను ఉత్పత్తి చేస్తుండటంతో సాధారణ గృహ నిర్మాణాల్లో దీని వినియోగం తక్కువగా ఉంది. అలాగే రోబో ఇసులాగే మెటల్ క్రషింగ్ స్టోన్ డస్ట్ కూడా ఉండటం వీటిలో నాణ్యమైన ఇసుకను గుర్తించడం కష్టంగా మారుతోంది.రోబో తయారీ ఈజీ.. నగర శివార్లలో విరివిగా లభ్యమయ్యే గ్రనైట్ శిలలతో రోబోశాండ్ను ఉత్పత్తి చేయవచ్చు. మెటల్ క్రషర్స్లో మిగిలిన వ్యర్థ శిలలను 2ఎంఎం, 1ఎంఎం పరిమాణంలో క్రష్ చేసి జల్లెడ పడితే ఈ ఇసుక తయారవుతుంది. తక్కువ సమయంలో నాణ్యత కలిగిన ఇసుకను తయారు చేయవచ్చన్నది నిపుణుల మాట. ఈ ఇసుకను నగరంలో రెడీమిక్స్ యూనిట్ల ద్వారా భారీ నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. -
పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం మూసివేత
ప్రపంచ టాప్ టెక్ కంపెనీలో ఒకటైన మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ కార్యాలయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్లో తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశంలో 25 సంవత్సరాలుగా సర్వీసులు అందిస్తున్న కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా తన సర్వీసులను ముగించినట్లయింది. కంపెనీ గ్లోబల్ వర్క్ఫోర్స్ తగ్గింపు వ్యూహంలో భాగంగా పాకిస్థాన్లో ఈమేరకు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఇప్పటికే స్థానికంగా ఉన్న క్లయింట్లకు క్షేత్రస్థాయిలో సర్వీసులు అందించేందుకు కంపెనీ ప్రాంతీయ కేంద్రాలు, అధీకృత రీసెల్లర్ల ద్వారా రిమోట్ సేవలు అందిస్తామని పేర్కొంది. ప్రస్తుత కస్టమర్ ఒప్పందాలు, సేవలు ప్రభావితం కాకుండా కొనసాగుతాయని తెలిపింది. ఆయా కంపెనీలకు నిత్యం మద్దతుగా నిలుస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. పాకిస్థాన్లో కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల స్థానికంగా కేవలం కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే ప్రభావితం చెందినప్పటికీ అక్కడి వ్యాపార, సాంకేతిక వర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.భారతదేశంలో మాదిరిగా కాకుండా మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్లో అభివృద్ధి లేదా ఇంజినీరింగ్ సర్వీసులు స్థాపించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. కేవలం అక్కడి యూనిట్ ద్వారా తన ప్రోడక్ట్లను ఇతర కంపెనీలతో అనుసంధానం చేసేందుకు, అమ్మకాల కార్యకలాపాలకే పరిమితం చేసింది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఉద్యోగాల కోతకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇటీవల మొత్తంగా కంపెనీలో పని చేస్తున్న 9,000 పైగా ఉద్యోగాలను తగ్గించింది. ఈ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణమే సంస్థ పాకిస్థాన్ నుంచి నిష్క్రమించేందుకు కారణమని ఆ దేశ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పాక్ లైసెన్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ వంటి ప్రధాన విధులను కొన్ని సంవత్సరాలుగా ఐర్లాండ్లోని తన యూరోపియన్ హబ్కు మారుస్తోంది.ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురుఅంతర్జాతీయంగా చాలాదేశాల్లో పాకిస్థాన్ ఉగ్రవాదానికి సంబంధించి వ్యతిరేకత ఉంది. స్థానికంగా పేదరికం పెరుగుతోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ ఏటా దారుణంగా క్షీణిస్తోంది. దాంతో చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను పరిమితం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీ ఇలా మొత్తంగా తన కార్యాలయాన్ని షట్డౌన్ చేయడం అక్కడి టెక్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. -
హైదరాబాద్ వెస్ట్ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్ట్లు
కోవిడ్ తర్వాత విల్లాలపై ఆసక్తి మరింత పెరిగింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతోంది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం కారణంగా ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. - సాక్షి, సిటీబ్యూరోపశ్చిమంలో హవా.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో పశ్చిమ ప్రాంతాల హవా కొనసాగుతోంది. మూడు త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి.వెస్ట్ హైదరాబాద్లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్లో అత్తాపూర్లు రియల్టీ హాట్స్పాట్స్గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్ లాంచింగ్లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. -
ఆట బొమ్మల ఉత్పత్తికి ప్రోత్సాహం.. త్వరలో కొత్త పథకం
పరిశ్రమతో సంప్రదింపుల అనంతరం దేశంలో ఆట బొమ్మల ఉత్పత్తిని (టాయ్స్) పెంచేందుకు త్వరలోనే ఓ పథకాన్ని ఖరారు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టాయ్స్ తయారీకి, ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఏఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు.ప్రభుత్వం తీసుకొచ్చే పథకం ఎగుమతులకు ప్రోత్సాహకాల రూపంలో ఉండదని.. దేశీయంగా తయారీని పెంచేందుకు, ఉపాధి కల్పనకు ఊతమిస్తుందన్నారు. డిజైన్ సామర్థ్యాలు, నాణ్యతతో కూడిన తయారీ, బ్రాండ్ నిర్మాణానికి మద్దతు రూపంలో ఈ పథకం ఉంటుందని చెప్పారు. ఒకప్పుడు ఆట బొమ్మల కోసం దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడగా.. ప్రస్తుతం దేశీయంగానే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంతోపాటు, 153 దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. విధానపరమైన మద్దతు చర్యలు, నాణ్యతా ప్రమాణాల అమలు, స్థానిక తయారీ క్లస్టర్లను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమైనట్టు వివరించారు.140 కోట్ల జనాభా కలిగిన దేశం కావడంతో తయారీ కార్యకలాపాల విస్తరణతో సహజ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆట బొమ్మల ఎగుమతులను పెంచుకునేందుకు చక్కని బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్, బలమైన డిజైన్పై దృష్టి సారించాలని పరిశ్రమకు గోయల్ సూచించారు. వినూత్నమైన ఆట»ొమ్మల నమనాలను అభివృద్ధి చేసిన స్టార్టప్లకు పీఎం ముద్రాయోజన కింద పెద్ద ఎత్తున నిధుల మద్దతు అందించినట్టు చెప్పారు. -
పూర్తిగా మహిళా ఉద్యోగులతో ఇన్సూరెన్స్ బ్రాంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా సంస్థ ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) తాజాగా హైదరాబాద్లో పూర్తిగా మహిళా సిబ్బందితో బ్రాంచీని ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో ఈ తరహా ఆల్–ఉమెన్ బ్రాంచీని ప్రారంభించగా, ఇది రెండోదని వివరించింది.దీనితో హైదరాబాద్లో తమ శాఖల సంఖ్య 7కు, దేశవ్యాప్తంగా 433కి చేరిందని కంపెనీ ఎండీ కమలేష్ రావు తెలిపారు. మహిళా అడ్వైజర్లకు సహాయకరంగా ఉండేలా ఈ శాఖలో కిడ్స్ రూమ్లాంటి సదుపాయాలు కూడా ఉంటాయని వివరించారు.ఆదిత్య బిర్లా గ్రూప్ (ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ ద్వారా), కెనడా ఆర్థిక సేవల దిగ్గజం సన్ లైఫ్ ఫైనాన్షియల్ మధ్య జాయింట్ వెంచర్గా 2000 ఆగస్టులో ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటైంది. 2001 జనవరిలో కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థ దేశంలోని టాప్ ప్రైవేట్ జీవిత బీమా కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. -
‘టాటా పవర్’ ఇక చూపిస్తాం..!
టాటా పవర్ అచ్చమైన సోలార్, పవన విద్యుత్ సంస్థ నుంచి పూర్తిస్థాయి హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన రంగ శక్తిగా అవతరిస్తుందని సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. అణు విద్యుత్ అభివృద్ధిని సైతం భవిష్యత్తులో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. టాటా పవర్ 106వ వార్షిక వాటాదారుల సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. విద్యుదుత్పాదన, అమలు దశలో కలిపి మొత్తం 25 గిగావాట్ల సామర్థ్యాన్ని కంపెనీ 2024–25లో అధిగమించినట్టు చెప్పారు. ఇందులో 65 శాతం శుద్ధ, పర్యావరణ అనుకూల ఇంధనాల నుంచే ఉన్నట్టు తెలిపారు. ఇటీవలి ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ దశను మలుపు తిప్పిన దివంగత గౌరవ చైర్మన్ రతన్ టాటా సేవలను సైతం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.గత ఆర్థిక సంవత్సరంలో టాటా పవర్ పునరుత్పాదక, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి భూటాన్ డ్రక్తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలోనే తమిళనాడులోని తిరునల్వేలిలో ఏర్పాటు చేసిన 4.3 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంట్ను సంస్థ ప్రారంభించింది. రూ.4,800 కోట్ల విలువ చేసే విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది. -
కొత్త రకం బ్యాంక్.. ఏటీఎం.. క్రెడిట్ కార్డ్
ఫిన్టెక్ కంపెనీ ‘స్లైస్’ దేశంలో మొట్టమొదటి యూపీఐ ఆధారిత ఫిజికల్ బ్యాంక్ బ్రాంచ్ ఏటీఎంతో పాటు స్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డు అనే పేరుతో తన ఫ్లాగ్షిప్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. ఈ స్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డుకు ఎటువంటి జాయినింగ్ లేదా వార్షిక రుసుము ఉండదు వినియోగదారులు తమ క్రెడిట్ లైన్ నుండి డ్రాయింగ్ ద్వారా యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు.ఇతర ప్రయోజనాలుస్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డుతో పలు ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. అన్ని లావాదేవీలపై కార్డుదారులకు 3 శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇందులో "స్లైస్ ఇన్ 3" ఫీచర్ కూడా ఉంది. అంటే వినియోగదారులు కొనుగోలును మూడు వడ్డీ లేని వాయిదాలుగా విభజించుకోవచ్చు. "స్లైస్ తో వినియోగదారులు తమ క్రెడిట్ కార్డును నేరుగా యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాను ఉపయోగించినట్లే దీనిని ఉపయోగించవచ్చు. క్యూఆర్ లను స్కాన్ చేయడం, స్టోర్లలో చెల్లించడం, బిల్ స్ల్పిట్, ఆన్లైన్ లో ఆర్డర్ వంటివి చేసుకోవచ్చు" అని స్లైస్ తెలిపింది.యూపీఐ బ్యాంక్.. ఏటీఎంక్రెడిట్ కార్డుతో పాటు స్లైస్ బెంగళూరులోని కోరమంగళలో యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖను స్లైస్ ప్రారంభించింది. ఈ శాఖలో యూపీఐ ఏటీఎం ఉంది. ఇక్కడ వినియోగదారులు క్యాష్ విత్డ్రాలు, డిపాజిట్లు చేయవచ్చు. ఖాతాలను తెరవడం వంటి ఇతర సేవలను వినియోగించుకోవచ్చు. స్లైస్ అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ బ్రాంచ్ అన్ని కస్టమర్ ఇంటరాక్షన్ లలో మొత్తం యూపీఐ ఇంటిగ్రేషన్ ను అందిస్తుంది. ఎటువంటి సుదీర్ఘ ప్రక్రియలు లేకుండా తక్షణ కస్టమర్ ఆన్బోర్డింగ్ చేస్తుంది. -
హైదరాబాద్లో అపార్ట్మెంట్ల ధరలు ఆకాశానికి..
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే మన నగరంలోనే అపార్ట్మెంట్ల ధరలు తక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. దేశంలో ముంబై తర్వాత ఖరీదైన సిటీగా మన నగరం అభివృద్ధి చెందింది. రెండో అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయింది.వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్లో ప్రాపర్టీల విలువ 6 శాతం వృద్ధి చెంది.. చ.అ. ధర సగటున రూ.5,800 నుంచి రూ.6 వేలకు పెరిగింది. ముంబైలో ఏడాదిలో 3 శాతం పెరిగి.. రూ.9,600 నుంచి రూ.9,800లకు చేరిందని ప్రాప్టైగర్.కామ్ నివేదిక వెల్లడించింది.దాదాపు పదేళ్ల కాలంలో అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉండటం, స్టాంప్ డ్యూటీలను తగ్గించడం, సర్కిల్ ధరలలో సవరణలతో పాటు గృహ కొనుగోళ్లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో అందుబాటు ధరలలోని ఇళ్ల విక్రయాలలో అత్యధిక వృద్ధి నమోదైంది.ఒకవైపు సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులకు రాయితీలను అందిస్తున్నాయి. లేదంటే ఆయా నగరాలలో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముంది. -
అమెరికా సీఈవో ఫోరంపై నాస్కామ్ కసరత్తు
భారత్, అమెరికా టెక్ దిగ్గజాలు కలిసి పని చేసేలా ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. జూలై 9న అమెరికా న్యూయార్క్లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో యూఎస్ సీఈవో ఫోరంను ప్రారంభించనున్నట్లు వివరించింది.కొత్త ఆవిష్కరణలు, పాలసీలు, నిపుణులను తయారు చేసుకోవడం వంటి అంశాలపై అత్యున్నత స్థాయి లో సంప్రదింపులు నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుందని నాస్కామ్ పేర్కొంది. ప్రవాస భారతీయులు, ప్రభుత్వం, పరిశ్రమ, ఇన్వెస్ట్మెంట్, మేధావులు, విద్యావేత్తలు మొదలైన వర్గాలను సమన్వయపర్చడం ద్వారా భారత్–అమెరికా టెక్ భాగస్వామ్యాన్ని పటిష్టపర్చేందుకు సహాయకరంగా ఉంటుందని తెలిపింది.భారతీయ టెక్నాలజీ కంపెనీలు అమెరికా అంతటా డిజిటల్ పరివర్తనను శక్తివంతం చేయడమే కాకుండా, ఉద్యోగాలను సృష్టించడం, స్థానిక కమ్యూనిటీలలో పెట్టుబడులు పెట్టడం, నిజమైన ప్రభావాన్ని అందించే ఆవిష్కరణలను నడిపిస్తున్నాయని నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ అన్నారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ సీఈఓ అమిత్ చద్దా, విప్రోలో అమెరికాస్ వన్ సీఈఓ మలయ్ జోషితో పాటు నంబియార్ ఈ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొంటారని నాస్కామ్ తెలిపింది. -
తగ్గినట్టే తగ్గి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
దేశంలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. వరుసగా పెరుగుతూ హ్యాట్రిక్ కొట్టిన పసిడి ధరలు క్రితం రోజున దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. అయితే ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
జీఎస్టీ మూడు శ్లాబులకు తగ్గాలి
దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.4–6.7 శాతం మేర వృద్ధి చెందుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ అనిశి్చతుల రిస్క్ నెలకొన్పప్పటికీ, బలమైన దేశీ డిమండ్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమాని అభిప్రాయపడ్డారు. సీఐఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మెమానీ మీడియాతో మాట్లాడారు.రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, వ్యవస్థలో నగదు లభ్యత పెంచే దిశగా ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని ఒక శాతం, రెపో రేటును అరశాతం తగ్గిస్తూ ఆర్బీఐ జూన్ మొదట్లో నిర్ణయం ప్రకటించడం తెలిసిందే. సీఆర్ఆర్ తగ్గించడం వల్ల వ్యవస్థలోకి రూ.2.5 లక్షల కోట్ల నిధుల లభ్యత పెరగనుంది. విదేశీ వాణిజ్యపరమైన రిస్క్లున్నాయంటూ.. అవి తటస్థం చెందుతాయని అంచనా వేస్తున్నట్టు మెమానీ చెప్పారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వృద్ధికి ప్రతికూలంగా మారినా దేశీ డిమాండ్ ఆదుకుంటుందన్నారు. జీఎస్టీ మరింత సరళం.. మూడు సులభతర శ్లాబులతో జీఎస్టీని మరింత సులభంగా మార్చాలని మెమానీ కోరారు. నిత్యావసరాలను 5 శాతం రేటు కింద, విలాసవంతమైన, హానికర వస్తువులను 28 శాతం రేటులో, మిగిలిన వస్తువులన్నింటినీ 12–18 శాతం మధ్య ఒక రేటు కిందకు తీసుకురావాలని సూచించారు. 28 శాతం రేటు అమలవుతున్న సిమెంట్ తదితర కొన్నింటిని తక్కువ రేటు కిందకు తీసుకురావాలన్నారు. అలా చేయడం ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్రోల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్త ఏకాభిప్రాయం అవసరమన్నారు. -
మెట్రోల్లోనే క్విక్ కామర్స్ జోరు..
క్విక్కామర్స్ రంగం శరవేగంగా వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. మెట్రోలకు వెలుపల పట్టణాల్లో లాభదాయకమైన విస్తరణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని మార్కెట్ పరిశోధనా సంస్థ రెడ్సీర్ తెలిపింది. క్విక్కామర్స్ సంస్థల స్థూల వస్తు విక్రయ విలువ (జీఎంవీ)లో నాన్ మెట్రోలు 20 శాతం వాటానే భర్తీ చేస్తున్నట్టు పేర్కొంది. తక్కువ డిమాండ్, డిజిటల్ పరిణతి తక్కువగా ఉండడం, స్థానిక షాపింగ్ అలవాట్లను రెడ్సీర్ నివేదిక ప్రస్తావించింది.2025 మొదటి ఐదు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు క్విక్ కామర్స్ సంస్థల ఆదాయం 150 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. డార్క్ స్టోర్లను పెద్ద ఎత్తున ప్రారంభించడం, వివిధ విభాగాల్లోకి దూకుడుగా ఎంట్రీ ఇవ్వడం, తీవ్రమైన పోటీ ఈ వృద్ధికి నేపథ్యాలుగా వివరించింది. టాప్–10–15 పట్టణాల వెలుపల ఒక్కో డార్క్స్టోర్కు వచ్చే రోజువారీ ఆర్డర్ల తగ్గుదల వేగంగా ఉందని వెల్లడించింది. 1,000 దిగువకు ఆర్డర్లు తగ్గాయని.. టాప్15కు తదుపరి టాప్ 20 పట్టణాల్లో డార్క్ స్టోర్ వారీ ఆర్డర్లు 700 దిగువకు తగ్గినట్టు తెలిపింది.ఇది డిమాండ్ బలహీనతను తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఆన్లైన్ సంస్థల పట్ల నమ్మకం తక్కువగా ఉండడం, డిజిటల్ టెక్నాలజీల పట్ల అవగాహన తక్కువగా ఉండడం ఆర్డర్లు పరిమితంగా ఉండడానికి కారణంగా పేర్కొంది. జనాభా కూడా తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. క్విక్కామర్స్ సంస్థలు ఆఫర్ చేసే వస్తు శ్రేణి స్థానికుల అభిరుచులకు అనుగుణంగా ఉండకపోవడాన్ని పేర్కొంది.దీనికితోడు ఈ ప్రాంతాల్లో స్థానిక రిటైల్ స్టోర్లకు, ప్రజలకు మధ్య ఉండే బలమైన సంబంధాలను ప్రస్తావించింది. దీంతో మెట్రోలతో పోల్చితే నాన్ మెట్రోల్లో ఒక్కో డార్క్స్టోర్ లాభం–నష్టాల్లేని స్థితి రావడానికి రెట్టింపు సమయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది. -
యూపీఎస్కూ పన్ను ప్రయోజనం
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను ప్రోత్సహించే దిశగా ఈ పథకాన్ని ఎంపిక చేసుకున్న ఉద్యోగులకు ఎన్పీఎస్ మాదిరే పన్ను ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలను కేంద్రం చేపట్టింది. యూపీఎస్ను సైతం పన్ను కార్యాచరణ పరిధిలోకి చేర్చడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంత జీవన భద్రత దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ముందడు అని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఎన్పీఎస్ కింద అమల్లో ఉన్న పన్ను ప్రయోజనాలను యూపీఎస్ ఎంపిక చేసుకునే వారికి సైతం వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతూ.. యూపీఎస్ కూడా ఎన్పీఎస్ కింద ఒక ఆప్షన్ అన్న విషయాన్ని గుర్తు చేసింది. దీనివల్ల యూపీఎస్ ఎంపిక చేసుకునే వారికి సైతం గణనీయమైన పన్ను ప్రయోజనాలు దక్కుతాయని తెలిపింది. 2025 ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరే ఉద్యోగులకు ఎన్పీఎస్ కింద యూపీఎస్ను ఒక ఆప్షన్గా ప్రవేశపెడుతూ ఈ ఏడాది జనవరి 24న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఎన్పీఎస్ కింద నమోదై ఉన్న ఉద్యోగులు యూపీఎస్కు మారేందుకు ఒక్కసారి అవకాశం ఇచ్చింది. -
‘జేన్ స్ట్రీట్’ స్కామ్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికన్ సంస్థ జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ట్రేడింగ్ చేయకుండా గ్రూప్ సంస్థలపై నిషేధం విధించింది. అక్రమంగా ఆర్జించిన రూ. 4,843 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్టాక్ సూచీలను ప్రభావితం చేసి, జేఎస్ గ్రూప్ భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలపై చేపట్టిన విచారణలో భాగంగా సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్లో భాగమైన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్, జేన్ స్ట్రీట్ సింగపూర్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ సంస్థలకు ఇవి వర్తిస్తాయి. 2023 జనవరి–2025 మే మధ్య కాలంలో 21 ఎక్స్పైరీ తేదీల్లో సూచీలను ప్రభావితం చేసే విధంగా క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్లో గ్రూప్ పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసినట్లు, తద్వారా ఆప్షన్స్ మార్కెట్లో పొజిషన్లతో భారీగా లాభాలు ఆర్జించినట్లు సెబీ విచారణలో తేలింది. జేన్ స్ట్రీట్, దాని అనుబంధ సంస్థలు భారతీయ ఆప్షన్స్ మార్కెట్లో అనధికారిక ట్రేడింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నాయంటూ 2024 ఏప్రిల్లో మీడియాలో వార్తలు రావడం ఈ కేసుకు బీజం వేశాయి. ఎక్స్పైరీ రోజు దగ్గరపడే సమయంలో, ఇండెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా, జేఎస్ గ్రూప్ సందేహాస్పద ట్రేడింగ్ లావాదేవీలు నిర్వహిస్తోందని సెబీ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇలాంటివి చేయబోమంటూ ఎన్ఎస్ఈకి హామీ ఇచ్చినప్పటికీ గ్రూప్ సంస్థలు తమ తీరును మార్చుకోలేదని ఉత్తర్వుల్లో సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘2025లో ఎన్ఎస్ఈ జారీ చేసిన అడ్వైజరీని కూడా పట్టించుకోకుండా, లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తూ జేఎస్ గ్రూప్ వ్యవహరించిన తీరు చూస్తే, మిగతా ఎఫ్పీఐలు, మార్కెట్ వర్గాల్లాగా, అది నమ్మతగినది కాదని అర్థం అవుతోంది. గతంలోలాగే లావాదేవీలు కొనసాగించేందుకు జేఎస్ గ్రూప్ను అనుమతిస్తే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కచ్చితంగా భంగం వాటిల్లుతుందని ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి’’ అని సెబీ వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జేఎస్ గ్రూప్ అక్రమంగా ఆర్జించిన రూ. 4,843.57 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఉత్తర్వులకు సంబంధించినవి అయితే తప్ప, తమ అనుమతి లేకుండా, జేఎస్ గ్రూప్ సంస్థల ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలను జరగనివ్వరాదంటూ బ్యాంకులకు సెబీ ఆదేశాలు ఇచ్చింది. ఇతరత్రా సూచీల్లోనూ జేఎస్ గ్రూప్ ట్రేడింగ్ లావా దేవీలపై సెబీ విచారణ చేపడుతోంది. సెబీ ఉత్తర్వుల ప్రకారం ఇండెక్స్, స్టాక్ ఆప్షన్లలో ట్రేడింగ్ ద్వారా జేఎస్ గ్రూప్ రూ.44,358 కోట్లు ఆర్జించింది. స్టాక్ ఫ్యూచర్స్లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్లో రూ. 191 కోట్లు, క్యాష్ సెగ్మెంట్లో రూ. 288 కోట్లు నష్టపోయింది. దీంతో 2023 జనవరి–2025 మార్చి మధ్య మొత్తం మీద రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించింది. ఏం చేసింది.. ఎలా చేసింది..స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ సెగ్మెంట్స్లో ట్రేడింగ్ ద్వారా సూచీలను ప్రభావితం చేసి, దాన్నుంచి లాభాలు పొందిందని జేఎస్ గ్రూప్పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అది రెండు కీలక వ్యూహాలు అమలు చేసిందని సెబీ విచారణలో వెల్లడైంది. దీని ప్రకారం, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్లలో ’జేఎస్ గ్రూప్’ ఉదయం పెద్దయెత్తున కొనుగోళ్లు చేసి, సాయంత్రం భారీగా అమ్మేసేది. అలాగే ఎక్స్పైరీ రోజున ఆఖరు రెండు గంటల్లో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా ఏదో ఒకదాన్ని భారీగా కొనడమో లేదా అమ్మడమో చేసేది. ఉదాహరణకు.. జేఎస్ గ్రూప్ ఉదయాన్నే కొన్ని ఎంపిక చేసుకున్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ షేర్లను భారీగా కొనేసేది. అదే సమయంలో ఇండెక్స్ ఆప్షన్స్ను షార్ట్ (అమ్మేయడం) చేసేది. ట్రేడింగ్ ముగిసే సమయం దగ్గరపడే కొద్దీ షేర్లను ఒక్కసారిగా అమ్మేసేది. దీంతో షేరు ధర పడిపోయేది. ఫలితంగా షేర్లపరంగా నష్టాలు వచ్చినప్పటికీ, సమాంతరంగా తీసుకున్న ఇండెక్స్ షార్ట్ ఆప్షన్లలో భారీగా లాభాలు వచ్చేవి. దీనివల్ల, ఉదయం రూ. 10 దగ్గర ఉన్న ఆప్షన్.. సాయంత్రానికి ఎకాయెకిన రూ.300–రూ. 400 అయిపోతుంది. లేదా అటుది ఇటవుతుంది. ఇలా ఎక్స్పైరీ రోజుల్లో ఇలా అసా ధారణ తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో సాధారణ ట్రేడర్లు భారీగా నష్టపోతారు. వాల్యూమ్స్పై ప్రభావం.. జేన్ స్ట్రీట్పై సెబీ చర్యలను మార్కెట్ వర్గాలు స్వాగతించాయి. దీనితో చిన్న ట్రేడర్లకు కాస్త ఊరట లభించగలదన్నాయి. కాకపోతే ఆప్షన్స్ వాల్యూమ్స్పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్లో జేన్ స్ట్రీట్ లాంటి ట్రేడింగ్ సంస్థల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుందని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇలాంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోతే దాదాపు రిటైల్ కార్యకలాపాలపైనా ప్రభావం పడొచ్చని వివరించారు. ఫలితంగా బిడ్–ఆస్క్ స్ప్రెడ్ (కొనుగోలు, అమ్మకం బిడ్ల మధ్య వ్యత్యాసం), తీవ్ర ఒడిదుడుకులు, అనిశ్చితి పెరిగిపోవచ్చన్నారు. ఇది ఇటు ఎక్సే్చంజీలకు, అటు బ్రోకర్లకు మంచి వార్త కాకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద సంస్థలపై మన మార్కెట్ ఎంతగా ఆధారపడిందనేది దీనితో తెలిసిపోతుందని కామత్ తెలిపారు. స్టాక్స్ కుదేలు.. జేఎస్ గ్రూప్పై సెబీ చర్యలతో ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో, విదేశీ సంస్థల ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్లాట్ఫాంలు, సంస్థల షేర్లు శుక్రవారం గణనీయంగా క్షీణించాయి. బీఎస్ఈలో నువామా వెల్త్ మేనేజ్మెంట్ షేరు 11.26%, స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ షేరు 6%, బీఎస్ఈ షేరు 6.42%, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) 2.3% క్షీణించాయి. జేఎస్ గ్రూప్పై సెబీ చర్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతిందని లెమన్ మార్కెట్స్ డెస్క్ అనలిస్ట్ గౌరవ్ గర్గ్ తెలిపారు.ఏమిటీ జేన్ స్ట్రీట్.. ఆర్థిక సేవల రంగానికి సంబంధించిన జేన్ స్ట్రీట్ గ్రూప్ 2000లో ట్రేడింగ్ సంస్థగా అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాతో పాటు యూరప్, ఆసియాలోని 45 దేశాల్లో, 5 కార్యా లయాల్లో 2,600 మంది సిబ్బంది ఉన్నారు. 2020 డిసెంబర్లో ఇది భారత్లో కార్యకలాపాలు ఆరంభించింది. -
ఎల్ఐసీ కొత్త పాలసీలు..
ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా నవ జీవన్ శ్రీ, నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం పేరుతో రెండు కొత్త సేవింగ్ పాలసీలను ప్రారంభించింది. ఇవి నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, లైఫ్ కవరేజ్ కలిగిన వ్యక్తిగత సేవింగ్ ప్లాన్లు. బీమా రక్షణతో పాటు పెట్టుబడికి భద్రత, వడ్డీ రాబడి కోరుకునేవారికి ఇవి అనువుగా ఉంటాయి. ఈ పాలసీలు 2025 జూలై 4 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎల్ఐసీ తెలిపింది. నవ జీవన్ శ్రీ - రెగ్యులర్ ప్రీమియం (ప్లాన్ నెం.912) ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రీమియం చెల్లించే వారికి అనువైన ప్లాన్. కనీస సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, గరిష్ఠ పరిమితి లేదు. వయస్సు పరిమితి 30 రోజుల నుంచి 75 ఏళ్ల వరకు. మెచ్యూరిటీ నాటికి కనిష్ట వయసు 18 సంవత్సరాలు కాగా గరిష్ట వయసు 75 ఏళ్లు. 6, 8, 10 లేదా 12 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధులను ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 సంవత్సరాలు. 15, 16, 20 ఏళ్ల వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. గ్యారెంటీడ్ అడిషన్లు: 10-13 ఏళ్ల పాలసీకి - 8.50 శాతం, 14-17 సంవత్సరాలకు 9 శాతం, 18-20 ఏళ్ల కాలానికి 9.50 శాతం చొప్పున గ్యారెంటీడ్ అడిషన్లు లభిస్తాయి.డెత్ బెనిఫిట్: ఆప్షన్ 1 కింద - కనీస సమ్ అష్యూర్డ్తోపాటు వార్షిక ప్రీమియానికి 7 రెట్లు, ఆప్షన్ 2 కింద - వార్షిక ప్రీమియానికి 10 రెట్లు + బేసిక్ సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు.దీనికి కూడా యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ వంటి వాటిని జోడించుకునే వెసులుబాటు ఉంది. మెచ్యూరిటీ తర్వాత లేదా రిస్క్ జరిగినప్పుడు చెల్లింపు: మొత్తం డబ్బును ఒకేసారి లేదా నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక ప్రాతిపదికన పొందవచ్చు. ప్రీమియం చెల్లింపును కూడా ఇదే విధంగా ఎంపిక చేసుకోవచ్చు.నెలకు రూ.10 వేలతో రూ.26 లక్షలుఒక వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్తో 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకుంటే.. ఆప్షన్ 2 కింద 10 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకుంటే వార్షిక ప్రీమియం రూ.1,10,900 కట్టాలి. అదే నెలవారీ అయితే రూ.10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పదేళ్లకూ చెల్లించే మొత్తం సొమ్ము: రూ.11,09,000 అవుతుంది. పాలసీ వ్యవధి 20 సంవత్సరాలు పూర్తయ్యాక రూ.16,58,786 గ్యారెంటీడ్ అడిషన్ రూపంలో లభిస్తాయి. మొత్తం కలుపుకొంటే మెచ్యూరిటీ తర్వాత రూ.26,58,786 లభిస్తుంది.నవ జీవన్ శ్రీ- సింగిల్ ప్రీమియం (ప్లాన్ నం.911) ఈ పాలసీ ఒకేసారి ఏకమొత్తం పెట్టుబడి పెట్టదలచుకున్న వారికి అనువుగా ఉంటుంది. ఈ పాలసీని 30 రోజుల నుండి 60 ఏళ్ల వయస్సు వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఆప్షన్ 2 కింద మాత్రం గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు మాత్రమే. మెచ్యూరిటీ సమయానికి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 75 ఏళ్లు (ఆప్షన్ 2లో 60) ఉండాలి. పాలసీ వ్యవధి కనీసం 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 20 సంవత్సరాలు. కనీస హామీ మొత్తం (Sum Assured) రూ.1 లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. డెత్ బెనిఫిట్: ఆప్షన్ 1 కింద - సింగిల్ ప్రీమియానికి 1.25 లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్లో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఆప్షన్ 2 కింద - సింగిల్ ప్రీమియానికి 10 రెట్లు రిస్క్ కవరేజీ లభిస్తుంది.గ్యారెంటీడ్ అడిషన్: ప్రతి వెయ్యి రూపాయల బేసిక్ సమ్ అష్యూర్డ్పై రూ.85 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ వంటి అదనపు రైడర్లను కూడా జోడించుకోవచ్చు.రిస్క్ లేదా మెచ్యూరిటీ సమయంలో చెల్లింపు: మొత్తాన్ని ఒకేసారి లేదా నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక పద్ధతిలో పొందే అవకాశముంది. రూ.5 లక్షలకు రూ.7.12 లక్షలు18 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల వ్యవధికి రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్తో పాలసీ తీసుకుంటే.. సింగిల్ ప్రీమియం రూ.5,39,325 చెల్లించాలి. దీనికి ప్రతి ఏడాది గ్యారెంటీడ్ అడిషన్గా రూ.42,500 వస్తుంది.(మొత్తం రూ.2,12,500). ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తంగా రూ.7,12,500 లభిస్తుంది. ఒకవేళ చివరి సంవత్సరంలో రిస్క్ జరిగితే గరిష్టంగా రూ.9.17 లక్షలు ఎల్ఐసీ నుంచి లభిస్తాయి. -
ఏఐ డ్రోన్లకు భారీగా ఆర్డర్లు
ఏఐ ఆధారిత డ్రోన్ సొల్యూషన్స్ కోసం గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ విభాగాల నుంచి పలు కాంట్రాక్టులు లభించినట్లు డ్రోన్ టెక్నాలజీ సంస్థ గరుడా ఏరోస్పేస్ తెలిపింది. ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్తో ఒప్పందం ప్రకారం వార్షిక సర్వేల నిర్వహణ, గనుల మూసివేత ప్రణాళికల కోసం డిజిటల్ డేటాబేస్లను, సర్వే మ్యాప్లు మొదలైన వాటిని తయారు చేయాల్సి ఉంటుంది.అలాగే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తమిళనాడుకు చెందిన జియాలజీ, మేనింగ్ డిపార్ట్మెంట్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ టెండర్లను కూడా గరుడ ఏరోస్పేస్ దక్కించుకుంది. అటు ఝార్ఖండ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ నుంచి కూడా కాంట్రాక్టు లభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అగ్నీశ్వర్ జయప్రకాష్ చెప్పారు.తమ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్(డాస్) మోడల్ వినియోగం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని, తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఈ కాంట్రాక్టులు తోడ్పడతాయని వివరించారు. -
రూ.7.5 కోట్ల కారు.. బడా బిజినెస్మ్యాన్ కక్కుర్తి..
రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న ఫెరారీ లగ్జరీ సూపర్ కారును ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారులు పట్టుకున్నారు. ట్యాక్స్ కడతావా.. సీజ్ చేయమంటావా అని అధికారులు పట్టుబట్టడంతో కారు యజమాని రూ.1.42 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.రూ.7.5 కోట్ల విలువైన బ్రైట్ రెడ్ ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్ కారు కొన్ని నెలలుగా బెంగళూరు వీధుల్లో షికారు చేస్తోంది. ఈ లగ్జరీ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయిందని, అలాంటి వాహనాలపై అక్కడ లైఫ్టైమ్ ట్యాక్స్ రూ.20 లక్షలు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. ‘మహారాష్ట్రలో ఇలాంటి కార్లపై పన్ను రూ.20 లక్షలు కాగా, కర్ణాటకలో ఇది దాదాపు రూ.1.5 కోట్లు. ఈ వాహనం రెండేళ్ల క్రితం మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది’ అని రవాణా అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.జయనగర్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) అధికారులు నగరంలో తరచూ కనిపిస్తున్న ఫెరారీ కారుపై నిఘా పెట్టి పట్టుకున్నారు. డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని డ్రైవర్ తొలుత చెప్పాడు. కారు రిజిస్ట్రేషన్ను పరిశీలించిన అధికారులు కర్ణాటక పన్ను చెల్లించకుండా 18 నెలలకు పైగా బెంగళూరులో ఈ వాహనం తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏం చేయాలని అధికారులు తమ ఉన్నతాధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఫెరారీ కారు యజమాని అదే రోజు పన్నులు, జరిమానాల రూపంలో రూ.1.4 కోట్లు చెల్లించాడు.కాగా ఈ ఖరీదైన ఫెరారీ కారు యజమాని ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోని 55 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్త తక్కువ పన్ను రేటు కారణంగా మహారాష్ట్రలో తన ఫెరారీ కారును రిజిస్టర్ చేయించుకుని బెంగళూరులో తిప్పుతున్నన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కర్ణాటక నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రంలో ఏడాదికి పైగా బయటి రాష్ట్రాల వాహనాలను ఉపయోగించే వారు ఇక్కడ లైఫ్టైమ్ రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.పన్ను ఎగవేతకు పాల్పడిన లగ్జరీ కార్ల యజమానులపై బెంగళూరు ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కర్ణాటక వెలుపల రిజిస్టర్ అయిన హై ఎండ్ వాహనాల నుంచి రూ.40 కోట్ల బకాయిలు వసూలు చేశారు. -
‘ఆర్కామ్’తో సంబంధం లేదు: అంబానీ కంపెనీలు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ఖాతాను ఫ్రాడ్ అకౌంటుగా ఎస్బీఐ వర్గీకరించడమనేది తమ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావమూ చూపదని అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్లో (అడాగ్) భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ స్పష్టం చేశాయి. ఆర్కామ్తో తమకెలాంటి వ్యాపార, ఆర్థిక సంబంధాలు లేవని, తమ రెండు సంస్థలు వేర్వేరుగా లిస్టెడ్ కంపెనీలుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని స్టాక్ ఎక్స్ఛేంజీలకు విడివిడిగా తెలిపాయి.ఈ నేపథ్యంలో ఆర్కామ్పై ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ గవర్నెన్స్, మేనేజ్మెంట్, కార్యకలాపాలు, ఉద్యోగులు, షేర్హోల్డర్లపై ఎలాంటి ప్రభావమూ ఉండదని వివరించాయి. రుణాల మళ్లింపు ఆరోపణలతో ఆర్కామ్ ఖాతాను ఫ్రాడ్ అకౌంటుగా వర్గీకరించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఎస్బీఐ స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్కి ఇచ్చిన రుణాల్లో నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు కనిపించాయని పేర్కొంది. మొత్తం రూ.31,580 కోట్ల రుణాల్లో సుమారు రూ.13,667 కోట్లు ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,692 కోట్లు సంబంధిత సంస్థలకు మళ్లించారని తెలిపింది. -
హోమ్ లోన్ కస్టమర్లు మరింత హ్యాపీ..
హోమ్ లోన్ గ్రహీతలకు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా మరోసారి శుభవార్త చెప్పింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 7.45 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ఇది 7.50 శాతంగా ఉంది. అలాగే కొత్త రుణ గ్రహీతలకు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రెపో రేటును తగ్గించిన తరువాత గత జూన్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే గృహ రుణ రేట్లను 8.00 శాతం నుండి 7.50 శాతానికి తగ్గించింది. ఇప్పుడు వడ్డీ రేటును ఇంకాస్త తగ్గించడంతో హోమ్లోన్ కస్టమర్లకు మరింత ఉపశమనం కలగనుంది. ఈ తాజా తగ్గింపు గృహ యాజమాన్యం మరింత చౌకగా మారుతుందని, దేశంలోని గృహ రంగంలో డిమాండ్ను ఉత్తేజపరిచే ప్రభుత్వ విస్తృత ఆర్థిక లక్ష్యానికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.జీరో ప్రాసెసింగ్ ఫీజుగృహ రుణాలను మరింత చేరువ చేయడంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా హోమ్ లోన్కు దరఖాస్తు చేసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేసింది. ఇంతవరకూ ఈ బ్యాంక్ లోన్ మొత్తంలో అర శాతం వరకూ ప్రాసెసింగ్ రుసుముగా తీసుకొనేది. ఇది గరిష్టంగా రూ.15 వేల వరకూ ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం. కస్టమర్లు లోన్ కోసం బ్యాంక్ బ్రాంచిల్లోనే కాకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో బ్యాంక్ వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. -
రియల్ ఎస్టేట్లో ఆ పెట్టుబడులు తగ్గాయ్..
భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్) నీరసించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 33 శాతం తగ్గిపోయి 1.69 బిలియన్ డాలర్లు (14,365 కోట్లు)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా వెల్లడించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు ఇందుకు దారితీసినట్టు తెలిపింది.క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇనిస్టిట్యూషన్స్ 2.53 బిలియన్ డాలర్లను (రూ.21,505 కోట్లు) రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే సగానికి తగ్గి 1,048 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం 643 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 486 మిలియన్ డాలర్ల పెట్టుబడుల కంటే 32 శాతం అధికమయ్యాయి. దేశీ పెట్టుబడుల అండ.. ‘దేశీ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ మార్కెట్కు కీలక చోదకంగా మారాయి. భారత రియల్ ఎస్టేట్లో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 2021లో 16 శాతంగా ఉంటే, అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ 2024 నాటికి 34 శాతానికి చేరింది’ అని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాజ్ఞిక్ తెలిపారు. ఇక 2025 మొదటి ఆరు నెలల కాలంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో దేశీ పెట్టుబడుల వాటా 48 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడం.. అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సాయపడ్డాయని, మొదటి ఆరు నెలల్లో మొత్తం పెట్టుబడులు 3 బిలియన్ డాలర్లకు దూసుకువెళ్లాయని తెలిపారు.ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 15 శాతం తగ్గి 2,998 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మొదటి ఆరు నెలల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 2,594 మిలియన్ డాలర్ల నుంచి 1,571 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 53 శాతం ఎగసి 1,427 మిలియన్ డాలర్లకు చేరాయి. ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూప్లు, విదేశీ బ్యాంక్లు, ప్రొప్రయిటరీ బుక్లు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, ఎన్బీఎఫ్సీలు, లిస్టెడ్ రీట్లు సంస్థాగత పెట్టుబడిదారుల కిందకు వస్తాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 193.42 పాయింట్లు లేదా 0.23 శాతం పెరిగి 83,432.89 వద్ద ముగియగా, నిఫ్టీ 55.7 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 25,461 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ప్రతికూల దిశలో ఫ్లాట్ గా స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.03 శాతం పెరిగింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో, మెటల్ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. భారత్ పెట్రోలియం, ఐజీఎల్, ఇండియన్ ఆయిల్, మహానగర్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు లాభపడటంతో నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.05 శాతం లాభపడింది.నిఫ్టీ రియల్టీ, ఫార్మా, ఐటీ, బ్యాంక్, మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.57 శాతం క్షీణించి 12.32 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
వైజాగ్లో వొడాఫోన్ ఐడియా 5జీ.. మరిన్ని నగరాల్లోనూ..
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ 5జీ సర్వీసులను మరో 23 నగరాలకు విస్తరించింది. వీటిలో వైజాగ్తో పాటు జైపూర్, కోల్కతా, లక్నో తదితర సిటీలు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద రూ.299 నుంచి డేటా ప్లాన్లను అందిస్తున్నట్లు వివరించింది.కంపెనీ ఇప్పటికే ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చండీగఢ్, పట్నాలాంటి అయిదు నగరాల్లో 5జీ సేవలు అందిస్తోంది. 22 టెలికం సర్కిళ్లకు గాను 17 సర్కిళ్లలో 5జీ స్పెక్ట్రమ్ను వొడా–ఐడియా కొనుగోలు చేసింది.4జీ సేవలకు సంబంధించి సుమారు 65,000 సైట్లలో నెట్వర్క్ను పటిష్టం చేసుకున్నామని, కవరేజీని మెరుగుపర్చామని కంపెనీ పేర్కొంది. వచ్చే ఆరు నెలల్లో కొత్తగా 1 లక్ష టవర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. -
‘ఫేస్జిమ్’లో రిలయన్స్కు వాటా
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్వీఎల్) తాజాగా యూకే సంస్థ ఫేస్జిమ్లో మైనారిటీ వాటాను సొంతం చేసుకుంది. తద్వారా దేశీయంగా ఫేషియల్ ఫిట్నెస్, స్కిన్కేర్ బ్రాండును ప్రవేశపెట్టనుంది. తాజా పెట్టుబడులతో దేశీయంగా అధిక వృద్ధిలోనున్న సౌందర్యం, వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. అయితే వాటా కొనుగోలు విలువను వెల్లడించలేదు.ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురుఓమ్నిచానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్ఫామ్ ‘టిరా’ ద్వారా ఫేస్జిమ్ను భారత్లో ప్రవేశపెట్టేందుకు తాజా భాగస్వామ్యం వీలు కల్పించనున్నట్లు పేర్కొంది. రానున్న ఐదేళ్లలో ఫేస్జిమ్ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలియజేసింది. కీలక పట్టణాలలో స్టాండెలోన్ స్టుడియోలు, ఎంపిక చేసిన టిరా స్టోర్ల ద్వారా ఇందుకు అవకాశాలను సృష్టించనున్నట్లు వివరించింది. -
ఉద్యోగులకు త్వరలో తీపికబురు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2025 నుంచి కరువు భత్యం (డీఏ) 4 శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఈమేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 59 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రానుండగా ఆగస్టు లేదా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పండుగ సీజన్కు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.సీపీఐ డేటా ఆధారంగా..డీఏ లెక్కింపునకు ఆధారమైన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) 2025 మేలో 0.5 పాయింట్లు పెరిగి 144కు చేరింది. గత మూడు నెలల్లో సూచీ స్థిరమైన పెరుగుదలను చూపించింది. ఇది మార్చిలో 143, ఏప్రిల్లో 143.5, మేలో 144గా ఉంది. ఇండెక్స్ ఇదే జోరును కొనసాగించి జూన్లో 144.5కు పెరిగితే ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ 12 నెలల సగటు 144.17కు చేరుకుంటుందని అంచనా. 7వ వేతన సంఘం ఫార్ములాను ఉపయోగించి డీఏను సర్దుబాటు చేసినప్పుడు ఇది సుమారు 58.85% రేటుగా మారుతుంది. దాంతో 2025 జులై నుంచి 59 శాతం డీఏకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: పాత వాహనాలపై నిషేధం ఎత్తివేత7వ వేతన సంఘం డీఏ పెంపు ఫార్ములాడియర్నెస్ అలవెన్స్ను ఏడాదికి రెండుసార్లు జనవరి, జులైలో సవరిస్తారు. గత 12 నెలల్లో ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ డేటా సగటు ఆధారంగా ఈ డీఏను లెక్కిస్తారు. ఇందుకోసం ఉపయోగించే ఫార్ములా కింది విధంగా ఉంటుంది.డీఏ(%) = [(గత 12 నెలల సగటు సీపీఐ ఐడబ్ల్యూ- 261.42)/261.42]*100దాని ప్రకారం..డీఏ(%) = [(144.17-261.42)/261.42]*100=58.85 శాతం.ఇక్కడ, 261.42ను గతేడాది గణాంకాల ప్రకారం లెక్కింపునకు మూల విలువగా పరిగణిస్తారు. పై ఫ్యార్ములాలో మైనస్ వ్యాల్యూ వస్తుంది. దీన్ని సవరించి దనాత్మకంగా లెక్కిస్తారు. ఈ పద్ధతిని ఉపయోగించి ఈసారి డీఏ పెరుగుదలను 4 శాతంగా అంచనా వేశారు. -
పాత వాహనాలపై నిషేధం ఎత్తివేత
దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడానికి పాత వాహనాల నిషేధానికి సంబంధించి ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన విధానాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కేవలం వాహనాల కొనుగోలు తేదీని బట్టి ఆటోమేటిక్ స్క్రాపింగ్ లేదా సీజ్ చేసే ప్రక్రియను అధికారులు ఇకపై కొనసాగించరని పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు.పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలను ఢిల్లీలో నడపకుండా నిషేధించాలన్న దీర్ఘకాలిక విధానాన్ని ఈ నిర్ణయంతో నిలిపేశారు. వాస్తవ ఉద్గారాలతో సంబంధం లేకుండా తమ వాహనాలను బాగా నిర్వహించిన వారికి లేదా క్లీనర్ టెక్నాలజీలను ఏర్పాటు చేసిన వారికి ఇది నష్టం కలిగిస్తుందని కొందరి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.‘పాలసీ ఫ్రేమ్వర్క్పై పునరాలోచన చేస్తున్నాం. ఇప్పుడు కేవలం వాహనాల వయసుపై కాకుండా వాస్తవ ఉద్గారాలపై దృష్టి సారించాం’ అని సిర్సా విలేకరుల సమావేశంలో చెప్పారు. పాత వాహనాలనే కాకుండా కాలుష్య కారకాలను లక్ష్యంగా చేసుకునే శాస్త్రీయ, సాంకేతిక ఆధారిత విధానాన్ని తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇదీ చదవండి: ఏకకాలంలో నాలుగైదు ఉద్యోగాలు.. తీరా దొరికాక..రూ.లక్షలు పోగేసి కొన్న వాహనాలను మెరుగ్గా నిర్వహిస్తున్నా, నిబంధనలకు లోబడి కాలుష్యకారకాలను నియంత్రిస్తున్నా ఏకమొత్తంగా వాహనాల వయసురీత్యా పాలసీలు అమలు చేయడం తగదని కొందరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా విమర్శించారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. సోషల్మీడియాలో ‘రూ.84 లక్షలతో రేంజ్ రోవర్ కారు కొన్ని ఎనిమిదేళ్లు అవుతుంది. కొవిడ్ కారణంగా రెండేళ్లు ఇంట్లోనే పార్క్ చేశాను. మొత్తంగా ఆ కారులో 74 వేల కి.మీ మాత్రమే ప్రయాణించాను. కారు మంచి కండిషన్లో ఉంది. కానీ నిబంధనల ప్రకారం ఇప్పుడు చౌకగా అమ్మాల్సి వస్తుంది’ అనేలా పోస్టులు వెలిశాయి. -
ఏకకాలంలో నాలుగైదు ఉద్యోగాలు.. తీరా దొరికాక..
ఏకకాలంలో నాలుగైదు అమెరికా స్టార్టప్ల్లో ఉద్యోగం చేస్తూ వార్తల్లో నిలిచిన అమెరికాకు చెందిన భారతీయ టెక్ ప్రొఫెషనల్ సోహమ్ పరేఖ్ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించిన ఆయన అందుకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ఆర్థిక ఒత్తిళ్ల వల్లే తాను ఒకేసారి రిమోట్గా నాలుగైదు కంపెనీల్లో పని చేయాల్సి వచ్చిందన్నారు. అందుకు అత్యాశ కారణం కాదని తెలిపారు.బహుళ ఉద్యోగాలు.. అంగీకరించిన పరేఖ్టీబీపీఎన్ షోలో పాల్గొన్న పరేఖ్ను తనపై వస్తున్న ఆరోపణలు నిజమేనా అని ప్రశ్నించగా ఆయన వాటిని అంగీకరించారు. ‘నేను ఒకేసారి పలు కంపెనీల్లో పనిచేశాను. కొందరివల్ల అదికాస్తా వైరల్గా మారింది. ఈ ప్రక్రియలో నా ఉద్యోగ స్థితిగతులను తప్పుగా చూపించారు. వ్యక్తిగత లాభం కోసం అక్రమాలకు పాల్పడ్డారని పలువురు ఆరోపించారు. కానీ నేను లాభాపేక్షతో అలా చేయలేదు. ఆర్థిక ఒత్తిళ్లతోనే అలా బహుళ కంపెనీల్లో పని చేయాల్సి వచ్చింది’ అన్నారు.గర్వపడటం లేదు‘వారానికి 140 గంటలు పనిచేయడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ నా అవసరాన్ని బట్టి అలా చేయవలసి వచ్చింది’ అని వివరించారు. వృత్తిపరంగా మనుగడ, ఆర్థిక స్థిరత్వమే కీలకమని భావించి క్లిష్ట సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మీరు చట్టాలను ఉల్లంఘించారని విశ్వసిస్తున్నారా అని అడిగినప్పుడు, పరేఖ్ అందుకు పూర్తి బాధ్యత స్వీకరిస్తానని చెప్పారు. ‘నేను చేసిన పనికి గర్వపడటం లేదు. ఇది సమర్థించే విషయం కాదు’ అని అన్నారు. పలు ఉద్యోగాలు చేస్తూ జూనియర్ డెవలపర్లను ఉపయోగించుకున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు. అందులో నిజం లేదన్నారు.సోహమ్ పరేఖ్ ఎవరు?ముంబైకి చెందిన పరేఖ్ ఉన్నత చదువుల కోసం 2018లో అమెరికా వెళ్లాలని భావించాడు. కానీ ఆర్థిక సమస్యల వల్ల తాను వెళ్లడం ఆలస్యం అయింది. చివరకు 2020లో అమెరికాకు వెళ్లాడు. అతను 2020లో ముంబై విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత 2022లో జార్జియా టెక్ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశాడు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! మళ్లీ కరుగుతోన్న బంగారు కొండ..విశ్లేషణ సంస్థ మిక్స్ పానెల్ సహ వ్యవస్థాపకుడు సుహైల్ దోషి అమెరికా స్టార్టప్ కంపెనీలను సోహమ్ పరేఖ్ మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయన వెలుగులోకి వచ్చాడు. పరేఖ్ ఒకేసారి నాలుగైదు స్టార్టప్ల్లో పనిచేస్తున్నారని చెప్పారు. విమర్శలు వస్తున్నప్పటికీ పరేఖ్ ఈ వ్యవహారంతో పాఠాలు నేర్చుకున్నానని, ఆ తప్పులు పునరావృతం చేసే ఆలోచన లేదని చెప్పాడు. -
బిగ్ రిలీఫ్! మళ్లీ కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈ రోజు వినియోగదారులకు ఊరట కల్పించింది. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: జోరు చూపించిన సేవల రంగం(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:53 సమయానికి నిఫ్టీ(Nifty) 6 పాయింట్లు తగ్గి 25,401కు చేరింది. సెన్సెక్స్(Sensex) 18 ప్లాయింట్లు నష్టపోయి 83,224 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జోరు చూపించిన సేవల రంగం
సేవల రంగం జూన్ నెలలో బలమైన పనితీరు చూపించింది. ఇందుకు నిదర్శనంగా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజెనెస్ యాక్టివిటీ ఇండెక్స్ పది నెలల గరిష్ట స్థాయిలో 60.4 పాయింట్లకు చేరింది. మే నెలలో ఇది 58.8 పాయింట్ల వద్ద ఉంది. స్థానిక మార్కెట్ నుంచే కాకుండా ఎగుమతి మార్కెట్ల నుంచి కొత్త ఆర్డర్లు రావడం బలమైన పనితీరుకు దోహదం చేసింది. వ్యయాలు తగ్గడం మార్జిన్ల విస్తరణకు దోహదం చేసినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.2024 ఆగస్ట్ తర్వాత తొలిసారి కొత్త ఆర్డర్లు జూన్ నెలలో గణనీయంగా పెరిగాయి. దేశీ మార్కెట్లో కార్యకలాపాలు పెరగడం, ఎగుమతులు వృద్ధి చెందడం మెరుగైన పనితీరుకు సాయపడ్డాయి. ముఖ్యంగా ఆసియా, మధ్యప్రాచ్యం, యూఎస్ మా ర్కెట్ల నుంచి డిమాండ్ అధికమైందని భండారీ అంచనా వేశారు. వరుసగా 37వ నెలలోనూ జూన్లో ఉపాధి అవకాశాలు పెరిగినట్టు చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో వృద్ధి పట్ల 18% సేవల రంగ సంస్థలు సానుకూలంగా ఉన్నాయి. 2022 తర్వాత చూస్తే ఇదే కనిష్ట స్థాయి.ఇదీ చదవండి: ‘జియో డేటా సెంటర్లలో వాడే జీపీయూలు మావే’61పాయింట్లకు కాంపోజిట్ ఇండెక్స్తయారీ, సేవల రంగ కార్యకలాపాలను ప్రతిబింబించే హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ జూన్లో 61 పాయింట్లకు పెరిగింది. మే నెలలో ఇది 59.3గా ఉంది. 14 నెలల్లోనే ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. -
‘జియో డేటా సెంటర్లలో వాడే జీపీయూలు మావే’
ఇంజినీరింగ్ కోణంలో భారత్ తమకు అత్యంత కీలకమైన మార్కెట్గా ఉంటోందని ఏఎండీ జనరల్ మేనేజర్ (డేటా సెంటర్ జీపీయూ వ్యాపార విభాగం) ఆండ్రూ డీక్మాన్ తెలిపారు. టెల్కో దిగ్గజం రిలయన్స్ జియో తదితర సంస్థలు తమ డేటా సెంటర్లలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూ) ఉపయోగిస్తున్నట్లు వివరించారు. భారత్లో జియో తమకు ముఖ్యమైన భాగస్వామి అని కంపెనీ నిర్వహించిన అడ్వాన్సింగ్ ఏఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.దేశీయంగా ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏఎండీ పోటీ సంస్థ ఎన్విడియాతో జియో జట్టు కట్టిన నేపథ్యంలో ఆండ్రూ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏఎండీకి భారత్లో 8,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఏఐ చాలా పెద్ద మార్కెట్ అని, ఏ ఒక్క సంస్థకో ఇది పరిమితం కాదని ఆండ్రూ చెప్పారు. ఇదీ చదవండి: ఏటా ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్కు ప్రణాళికలుప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాల ప్రభుత్వాలకు ఏఐపరంగా తోడ్పాటు అందించడంపై ఏఎండీ కలిసి పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థలతో పోలిస్తే తమ చిప్లు తక్కువ ధరలో మరింత మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏఎండీ సీఈవో లీసా సూ చెప్పారు. -
ఏటా ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్కు ప్రణాళికలు
వచ్చే మూడేళ్ల పాటు వరుసగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మ్యాటర్ మోటర్ వర్క్స్ గ్రూప్ సీవోవో అరుణ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తమ ఎలక్ట్రిక్ గేర్డ్ బైక్ ‘ఏరా’ (ఏఈఆర్ఏ)ని ఢిల్లీ మార్కెట్లో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 60 డీలర్షిప్లను ప్రారంభించనున్నామని, వీటిలో అత్యధిక భాగం దక్షిణాదిలోనే ఉంటాయని సింగ్ వివరించారు.ఇదీ చదవండి: ఐపీవోకు మీషో రెడీప్రస్తుతానికి తాము మోటర్సైకిల్స్పైనే దృష్టి పెడుతున్నాయని, ఎలక్ట్రిక్ స్కూటర్ల యోచన లేదని చెప్పారు. తమ తొలి మోడల్ ఏఈఆర్ఏని ఆరేళ్ల పాటు రూపొందించామని, గతేడాది అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభించామని వివరించారు. తొలి ఏడాదిలో 10,000తో మొదలుపెట్టి రెండో ఏడాది 50,000–60,000 వరకు వాహనాలను విక్రయించే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. అహ్మదాబాద్లోని తమ ప్లాంటుకు ప్రతి నెలా 10,000 వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉందని సింగ్ తెలిపారు. -
ఐపీవోకు మీషో రెడీ
ఫ్యాషన్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్ ప్రొడక్టుల ఈకామర్స్ కంపెనీ మీషో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. సాఫ్ట్బ్యాంక్కు పెట్టుబడులున్న కంపెనీ గోప్యతా విధానంలో ముందస్తు ఫైలింగ్ను చేపట్టినట్లు తెలుస్తోంది. గత నెల 25న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఐపీవోకు ప్రాస్పెక్టస్ దాఖలుపై నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. లిస్టింగ్ ద్వారా కనీసం రూ. 4,250 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి.స్టాక్బ్రోకర్గా వన్ మొబిక్విక్సెబీ నుంచి గ్రీన్సిగ్నల్స్టాక్ బ్రోకర్, క్లియరింగ్ సభ్యులుగా వ్యవహరించేందుకు పూర్తి అనుబంధ సంస్థ మొబిక్విక్ సెక్యూరిటీస్ బ్రోకింగ్ (ఎంఎస్బీపీఎల్)కు అనుమతి లభించినట్లు మాతృ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ తాజాగా వెల్లడించింది. ఇందుకు నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. 2025 జులై1న సెబీ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అయినట్లు తెలియజేసింది. వెరసి ఎంఎస్బీపీఎల్ దేశీ స్టాక్ బ్రోకర్గా కొనుగోళ్లు, అమ్మకాలు, లావాదేవీలు, క్లియరింగ్, ఈక్విటీ లావాదేవీల సెటిల్మెంట్లు చేపట్టనున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదుతాజా లైసెన్స్ కారణంగా క్యాపిటల్ మార్కెట్లో సంపద పంపిణీ(వెల్త్ డి్రస్టిబ్యూషన్) విభాగంలో సేవలు మరింత విస్తరించేందుకు వీలుంటుందని తెలియజేసింది. తద్వారా సమీకృత ఫిన్టెక్ సంస్థగా అవతరించనున్నట్లు పేర్కొంది. మొబిక్విక్ గ్రూప్ అనుబంధ సంస్థ జాక్ ఈపేమెంట్ సర్వీసెస్(జాక్పే).. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా సేవలందించేందుకు ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. -
ఎలక్ట్రానిక్ కంపెనీల హవా
గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సరీ్వసెస్ (ఈఎంఎస్) రంగం దుమ్మురేపుతోంది. వ్యవస్థాగత వృద్ధికి పలు అంశాలు తోడవడంతో ఈ రంగంలోని కంపెనీలు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. చైనాయేతర తయారీ తదితర అంశాలతో ఏర్పడుతున్న డిమాండ్ ఈ రంగానికి బలాన్నిస్తోంది. దీంతో ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లో హవా చూపుతున్న ఈఎంఎస్ దిగ్గజాలు మరింత స్పీడందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మేకిన్ ఇండియాతో తయారీకి దన్నుగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు, చైనాయేతర దేశాలలో తయారీ యూనిట్ల ఏర్పాటుపై గ్లోబల్ దిగ్గజాల దృష్టి దేశీయంగా ఈఎంఎస్ కంపెనీలకు జోష్నిస్తోంది. దీనికితోడు కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఇండ్రస్టియల్, ఎనర్జీ, డిఫెన్స్, మెడికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల నుంచి పటిష్ట డిమాండ్ వీటికి జత కలుస్తోంది. వెరసి ఈఎంఎస్ రంగంలోని పలు లిస్టెడ్ కంపెనీలు కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇటు దేశీ డిమాండుకుతోడు అటు ఎగుమతులు సైతం పుంజుకోవడం కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. నిజానికి ఈ రంగంలో మార్జిన్లు తక్కువకావడంతో అధిక అమ్మకాల పరిమాణమే కంపెనీలకు లబ్ధిని చేకూరుస్తుంది. అయినప్పటికీ కొద్ది నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తోంది. భారీ అంచనాలు దేశీయంగా ఈఎంఎస్ రంగం 2022–23 నుంచి 2027–28 కాలంలో వార్షికంగా 25 శాతం వృద్ధి సాధించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 2027–28కల్లా రూ. 27.7 లక్షల కోట్లను తాకగలదని అంచనా వేశాయి. ఈ రంగం విలువ 2022లో రూ. 8.4 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ప్రకారం వేసిన అంచనాలివి. కాగా.. ప్రభుత్వం స్థానిక తయారీకి దన్నునిస్తూ ప్రోత్సాహకాలతో కూడిన పథకాలను ప్రవేశపెడుతోంది. తద్వారా గ్లోబల్ దిగ్గజాలను దేశీయంగా తయారీకి ఆహ్వానిస్తోంది. దేశీయంగా పటిష్టస్థాయిలో ఇంజనీరింగ్, డిజైన్ సామర్థ్యాలు అందుబాటులో ఉండటానికితోడు.. నైపుణ్యంగల మానవవనరులు చౌకగా లభిస్తాయి. అంతేకాకుండా ఈఎంఎస్ రంగానికి భారత్ భారీ మార్కెట్ కూడా. అధిక శాతం కంపెనీలు బీటూబీ కస్టమర్లపైనే దృష్టిపెడుతున్నాయి.కీలక రంగాల దన్ను అధిక మార్జిన్లకు వీలున్న ఏరోస్పేస్, ఇండ్రస్టియల్స్, ఆటోమోటివ్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆర్డర్లు లభిస్తుండటంతో లిస్టెడ్ కంపెనీల లాభదాయకత మెరుగుపడుతోంది. ఇందుకు దేశీ కంపెనీలు సంక్లిష్ట ప్రొడక్టుల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. దేశీయంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విస్తృతి తక్కువగా ఉండటం, వినియోగంపై వెచి్చంచగల ఆదాయాలు పుంజుకోవడం వంటి అంశాలు కంపెనీలకు అండగా నిలుస్తున్నాయి. తయారీలో స్థానికతకు ప్రాధాన్యత, అధిక విలువగల ప్రొడక్టుల తయారీలో నైపుణ్యం వంటి అంశాలతో లిస్టెడ్ దిగ్గజాలు దేశీయంగా ఈఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఫలితంగా ప్రపంచస్థాయిలో పోటీపడే తయారీ కేంద్రంగా భారత్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బలపడుతున్న ఆర్డర్ల బుక్ లిస్టెడ్ దిగ్గజాలకు బూస్ట్నిస్తోంది. దిగ్గజాల దూకుడు దేశీ లిస్టెడ్ దిగ్గజాలలో డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అవలాన్ టెక్నాలజీస్, సిర్మా ఎస్జీఎస్, సైయెంట్ డీఎల్ఎం, డేటా ప్యాటర్న్స్ ఇండియా తదితరాలున్నాయి. వీటిలో డిక్సన్, అంబర్ను మినహాయిస్తే మొత్తం ఆర్డర్ బుక్ విలువ గతేడాదికల్లా(2024–25) వార్షికంగా 23 శాతం పురోభివృద్ధిని సాధించింది. రూ. 16,300 కోట్లకు చేరింది. ఇక గతేడాది లిస్టెడ్ దిగ్గజాల మొత్తం ఆదాయం వార్షికంగా 84 శాతం జంప్చేసి రూ. 58,600 కోట్లను తాకింది. ఆదాయంలో డిక్సన్ 2 రెట్లు దూసుకెళ్లగా.. కేన్స్ 51 శాతం, అంబర్ 48 శాతం చొప్పున జంప్చేశాయి. ఇతర సంస్థల ఆదాయం సగటున 20 శాతానికిపైగా ఎగసింది. మొత్తం నిర్వహణ లాభం 73 శాతం పురోగమించి రూ. 3,500 కోట్లను తాకింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు ఓకే!
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3 శాతం పెరిగాయి. 19,048 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో చూస్తే భిన్నమైన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గినట్టు నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) లీజింగ్ మార్కెట్ మాత్రం బలమైన పనితీరు చూపించింది. → దేశవ్యాప్తంగా టాప్ 8 నగరాల్లో 2025 జనవరి–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 1,70,201 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోల్చి చూస్తే 2 శాతం తక్కువ. → ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు 2 శాతం నుంచి 14 శాతం మధ్య పెరిగాయి. → ఇళ్ల అమ్మకాల్లో 49 శాతం రూ.కోటి అంతకుమించి ధరల శ్రేణిలోనే ఉన్నాయి. మిగిలిన 51 శాతం ఇళ్ల ధరలు రూ.కోటిలోపు ఉన్నాయి. → ముంబై నగరంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎలాంటి మార్పు లేకుండా 47,035 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్ నగరంలో అమ్మకాలు కూడా పెద్ద మార్పు లేకుండా 9,370 యూనిట్లుగా ఉన్నాయి. → చెన్నై నగరంలో క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగి 26,795 యూనిట్లుగా నమోదయ్యాయి. → బెంగళూరులో అమ్మకాలు 3 శాతం తగ్గి 26,599 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో 8 శాతం తగ్గి 26,795 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో ఒక శాతం తగ్గాయి. 24,329 యూనిట్ల విక్రయాలు జరిగాయి. కోల్కతాలో అమ్మకాలు 11 శాతం తగ్గి 8,090 యూనిట్లకు పరిమితమయ్యాయి.జోరుమీదున్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ హైదరాబాద్ సహా టాప్–8 నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 41 శాతం పెరిగి 48.9 మిలియన్ (489 లక్షలు) చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. ఈ ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద లీజింగ్ 80–90 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుందని నైట్ఫ్రాంక్ అంచనా. → చెన్నైలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 68 శాతం వృద్దితో 5.1 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. → ముంబైలో మాత్రం క్రితం ఏడాది మొదటి ఆరు నెలల కాలం గణాంకాలతో పోల్చి చూస్తే 5 శాతం క్షీణించి 5.5 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపై 18.2 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో బలమైన వృద్ధి నమోదైంది. 27 శాతానికి పైగా పెరిగి 7.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → పుణెలో లీజింగ్ 17% వృద్ధితో 5.1 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. → కోల్కతాలో ఏకంగా 60 శాతం పెరిగి 1.1 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → అహ్మదాబాద్లో 51 శాతం తగ్గిపోయి 0.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. -
లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్.. ఆర్బీఐ కొత్త రూల్
వ్యక్తిగత, గృహ, వ్యాపార రుణాల గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని ఫ్లోటింగ్-రేట్ రుణాలకు వర్తించే ప్రీ-పేమెంట్ ఛార్జీలను రద్దు చేసింది. గృహ రుణాలు, వ్యాపార అవసరాల కోసం తీసుకున్నవి, వ్యక్తులు, ఎంఎస్ఈలు పొందిన రుణాలన్నింటికీ ఆర్బీఐ కొత్త నిబంధన వర్తిస్తుంది. 2026 జనవరి 1 లేదా ఆ తర్వాత మంజూరు చేసే లేదా పునరుద్ధరించే రుణాలు, అడ్వాన్సులకు ఈ నిబంధన వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది.ఈ మేరకు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు (కో-ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, అఖిల భారత ఆర్థిక సంస్థలు) ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వ్యాపారం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన ఏదైనా ఫ్లోటింగ్ రేటు టర్మ్-లోన్పై జప్తు ఛార్జీలు / ప్రీ-పేమెంట్ పెనాల్టీలను విధించడానికి వీల్లేదని ఆర్బీఐ సర్క్యులర్ తెలిపింది. ఎంఎస్ఈలకు సులభమైన, సరసమైన ఫైనాన్సింగ్ లభ్యత అత్యంత ముఖ్యమైనదని తెలిపింది.ఎంఎస్ఈలకు మంజూరు చేసిన రుణాల విషయంలో ముందస్తు చెల్లింపు ఛార్జీల విధింపునకు సంబంధించి నియంత్రిత సంస్థల (ఆర్ఈ) మధ్య భిన్నమైన పద్ధతులను ఆర్బీఐ పర్యవేక్షక సమీక్షల్లో గుర్తించింది. దీనిపై ఫిర్యాదులు, వివాదాలు కూడా వెల్లువెత్తాయి. ముసాయిదా సర్క్యులర్పై వచ్చిన స్పందన, ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆర్బీఐ ఇప్పుడు ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. -
ముందు లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.450 కోట్లతో ప్రచారం
ముంబై: బీమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే దిశగా జీవిత బీమా కంపెనీలు చేతులు కలిపాయి. రూ.450 కోట్లతో మూడేళ్ల పాటు పలు మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. సబ్సే పెహలే లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రచారాన్ని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ ప్రారంభించింది.అన్ని జీవిత బీమా కంపెనీలు తమ ప్రీమియం ఆదాయానికి అనుగుణంగా ఈ ప్రచారం కోసం నిధులు అందించనున్నాయి. ‘ఏటా రూ.150–160 కోట్ల వరకు ఖర్చు చేస్తాం. మూడేళ్ల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సరిపడా ఖర్చును సమకూర్చేందుకు ఇప్పటికే హామీ లభించింది’ అని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ చైర్మన్ కమలేష్ రావు తెలిపారు.గత కొన్ని సంవత్సరాల్లో బీమా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 2022–23లో జీవిత బీమా విస్తరణ జీడీపీలో 4% కాగా, 2023–24లో 3.7%కి, గత ఆర్థిక సంవత్సరంలో 3.2%కి తగ్గుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బీమా విస్తరణలో భారత్ 10వ స్థానంలో ఉంది. -
హెచ్ఎంఏ అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి హెచ్ఎంఏ తన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కార్యవర్గ సమావేశంలో అల్వాల దేవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈయన ఈరైడ్ విద్యుత్ వాహనాల సంస్థ వ్యవస్థాపకుడు.శరత్ చంద్ర మారోజును ఉపాధ్యక్షుడిగా, వాసుదేవన్ను కార్యదర్శిగా కార్యవర్గం ఎన్నుకుంది. కొత్త మేనేజ్మెంట్ కమిటీలో ఇంకా సిండిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శరత్ చంద్ర మారోజు, ఈక్విటాస్ బ్యాంక్ జాతీయ అధిపతి వాసుదేవన్, ధ్రుమతారు కన్సల్టెంట్స్ వ్యవస్థపకులు, సీఈఓ చేతనా జైన్, స్టెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకులు వి.శ్రీనివాసరావు, సిటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకర వెంకట కృష్ణ ప్రసాద్ ఉన్నారు.ఈ సందర్భంగా హెచ్ఎంఏ నూతనాధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, “వివిధ పరిశ్రమల్లో యాజమాన్య విధానాలను మరింత బలోపేతం చేయడంపై మేం ప్రధానంగా దృష్టిపెడతాం. అదే సమయంలో విద్యార్థుల సామర్థ్యాలను కూడా పెంపొందిస్తాం. వాళ్లను ఆంత్రప్రెన్యూర్లుగా లేదా కార్పొరేట్ ఉద్యోగాలకు సరిపోయేలా తీర్చిదిద్దుతాం” అని తెలిపారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) 1964 నుంచి నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ. సరికొత్త యాజమాన్య విధానాలపై యువ మేనేజర్లు, వృత్తినిపుణులు, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతుంది.