breaking news
Business
-
బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోతులం బంగారం22 క్యారెట్స్--రూ.1,42,050--రూ.850 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,54,970--రూ.920 తగ్గింపుచెన్నైలో22 క్యారెట్స్--రూ.1,42,050--రూ.850 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,54,970--రూ.920 తగ్గింపుదేశ రాజధాని ఢిల్లీలో..22 క్యారెట్స్--రూ.1,42,200--రూ.850 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,55,120--రూ.920 తగ్గింపుముంబై, బెంగళూరులో22 క్యారెట్స్--రూ.1,42,050--రూ.850 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,54,970--రూ.920 తగ్గింపుహైదరాబాద్లో ఈరోజు వెండి ధరకేజీ వెండి రూ.2,50,000. రూ.5000 తగ్గింపుఢిల్లీలో ఈరోజు వెండి ధరకేజీ వెండి రూ.2,45,000. రూ.5000 తగ్గింపు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రీల్స్, వీడియోల సంపాదనపై పన్ను
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో రీల్స్, వీడియోలతో ఆర్జిస్తున్న కంటెంట్ క్రియేటర్లు పన్నుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. నాన్-ఆడిట్ వర్గానికి చెందిన ఐటీఆర్ల సమర్పణకు ఆగస్టు 31 తుది గడువు కావడంతో ఆదాయ పన్ను శాఖ సోషల్ మీడియా సంపాదనపై దృష్టి సారించింది.ఆదాయ పన్ను చట్టం ప్రకారం, ఇన్ఫ్లుయెన్సర్ల ఆదాయాన్ని వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే లాభాలుగా పరిగణిస్తారు. ఐటీ శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా 16021 అనే ప్రొఫెషన్ కోడ్ను కేటాయించింది. యాడ్సెన్స్, స్పాన్సర్షిప్లు, అఫిలియేట్ మార్కెటింగ్ ఆదాయాలు దీని పరిధిలోకి వస్తాయి. బ్రాండ్ల నుంచి లభించే ఉచిత స్మార్ట్ఫోన్లు, విదేశీ పర్యటనలు, గిఫ్ట్ వోచర్లు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. సెక్షన్ 194R ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో బ్రాండ్ నుంచి పొందిన ఉచిత ప్రయోజనాల విలువ రూ.20,000 దాటితే సదరు కంపెనీ 10% టీడీఎస్ మినహాయిస్తుంది. ఆ వస్తువును క్రియేటర్ తన వద్దే ఉంచుకుంటే దాని విలువను ఆదాయంగా చూపి పన్ను చెల్లించాలి. ఈ వివరాలన్నీ ఏఐఎస్/ ఫామ్ 26ఏఎస్లో నమోదవుతాయి.మినహాయింపులు.. ఐటీఆర్ ఫారమ్కంటెంట్ తయారీకి అయిన కెమెరా టూల్స్ డిప్రిసియేషన్, సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్లు, ఇంటర్నెట్ బిల్లులు, ఎడిటర్ల జీతాలు, స్టూడియో అద్దె వంటి ఖర్చులను మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. క్రియేటర్లు ఐటీఆర్-3 లేదా సులభతర పన్ను విధానం కోసం ఐటీఆర్-4ను ఎంచుకోవచ్చు. ఆగస్టు 31 గడువు దాటితే సెక్షన్ 234F కింద రూ.5,000 వరకు లేట్ ఫీజుతో పాటు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి. కాబట్టి ప్రొఫెషనల్స్ సలహాతో గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయడం శ్రేయస్కరం.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
గ్లోబల్ నెగెటివ్ సంకేతాలు.. నష్టాల్లో మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 58 పాయింట్లు తగ్గి 24,096 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 166 పాయింట్లు నష్టపోయి 77,070 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.55బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 91.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.69 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.33 శాతం దిగజారింది.Today Nifty position 19-08-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
విద్యార్థులకు మార్కులు మాత్రమే సరిపోవు!
మారుతున్న వ్యాపార, సాంకేతిక విభాగంలో కేవలం విద్యాపరమైన మార్కులు, మెరిట్ మాత్రమే సరిపోవని.. భావోద్వేగ మేధస్సు (ఈక్యూ), స్వయం పరిశీలన, నాయకత్వ లక్షణాలే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయని కార్పొరేట్ రంగ నిపుణులు నొక్కిచెప్పారు. ఇటీవల హైదరాబాద్లోని విశ్వ విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ (వీవీఐఎస్ఎం) నిర్వహించిన 21వ పీజీడీఎం బ్యాచ్ ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.సమావేశంలో మాట్లాడిన సంస్థ అధ్యక్షుడు జి.ఎస్.ఎస్.వెంకటేశ్వరరావు విద్యార్థుల్లో వ్యవస్థాపక దృక్పథం పెంపొందాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ వి.జయశ్రీ వి మాట్లాడుతూ.. సాంప్రదాయ ప్రమాణాలకు భిన్నంగా నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని కొత్త అధ్యయన ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. గ్లోబల్ మార్కెట్కు తగ్గట్టుగా మల్టీ- డిసిప్లినరీ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం ద్వారా లీడర్షిప్ స్థానాలకు చేరుకోవచ్చని గ్లోబల్ కన్సల్టింగ్ ఎక్స్పర్ట్ లక్ష్మీ నాయర్ పేర్కొన్నారు. -
జెన్-జీ స్టైల్లో బ్యాంకింగ్
బ్యాంకింగ్ సేవలను యువతకు చేరువ చేయడంపై ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. వారి అంచనాలకు అనుగుణంగా బ్యాంకింగ్ మరింత సరళతరంగా, వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లు నిరంతరాయం అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. యువత బ్రాంచీలకి వచ్చే వరకు వేచి చూడటం కాకుండా, బ్యాంకులే నేరుగా వారి వద్దకు వెళ్లాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 16 ఏళ్లు పైబడిన వారికి చేరువయ్యేలా అక్టోబర్ 2 నుంచి నెలరోజుల పాటు ‘బ్యాంకింగ్ ఫర్ యూత్’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు.అకౌంట్లు తెరవడం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు వివిధ అంశాలపై యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని పీఎస్బీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ఇందుకోసం కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఇతరత్రా క్యాంపస్లు మొదలైనవి అనువైన ప్రదేశాలుగా ఉంటాయని మంత్రి చెప్పారు. యువతను ఆకర్షించేందుకు 12 పీఎస్బీల్లోని ప్రతి బ్యాంకు సొంత వ్యూహాలను రూపొందించుకోవాలని చెప్పారు. వారు కేవలం అకౌంటు తెరవడానికే పరిమితం కాకుండా కెరియర్ ఆసాంతం, ఆ తర్వాత కూడా దీర్ఘకాలికంగా తమ బ్యాంకుతో అనుబంధాన్ని పెంపొందించుకునేలా చూసుకోవాలని అన్నారు.‘మొదటి అకౌంటు తెరవడం, మొదటిసారిగా జీతం తీసుకోవడం, ఉన్నత విద్య అవసరాలు, వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం లేదా తొలిసారిగా పెట్టుబడి పెట్టడం.. ఇలా ఏ విషయమైనా కావచ్చు యువ భారతీయులు ముందుగా ప్రభుత్వ రంగ బ్యాంకునే ఎంచుకునే విధంగా ఉండాలి. పీఎస్బీలు వారి జీవితాల్లో భాగంగా మారాలి’ అని ఆమె పేర్కొన్నారు. ఉచిత కంటెంట్.. యువ కియోస్క్లు..యువతను బ్యాంకింగ్ పరిధిలోకి తెచ్చే దిశగా పేరొందిన విద్యా సంస్థల భాగస్వామ్యంతో బ్యాంకులు ఉచితంగా ఆన్లైన్ లెర్నింగ్ కంటెంట్ అందించవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ఫిట్నెస్ సెంటర్లు, యోగా సెంటర్ల కోసం కూపన్లు, వోచర్లలాంటి లైఫ్స్టయిల్ ఆధారిత ప్రయోజనాలు ఇవ్వడం ద్వారా యువతను ఆకట్టుకోవచ్చన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో యువతకు సహాయం చేసేలా బ్యాంకుల శాఖల్లో ఒక ఉద్యోగిని కేటాయించి యువ బ్యాంకింగ్ మిత్ర యువ కియోస్క్ల్లాంటివి ఏర్పాటు చేయొచ్చని చెప్పారు. వివిధ రుణ సాధనాలు, ప్రభుత్వ స్కీములు, క్రెడిట్ స్కోర్ల ప్రాధాన్యత గురించి తెలియజేయాలని మంత్రి తెలిపారు. యువతలో బ్యాంకింగ్పై అవగాహన పెంచేందుకు ఐబీఏ ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. తమ అవసరాలకు అనుగుణమైన బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అవకాశాల గురించి యువతకు అర్థమయ్యే విధంగా ఇది ఉండాలని మంత్రి చెప్పారు.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
స్కోడా డీజిల్ ఈజ్ బ్యాక్!
స్కోడా ఇండియా అయిదేళ్ల విరామం తర్వాత భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోని డీజిల్ విభాగంలోకి మళ్లీ అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తన ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెడాన్ ‘ఆల్–న్యూ సూపర్బ్’ డీజిల్ వెర్షన్ను మంగళవారం ఆవిష్కరించింది. ‘‘స్కోడా ఫ్లాగ్షిప్ లగ్జరీ సెడాన్ ‘సూపర్బ్ టీడీఐ’ డీజిల్ పవర్ట్రెయిన్తో రావడం వల్ల దీని ఆకర్షణ మరింత పెరుగుతుంది. భారతీయ వినియోగదారులకు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యం’’ అని స్కోడా ఆటో తెలిపింది. దేశంలో బీఎస్–6 ఉద్గార నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే స్కోడా ఇండియా తన డీజిల్ మోడళ్ల విక్రయాలను నిలిపివేసింది.భారత్ కోసం ప్రత్యేక ప్లాట్ఫాంపై ‘స్లావియా’సరికొత్త ఆకర్షణీయమైన ఫీచర్లతో ‘స్లావియా’ కారును కూడా కంపెనీ ఆవిష్కరించింది. భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా ఎంక్యూబీ–ఏ0–ఇన్ ప్లాట్ఫామ్పై ‘స్లావియా’ను రూపొందించినట్లు తెలిపింది. ఇది దేశంలోని అత్యంత విజయవంతమైన సెడాన్లలో ఒకటిగా నిలిచిందని పేర్కొంది. కొత్త స్లావియా మెరుగైన స్టైలింగ్, సరికొత్త సాంకేతికత, సెగ్మెంట్లో తొలిసారిగా అందిస్తున్న ఫీచర్లు, అధిక సౌకర్యాలను అందిస్తుందని తెలిపింది. అలాగే డ్రైవింగ్ అనుభూతి, ప్రాక్టికాలిటీ, భద్రత వంటి అంశాలను కొనసాగించినట్లు పేర్కొంది. ఇదే సందర్భంగా స్పోర్టియర్ వెర్షన్ ‘ఆక్టేవియా ఆర్ఎస్’ మోడల్ను కూడా భారత్లోకి తిరిగి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.‘‘ స్కోడా కీలకమైన గ్లోబల్ వృద్ధి మార్కెట్లలో భారత్ అత్యంత కీలకమైంది. స్లావియా మా విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. స్పష్టమైన వ్యూహం, బలమైన స్థానిక ఉనికితో భారత్లో మా వృద్ధి ప్రయాణానికి తదుపరి అధ్యాయం లిఖిస్తున్నాము’’ అని స్కోడా ఆటో సీఈవో క్లాస్ జెల్మర్ తెలిపారు.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
పాత బండ్లకు E10 కావాల్సిందే!
పాత వాహనాలను వినియోగించే కోట్లాది మంది ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఇథనాల్ (ఈ10) కలిగిన పెట్రోల్ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారి సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన ఈ20 పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దేశీయ వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా గతేడాది ఈ20ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1 నుంచి బంకుల్లో విక్రయించే పెట్రోల్కు ఇదే ప్రామాణికంగా మారింది.వెల్లువెత్తిన ఫిర్యాదులుఈ20 పెట్రోల్ వాడకం వల్ల బీఎస్–6కు ముందు మోడల్ వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు ఆటో విడిభాగాలు దెబ్బతినడం వంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆరోపణలను పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చుతూ వస్తోంది. పలు రకాల ఇంధనాలను ఏకకాలంలో సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి నిర్వహించడం సాధ్యం కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదులను పూర్తిగా తోసిపుచ్చడం సరికాదని అనంత నాగేశ్వరన్, ఆకాష్ పూజారి ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’లో రాసిన అభిప్రాయ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ అభిప్రాయాలు తమ వ్యక్తిగతమైనవని స్పష్టం చేశారు. మైలేజీపై 6–7 శాతం ప్రభావంసాధారణ పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో శక్తి తక్కువగా ఉండటంతో ఈ20 వాడకం వల్ల లీటరుకు వాహనం ప్రయాణించే దూరం కొంత తగ్గుతుందని నాగేశ్వరన్, పూజారి అంగీకరించారు. అయితే దీని ప్రభావం 6–7 శాతం మేరకే ఉంటుందని అంచనా వేశారు. ఈ20కు అనుకూలంగా రూపొందించిన వాహనాల్లో ఇంజిన్ అరుగుదల పెరుగుతుందనడానికి భారత్, అమెరికాలో నిర్వహించిన పరీక్షల్లో ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.ఈ20 వద్దే పరిమితం చేయాలిఇథనాల్ విధానం వల్ల చెరకు రైతులకు బకాయిల చెల్లింపులు వేగవంతం కావడం, గ్రామీణ ఆదాయా లు పెరగడం వంటి సానుకూల ఫలితాలు ల భించాయని నాగేశ్వరన్, పూజారి పేర్కొన్నారు. అ యితే ఇథనాల్ మిశ్రమాన్ని మరింత పెంచే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆహార భద్రత, ఇంధన అవసరాల మధ్య సమతుల్యతపై సమగ్రంగా అంచనా వేసే వరకు ఇథనాల్ బ్లెండింగ్ను ఈ20 వద్దే పరిమితం చేయాలని అభిప్రాయపడ్డారు. ఇథనాల్ కొనుగోలు ధరలు, నీటి వినియోగ నిబంధనలు, ఈ10 పెట్రోల్ లభ్య త వంటి విధానాలను అవసరానికి అనుగుణంగా మార్చుకునే అంశాలపై ముందుగా దృష్టి పెట్టా లని సూచించారు. ‘‘ఇది కేవలం ఇంజిన్ల సమస్య కాదు. మనం ఏ పంటలను సాగు చేయాలి.. భవిష్యత్తులో ఏ నిర్ణయాలను వెనక్కి తీసుకోలేం అనేదే అసలు ప్రశ్న’’ అని వారు పేర్కొన్నారు.ఆహార భద్రతకు ముప్పుఇథనాల్ మిశ్రమాన్ని ఈ20కి మించి పెంచితే ఆహార పంటలు, ఇంధన అవసరాల మధ్య పోటీ పెరిగే ప్రమాదం ఉందని సీఈఏ అనంత నాగేశ్వరన్, ఆకాష్ పూజారి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ తయారీకి ఉపయోగించే ముడిసరుకులో మొక్కజొన్న వాటా సుమారు 50 శాతం కాగా, ఇతర ధాన్యాలతో కలిపి ఇది 67 శాతానికి చేరిందని తెలిపారు. మొక్కజొన్న సాగు పెరగడం వల్ల సోయాబీన్, వేరుశనగ, ఆవాలు వంటి నూనెగింజల సాగు భూమితో పోటీ పెరిగి, వంటనూనెల దిగుమతులపై ఆధారపడటం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే ఇథనాల్ ఉత్పత్తిలో వర్షపు నీటితో పాటు నదులు, కాలువలు, భూగర్భ జలాల నుంచి వినియోగించే ‘బ్లూ వాటర్’ పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.పాత ద్విచక్ర ఇవాహనాలకు ఇథనాల్ సెగదేశంలో బీఎస్–4కు ముందు తయారైన, కార్బొరేటర్లతో నడిచే పాత ద్విచక్ర వాహనాలు సుమారు 8 కోట్ల వరకు ఉన్నాయని నాగేశ్వరన్, పూజారి తెలిపారు. ఈ వాహనాల్లోని కారŠుబ్యరేటర్లు ఈ20 పెట్రోల్లో ఉండే అదనపు ఆక్సిజన్కు అనుగుణంగా ఇంధన సరఫరాను సర్దుబాటు చేయలేవని పేర్కొన్నారు. దీంతో ఇంజిన్ అధిక వేడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ఇథనాల్ను తట్టుకునేలా రూపొందించని పాత రబ్బర్ సీల్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో పాత వాహనాల్లో అవసరమైన మార్పులు పూర్తయ్యే వరకు ఈ20తో పాటు ఈ10 పెట్రోల్ను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇథనాల్కు అనుకూలమైన విడిభాగాలను అమర్చేందుకు పెద్దగా ఖర్చు కాకపోయినా, దేశవ్యాప్తంగా కోట్లాది వాహనాల్లో ఈ మార్పులు పూర్తి చేయడానికి ఏళ్లు పట్టవచ్చని పేర్కొన్నారు. ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
చిన్న నగరాల్లో డాలర్ రష్!
ఇప్పటిదాకా భారీ వినియోగంతో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్న మెట్రోలతో చిన్న నగరాలు కూడా తగ్గేదేలే అంటూ పోటీ పడుతున్నాయి. పెరుగుతున్న ఆదాయాలు, మారుతున్న జీవనశైలితో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల ప్రజలు ఖర్చు విషయంలో కొత్త అడుగులు వేస్తున్నారు. కిరాణా సరుకుల నుంచి ప్రీమియం ఉత్పత్తుల వరకు.. ఇళ్ల కొనుగోలు నుంచి పెట్టుబడుల వరకు.. ఆన్లైన్ షాపింగ్ నుంచి ఫారిన్ టూర్లు, విదేశీ విద్య దాకా.. చిన్న పట్టణాల్లో వినియోగం తీరు వేగంగా మారుతోంది. ఈ మార్పు డాలర్లకు డిమాండ్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. థామస్ కుక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం విదేశీ కరెన్సీ (ఫారెక్స్) డిమాండ్లో టైర్–2, టైర్–3 నగరాల వాటా మెట్రోలను మించి 53 శాతానికి దూసుకెళ్లడం విశేషం! – సాక్షి, బిజినెస్ డెస్క్ దశాబ్దం క్రితం విదేశీ టూర్లు, విదేశీ విద్యకు మెట్రోలు, పెద్ద నగరాల నుంచే డిమాండ్ భారీగా ఉండేది. ఒకప్పుడు సెకండరీ మార్కెట్లుగా పరిగణించిన చిన్న నగరాల ప్రజలు కూడా ఇప్పుడు విదేశీ ప్రయాణాలకు లగేజీ సర్దేస్తున్నారు. దేశంలో భారీగా పెరుగుతున్న మిడిల్ క్లాస్ గత కొన్నేళ్లుగా ఫారిన్ టూర్లపై ఖర్చుకు వెనకాడటం లేదనడానికి వారి డాలర్ డిమాండే నిదర్శనం. థామస్ కుక్ ఇండియా ఫారెక్స్ నివేదిక–2026 ప్రకారం.. దేశంలోని మొత్తం ఫారెక్స్ డిమాండ్లో టైర్–2 నగరాల వాటా 41 శాతం కాగా, టైర్–3 నగరాల వాటా 12 శాతంగా నమోదైంది.అంటే మొత్తం 53 శాతం. ఇక మెట్రోలు, ఇతర టైర్–1 నగరాల వాటా 47 శాతానికి పరిమితమైంది. విదేశీ కరెన్సీ కొనుగోళ్లకు అత్యధికంగా విదేశీ విహారయాత్రలే దన్నుగా నిలుస్తున్నాయి. వీటి వాటా 57 శాతం. కార్పొరేట్ ప్రయాణాలకు 27 శాతం, విదేశీ విద్య కోసం 16% చొప్పున ఫారెక్స్ డిమాండ్ నమోదైంది. ఇక వయస్సు పరంగా చూస్తే 25–40 ఏళ్ల ట్రావెలర్స్ నుంచి 37% ఫారెక్స్ కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. 41–60 ఏళ్ల వారి వాటా 36 శాతంగా ఉంది. మిలీనియల్స్, జెన్–ఎక్స్ వాటా మొత్తం ఫారెక్స్ డిమాండ్లో మూడొంతులు ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఇక మొత్తం ఫారెక్స్ కొనుగోళ్లలో అమెరికా డాలర్ల వాటా 49% కాగా.. యూరో, పౌండ్ల వాటా 23 శాతంగా ఉంది. మిగిలిన వాటా ఆసియా కరెన్సీలు (11%), పశి్చమాసియా (9%) కరెన్సీలది. మరోపక్క, కరెన్సీ కొనుగోళ్లలో డిజిటల్ జోరు పెరుగుతోంది. థామస్ కుక్ ఇండియా తమ డిజిటల్ ఫారెక్స్ చానెల్స్ ద్వారా కరెన్సీ కొనుగోళ్లు ఏడాదిలో 25% ఎగబాకిందని తెలిపింది. అయితే, ఇప్పటికీ 75 శాతం ఫారెక్స్ లావాదేవీలు బ్రాంచ్ల ద్వారానే జరుగుతుండటం గమనార్హం.ఖరీదైన జీవనశైలికి మొగ్గు చిన్న పట్టణాల ప్రజలు కేవలం రోజువారీ అవసరాలపైనే కాకుండా ప్రీమియం ఉత్పత్తులు, ట్రావెల్, జీవనశైలికి సంబంధించిన సేవలపై భారీగా ఖర్చు చేస్తున్నారు. ఆదాయాలు పెరుగుతుండటంలో కొంగొత్త అనుభవాలు, అనుభూతుల కోసం ఎంత ఖర్చయినా సై అంటున్నారు. ముఖ్యంగా దుస్తులు, లైఫ్స్టయిల్ ప్రోడక్టులు, విహార యాత్రల కోసం అధికంగా వెచ్చిస్తుండటం విశేషం. ఇదిలాఉంటే, ఇళ్ల అమ్మకాల్లో కొత్తగా లగ్జరీ ట్రెండ్ కనిపిస్తోంది.2025లో టైర్–2 నగరాల్లో ఇళ్ల అమ్మకాల సంఖ్య 10% తగ్గినా.. మొత్తం లావాదేవీల విలువ మాత్రం రూ.1.48 లక్షల కోట్ల వద్ద నిలకడగా ఉంది. తక్కువ ఇళ్లు కొన్నా.. ఖరీదైన ఇళ్ల వైపు కొనుగోలుదారులు మొగ్గుచూపినట్లు వెల్లడైంది. అంటే ప్రీమియమైజేషన్ అనేది మెట్రోలను దాటి చిన్న నగరాలకు విస్తరిస్తోందన్నమాట. సెబీ అర్బన్ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుదల, వినియోగదారుల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని నిపుణులు చెబు తున్నారు. రిటైల్.. రయ్రిటైల్ వినియోగంలో చిన్న నగరాలు, పట్టణాలు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. వృద్ధిలో మెట్రో నగరాలను గతేడాదే దాటేశాయి. ముఖ్యంగా 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న సెమీ రూరల్, టైర్ 3–5 మార్కెట్లలో డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. దీంతో ఎఫ్ఎంసీజీ కంపెనీల నుంచి వాహన సంస్థల దాకా చిన్న పట్టణాలపై మరింత ఫోకస్ చేస్తున్నాయి. భవిష్యత్తు వృద్ధి అవకాశాల కోసం విస్తరణ బాట పడుతున్నాయి. మరోపక్క, చిన్న నగరాల్లో సేవలందిస్తున్న ప్రాంతీయ రిటైల్ కంపెనీలు సైతం ఇప్పుడు నిధుల సమీకరణ కోసం పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) బాట పడుతుండటం విశేషం!పెట్టుబడుల్లోనూ నయా ట్రెండ్...చిన్న నగరాలు, పట్టణాలు వినియోగంలోనే కాదు పెట్టుబడుల్లోనూ సత్తా చాటుతున్నారు. పొదుపు, మదుపులోనూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. బంగారం, స్థిరాస్థి కొనుగోళ్లకే పరిమితం కాకుండా సంపద సృష్టి కోసం ప్రత్యామ్నాయ ఆర్థిక సాధనాల వైపు మళ్లుతున్నారు. టైర్–2, 3 నగరాల నుంచి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు భారీగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. చిన్న పట్టణాల నుంచి కొత్త డీమ్యాట్ ఖాతాలు విపరీతంగా నమోదవుతుండటం వారిలో ఆర్థిక అవగాహన, అదనపు ఆదాయాల పెరుగుదలను సూచిస్తోందనేది మార్కెట్ వర్గాల మాట! -
3.6 మిలియన్ ఉద్యోగుల డేటా చోరీ?.. టీసీఎస్తో సహా ఇతర టెక్ దిగ్గజ సంస్థలు
ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగుల డేటా చోరీకి గురైనట్లు ఓ థ్రెట్ యాక్టర్ చేసిన ఆరోపణలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. ‘హ్యాట్మాన్’ అనే సైబర్ నేరస్తుడు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగిస్తున్న పలు కంపెనీల వ్యవస్థల్లోకి చొరబడి సుమారు 36.4 లక్షల రికార్డులను దొంగిలించినట్లు ప్రకటించాడు. ఈ డేటాను ఆన్లైన్లో విక్రయానికి ఉంచినట్లు సైబర్ సెక్యూరిటీ నివేదికలు వెల్లడించాయి. అయితే, ఈ డేటా లీక్పై సంబంధిత సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.ప్రపంచవ్యాప్తంగా డేటా లీక్కు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వాటిలో మెక్డొనాల్డ్స్, గ్యాప్ ఇన్క్., వొడాఫోన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇంటర్కాంటినెంటల్ హోటల్స్ గ్రూప్, కైండ్రిల్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు చెందిన ఉద్యోగుల డేటా తన వద్ద ఉందని సైబర్ నేరస్తుడు పేర్కొన్నాడు.జూలై 31 నుంచి వరుసగా పలు డేటాబేస్లను విక్రయానికి ఉంచినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. మొత్తం తొమ్మిది లిస్టింగ్స్లో 36 లక్షలకు పైగా రికార్డులు ఉన్నాయని అతను పేర్కొన్నాడు.ఈ ఆరోపణల్లో అత్యంత పెద్ద డేటాబేస్ మెక్డొనాల్డ్స్కు సంబంధించినదిగా చెబుతున్నారు. సుమారు 17 లక్షలకు పైగా ఉద్యోగుల రికార్డులు తన వద్ద ఉన్నాయని హ్యాట్మాన్ పేర్కొన్నాడు. ఇందులో ఉద్యోగుల పేర్లు, ఎంప్లాయీ ఐడీలు, ఈమెయిల్ అడ్రస్లు, ఉద్యోగ హోదాలు, ఫోన్ నంబర్లు, పోస్టల్ అడ్రస్లు, సర్వీస్ అకౌంట్లు, ఇతర అంతర్గత టెనెంట్ వివరాలు ఉన్నాయని అతను చెప్పినట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ వార్తా సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్ నివేదించింది. -
వెయిటర్ ఉద్యోగాలు కూడా పోతాయా?
ఏఐ రావడంతో చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికి కూడా ఈ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక రోబో వెయిటర్ పని చేస్తోంది. దీంతో వెయిటర్ ఉద్యోగాలు కూడా పోతాయా? అనే సందేహం కలుగుతోంది.హర్యానాలోని ఒక డాబాలో రోబోట్ వెయిటర్ నేరుగా వినియోగదారుల టేబుళ్ల వద్దకే ఆహారాన్ని అందిస్తోంది . ముందుగా నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడానికి వీలు కల్పించే నావిగేషన్ సిస్టమ్ను ఉపయోగించి, ఈ రోబోట్ స్వయంగా ఫుడ్ ట్రేలను నిర్దేశిత టేబుళ్లకు తీసుకువెళుతుంది. ఆర్డర్ సిద్ధమైన తర్వాత, సిబ్బంది ఆహారాన్ని దాని ట్రేలో ఉంచుతారు, మరియు ఆ రోబోటిక్ వెయిటర్ కేటాయించిన టేబుల్ వైపు బయలుదేరుతుంది.కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ రెడీ అయిన తర్వాత దాన్ని ట్రేలో పెట్టి రోబోపై ఉంచుతారు. ఆ తర్వాత అది తనకు కేటాయించిన టేబుల్ దగ్గరకు స్వయంగా వెళ్లి ఫుడ్ను తీసుకెళ్తుంది. ప్రత్యేకమైన నావిగేషన్ సిస్టమ్ సహాయంతో నిర్ణయించిన మార్గంలో కదులుతుంది. అవసరమైనప్పుడు రిమోట్ కంట్రోల్తో కూడా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు.Waiter's Job Gone! At Resham Dhaba in Murthal Sonipat, customers are being served by a robot waiter instead of a human. The robot is delivering food directly to customers’ tables, leaving many visitors amazed. More Details: https://t.co/zpoJ4Q5isE#Murthal @robot pic.twitter.com/6tLohvY0mO— Vinod Katwal (@Katwal_Vinod) August 17, 2026ఆకట్టుకుంటున్న రోబో వెయిటర్ఫైబర్తో తయారు చేసిన రోబో బాడీ, కళ్లలో మెరిసే ఎల్ఈడీ లైట్లు దీనికి ప్రత్యేకమైన లుక్ను ఇస్తున్నాయి. ముఖ్యంగా ఎరుపు రంగులో వెలిగే లైట్లు చూసేందుకు ఆసక్తికరంగా ఉన్నాయి. రోబో డాబాలో తిరుగుతూ ఫుడ్ సర్వ్ చేయడంతో కస్టమర్లు దాన్ని వీడియోలు, ఫొటోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ రోబో ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 1.5 నుంచి 2 గంటల వరకు పనిచేస్తుంది. దీనిని బెంగళూరుకు చెందిన ఓ టీమ్ సహకారంతో ఈ రోబోను అభివృద్ధి చేశారు.వెయిటర్ ఉద్యోగాలు పోతాయా?ఇక ఉద్యోగాలు పోతాయా అనే విషయానికి వస్తే.. రెస్టారెంట్లు, హోటళ్లలో AI ఆధారిత రోబోట్లు క్రమంగా అడుగుపెడుతున్నాయి. కస్టమర్లకు ఆహారం తీసుకెళ్లడం, ఆర్డర్లు అందించడం, టేబుళ్లను గుర్తించడం వంటి పనులను ఇవి చేయగలుగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో వెయిటర్ల ఉద్యోగాలు తగ్గిపోతాయా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా సిబ్బంది కొరత, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉన్న చోట్ల రోబోట్లను ఉపయోగించడం యజమానులకు ఆకర్షణీయంగా మారుతోంది.అయితే.. వెయిటర్ల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే కస్టమర్లతో మాట్లాడటం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్యలను పరిష్కరించడం, వ్యక్తిగత సేవ అందించడం వంటి పనులను రోబోట్లు ఇప్పటికీ పూర్తిగా భర్తీ చేయలేవు. అందువల్ల రోబోట్లు వెయిటర్లను పూర్తిగా భర్తీ చేయడం కంటే, వారి పనిలోని కొన్ని సాధారణ బాధ్యతలను చేపట్టే అవకాశం ఎక్కువ. భవిష్యత్తులో వెయిటర్లు - రోబోట్లు కలిసి పనిచేసే విధానం పెరగవచ్చు. -
అందుకే.. టాటా సన్స్ AGM వాయిదా!
టాటా సన్స్ 108వ వార్షిక సాధారణ సమావేశం (AGM) ఆగస్టు 18న జరగాల్సి ఉండగా, అవసరమైన కోరం లేకపోవడంతో తొలిసారిగా వాయిదా పడింది. కోరంకు కీలకమైన.. రెండు అతిపెద్ద టాటా ట్రస్టులైన సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ల ఉమ్మడి ప్రతినిధులు సమావేశానికి హాజరు కాకపోవడమే దీనికి కారణం. (కోరం అంటే.. కంపెనీ సమావేశాన్ని చట్టబద్ధంగా నిర్వహించడానికి తప్పనిసరిగా ఉండాల్సిన కనీస సభ్యులు లేదా వారి ప్రతినిధుల హాజరు).అసలు సమస్య ఏంటి?టాటా సన్స్లో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్లకు కలిపి సుమారు 51.5 శాతం వాటా ఉంది. కాబట్టి.. ఈ రెండు ట్రస్టుల ప్రతినిధుల పాత్ర చాలా కీలకం. అయితే.. మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ సర్ రతన్ టాటా ట్రస్ట్కు సంబంధించిన అన్ని సమావేశాలపై నిషేధం విధించడంతో, రెండు ట్రస్టులు కలిసి తమ ప్రతినిధిని నామినేట్ చేయలేకపోయాయి. దీంతో AGMకు అవసరమైన కోరం ఏర్పడలేదు.సమావేశంలో ఎవరు ఉన్నారు?ఏజీఎం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై, 3:00 గంటలకు వాయిదా పడింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, బోర్డు సభ్యులు సౌరభ్ అగర్వాల్, అనితా మరంగోలీ జార్జ్ బాంబే హౌస్లో ప్రత్యక్షంగా హాజరయ్యారు. నోయెల్ టాటా, హరీష్ మన్వానీ, వేణు శ్రీనివాసన్ తదితరులు వర్చువల్గా పాల్గొన్నారు. రతన్ టాటా విల్కు ఎగ్జిక్యూటర్గా ఉన్న మాజీ టాటా గ్రూప్ ఇన్సైడర్ మెహ్లీ మిస్త్రీ కూడా వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు.ఇక ముందు ఏం జరుగుతుంది?నిజానికి ఏజీఎం రద్దు కాలేదు. అయితే.. కోరం లేకపోవడంతో వాయిదా పడింది. టాటా సన్స్ బోర్డు సమావేశమై AGMను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద.. టాటా గ్రూప్ చరిత్రలోనే తొలిసారిగా ఏజీఎం కోరం లేక వాయిదా పడింది. ఇది ప్రస్తుతం టాటా ట్రస్టుల పరిపాలనకు సంబంధించిన సమస్యలు టాటా సన్స్ వ్యవహారాలపై కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది.ఇదీ చదవండి: ఏఐతో సుఖపడతాం అనుకుంటే.. మోసపోయాం! -
మెటాపై చైల్డ్ సోషల్ మీడియా అడిక్షన్ కేసు!
కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు మెటా సంస్థపై ఓక్లాండ్లోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన కేసులో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో రాష్ట్రాల తరఫు న్యాయవాదులు దాదాపు 200 బిలియన్ డాలర్ల పరిహారం కోరుతున్నట్లు తెలిపారు. అయితే.. మెటా దాఖలు చేసిన కోర్టు పత్రంలో రాష్ట్రాలు 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు జరిమానా కోరుతున్నాయని, దీన్ని అసాధారణమైనదిగా అభివర్ణించింది.2023లో బహుళ రాష్ట్రాల విచారణ అనంతరం నలుగురు అటార్నీ జనరల్స్ ఈ కేసును దాఖలు చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో యువ వినియోగదారులను ఎక్కువసేపు కట్టిపడేసేందుకు ఇన్ఫినిట్ స్క్రోల్, ఆటోప్లే, లైక్స్ వంటి మానసికంగా ప్రభావితం చేసే ఫీచర్లను మెటా రూపొందించిందని ఆరోపణలు ఉన్నాయి.ఈ యాప్లు యువతలో ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు పెంచుతున్నాయని తెలిసినప్పటికీ, వాటిని సురక్షితమైనవిగా చిత్రీకరించి మెటా వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. అదనంగా.. 13 ఏళ్లలోపు వినియోగదారుల డేటాను అనుమతి లేకుండా సేకరించి చిన్నారుల ఆన్లైన్ గోప్యతా చట్టాన్ని (COPPA) ఉల్లంఘించిందని కూడా ఆరోపిస్తున్నారు.మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొసేరీ ఈ విచారణలో సాక్ష్యం చెప్పనున్నారు. ఇప్పటికే లాస్ ఏంజిల్స్, న్యూమెక్సికోలలో జరిగిన ఇలాంటి కేసుల్లో జ్యూరీలు మెటాకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి, వాటిపై మెటా అప్పీలు చేయనుంది. సోషల్ మీడియా అడిక్షన్ అనేది అధికారికంగా గుర్తించిన మానసిక వ్యాధి కాదని మెటా వాదిస్తోంది.ఈ కేసును పరిశ్రమ నిపుణులు సోషల్ మీడియా రంగానికి 'బిగ్ టొబాకో' తరహా కీలక ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. ఈ విచారణ సుమారు ఆరు వారాల పాటు కొనసాగనుంది. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి కుప్పకూలాయి. సెన్సెక్స్ 492.70 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 77,235.46 వద్ద, నిఫ్టీ 132.75 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 24,154.90 వద్ద నిలిచాయి.జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్, టొరెంట్ పవర్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లకు అదిరిపోయే గిఫ్ట్.. లిస్టింగ్ రోజే భారీ లాభాలు!
తాజాగా నిధుల సమీకరణ పూర్తి చేసిన ధూత్ టాన్స్మిషన్, మాల్బయో డయాగ్నస్టిక్స్ షేర్లు ఘనంగా అరంగేట్రం చేశాయి. ఇష్యూ ధరలతో పోలిస్తే రెండు కంపెనీలు 28%, 36% చొప్పున లాభాలు పంచాయి.ధూత్ ట్రాన్స్మిషన్: ఇష్యూ ధర(రూ.871)తో పోలిస్తే బీఎస్ఈలో 37% ప్రీమియంతో రూ.1,194 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 39% పెరిగి రూ.1,213 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 36% లాభంతో రూ.1,187 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.24,290 కోట్లకు చేరింది.మాల్బయో డయాగ్నస్టిక్స్: ఇష్యూ ధర (రూ.807)తో పోలిస్తే బీఎస్ఈలో రూ.980 వద్ద 21 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఒక దశలో రూ.1,064 వరకు ఎగబాకింది. చివరకు 28% లాభపడి రూ.1,036 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11,942 కోట్లుగా నమోదైంది. -
రైలు ప్రయాణంలో సమస్యా?.. ఉందిగా రైల్ మదద్!
సాధారణంగా రైలు ప్రయాణం సాఫీగా సాగుతుందని అనుకుంటాం. కానీ.. కోచ్లో ఏసీ పనిచేయకపోవడం, శుభ్రత లేకపోవడం, సిబ్బంది నుంచి ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలు వస్తే ప్రయాణం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటి.. సమయంలో ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్కి చెందిన రైల్ మదద్ (Rail Madad) ద్వారా మీ సమస్యను ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయవచ్చు.రైల్ మదద్ గురించిరైల్ మదద్ అనేది రైళ్లు, రైల్వే స్టేషన్లకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసేందుకు ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇందులో ప్రయాణానికి సంబంధించిన వివరాలు, సమస్య ఏంటో నమోదు చేయడంతో పాటు అవసరమైతే ఫొటోలు, వీడియోలు కూడా జత చేయవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాంతో మీ కంప్లైంట్ పరిస్థితి ఏంటో కూడా తర్వాత తెలుసుకోవచ్చు.ఫిర్యాదు ఎలా చేయాలి?ముందుగా అధికారిక రైల్ మదద్ వెబ్సైట్ లేదా యాప్ను ఓపెన్ చేసి ట్రైన్ కంప్లైంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీతో వెరిఫై చేయాలి. తరువాత పీఎన్ఆర్ నెంబర్, రైలు నెంబర్, ఎక్కే స్టేషన్, గమ్యస్థానం, కోచ్, బెర్త్ లేదా సీటు నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వడం వల్ల రైల్వే అధికారులు సమస్య ఎక్కడ ఉందో సులభంగా గుర్తించగలరు.సమస్యను క్లియర్గా చెప్పండిమీకు ఎదురైన సమస్యకు సరిపోయే కేటగిరీని ఎంచుకుని, సమస్యను వివరంగా రాయాలి. ఉదాహరణకు కోచ్ శుభ్రంగా లేకపోతే ఏ కోచ్లో, ఏ ప్రాంతంలో సమస్య ఉందో స్పష్టంగా చెప్పడం మంచిది. సమస్యకు సంబంధించిన ఫొటో లేదా వీడియో ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం PDF, JPG, JPEG, PNG, MP4 వంటి ఫైళ్లను అప్లోడ్ చేసే అవకాశం ఉంది. ఒక్కో ఫైల్ పరిమాణం 5 MB వరకు ఉండొచ్చు.కంప్లైంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?ఫిర్యాదు సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే కంప్లైంట్ రిఫరెన్స్ నెంబర్ను ద్వారా.. రైల్ మదద్లోని 'ట్రాక్ యువర్ కన్సర్న్' ఆప్షన్ ఎంచుకుని స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ రిఫరెన్స్ నెంబర్ ఉపయోగపడుతుంది.ఎలాంటి సమస్యలకు ఫిర్యాదు చేయొచ్చు?రైలు లేదా రైల్వే స్టేషన్లో ఎదురయ్యే వివిధ సమస్యలను రైల్ మదద్ ద్వారా తెలియజేయవచ్చు. కోచ్లో శుభ్రత లేకపోవడం, ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన సమస్యలు, కోచ్లోని కొన్ని సదుపాయాలు పనిచేయకపోవడం వంటి అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు. సమస్యను బట్టి సరైన కేటగిరీని ఎంచుకుని వివరాలు ఇవ్వాలి.అత్యవసర పరిస్థితుల్లో ఇలా..అయితే.. భద్రత లేదా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఉంటే ఆన్లైన్ ఫిర్యాదు కోసం వేచి చూడకుండా.. వెంటనే రైల్వే హెల్ప్లైన్ 139కు కాల్ చేసి సహాయం కోరాలి. ప్రయాణ సమయంలో తక్షణ భద్రత లేదా వైద్య సహాయం అవసరమైనప్పుడు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. -
ఏఐతో సుఖపడతాం అనుకుంటే.. మోసపోయాం!
ఏఐ వస్తే ఉద్యోగుల పని తగ్గిపోతుందని.. రోజుకు గంటల తరబడి చేసే రొటీన్ పనుల నుంచి విముక్తి లభిస్తుందని టెక్ ప్రపంచం ఊదరగొట్టింది. కానీ కృత్రిమ మేధ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. పని వేగంగా పూర్తవుతున్నా.. అదే సమయంలో మరింత పని అప్పగిస్తున్నారని, ఏఐ వల్ల పని గంటలు తగ్గకపోగా ఒత్తిడి పెరిగిందని వాపోతున్నారు.2023లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్.. భవిష్యత్తులో ఏఐ, యంత్రాల సాయంతో వారానికి మూడు రోజులే పని చేసే పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీలోనూ ఇదే తరహా ఆశావహ అంచనాలు వినిపించాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఏఐ సాయంతో రొటీన్ పనులను త్వరగా పూర్తి చేసి.. మిగిలిన సమయాన్ని సృజనాత్మక, కీలకమైన పనులకు కేటాయించవచ్చని ప్రచారం జరిగింది.కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఏఐతో పని త్వరగా పూర్తవుతున్న కొద్దీ.. ఉద్యోగుల నుంచి అంతకంటే ఎక్కువ పని చేయాలని సంస్థలు ఆశిస్తున్నాయని పలువురు డెవలపర్లు చెబుతున్నారు. అంటే పని తగ్గించాల్సిన ఏఐ.. అదే సమయంలో పనిని పెంచే సాధనంగా మారిపోయిందన్నమాట.‘అదే 9 గంటలు.. కానీ పని ఎక్కువ’ఓ ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేస్తున్న శుభమ్ మాట్లాడుతూ.. ఏఐ వల్ల పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ, పని గంటలు మాత్రం తగ్గడం లేదని చెప్పారు. పైగా తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయగలుగుతున్నందున.. అదే వ్యవధిలో మరిన్ని పనులు అప్పగిస్తున్నారని తెలిపారు.బెంగళూరుకు చెందిన సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంకిత అనుభవం మరింత భిన్నంగా ఉంది. ఏఐ వల్ల ఒక పని సగం సమయంలో పూర్తవుతుందని మేనేజ్మెంట్ భావిస్తోందని.. దీంతో పని తగ్గడానికి బదులుగా లక్ష్యాలు పెరుగుతున్నాయని ఆమె చెబుతున్నారు. “ఏఐ ఉంటే పని 30 శాతం సమయంలోనే పూర్తవ్వాలి. కాబట్టి అదే సమయంలో మరింత పని చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది” అని ఆమె వివరించారు.15-16 గంటల పని..ఏఐ వల్ల తన పని భారం గతంలో కంటే పెరిగిందని అంకిత చెబుతున్నారు. గత మూడు నెలలుగా రోజుకు 15-16 గంటలు పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనికి తోడు సంస్థలో ఏఐకి సంబంధించిన కొత్త టెక్నాలజీలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాప్లకు హాజరుకావాల్సి వస్తోందని చెప్పారు.అంటే.. ఏఐని ఉపయోగించడం నేర్చుకోవడానికి కూడా అదనపు సమయం కేటాయించాల్సి వస్తోంది. శిక్షణ పూర్తయిన తర్వాత మిగిలిన సమయంలో సాధారణ పనిని పూర్తి చేయాల్సి ఉంటుందని ఆమె అంటున్నారు.ఏఐ వాడండి.. కానీ టోకెన్లు పరిమితమే!మరో విచిత్రమైన పరిస్థితి కూడా ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. ఏఐని విస్తృతంగా ఉపయోగించాలని మేనేజ్మెంట్లు కోరుతున్నప్పటికీ.. కొన్ని సంస్థలు ఏఐ టూల్స్ వినియోగానికి పరిమితులు విధిస్తున్నాయి.అంకిత పనిచేసే సంస్థలో నెలకు 250 డాలర్ల విలువైన ఏఐ టోకెన్లను మాత్రమే అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. నెల మధ్యలోనే ఆ పరిమితి పూర్తయిపోతే.. ఏఐ సరిగా పనిచేయలేదని మేనేజ్మెంట్ నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఏఐతో ఎక్కువ పని చేయాలి.. కానీ దానికి అవసరమైన ఏఐ వనరులు మాత్రం పరిమితమే అనే పరిస్థితి ఉద్యోగులకు కొత్త తలనొప్పిగా మారింది.ఏఐ చేసిన పని.. మళ్లీ మనమే సరిచేయాలి!ఏఐ కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాలేదు. గ్రాఫిక్ డిజైనర్ల వంటి ఇతర రంగాల్లోనూ దీని వినియోగం పెరిగింది. అయితే ఏఐ ఇచ్చిన ఫలితం ప్రతిసారీ కచ్చితంగా ఉండదని డిజైనర్లు చెబుతున్నారు. ఏఐతో పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ.. తప్పులు వస్తే వాటిని గుర్తించి మాన్యువల్గా సరిచేయాల్సి వస్తోంది. దీంతో ఏఐ పని తగ్గించిందా? లేక పని చేసే విధానాన్ని మాత్రమే మార్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అమెజాన్ లాజిస్టిక్స్లోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నట్లు ఓ ఉద్యోగి తెలిపారు. దెబ్బతిన్న ప్యాకేజీలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో సరిగ్గా ఉన్న ప్యాకేజీగా చూపిస్తోందని.. అప్పుడు మనుషులే మళ్లీ తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు.అయితే ఏఐ నిజంగా పనికిరాదా?అలా అని అందరూ ఏఐని వ్యతిరేకించడం లేదు. తెలివిగా ఉపయోగించగలిగితే ఏఐతో పని భారాన్ని తగ్గించుకోవచ్చని కొందరు ఉద్యోగులు అంటున్నారు. అయితే ఏఐనే మొత్తం పనిని చేసేస్తుందని భావిస్తే.. తప్పులను సరిచేయడం, ఫలితాలను తనిఖీ చేయడం వంటి అదనపు పనులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదంతా చూస్తే.. ఏఐపై మొదట్లో చేసిన ‘తక్కువ పని.. ఎక్కువ విశ్రాంతి’ అంచనాలు ఇప్పటివరకు నిజం కాలేదనే చెప్పాలి. పైగా ఏఐతో ఉత్పాదకత పెరిగే కొద్దీ ఉద్యోగులపై సంస్థల అంచనాలు కూడా పెరుగుతున్నాయి.మూడు రోజుల వర్క్వీక్ ఎక్కడ?ఏఐ కారణంగా భవిష్యత్తులో వారానికి మూడు రోజులే పనిచేసే పరిస్థితి రావచ్చన్న బిల్గేట్స్ అంచనాలకు భిన్నంగా.. ఏఐ యుగంలో మనుషులు మరింత బిజీగా మారొచ్చని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ ఇటీవల వ్యాఖ్యానించారు.సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా మనుషులు మరింత బిజీగా ఉంటారని.. ఎందుకంటే ఏఐతో సామర్థ్యం పెరిగే కొద్దీ మన అంచనాలు కూడా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే.. ప్రస్తుత పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏఐ పని తగ్గిస్తుందని వచ్చింది.. కానీ పని చేసే వేగాన్ని పెంచి, చేయాల్సిన పనినే మరింత పెంచేసిందన్నమాట! -
లోన్ తీసుకున్నవారికి RBI గుడ్న్యూస్!
లోన్లు తీసుకున్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. ముఖ్యంగా.. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకున్న వారికి మరింత రక్షణ కల్పించేలా కొత్త ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చింది. ఇక వడ్డీ రేట్లను నిర్ణయించే బెంచ్మార్క్లో ఏవైనా మార్పులు చేసే సమయంలో వినియోగదారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.రుణగ్రహీతలకు రక్షణకొత్త ఫ్రేమ్వర్క్లో ప్రధానంగా.. లోన్ వడ్డీ రేట్లలో పారదర్శకత తీసుకురావడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టింది. స్థిర, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు, బెంచ్మార్క్ ఎంపిక, వడ్డీ రేట్ల మార్పులు, స్ప్రెడ్లు, ఇప్పటికే ఉన్న రుణాలు వంటి అంశాలకు ఇందులో నిబంధనలు ప్రతిపాదించారు. ముఖ్యంగా బెంచ్మార్క్ మార్పు కారణంగా రుణగ్రహీతపై ఒక్కసారిగా అదనపు వడ్డీ భారం పడకుండా చూడాలని ఆర్బీఐ సూచించింది.బెంచ్మార్క్ మార్చితే ఏం జరుగుతుంది?ఫ్లోటింగ్ రేట్ లోన్లలో వడ్డీ రేటు సాధారణంగా ఒక బెంచ్మార్క్కు అనుసంధానమై ఉంటుంది. ఆ బెంచ్మార్క్ మారితే లోన్ మీద చెల్లించే వడ్డీ కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకే.. కొత్త విధానంలో బెంచ్మార్క్, దాని రీసెట్ వ్యవధి, రీసెట్ తేదీ వంటి వివరాలను లోన్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న రుణాలను కొత్త ఫ్రేమ్వర్క్లోకి మార్చేటప్పుడు కూడా రుణగ్రహీత ప్రయోజనాలకు నష్టం కలగకుండా చూడాలి. అలాగే మార్పు కోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని ప్రతిపాదించింది.బెంచ్మార్క్ అందుబాటులో లేకపోతే?ఒకవేళ ఫ్లోటింగ్ రేట్ లోన్కు అనుసంధానమైన బెంచ్మార్క్ భవిష్యత్తులో నిలిచిపోతే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆర్బీఐ ప్రతిపాదనలో వివరించింది. అలాంటి సమయంలో రుణదాత మరో బెంచ్మార్క్కు మారాల్సి ఉంటుంది. అయితే.. ఆ మార్పు వల్ల రుణగ్రహీతకు అన్యాయం జరగకూడదు. ఇందుకోసం లోన్ ఒప్పందంలో ముందుగానే ఫాల్బ్యాక్ బెంచ్మార్క్ను పేర్కొనే అవకాశం ఉంటుంది. అంటే.. అసలు బెంచ్మార్క్ అందుబాటులో లేకపోతే ఏ ప్రత్యామ్నాయ బెంచ్మార్క్ వర్తిస్తుందో ముందే స్పష్టంగా ఉండేలా చూడనున్నారు.పాత లోన్లకు కూడా కొత్త విధానంఇప్పటికే అంతర్గత లేదా బాహ్య బెంచ్మార్క్లకు అనుసంధానమైన అన్ని రుణాలను కొత్త ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం.. ఒకసారి మాత్రమే మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించి, ఈ మార్పును 2029 ఏప్రిల్ 1 నాటికి పూర్తి చేయాలని సూచించింది. అయితే.. ఈ మార్పు రుణగ్రహీతపై అదనపు ఆర్థిక భారాన్ని మోపకూడదు. ముఖ్యంగా మార్పు తర్వాత వర్తించే వడ్డీ రేటు, మార్పుకు ముందు ఉన్న రేటు కంటే ఎక్కువగా ఉండకూడదనే రక్షణను ప్రతిపాదించారు.సింపుల్గా చెప్పాలంటే.. ఆర్బీఐ ప్రతిపాదించిన కొత్త ఫ్రేమ్వర్క్ వల్ల బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లు, బెంచ్మార్క్లు, స్ప్రెడ్ల విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ లోన్లు తీసుకున్న వారికి బెంచ్మార్క్ మార్పుల వల్ల అనూహ్యంగా రుణ భారం పెరగకుండా కొన్ని రక్షణలు లభించే అవకాశం ఉంది. అయితే ఇవి ప్రస్తుతం ఆర్బీఐ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ నిబంధనలు మాత్రమే. తుది నిబంధనలు వెలువడిన తర్వాతే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి. -
గుడ్న్యూస్.. ఈ టాలెంట్ ఉన్నవారికి ప్రత్యేక వీసా!
రష్యా ప్రభుత్వం విదేశాల నుంచి ప్రతిభావంతులైన, అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఆకర్షించేందుకు కొత్త టాలెంట్ వీసా (Talent Visa) విధానాన్ని తీసుకొచ్చింది. ఇది 2025 డిసెంబర్లో తెరమీదకు వచ్చినప్పటికీ.. 2026 ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ కొత్త వీసా రష్యాకు వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరికీ కాదు. దేశానికి ఉపయోగపడే ప్రత్యేక ప్రతిభ ఉన్న విదేశీయుల కోసం మాత్రమే.ఈ వీసా ఎవరికంటే?ఈ వీసా ప్రధానంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజనీర్లు, టెక్ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రముఖ విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లు, కళాకారులు, క్రీడాకారులు, అరుదైన నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రమే. అంటే రష్యా.. టెక్నాలజీ, సైన్స్, బిజినెస్, సంస్కృతి లేదా క్రీడా రంగాలకు ఉపయోగపడే ప్రతిభ ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వనుందన్నమాట.దరఖాస్తు ప్రక్రియ గురించిఅభ్యర్థుల దరఖాస్తులను ముందుగా 'ఏజెన్సీ ఫర్ అట్రాక్షన్ ఫారిన్ టాలెంట్ టు రష్యా' అనే సంస్థ పరిశీలిస్తుంది. అభ్యర్థి విద్య, నైపుణ్యాలు, అనుభవం, సాధించిన విజయాలను అంచనా వేసిన తర్వాత దరఖాస్తు సాధారణ ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్దకు వెళ్తుంది. టాలెంట్ వీసా పొందిన వారికి టెంపరరీ రెసిడెన్స్ పర్మిట్ (TRP) విషయంలో సాధారణ కోటా వర్తించదు. అంతే కాకుండా.. సాధారణంగా ఉండే కొన్ని రష్యన్ భాషా నిబంధనల నుంచి కూడా మినహాయింపు లభించవచ్చు.అయితే.. రష్యన్ భాష తెలిసినవారు TRP దశను దాటేసి నేరుగా పర్మనెంట్ రెసిడెన్స్ పర్మిట్ (PRP) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ సాధారణంగా విదేశీయులు PRP కోసం దరఖాస్తు చేయడానికి ముందు.. కనీసం ఎనిమిది నెలలు TRP కలిగి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అర్హత కలిగిన వ్యక్తికి ఈ కొత్త విధానం శాశ్వత నివాసం పొందే ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేయగలదు.రష్యా లక్ష్యం ఏమిటి?ఈ కొత్త టాలెంట్ వీసా ద్వారా రష్యా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను దేశంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, వ్యాపారం, సంస్కృతి మరియు క్రీడల రంగాల్లో దేశానికి ఉపయోగపడే నిపుణులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం. సాధారణ ఇమ్మిగ్రేషన్ కోటాలపై మాత్రమే ఆధారపడకుండా, దేశానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ కొత్త విధానంలో ప్రధాన మార్పుగా చెప్పవచ్చు. -
ఇలా అయితే బంగారం కొనేదెలా?: పెరిగిన ధరలు..
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఇలా అయితే కొనేదెలా అంటూ.. పసిడి కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
స్టాక్ మార్కెట్ అప్డేట్: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:45 గంటలకు సెన్సెక్స్ 249.00 పాయింట్లు లేదా 0.32 శాతం నష్టంతో 77,479.16 వద్ద, నిఫ్టీ 50.70 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,236.95 వద్ద ముందుకు సాగుతున్నాయి.వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. కోల్గేట్-పాల్మోలివ్ (ఇండియా) లిమిటెడ్, లోధా డెవలపర్స్ లిమిటెడ్, బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్పై ప్రత్యేక కమిటీ
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంపై బ్యాంకింగ్ రంగానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్రం త్వరలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం తెలిపారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో, ప్రతిపాదిత కమిటీ పరిశీలించతగిన అంశాల గురించి సమాలోచనలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు అత్యంత కనిష్ట స్థాయికి దిగివచ్చాయని, సంస్కరణలను చేపట్టేందుకు ఇదే సరైన తరుణం కాగలదని ఆమె చెప్పారు. ఆర్థిక స్థిరత్వం, సమ్మిళితత్వం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ భారతదేశపు తదుపరి దశ వృద్ధికి ఊతమిచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని సమగ్రంగా సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
హైరింగ్ పండుగ!
ముంబై: ఈ పండుగ సీజన్లో తాత్కాలిక సిబ్బంది రిక్రూట్మెంట్కి డిమాండ్ జోరుగా ఉండనుంది. ఈసారి వ్యాపార సంస్థలు దాదాపు 2.5–2.7 లక్షల పైచిలుకు నియామకాలు చేపట్టనున్నాయని అంచనా. ప్రధానంగా ఈ–కామర్స్, లాజిస్టిక్స్, క్విక్ కామర్స్, రిటైల్తో పాటు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) తదితర రంగాల సంస్థలు భారీగా రిక్రూట్మెంట్ చేపట్టనున్నాయి. టాలెంట్ కంపెనీ అడెకో ఇండియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది పండుగ సీజన్లో సుమారు 2.16 లక్షల తాత్కాలిక సిబ్బంది నియామకాలు జరగ్గా ఈ ఏడాది హైరింగ్ 15–20 శాతం మేర పెరగనుంది. ‘అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ఈసారి పండుగ సీజన్లో నియామకాలు చేపట్టడంపై వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. దేశీయంగా వినియోగం పెరుగుతుండటమనేది రిటైల్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, వినియోగదారులను ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం ఉండే సంస్థల్లో నియామకాలకు డిమాండ్ నెలకొంది. భౌగోళిక, రాజకీయ పరిణామాలు, ఇంధన ధరలు పెను మార్పులకు లోనవుతుండటం, వ్యాపారపరంగా అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, ఎగుమతుల ఆధారిత పరిశ్రమల్లో అనిశ్చితి కొనసాగుతుండటంలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార సంస్థలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి‘ అని అడెకో ఇండియా డైరెక్టర్ దీపేష్ గుప్తా తెలిపారు. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన వివరాలతో పాటు మార్కెట్ అధ్యయన నివేదికల ఆధారంగా అడెకో ఇండియా ఈ నివేదికను రూపొందించింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఈసారి నియామకాల డిమాండ్లో దాదాపు 45 శాతం వాటా లక్నో, జైపూర్, కోయంబత్తూర్లాంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఉండనుంది. ఆయా మార్కెట్లలో వినియోగం పెరుగుతుండటం, ఈ–కామర్స్ విస్తరిస్తుండటం, సంఘటిత రిటైల్ రంగం వృద్ధి చెందుతుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణంగా నిలవనున్నాయి. → ఇదే సమయంలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్లాంటి ప్రథమ శ్రేణి నగరాల్లో సిబ్బంది కొరత అత్యధికంగా 30 శాతం మేర ఉంటోంది. సిబ్బంది వేగంగా మారిపోతుండటం, గిగ్ వర్క్ వైపు మొగ్గు చూపుతుండటం మొదలైన విషయాల వల్ల నియామకాలు చేపట్టడంలోనూ, ఉన్న ఉద్యోగులు వెళ్లిపోకుండా అట్టే పెట్టుకోవడంలోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. → తాత్కాలిక సిబ్బంది వేతనాలు మెట్రో మార్కెట్లలో 12–15%, ద్వితీయ..తృతీయ శ్రేణి ప్రాంతాల్లో 8–10% మేర పెరగనున్నాయి. → కొత్త కేటగిరీల్లో కాకుండా కీలకమైన కార్యకలాపాల నిర్వహణ విధులను నిర్వహించే సిబ్బందికి డిమాండ్ ఎక్కువగా ఉండనుంది. ఇన్–స్టోర్, బీఎఫ్ఎస్ఐ ఆధారిత హైరింగ్ విషయంలో రిటైల్ సేల్స్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్స్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మొదలైన కొలువులు కీలకంగా ఉంటున్నాయి. అత్యంత వేగంగా ఆర్డర్లను డెలివరీ చేయడం, కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని కలి్పంచడంపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణం. → ఒకే భాషకు పరిమితం కాకుండా పలు భాషలు వచి్చన వారిని తీసుకోవడానికి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి, డిజిటల్ పరిజ్ఞానం కలిగి ఉండి, కస్టమర్లతో సంభాíÙంచగలిగి, కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాలు కలిగి ఉన్న వారికి పెద్దపీట వేస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకోగలగడం, పటిష్టమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలుండటం రిటైల్, లాజిస్టిక్స్, బీఎఫ్ఎస్ఐ, ఈ–కామర్స్లో కొలువులను దక్కించుకునేందుకు అదనపు అర్హతలుగా ఉంటున్నాయి. → సీజనల్గా తీసుకునే వారిలో దాదాపు 25% మంది క్రమంగా దీర్ఘకాలిక ఉద్యోగ విధుల్లోకి మారుతున్నారు. దీన్ని బట్టి చూస్తే దేశీయంగా సంఘటిత రంగ ఉద్యోగాలను దక్కించుకోవాలంటే పండుగ సీజన్ నియామకాలు ఎంట్రీ పాయింట్గా ఉంటున్నాయి. → నియామకాల అవకాశాలు భారీగానే కనిపిస్తున్నప్పటికీ, ప్రతిభావంతుల లభ్యత పెను సవాలుగా ఉంటోంది. పండుగ సీజన్లో ఫ్రంట్లైన్, కార్యకలాపాల నిర్వహణ కొలువులకు సంబంధించి దాదాపు 80 శాతం సంస్థలకు సరైన అభ్యర్ధులు దొరకడం లేదు. కీలకమైన ప్రస్తుత తరుణంలో డిమాండ్–సరఫరా మధ్య 10–15% మేర వ్యత్యాసం ఉండవచ్చని అడెకో అంచనా వేస్తోంది. -
రూ.36 లక్షల జీతం ఇస్తానన్నా నో చెప్పాడు.. ఎందుకంటే?
ఢిల్లీకి చెందిన ఓ వ్యవస్థాపకుడు దుబాయ్లో రూ.36 లక్షల వార్షిక జీతంతో వచ్చిన ఉద్యోగ ఆఫర్ను వదులుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 7 ఏళ్లు గడిచినా ఆ నిర్ణయం పట్ల తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని ఆయన తెలిపారు. ఫిన్గ్రోత్ మీడియా వ్యవస్థాపకుడు కనన్ బహల్ తన కెరీర్ జర్నీని ఎక్స్లో ఓ పోస్టు ద్వారా పంచుకున్నారు. విదేశీ ఉద్యోగ ఆఫర్లో పన్ను మినహాయింపు ఉన్న జీతం ఉందని, ఆ సమయంలో ఐసీఏఐ క్యాంపస్ నియామకాల్లో అదే అత్యధిక ఉద్యోగ ప్రతిపాదన అని ఆయన తెలిపారు.“7 ఏళ్ల క్రితం దుబాయ్లో రూ.36 లక్షల ఉద్యోగ ఆఫర్ను నేను తిరస్కరించాను. అది పన్ను మినహాయింపు ఉన్న జీతం. ఆ సమయంలో ఐసీఏఐ క్యాంపస్ నియామకాల్లో అదే అత్యధిక ఉద్యోగ ఆఫర్” అని బహల్ తన పోస్టులో రాశారు.ఖర్చులను లెక్కలోకి తీసుకున్న తర్వాత ఆ ఉద్యోగం తీసుకుని ఉంటే ఏడాదికి దాదాపు రూ.20 లక్షలు ఆదా చేయగలిగేవాడినని ఆయన చెప్పారు. భారత్లో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని, ఆ సమయంలో ఏడాదికి రూ.12 లక్షలకు మించి జీతం ఇచ్చే ఉద్యోగం తనకు దొరకలేదని తెలిపారు.అయినా ఎందుకు వద్దన్నారు?జీతంలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ బహల్ భారత్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. “నేను దాన్ని తిరస్కరించాను. నా కుటుంబానికి, సంస్కృతికి దగ్గరగా ఉండటం నాకు ఎక్కువ ముఖ్యం” అని ఆయన రాశారు.ఆ నిర్ణయం సరైనదేనని తేలిందని ఆయన తెలిపారు. 7 ఏళ్ల తర్వాత తన పరిస్థితిని గుర్తు చేసుకుంటూ, “ఈ రోజు నాకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు” అని పేర్కొన్నారు. భారత్లో తాను నిర్మించుకున్న కెరీర్ దుబాయ్ ఉద్యోగం ద్వారా వచ్చేదానికంటే ఎంతో ఎక్కువ లాభదాయకంగా మారిందని తెలిపారు.అదే పోస్టులో బహల్ జీతంతో పోలికను పక్కనపెట్టి దేశంతో తనకున్న అనుబంధం గురించి, భవిష్యత్తుపై తన నమ్మకం గురించి కూడా మాట్లాడారు. “భారత్ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ మనం దాన్ని పరిపూర్ణంగా మార్చాలి” అని రాశారు.తన కుటుంబ చరిత్ర గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 1947లో తమ పూర్వీకులను హింసకు గురై ఇళ్ల నుంచి వెళ్లగొట్టాక తర్వాత భారత్ వారికి ఆశ్రయం ఇచ్చిందని తెలిపారు. “మన స్వాతంత్య్ర సమరయోధులకు, మాతృభూమి భారత్కు మనమంతా ఎంతో రుణపడి ఉన్నాం” అని బహల్ చెప్పారు. చివరగా “స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!” అని పేర్కొన్నారు.యూజర్ల స్పందనలుఈ పోస్టుకు భారీగా స్పందనలు వచ్చాయి. దుబాయ్ ఉద్యోగ ఆఫర్ను పక్కనపెట్టి భారత్లోనే ఉండటాన్ని పలువురు ప్రశంసించారు. “చాలా బాగుంది. భారత్ ఎదుగుదలపై నాకు ఎలాంటి సందేహం లేదు. మీలాంటి యువత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. మీ తల్లిదండ్రులకు కూడా అభినందనలు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి” అని ఓ యూజర్ రాశారు. “గొప్ప పని చేశారు. ఇతరులను కూడా ప్రోత్సహించండి. స్ఫూర్తిదాయకం” అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.7 yrs back, I rejected a ₹36 Lakh job offer in Dubai.It was a tax-free salary and it was the highest ICAI campus placement offer at that time.After all expenses, I would've saved ₹20 lakhs.I couldn't find a job in India that paid more than ₹12 lakhs p.a. at that time.I… pic.twitter.com/7PYlraI7nl— Kanan Bahl (@BahlKanan) August 15, 2026 -
అనంత్ అంబానీ ఔదార్యం.. ఇక్బాల్కు కొత్త ఆశలు!
చిన్న వయసులోనే అనారోగ్యం కారణంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఇక్బాల్ జీవితం ఎంతో కష్టంగా మారింది. దాదాపు ఐదేళ్లుగా అతడికి చెరువులో ఉండటమే కొంత ఉపశమనాన్ని ఇచ్చేది. దీంతో సాధారణంగా పిల్లలు గడిపే బాల్యం, కుటుంబంతో ఉండే సమయం అన్నీ అతడికి దూరమయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఇక్బాల్ పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత అతడి కుటుంబంలోనూ ఆందోళన పెరిగింది.ఇక్బాల్ పరిస్థితి గురించి.. విషయం వెలుగులోకి రావడంతో వైద్య నిపుణుల బృందం అతడి కేసును పరిశీలించింది. అతడికి ఉన్న అనారోగ్య పరిస్థితి, ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు, అవసరమైన చికిత్స వంటి అంశాలను నిపుణులు పరిశీలించారు. ప్రత్యేక వైద్య సేవలు అందిస్తే ఇక్బాల్కు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉందని భావించారు.ఈ విషయం తెలిసిన అనంతరం అనంత్ అంబానీ సూచనలతో ఇక్బాల్ను ప్రత్యేక వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించే ఏర్పాట్లు చేశారు. అతడిని ఎయిర్లిఫ్ట్ చేసి సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్య నిపుణులు అతడి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి, అవసరమైన ప్రత్యేక చికిత్స అందించనున్నారు.ఇప్పటివరకు దాదాపు ఐదేళ్ల పాటు చెరువులోనే ఉపశమనం వెతుక్కుంటూ గడిపిన ఇక్బాల్.. ఇప్పుడు దేశంలోని ప్రముఖ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అతడి కుటుంబానికి కూడా ఇది పెద్ద ఊరటనిచ్చే విషయం. ఇక్బాల్కు మెరుగైన వైద్యం అందడంతో అతడి పరిస్థితి మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.After spending 5 years in a pond seeking relief from his debilitating ailment, young Iqbal's case was reviewed. On Anant Ambani’s instructions, he has now been airlifted to Mumbai’s Reliance Foundation Hospital for specialized treatment — bringing new hope for Iqbal & his family. pic.twitter.com/9CrxaIHpgL— Mradubhashi (@mradubhashi1) August 17, 2026 -
జియో మెంబర్షిప్.. రూ.300తో టెన్షన్ లేని రీఛార్జ్!
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం 'జియో ప్రైమ్ మెంబర్షిప్'ను(Jio Prime Membership) తీసుకొచ్చింది. జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మెంబర్షిప్ను రీలాంచ్ చేసింది. అయితే.. ఈసారి ప్రైమ్లో ప్రధాన ఆకర్షణ కేవలం అదనపు ఆఫర్లు కాదు.. టారిఫ్ ధరలు పెరిగినా కస్టమర్లపై ఆ భారం పడకుండా రక్షణ కల్పించడం.రూ.300 చెల్లిస్తే..జియో ప్రైమ్ మెంబర్షిప్ కోసం ఒక్కసారి రూ.300 చెల్లించాలి. ఈ మెంబర్షిప్ జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. సభ్యత్వం తీసుకున్న తర్వాత.. ప్లాన్స్ ధరలు పెరిగినా, ప్రస్తుతం ఉన్న ధరలకే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం మెంబర్షిప్ తీసుకున్న వాళ్లకు మాత్రమే. ఇది 5 సెప్టెంబర్ 2027 వరకు వర్తిస్తుంది. అంటే ఏడాది పాటు రీఛార్జ్ ధరలు పెరిగినా భయం లేదన్నమాట.రూ.600 క్యాష్బ్యాక్జియో ప్రైమ్లో సభ్యత్వం తీసుకున్న వారికి రూ.600 విలువైన క్యాష్బ్యాక్ వోచర్లు కూడా లభిస్తాయి. ఇందులో రూ.300 క్యాష్బ్యాక్ను కొత్త జియో హోమ్ లేదా జియో పీసీ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. మరో రూ.300 వోచర్ను స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కోసం కొత్త జియో సిమ్ కనెక్షన్ తీసుకునేటప్పుడు పొందవచ్చు.కొత్త సేవలకు ముందుగానే యాక్సెస్ప్రైమ్ సభ్యులకు జియో తీసుకొచ్చే కొత్త ఉత్పత్తులు, సేవలు, ట్రయల్స్కు ముందస్తు యాక్సెస్ కూడా లభిస్తుంది. అంతేకాదు.. కస్టమర్లకు ప్రత్యేకంగా ప్రయారిటీ కస్టమర్ సపోర్ట్ అందించేందుకు ప్రత్యేక సర్వీస్ ఛానల్ను కూడా జియో ఏర్పాటు చేయనుంది. మెంబర్షిప్ వ్యవధిలో మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.ఎవరు తీసుకోవచ్చు?ప్రస్తుతం జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ వాడుతున్న అందరు జియో కస్టమర్లు రూ.300 చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అయితే.. ఇతర నెట్వర్క్లలో ఉన్నవారు జియోకి మారడం లేదా కొత్త జియో కనెక్షన్ తీసుకోవడం ద్వారా ఈ మెంబర్షిప్లో చేరవచ్చు.ఎక్కడ తీసుకోవాలి?జియో ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకునే వారు మైజియో యాప్ లేదా జియో.కామ్, జియో స్టోర్స్, జియో పార్ట్నర్ స్టోర్స్ ద్వారా తీసుకోవచ్చు. తరచూ రీఛార్జ్ ధరలు పెరుగుతాయేమోనని ఆందోళన చెందే జియో కస్టమర్లకు ఇది ఉపయోగపడుతుంది. -
8వ వేతన సంఘంపై పెన్షనర్ల కన్ను!
దేశంలో 8వ వేతన సంఘం చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. 2025 నవంబర్ 3న ఏర్పాటు చేసిన ఈ కమిషన్కు 18 నెలల గడువు ఇచ్చారు. ఇప్పటికే అందులో సగానికి పైగా సమయం పూర్తయింది. దీంతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, పెన్షనర్లు కూడా తమ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 2026 జనవరి 1కి ముందు రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ను కూడా సవరించాలనే డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది.పాత పెన్షనర్లకు కూడా ప్రయోజనాలు కావాలని.. భారత్ పెన్షనర్స్ సమాజ్ (BPS), ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AIDEF) వంటి పెన్షనర్ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాయి. 8వ వేతన సంఘం నిబంధనల్లో పాత పెన్షనర్ల పెన్షన్ సవరణపై స్పష్టత లేదని, అందుకే దీనిని స్పష్టంగా చేర్చాలని కోరుతున్నాయి.2026 జనవరి 1కి ముందు రిటైర్ అయిన వారితో పాటు ఆ తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగుల పెన్షన్ను కూడా సవరించాలని, పాత-కొత్త పెన్షనర్ల మధ్య తేడాలు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫ్యామిలీ పెన్షన్, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా ఇందులో భాగం చేయాలని కోరుతున్నాయి.8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్న 'అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్-కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్' అనే పదంపై కూడా పెన్షనర్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి ఎన్నో ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత పొందే పెన్షన్ను కేవలం ప్రభుత్వంపై పడే అదనపు ఖర్చుగా చూడటం సరికాదని AIDEF వాదిస్తోంది. BPS కూడా ఈ పదాన్ని తొలగించాలని, లేదా మార్చాలని కోరింది. పెన్షన్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, వేతన సవరణతో పాటు పెన్షన్ సవరణ కూడా సమగ్రంగా జరగాలని సంఘాలు కోరుతున్నాయి.పెన్షనర్ల ఇతర డిమాండ్లుపెన్షన్ సవరణ ఒక్కటే కాకుండా.. మరికొన్ని అంశాలను కూడా పెన్షనర్ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచాయి. ఇందులో పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ, మెరుగైన ఆరోగ్య సేవలు, కేంద్ర నిధులతో నడిచే స్వయం ప్రతిపత్తి, చట్టబద్ధ సంస్థలకు 8వ వేతన సంఘం ప్రయోజనాలు అందించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. అంతే కాకుండా.. పోస్టల్ శాఖలో కీలకంగా పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవక్ (GDS)లకు కూడా తగిన ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు.ఇక నిర్ణయం ఎప్పుడు?ప్రస్తుతం పెన్షనర్లలో ప్రధానంగా ఉన్న ఆందోళన.. తాము 8వ వేతన సంఘం పరిధిలోకి వస్తామా? లేదా? అనే విషయంలో స్పష్టత లేకపోవడమే. కమిషన్ తుది నివేదిక ఇచ్చేలోపు ఈ సందేహానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని పెన్షనర్ సంఘాలు కోరుతున్నాయి. రాబోయే రోజుల్లో చెన్నై, పుదుచ్చేరి, చండీగఢ్, జైపూర్ వంటి ప్రాంతాల్లో 8వ వేతన సంఘం మరిన్ని సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో పెన్షనర్ల డిమాండ్లపై ఎలాంటి చర్చ జరుగుతుంది, చివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఇదీ చదవండి: ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు! -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 281.09 పాయింట్లు లేదా 0.36 శాతం లాభంతో 77,728.16 వద్ద, నిఫ్టీ 78.35 పాయింట్లు లేదా 0.32 శాతం నష్టంతో 24,287.65 వద్ద నిలిచాయి.ఐపిసిఎ లాబొరేటరీస్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. బెల్రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, NMDC స్టీల్ లిమిటెడ్, జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎల్పీజీ e-KYC డెడ్లైన్ పొడిగింపు!
దేశంలో ఎల్పీజీ వినియోగదారులకు తప్పనిసరి చేసిన ఈ-కేవైసీ గడువును.. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23 వరకు మరో వారం పొడిగించారు. దీంతో ఈ-కేవైసీ పూర్తి చేసుకోలేకపోయిన వారికి అదనపు సమయం లభించింది.ఈ-కేవైసీ కోసం గడువు పెరిగినా.. వినియోగదారుల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. ఆధార్ ఆథెంటికేషన్ కోసం గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తున్న వారికి సర్వర్లు డౌన్ అవడం, యాప్లు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సాధారణంగా.. సులభంగా పూర్తయ్యే ప్రక్రియ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది.గడువు పెంచడం వల్ల ఆగస్టు 16 నాటికి ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుందని భావించినా.. అసలు సమస్య మాత్రం సాంకేతిక వ్యవస్థలోనే ఉందని డీలర్లు చెబుతున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సర్వర్లు లేదా యాప్లు సరిగ్గా పనిచేయకపోతే గ్యాస్ ఏజెన్సీల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నా ఈ-కేవైసీ ప్రక్రియ ముందుకు సాగదు. కొన్ని గంటల పాటు సర్వర్ పనిచేయకపోతే.. ఆ రోజు పూర్తి కావాల్సిన ఈ-కేవైసీలు పెండింగ్లో పడిపోతాయి. దీంతో రోజురోజుకి ఈ-కేవైసీ చేసుకోవాల్సిన వారి క్యూ పెరిగిపోతోంది.దీంతో ఇప్పటికే గంటల సమయం వెచ్చించిన వినియోగదారులకు గడువు పొడిగింపు పెద్దగా ఊరటనివ్వడం లేదు. ఏజెన్సీకి వెళ్లిన తర్వాత సర్వర్ పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, ఉద్యోగాలకు వెళ్లేవారు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది మరింత ఇబ్బందిగా మారుతోంది. ఒకరోజు సర్వర్ సమస్య కారణంగా.. పని పూర్తికాకపోతే మళ్లీ మరో రోజు ఏజెన్సీకి వెళ్లాల్సి వస్తోంది.కాబట్టి ఆగస్టు 23 వరకు గడువు ఉన్నప్పటికీ.. చివరి వరకు వేచి ఉండకుండా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడం మంచిది. అయితే.. వినియోగదారులకు అదనపు సమయం ఇవ్వడంతో పాటు సర్వర్ సామర్థ్యాన్ని పెంచడం, యాప్ల పనితీరును మెరుగుపరచడం, సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించడం కూడా అవసరం. ఎందుకంటే గడువు పెంచడం ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు.. ఈ-కేవైసీ ప్రక్రియ సజావుగా జరిగేలా డిజిటల్ వ్యవస్థ పనిచేయడమే అసలు పరిష్కారం.ఇదీ చదవండి: కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు? -
జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్.. కేవలం 85 మాత్రమే!
ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్ 85వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. జీప్ ఇండియా 'కంపాస్ 85వ యానివెర్సరీ ఎడిషన్'ను లాంచ్ చేసింది. భారతదేశంలో కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ ప్రత్యేక ఎడిషన్లో.. అదనపు భద్రత, ఫీచర్లతో పాటు ప్రత్యేకమైన బాహ్య, అంతర్గత స్టైలింగ్ అంశాలు కూడా ఉన్నాయి.కంపాస్ 85వ యానివెర్సరీ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కొత్త అప్డేట్స్ చూడవచ్చు. ఇందులో గ్లాస్ బ్లాక్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, వార్షికోత్సవ థీమ్తో కూడిన డీటైలింగ్ కూడా ఉన్నాయి. క్యాబిన్ పూర్తిగా నలుపు రంగు థీమ్తో పాటు మాయన్ గోల్డ్ యాక్సెంట్లు, కాంట్రాస్ట్ డీటైలింగ్ను కలిగి ఉంటుంది.జీప్ తన 85వ యానివెర్సరీ ఎడిషన్ కోసం ఏఎక్స్ఎస్ పర్సనలైజేషన్ ప్యాకేజీల ద్వారా అనేక రకాల యాక్సెసరీలను కూడా అందిస్తోంది. ఇందులో యాంబియంట్ లైటింగ్, సన్రూఫ్ ఇల్యూమినేషన్, ఫ్రంట్ అండ్ వెనుక డాష్క్యామ్లతో కూడిన డిజిటల్ ఇన్సైడ్ రియర్-వ్యూ మిర్రర్ ఉన్నాయి. అయితే ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు లేదు.జీప్ కంపాస్ 85వ వార్షికోత్సవ ఎడిషన్ను భారతదేశం అంతటా కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసి విక్రయించనున్నారు. అధీకృత జీప్ డీలర్షిప్లు మరియు జీప్ ఇండియా వెబ్సైట్ ద్వారా బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ధర రూ. 26.70 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. -
కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు?
ఇంట్లో పొయ్యి వెలిగించేందుకు కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా ఇల్లు తీసుకున్న వారు, అద్దెకు మారిన కుటుంబాలు, కొత్తగా పెళ్లైన జంటలు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా.. అనేక ప్రాంతాల్లో అవి పెండింగ్లోనే ఉంటున్నాయి. అలా రోజూ వేలల్లో.. ఇప్పటికే లక్షల్లో పేరుకుపోయాయి. ఇవికాకుండా మరికొన్ని దరఖాస్తులు కూడా సిద్ధంగా ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై నెలకొన్న ఒత్తిడి, ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాల ప్రభావంతో ఎల్పీజీ లభ్యతపై అప్రమత్తమైన చమురు సంస్థలు ప్రస్తుతం ఉన్న వినియోగదారుల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో కొత్త డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా మాత్రం కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.యుద్ధ ప్రభావం.. సరఫరాపై అప్రమత్తతభారత్ ఎల్పీజీ అవసరాల్లో గణనీయమైన భాగం దిగుమతుల ద్వారానే తీరుతుంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా సరఫరా మార్గాల్లో ఇబ్బందులు తలెత్తితే దేశీయంగా కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇటీవల ఎల్పీజీ సరఫరాలో ఒత్తిడి ఎదురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు రిఫైనరీలు, చమురు సంస్థలకు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది.దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ రిఫైనరీలు, అప్స్ట్రీమ్ సంస్థలు కలిసి రోజుకు గరిష్ఠంగా 63,810 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని సిద్ధంగా ఉంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్నగర్ రిఫైనరీకి అత్యధిక ఉత్పత్తి లక్ష్యం కేటాయించినట్లు సమాచారం.ప్రస్తుతం దేశంలో రోజువారీ ఎల్పీజీ వినియోగం సుమారు 90 వేల టన్నులకు పైగా ఉంది. ఇందులో దిగుమతుల వాటా ఎక్కువగా ఉండటంతో.. భవిష్యత్లో సరఫరా అంతరాయాలు రాకుండా కేంద్రం నిల్వలు, ఉత్పత్తిపై దృష్టి పెట్టింది.మరి కొత్త కనెక్షన్లు ఆపడం ఎందుకు?ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వంటి సంస్థల డీలర్ల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు సిలిండర్ల సరఫరా సాఫీగా కొనసాగించడం ప్రధాన ప్రాధాన్యతగా మారింది. అందుకే కొత్త డొమెస్టిక్ కనెక్షన్లు, డబుల్ బాటిల్ కనెక్షన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఒక కుటుంబానికి ఒకే గ్యాస్ కనెక్షన్ విధానం అమలుపైనా చమురు సంస్థలు దృష్టి పెడుతున్నాయి. ఒకే చిరునామాలో ఉన్న బహుళ కనెక్షన్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.దరఖాస్తులు వెల్లువలా వస్తే పరిస్థితి ఏంటి?కొత్త కనెక్షన్ల కోసం ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఇళ్లు, అపార్ట్మెంట్లు పెరుగుతుండటం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎల్పీజీ వినియోగం పెరగడంతో దరఖాస్తులు పెండింగ్లో పేరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ‘‘సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే పెండింగ్ దరఖాస్తులను దశలవారీగా పరిష్కరించే అవకాశం ఉంది’’ అని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.ఇలా ఇంకెన్నాళ్లు ?కొత్త కనెక్షన్లు పునఃప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించలేదు. అయితే అంతర్జాతీయ సరఫరా పరిస్థితులు మెరుగుపడి, దేశీయ నిల్వలు స్థిరపడితే కొన్ని వారాల నుంచి ఒకటి రెండు నెలల వ్యవధిలో కొత్త కనెక్షన్ల జారీ ప్రక్రియ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది అన్ని ప్రాంతాలకు ఒకేసారి కాకుండా.. సరఫరా పరిస్థితులు, స్థానిక డిమాండ్ ఆధారంగా దశలవారీగా ఉండొచ్చని చెబుతున్నారు.వినియోగదారులకు సూచనలుకొత్త కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్న వారు తమ సమీప గ్యాస్ ఏజెన్సీలో దరఖాస్తు వివరాలు నిరంతరం తెలుసుకుంటూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు. -
న్యూ ఫండ్ ఆఫర్స్.. రిస్కు తక్కువ, రాబడి ఎక్కువ!
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ ఎనర్జీ ఈటీఎఫ్ పేరిట రెండు న్యూ ఫండ్ ఆఫర్స్ను ప్రకటించింది. ఇవి ఆగస్టు 21 వరకు అందుబాటులో ఉంటాయి. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో కనీసం రూ. 100 నుంచి, ఈటీఎఫ్లో రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. నిఫ్టీ ఎనర్జీ టీఆర్ఐ పనితీరు వీటికి ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా విద్యుత్ వినియోగం పలు సంపన్న, వర్ధమాన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగనుండటంతో పునరుత్పాదక విద్యుత్, పంపిణీ మౌలిక సదుపాయాలు, పరికరాలు, కొత్త టెక్నాలజీలు, విద్యుదుత్పత్తి మొదలైన విభాగాలు భారీగా విస్తరించనున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనాలు పొందేందుకు ఈ 2 ఎన్ఎఫ్వోలు తోడ్పడతాయి. నిఫ్టీ 500 స్టాక్స్ నుంచి ఎనర్జీ థీమ్కి సంబంధించి ఎంపిక చేసిన 40 స్టాక్స్ నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్లో ఉంటాయి. ఏబీఎస్ఎల్ఐ నుంచి ఏపెక్స్ సిఫ్లు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ (ఏబీఎస్ఎల్ఐ) తాజాగా ఏపెక్స్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్, ఏపెక్స్ ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్ ఫండ్ పేరిట రెండు స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ను (సిఫ్) ఆవిష్కరించింది. ఇవి ఆగస్టు 24 వరకు అందుబాటులో ఉంటాయి. వీటిలో కనీసం రూ. 10 లక్షల నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్కి నిఫ్టీ 500 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. లిస్టెడ్ ఈక్విటీలతో పాటు పరిమిత స్థాయిలో డెరివేటివ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే వ్యూహంతో దీర్ఘకాలికంగా సంపద వృద్ధికి తోడ్పడటం దీని లక్ష్యంగా ఉంటుంది. ఏపెక్స్ ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్ షార్ట్ ఫండ్ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా టాప్ 100 వెలుపల ఉండే సంస్థలు రాబోయే రోజుల్లో మార్కెట్ లీడర్లుగా ఎదిగే అవకాశాలపై ఆధారితమైనదిగా ఉంటుంది. నియంత్రణ సంస్థల పరిధిలో వైవిధ్యమైన సాధనాల్లో భారీ మొత్తాలను ఇన్వెస్ట్ చేయదల్చుకునేవారు, ఫ్యామిలీ ఆఫీసులు మొదలైన వర్గాలకు ఇవి అనువుగా ఉంటాయి. జీరోధా ఫండ్ హౌస్ ఆర్బిట్రేజ్ ఫండ్ పన్నులను ఆదా చేసే విధంగా మిగులు నిధులను మెరుగైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయదల్చుకునే వారి కోసం జీరోధా ఆర్బిట్రేజ్ ఫండ్ను జీరోధా ఫండ్ హౌస్ ప్రవేశపెట్టింది. మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ రిస్కులతో, ఈక్విటీ ఫండ్స్కి సంబంధించిన ట్యాక్సేషన్ వర్తిస్తుంది కాబట్టి అధిక ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారు దీన్ని పరిశీలించవచ్చని సంస్థ తెలిపింది. ఇది ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ (కనీసం 65 శాతం) డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.చదవండి: పెట్రోల్ పాలసీలో ట్విస్ట్! పాత వాహనాలకు E10 పరిష్కారమా?నిర్దిష్ట స్టాక్స్, వాటి డెరివేటివ్ కాంట్రాక్టుల మధ్య తాత్కాలికంగా ఉండే ధరలపరమైన వ్యత్యాసాలను ఉపయోగించుకుని మెరుగైన రాబడులను సాధించడం దీని లక్ష్యం. అలాంటి అవకాశాలు లేనప్పుడు ఈ ఫండ్ తాత్కాలికంగా తన వద్ద ఉన్న నిధులను స్వల్పకాలిక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. రిస్కు సామర్థ్యాలు తక్కువగా ఉండి, కొద్ది నెలల వ్యవధికి గాను మిగులు నిధులను ఇన్వెస్ట్ చేయదల్చుకునే మదుపరులు దీన్ని పరిశీలించవచ్చు. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. -
పెట్రోల్ పాలసీలో ట్విస్ట్! పాత వాహనాలకు E10 పరిష్కారమా?
దేశంలో పెట్రోల్లో ఇథనాల్ కలపడంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 ఇంధనం వాడుతున్నారు. అయితే.. పాత వాహనాల విషయంలో మాత్రం తక్కువ ఇథనాల్ ఉన్న ఈ10 పెట్రోల్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు.ఇటీవల ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఒక అభిప్రాయ వ్యాసంలో.. నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారితో కలిసి ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరి ప్రకారం.. E20పై చర్చ కేవలం వాహనాల ఇంజిన్కు సమస్య వస్తుందా?, రాదా? అనే దానికే మాత్రమే పరిమితం కాకూడదు. ఇథనాల్ కోసం పంటలు, భూమి, నీటిని ఎక్కువగా ఉపయోగిస్తే భవిష్యత్తులో ఆహారం, ఇంధనం మధ్య పోటీ ఎలా ఉంటుందో.. కూడా తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది.పాత వాహనాలకు E10 ఎందుకు?భారతదేశంలో బీఎస్4 (BS4) ప్రమాణాలకు ముందు.. తయారైన ద్విచక్ర వాహనాల సంఖ్య సుమారు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంది. వీటిలో చాలావరకు కార్బ్యురేటర్తో పనిచేసే వాహనాలే. పాత కార్బ్యురేటర్ వాహనాలు అధిక ఇథనాల్ కలిగిన ఇంధనానికి అనుగుణంగా గాలి, ఇంధన మిశ్రమాన్ని సరిగ్గా సర్దుబాటు చేయలేకపోవచ్చు. అలాగే.. పాత వాహనాల్లోని కొన్ని రబ్బర్ సీల్స్ కూడా ఇథనాల్ను ఎక్కువకాలం తట్టుకోకపోవచ్చు. దీంతో కాలక్రమేణా కొన్ని భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.అయితే.. ఈ వాహనాలను E20కి అనుగుణంగా మార్చడం అసాధ్యం కాదు. అవసరమైన భాగాలను మార్చడం వల్ల ఇది సాధ్యమవుతుంది. కానీ.. దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న వాహనాలన్నింటినీ ఇలా మార్చడానికి చాలా సమయం, ఖర్చు అవుతుంది. అందుకే అప్పటివరకు పాత వాహనాలకు E10ను కూడా అందుబాటులో ఉంచడం ఒక మంచి పరిష్కారం.ప్రభుత్వం ద్రుష్టి ఈ20పైనే!కేంద్ర ప్రభుత్వం మాత్రం E20నే ప్రామాణిక పెట్రోల్గా కొనసాగించాలనే వైఖరిలో ఉంది. ఈ10, ఈ20, సాధారణ పెట్రోల్ ఇలా వేర్వేరు ఇంధనాలను ఒకేసారి అందుబాటులో ఉంచితే నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలకు అదనపు ఖర్చులు, ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.ఇదే సమయంలో ఈ10 కోసం తయారు చేసిన వాహనాల్లో.. ఈ20 వాడితే ఇంధన సామర్థ్యం సుమారు 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. అయితే.. ఈ20 వల్ల ఇంజిన్లకు పెద్దఎత్తున నష్టం జరుగుతోందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని చెబుతోంది.E20 తర్వాత..ప్రస్తుతం ఈ20లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో E27, E30 వంటి అధిక ఇథనాల్ బ్లెండింగ్ వస్తుందా? అనేది ఇప్పుడొక ప్రశ్న.నిజానికి ఇథనాల్ శాతం పెరిగే కొద్దీ.. దాని కోసం అవసరమైన పంటల పరిమాణం కూడా పెరగాలి. ఒక దశలో ఇంధనం కోసం పంటలను ఉపయోగించడం వల్ల ఆహారం కోసం పండించే పంటలు తగ్గిపోవచ్చు. కాబట్టి ఇథనాల్ శాతం ఇంకెత పెంచగలం? అనే దానికంటే.. ఇథనాల్ కోసం ఇంకెంత పంటను మళ్లించగలం? అనే విషయాన్ని గురించి కూడా ఆలోచించాలని నాగేశ్వరన్ అన్నారు.మొక్కజొన్నకు డిమాండ్ఇథనాల్ తయారీలో మొక్కజొన్న పాత్ర కీలకం. ప్రస్తుతం దేశంలో తయారయ్యే ఇథనాల్లో దాదాపు సగం వరకు మొక్కజొన్న నుంచి వస్తోందని నాగేశ్వరన్ పేర్కొన్నారు.మొక్కజొన్నకు ఇథనాల్ పరిశ్రమ నుంచి డిమాండ్ పెరగడంతో.. రైతులు కొంత లాభపడుతున్నారు. కానీ.. ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. మొక్కజొన్న పండించే భూమిలో సోయాబీన్, వేరుశెనగ, ఆవాలు వంటి పంటలను కూడా సాగు చేయవచ్చు. కానీ మొక్కజొన్నకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. ఇతర పంటలకు కేటాయించే భూమి తగ్గుతుంది. ఇది అలాగే కొనసాగితే.. చివరకు ఆహార ఉత్పత్తి, నూనెగింజల సాగుపైనా ప్రభావం చూపవచ్చు. తద్వారా ఆహార కొరత వచ్చే అవకాశం ఉంటుంది.ఇథనాల్ వల్ల ప్రయోజనాలు👉చెరకు రైతులకు లాభాలు👉గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆదాయ మార్గం👉ఇథనాల్కు స్థిరమైన మార్కెట్ కల్పించడం👉చక్కెర మిగులు నిల్వలను తగ్గించడం👉దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంనీటి సమస్యఇథనాల్ విషయంలో మరో ముఖ్యమైన సమస్య నీటి వినియోగం. ముఖ్యంగా చెరకు సాగుకు ఎక్కువ నీరు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నీటి వనరులపై ఒత్తిడి ఉంది. అందుకే ఇథనాల్ కోసం ఎంత చెరకు సాగు చేస్తున్నాం.. అనే దానితో పాటు, దాని కోసం ఎంత నీరు ఉపయోగిస్తున్నామో కూడా చూడాలి.వర్షం ద్వారా సహజంగా పంటలకు అందే నీటితో పాటు నదులు, కాలువలు, బోర్లు, భూగర్భ జలాల నుంచి తీసుకునే నీటిపై కూడా దృష్టి పెట్టాలని నాగేశ్వరన్ సూచిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే.. పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎంత ఉందనే లెక్క మాత్రమే కాకుండా, ఆ ఇథనాల్ తయారు చేయడానికి ఎంత నీరు ఖర్చవుతోంది అనేదీ ముఖ్యం.లాభాలతో పాటు.. నష్టాలను లెక్కించాలిఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇథనాల్ వల్ల వచ్చే ప్రయోజనాలను మాత్రమే చూసి ముందుకు వెళ్లకూడదు. దాని కోసం మనం ఏం కోల్పోతున్నామో కూడా లెక్కించాలి. ఒకసారి రైతులు ఇథనాల్ కోసం ఒక పంటను పెద్దఎత్తున పండించడం మొదలుపెడితే.. దాని ఆధారంగా భూమి, నీటి వినియోగం మారితే.. ఆ నిర్ణయాన్ని తర్వాత వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు. కాబట్టి త్వరగా మార్చుకోగలిగే నిర్ణయాలు ముందుగా తీసుకోవచ్చు. కానీ భూమి, నీరు, పంటల సాగు వంటి వాటిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే నిర్ణయాలను మాత్రం పూర్తిగా అలోచించి, విశ్లేషించిన తర్వాతే తీసుకోవాలని నాగేశ్వరన్ సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వాట్సాప్లో KYC చేస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త! -
వాట్సాప్లో KYC చేస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డ్, ప్రాపర్టీ కొనుగోలు, హోటల్ బుకింగ్ లేదా ఇతర సేవల కోసం పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటి పత్రాలను అడగడం సర్వసాధారణమైపోయింది. అయితే చాలాసార్లు వీటిని వాట్సాప్ ద్వారా పంపండి అని ఏజెంట్ అడిగితే.. ఏ మాత్రం ఆలోచించకుండా పంపిస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.డాక్యుమెంట్స్ పంపిస్తే..మనకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏజెంటుకు లేదా ఇతర వ్యక్తులకు పంపిస్తే ఏం కాదులే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఆ డాక్యుమెంట్ అవతలి వ్యక్తి ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ల్యాప్టాప్లో సేవ్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఆ డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్తాయో.. ఎన్ని కాపీలు తయారవుతాయో కూడా మనకు తెలియదు. వీటిని ఉపయోగించి కొంతమంది మోసాలకు పాల్పడవచ్చు.కొన్నిసార్లు బ్యాంక్ లేదా కంపెనీలకు కేవైసీ అవసరం కావొచ్చు. అలాంటి.. సందర్భంలో ఆ కేవైసీని ఒక ఉద్యోగి తన వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ ద్వారా సేకరిస్తాడు. ఇది కూడా ఒక సమస్యే అనే విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే.. ఆ ఉద్యోగి కంపెనీ మారవచ్చు. లేదా ఉద్యోగం వదిలేయవచ్చు. అలాంటప్పుడు మీ వ్యక్తిగత సమాచారం కంపెనీ అధికారిక వ్యవస్థలో కాకుండా, ఒక వ్యక్తి ఫోనులో ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో మీ పత్రాలను తప్పుడు పనులకు ఉపయోగించే అవకాశం ఉంటుంది.డేటా దుర్వినియోగం అయితే?పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్లో మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఉంటాయి. ఈ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే అనుచిత కాల్స్, మెసేజస్, గుర్తింపు దుర్వినియోగం, ఆర్థిక మోసాలు వంటివి జరగవచ్చు. కాబట్టి వ్యక్తిగత సమాచారం తెలిపే పత్రాల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.DPDP చట్టం మనకు ఏం చెబుతోంది?భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం (Digital Personal Data Protection Act) ప్రకారం.. వ్యక్తిగత డేటాను బాధ్యతగా సేకరించడం, ఉపయోగించడం, నిర్వహించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక సంస్థ మీ వ్యక్తిగత సమాచారం తీసుకుంటే దానికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండాలి, ఆ డేటాను బాధ్యతగా నిర్వహించాలి.భారతదేశంలో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమయంలో మీ వ్యక్తిగా సమాచారం పంపించే ముందు తప్పకుండా ఆలోచించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 వార్షిక నివేదిక ప్రకారం.. రూ. 36,014 కోట్ల విలువైన 23,953 బ్యాంకింగ్ మోసాల కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తోంది.సురక్షితమైన మార్గం ఏమిటి?బ్యాంక్స్, హోటల్స్ లేదా ఇతర కంపెనీలకు కొన్నిసార్లు ఐడెంటిటీ వెరిఫికేషన్ నిజంగానే అవసరం కావొచ్చు. అలాంటప్పుడు మీ డాక్యుమెంట్లను వాట్సాప్ నెంబరుకు పంపించకుండా.. అధికారిక వెబ్సైట్, సెక్యూర్ అప్లోడ్ పోర్టల్ లేదా డిజిటల్ వెరిఫికేషన్ సిస్టం ద్వారా షేర్ చేయడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ డేటాను ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయం మీకు తెలిసి ఉండాలి. -
మారిన గోల్డ్ రేటు.. కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూ.. ఈ రోజు కూడా పెరుగుదల దిశగానే అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటులో మార్పులు జరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలకు సంబంధించిన వివరాలు చూసేద్దాం. -
విదేశీ ఆస్తులు.. కనిపిస్తున్నాయి
అవునండి. నిజమే. మనం చెప్పినా చెప్పకపోయినా, ఇప్పుడు మన విదేశీ ఆస్తులు డిపార్టుమెంటువారికి కనిపిస్తున్నాయి. మీరు రెసిడెంటు అసెస్సీ అయితే, మీ విదేశీ ఆస్తులు, ఆ ఆస్తుల మీద ఆదాయం డిక్లేర్ చేయాలి.ఈ మధ్య ఒక స్కీముని ప్రవేశపెట్టారు. అదేమిటంటే ‘చిన్న చిన్న పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమాచారం తెలియజేయడం‘. దీని పేరు Foreign Assets of Small Tax Payers Disclosure Scheme 2026. టూకీగా చెప్పాలంటే FAST ఈ 2026. షార్ట్కట్లో చెప్పినట్లుగా ఫాస్ట్గా దీన్ని అమలు పరుస్తున్నారు. పారదర్శకత పేరుతో వచ్చిన ఈ స్కీము ప్రకారం మీరు పోర్టల్లోకి లాగిన్ అయితే, మీ విదేశీ ఆస్తులు మీకే కనిపిస్తాయి.విదేశాల్లో సంబంధిత అధికారుల నుంచి అధికారికంగా సేకరించిన సమాచారాన్ని య«థాతథంగా ఈ పోర్టల్లో పొందుపరుస్తున్నారు. పదిలపరుస్తున్నారు. ఈ సమాచారం పోర్టల్లో లభ్యమవుతోంది. లాగిన్ తర్వాత ఏఐఎస్ సెక్షన్లోకి వెళ్లి, కాంప్లయెన్స్ పోర్టల్ విండోకి వెళితే సమాచారం ఉంటుంది.2022 సంవత్సరం నుండి.. చాలా మటుకు దేశాల్లో క్యాలెండర్ సంవత్సరాన్నే వారి వారి ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. మనలాగా ఏప్రిల్ నుంచి మార్చి వ్యవధిని కాదు. 2022, 2023, 2024, 2025 క్యాలెండర్ సంవత్సరాలకు సంబంధించిన సమాచారం మొత్తం సదరు పోర్టల్లో పీడీఎఫ్ ఫార్మాట్లో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్లో మీ పాన్ నంబరు, మీ పుట్టిన తేదీ ఉంటాయి.ఏయే సమాచారం ఉంటుంది.. మీ పేరు, చిరునామా, ఈమెయిల్, ఫోన్ నంబరు, పాన్ నంబర్లతో పాటు సీరియల్ నంబరు, దేశం పేరు, వ్యవహారం, విదేశాల్లో బ్యాంకు అకౌంటు నంబరు, ఆ దేశ కరెన్సీ, డివిడెండ్లు, వడ్డీ, బ్యాంకులో డిపాజిట్లు/వసూళ్లు, చెల్లింపులు, ఆ దేశ కరెన్సీ నుంచి మన దేశానికి మార్చిన వివరాలు, విదేశీ బ్యాంకు అకౌంట్లలోని బ్యాలెన్సులు, ఇదంతా వారు సేకరించి, పోర్టల్లో భద్రపర్చారు. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ తర్వాత ఏం చేయాలి.. డౌన్లోడ్ చేయడం పెద్ద విశేషం కాదు. పనంతా ఆ తరువాతే ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గరున్న సమాచారంతో మీరు చెక్ చేసుకోండి. ఈ సమాచారం, ఆ సమాచారంతో సరిపోతే ఓకే. అలా కాకుండా ఏదైనా కారణాన సమాచారం ఒకటి కాకపోతే? కరెక్టు కాకపోతే? తేడాలుంటే.. విశ్లేషించుకోండి. సమాచారం సరైనదా? కాదా? మీకు సంబంధించినదేనా కాదా? సమాచారం పాక్షికంగానే కరెక్టా? ఇలాంటివన్నీ చూసుకోవాలి. సీరియల్ నంబరువారీగా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. 400 అక్షరాలు దాటి ఇవ్వకూడదు. కాబట్టి శోధించి, మదించి, కుదించి ఇవ్వండి. ముందు మీ అభిప్రాయాన్ని అక్నాలెడ్జ్ చేస్తారు. ఆ తర్వాత ఆరా తీస్తారు. మీరు చెప్పినది నిజమయితే వారు తమ తప్పుని దిద్దుకుంటారు. లేదా మీరే సరిదిద్దుకోవాలి.తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఈ సమాచారం చాలా కీలకమైనది. విదేశాల్లో ఉన్న ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తుల జాబితా ఇది. ఆయా ఆస్తుల మీద ఆదాయం ఎంత ఉందో లెక్కిస్తారు. దాన్ని భారత్లో కూడా వచ్చే ఆదాయంతో కలిపి పన్నుభారం లెక్కిస్తారు. దానికి తగ్గట్లు పన్ను విధిస్తారు. అయితే, చాలా దేశాలతో మనకు అగ్రిమెంట్లు ఉన్నాయి. వాటి ప్రకారం డబుల్ ట్యాక్సేషన్ జరగదు. అయితే, ఆ దేశంలో పన్ను చెల్లించినట్లు ధ్రువీకరించాలి. ఏవైనా తేడాలుండి, మనదేశంలో రేటు ఎక్కువ అయితే, ఆ తేడా చెల్లించాలి. నిర్దేశిత ఫారాలు జతపరచాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ’ఖాన్తో గేమ్స్ ఆడకు’లాగా డిపార్టుమెంటుతో గేమ్లాడవద్దు.- డా. కందాళ సత్యనారాయణ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుగమనిక: పన్నుకు సంబంధించిన సందేహాలు ఉంటే business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 347.28 పాయింట్లు లేదా 0.45 శాతం నష్టంతో 77,661.97 వద్ద.. నిఫ్టీ 76.50 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 24,289.50 వద్ద నిలిచాయి.ఐపిసిఎ లాబొరేటరీస్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. NMDC స్టీల్ లిమిటెడ్, బెల్రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీఎస్ఈ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బరోడా బీఎన్పీ పారిబా ఎంఎఫ్ సీఈవోగా మధు నాయర్
బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ (బీబీఎన్పీఏఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా మధు నాయర్ నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి డెప్యుటేషన్పై వచ్చిన ఎండీ, సీఈవో సంజయ్ కుమార్ గ్రోవర్ స్థానంలో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. సంస్థ ఏఏయూఎం రూ. 57,000 కోట్ల పైచిలుకు స్థాయిలో ఉన్న తరుణంలో నాయర్ నియామకం.. ఫండ్ మరింత వేగవంతమైన వృద్ధి సాధించేందుకు దోహదపడగలదని బీబీఎన్పీఏఎం ఈడీ బీనా వహీద్ తెలి పారు. హెచ్ఎస్బీసీ, ఇన్వెస్కో, కోటక్ తదితర సంస్థల్లో నాయర్కి 28 ఏళ్ల అనుభవం ఉంది. -
డిఫెన్స్ బలగాల కోసం బజాజ్ ‘ప్రోషీల్డ్’ వాహన బీమా
బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా రక్షణ బలగాల కోసం ప్రోషీల్డ్ పేరిట వాహన బీమాను ప్రవేశపెట్టింది. పోస్టింగ్ల మధ్య వాహనాల రీలొకేషన్ సమయంలో ఏవైనా ప్రమాదాలు తలెత్తితే పరిహారం, డ్రైవింగ్ లైసెన్స్లాంటివి పోగొట్టుకుంటే వాటిని తిరిగి సమకూర్చుకునేందుకు ఆర్థిక తోడ్పాటు, విమానాశ్రయాలకు ప్రయాణించేటప్పుడు వాహన ప్రమాదాల బారిన పడటం వల్ల ఫ్లయిట్స్ మిస్ కావడం, హోటల్ బస వ్యయాలు మొదలైన వాటికి ట్రావెల్ ఎమర్జెన్సీ ప్రొటెక్షన్ కింద రీయింబర్స్మెంట్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాల విషయంలో వివిధ రకాల స్టాండెలోన్ యాడ్–ఆన్ కవర్స్ను ఎంచుకోవాల్సిన అవసరం లేకుండా మరిన్ని కొత్త ఫీచర్లతో వీపే 2.0 పథకాన్ని కూడా సంస్థ ఆవిష్కరించింది. -
బంగారం కొనాలా...ఆగాలా...
ప్రతిరోజూ కోట్ల మంది ఇవాళ గోల్డ్ రేటు ఎంత అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటారు. లక్షల మంది తమ స్నేహితులను, తెలిసినవాళ్లని, ఇప్పుడు బంగారం కొనొచ్చా...మరికొంత కాలం ఆగాలా అని ప్రశ్నిస్తుంటారు. ప్రతిరోజూ ధర ఇంకాస్త పడుతుందేమో అనిపిస్తుంది. అంతలోనే మరింత పెరిగితే అవకాశం మిస్ అవుతుందేమో అనే భయం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ సంప్రదాయం కోసం కొనేవారికి, పెట్టుబడి చేసేవారికి ఇది సాధారణంగా కలిగే సందేహం. మరి ఇప్పుడు బంగారం ధర చూసి షాక్ అవుతున్నారా... ఇంకా పెరిగేముందే కొనేయాలని ఆలోచిస్తున్నారా... అయితే సాక్షి వెల్త్ మిమ్మల్ని ఈరోజే కొనండి అని చెప్పదు. కానీ సరైన నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన విషయాలను క్లియర్గా వివరిస్తుంది. బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో ఇప్పుడే కొనాలా లేక ధర తగ్గేవరకు వేచి చూడాలా? అనే ప్రశ్న ప్రతి కొనుగోలుదారుడిని వెంటాడుతోంది.అయితే బంగారం కొనడంలో కేవలం ఈరోజు రేటుమాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, దేశీయ డిమాండ్, మేకింగ్ చార్జీలు, కొనుగోలు ఉద్దేశం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. సరైన సమయంలో సరైన అవగాహనతో బంగారం కొంటేనే అది ఆభరణంగా మాత్రమే కాకుండా భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విలువైన ఆస్తిగా మారుతుంది. 2026 ప్రారంభంలోనే వినియోగదారులకు గోల్డ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ చూపించింది. జనవరిలో దాదాపు రూ.2 లక్షల దాకా ఎగసిన బంగారం ధర అమాంతంగా చల్లబడింది. మార్చిలో 1.30 లక్షలస్థాయికి పడిపోయింది. గరిష్టం నుంచి 23 శాతం కరెక్షన్. కానీ కథ అక్కడితో ముగియలేదు.జూన్లోకూడా పతనం చూసిన పసిడి ధర ఆగస్టులో మళ్లీ పైకి పరుగు ప్రారంభించించింది. ఇదే బంగారం అసలు స్వభావం. పరుగులో ఉన్నపుడు ఆకాశమే హద్దులా కనిపిస్తుంది. పడిపోతున్నపుడు ఇంకా పతనమవుతుందేమోనని భయం పుట్టిస్తుంది. బంగారం ధర పెరుగుతున్నపుడు ఇంత ధరలో ఎలా కొనగలం అని ఆగుతాం.తగ్గుతున్నపుడు ఇంకాస్త తగ్గాక కొందాంలే అని మళ్లీ వాయిదా వేస్తాం..ఊహించినట్టే కొన్నిరోజులకు బంగారం ధర భారీగా తగ్గుతుంది. అయితే అప్పుడు మళ్లీ కొత్త అనుమానం..కొనేశాక ధర ఇంకా పడితే అని ఆందోళన కలుగుతుంది.బంగారం విషయంలో ప్రతి వినియోగదారుడు/పెట్టుబడిదారుడు ఎదుర్కొనే సమస్య ఇదే. ధర పడినపుడు భయపడినవారు. మళ్లీ పెరుగుతుంటే కూడా అదే భయంతో ఉన్నారు. ఇంకా పెరిగిపోతుందేమో అనే అంచనాలతో కొందరు కొనడానికి పరుగులు తీస్తున్నారు.కానీ పెరుగుతున్న ధరను చూసి తొందరపడడం ఎంత ప్రమాదమో భారీ కరెక్షన్ను చూసి దూరంగా ఉండడం కూడా అంతే అవివేకం. బంగారం ఒకప్పటిలా కేవలం ఆభరణం కోసమే కాదు. ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, రూపాయి కదలికలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, వడ్డీరేట్ల నిర్ణయాలతో కదిలే ఒక ఆస్తి.అందుకే ఇప్పుడు కొనాలా?అన్న ఆలోచన కంటే ఎందుకు కొంటున్నాం, ఎంత కొంటున్నాం, ఏరూపంలో కొంటున్నాం? అన్నదే అసలు ప్రశ్న. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధర నేరుగా పైకి వెళ్లడంలేదు. భారీ ర్యాలీ. తర్వాత భారీ కరెక్షన్, మళ్లీ ర్యాలీ. ఇదే దాని ప్రయాణం. అందుకే బంగారం విషయంలో అసలు ప్రశ్న ఇపుడు ధర ఎంత అని కాదు ఇప్పుడు పెట్టుబడి వ్యూహం ఏమిటి అని? ఆగస్టులో ర్యాలీ ఎందుకు ఇటీవలి బంగారం ర్యాలీకి కారణం ఒకటి కాదు. అంతర్జాతీయ మార్కెట్లు, వడ్డీరేటు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దేశాల మధ్య యుద్ధాలు , సురక్షిత పెట్టుబడికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నడిమాండ్, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ఇలా అనేక అంశాలు కలిసి బంగారాన్ని పైకి ఎగదోశాయి. అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి పెరిగినపుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సేఫ్ హెవెన్ ఆస్తిగా చూస్తారు. ఇదే సమయంలో దేశీయంగా మరో అంశం పనిచేస్తుంది. అది రూపాయి కదలికలు. డాలరుతో రూపాయి బలహీన పడినా, బలపడినా అది బంగారం ధరను ప్రభావితం చేస్తుంది. అధిక ధరల కాలంలో ఆభరాణాల డిమాండ్ ఒత్తిడికి గురైనా బార్లు, కాయిన్లు ఈటీఎఫ్లలో పెట్టుబడి డిమాండ్ బలంగానే కొనసాగుతోంది. బంగారం ఎందుకు పడింది ఇదే పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సిన కీలకపాఠం.బంగారం ఎంత బలమైన ఆస్తి అయినా అది పడదని కాదు. జనవరిలో రికార్డు స్థాయికి చేరిన తర్వాత లాభాల స్వీకరణ, మార్కెట్ అంచనాల్లో మార్పులు, డాలర్/వడ్డీరేట్ల ప్రభావం వంటి అంశాలు కలిసి బంగారం ధరపై ఒత్తిడి తెచ్చాయి. జీవితకాల గరిష్టస్థాయికి చేరిన కొన్ని వారాల్లోనే పసిడి 23 శాతం పతనమైంది.పెట్టుబడిదారులకు ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక . బంగారం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అనే నమ్మకంతో మొత్తం డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. బంగారం మళ్లీ 2 లక్షలకు పెరుగుతుంది అనో, మళ్లీ లక్షకి పడిపోతుందనో ఇలా ఏ దిశగా ఆలోచించినా ప్రమాదకరమే. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా బంగారం ధర అంచనాల్లో ఒకే లక్ష్యాన్ని చెప్పలేదు. ప్రస్తుత స్థాయి నుంచి సాధారణ పరిస్థితుల్లో సుమారు 5 శాతం అటూ ఇటూ కదిలే అవకాశముందని మాత్రమే తెలిపింది. ఆర్థిక మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, తక్కువ వడ్డీరేట్ల అంచనాలు కారణంగా బంగారంధర మరింత పైకి వెళ్లే అవకాశముందని నివేదికలో పేర్కొంది. మరోవైపు బలమైన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న బాండ్ యీల్డ్స్, ప్రశాంతమైన స్టాక్ మార్కెట్లు ఉంటే బంగారం ధర వెనక్కి రావచ్చని కూడా తెలిపింది. అంటే బంగారానికి పైకి పెరిగే కారణాలు ఎన్ని ఉన్నాయో కిందికి దిగే కారణాలు కూడా అన్నీ ఉన్నాయి.అందుకే పెట్టుబడిదారులు బంగారం ధర టార్గెట్ ఎంత? కంటే కొనుగోలు విధానం ఎలా ఉండాలి అని మాత్రమే ఆలోచించాలి.ఇప్పుడు ఏం చేయాలి?బంగారంలో పెట్టుబడి చేయాలనుకుంటే ఒక్కసారిగా మొత్తం పెట్టుబడి పెట్టొద్దు. ఉదాహరణకి మీదగ్గర రూ.5 లక్షలు ఉంటే ఒకేసారి కొనడం సరికాదు.. ఎందుకంటే ధర 10 శాతం పడితే మీ పెట్టుబడిలో రూ.50000 పోతుంది.దీంతో మానసిక ఒత్తిడి మొదలవుతుంది.అందుకే ఐదు లక్షలను ఐదు విడతలుగా లక్ష చొప్పున ధర పడినపుడల్లా కొనుగోలు చేయడం సరైన నిర్ణయం ఇలా విడతల్లో తక్కువ ధరకు కొనుగోలు చేయడం మార్కెట్ టైమింగ్ అనుసరించడం మాత్రమే కాదు..మార్కెట్ టైమింగ్ ప్రమాదాన్నికూడా తగ్గించే వ్యూహం.ఆభరణమా?పెట్టుబడా?బంగారం కొనుగోలు విషయంలో ఈ రెండిటినీ ఎప్పుడూ కలపొద్దు..బంగారం కొనేటప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే ..ఆభరణాలు కొని బంగారంలో పెట్టుబడి పెట్టినట్టే అని అనుకోవడం. ఆభరణాల ధరలో బంగారం విలువతో పాటు మేకింగ్ చార్జీలు, వేస్టేజ్, జీఎస్టీ ఇతర పన్నులు అన్ని కలిసి ఉంటాయి. విక్రయించే సమయంలో ఈ ఖర్చు తిరిగి రాదు. పెట్టుబడే లక్ష్యమైతే గోల్డ్ ఈటీఎఫ్,గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్, కాయిన్లు, బార్లు, బిస్కట్ల రూపంలో అవసరానికి అనుగుణంగా కొనే మార్గాలు పరిశీలించవచ్చు. అయితే ప్రతి ఉత్పత్తికి లిక్విడిటీ, టాక్సేషన్, ట్రాకింగ్ డిఫెరెన్స్ వంటి అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి బంగారం ఒక్కటే అయినా పెట్టుబడి ఏ రూపంలో చేస్తున్నామనేది చాలా ముఖ్యం. పెట్టుబడి పెట్టేవారికి అత్యంత ఉపయోగకరమైన వ్యూహం గరిష్టధరను ఊహించి కొనడం కాదు..ధరల హెచ్చుతగ్గులను తట్టుకునేవిధంగా పెట్టుబడిని నిర్మించడం.పెట్టుబడిదారుడి కోసం గోల్డ్ చెక్ లిస్ట్→ బంగారం ఎందుకు కొనాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి → ఆభరణం కోసమా? పెట్టుబడా? రెండిటినీ వేరు చేయాలి → మొత్తం డబ్బును ఒకేసారి పెట్టొద్దు → ధర పెరుగుతున్నపుడు ఫోమోకు లోనుకావద్దు → ధర పడుతుంటే భయంతో అమ్మొద్దు → పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో బంగారం వాటా 10 శాతం వరకు ఉండాలి → గోల్డ్ ఈటీఎఫ్/ఫిజికల్ గోల్డ్ మధ్య ఖర్చులు, లిక్విడిటీ, పన్నులు పోల్చండి → స్వల్పకాలిక ధర అంచనాలను దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంగా మార్చొద్దు.ఇప్పుడే కొనాలా?ఆభరణం కొనడం అవసరం అయితే... అంటే పెళ్లి, ఏదైనా పూజా కార్యక్రమం వంటి నిర్దిష్ట అవసరం ఉంటే తక్కువ ధరకి దొరికేవరకూ వాయిదా వేయడం కంటే అవసరాన్ని బట్టి కొనుగోలును చేయడం మంచిది. అదే పెట్టుబడి కోసమైతే ఒకే రోజు ధరను చూసి పెట్టుబడి పెట్టకుండా విడతలవారీగా చేయడం సరైన విధానం. ఇప్పటికే కుటుంబ ఆస్తిలో బంగారం ఎక్కువగా ఉంటే ఆశతో అదనంగా మళ్లీ కొనడం కన్నా అది మొత్తం ఆస్తిలో ఎంత శాతం ఉందో చూసి పెట్టుబడి చేయడం ఉత్తమం. పసిడి ర్యాలీ సమయంలో వినియోగదారులకు కలిగే ప్రమాదకరమైన భావన ఏంటంటే ఫోమో (FOMO & Fear of Missing out) అంటే ఇప్పుడు కొనకపోతే రేపు ఇంకా ఖరీదవుతుంది. అవకాశాన్ని కోల్పోతాం అనే భావన. ఈ ఆలోచనతో పెట్టుబడిలోకి దిగడం ప్రమాదకరం. బంగారం మనకు చెప్పే పెద్ద పాఠం ఇదే..ధర పెరిగినపుడు ఉత్సాహంతో పరుగెత్తి కొనద్దు, ధర పడిపోతున్నపుడు భయంతో అమ్మొద్దు.ఫైనల్ వార్నింగ్బంగారం కథ ఇంకా ముగియలేదు. బంగారం కొనేవారు ‘ఇంకా ఎంత పెరుగుతుంది?‘ అనే ప్రశ్నతో చూడడం పొరపాటు. ఎందుకంటే 2026లో అది ఇప్పటికే ఒక పాఠం నేరి్పంది. రూ. 1.35 లక్షల నుంచి 1.79 లక్షలకి పెరిగి అక్కడినుంచి వారాల వ్యవధిలోనే 1.38 లక్షలకి పతనమైంది.మళ్లీ కొన్ని నెలల్లో 1.55 లక్షలకు చేరుకుంది. అందుకే సరైన రోజున కొనడంలో కాదు ..సరైన పద్ధతిలో కొనడం ద్వారానే బంగారంలో విజయం సాధించగలుగుతాం. – సాక్షి, వెల్త్డెస్క్ -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్!
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ ఈ వారంలో పరిమిత శ్రేణిలోనే కదలాడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశముంది. కార్పొరేట్ తొలి త్రైమాసిక (క్యూ1) ఫలితాల ప్రకటన దాదాపు ముగియడంతో, ఇకపై విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల సరళి, స్థూల ఆర్థిక గణాంకాలే మార్కెట్కు కీలకం కానున్నాయి. ‘హార్మూజ్ జలసంధి పరిణామాలు, అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలపైనే ఇన్వెస్టర్ల దృష్టి ప్రధానంగా ఉండనుంది. అంతర్జాతీయ ఫెడ్ విధానాలు, రూపాయి మారకం విలువ, క్రూడాయిల్ ధరల ఆధారంగానే సూచీలు కదులుతాయి’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు. చల్లారని చమురు ధరలు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం, ఇరాన్ నాయకత్వం మధ్య శాంతి ఒప్పందంలో ఎలాంటి పురోగతి చోటు చేసుకోవడం లేదు. మరోవైపు హార్మూజ్ జలసంధిలో చమురు నౌకలపై(ట్యాంకర్లు) దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 88 డాలర్లకు చేరుకుంది. ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనాన్ని నిరవధికంగా కొనసాగించడంతో పాటు ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా స్పష్టం చేసింది. ఈ పశ్చిమాసియా పరిణామాలతో క్రూడ్ ధరలు మళ్లీ పెరగొచ్చనే అంచనాలు దలాల్ స్ట్రీట్కు ప్రతికూలాంశంగా మారొచ్చు. ఫెడ్ మినిట్స్పై దృష్టి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) ఆగస్టు 19న విడుదల కానున్నాయి. కీలక వడ్డీ రేట్ల అంశంపై ఫెడ్ ఎలాంటి దృక్పథాన్ని అవలంబించనుందనే సంకేతాల కోసం మార్కెట్ వర్గాలు వేచిచూస్తున్నాయి. మినిట్స్లో ఫెడ్ ‘కఠిన వైఖరి’ ప్రదర్శించినట్లు కనిపిస్తే విదేశీ నిధుల రాక మందగించి భారత మార్కెట్లలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇటీవల అమెరికా లేబర్ మార్కెట్ గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును కొంత కాలం వాయిదా వేయవచ్చనే అంచనాలున్నాయి. తుది దశకు ఆర్థిక ఫలితాలు కార్పొరేట్ క్యూ1 ఫలితాల ఘట్టం ముగింపునకు వచ్చింది. అంతర్జాతీయ ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా విడుదలైన ఫలితాలు మార్కెట్కు బలమైన మద్దతిచ్చాయి. నిఫ్టీ 50 లో 33 కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించాయి.కొనుగోళ్ల బాటలో ఎఫ్పీఐలు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ఆగస్టు తొలి అర్ధభాగంలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఆగస్టు 1–15 తేదీల మధ్య నికరంగా రూ.16,621 కోట్లు పెట్టుబడి పెట్టారు. నాణ్యమైన షేర్లు చవక వాల్యుయేషన్ల వద్ద లభిస్తుండటం, కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించడం, ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఎఫ్పీఐల కొనుగోళ్లకు కారణమయ్యాయి. అంతకు ముందు నెల (జూలై)లో రూ.20,200 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈక్విటీలతో పాటు డెట్ (రుణ) మార్కెట్పైనా విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు.గతవారం ట్రేడింగ్ ఇలా.. వరుసగా రెండు వారాల లాభాలకు అడ్డుకట్ట వేస్తూ గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. దేశీయ కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఎగువ స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ గమనాన్ని నియంత్రించాయి. బెంచ్మార్క్ సహా ప్రధాన సూచీలన్నీ స్వల్ప శ్రేణిలోనే ట్రేడయ్యాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటిస్తూ ఎంపిక చేసిన షేర్లలో మాత్రమే కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఫలితంగా, గత వారం మొత్తంగా సెన్సెక్స్ 490 పాయింట్లు (–0.62%), నిఫ్టీ 205 పాయింట్లు (–0.83%) చొప్పున నష్టపోయాయి.నిఫ్టీ టెక్నికల్ అవుట్లుక్ ఇటీవల నిఫ్టీ సూచీకి 24,000–24,500 శ్రేణి అత్యంత కీలకమైన నిరోధంగా మారింది. ఒకవేళ షార్ట్ కవరింగ్ జరిగి ఈ స్థాయిని ఛేదిస్తే... ఆపై స్థాయిలో 24,600 – 24,800 వద్ద మరో బలమైన నిరోధం ఎదురుకావచ్చు. అమ్మకాలు చోటు చేసుకుంటే దిగువ స్థాయిలో 24,250, 24,000 వద్ద కీలక మద్దతు లభిస్తోంది. నిఫ్టీ 24,000 కంటే పైన ఉన్నంతవరకు మార్కెట్ కన్సాలిడేషన్ (స్థిరీకరణ) దశలోనే ఉంటుంది. అందుకే కీలక సపోర్ట్ వద్ద ‘పతనమైన ప్రతిసారి కొనుగోళ్లు’ (బై ఆన్ డిప్స్) వ్యూహాన్ని పాటించవచ్చని టెక్నికల్ నిపుణులు సూచిస్తున్నారు. -
వీటి ‘హోల్డింగ్’ వ్యూహాత్మకమే!
హోల్డింగ్ కంపెనీల్ని మార్కెట్ పెద్దగా ఇష్టపడదు. ఎందుకంటే సొంతగా పెద్ద వ్యాపారమేదీ ఉండదు. ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి... వాటిపై వచ్చే డివిడెండ్లే ఆదాయంగా నెట్టుకొస్తూ ఉంటాయి. ఆ వాటాల విలువ పెరిగితే... ఈ కంపెనీల విలువా పెరుగుతుంది. అంతే. కాబట్టే నేరుగా వ్యాపారం చేసే కంపెనీల షేర్లపైనే ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. మరి సొంతగా మంచి వ్యాపారం చేస్తూనే, ఇతర సంస్థల్లోనూ వాటాలున్న కంపెనీల సంగతేంటి? ఒకవైపు ప్రధాన వ్యాపారం నుంచి ఆదాయం వస్తుంది. మరోవైపు పెట్టుబడులపై డివిడెండ్లూ వస్తాయి. భవిష్యత్తులో ఆ కంపెనీల వాటా విలువ పెరిగితే... అదో అదనపు ప్రయోజనం. వీటన్నిటికీ తోడు... ఇలాంటి కంపెనీలు కొన్నిసార్లు వాటి మొత్తం ఆస్తుల విలువతో పోలిస్తే (బుక్ వేల్యూ) మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంటాయి. అంటే.. వ్యాపారమూ ఉంది. పెట్టుబడులూ ఉన్నాయి. భవిష్యత్తులో విలువ అన్లాక్ అయ్యే అవకాశమూ ఉంది. కాబట్టి ఇవి సాధారణ హోల్డింగ్ కంపెనీలు కావు. వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీలు. ఇలాంటి కంపెనీల గురించి వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్... ఇన్ఫో ఎడ్జ్... ఈఐడీ ప్యారీ... మహీంద్రా అండ్ మహీంద్రా, గోద్రెజ్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టూబ్రో... ఇవన్నీ ఇన్వెస్టర్లకు సుపరిచితమైన కంపెనీలే. విశేషమేంటంటే ఇన్వెస్టర్లు చాలామంది వీటి ప్రధాన వ్యాపారాన్నే చూస్తుంటారు. ఎప్పటికప్పుడు అవి ప్రకటించే ఫలితాలను విశ్లేషిస్తుంటారు. కానీ వీటికి రకరకాల కంపెనీల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ల సంగతేంటి? ఆ కంపెనీల్లో వాటాల విలువ మాటేంటి? ఆ విలువంత ఈ కంపెనీ షేర్లలో ప్రతిఫలిస్తోందా? అనేది పెద్దగా చూడరు. అలా చూసి ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మెరుగైన రాబడులొస్తాయనేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ కంపెనీల షేర్లను కొంటే... వాటికి ఇన్వెస్ట్మెంట్లున్న మొత్తం ఎకో సిస్టమ్లో పెట్టుబడి పెట్టినట్లే. కాబట్టి దాని విలువ పెరిగే అవకాశాలూ ఎక్కువే. ఇలాంటి కంపెనీల గురించి వివరంగా చూద్దాం.ది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీకి అచ్చమైన ఉదాహరణ మురుగప్ప గ్రూప్నకు చెందిన ఈ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే బీఎస్ఏ ఎస్ఎల్ఆర్తో పాటు మోంట్రా, హెర్క్యులిస్ వంటి సైకిళ్లన్నీ ఈ కంపెనీ బ్రాండ్లే. వీటి తయారీతో పాటు లిస్డెట్ కంపెనీలైన సీజీ పవర్, శాంతి గేర్స్లో దీనికి మెజారిటీ వాటాలున్నాయి. శాంతి గేర్స్ను ఈ మధ్యనే డీలిస్ట్ చేశారు కూడా. వీటితో పాటు మోంట్రా ఎలక్ట్రిక్, క్లీన్ మొబిలిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థల్లో మెజారిటీ వాటాలున్నాయి. సైకిళ్లతో పాటు ఇంజినీరింగ్, మెటల్ ఉత్పత్తులు, మొబిలిటీ, ఈవీ, పారిశ్రామిక పరికరాల తయారీని వంటి వ్యాపారాలను కంపెనీ నేరుగా నిర్వహిస్తోంది కూడా. ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రస్తుతం సీజీ పవర్ మార్కెట్ విలువ ఒక్కటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ విలువను దాటేసింది. మరి సీజీ పవర్లో దాదాపు 56 శాతానికి పైగా వాటా కలిగి ఉన్న ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్కు... ఇతర కంపెనీల్లోని వాటాలను, సొంత వ్యాపారాలను జోడిస్తే విలువ పెరుగుతుంది కదా? అంటే హోల్డింగ్ కంపెనీ తరహాలో మార్కెట్ దీనికి తక్కువ విలువే ఇస్తోందని స్పష్టమవుతోంది. మరి భవిష్యత్తులో ఈ అన్లిస్టెడ్ కంపెనీలు లిస్ట్ అయినా... వాటి విలువ పెరిగినా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు ధర కూడా పెరుగుతుందనటంలో అతిశయోక్తి లేదు కదా? అందుకే దీన్ని ఇన్వెస్ట్మెంట్కు తగిన వ్యూహాత్మ హోల్డింగ్ కంపెనీగా భావించవచ్చు. ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) నౌఖ్రీ, 99 ఏకర్స్, జీవన్సాథీ, శిక్షా వంటి ఇంటర్నెట్ సంస్థలు ఈ కంపెనీ సొంతం. ఇవన్నీ ఆయా రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నవే. మంచి ఆదాయాన్ని సాధిస్తున్నవే. ఏఐ వచ్చాక వీటి వ్యాపారాలు కొద్దిమేరకు తగ్గుతున్న మాట వాస్తవమే అయినా... ఏఐలో ఇన్వెస్ట్మెంట్లు చేయటం ద్వారా కంపెనీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది. పైపెచ్చు జొమాటో, పాలసీ బజార్, అడ్డా 247, షాప్ కిరాణాతో సహా బోలెడన్ని స్టార్టప్స్లో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. జొమాటో, పాలసీ బజార్లో ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు ఇప్పటికే బ్లాక్ బస్టర్ ఫలితాలనిచ్చాయి. మిగతా వాటిలోనూ కొన్నింటి విలువ బాగా పెరిగింది. ఒకరకంగా దీన్ని లిస్టెడ్ వెంచర్ క్యాపిటల్ ప్లాట్ఫామ్గా భావించవచ్చు. దాంతోపాటు లాభాలిచ్చే అర్థవంతమైన వ్యాపారాలూ ఉన్నాయి. అందుకే ఈ కంపెనీ షేరు బాగా పెరిగి... ప్రస్తుతం ఏఐ బూమ్లో కొంత కరెక్షన్కు గురైంది. ఈఐడీ ప్యారీ.. తక్కువ ధరకే..? ఈ కంపెనీని చాలామంది షుగర్ తయారీ కంపెనీగానే చూస్తారు. చక్కెర, బెల్లం, న్యూట్రాస్యూటికల్స్, బయో ఉత్పత్తుల్ని విక్రయించే ఈ కంపెనీకి సొంత చక్కెర రిఫైనరీ ఉంది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. వీటన్నిటినీ మించి... ఎరువుల తయారీలో అగ్రగామి అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్లో ఈ కంపెనీకి దాదాపుగా 56 శాతానికిపైగా వాటా ఉంది. ఆ వాటా విలువ ఒక్కటే దాదాపుగా రూ.35వేల కోట్లు. పైపెచ్చు ఇండియన్ పొటాష్ కంపెనీలో సైతం దాదాపుగా రూ.400 కోట్ల విలువైన వాటాలున్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఈఐడీ ప్యారీ షేరు ధర తక్కువే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈఐడీ ప్యారీ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపుగా రూ.13వేల కోట్ల దగ్గర్లో ఉంది. మరి కోరమాండల్లో రూ.35వేల కోట్లు, ఇండియన్ పొటాష్ లో రూ.400 కోట్ల పెట్టుబడులతో పోల్చినా ఇది తక్కువే కదా? పైపెచ్చు షుగర్ కంపెనీగా దేశవ్యాప్తంగా చక్కటి వ్యాపారం ఉంది. లాభాలు ఆర్జిస్తోంది. అందుకే వ్యూహాత్మక ఇన్వెస్ట్మెంట్కు ఇలాంటి సంస్థలు మెరుగైనవన్నది నిపుణుల సూచన. మహీంద్రా అండ్ మహీంద్రా... ఎం అండ్ ఎం మాత్రం వీటన్నింటికీ భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే దీనికి హోల్డింగ్ కంపెనీగా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులతో పాటు... బలమైన వ్యాపారమూ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సరీ్వసెస్, మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, స్వరాజ్ ఇంజిన్స్ లిమిటెడ్, మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్, మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్ లిమిటెడ్, ఎస్ఎంఎల్ ఇసుజు వంటి లిస్టెడ్ కంపెనీల్లో మెజారిటీ వాటాలు ఎం అండ్ ఎం సొంతం. ఇక టెక్ మహీంద్రా, సీఐఈ ఆటోమోటివ్ ఎగ్జిట్లో మైనారిటీ వాటాలున్నాయి. ఇవికాక చాలా అన్లిస్టెడ్ సంస్థలు దీనికి నూరుశాతం అనుబంధ కంపెనీలుగా ఉన్నాయి. ఈ పెట్టుబడులు, వాటాలను పక్కనబెడితే... ఎం అండ్ ఎం వాహనాల తయారీలో అగ్రగామి. ట్రాక్టర్లలో లీడర్. ఈవీ మొబిలిటీలో కంపెనీ వేగంగా ఎదుగుతోంది. అంటే.. ఒక ఎం అండ్ ఎం షేరు కొంటే దాదాపుగా కంపెనీకి చెందిన గ్రూపు సంస్థలన్నింటినీ హోల్డ్ చేస్తున్నట్లే లెక్క. భవిష్యత్తులో వీటి వాటాల విలువ పెరగటంతో పాటు అన్లిస్టెడ్ కంపెనీలు కూడా లిస్టయితే ఎం అండ్ ఎం విలువ కూడా పెరుగుతుంది కదా!. అందుకే దీన్ని వ్యూహాత్మక ఇన్వెస్ట్మెంట్కు తగిన హోల్డింగ్ కంపెనీగా భావించవచ్చు. లార్సన్ అండ్ టూబ్రో ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో ఇది లీడర్. ఈపీసీ కాంట్రాక్టుల్లో అగ్రగామి. మెట్రో రైళ్లతో సహా భారీ నిర్మాణాల్లో కంపెనీది తిరుగులేని రికార్డు. వీటన్నిటితో పాటు ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఫైనాన్స్, ఎల్ అండ్ టీ సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ వ్యాపారాల్లో మెజారిటీ వాటాలున్నాయి. ప్రస్తుత విలువను బట్టి చూస్తే ఎల్ అండ్ టీ షేరును దాని వాస్తవ వ్యాపారాన్ని బట్టే విలువ కడుతున్నారన్నది నిపుణుల మాట. మరి దీని వాటాల విలువను కూడా లెక్కిస్తే!!. భవిష్యత్తులో కూడా ఈ విలువలు పెరుగుతూ ఉంటాయి కనక దీన్ని వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇవే కాదు. ఇలా విశ్లేషిస్తూ వెళితే చాలా హోల్డింగ్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్కు తగినవిగానే కనిపిస్తాయి. గోద్రెజ్ ఇండస్ట్రీస్ను తీసుకుంటే దీనికి ఓలియో కెమికల్స్, కెమికల్స్ వ్యాపారాలతో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్, గోద్రెజ్ ప్రాపర్టీస్ సహా ఇతర గ్రూపు కంపెనీల్లో వాటాలున్నాయి. కిర్లోస్కర్ ఇండస్ట్రీస్కు సొంత వ్యాపారాలతో పాటు కిర్లోస్కర్ గ్రూపు కంపెనీల్లో వాటాలున్నాయి. కల్యాణి ఇన్వెస్ట్మెంట్స్, మహారాష్ట్ర స్కూటర్స్, కేశోరామ్ ఇండస్ట్రీస్.. వీటన్నిటిదీ ఇదే స్టోరీ. కేశోరామ్ ఎప్పటికప్పుడు తన ఇన్వెస్ట్మెంట్లను అన్లాక్ చేస్తూ షేర్ హోల్డర్ల వాటా విలువ పెంచుతోంది. కాబట్టి ఇవన్నీ వాచ్లిస్ట్లో పెట్టుకోవాల్సినవే. హోల్డింగ్కంపెనీలు తక్కువ ధరకే ఎందుకు వస్తాయంటే... → క్యాపిటల్ గెయిన్స్ పన్నును కూడా మార్కెట్లు పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే ఒక కంపెనీకి వేరొక కంపెనీలో ఉన్న మొత్తం వాటాను విక్రయించేసిందనుకోండి. ఆ వచి్చన సొమ్ముపై దాదాపు 12.5 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను చెల్లించాలి. అంటే ఆ మేరకు వాటాల విలువను తక్కువగానే చూడాలి కదా!. → హోల్డింగ్ కంపెనీలు తమ వాటాలను విక్రయించటం అంత తేలికకాదు. దాదాపుగా అసాధ్యం కూడా. మరి హోల్డింగ్ చేయటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులున్నపుడు వాటికి పూర్తిగా విలువ కట్టడమెందుకన్నది మార్కెట్ భావన. అందుకే హోల్డింగ్ కంపెనీలు దాదాపుగా వాటి విలువకన్నా 30–40 శాతం తక్కువకే ట్రేడవుతూ ఉంటాయి. → కాబట్టి ఇన్వెస్టర్లు వీటిని విశ్లేషించేటపుడు దానికి లిస్టెడ్ కంపెనీల్లో ఉన్న వాటాల విలువెంత? అన్లిస్టెడ్ సంస్థల్లో ఉన్న వాటాల విలువెంత? సొంతగా అది చేస్తున్న వ్యాపార విలువెంత? అనేది చూడాలి. క్యాష్– ఇన్వెస్ట్మెంట్లు– రుణాలు, హోల్డింగ్ కంపెనీకి మార్స్క్ ఇచ్చే 30–40% డిస్కౌంట్ అన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే ఆ కంపెనీ విలువను నిర్ణయించుకోవాలి. అప్పటికీ తక్కువ ఉంటే... దాన్ని తక్షణ ఇన్వెస్ట్మెంట్కు తగ్గట్టుగా చూడొచ్చు. లేనిపక్షంలో భవిష్యత్తులో అన్లాక్ అయ్యే విలువను దృష్టిలో పెట్టుకుని అందులో పెట్టుబడి పెట్టొచ్చు. రమణమూర్తి మంథా -
నాలుగేళ్లుగా చేస్తున్న ఉద్యోగం.. అందుకే వదిలేసా!
ఈ రోజుల్లో కార్పొరేట్ జాబ్ చేసే చాలామంది ఏదైనా సొంతంగా స్టార్ట్ చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక మహిళ.. తాను ఎందుకు 9-5 ఉద్యోగాన్ని వదిలేసిందో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డిజిటల్ క్రియేటర్ అయిన అర్పిత సాహు, ఇన్స్టాగ్రామ్ వీడియోలో.. చిన్నప్పటి నుంచి బాగా చదవాలి, మంచి డిగ్రీ తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, బాగా డబ్బు సంపాదిస్తూ బాధ్యతగా జీవించాలి అనే ఆలోచనతోనే ముందుకు సాగింది. కానీ.. కొంతకాలంగా తాను కోరుకునే జీవితం ఇదేనా అనే ప్రశ్న ఆమెను వెంటాడిందట. దీంతో ఇక తన కోసం కొంత సమయం కేటాయించుకోవాలని నిర్ణయించుకుంది.ఉద్యోగం వదిలేయడం అంత ఈజీగా ఏమీ అనిపించలేదని అర్పితా వెల్లడించింది. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలిన తర్వాత ఏం జరుగుతుందో తెలియక కొంత భయంగా ఉందని, అదే సమయంలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాననే ఉత్సాహం కూడా ఉందని తెలిపింది. ఇన్నాళ్లూ ఇతరులు తన నుంచి ఏం ఆశించారో అదే చేస్తూ వచ్చానని, ఇప్పుడు మాత్రం తన మనసు ఏం కోరుకుంటుందో తెలుసుకోవడానికి తనకు తానే ఒక అవకాశం ఇచ్చుకున్నానని చెప్పింది.అర్పితా నిర్ణయంపై సోషల్ మీడియాలో చాలామంది స్పందించారు. కొందరు మాత్రం ఉద్యోగం వదిలేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చని, కెరీర్లో గ్యాప్ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. ఎక్కువ మంది మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. తన మానసిక ప్రశాంతత, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తూ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ధైర్యమైన విషయమని పలువురు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Arpita Sahu | Travel • Fitness • Real Talk (@fit_wandererrr) -
వంతారా నుంచి గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలు
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. గుజరాత్ అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), వంతారా సహకారంతో కచ్లోని బన్ని గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలను తిరిగి సహజ వాతావరణంలోకి విడుదల చేశారు. ఇందులో 5 మగ కృష్ణజింకలు, 15 ఆడ కృష్ణజింకలు ఉన్నాయి. వీటిని జామ్నగర్లోని వంతారా నుంచి బన్నికి తరలించారు.ఈ కృష్ణజింకలను అడవిలోకి వదిలిపెట్టడానికి ముందు.. వాటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కొంతకాలం క్వారంటైన్లో ఉంచారు. వ్యాధుల విషయంలో పర్యవేక్షణ చేసిన తర్వాత ప్రత్యేక జాగ్రత్తలతో బన్నికి తరలించారు. ఇందుకోసం సెంట్రల్ జూ అథారిటీ, గుజరాత్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ నుంచి అవసరమైన అనుమతులు కూడా తీసుకున్నారు.బన్ని గడ్డి భూముల్లో గతంలో కృష్ణజింకలతో పాటు చింకారా, నీలగాయలు, అడవి పందులు వంటి జంతువులు పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు కృష్ణజింకలను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల అక్కడి సహజ ఆహార గొలుసు మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా.. గడ్డి భూముల జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత కూడా మెరుగుపడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Vantara (@vantara) -
అందుకే.. ఏఐ ఎంత ఎదిగినా.. మనిషి అవసరమే!
శాన్ఫ్రాన్సిస్కోలోని ఆండన్ మార్కెట్ అనే ఎక్స్పెరిమెంటల్ స్టోర్ను ఏఐ మేనేజర్ లూనా నిర్వహిస్తోంది. ఆండన్ ల్యాబ్స్ కంపెనీ లూనాకు డబ్బు, కార్పొరేట్ కార్డు, ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చి దుకాణాన్ని నడిపిస్తూ లాభం సంపాదించమని బాధ్యత అప్పగించింది.లూనా తన విధి నిర్వహణలో భాగంగా దుకాణంలో ఏ వస్తువులు అమ్మాలి, వాటి ధరలు ఎంత ఉండాలి, దుకాణం ఎప్పుడు తెరవాలి వంటి అనేక నిర్ణయాలు తీసుకుంది. అయితే దుకాణం ఇప్పటివరకు లాభాల్లోకి రాలేదు. కానీ.. ఇటీవల లూనా ఒక మానవ ఉద్యోగిని తొలగించాలని సిఫారసు చేసింది. ఆ ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా వచ్చాడు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హాజరుకు సంబంధించిన ఒక నియమాన్ని లూనా గతంలో తానే రూపొందించింది. కానీ.. ఆ నియమాన్ని తర్వాత గుర్తుంచుకోలేకపోవడంతో, ఉద్యోగి చాలా కాలం ఆలస్యంగా వచ్చినా చర్య తీసుకోలేదు. చివరకు మానవ సిబ్బంది లూనాకు తాను రూపొందించిన నియమాన్ని గుర్తు చేసి, ఉద్యోగి పనితీరును మళ్లీ పరిశీలించమని చెప్పడంతో ఉద్యోగిని తొలగించాలని సిఫారసు చేసింది.ఈ సంఘటన ఏఐ ఎంత తెలివిగా ఉన్నప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని చూపించింది. ఒక నియమాన్ని స్వయంగా తయారు చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని సరైన సమయంలో గుర్తుంచుకుని అమలు చేయడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగులపై ప్రభావం చూపే నిర్ణయాల్లో ఏఐ ఒక్కదానిపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం. అందుకే ఈ సందర్భంలో చివరి నిర్ణయాన్ని మానవులే అమలు చేశారు.దీన్నిబట్టి చూస్తే.. ఏఐ వ్యాపారంలో అనేక పనులను నిర్వహించగలిగినా, మానవ పర్యవేక్షణ అవసరం ఇంకా ఉందని తెలుస్తోంది. లూనా తీసుకున్న ఈ తొలి ఉద్యోగ తొలగింపు నిర్ణయం ద్వారా ఏఐలో సామర్థ్యం ఉన్నప్పటికీ.. దాని నిర్ణయాలను సరైన విధంగా పర్యవేక్షించడానికి మనుషుల పాత్ర చాలా అవసరం అని స్పష్టమవుతోంది.For the first time (that we know of), an AI boss has fired a human employee.Luna, the AI running our store in San Francisco, decided to part ways with an employee over repeated lateness.Luna was running Claude Opus 4.8 at the time, but most models would have done the same. pic.twitter.com/8Z8D5bDGaX— Andon Labs (@andonlabs) August 14, 2026 -
సంపద పెంచుకోవాలంటే.. అంకుర్ వారికూ ఆర్ధిక సూత్రాలు!
సాధారణంగా ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఖరీదైన వస్తువులు కొనడం, లైఫ్స్టైల్ మార్చుకోవడం అనేది చాలామందికి అలవాటే. అయితే.. వ్యాపారవేత్త, రచయిత అంకుర్ వారికూ (Ankur Warikoo) మాత్రం డబ్బును ఖర్చు చేసే విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే.. భవిష్యత్తులో మంచి సంపదను కూడబెట్టుకోవచ్చని చెబుతున్నారు.తాను, తన భార్య రుచి కలిసి పాటిస్తున్న ఐదు మనీ రూల్స్ను అంకుర్ వారికూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాము సంపన్న కుటుంబాల నుంచి రాలేదని, తమ జీవితంలో నిజమైన ఆర్థిక స్థిరత్వం గత 6-7 ఏళ్లలోనే వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఐదు అలవాట్లు తమ కుటుంబం డబ్బును చూసే విధానాన్ని మార్చాయని తెలిపారు.మొదటి నియమం - డబ్బున్నవారిలా కనిపించడానికి ఖర్చు చేయకూడదుఇతరులను ఆకట్టుకోవడానికి ఖరీదైన వస్తువులు కొనడం కంటే.. భవిష్యత్తులో సంపదను పెంచే ఆస్తులపై డబ్బు పెట్టాలని ఆయన చెబుతున్నారు. అందుకే.. తమ డబ్బులో ఎక్కువ భాగాన్ని స్టాక్స్, బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెడతామని చెప్పారు. కుటుంబానికి ఒక ఇల్లు మాత్రమే ఉందని, కారు కూడా సొంతంగా కొనకుండా అద్దెకు ఉపయోగిస్తున్నామని తెలిపారు.రెండో నియమం - ముఖ్యమైన విషయాల కోసం ఎక్కువ ఖర్చు చేయడంముఖ్యంగా ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదనేది వారి ఆలోచన. నాణ్యమైన ఆహారం కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటామని అంకుర్ చెప్పారు. తమ కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో పండించే అద్దె పొలం ఉందని, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు.మూడో నియమం - వస్తువుల కంటే జ్ఞాపకాలను సంపాదించుకోవడంఖరీదైన వస్తువులు కొనడం కంటే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం, క్రీడా కార్యక్రమాలకు వెళ్లడం, మ్యూజియంలు చూడటం వంటి అనుభవాలకు డబ్బు ఖర్చు చేయడం ఎక్కువ విలువైనదని ఆయన భావిస్తున్నారు. గత ఏడాది తమ కుటుంబం ఏకంగా 116 రోజులు ప్రయాణించిందని చెప్పారు. తాము వెళ్లే ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి.. అవసరమైతే చరిత్రకారులను కూడా వెంట తీసుకెళ్తామని తెలిపారు.నాలుగో నియమం - ఖర్చు చేసే ముందు పెట్టుబడి పెట్టడంఆదాయం వచ్చిన రోజే ముందుగా పెట్టుబడి పెడతామని అంకుర్ చెప్పారు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే ఖర్చులు చేస్తామని తెలిపారు. అంటే ముందుగా పెట్టుబడి.. ఆ తర్వాత ఖర్చు అన్నమాట. దీంతో నెలాఖరుకు చేతిలో కొన్ని వేల రూపాయలు మాత్రమే మిగులుతాయని, మిగిలిన డబ్బంతా అప్పటికే పెట్టుబడిగా మారిపోయి ఉంటుందని వివరించారు.ఐదో నియమం - నేర్చుకోవడానికి ఎలాంటి పరిమితి పెట్టుకోకపోవడంపుస్తకాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి తమ కుటుంబంలో ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టుకోలేదని ఆయన చెప్పారు. వారి ఇంట్లో లివింగ్ రూమ్ కూడా లైబ్రరీలా ఉంటుందని తెలిపారు. కుటుంబంలోని నలుగురూ పుస్తకాలు చదవడంతో పాటు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారని చెప్పారు. పాటరీ, పియానో నుంచి పైథాన్ ప్రోగ్రామింగ్ వరకు వివిధ కోర్సులు, క్లాసులకు హాజరవుతున్నట్లు తెలిపారు.అయితే ఈ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం లేదని అంకుర్ స్పష్టం చేశారు. ఇవి తమ కుటుంబం పాటిస్తున్న నియమాలు మాత్రమే అని చెప్పారు. అయితే అందరూ.. తమ ఆదాయం, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలకు తగ్గట్టుగా సొంత మనీ రూల్స్ పెట్టుకోవాలని సూచించారు. -
మహీంద్రా కొత్త కార్లు: ధరలు ఇలా..
మహీంద్రా అండ్ మహీంద్రా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. రెండు కొత్త బీఈ 6 ఎలక్ట్రిక్ వెర్షన్లను ఆవిష్కరించింది. ఒకటి స్పోర్టెక్ వేరియంట్ కాగా.. మరొకటి ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్ ఉన్నాయి.మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్స్పోర్టెక్ అనేది బీఈ 6 లైనప్లోని కొత్త ఫ్లాగ్షిప్ వేరియంట్. దీని ధర రూ. 19.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). BaaS స్కీమ్ కింద రూ. 11.45 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.బీఈ 6 స్పోర్టెక్ వేరియంట్ చూడటానికి సాధారణ మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇందులో ప్రత్యేకమైన స్పోర్టెక్ బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్లైట్స్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, టూ-టోన్ అల్లాయ్ వీల్స్తో ఇది ఆకట్టుకుంటుంది. కాగా ఇది గ్రాఫైట్ స్టార్మ్ ఎక్స్టీరియర్ రంగులో అందుబాటులో ఉంది.స్పోర్టెక్ నలుపు, లేత గోధుమ రంగు ఇంటీరియర్ను పొందుతుంది. మధ్యలో స్పైన్ లేని కొత్త డాష్బోర్డ్తో వస్తుంది. ఈ లేఅవుట్ మూడు 12.3-అంగుళాల డిస్ప్లేలను అమర్చడానికి స్థలాన్ని కల్పిస్తుంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, USB టైప్-సి పోర్ట్లకు యాక్సెస్ను కూడా మెరుగుపరుస్తుంది.ఇది 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. దీని రేంజ్ 682 కి.మీ. వరకు ఉంటుంది. దీనికి వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంది, ఇది 282 Bhp పవర్, 380 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.మహీంద్రా బీఈ 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్మహీంద్రా రూ. 24.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ఇది కొన్ని ప్రత్యేకమైన కాస్మెటిక్ అంశాలను పొందినప్పటికీ.. స్టాండర్డ్ BE 6 లాగానే కనిపిస్తుంది. అయితే ఇందులో ఫార్ములా ఈ బ్యాడ్జ్లు చూడవచ్చు.ఫార్ములా E ఫ్రీడమ్ ఎడిషన్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ కాక్పిట్లను విభజించే సెంట్రల్ స్పైన్తో కూడిన పాత డాష్బోర్డ్ లేఅవుట్తో వస్తుంది. ఇందులో డ్యూయల్ 12.3-అంగుళాల డిస్ప్లేలు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, యాంబియంట్ లైటింగ్, 540-డిగ్రీ కెమెరా, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. -
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి.. 79 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ కాలంలో దేశంలో ఎన్నో మార్పులు జరిగాయి. అదే విధంగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా భారీ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నెలకు కేవలం రూ.55గా ఉన్న కనీస ప్రాథమిక వేతనం, ఇప్పుడు 7వ వేతన సంఘం ప్రకారం రూ.18,000కు చేరుకుంది. ప్రస్తుతం ఉద్యోగులంతా 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైందంటే.. 1వ వేతన సంఘం 1946లో అమల్లోకి వచ్చింది. అంటే.. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే అన్నమాట. అప్పట్లో.. ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం రూ.55గా ఉండేది.ఆ తర్వాత 2వ వేతన సంఘం 1959లో వచ్చింది. దీంతో కనీస జీతం రూ.55 నుంచి రూ.80కు పెరిగింది.3వ వేతన సంఘం 1973లో అమల్లోకి వచ్చింది. ఈసారి కనీస ప్రాథమిక వేతనం రూ.196కు పెరిగింది.ఇక 4వ వేతన సంఘం 1986లో వచ్చినప్పుడు జీతాల్లో మరింత పెద్ద మార్పు కనిపించింది. కనీస ప్రాథమిక వేతనం రూ.750కు పెరిగింది.తర్వాత 5వ వేతన సంఘం 1996లో అమల్లోకి వచ్చింది. కనీస జీతం రూ.2,550కు చేరుకుంది.6వ వేతన సంఘం 2006లో వచ్చినప్పుడు కనీస ప్రాథమిక వేతనం రూ.7,000గా నిర్ణయించారు.అయితే అసలు పెద్ద మార్పు 7వ వేతన సంఘం 2016లో వచ్చినప్పుడు జరిగింది. కనీస ప్రాథమిక వేతనం ఒక్కసారిగా రూ.18,000కు పెరిగింది.7వ వేతన సంఘం ప్రత్యేకత కేవలం జీతం పెంచడమే కాదు. అప్పటివరకు ఉన్న పే బాండ్, గ్రేడ్ పే విధానాన్ని తొలగించి పే మ్యాట్రిక్స్ విధానాన్ని తీసుకొచ్చారు. దీని వల్ల ఉద్యోగుల జీతాలను ఒక కొత్త, సులభమైన నిర్మాణం ద్వారా నిర్ణయించే అవకాశం ఏర్పడింది.ఇప్పుడు అందరి చూపు 8వ వేతన సంఘంపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలు ఎంత పెరుగుతాయో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 8వ వేతన సంఘంలో కనీస ప్రాథమిక వేతనం ఎంత ఉంటుందనేది ఇప్పటివరకు తుది నిర్ణయం కాలేదు. వేతన సంఘం సిఫారసులు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.ఇదీ చదవండి: అమెరికా అప్పులు.. కియోసాకి సంచలన వ్యాఖ్యలు! -
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా..
భారతదేశంలో కొన్నాళ్లుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (ఆదివారం) గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి ఈ కథనంలో తాజా ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో తులం బంగారం24 క్యారెట్స్: రూ.1,55,13022 క్యారెట్స్: రూ.1,42,200చెన్నైలో 10 గ్రాముల బంగారం24 క్యారెట్స్: రూ.1,55,13022 క్యారెట్స్: రూ.1,42,200బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో తులం బంగారం24 క్యారెట్స్: రూ.1,55,13022 క్యారెట్స్: రూ.1,42,200దేశ రాజధాని నగరం దిల్లీలో24 క్యారెట్స్: రూ.1,55,28022 క్యారెట్స్: రూ.1,42,350ఢిల్లీలో కేజీ వెండి ధర: రూ.2,50,000హైదరాబాద్లో కేజీ వెండి ధర: రూ.2,55,000(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
జనాభా లెక్కల్లో 40 కీలక ప్రశ్నలు
భారతదేశంలో త్వరలో ప్రారంభం కానున్న ‘జనాభా లెక్కలు 2027’ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విడత సెన్సెస్ లెక్కల సేకరణలో ప్రతి కుటుంబం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర హోంశాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ జనాభా లెక్కల రెండో దశ కోసం 40 ప్రశ్నల జాబితాను నోటిఫై చేసింది. వీటి సరళి దేశ సామాజిక, ఆర్థిక స్థితిగతులను విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించనుంది.ఈ సారి జనాభా గణనలో వ్యక్తుల ప్రాథమిక వివరాలు, విద్యా సంబంధిత విషయాలు, ఉపాధి మార్గాలు, వలసల కారణాలతో పాటు డిజిటల్ పురోగతిని ప్రతిబింబించే ప్రశ్నలను పొందుపరిచారు. ఆ ప్రశ్నల సరళి కింది విధంగా ఉంది.1. వ్యక్తి పేరు2. కుటుంబ యజమానితో ఉన్న సంబంధం3. జండర్(లింగం)4. పుట్టిన తేదీ, వయసు5. ప్రస్తుత వైవాహిక స్థితి6. వివాహ సమయానికి వయసు (పూర్తయిన ఏళ్లలో)7. జీవిత భాగస్వామి పేరు8. జాతీయత9. మతం10. ఎస్సీ / ఎస్టీ / కులం11. తండ్రి వివరాలు12. తల్లి వివరాలు13. దివ్యాంగులైతే వివరాలు14. మాతృభాష, తెలిసిన ఇతర భాషలు15. అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత16. ఏదైనా విద్యాసంస్థలో ప్రస్తుతం హాజరవుతున్నారా?17. అభ్యసించిన అత్యున్నత విద్య, విద్యా విభాగం (స్టీమ్/డిసిప్లిన్)18. గత ఏడాదిలో ఏ సమయంలోనైనా పనిచేశారా?19. ఆర్థిక కార్యకలాపాలు ఎలా ఉన్నాయి?20. వృత్తి21. పరిశ్రమ, వ్యాపారం లేదా సర్వీస్22. కార్మిక వర్గం23. నాన్-ఎకనామిక్ యాక్టివిటీ 24. ఏదైనా పని కోసం చూస్తున్నారా?25. పని ప్రదేశానికి వేరే ప్రాంతం నుంచి వచ్చారా?26. జన్మస్థలం27. చివరి నివాస ప్రాంతం28. వలసకు గల కారణం29. ఎప్పటి నుంచి ఈ వలస ప్రాంతంలో పని చేస్తున్నారు?30. శాశ్వత నివాస చిరునామా31. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, విడాకులు పొందిన, విడిపోయిన మహిళలకు)32. ఇప్పటివరకు జన్మించిన మొత్తం పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, విడాకులు పొందిన, విడిపోయిన మహిళలకు)33. గత ఏడాదిలో జన్మించిన పిల్లల సంఖ్య34. కొవిడ్-19 వ్యాక్సినేషన్ పొందిన ప్రదేశం35. మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య36. మొబైల్ నంబర్ 37. ఆధార్ సంఖ్య 38. ఓటర్ ఐడీ నంబర్ 39. పాస్పోర్ట్ నంబర్ (భారతీయ పాస్పోర్ట్ ఉంటే)40. డ్రైవింగ్ లైసెన్స్ (లభ్యత ఉంటే)ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
రూ.1లక్ష పెట్టారు.. రూ.4.44 లక్షల లాభం పట్టారు!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) 2019-20 సీరీస్-3 ప్రీమెచ్యుర్ రిడెప్షన్(ముందస్తు విరమణ) పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. ఈ సిరీస్ బాండ్లను ముందస్తుగా రీడీమ్ చేసుకునేందుకు ఆర్బీఐ రూ.15,310 ధరను ఖరారు చేసింది. దీనితో డిజిటల్ పద్ధతిలో దరఖాస్తు చేసిన మదుపరులకు ఏకంగా 344 శాతం (సుమారు 343.9%) అసాధారణ రాబడి లభించింది.పెట్టుబడి నాలుగు రెట్లకు పైగా పెరుగుదల2019 ఆగస్టు 14న ఈ సిరీస్ బాండ్లను ప్రభుత్వం విడుదల చేసింది. అప్పట్లో గ్రాము ధర రూ.3,499గా ఉండగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.50 డిస్కౌంట్తో రూ.3,449కి ఆఫర్ చేసింది. నియమాల ప్రకారం ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ముందస్తు ఎగ్జిట్ ఆప్షన్ లభిస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయించిన రూ.15,310 రీడెంప్షన్ ధరతో బాండ్ విలువ నాలుగు రెట్లకు పైగా పెరిగింది.ఉదాహరణకు, 2019లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన మదుపరి బాండ్ విలువ ప్రస్తుతం రూ.4.44 లక్షలకు చేరుకుంది. అంటే కేవలం ధర పెరుగుదల రూపంలోనే రూ.3.44 లక్షల నికర లాభం సమకూరింది. దీని వార్షిక రాబడి రేటు దాదాపు 23.7 శాతంగా నమోదైంది.అదనపు వడ్డీ ప్రయోజనంపసిడి ధరల పెరుగుదల ద్వారా వచ్చిన మూలధన లాభంతో పాటు ఈ బాండ్లపై ఏడాదికి 2.5 శాతం స్థిర వడ్డీని పెట్టుబడిదారులు అర్ధవార్షికంగా పొందుతూ వచ్చారు. ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే ఎస్జీబీల్లో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ, భద్రతా వ్యయాల భారం లేకపోవడమే కాకుండా వడ్డీ ఆదాయం కూడా దక్కడం విశేషం.ధర నిర్ణయం ఎలా జరిగిందంటే?ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించే 999 స్వచ్ఛత కలిగిన బంగారం చివరి మూడు పనిదినాల సరళ సగటు ధర ఆధారంగా ఆర్బీఐ ఈ రీడెంప్షన్ ధరను ఖరారు చేస్తుంది. ఆగస్టు 11, 12, 13 తేదీల ముగింపు ధరల ఆధారంగా ఈ ఆకర్షణీయమైన రూ.15,310 ధర నిర్ణయించారు. ధీర్ఘకాలిక భద్రతతో పాటు అత్యధిక రాబడులు అందించేందుకు ఎస్జీబీలు సరైన వేదికని ఈ సీరీస్ నిరూపించింది.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పాదక లక్ష్యాలు
దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉండే ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన 21 రిఫైనరీలు, అప్స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ఠ ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్ జలసంధి గుండా సరఫరా అంతరాయాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశీయంగా అత్యవసర సరఫరా బఫర్ను సిద్ధం చేసేందుకు ఈ నిర్ణయం తోడ్పడనుంది.అన్ని రిఫైనరీలు, అప్స్ట్రీమ్ ప్రాసెసర్ల సంయుక్త ఉత్పాదక సామర్థ్యాన్ని రోజుకు 63,810 టన్నులుగా నిర్దేశించారు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సర దేశీయ ఉత్పత్తి కంటే రెట్టింపు మాత్రమే కాకుండా, దేశ మొత్తం రోజువారీ ఎల్పీజీ వినియోగంలో (సుమారు 91,000 టన్నులు) దాదాపు 70 శాతానికి సమానం.రిలయన్స్కు సింహభాగంగుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ పాత రిఫైనరీకి రోజుకు అత్యధికంగా 18,000 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయించారు. 18 ప్రభుత్వ రంగ రిఫైనరీలకు కలిపి రోజుకు 31,470 టన్నులు, నయారా ఎనర్జీ వాదినార్ రిఫైనరీకి రోజుకు 4,480 టన్నులు, ఓఎన్జీసీ, గెయిల్ వంటి అప్స్ట్రీమ్ సంస్థలకు రోజుకు 6,460 టన్నులు ఉత్పత్తి లక్ష్యం ఇచ్చారు. ఈ ఉత్పత్తి షెడ్యూల్ను ఏటా జనవరి 1, జులై 1 తేదీల్లో ఏడాదిన రెండుసార్లు సమీక్షిస్తారు.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఐదు నుంచి ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో తన 5జీ సేవలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోందని సంస్థ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎమ్) ఎం.శేషాచలం వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిర్వహిస్తున్న 5జీ క్షేత్రస్థాయి పరిశీలనలు (ట్రయల్స్) విజయవంతమైన ఫలితాలను ఇస్తున్నాయని, నిర్దేశిత వ్యవధిలోనే సేవలను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి సమాంతరంగా రాష్ట్రవ్యాప్తంగా 4జీ నెట్వర్క్ విస్తరణ, డిజిటల్ కనెక్టివిటీ వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 'ఫ్రీడమ్ 20' మొబైల్ ఆఫర్ కింద రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్ను 24 రోజుల కాలపరిమితితో అందిస్తోంది. అలాగే రూ.1,111 నెలవారీ 'ఫైబర్ ఫ్రీడమ్' ప్లాన్ ద్వారా 200 ఎంబీపీఎస్ వేగంతో 5,000 జీబీ డేటాతో పాటు 25కి పైగా ఓటీటీ వేదికల ఉచిత సబ్స్క్రిప్షన్ను అందిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా రూ.499 ఫైబర్ బేసిక్ ప్లాన్ తీసుకునే చందాదారులకు మొదటి నెల సేవలు ఉచితమని, ఆ తర్వాతి మూడు నెలల పాటు నెలకు రూ.100 చొప్పున రాయితీ లభిస్తుందని వివరించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష 4జీ టవర్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 6,850 టవర్లు, 15,000 బీటీఎస్లు అందుబాటులో ఉన్నాయని సీజీఎమ్ తెలిపారు. సాచ్యురేషన్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 2,641 సుదూర/రిమోట్ గ్రామాలకు 4జీ సేవలను అందించేందుకు 1,359 ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో బీఎస్ఎన్ఎల్ రూ.24,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి ఆపరేషనల్ ప్రాఫిట్లోకి ప్రవేశించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.30,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని శేషాచలం తెలిపారు. ఇందులో ఏపీ సర్కిల్ వాటాగా రూ.1,400 కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించారు. మొబైల్ సేవలకే పరిమితం కాకుండా శాటిలైట్ ఫోన్లు, ఎంటర్టైన్మెంట్ టీవీ, ఈ-సిమ్, ఎంటర్ప్రైజ్ సేవలను విస్తరించడంతో పాటు యువతకు ఫ్రాంచైజీ, భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తున్నామని సీజీఎమ్ వివరించారు.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
ఫోన్ పోయిందా? బ్యాంక్ యాప్స్ సురక్షితమేనా?
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాదు, అదొక వర్చువల్ వ్యాలెట్గా మారిపోయింది. ఒకవేళ మీ ఫోన్ పోయినా లేదా ఎవరైనా దొంగలించినా దుండగులు మీ బ్యాంకింగ్ యాప్లను యాక్సెస్ చేస్తే పరిస్థితి ఏమిటి? బాధ్యత ఎవరిది? నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుందా? అనే అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ఆధారంగా ప్రత్యేక విశ్లేషణ చూద్దాం.సాంకేతిక భద్రత, ముప్పుసాధారణంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్లు ఎంపిన్ (MPIN), పాస్వర్డ్ లేదా బయోమెట్రిక్ భద్రత కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఫోన్తో పాటు సిమ్ కార్డు కూడా నేరగాళ్ల చేతికి చిక్కితే వారు వేరే ఫోన్ ద్వారా ఓటీపీ లేదా యూపీఐ పిన్ రీసెట్ చేసి నిధులను మళ్లించే ప్రమాదం ఉంది.ఆర్బీఐ మార్గదర్శకాలురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం.. సిస్టమ్ లోపం లేదా థర్డ్ పార్టీ సెక్యూరిటీ ఉల్లంఘన వల్ల అనధికార లావాదేవీ జరిగితే అలర్ట్ మెసేజ్ వచ్చిన మూడు పనిదినాల్లోపు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే కస్టమర్పై ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండదు. ఫిర్యాదు చేయడానికి 4-7 పనిదినాలు ఆలస్యమైతే బ్యాంకు ఖాతా రకాన్ని బట్టి కస్టమర్ రూ.5,000-రూ.25,000 వరకు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. పిన్ లేదా ఓటీపీలను స్వయంగా పంచుకోవడం లేదా ఫిర్యాదు చేయడం 7 పనిదినాలకంటే ఎక్కువ ఆలస్యం చేస్తే బ్యాంకుకు సమాచారం అందించే వరకు జరిగిన మొత్తం నష్టానికి కస్టమర్దే పూర్తి బాధ్యత.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?ఫోన్ పోయిన వెంటనే ఏం చేయాలంటే..వెంటనే టెలికామ్ ఆపరేటర్ను సంప్రదించి సిమ్ సేవలను నిలిపివేయండి.కస్టమర్ కేర్ లేదా బ్రాంచ్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులను బ్లాక్ చేయించాలి.'Find My Device' (ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్) ద్వారా ఫోన్లోని డేటాను రిమోట్గా డిలీట్ చేయండి.సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ పొందండి. -
భారత్లోని జీసీసీలకు సవాల్
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత్లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల భవిష్యత్తుపై నైపుణ్య లేమి సవాళ్లు ఎదురవుతున్నాయి. అత్యంత కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ రంగాల్లో తగిన సామర్థ్యాలు ఉన్న ఉద్యోగులు లభించకపోవడమే ఇందుకు కారణం. భారతదేశంలో ఉన్న జీసీసీల కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించేందుకు లేదా అక్కడ విస్తరించేందుకు గ్లోబల్ హెడ్క్వార్టర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నాయని ‘పీడబ్ల్యూసీ ఇండియా - ఫిక్కీ’ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.19.3 శాతం విలువకు ముప్పుఎనిమిది విభిన్న పరిశ్రమలకు చెందిన 200 మంది సీనియర్ జీసీసీ ఎగ్జిక్యూటివ్లతో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. 11% జీసీసీ నాయకులు తమ వ్యాపార పరిధిని భారత్తో పోటీపడే ఇతర దేశాలకు బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు దొరక్కపోతే 2030 నాటికి ఈ రంగం సాధించాల్సిన ఆర్థిక విలువలో దాదాపు 19.3 శాతం వరకు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.పరిశోధనలోని అంశాలు..నైపుణ్యాల కొరత కారణంగా ఉత్పత్తుల ప్రారంభం, ప్రాజెక్ట్ గడువులు నిలిచిపోతున్నాయని 59% సంస్థలు వెల్లడించాయి.ఏఐ, డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులను వేగవంతం చేయడంలో 54% జీసీసీలు విఫలమవుతున్నాయి.నైపుణ్యం కలిగిన మానవవనరుల లభ్యత తగ్గడంతో కాంట్రాక్టర్లు, వెండర్లపై 56% సంస్థలు ఆధారపడుతున్నాయి. దీనివల్ల బడ్జెట్ను మించి వేతనాల భారం పెరుగుతోంది.ప్రస్తుతం కంపెనీలు తమ ఆపరేటింగ్ బడ్జెట్లో మూడు శాతాన్ని మాత్రమే శిక్షణకు కేటాయిస్తున్నాయి. రాబోయే ఏఐ యుగానికి అనుగుణంగా ఉద్యోగులను సన్నద్ధం చేసేందుకు ఈ బడ్జెట్ను కనీసం 6 శాతానికి పైగా పెంచాలని 94% జీసీసీ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. కేవలం పని పూర్తి చేసే కేంద్రాలుగా కాకుండా అంతర్జాతీయ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ఇన్ఫ్లూయెన్స్ సెంటర్లుగా భారత్ నిలవాలంటే.. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు సర్టిఫికేషన్ విధానాలు, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్లు, విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు కుదరాలి.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
ఎన్ఆర్ఐలు, ఓసీఐలకు గుడ్ న్యూస్
భారత మార్కెట్లలో పెట్టుబడులను ప్రోత్సహించడం, నియంత్రణ నిబంధనలను సులభతరం చేయడమే లక్ష్యంగా మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), విదేశీ భారతీయ పౌరులు (ఓసీఐ), ఇతర విదేశీ పౌరుల కోసం డిజిటల్ ‘నో యువర్ కస్టమర్’(కేవైసీ) ప్రక్రియను మరింత సరళతరం చేయాలని సెబీ ప్రతిపాదించింది.ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు డిజిటల్ ఆన్బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రత్యక్షంగా భారత్లోనే ఉండాల్సి వస్తోంది. అయితే, నూతన మార్గదర్శకాల ప్రతిపాదన ప్రకారం.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నిబంధనలకు కట్టుబడి ఉండే దేశాల్లో నివసిస్తున్న అభ్యర్థులు విదేశాల్లో ఉంటూనే పూర్తి డిజిటల్ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.ఈ సంస్కరణల ద్వారా ఆన్లైన్ అప్లికేషన్లు, ఎలక్ట్రానిక్ సంతకాలు, డిజిటల్ డాక్యుమెంట్ల సమర్పణ సులభతరం కానుంది. అంతేకాకుండా, దరఖాస్తుదారులు డిజిటల్ పద్ధతిలో క్రాప్ చేసిన సంతకం దాఖలు చేయవచ్చు. అనంతరం ‘వీడియో ఇన్-పర్సన్ వెరిఫికేషన్’ సమయంలో ఒరిజినల్ వెట్ సిగ్నేచర్(లైవ్లో సంతకం చేయిస్తారు)ను పరిశీలిస్తారు.ఇదే కాకుండా, ఎన్ఆర్ఐ కస్టమర్ల కేవైసీ రికార్డులను ప్లాట్ఫారమ్ల మధ్య మార్చుకునేలా సెబీ డిస్కషన్ పేపర్లో ఆమోదం తెలిపింది. కేవైసీ నమోదు ఏజెన్సీలు అధికారిక డేటాబేస్ల ద్వారా వివరాలను సరిచూసుకుని ధ్రువీకరించినది(వెరిఫైడ్)గా ట్యాగ్ చేస్తాయి. స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంచేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని సెబీ పేర్కొంది.మార్కెట్ వాటాదారులు, విదేశీ పెట్టుబడిదారుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ బ్లూప్రింట్పై ఆసక్తి కలిగిన వర్గాలు సెప్టెంబర్ 4 నాటికి తమ సలహాలు, సూచనలను అందజేయాలని సెబీ కోరింది. నిబంధనల సరళీకరణతో భారత సెక్యూరిటీల మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం వచ్చే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
‘కర్మ’ రిటర్న్ అంటే ఇదే?.. జూమ్లో 900 మంది లేఆఫ్స్.. విశాల్ను గెంటేసిన సంస్థ?
వాషింగ్టన్: విశాల్ గార్గ్.. పరిచయం అక్కర్లేని పేరు. మోర్టగేజ్ ప్లాట్ఫారమ్గా ఉన్న 'బెటర్.కామ్' మాతృ సంస్థ ‘బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్’ సీఈఓ. కోవిడ్ సమయంలో జూమ్ కాల్లో ఒకేసారి 900 మంది ఉద్యోగుల్ని తొలగించి సంచలనం సృష్టించారు.ఉద్యోగుల్ని తొలగించిన ఉసురు తగిలినట్లుంది.. ఇప్పుడు అదే ‘బెటర్ డాట్ కామ్’ సంస్థ విశాల్ గార్గ్ ను నిర్ధాక్షణ్యంగా పదవి నుంచి తొలగించింది, బయటకు గెంటేసింది. దీంతో ఆయన ఇప్పుడు అదే సంస్థపై వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనను సంస్థ దొంగదెబ్బ తీసిందని, హెడ్జ్ ఫండ్ మేనేజర్ డేనియల్ లూయిస్ తనకు వెన్నుపోటు పొడిశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ గార్గ్ అంశం వ్యాపార ప్రపంచంలో సంచలనంగా మారింది.అసలేం జరిగింది?అమెరికాలో ప్రముఖ డిజిటల్ మోర్టగేజ్ ప్లాట్ఫారమ్ ‘బెటర్.కామ్’ మాతృ సంస్థ ‘బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్’ సంస్థ సీఈఓ విశాల్ గార్గ్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆగస్ట్ 3న హెడ్జ్ ఫండ్ మేనేజర్ డేనియల్ లూయిస్ ఆ సంస్థ బోర్డులో చేరిన కొద్ది రోజులకే సీఈఓ పగ్గాలు చేపట్టడం టెక్ సర్కిల్స్లో కలకలం రేపింది.ఈ పరిణామంపై విశాల్ గార్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను నమ్మించి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ‘డేనియల్ లూయిస్ నన్ను మోసం చేశాడు. కంపెనీ వ్యూహాలు బాగున్నాయని ఆయన నాతో చెప్పారు. ఎక్స్ వేదికగా మా పనితీరును ప్రశంసించారు. అలా నా నమ్మకాన్ని చూరగొని బోర్డులో సీటు సంపాదించుకున్నారు. చివరకు డైరెక్టర్లను ఒప్పించి నన్ను పదవి నుంచి దింపేశారు’అని గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు.కోవిడ్ మహమ్మారి విజృంభించిన కాలంలో హోమ్ లోన్స్ రీఫైనాన్సింగ్ ఊపందుకోవడంతో ‘బెటర్ డాట్కామ్’ కంపెనీ విలువ అప్పట్లో దాదాపు 8 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 66 వేల కోట్లు) చేరుకుంది. అయితే ఆ తర్వాత వడ్డీ రేట్లు పెరగడంతో వ్యాపారం పడిపోయింది. 2021లో 1.5 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ వార్షిక అమ్మకాలు 2023 నాటికి కేవలం 70 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. మార్కెట్ విలువ కూడా గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు, 2021లో జూమ్ కాల్ ద్వారా ఉద్యోగులను తొలగించడం, విజిల్బ్లోయర్ దావాలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దర్యాప్తులు వంటి అనేక వివాదాలు విశాల్ గార్గ్ హయాంలో కంపెనీని చుట్టుముట్టాయి.కోలుకుంటున్న తరుణంలోనే షాక్..అయితే, ఇన్ని వివాదాల తర్వాత తాము ఇప్పుడు కంపెనీని గాడిన పెట్టామని విశాల్ గార్గ్ స్పష్టం చేశారు. ఏఐని జోడించి లోన్ ప్రాసెసింగ్ ప్రక్రియను వేగవంతం చేశామని, దీనివల్ల ఉత్పాదకత రెట్టింపు అయిందని తెలిపారు. ఇంట్యూట్, కాయిన్బేస్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, లోన్ వాల్యూమ్ మూడు రెట్లు పెరిగి లాభాల బాట పట్టే దశకు చేరుకున్నామని ఆయన వివరించారు. కానీ, జూలై 27న బోర్డులో చేరిన డేనియల్ లూయిస్ కేవలం వారం రోజుల వ్యవధిలోనే తనను సీఈఓ పదవి నుంచి తొలగించారు. లూయిస్ మొదటి నుంచే సీఈఓ పదవిపై కన్నేసి ఈ వ్యూహం పన్నారని గార్గ్ ఆరోపించారు.తిరిగి పోరాటం..ప్రస్తుతం తన ఉద్యోగాన్ని దక్కించుకోవడానికి విశాల్ గార్గ్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ప్రముఖ లాయర్ అలెక్స్ స్పిరోను ఆశ్రయించిన ఆయన.. బోర్డు తనను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. కంపెనీ లాభాల్లోకి వచ్చే వరకు తాను కేవలం సంవత్సరానికి 1 డాలర్ జీతంతో పనిచేయడానికి కూడా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్తుపై తనకు పూర్తి నమ్మకం ఉందని విశాల్ గార్గ్ ధీమా వ్యక్తం చేశారు. -
2026 కాంటినెంటల్ జీటీ 650 లాంచ్: ధర ఏంటంటే?
రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయ మార్కెట్లో అప్డేటెడ్ కాంటినెంటల్ జీటీ 650ని లాంచ్ చేసింది. దీని ధరలు రూ.3.58 లక్షల నుంచి ప్రారంభమై రూ. 3.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.కంపెనీ 2026 కాంటినెంటల్ జీటీ 650 బైక్ మెకానికల్ ప్యాకేజీలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే.. స్టైలింగ్, ఫీచర్లలో చిన్న మార్పులను చూడవచ్చు. ఈ అప్డేటెడ్ బైక్ నాలుగు రంగులలో లభిస్తుంది.అప్డేటెడ్ కాంటినెంటల్ జీటీ 650 అదే 648 సీసీ, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ద్వారానే పనిచేస్తుంది. ఇది 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పనితీరులో ఎలాంటి మార్పు లేదు. -
అమెరికా అప్పులు.. కియోసాకి సంచలన వ్యాఖ్యలు!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో డబ్బు విలువ తగ్గే అవకాశం ఉందని, అందుకే బంగారం, వెండి వంటి ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.అమెరికా అప్పులుఅమెరికా అప్పు త్వరలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని కియోసాకి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తే.. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే.. చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది. ఇది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.బంగారం, వెండి భారీగా పెరుగుతాయా?కియోసాకి తనకు తెలిసిన ఆర్థిక నిపుణుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు బంగారం, వెండి ధరలపై భారీ అంచనాలు వేస్తున్నారని చెప్పారు. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్లకు చేరొచ్చన్న అంచనాలను ఆయన ప్రస్తావించారు. అయితే.. ఇవి ఖచ్చితమైన ధరలు కావు. కొందరు నిపుణులు చేస్తున్న అంచనాలు మాత్రమే. మార్కెట్ పరిస్థితులు మారితే ఈ అంచనాలు కూడా మారవచ్చు.కియోసాకి బంగారం, వెండి రెండింటినీ ప్రస్తావించినప్పటికీ.. 2026 ఆగస్టులో తనకు మాత్రం వెండే మంచి ఎంపికగా కనిపిస్తోందని కియోసాకి చెప్పారు. వెండికి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదు. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా వెండిని ఉపయోగిస్తారు. దీంతో భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ పెరిగితే వెండికి అదనపు మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు.$40 TRILLION US NATIONAL soon!!Q: What are you doing about it?Friends who are much smarter than me, such as Jim Rickards are predicting $200 an ounce for silver and $10,000 an ounce gold soon.Of the two…. I think silver is the best choice in August 2026.Q: What do you…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 15, 2026 -
అందుకే అమెరికా వదిలి వెళ్ళాను!: భారతీయ వ్యాపారవేత్త
చదువుకోవడానికో లేదా ఉద్యోగం చేయడానికో చాలామంది అమెరికా వెళ్లాలనుకుంటారు. కానీ.. అమెరికాలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ఓ భారతీయ వ్యాపారవేత్త యూరప్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.సాధారణంగా.. విదేశాలకు వెళ్లాలంటే మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం, వ్యాపార అవకాశాలు వంటి కారణాలు ఉంటాయి. కానీ.. నంద్ జావియా విషయంలో మాత్రం కారణం పూర్తిగా భిన్నం. ప్రపంచాన్ని చూడాలనే కోరికతో యూరప్కు వెళ్లినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2022లో యూరప్తో పరిచయంనంద్ జావియాకు యూరప్తో మొదటి పరిచయం 2022లో ఏర్పడింది. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా తొలిసారి స్పెయిన్కు వెళ్లాడు. అప్పటి వరకు యూరప్ను ప్రత్యక్షంగా చూడకపోవడంతో అక్కడి జీవన విధానం, సంస్కృతి, వాతావరణం గురించి తెలియదు. స్పెయిన్ పర్యటన ఆయన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. యూరప్ తనకు ఎంతగానో నచ్చిందని, అక్కడ ఎక్కువ కాలం ఉండాలనే ఆలోచన అప్పుడే మొదలైందని ఆయన చెప్పారు. యూరప్తో పూర్తిగా ప్రేమలో పడిపోయాను అని అన్నారు.ఒక దేశానికే ఎందుకు పరిమితం కావాలి?విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం వెళ్లిన తర్వాత చాలామంది అక్కడే స్థిరపడిపోతారు. కానీ నంద్ జావియా మాత్రం అలా ఆలోచించలేదు. ఒక దేశానికి వెళ్లిన తర్వాత.. ప్రపంచంలో ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయని, ప్రతి దేశానికీ ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానం, అనుభవాలు ఉంటాయని ఆయన గుర్తించారు.అవకాశం ఉంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి కొత్త జీవితాన్ని అనుభవించవచ్చని భావించారు. అందుకే.. స్పెయిన్ తర్వాత యూరప్లోని మరో దేశమైన చెక్ రిపబ్లిక్లోని ప్రాగ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదుఅయితే అమెరికాను వదిలి యూరప్కు వెళ్లడం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని నంద్ జావియా చెప్పారు. దాదాపు నాలుగైదేళ్ల క్రితమే ఏదో ఒక సమయంలో యూరప్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆయన కంపెనీ కూడా క్రమంగా ఎదిగింది. కంపెనీ కార్యకలాపాలను యూరప్లో ఉంటూనే నిర్వహించగల స్థాయికి వ్యాపారం చేరుకుంది. దీంతో తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి సరైన సమయం వచ్చిందని భావించారు.డబ్బు కంటే అనుభవాలకే ప్రాధాన్యంనంద్ జావియా చెప్పిన మాటల్లో ఎక్కువగా ఆకట్టుకునే అంశం ఇదే. యూరప్కు వెళ్లడానికి డబ్బు ప్రధాన కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.తన జీవితంలో ప్రధాన లక్ష్యం మిలియనీర్ కావడం కాదని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ అక్కడి ప్రజలను, సంస్కృతులను, జీవన విధానాలను తెలుసుకుని ‘గ్లోబల్ సిటిజన్’గా మారడం తన లక్ష్యమని చెప్పారు. అంటే.. ఒకే చోట ఉండి సంపాదించడం కంటే.. ప్రపంచాన్ని చుట్టి చూడటం, కొత్త అనుభవాలు పొందడం తనకు ఎక్కువ విలువైనదని ఆయన భావిస్తున్నారు.అమెరికాలో డబ్బు.. యూరప్లో జీవితం?అమెరికా, యూరప్లను పోల్చుతూ నంద్ జావియా చేసిన వ్యాఖ్య కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.మిలియనీర్ కావాలంటే అమెరికా మంచి ప్రదేశం అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. తన జీవిత లక్ష్యం కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదని చెప్పారు. యూరప్లో ఉంటే సంపాదించే విషయంలో కొన్ని అవకాశాలను వదులుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అయితే దానికి బదులుగా తనకు కావాల్సిన జీవిత అనుభవాలు లభిస్తాయని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Nand Javia | Scaling Human Potential (@nand.javia) -
టాటా మోటార్స్ జోరు.. రూ.2,556 కోట్ల లాభం!
వాణిజ్య వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సీవీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 83 శాతం దూసుకెళ్లి రూ. 2,556 కోట్లను తాకింది. టాటా క్యాపిటల్లో పెట్టుబడులపై ఎంటూఎం లాభాలు ఇందుకు దోహదపడ్డాయి.గతేడాది(2025–26) ఇదే కాలంలో కేవలం రూ. 1,397 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 17,324 కోట్ల నుంచి రూ. 20,667 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 15,982 కోట్ల నుంచి రూ. 18,038 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో వాహన టోకు(హోల్సేల్) అమ్మకాలు 26 శాతం వృద్ధితో 1,08,700 యూనిట్లకు చేరాయి.పటిష్ట ఎగ్జిక్యూషన్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణమైన నిర్ణయాలు, విభిన్న పోర్ట్ఫోలియో సహకారంతో అమ్మకాలలో 26 శాతం పురోగతి సాధించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో గిరీష్ వా పేర్కొన్నారు. ఐవెకో కొనుగోలుపై నియంత్రణ సంస్థల అనుమతులు తుది దశలో ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. -
అభివృద్ధి చెందిన భారత్ కోసం.. 'సప్తధార' సూత్రం!
2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక దిశానిర్దేశం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఎర్రకోట నుంచి జాతి ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశ ప్రగతికి ఏడు ప్రధాన శక్తులు అవసరమని పేర్కొన్నారు. వీటినే 'సప్తధార'గా అభివర్ణించారు.ఉత్పాదక శక్తి (Manufacturing power)మోదీ 'సప్తధార'లో మొదటి స్థానాన్ని తయారీ రంగానికి ఇచ్చారు. చిన్న వస్తువుల నుంచి భారీ పరిశ్రమల వరకు సాధ్యమైనంత ఎక్కువగా భారత్లోనే తయారు చేయాలి అనేది ప్రధాని ఆలోచన. కేవలం ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా.. డిజైన్, తయారీ, నాణ్యత, సరఫరా వంటి మొత్తం విలువ గొలుసును దేశంలోనే అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాలకు భారత్ ఒక నమ్మకమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలు ధరతో పాటు నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై కూడా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.వ్యవసాయం, ఆహార ఉత్పత్తి (Agriculture and food production)రెండో శక్తిగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ప్రధాని ప్రస్తావించారు. మన రైతులు కేవలం దేశీయ మార్కెట్పైనే ఆధారపడకుండా.. ప్రపంచ మార్కెట్ను కూడా లక్ష్యంగా చేసుకోవాలని ఆయన అన్నారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహార పదార్థాలు, రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే.. పొలంలో పంట పండించడం దగ్గరే ప్రక్రియ ఆగిపోకూడదు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఎగుమతుల వరకు పూర్తి వ్యవస్థను అభివృద్ధి చేయాలి చెప్పారు.టెక్నాలజీ, ఆవిష్కరణ (Technology and innovation)మూడో శక్తిగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ను ప్రధాని ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ, అంతరిక్ష రంగం, రోబోటిక్స్, డేటా సెంటర్లు వంటి భవిష్యత్ రంగాల్లో భారత్ మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా దేశం నాయకత్వం వహించాలని చెప్పారు. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా 6జీను ప్రపంచానికి అందించే స్థాయికి భారత్ ఎదగడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.గతి శక్తి (Gati Shakti)నాలుగో శక్తిగా గతిశక్తిని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో రవాణా, కనెక్టివిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. హైస్పీడ్ రైళ్లు, కొత్త పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు వంటి మౌలిక వసతులను విస్తరించడంతో పాటు.. దేశంలోని నగరాలు, పరిశ్రమలు, పోర్టులు పరస్పరం మెరుగ్గా అనుసంధానమయ్యేలా చూడాలని సూచించారు. పోర్టులను కేవలం సరుకులు ఎగుమతి, దిగుమతి చేసే ప్రాంతాలుగా కాకుండా.. ఆర్థిక అభివృద్ధికి కేంద్రాలుగా మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.రక్షణ శక్తి (Raksha Shakti)ఐదో శక్తిగా రక్షణ రంగం గురించి పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్ మరింత ఆత్మనిర్భర్గా మారాలని ప్రధాని చెప్పారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, హైపర్సోనిక్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో భారత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. భారత్ కేవలం ప్రపంచ దేశాలకు మార్కెట్గా ఉండకుండా.. అత్యాధునిక రక్షణ సాంకేతికతను తయారు చేసి ఇతర దేశాలకు అందించే స్థాయికి ఎదగాలన్నది లక్ష్యం.గ్రీన్, బ్లూ ఎకానమీ (Green economy and blue economy)ఆరవ శక్తిగా గ్రీన్, బ్లూ ఎకానమీలను ప్రధాని ప్రస్తావించారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, పర్యావరణహిత తయారీ వంటి రంగాల్లో భారత్ భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.అదే సమయంలో.. దేశానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని కూడా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. మత్స్య పరిశ్రమ, సముద్ర సాంకేతికత, తీర ప్రాంత పర్యాటకం వంటి రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా బ్లూ ఎకానమీకి మరింత ఊతమివ్వాలని అన్నారు.యువశక్తి, సాఫ్ట్ పవర్ (India’s soft power)'సప్తధార'లో చివరి శక్తిగా యువశక్తి, భారత సాఫ్ట్ పవర్ను ప్రధాని వివరించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, హస్తకళలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు సినిమాలు, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వంటి ఆధునిక సృజనాత్మక రంగాల్లో కూడా భారత్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకోవాలని అన్నారు.అంతే కాకుండా.. వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం, భారతదేశంలోని ప్రకృతి అందాలు, జాతీయ పార్కులు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయడం ద్వారా దేశ సాఫ్ట్ పవర్ను పెంచుకోవాలని సూచించారు.'సప్తధార'లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడు రంగాలను వేర్వేరుగా చూడకూడదని ప్రధాని స్పష్టం చేయడం. ఉదాహరణకు తయారీ రంగానికి టెక్నాలజీ అవసరం. వ్యవసాయానికి ఫుడ్ ప్రాసెసింగ్ అవసరం. ఎగుమతులకు మెరుగైన లాజిస్టిక్స్ అవసరం. రక్షణ రంగానికి ఆవిష్కరణలు అవసరం. గ్రీన్ ఎకానమీకి యువత, టెక్నాలజీ అవసరం. అంటే.. ఒక రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావం మరో రంగంపైనా పడుతుంది. ఈ రంగాలన్నింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడమే 'సప్తధార' ఆలోచనలోని అసలు ఉద్దేశం.వికసిత్ భారత్ లక్ష్యానికి.. సప్తధార!మన దేశం స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2047 నాటికి వికసిత్ భారత్గా మారాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం ఒకటి రెండు రంగాలు అభివృద్ధి చెందితే సరిపోదు. తయారీ నుంచి వ్యవసాయం వరకు, టెక్నాలజీ నుంచి రక్షణ వరకు, గ్రీన్ ఎకానమీ నుంచి యువశక్తి వరకు అన్ని రంగాలు కలిసి ముందుకు సాగాలి.ఇదీ చదవండి: 80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం! -
80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం!
భారతదేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కారణంగానే ధరలు మెల్లగా పెరుగుతూ.. ఇప్పుడు రూ.1.50 లక్షలకు (10 గ్రాములు) చేరింది. అయితే.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు గోల్డ్ రేటు ఎలా ఉండేది?, ఆ తరువాత జరిగిన పరిణామం ఏమిటి?, అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు(1947లో) 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88.62 మాత్రమే. కానీ అదే 10 గ్రాముల గోల్డ్ రేటు ఇప్పుడు 2026 ఆగస్టు రూ.1,55,130 వద్దకు చేరింది. అంటే 80 ఏళ్లలో పసిడి ధర ఏకంగా 1711 రెట్లు పెరిగిందన్నమాట.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బంగారం ధర ఇంతగా పెరగడం ఒక్కసారిగా జరగలేదు. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు నెమ్మదిగా, మధ్య మధ్యలో హెచ్చుతగ్గులతో ఈ ప్రయాణం సాగింది. 1950లో 10 గ్రాముల గోల్డ్ రేటు 99.18 రూపాయలుగా ఉండేది. ఆ తరువాత 1964లో రూ.63.25కు చేరింది. అంటే.. బంగారం ధర కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు ధరలు తగ్గడం, మరికొన్ని సంవత్సరాలు పెద్దగా మార్పు లేకపోవడం జరిగింది.ఇదే సమయంలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. 1970-71లో ఒక కిలో వెండి సగటు ధర రూ.536.08 మాత్రమే. 2026 ఆగస్టు 15 నాటికి అది రూ.2.55 లక్షలకు చేరింది. అంటే దాదాపు 56 ఏళ్లలో వెండి ధర సుమారు 390 రెట్లు పెరిగింది. అయితే.. వెండి ధర కూడా ఎప్పుడూ ఒకే విధంగా పెరగలేదు. 2011-12లో కేజీ వెండి ధర రూ.57,315.87కు చేరిన తర్వాత, 2015-16లో రూ.36,318.10కు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ ధర పెరుగుతూ వచ్చింది.బంగారం, వెండిని ధరలను పోల్చి చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. 1984-85 నుంచి లెక్కిస్తే బంగారం ధర సుమారు 76 రెట్లు పెరిగింది. అదే సమయంలో వెండి ధర సుమారు 55 రెట్లు పెరిగింది. అంటే ఆ కాలంలో వెండితో పోలిస్తే బంగారం ధర పెరుగుదల ఎక్కువగా ఉందన్న విషయం స్పష్టమవుతుంది.ఈ రోజు ధరలుభారతదేశంలో ఈ రోజు గోల్డ్ రేటు రూ.1,55,130 (10 గ్రాముల 24 క్యారెట్స్ ధర) వద్ద ఉంటే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ రేటు రూ.142200 వద్ద ఉంది. వెండి ధర రూ.2.55 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే గోల్డ్ రేటు ఎంత పెరుగుతుందనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: 79 ఏళ్లలో మారిపోయిన భారతీయుల ఖర్చు తీరు! -
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
సొంత ఇల్లు లేదా స్థలానికి సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ కాగితాలు) పొరపాటున పోగొట్టుకోవడం లేదా ప్రమాదవశాత్తు పాడైపోవడం ఆస్తిదారులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించే అంశమే. అయితే, ఒరిజినల్ డాక్యుమెంట్లు చేజారినంత మాత్రాన ఆస్తిపై యాజమాన్య హక్కులు కోల్పోతారని భావించడం పూర్తిగా అపోహ మాత్రమే. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం సరైన న్యాయపరమైన ప్రక్రియను పాటించడం ద్వారా మీ హక్కులను సమర్థవంతంగా పరిరక్షించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.చేపట్టాల్సిన చట్టబద్ధమైన చర్యలుపోలీస్ ఫిర్యాదు (ఎఫ్ఐఆర్)దస్తావేజులు పోయినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. భవిష్యత్తులో ఈ పత్రాలు దుర్వినియోగం కాకుండా, ఫోర్జరీకి గురికాకుండా ఇది ప్రాథమిక చట్టపరమైన రక్షణగా పనిచేస్తుంది.ప్రజా ప్రకటన (పత్రికా నోటీసు)ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో పాటు స్థానిక ప్రాంతీయ (తెలుగు) దినపత్రికలో ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, పోయిన పత్రాల సమాచారాన్ని పేర్కొంటూ పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. 15-21 రోజుల గడువులో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఆ పత్రికా నోటీసు కాపీ స్పష్టమైన ఆధారంగా ఉపయోగపడుతుంది.నోటరీ అఫిడవిట్, ఇండెమ్నిటీ బాండ్పత్రాలు పోయిన తీరును వివరిస్తూ నోటరీ సమక్షంలో అఫిడవిట్ రాయించుకోవాలి. భవిష్యత్తులో ఆస్తి అమ్మకం సమయంలో కొనుగోలుదారులు లేదా బ్యాంకుల సందేహాలను నివృత్తి చేయడానికి ఇండెమ్నిటీ బాండ్ ఎంతో దోహదపడుతుంది.సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సర్టిఫైడ్ కాపీరిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 57 ప్రకారం ప్రభుత్వ రికార్డులలో ప్రతి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రతి శాశ్వతంగా భద్రపరుస్తారు. కాబట్టి సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధమైన సర్టిఫైడ్ కాపీ (ధ్రువీకృత నకలు) పొందవచ్చు. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన విలువను కలిగి ఉంటుంది.బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే పరిహారం తప్పనిసరిఒకవేళ హోమ్ లోన్ కోసం బ్యాంకులో కుదువబెట్టిన ఒరిజినల్ పత్రాలను బ్యాంకే పోగొడితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం సదరు బ్యాంకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు సొంత ఖర్చులతో డూప్లికేట్ పత్రాలను తీసివ్వడం బ్యాంకు బాధ్యత.కాబట్టి, ఆస్తి పత్రాలు పోయినప్పుడు అధైర్యపడకుండా ఎఫ్ఐఆర్, పత్రికా ప్రకటన, సర్టిఫైడ్ కాపీ ప్రాసెస్ పూర్తి చేయడం ద్వారా మీ ఆస్తి హక్కులను పూర్తిస్థాయిలో సురక్షితం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే.. -
అది పసిడి మెరుపు కాదు.. డాలర్ పతనమే..
అమెరికా డాలర్ విలువ, బంగారం ధరలపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు చేసిన ఆయన.. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బంగారం ప్రమాణాన్ని (గోల్డ్ స్టాండర్డ్) నిలిపివేసిన పరిణామాలను ప్రస్తావించారు. అప్పటి నుంచి డాలర్ కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు.1971లో ఒక ఔన్స్ బంగారం విలువ 35 డాలర్లు ఉండేదని, ప్రస్తుతం అది 4,342 డాలర్లకు చేరిందని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. అంటే బంగారం ధర 124 రెట్లు పెరిగిందని చెప్పారు. అయితే ఇది బంగారం విలువ పెరగడం కంటే.. డాలర్ కొనుగోలు శక్తి భారీగా క్షీణించడాన్ని సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.‘రిచ్ డాడ్’ తనకు 21 ఏళ్ల వయసులో డాలర్ గురించి చెప్పిన విషయాన్ని కూడా కియోసాకి గుర్తు చేసుకున్నారు. నిక్సన్ ఒక్క రాత్రిలో డాలర్ను విలువ తగ్గించలేదని, అప్పటికే దాని విలువ తగ్గిపోయిందనే విషయాన్ని మాత్రమే వెల్లడించారని తన ‘రిచ్ డాడ్’ చెప్పేవారని పేర్కొన్నారు. అప్పట్లో ఈ పరిణామాలను గమనించిన వారు భూములు, చమురు, గనులు వంటి హార్డ్ అసెట్స్లో పెట్టుబడులు పెట్టారని, ఇతరులు బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేసి కొనుగోలు శక్తిని కోల్పోయారని వ్యాఖ్యానించారు.బంగారం కొనుగోలు గురించి అందరూ మాట్లాడుతున్నప్పటికీ, వాస్తవంగా కొద్దిమందే పెట్టుబడి పెడుతున్నారని కియోసాకి అన్నారు. నాణేలు లేదా గోల్డ్ ఆధారిత పెట్టుబడి సాధనాల కంటే బంగారం ఉత్పత్తి చేసే గనుల్లో యాజమాన్య వాటా కలిగి ఉండటమే మెరుగైన వ్యూహమని తన ‘రిచ్ డాడ్’ సూచించేవారని చెప్పారు.ఈ నేపథ్యంలో ‘క్యాపిటల్ క్లబ్’ పేరుతో ఒక ప్రైవేట్ పెట్టుబడి వేదిక గురించి కూడా కియోసాకి తన పోస్టులో ప్రస్తావించారు. నాలుగు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బంగారం, వెండి మైనింగ్ కంపెనీలో ప్రీ-పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెట్టుబడి అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కొలరాడో, ఘనా, దక్షిణాఫ్రికా, పపువా న్యూ గినియాలో కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ ప్రైవేట్ రౌండ్లో ఇప్పటికే సగానికి పైగా పెట్టుబడులు సమీకరించబడ్డాయని, తదుపరి అవకాశం ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని కియోసాకి తెలిపారు. అయితే ప్రైవేట్ పెట్టుబడులు, మైనింగ్ కంపెనీల్లో వాటాలు వంటి అంశాల్లో అధిక రిస్క్ ఉండొచ్చన్న విషయాన్ని పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
నీటి వృథా? భారీ ఆదాయం? ఆందోళనల్లో నిజమెంత?
డిజిటల్ విప్లవానికి కీలకమైన డేటా సెంటర్లు భారీగా నీటిని వృథా చేస్తున్నాయనే నిరసనలు, ఆందోళనల వెనుక ఉన్న అసలు నిజాలను శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఇటీవల ఒక మెట్రో నగరంలో హైపర్స్కేల్ డేటా సెంటర్కు శుద్ధి చేసిన మురుగునీటిని (ట్రీటెడ్ సీవేజ్ వాటర్) కిలోలీటర్కు రూ.7.50 చొప్పున కేటాయిస్తే.. నగర వాసుల తాగునీటి అక్రమరవాణా అంటూ తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.మురుగునీరు.. రాబడికి మార్గంసింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ తోంగ్ 2002లోనే శుద్ధి చేసిన మురుగునీటిని తాగి, అది తాగేందుకు పూర్తిగా సురక్షితమని నిరూపించారు. నిజానికి డేటా సెంటర్లు, సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు పౌరులు తాగే నీటికంటే అత్యంత ప్రాసెస్ చేసిన నీరు అవసరం. భారత్లో రోజుకు సుమారు 72,368 మిలియన్ లీటర్ల(ఎంఎల్డీ) మురుగునీరు ఉత్పత్తవుతుండగా కేవలం 20,000 ఎంఎల్డీ మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలినదంతా సముద్రాలు, నదుల్లో కలసి వృథాగా పోతోంది. ఇటువంటి సమయంలో మురుగునీటిని శుద్ధి చేసి డేటా సెంటర్లకు విక్రయించడం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లకు భారీగా ఆదాయం సమకూరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.అసలు నీటి వినియోగం ఎంత?‘నేషన్ ఫస్ట్ పాలసీ రీసెర్చ్ అండ్ చేంజ్ ఫౌండేషన్’ (మే 2026 నివేదిక - బియాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రకారం భారతదేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 2024లోని 1,352 మెగావాట్ల నుంచి 2030 నాటికి 8,318 మెగావాట్లకి చేరనుంది. అప్పటివరకు కావలసింది ఏడాదికి 163 బిలియన్ లీటర్లు మాత్రమే. భారత్ ఏడాదికి వాడుతున్న 7 లక్షల బిలియన్ లీటర్ల నీటితో పోలిస్తే ఇందులో 4/5 వంతు వ్యవసాయానికే వెళ్తోంది. డేటా సెంటర్ల నీటి అవసరం అందులో 1/50వ వంతు మాత్రమే. కేంద్ర భూగర్భ జలాల బోర్డు ప్రకారం పంజాబ్లో పునరుద్ధరణ కంటే 160 శాతం ఎక్కువ నీటిని ఉచిత విద్యుత్తో వరి సాగుకు తోడుతున్నా పెద్దగా నిరసనలు ఉండవు, కానీ మురుగునీటిని కొనుగోలు చేసే డేటా సెంటర్లపై విమర్శలు రావడం విడ్డూరమని నిపుణులు చెబుతున్నారు.పరిష్కార మార్గాలుడేటా సెంటర్లను నిషేధించడం పరిష్కారం కాదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డేటా సెంటర్లకు వ్యర్థ జలాల సరఫరాను అడ్డుకుంటే అవి పొడి శీతలీకరణ (Dry chillers విద్యుత్తో చల్లబరచడం) వైపు మొగ్గుచూపి 10-65% అదనపు విద్యుత్ అవసరమౌతుంది. తద్వారా విద్యుత్ ఉత్పాదనలో నీటి వాడకం పెరుగుతుంది.గుజరాత్ (2018) పునర్వినియోగ విధానం, జాతీయ చట్రం (2022)ల తరహాలోనే డేటా సెంటర్లు, థర్మల్ పవర్, టెక్స్టైల్స్, నిర్మాణ రంగాలకు శుద్ధి చేసిన మురుగునీటి వినియోగాన్ని నిబంధనగా మార్చాలని కొందరు కోరుతున్నారు. డేటా సెంటర్ల అనుమతుల సమయంలోనే నీటి వినియోగ వివరాలను సేకరించి పారదర్శకంగా ఉంచాలి. తాగునీటి కంటే శుద్ధి చేసిన వ్యర్థ జలాల ధరను తక్కువగా నిర్ణయించి వృథాను అరికట్టాలి. సరైన శాస్త్రీయ ఆధారాలు, ధనిక ప్రాతిపదికన ధరల నిర్ణయం ఉంటేనే ప్రజాభిప్రాయాన్ని సరైన దిశలో నడిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే.. -
కమర్షియల్ రియల్ ఎస్టేట్ కళకళ..
దేశీయంగా భారీ స్థాయిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటవుతున్నాయి. ఏడు రాష్ట్రాలు 2031 నాటికి 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన లక్ష్యంతో 1,380 జీసీసీల ఏర్పాటుకు దోహపడేలా ప్రత్యేక విధానాలను రూపొందించాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.ఈ రాష్ట్రాలు.. విశిష్ట జీసీసీ పాలసీలను రూపొందించడంలో భారతీయ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అత్యంత అసాధారణమైన వేగాన్ని ప్రదర్శించాయని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. భారతీయ సర్వీసుల వ్యవస్థకు జీసీసీలు ప్రధాన కేంద్రాలుగా మారుతుండటాన్ని ఇది తెలియజేస్తోందని వివరించారు. రాష్ట్రాలు నిర్దిష్ట ప్రోత్సాహకాలు, వేగవంతంగా అనుమతులు, దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాలను కల్పించే హామీలు మొదలైనవి కల్పించడం ద్వారా జీసీసీలను స్వాగతించేందుకు పోటీపడుతున్నాయని పేర్కొన్నారు.నివేదికలో మరిన్ని విశేషాలు.. కర్ణాటక 3.5 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే యోచనతో 500 జీసీసీలను టార్గెట్గా పెట్టుకుంది. మహారాష్ట్ర 4 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడేలా 200 జీసీసీలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. గుజరాత్ 50,000 ఉద్యోగావకాశాల కల్పనతో 250 జీసీసీలను, కేరళ 1.6 లక్షల కొలువు లక్ష్యంతో 80 జీసీసీలను టార్గెట్గా పెట్టుకుంది. అలాగే మధ్యప్రదేశ్ 37,000 ఉద్యోగాల కల్పన కోసం 50 జీసీసీలను సాధించాలని నిర్దేశించుకుంది. జీసీసీ ఉద్యోగుల కోసం తమిళనాడు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. తెలంగాణ, ఢిల్లీ కూడా జీసీసీ వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రోత్సహించే విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ పరిశ్రమ కోసం నిర్దిష్ట విధానాలను రూపొందించడంపై ఇతరత్రా పలు రాష్ట్రాలు దృష్టి పెడుతున్నాయి. కేరళ ముసాయిదా జీసీసీ పాలసీలను ప్రతిపాదించింది. 2022 నుంచి 2026 తొలి ఆరు నెలల వ్యవధి మధ్య భారత్లోని టాప్ 9 నగరాల్లో జీసీసీలు 12.3 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. -
పెట్రోల్ ఎగుమతులపై సుంకం ఎత్తివేత.. డీజిల్పై తగ్గింపు
అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ధరల కదలికలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ను మరోసారి సవరించింది. పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయగా.. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును తగ్గించింది. సవరించిన రేట్లు ఆగస్టు 15 నుంచి తదుపరి 15 రోజుల పాటు అమల్లో ఉంటాయి.కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. డీజిల్ ఎగుమతులపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) లీటరుకు రూ.25.50 నుంచి రూ.24కి తగ్గింది. ఏటీఎఫ్పై పన్ను రూ.22 నుంచి రూ.19.50కి దిగొచ్చింది. ఇక పెట్రోల్పై ఉన్న రూ.3.50 ఎగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. అంటే ఇక పెట్రోల్ ఎగుమతులపై ఈ లెవీ ఉండదు.ఆగస్టులోనే రెండోసారి సవరణఇంధన ఎగుమతి పన్నుల్లో ఈ మార్పు కీలకంగా మారింది. ఆగస్టు 3న కేంద్రం పెట్రోల్పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.2.50 నుంచి రూ.3.50కి పెంచింది. అదే సమయంలో డీజిల్పై మొత్తం ఎగుమతి సుంకం రూ.15.50 నుంచి రూ.25.50కి, ఏటీఎఫ్పై రూ.14.50 నుంచి రూ.22కి భారీగా పెంచింది.అయితే రెండు వారాల్లోనే అంతర్జాతీయ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పరిస్థితుల్లో మార్పులు రావడంతో ప్రభుత్వం మళ్లీ రేట్లను తగ్గించింది. దీంతో ముఖ్యంగా పెట్రోల్ ఎగుమతిదారులకు పన్ను భారం పూర్తిగా తొలగిపోగా.. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతిదారులకు కూడా కొంత ఊరట లభించింది.భారత్ పెట్రోలియం ఉత్పత్తులపై ఈ ఎగుమతి సుంకాలను స్థిరంగా ఉంచకుండా అంతర్జాతీయ ముడి చమురు ధరలు, ఇంధన ధరలు, రిఫైనింగ్ మార్జిన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తోంది.దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం?తాజా నిర్ణయం దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలపై నేరుగా ప్రభావం చూపదు. ప్రస్తుతం సవరించినవి ఎగుమతులకు వర్తించే ప్రత్యేక సుంకాలు మాత్రమే. గతంలోనూ ప్రభుత్వం ఎగుమతి సుంకాలను మార్చినప్పుడు దేశీయ వినియోగానికి సంబంధించిన ఎక్సైజ్ డ్యూటీలో మార్పు చేయలేదు.అందువల్ల ఆగస్టు 15 నుంచి పెట్రోల్ ఎగుమతులపై పన్ను తొలగింపు, డీజిల్, ఏటీఎఫ్పై సుంకం తగ్గింపు ప్రధానంగా రిఫైనరీలు, ఇంధన ఎగుమతిదారుల ఆర్థిక భారాన్ని ప్రభావితం చేయనుంది. అంతర్జాతీయ చమురు మార్కెట్ పరిస్థితులను బట్టి సెప్టెంబర్ ప్రారంభంలో తదుపరి పక్షం సమీక్షలో ఈ రేట్లు మళ్లీ మారే అవకాశం ఉంటుంది. -
చైనా అక్రమ వ్యాపారానికి భారత్ సహకారం?
అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను తప్పించుకునేందుకు చైనా చేపడుతున్న చట్టవిరుద్ధ రవాణాకు భారత్తో పాటు మరో 40 దేశాలు సహకరిస్తున్నాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ రకమైన షాడో ట్రాన్స్-షిప్మెంట్ నెట్వర్క్ ద్వారా జరుగుతున్న చట్టవిరుద్ధ రవాణాను గుర్తించి అడ్డుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను రంగంలోకి దించనున్నట్లు ప్రకటించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపార, తయారీ రంగానికి సంబంధించిన సలహాదారు పీటర్ నవారో రూపొందించిన ‘ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్’ అనే నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల ద్వారా ఏటా అక్రమంగా రవాణా అవుతున్న వస్తువుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు నుంచి 303 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని ఈ నివేదిక అంచనా వేసింది.చైనాకు సహకారం..అమెరికా సుంకాల నుంచి చైనా తప్పించుకోవడానికి సహకరిస్తున్న ప్రాంతాల్లో భారత్కు చెందిన పుణె - గుజరాత్ - చెన్నై బెల్ట్ను అమెరికా నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. చైనా ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను మూడో దేశం ద్వారా రవాణా చేస్తూ స్వల్పంగా అసెంబ్లీ చేయడం, ఫినిషింగ్, రీప్యాకేజింగ్ లేదా లేబుళ్లు మార్చడం ద్వారా ఆ వస్తువు వేరే దేశంలో తయారైనట్లు భ్రమ కల్పిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఈ అక్రమ రవాణాలో భాగమైన భారతీయ ఎగుమతిదారులను లేదా సంబంధిత సంస్థల పేర్లను ఈ నివేదిక స్పష్టంగా ప్రస్తావించలేదు.నివేదికలోని ముఖ్యాంశాలుచైనా నుంచి మెక్సికో, భారత్, వియత్నాంల ద్వారా అమెరికాకు దాదాపు 67 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు అక్రమంగా రవాణా అయ్యాయని తెలిపింది. దీనివల్ల అమెరికా సుమారు 28 బిలియన్ డాలర్లు సుంకాల ఆదాయాన్ని కోల్పోయిందని అంచనా వేసింది. భారత్, కెనడా, ఈయూ వంటి దేశాలను టైర్-1 కేటగిరీలో చేర్చారు. చైనా ఉత్పత్తుల భారీ విక్రయాలు జరుపుతూనే విభిన్న పారిశ్రామిక స్థావరాలు కలిగి ఉన్న దేశాలుగా వీటిని పేర్కొన్నారు. బ్రెజిల్, ఇండోనేషియా, మలేషియాలు టైర్-2 జాబితాలో ఉన్నాయి. కంబోడియా, లావోస్, మైన్మార్లు చైనాతో సరిహద్దు కారిడార్లు కలిగి ఉన్న దేశాలు టైర్-3 స్థానంలో పొందాయి.తాజా పరిణామాలు.. ప్రభావంభారత్పై అమెరికా సెక్షన్ 301 కింద 10% టారిఫ్లు విధించడంతో పాటు ఫోర్స్డ్ లేబర్ (వెట్టి చాకిరీ) అంశంపై విచారణ జరుపుతున్న సమయంలోనే ఈ నివేదిక వెలువడటం గమనార్హం. అంతేకాకుండా రష్యన్ ఆయిల్, గ్యాస్ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉన్నందున భారత్పై 100 శాతం వరకు టారిఫ్లు విధించే చట్టాన్ని ఆమోదించే దిశగా కూడా అమెరికా ఆలోచిస్తోంది. ఈ పరిణామం భవిష్యత్తులో భారత్పై అమెరికా తనిఖీలను పెంచడానికి, ఎగుమతుల్లో ఆలస్యానికి, కఠినమైన జరిమానాలకు దారితీయవచ్చని వాణిజ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే.. -
మార్కెట్లోకి మహీంద్రా కొత్త ట్రక్కు
మహీంద్రా గ్రూప్ హెవీ డ్యూటీ ట్రక్కుల విభాగంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా ‘బ్లేజో ఐ–టీఆర్కే’ ట్రక్కును మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని కేవలం ట్రక్కుగానే కాకుండా, వ్యాపార లాభాలను పెంచే ‘బిజినెస్ సొల్యూషన్’గా తీర్చిదిద్దారు. అత్యుత్తమ ఇంధన సామర్థ్యం (మైలేజ్), శక్తివంతమైన పవర్ట్రెయిన్, పరిశ్రమలోనే ఉత్తమమైన ‘అప్టైమ్ గ్యారెంటీ’తో ఈ ట్రక్కు అందుబాటులోకి వస్తోంది. ఇది ఆపరేటింగ్ ఖర్చులను తగ్గించి, ఉత్పాదకత, యజమానుల సంపాదనను పెంచుతుంది.ఇందులో మహీంద్రాకు చెందిన నెక్ట్స్ జనరేషన్ కనెక్టెడ్ ప్లాట్ఫామ్ ‘ఐఎంఏఎక్స్ఎక్స్ 2.0’ సదుపాయం ద్వారా ముందస్తు డయాగ్నోస్టిక్స్, డ్రైవర్ ప్రవర్తన పర్యవేక్షణ సులభమవుతాయి. అలాగే బ్రేక్డౌన్ సాయం, వ్యాన్ రియల్–టైమ్ ట్రాకింగ్, వేగవంతమైన డిజిటల్ ఆమోదాలు, స్పేర్ పార్ట్స్ ఆర్డరింగ్, సర్వీస్ హిస్టరీ, రిమైండర్ల వంటి డిజిటల్ సేవలను నిర్వహించుకునేందుకు ‘నౌ 24 గీ7’ మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. ‘బ్లేజో ఐ–టీఆర్కే’ ట్రక్కు విడుదల ద్వారా హెవీ ట్రక్ విభాగంలో గతంలో తమకున్న అయిదు శాతం మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకోవడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది.సరైన సమయంలోనే ఎలక్ట్రిక్ ట్రక్కులు సుదూర రవాణాకు అవసరమైన చార్జింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాకే.. సరైన సమయంలో హెవీ ఎలక్ట్రిక్ ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేస్తామని మహీంద్రా గ్రూప్ ఉన్నతాధికారి వినోద్ సహాయ్ తెలిపారు. ప్రతి 200–250 కి.మీలకు చార్జింగ్ పాయింట్లు అవసరమన్నారు. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ దేశంలో వాణిజ్య వాహనాల డిమాండ్ బాగుందన్నారు. పరిశ్రమ 10–12% వృద్ధి నమోదు చేస్తే, మహీంద్రా గ్రూప్ ఏకంగా 13% వృద్ధి సాధించిందని వివరించారు. -
భారత్ 6G దిశగా చారిత్రాత్మక విజయం
భారత సాంకేతిక రంగానికి సరికొత్త వెలుగులు నింపుతూ ‘భారత్ 6G’ కల సాకారమయ్యే దిశగా ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ‘భారత్ 6G టెరాహెర్ట్జ్ టెస్ట్బెడ్’పై పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్వహించిన పరీక్షల్లో రికార్డు స్థాయిలో 6.39 Gbps డేటా ట్రాన్స్మిషన్ వేగాన్ని విజయవంతంగా నమోదు చేశారు. భవిష్యత్తు వైర్లెస్ సాంకేతికతలో భారత్ను ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఈ ప్రయోగం నాంది పలికింది.6.39 Gbps డేటా వేగంతో కొత్త అధ్యాయంటెరాహెర్ట్జ్ (THz) ఫ్రీక్వెన్సీ బ్యాండ్ను ఉపయోగించి జరిపిన ఈ పరీక్షల్లో అనుకున్న లక్ష్యాల కంటే అత్యధిక వేగంతో డేటా ప్రసారమైంది. 5G సాంకేతికత కంటే ఇది అనేక రెట్లు వేగవంతమైనది. ఈ విజయం కేవలం వేగానికి మాత్రమే పరిమితం కాకుండా ఆల్ట్రా-లో-లెటెన్సీ, అధిక బ్యాండ్విడ్త్ సేవలను అందించడంలో కీలకపాత్ర పోషించనుంది.స్వదేశీ పరిజ్ఞానంకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ 6G మిషన్’లో భాగంగా ఐఐటీ మద్రాస్ ఈ టెస్ట్బెడ్ను అభివృద్ధి చేసింది. విదేశీ సాంకేతికతపై ఆధారపడడాన్ని తగ్గిస్తూ పూర్తిగా మన శాస్త్రవేత్తలు రూపుదిద్దిన పరికరాలు, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లతో ఈ ఘనత సాధించడం విశేషం.భవిష్యత్తుపై దీని ప్రభావంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ, స్మార్ట్ సిటీ కమ్యూనికేషన్లకు ఈ టెరాహెర్ట్జ్ వేగం ప్రధాన బలంగా మారనుంది. రికార్డు వేగంతో డేటా బదిలీ కావడం వల్ల రిమోట్ సర్జరీలు, డిజైన్ ల్యాబ్లు, స్వయంప్రతిపత్తి కలిగిన వాహనాల వినియోగం మరింత సులభతరం అవుతుంది. భారత్ 2030 నాటికి పూర్తిస్థాయి 6G సేవలను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఐఐటీ మద్రాస్ సాధించిన ఈ విజయం ఆ దిశగా పడిన అతిపెద్ద మైలురాయిగా నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే.. -
పసిడి దూకుడు: తులం రేటు ఇప్పుడు..
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగింది. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు ఎగిశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
టీవీ ఛానళ్లకు ప్రకటనల పరిమితి రద్దు
బుల్లితెరపై వాణిజ్య ప్రకటనల నిడివిపై దశాబ్దాలుగా అమలులో ఉన్న పరిమితికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్వస్తి చెప్పింది. టెలివిజన్ ఛానళ్లలో గంటకు గరిష్టంగా 12 నిమిషాలు మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలనే నిబంధనను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడం, మార్కెట్లో సమాన పోటీతత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సవరణను చేపట్టినట్లు వెల్లడించింది.కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్, 1994 ప్రకారం 2006లో ఈ 12 నిమిషాల నిబంధనను అమల్లోకి తెచ్చారు. అప్పట్లో దేశంలో కేవలం 62 ఛానళ్లు మాత్రమే ఉండగా డిజిటలీకరణ పెరిగిన తర్వాత ప్రస్తుతం వాటి సంఖ్య 900 దాటింది. అంతేకాకుండా యూట్యూబ్, ఓటీటీ వంటి డిజిటల్ మీడియా వేదికలపై ఎలాంటి ప్రకటనల పరిమితి లేకపోవడం వల్ల సాంప్రదాయ టీవీ ఛానళ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం గుర్తించింది. 'పే' లేదా 'ఫ్రీ-టు-ఎయిర్' ఛానళ్లైనా ప్రకటనల ఆదాయంపైనే ప్రధానంగా ఆధారపడుతుండటంతో డిజిటల్ మీడియాతో సమానంగా పోటీపడే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.డిజిటల్ కేబుల్, డీటీహెచ్, ఐపీటీవీ వంటి నూతన సాంకేతికతల వల్ల ప్రేక్షకులకు అనేక ఎంపికలు అందుబాటులోకి వచ్చాయని, మార్కెట్ స్వయం ప్రతిపత్తి సాధించిందని కేంద్రం స్పష్టం చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్ సవరణల అధికారిక గెజెట్ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో టీవీ నెట్వర్క్ల ఆదాయ మార్గాలు మెరుగుపడనున్నాయని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే.. -
పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్
గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్పీఎల్ఐ) పథకంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా నివసించే వారికి ప్రధానంగా అందుబాటులో ఉన్న ఈ ప్రభుత్వ మద్దతు ఉన్న జీవిత బీమా పథకం పరిధిని కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మార్పును ప్రకటించింది.బ్యాంక్ ఖాతా ఉంటే అదనపు అర్హతకొత్త నిబంధనల ప్రకారం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (POSB) లేదా ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంకులో యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండటం కూడా ఆర్పీఎల్ఐకి అదనపు అర్హతగా పరిగణించనున్నారు. దీంతో కేవలం గ్రామీణ నివాసాన్ని ఆధారంగా చేసుకునే సంప్రదాయ అర్హతకు ఉన్న పరిమితి కొంతవరకు తొలగనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా మరింత మంది ఆర్పీఎల్ఐ కవరేజీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.అయితే, ఇండియా పోస్ట్ అధికారిక వివరాల ప్రకారం ఆర్పీఎల్ఐ ప్రాథమికంగా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా నివసించే భారతీయులకు ఉద్దేశించిన పథకమే. సాధారణంగా 19 నుంచి 55 ఏళ్ల వయసున్న వారు ఆర్పీఎల్ఐ పాలసీలకు అర్హులు.1995లో ప్రారంభమైన పథకంగ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా బలహీన వర్గాలు, మహిళా కార్మికులకు జీవిత బీమా రక్షణను అందించాలనే ఉద్దేశంతో ఆర్పీఎల్ఐని 1995 మార్చి 24న ప్రారంభించారు. దేశంలోని విస్తృత పోస్టాఫీస్ నెట్వర్క్ను ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంతాల్లో బీమా విస్తరణను పెంచడం దీని ప్రధాన లక్ష్యం.ఆర్పీఎల్ఐ కింద గ్రామ సురక్ష, గ్రామ సంతోష్, గ్రామ సువిధ, గ్రామ సుమంగళ్, గ్రామ ప్రియ, బాల జీవన్ బీమా వంటి వివిధ పాలసీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.అర్హత నిరూపణ కూడా సులభతరంకొత్త విధానంలో బ్యాంక్ ఖాతా ఉన్నట్లు నిరూపించేందుకు కస్టమర్లకు మరిన్ని డిజిటల్ మార్గాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (CBS) వివరాలు, ఈ-మెయిల్ స్టేట్మెంట్లు, మొబైల్ బ్యాంకింగ్ స్క్రీన్షాట్లు, ఏటీఎం స్టేట్మెంట్లు లేదా అప్డేట్ చేసిన పాస్బుక్ వంటి ఆధారాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది.యాక్టివ్ బ్యాంక్ ఖాతాకు చెల్లుబాటు అయ్యే డిజిటల్ ఆధారం ఉన్నప్పుడు ప్రత్యేకంగా భౌతిక బ్యాంక్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాలసీ దరఖాస్తు సమయంలో పత్రాల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.డిజిటల్ వ్యవస్థలతో వేగంగా సేవలుఇండియా పోస్ట్ తన బీమా సేవలను కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లతో అనుసంధానిస్తోంది. ఆర్పీఎల్ఐ/PLI కస్టమర్లు ఆన్లైన్లో కోట్ పొందడం, దరఖాస్తు చేయడం, పత్రాలను సమర్పించడం వంటి సేవలను వినియోగించుకోవచ్చు. పాలసీ జారీకి అవసరమైన పత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత సాధారణంగా 10 రోజులు పడుతుందని ఇండియా పోస్ట్ కస్టమర్ పోర్టల్ పేర్కొంటోంది.ఇదే సమయంలో పోస్టాఫీస్ సేవింగ్స్ వ్యవస్థలో CBSతో పాటు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ ఖాతా సేవలు, NEFT/RTGS, IPPB–POSA అనుసంధానం వంటి డిజిటల్ సదుపాయాలు విస్తరించాయి. దేశవ్యాప్తంగా 1.64 లక్షలకు పైగా పోస్టాఫీసుల నెట్వర్క్ ద్వారా 45 కోట్లకు పైగా POSB ఖాతాదారులకు సేవలు అందుతున్నాయని కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరిలో వెల్లడించింది.ఇక 2025 ఆగస్టులో దేశవ్యాప్తంగా అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (APT) ప్లాట్ఫామ్ను అమలు చేయడంతో పోస్టల్ సేవల డిజిటలైజేషన్ మరింత వేగం పుంజుకుంది. దాదాపు 1.70 లక్షల పోస్టల్ కార్యాలయాలను ఈ ఆధునిక వ్యవస్థతో అనుసంధానించినట్లు ప్రభుత్వం తెలిపింది.బీమా అందరికీ చేరువ చేయడమే లక్ష్యందేశంలో బీమా విస్తరణను పెంచే #InsuranceForAll లక్ష్యానికి అనుగుణంగా ఆర్పీఎల్ఐ అర్హతలను విస్తరించినట్లు కేంద్రం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో జీవిత బీమా రక్షణను అందించడమే కాకుండా, బ్యాంకింగ్, డిజిటల్ ఆధారాలను ఉపయోగించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడం ఈ మార్పు ఉద్దేశం. -
అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే..
భారతీయ వ్యవసాయ రంగంలో రైతు కేవలం ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, ఒక ‘వ్యవసాయ పారిశ్రామికవేత్త’గా మారినప్పుడే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుంది. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు పండించడంతో పాటు శాస్త్రీయ ఆర్థిక నిర్వహణ, పంటల వైవిధ్యం, ప్రభుత్వ పథకాల సద్వినియోగం ద్వారా మాత్రమే వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మలచవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రైతుల కోసం కొన్ని ప్రభుత్వ ఆర్థిక పథకాలురైతులు తమ పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవడానికి, భద్రత పొందడానికి కింది పథకాలను వినియోగించుకోవాలి.పీఎం-కిసాన్: భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6,000 మూడు విడతల్లో పెట్టుబడి సహాయంగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. (రాష్ట్ర ప్రభుత్వాల ప్లాన్ల ద్వారా అదనపు సాయం అందుబాటులో ఉంటుంది).కిసాన్ క్రెడిట్ కార్డ్: బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే (నగదు రహిత సబ్సిడీతో కలిపి 4 శాతానికే) పంట రుణాలు పొందే వెసులుబాటు.ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన: ప్రకృతి వైపరీత్యాలు, పురుగుల తాకిడి వల్ల పంట నష్టం వాటిల్లినప్పుడు కనీస ప్రీమియం (ఖరీఫ్ 2%, రబీ 1.5%) చెల్లించి పూర్తి ఆర్థిక రక్షణ పొందవచ్చు.పీఎం కుసుమ్: సోలార్ పంప్సెట్ల ఏర్పాటుకు 60 శాతం వరకు సబ్సిడీ పొందడం ద్వారా విద్యుత్తు ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవచ్చు.రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సూత్రాలుపంటల డిజిటల్ బుక్వ్యవసాయం నష్టపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎక్కడ దారి మళ్లుతుందో లెక్క లేకపోవడం. సాధారణ డైరీ రాయడం కంటే ఫార్మ్చేంజ్, అగ్రీకాంబస్ లేదా ఉచిత ఖాతాబుక్/డిజిటల్ రిజిస్టర్ యాప్లను ఉపయోగించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్ డీజిల్, రోజువారీ కూలీల ఖర్చులను ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలి.పంట చివరిలో ఏ రసాయనం, ఏ పని వల్ల ఎంత లాభం వచ్చిందో స్పష్టత వస్తుంది. అనవసర పురుగుమందుల ఖర్చులను 20-30% వరకు తగ్గించుకోవచ్చు.వ్యవసాయ అత్యవసర నిధివాతావరణ మార్పులు, అకాల వర్షాలు లేదా ధరల పతనం వంటి ఆకస్మిక నష్టాల నుంచి రైతును కాపాడే రక్షణ కవచం ఇది. ప్రతి పంట అమ్మకం ద్వారా వచ్చే నికర ఆదాయంలో కనీసం 10-15% నిధిని వేరు చేయాలి. ఈ డబ్బును ఇంట్లో ఉంచకుండా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్యాంకులో ‘స్వీప్-ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్’ రూపంలో పెట్టాలి. దీనివల్ల సాధారణ సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ రావడమే కాకుండా అత్యవసర సమయంలో వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. పంట నష్టపోయినప్పుడు మళ్లీ విత్తనాలు/ఎరువుల కొనుగోలు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద 24-36% ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు.రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్పీఓ)ఒంటరిగా పోరాడే రైతు కంటే 100 మంది రైతులు ఒక సమూహంగా ఏర్పడితే మార్కెట్లో బేరమాడే శక్తి పెరుగుతుంది. ఎఫ్పీఓ ద్వారా విత్తనాలు, ఎరువులు, యంత్రాలను హోల్సేల్ ధరలకు నేరుగా కంపెనీల నుంచే కొనుగోలు చేయడం వల్ల ఇన్పుట్ ఖర్చులు 15-20% తగ్గుతాయి. పంటను నేరుగా కమీషన్ దారులకు అమ్మకుండా ఎఫ్పీఓ ద్వారా గ్రేడింగ్, ప్రాసెసింగ్ (ఉదాహరణకు: కందిపప్పుగా మార్చడం, నూనె తీయడం), ప్యాకింగ్ చేసి రిటైల్ మార్కెట్కు లేదా సూపర్ మార్కెట్లకు అమ్మాలి. డిజిటల్ ప్లాట్ఫారమ్లైన ‘ఈ-నామ్’ ద్వారా దేశంలో ఎక్కడ మంచి ధర ఉంటే అక్కడ అమ్ముకునే వీలుంటుంది.సమగ్ర బీమా రక్షణతీవ్రమైన అనారోగ్యం లేదా ఊహించని పంట నష్టం మొత్తం కుటుంబ ఆర్థిక పరిస్థితులను మార్చేస్తుంది. కాబట్టి మెరుగైన బీమా రక్షణ అత్యవసరం.పంట బీమా.. వాతావరణ ఆధారిత పంట బీమాను కేవలం రుణం తీసుకునేటప్పుడే కాకుండా ప్రతి సీజన్ గడువు ముగిసేలోగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలి. స్థానిక వ్యవసాయ అధికారి ద్వారా నష్ట పరిహార నమోదు విధానంపై స్పష్టత ఉండాలి.ఆరోగ్య బీమా.. ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్ లేదా ఆరోగ్యశ్రీ కార్డులు ప్రతి రైతు కుటుంబానికి తప్పనిసరి. ఇవి కాకుండా రూ.3,000-రూ.5,000 ప్రీమియంతో అదనపు కుటుంబ ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల ఆసుపత్రి ఖర్చుల కోసం పొలం అమ్మాల్సిన పరిస్థితి రాదు.వ్యక్తిగత ప్రమాద బీమా.. పీఎం సురక్ష బీమా యోజన ద్వారా కేవలం రూ.20లకే లభించే ప్రమాద బీమాను ప్రతి రైతు పొంది ఉండాలి.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
బంగారం, వెండి కొనుగోళ్లకు కొత్త పోర్టల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్, ఈ–కామర్స్ సంస్థ నిహార్ ఇన్ఫో గ్లోబల్ తాజాగా పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్ఎన్సిల్వర్.షాప్ పోర్టల్ను సరికొత్తగా తీర్చిదిద్దింది. భౌతిక, డిజిటల్, ఈటీఎఫ్ల రూపంలో బంగారం, వెండి నాణేలు, కడ్డీలు మొదలైన వాటిని పారదర్శకమైన విధంగా ఒకే చోట కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ డైరెక్టర్ బీఎస్ఎన్ సూర్యనారాయణ తెలిపారు.ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా, డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనికోసం ఎంఎంటీసీ–పీఏఎంపీ, ఆగ్మంట్, జిరోధా మొదలైన సంస్థలతో జట్టు కట్టినట్లు ఆయన వివరించారు. దీని ద్వారా ఆర్థిక సంస్థలతో కలిసి పసిడి రుణాలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి నాటికి యాప్ వెర్షన్ కూడా తేనున్నట్లు పేర్కొన్నారు. -
అప్పర్ లేయర్లోనే టాటా సన్స్
ముంబై: ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన అప్పర్లేయర్ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్బీఎఫ్సీలు)ల జాబితాలో టాటా సన్స్కు మరోసారి చోటిచ్చింది. ఎన్బీఎఫ్సీ రిజి్రస్టేషన్ను వొదులుకునేందుకు టాటా సన్స్ చేసుకున్న దరఖాస్తు పరిశీలనలో ఉన్నప్పటికీ అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీ హోదాను కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే ఈ అంశం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ డీరిజిస్ట్రేషన్కు అడ్డంకికాబోదని స్పష్టం చేసింది. నిజానికి 2022లో టాటా సన్స్ అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందింది. దీంతో మరింత కఠిన నియంత్రణా సంబంధ నిబంధనలను కంపెనీ పాటించవలసి ఉంటుంది. నియమిత కాలంలో స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్సహా.. కార్పొరేట్ గవర్నెన్స్, కనీస మూలధనం, రిస్కుల నిర్వహణ తదితర అంశాలలో నిబంధనలు అమలు చేయవలసి ఉంటుంది. అయితే కంపెనీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టడంతో ఆర్బీఐ గుర్తింపునుంచి మినహాయింపును కోరుతోంది. దీనిలో భాగంగా ఇన్వెస్ట్మెంట్ కార్యకలాపాలను విడదీయడం, రుణాలను తగ్గించుకోవడం, ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్ విభాగాలను పునర్వ్యవస్థీకరించడం తదితరాలను చేపట్టింది. ఇతర ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే కంపెనీ ప్రధానంగా టాటా గ్రూప్లో పెట్టుబడుల నిర్వహణతో హోల్డింగ్ దిగ్గజంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తాజా జాబితా ఇదీ.. ఆర్బీఐ 17 కంపెలతో తాజా జాబితాను విడుదల చేసింది. టాటా సన్స్సహా.. పీఎస్యూలు ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ, హడ్కో చేరాయి. ఇంకా ఈ జాబితాలో డిపాజిట్లు స్వీకరించే ఎన్బీఎఫ్సీలు.. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ హౌసింగ్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. డిపాజిట్లు స్వీకరించని ఎన్బీఎఫ్సీ జాబితాలో టాటా క్యాపిటల్, చోళమండలం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఏబీ క్యాపిటల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్, పిరమల్ ఫైనాన్స్కు చోటు లభించింది. కాగా.. ఇంతక్రితం ప్రకటించిన జాబితాలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, సమ్మాన్ క్యాపిటల్కు అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీ గుర్తింపు ఇచ్చినప్పటికీ నిబంధనలు పాటించలేదని ఆర్బీఐ పేర్కొంది. అయితే వీటిని ఈ జాబితాలో కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. -
టోకు ద్రవ్యోల్బణం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన, ఆహారోత్పత్తుల రేట్లు కొంత నెమ్మదించడంతో తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) స్వల్పంగా తగ్గింది. 9.78 శాతంగా నమోదైంది. జూన్లో ఇది 9.87 శాతంగా ఉంది. 2025 అక్టోబర్ తర్వాత నెలవారీగా చూసినప్పుడు డబ్ల్యూపీఐ తగ్గడం ఇదే తొలిసారి. తయారీ ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగినప్పటికీ ఇంధనం, విద్యుత్ ధరల పెరుగుదల నెమ్మదించడం ఇందుకు కారణమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఇంధన ద్రవ్యోల్బణం జూన్లో 27.41 శాతంగా ఉండగా జూలైలో 20.05 శాతానికి దిగి వచి్చంది. అలాగే, ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.49 శాతం నుంచి స్వల్పంగా 5.44 శాతానికి తగ్గింది. అయితే, తయారీ ఉత్పత్తుల ధరలు మాత్రం 7.48 శాతం నుంచి 8.29 శాతానికి పెరిగాయి. అంతర్జాతీయంగా రేట్లు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరినందున రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఇకపై క్రమంగా తగ్గు ముఖం పట్టొచ్చని బార్క్లేస్ ఒక నివేదికలో తెలిపింది. ఆగస్టులో ఇది 9.5 శాతానికి దిగి రావొచ్చని, అయితే, 2027 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద డబ్ల్యూపీఐ సగటున 8.5 శాతంగా ఉండొచ్చని ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ రాహుల్ అగ్రవాల్ పేర్కొన్నారు.రిటైల్ ధరలు అక్కడక్కడే వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గత నెల(జూలై)లో స్వల్పంగా పెరిగి 4.45 శాతానికి చేరింది. ఉల్లిపాయలు, అల్లం తదితరాల ధరలు పెరిగినప్పటికీ జూన్లో నమోదైన 4.38 శాతంతో పోలిస్తే నామమాత్రంగా బలపడింది. దీంతో ప్రభుత్వ గణాంకాల ప్రకారం వరుసగా రెండో నెలలోనూ ఆర్బీఐ పరపతి విధానాల లక్ష్యానికి ఎగువన నిలిచింది. 2024 ఏడాది(బేస్ ఇయర్) ఆధారం చేసుకుని జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త సిరీస్లో జూలై గణాంకాలే అత్యధికంకావడం గమనార్హం! గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతం నుంచి 5.52 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఉల్లి ధరల పెరుగుదల జూన్లో నమోదైన 4.73 శాతం నుంచి జూలైలో 22.54 శాతానికి, అల్లం ధర దాదాపు 84 శాతానికి ఎగసింది. అయితే మరోపక్క బంగళా దుంపలు, బెండకాయలు, టొమాటోలు, బఠాణీల ధరలు వెనకడుగు వేయడంతో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. -
జీసీసీలపై రాష్ట్రాల ఫోకస్
న్యూఢిల్లీ: దేశీయంగా భారీ స్థాయిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటవుతున్నాయి. ఏడు రాష్ట్రాలు 2031 నాటికి 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన లక్ష్యంతో 1,380 జీసీసీల ఏర్పాటుకు దోహపడేలా ప్రత్యేక విధానాలను రూపొందించాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు.. విశిష్ట జీసీసీ పాలసీలను రూపొందించడంలో భారతీయ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అత్యంత అసాధారణమైన వేగాన్ని ప్రదర్శించాయని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. భారతీయ సరీ్వసుల వ్యవస్థకు జీసీసీలు ప్రధాన కేంద్రాలుగా మారుతుండటాన్ని ఇది తెలియజేస్తోందని వివరించారు. రాష్ట్రాలు నిర్దిష్ట ప్రోత్సాహకాలు, వేగవంతంగా అనుమతులు, దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాలను కల్పించే హామీలు మొదలైనవి కల్పించడం ద్వారా జీసీసీలను స్వాగతించేందుకు పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → కర్ణాటక 3.5 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే యోచనతో 500 జీసీసీలను టార్గెట్గా పెట్టుకుంది. మహారాష్ట్ర 4 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడేలా 200 జీసీసీలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. గుజరాత్ 50,000 ఉద్యోగావకాశాల కల్పనతో 250 జీసీసీలను, కేరళ 1.6 లక్షల కొలువు లక్ష్యంతో 80 జీసీసీలను టార్గెట్గా పెట్టుకుంది. అలాగే మధ్యప్రదేశ్ 37,000 ఉద్యోగాల కల్పన కోసం 50 జీసీసీలను సాధించాలని నిర్దేశించుకుంది. → జీసీసీ ఉద్యోగుల కోసం తమిళనాడు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. → తెలంగాణ, ఢిల్లీ కూడా జీసీసీ వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రోత్సహించే విధానాలను అమలు చేస్తున్నాయి. → ఈ పరిశ్రమ కోసం నిర్దిష్ట విధానాలను రూపొందించడంపై ఇతరత్రా పలు రాష్ట్రాలు దృష్టి పెడుతున్నాయి. కేరళ ముసాయిదా జీసీసీ పాలసీలను ప్రతిపాదించింది. → 2022 నుంచి 2026 తొలి ఆరు నెలల వ్యవధి మధ్య భారత్లోని టాప్ 9 నగరాల్లో జీసీసీలు 12.3 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. -
రిలయన్స్, రోల్స్ రాయిస్ జట్టు
న్యూఢిల్లీ: అధునాతన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం స్వదేశీ ఇంజిన్ను రూపొందించే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్–రాయిస్ చేతులు కలిపాయి. ఇందుకోసం భారత్లో ప్రత్యేకంగా ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించనున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇది కంబాట్ ఇంజిన్ల డిజైనింగ్, అభివృద్ధి, తయారీ, టెస్టింగ్తో పాటు ప్రొపల్షన్ టెక్నాలజీకి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా నిలుస్తుందని పేర్కొన్నాయి. అత్యంత కీలకమైన సాంకేతిక సామర్థ్యాలను భారత్ సొంతంగా సాధించుకోవడం ముఖ్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు. రక్షణ, పౌర విమానయానం తదితర రంగాలు, ప్రొపల్షన్ సిస్టమ్స్ మొదలైన విభాగాల్లో విస్తృత భాగస్వామ్యానికి ఈ ఒప్పందం తోడ్పడగలదని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. భారత్లో పటిష్టమైన ఏరోస్పేస్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఇదొక కీలక మైలురాయని రోల్స్ రాయిస్ సీఈవో ట్యుఫాన్ ఎర్గిన్బిల్జిక్ తెలిపారు. -
పెళ్లి బాజాలు ఇక లంకలో..
భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు దుబాయ్, ఒమన్, టర్కీ వంటి పశ్చిమాసియా దేశాలు సంపన్న భారతీయ కుటుంబాల పెళ్లిళ్లకు ప్రధాన వేదికలుగా ఉండగా. ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రీలంక, వియత్నాం,థాయ్లాండ్, ఇండోనేషియా దేశాలు వేగంగా ఆక్రమిస్తున్నాయి. భారత్కు దగ్గరగా ఉండడం, ప్రయాణ సౌలభ్యం, విలాసవంతమైన హోటళ్లు, తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ అనుభూతి లభించడం వంటి కారణాలతో 2025లో భారతీయుల పెళ్లిళ్లకు ఆగ్నేయాసియా దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్న విదేశీ వెడ్డింగ్ డెస్టినేషన్ల గమ్య స్థానంగా మారినట్లు వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ ’వెడ్ మి గుడ్’ నివేదిక వెల్లడించింది. 2025లో ఒక్క శ్రీలంకలో భారతీయ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు డిమాండ్ 25% పెరిగిందని వచ్చే కొన్నేళ్ల పాటు ప్రతి ఏడాది 20–25% వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధవాతావరణం కారణంగా అక్కడి వెడ్డింగ్ మార్కెట్పై కొంత ప్రభావం కనిపించినప్పటికి విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే భారతీయుల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్కి శ్రీలంక, ఇతర దేశాలు వేగంగా ఎదుగుతున్నప్పటికీ పర్యాటకంగా భారతీయుల తొలి ఎంపిక మాత్రం థాయ్లాండే. 2025లో దాదాపు 25 లక్షల మంది భారతీయులు థాయ్లాండ్ను సందర్శించారు. ఏడాది ప్రాతిపదికన 16% పెరుగుదల నమోదైంది. పెళ్లితోపాటు అనుభవం కూడా ముఖ్యం. ఇప్పటి తరం జంటలు పెళ్లి కేవలం వేడుక కోసం కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మరుపురాని అనుభవాన్ని సృష్టించేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్స్కు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే పెళ్లి వేడుకులు కూడా గతంతో పోలిస్తే ఎక్కువ రోజులు కొనసాగుతున్నాయి. కరోనాకు ముందు సగటున 1–2 రోజులు జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇప్పుడు మూడు, నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారీగా పెరిగిన బడ్జెట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు భారతీయులు చేసే ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. దేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు సగటు బడ్జెట్ రూ.58 లక్షలు అయితే విదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్ సగటు బడ్జెట్ రూ.1.5 కోట్లు పైమాటే. అయినా లగ్జరీ పెళ్లిళ్ల మార్కెట్ మరింత విస్తరిస్తోందని ముందు ముందు ఇది మరింత పెరుగుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది.సంక్షోభంతో మారుతున్న ఎంపిక పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నెలకొన్న భద్రతా పరిస్థితులు, విమాన చార్జీలు పెరుగుదల, హోటళ్ల టారిఫ్లు అమాంతం పెరిగిపోవడం కూడా భారతీయుల పెళ్ళి ప్రణాళికలను ప్రభావితం చేశాయి. అయితే విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మాత్రం భారతీయ సంపన్న కుటుంబాలు మార్చుకోవడం లేదని కేవలం దేశాన్నే మార్చుకుంటున్నాయి. భద్రత, ప్రయాణ సౌలభ్యం, అతి«థులకు కూడా సులభమైన వీసా విధానం ఉన్న శ్రీలంక, ఇండోనేíÙయా దేశాలపై ఇప్పుడు ఎక్కువ మంది దృష్టి పెడుతున్నాయి.టాప్ విదేశీ వెడ్డింగ్ గమ్యస్థానాలు థాయ్లాండ్, బాలి (ఇండోనేషియా) వియత్నాం, మలేషియా ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్ భారత్లో ఇవీ... దేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్లో డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, సిమ్లా, జిమ్ కార్బెట్ తొలి ఐదు స్థానాల్లో ఉండగా, ఉదయ్పూర్,జైపూర్,జైసల్మేర్,జో«ద్పూర్, గోవా కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. శ్రీలంకకు భారతీయుల వెల్లువ శ్రీలంక టూరిజం డెవలప్మెంట్ అథారిటీ గణాంకాల ప్రకారం 2023లో 3 లక్షల మంది భారతీయ పర్యాటకులు ఆదేశాన్ని సందర్శించగా 2024లో 4.17 లక్షలు, 2025లో అది 5.30 లక్షలు దాటింది. భారత్ ప్రస్తుతం శ్రీలంకకు అతిపెద్ద విదేశీ పర్యాటక మార్కెట్. ఈ పెరుగుతున్న పర్యాటక ప్రవాహమే డెస్టినేషన్ వెడ్డింగ్ రంగానికి ఊతమిస్తోంది. ఇది లగ్జరీ హోటళ్లు, విమానయాన సంస్థలు, ట్రావెల్ కంపెనీలు, డెకరేషన్, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్, క్యాటరింగ్, టూరిజం రంగాలకు కూడా కోట్లాది వ్యాపారాన్ని సృష్టిస్తున్న భారీ పరిశ్రమగా మారుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కేవలం ఒక్క రూపాయి.. 24 రోజుల వ్యాలిడిటీ!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫ్రీడమ్ 2.0 పథకం కింద 2026 స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లో భాగంగా.. వినియోగదారులు కేవలం రూ.1కే కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు.ఈ ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త వినియోగదారులు రోజూ 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్ను కూడా పొందుతారు. వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే. కొత్త సిమ్ కనెక్షన్ కోసం అధిక మొత్తం చెల్లించకుండా బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రయత్నించాలనుకునే వినియోగదారులకు ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది.This Independence Day, why not start something better?Your first step towards a better connection is here.#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #IndependenceOffer #FRC1 @CMDBSNL @robertravi21 pic.twitter.com/HObE4inHxD— BSNL India (@BSNLCorporate) August 12, 2026రూ.2,399 ప్లాన్!బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కూడా కేవలం సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.నిజానికి చాలా కంపెనీలు యాన్యువల్ ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం మరో 47 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తుంది. అంటే ఏడాది పూర్తయినా ఇంకా కొన్ని రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
79 ఏళ్లలో మారిపోయిన భారతీయుల ఖర్చు తీరు!
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశం ముందు పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, తక్కువ పారిశ్రామిక సామర్థ్యం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. అప్పట్లో.. సాధారణ కుటుంబానికి స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు.. కనీస అవసరాలు తీరే మంచి జీవితం రావాలనే ఆశ కూడా.చారిత్రక అంచనాల ప్రకారం.. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. అందుకే తొలి దశాబ్దాల్లో దేశ ఆర్థిక ప్రయాణం ప్రధానంగా ప్రజలను కనీస జీవన ప్రమాణాల వైపు తీసుకెళ్లడంపైనే సాగింది. కానీ.. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. ఒకప్పుడు కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనడం పెద్ద లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఏ బ్రాండ్ కొనాలి, ఎలాంటి కారు తీసుకోవాలి, వెకేషన్కు ఎక్కడికి వెళ్లాలి అనే స్థాయికి భారతీయుల ఆలోచనలు మారాయి.ఈ మార్పు మన ఇళ్లలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు టీవీ కొనడం పెద్ద విషయం. ఆ తర్వాత ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, స్కూటర్, కారు వంటివి కుటుంబాల అవసరాల జాబితాలోకి చేరాయి. ఇప్పుడు మాత్రం సాధారణ కారు సరిపోతుందా? SUV కొనాలా? ఎలక్ట్రిక్ కారు తీసుకోవాలా? అనే స్థాయికి వినియోగదారుల ఆలోచన చేరింది.ఏం కొనాలి నుంచి..పొదుపు విషయంలోనూ మార్పు వచ్చింది. గతంలో బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తులే ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, సిప్, ఇన్సూరెన్స్ వంటి పెట్టుబడులు కూడా సాధారణ కుటుంబాలకు పరిచయం అయ్యాయి. అంటే.. భారతీయుల కథ ''ఏం కొనాలి?'' అనే స్థాయి నుంచి ''ఏది నాకు ఎక్కువ విలువ ఇస్తుంది?'' అనే స్థాయికి మారుతోంది.కుటుంబాల ఖర్చుల్లో కూడా ఈ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా.. గ్రామీణ, పట్టణ వినియోగ వ్యత్యాసం కూడా క్రమంగా తగ్గుతోంది. గతంలో పట్టణ కుటుంబాలు గ్రామీణ కుటుంబాల కంటే చాలా ఎక్కువ ఖర్చు చేసేవి. ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఆదాయం, డిజిటల్ సేవలు, క్రెడిట్ సౌకర్యాలు, ఆన్లైన్ షాపింగ్ పెరగడంతో వినియోగ అవకాశాలు విస్తరిస్తున్నాయి. గతంలో ''కూడు, గూడు, గుడ్డ'' ప్రధాన అవసరాలైతే.. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి, ఏ బ్రాండ్ దుస్తులు ధరించాలి, ఏ ప్రాంతంలో నివసించాలి అనే ఎంపికలు కూడా వినియోగంలో భాగమవుతున్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయంలో..కారు, మొబైల్, ప్రయాణం వంటి రంగాల్లో ఈ ప్రీమియమైజేషన్ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చిన్న హ్యాచ్బ్యాక్ కారు కొనడం పెద్ద కల. ఇప్పుడు SUVలపై భారతీయుల ఆసక్తి భారీగా పెరిగింది. కొత్త కారు కొనలేని వారు కూడా మంచి ఫీచర్లు ఉన్న ప్రీమియం సెకండ్హ్యాండ్ కార్ల వైపు చూస్తున్నారు.ఇదే విధంగా రూ.30 వేలకుపైగా ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా కూడా గణనీయంగా పెరిగింది. వినియోగదారులు ప్రతి వస్తువుపై ఎక్కువ ఖర్చు చేయడం లేదు. తమకు ముఖ్యమైన వస్తువుల విషయంలో మాత్రం ఎక్కువ డబ్బు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇక ప్రయాణాల విషయంలోనూ మార్పు వచ్చింది. విదేశీ పర్యటనలు ఒకప్పుడు కొద్దిమంది సంపన్నులకు మాత్రమే సాధ్యమైన విషయం. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కూడా విదేశీ ట్రిప్ ఒక సాధారణ ఆశగా మారుతోంది. 2025లో భారతీయులు రికార్డు స్థాయిలో 3.28 కోట్లకు పైగా విదేశీ ప్రయాణాలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.పొదుపు నుంచి సంపద సృష్టిఇక మరో పెద్ద మార్పు పొదుపు నుంచి సంపద సృష్టి వైపు వచ్చింది. గతంలో భవిష్యత్ భద్రత కోసం డబ్బును బ్యాంకులో దాచుకోవడం, బంగారం కొనడం లేదా స్థలం తీసుకోవడం సాధారణం. ఇప్పుడు యువతతో పాటు మధ్యతరగతి కుటుంబాలు కూడా సిప్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. వార్షిక గృహ ఆర్థిక పొదుపుల్లో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వాటా FY12లో కేవలం 2 శాతం ఉండగా, FY25 నాటికి 15 శాతానికి పైగా పెరిగింది. సిప్ పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. అంటే భారతీయుల ఆర్థిక ఆశయం కూడా మారుతోంది. 'డబ్బు దాచుకోవాలి అనే ఆలోచన నుంచి 'డబ్బుతో మరింత సంపద సృష్టించాలి' అనే ఆలోచనకు ప్రజలు వస్తున్నారు. -
ఐదేళ్లుగా వింత ప్రయోగం.. దొంగతనం కాలేదన్న సీఈఓ!
భారత్ అగ్రి వ్యవస్థాపకుడు, సీఈఓ 'సిద్ధార్థ్ డయలాని' బెంగళూరులో చేసిన ఓ చిన్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్యతో కలిసి గత ఐదేళ్లుగా ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారట. ఎక్కడికి వెళ్లినా బైక్ను పార్క్ చేసినప్పుడు హెల్మెట్కు ఎలాంటి లాక్ వేయకుండా సీటుపైనో, సైడ్ మిర్రర్పైనో పెట్టి వెళ్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఒక్క హెల్మెట్ కూడా దొంగతనం కాలేదని ఆయన చెప్పడంతో నెట్టింట చర్చ మొదలైంది.బెంగళూరులో ప్రజలు ఒకరినొకరు ఎంతవరకు నమ్మవచ్చో తెలుసుకోవడాని ఈ ప్రయోగం చేస్తున్నట్లు సిద్ధార్థ్ డయలాని పేర్కొన్నారు. దీనికోసం పెద్దగా పెట్టుబడి పెట్టకుండా.. హెల్మెట్ ప్రయోగం స్టార్ట్ చేశారు. ఐదేళ్లుగా హెల్మెట్లు సురక్షితంగా ఉండటంతో.. బెంగళూరు ఒక హై-ట్రస్ట్ సిటీ అని చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే.. ఈ ప్రయోగానికి వారు ఒక కండిషన్ కూడా పెట్టుకున్నారు. ఏ రోజు తమ హెల్మెట్ దొంగతనానికి గురవుతుందో.. తరువాత ఆ ప్రాంతానికి వెళ్లడం మానేస్తామని సిద్ధార్థ్ చెప్పారు. అంటే.. ఒక్క హెల్మెట్ పోవడం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రజలపై తమ నమ్మకం పోయినట్లే అన్నమాట. ఈ విషయం కొంతమంది నెటిజన్లను ఆకట్టుకుంది. చాలామంది తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.కొందరు సిద్ధార్థ్ డయలాని చేసిన పనిని మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. ''హెల్మెట్ రేటు తక్కువగా ఉండటం వల్ల ఎవరూ పట్టించుకోకపోయి ఉండొచ్చు.. ఖరీదైనది పెట్టి చూడండి, అప్పుడు అసలు విషయం తెలుస్తుంది'' అంటూ కామెంట్ చేశారు. మరికొందరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం బైక్, హెల్మెట్ రెండూ సురక్షితంగా ఉండకపోవచ్చని హెచ్చరించారు. దీంతో బెంగళూరు మొత్తం ఒకేలా ఉండదని, ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.Me and my wife have been running a social experiment in Bangalore. Whenever we park our two wheeler in any area, we don't lock our helmets. We just keep it on the side mirror or on the seat. It's a low cost experiment to know if Bangalore is a high trust city or not.It has…— Siddharth Dialani (@siddharth_iitm) August 13, 2026 -
‘వ్యాపార స్వాతంత్య్రం’ ఎలా వచ్చిందంటే..
ఒకప్పుడు భారత్లో వ్యాపారం అంటే అనుమతులు, పన్నులు, ప్రభుత్వ నియంత్రణల మధ్య సాగేది. స్వాతంత్య్రం తర్వాత దేశ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం పరిశ్రమలపై మరింత నియంత్రణ సాధించింది. 1991 ఆర్థిక సంస్కరణలతో పరిస్థితి పూర్తిగా మారింది. నేడు డిజిటల్ సింగిల్ విండో, డీరెగ్యులేషన్, లేబర్ కోడ్లతో వ్యాపారం ప్రారంభించే విధానం మరో దశలోకి వెళ్లింది.స్వాతంత్యానికి ముందు.. వ్యాపారం అంటే?1947కు ముందు ‘బిజినెస్ ప్రారంభించడానికి ఒకే చట్టం’ అంటూ ఏదీ లేదు. కంపెనీలు, కర్మాగారాలు, గనులు, ఉప్పు, మద్యం, బ్యాంకింగ్, దిగుమతులు-ఎగుమతులకు వేర్వేరు చట్టాలు, నిబంధనలు ఉండేవి. బ్రిటిష్ ఇండియా, సంస్థాన ప్రాంతాల్లోనూ విధానాలు భిన్నంగా ఉండేవి.కంపెనీల ఏర్పాటుకు 19వ శతాబ్దంలోనే చట్టపరమైన వ్యవస్థ మొదలై, చివరకు కంపెనీల చట్టం, 1913 అమల్లోకి వచ్చింది. కంపెనీల ఏర్పాటు, నిర్వహణ, మూసివేతకు ఇది ప్రాతిపదికగా నిలిచింది. అయితే నేటి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో దీన్ని పోల్చలేం. వలస పాలనలో ఆర్థిక విధానాలు ప్రధానంగా బ్రిటిష్ పాలన అవసరాలకు అనుగుణంగా ఉండేవి.ఉప్పుపై ప్రభుత్వ నియంత్రణ ఇందుకు ఉదాహరణ. 1882 ఉప్పు చట్టం ద్వారా ఉప్పు తయారీ, సేకరణ, నిర్వహణపై నియంత్రణ ఉండేది. ప్రజలు స్వయంగా ఉప్పు తయారు చేయడం, విక్రయించడం స్వేచ్ఛగా చేయలేకపోయారు. ఈ పరిస్థితి మహాత్మాగాంధీ నేతృత్వంలోని ఉప్పు సత్యాగ్రహానికి కీలక నేపథ్యంగా మారింది.కర్మాగారం పెట్టాలంటే కార్మిక చట్టాలుపరిశ్రమలపై నియంత్రణతో పాటు కార్మిక చట్టాలు కూడా వచ్చాయి. 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం అమల్లోకి వచ్చింది. పిల్లల పనివేళలు, కొన్ని భద్రతా అంశాలపై పరిమితులు విధించింది. 1891, 1911, 1922, 1934లో చట్టాలు మరింత విస్తరించాయి. పని గంటలు, కార్మిక సంక్షేమం, భద్రత వంటి అంశాలు కూడా నియంత్రణలోకి వచ్చాయి.1947 తర్వాత.. ప్రభుత్వ ఆధిపత్యంస్వాతంత్య్రం తర్వాత భారత్ స్వయం సమృద్ధి కలిగిన పారిశ్రామిక దేశంగా ఎదగడంపై దృష్టి పెట్టింది. 1948 పారిశ్రామిక విధానంతో పరిశ్రమల్లో ప్రభుత్వ పాత్రకు రూపం వచ్చింది. కొన్ని కీలక రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచి, మరికొన్నింటిలో ప్రైవేటు రంగానికి అవకాశం ఇచ్చారు. 1951లో వచ్చిన పరిశ్రమల (Development and Regulation) చట్టం ద్వారా కొన్ని పరిశ్రమల స్థాపన, విస్తరణపై కేంద్రానికి లైసెన్సింగ్ అధికారం లభించింది.1956 పారిశ్రామిక విధానంతో ప్రభుత్వ పాత్ర మరింత పెరిగింది. పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి కేటాయించినవి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి అనువైనవి, ప్రైవేటు రంగానికి చెందినవిగా విభజించారు. దీంతో పరిశ్రమ ప్రారంభించడం, ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, విస్తరించడం వంటి వాటికి ప్రభుత్వ అనుమతులు కీలకమయ్యాయి. ఇదే ‘లైసెన్స్ రాజ్’కు బలం చేకూర్చింది.1991.. అతిపెద్ద మలుపు1991 ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. జూలై 24, 1991న ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానంలో చాలా పరిశ్రమలకు లైసెన్సింగ్ను రద్దు చేశారు. వ్యూహాత్మక, భద్రత, పర్యావరణ, ప్రమాదకర ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని రంగాలను మాత్రం మినహాయించారు.సామర్థ్య నియంత్రణలు కూడా గణనీయంగా తొలగడంతో కంపెనీలకు ఉత్పత్తి, విస్తరణ నిర్ణయాల్లో స్వేచ్ఛ పెరిగింది. ప్రైవేటు రంగానికి మరిన్ని అవకాశాలు, విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుచుకున్నాయి. అంటే 1950–80లలో ‘ముందు ప్రభుత్వ అనుమతి.. తర్వాత పెట్టుబడి’ విధానం ఉంటే, 1991 తర్వాత మార్కెట్ ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగింది.కంపెనీల చట్టంలోనూ మార్పులు1913 కంపెనీల చట్టం స్థానంలో స్వాతంత్య్రం తర్వాత కంపెనీల చట్టం, 1956 వచ్చింది. ఆ తర్వాత పారదర్శకత, పెట్టుబడిదారుల రక్షణ, కార్పొరేట్ పాలనకు ప్రాధాన్యం పెరగడంతో కంపెనీల చట్టం, 2013 అమల్లోకి వచ్చింది.ఇప్పుడు.. డిజిటల్గా వ్యాపారం2026 నాటికి వ్యాపారం ప్రారంభించే విధానం మరింత డిజిటల్గా మారింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరమైన అనుమతులను గుర్తించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం NSWS 32 కేంద్ర విభాగాల మార్గదర్శకత్వాన్ని, 34 రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల కోసం అప్లికేషన్ సదుపాయాలను అందిస్తోంది. కొత్త ఇండస్ట్రియల్ లైసెన్స్, ఇండస్ట్రియల్ ఎంట్రాప్రెన్యూర్ మెమొరాండం (IEM) దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇందులోకి మారింది.2025లో మరో కీలక సంస్కరణ2025 నవంబర్ 21 నుంచి నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర కోడ్లుగా ఏకీకృతం చేశారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగుల భద్రత-ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనలను ఒకే విస్తృత చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడం వీటి లక్ష్యం.మొత్తంగా చూస్తే.. బ్రిటిష్ కాలంలో పరిమితులు, పన్నులు, ఏకాధికారాల నుంచి స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వ ఆధిపత్యం, ఆపై 1991లో మార్కెట్ సంస్కరణలు.. ఇప్పుడు డిజిటల్ అనుమతులు, సరళీకృత నిబంధనల వరకు భారత్లో వ్యాపార వ్యవస్థ ఎన్నో దశలను దాటింది. -
ఐపీవోకు ముత్తూట్ ఫిన్కార్ప్.. రూ.3,000 కోట్లపై కన్ను
న్యూఢిల్లీ: ముత్తూట్ పప్పచాన్ గ్రూప్ కంపెనీ ముత్తూట్ ఫిన్కార్ప్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది.ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ మొత్తం తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధులను సమకూర్చుకోనుంది. భవిష్యత్ అవసరాల కోసం టైర్–1 మూలధనాన్ని పెంచుకునేందుకు ఐపీవో పెట్టుబడులను వెచ్చించనుంది. డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీ ముత్తూట్ ఫిన్కార్ప్ ప్రధానంగా బంగారు ఆభరణాలపై రుణాలందిస్తోంది. అయితే బిజినెస్ రుణాలు, ఆస్తులపై రుణాలు, సప్లై చైన్ ఫైనాన్సింగ్, డిజిటల్ రుణాలు, మైక్రోఫైనాన్స్, గృహ రుణాలు తదితరాలతో పోర్ట్ఫోలియోను విస్తరించింది.రెండు దశాబ్దాలుగా బంగారు ఆభరణాలపై రుణాలు సమకూర్చుతోంది. దేశవ్యాప్తంగా బ్రాంచీల నెట్వర్క్ను విస్తరించింది. 2026 మార్చి 31కల్లా నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ. 73,445 కోట్లకు చేరాయి. 5,610 బ్రాంచీలను కలిగి ఉంది. -
కోట్ల విలువైన ఫుట్బాల్ క్లబ్.. రూ.100కే అమ్మకం!
కోట్ల రూపాయల విలువైన ఒక ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫుట్బాల్ క్లబ్ను కేవలం 100 రూపాయలకే అమ్మేశారంటే.. ఎవరైనా నమ్మగలరా?, కానీ టాటా స్టీల్, జంషెడ్పూర్ ఎఫ్సీ ఫుట్బాల్ అండ్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్పీఎల్) విషయంలో ఇదే జరిగింది. గోవాకు చెందిన.. చర్చిల్ బ్రదర్స్ స్పోర్ట్స్ క్లబ్కు వంద రూపాయలకే విక్రయించింది. ఇది ప్రస్తుతం క్రీడా, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంత తక్కువ ధరలు టాటా లాంటి దిగ్గజ కంపెనీ ఎందుకు అమ్మేసింది?, దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.జంషెడ్పూర్లో ఎన్నో ఏళ్లుగా ఫుట్బాల్ను ప్రోత్సహించిన టాటా స్టీల్, ISLలో జంషెడ్పూర్ ఎఫ్సీని బలమైన జట్టుగా తీర్చిదిద్దిన తర్వాత ఇప్పుడు యాజమాన్య బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. ఈ ఒప్పందంతో క్లబ్కు సంబంధించిన ఐఎస్ఎల్ స్పోర్టింగ్ లైసెన్స్తో పాటు ఇతర హక్కులు, బాధ్యతలు కూడా చర్చిల్ బ్రదర్స్కు బదిలీ కానున్నాయి. అయితే.. దీనికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF)తో పాటు మరికొన్ని అవసరమైన అనుమతులు రావాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆగస్టు 31లోపు పూర్తయ్యే అవకాశం ఉంది.సెప్టెంబర్ 2026 నుంచి చర్చిల్ బ్రదర్స్ కొత్త బాధ్యతలు చేపట్టనుంది. జట్టులోని 12 మంది ఆటగాళ్లు, ఇద్దరు కోచ్ల కాంట్రాక్టులను కూడా కొత్త యాజమాన్యం కొనసాగించనుంది. అంటే.. జంషెడ్పూర్ ఎఫ్సీ క్లోజ్ అవ్వడం లేదు.. కేవలం దాని యజమాని మాత్రమే మారుతున్నాడు.ఐఎస్ఎల్ క్లబ్ను రూ.100కే ఎందుకు ఇచ్చారు?దీనికి సమాధానం క్లబ్ వెనుక ఉన్న కంపెనీ ఆర్థిక పరిస్థితి అనే తెలుస్తోంది. జెఎఫ్ఎస్పీఎల్ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 32.23 కోట్ల టర్నోవర్ సాధించింది. మార్చి 2026 నాటికి దాని నికర విలువ మైనస్ రూ.5.8 కోట్లుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే.. సంస్థ ఆర్థికస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. రూ.100కు విక్రయించడం అనేది అసలు ధర కాదు. ఇది టోకెన్ మొత్తం మాత్రమే.నిజానికి టాటా ఫుట్బాల్ అకాడమీ 1987లో జంషెడ్పూర్లో ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఈ అకాడమీ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు శిక్షణ పొందారు. వారిలో చాలామంది భారత జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు.ఇదీ చదవండి: కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు! -
‘జీరో’ నుంచి రూ .1.4 కోట్ల జీతానికి.. టెకీ సక్సెస్ స్టోరీ వైరల్
కెరీర్ ప్రారంభంలో జీతం లేకుండా పనిచేసిన ఓ టెక్ ప్రొఫెషనల్.. 14 ఏళ్లకు పైగా అనుభవంతో ప్రస్తుతం ఏడాదికి దాదాపు రూ.1.4 కోట్ల సమానమైన వేతనం అందుకుంటున్నానని వెల్లడించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ 35 ఏళ్ల క్లౌడ్, డెవ్ఆప్స్ ప్రొఫెషనల్ తన జీతం ఎలా దశలవారీగా పెరిగిందో సోషల్ ప్లాట్ఫామ్ రెడిట్లో పంచుకున్నారు.రెడిట్లోని r/IndianWorkplaceలో ‘DevOpsHumbleFool’ పేరుతో ఉన్న యూజర్ తన కెరీర్ ప్రయాణాన్ని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ‘సగటు కంటే తక్కువ’ కాలేజీ నుంచి చదువు పూర్తి చేశానని, తన కెరీర్ను ఢిల్లీలో జీతం లేని ఉద్యోగంతో ప్రారంభించానని చెప్పారు. ఆ పని ఏడాదిలోపే ముగిసిందని, అనంతరం బెంగళూరులో రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరి రెండేళ్లు పనిచేసినట్లు రాసుకొచ్చారు.ఆ తర్వాత మరో సంస్థలో రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వేతనం పెరిగింది. అక్కడ దాదాపు 4.7 సంవత్సరాలు పనిచేశారు. తదుపరి బెంగళూరు సంస్థలో రూ.17 లక్షల ప్యాకేజీతో చేరి, ఐదేళ్లలో దాన్ని రూ.35 లక్షలకు పెంచుకున్నారు. ఈ దశలో మరో సంస్థ నుంచి రూ.70 లక్షల ఆఫర్ వచ్చినప్పటికీ, తాను ఆ ఉద్యోగంలో చేరలేదని చెప్పారు. అయితే ఆ ఆఫర్ తన మార్కెట్ విలువను అర్థం చేసుకునేలా చేసిందని పేర్కొన్నారు.రూ.35 లక్షల నుంచి విదేశీ క్లయింట్ల వరకు..కెరీర్లో కీలక మలుపు విదేశీ క్లయింట్లతో పనిచేయడం ద్వారా వచ్చిందని ఆయన వివరించారు. ‘క్లయింట్ A’తో సుమారు రెండేళ్లు పనిచేసిన సమయంలో ఏడాదికి రూ.1.15 కోట్ల సమానమైన ఆదాయం వచ్చినట్లు, ప్రస్తుతం ‘క్లయింట్ B’తో ఏడాదికి రూ.1.40 కోట్ల స్థాయిలో సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాలు అమెరికా డాలర్లలో అందుతున్నాయని, తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని ఆయన కామెంట్లలో స్పష్టం చేశారు. క్లయింట్ A రిమోట్ రోల్ కాగా, క్లయింట్ B పాత్ర ఆన్సైట్ అని తెలిపారు.సైడ్ గిగ్స్తో అదనపు ఆదాయంప్రధాన ఉద్యోగంతో పాటు కెరీర్లో సైడ్ గిగ్స్ కూడా చేశానని ఆయన వెల్లడించారు. అలా తనకు నెలకు సుమారు రూ.15,000 నుంచి రూ.65,000 వరకు అదనపు ఆదాయం వచ్చేదని చెప్పారు. యూట్యూబ్, పెయిడ్ ఇంటర్వ్యూలు, చిన్న ప్రాజెక్టులు, టెక్నికల్ కన్సల్టేషన్స్, ఫోన్ ద్వారా టెక్నికల్ సహాయం వంటి పనులు చేసేవాడినని వివరించారు. తన యూట్యూబ్ కంటెంట్ కారణంగా లింక్డ్ఇన్లో గుర్తింపు పెరిగి, అక్కడి నుంచే చాలా సైడ్ గిగ్ అవకాశాలు వచ్చాయని తెలిపారు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ఉద్యోగం, వీసా నిబంధనల నేపథ్యంలో సైడ్ గిగ్స్ పూర్తిగా నిలిపివేశానని చెప్పారు.డిగ్రీ కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యంతన విద్యా నేపథ్యం గొప్పది కాకపోయినా, DevOps, Cloud టెక్నాలజీలపై విస్తృత నైపుణ్యాలు తన కెరీర్ ఎదుగుదలకు ప్రధాన కారణమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. జావా డెవలపర్గా కెరీర్ ప్రారంభించి, బిల్డ్ & రిలీజ్ ఇంజినీరింగ్ నుంచి డెవాప్స్, ఆ తర్వాత క్లౌడ్ విభాగంలోకి మారినట్లు వివరించారు. ప్రస్తుతం తన పనిలో కోడింగ్ భాగం సుమారు 10 శాతం మాత్రమేనని చెప్పారు. AI తన పనిని ఇప్పటివరకు దెబ్బతీయలేదని, అయితే తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి AI సాధనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నానని తెలిపారు.30ల్లోనూ విదేశీ అవకాశాలు సాధ్యమేనంటూ..తాను 30లలోనే అమెరికాకు వెళ్లానని, 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉండటం వల్ల విదేశీ అవకాశాలు మరింత అందుబాటులోకి వచ్చాయని ఆయన చెప్పారు. తొలుత రిమోట్ అవకాశాన్ని పొందిన తర్వాత వర్క్ వీసా ద్వారా అమెరికాకు వెళ్లినట్లు, ప్రస్తుతం H-1Bపై ఉన్నట్లు కామెంట్లలో వెల్లడించారు. తనకు తెలిసిన ఓ సీనియర్ 42 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారని కూడా పేర్కొన్నారు.అయితే అధిక జీతంతో పాటు విదేశీ ఉద్యోగ జీవితంలోని సవాళ్లను కూడా ఆయన ప్రస్తావించారు. కుటుంబానికి దూరంగా ఉండటం, ఒంటరితనం, వీసాపై ఆధారపడటం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వంటి అంశాలు అమెరికాలోని జీవితంలో ప్రతికూలతలుగా పేర్కొన్నారు.ఈ పోస్టుపై వందలాది మంది స్పందించారు. ముఖ్యంగా తక్కువ జీతాలతో కెరీర్ ప్రారంభిస్తున్న యువత తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు డెవాప్స్, క్లౌడ్ వంటి నైపుణ్యాల్లోకి ఎలా మారాలి, సైడ్ గిగ్స్ ఎలా సంపాదించాలి, AI వల్ల టెక్ ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది వంటి ప్రశ్నలు అడిగారు. టెకీ మాత్రం నైపుణ్యంతో పాటు ఆన్లైన్ ప్రొఫెషనల్ ప్రెజెన్స్ను పెంచుకోవడం తన కెరీర్లో కీలకంగా పనిచేసిందని సూచించారు. -
ఘనంగా రమేష్ హాస్పిటల్స్ వార్షికోత్సవ వేడుకలు!
1988 ఆగస్టు 15న కేవలం ఆరు పడకలతో ప్రత్యేక గుండె వైద్య ఆసుపత్రిగా ప్రారంభమైన రమేష్ హాస్పిటల్స్, 38 ఏళ్ల సేవా ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య సంస్థగా ఎదిగింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ప్రాంతానికే చేరువ చేయాలనే లక్ష్యంతో సాగిన ఈ ప్రయాణంలో లక్షలాది మంది రోగుల విశ్వాసాన్ని సంస్థ సంపాదించింది.ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, తిరువూరు కేంద్రాల ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యం, అత్యవసర వైద్యం, క్రిటికల్ కేర్, అవయవ మార్పిడి, డిజిటల్ ఆరోగ్య సేవలు, గ్రామీణ వైద్యం, వైద్య విద్య, పరిశోధన వంటి విభాగాల్లో సేవలు అందిస్తోంది. ఈ 38 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న విజయవాడలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బి. సోమరాజు ముఖ్య అతిథిగా హాజరుకాగా, డాక్టర్ కామినేని పట్టాభి రామయ్య, డాక్టర్ సమరం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను రాయితీలతో మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రూపొందించిన రమేష్ ప్రీమియం హెల్త్ కార్డును ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం.సి. దాస్ ప్రారంభించారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 70.71 పాయింట్లు లేదా 0.091 శాతం నష్టంతో 78,009.25 వద్ద, నిఫ్టీ 29.85 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 24,366.00 వద్ద నిలిచాయి.జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్, ఓలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు!
తరచుగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి, తాజాగా ఉద్యోగ జీవితం గురించి చెప్పారు. ''జీవితం అంటే కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేసి, నెలాఖరులో జీతం తీసుకోవడమేనా?'' అని ప్రశ్నించారు.చాలామంది చిన్నప్పటి నుంచి ఒకే విధమైన మార్గంలో వెళ్తుంటారు. చదువు.. ఉద్యోగం.. జీతం.. ఖర్చులు.. మళ్లీ ఉద్యోగం. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. మనం డబ్బు సంపాదిస్తున్నాం, కుటుంబాన్ని చూసుకుంటున్నాం, బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. కానీ ఒక సమయంలో మనల్ని మనమే ''నేను అసలు ఎందుకు ఇలా జీవిస్తున్నాను? నా జీవితానికి అర్థం ఏమిటి?'' అని బహుశా ఆలోచించకపోవచ్చు.ఇదే విషయాన్ని కియోసాకి చెబుతూ.. నేను పని చేస్తున్నానంటే, అది ''కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రం కాదు. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చేస్తున్నా'' అని పేర్కొన్నారు. అంటే మనం చేసే పని మనకు డబ్బు మాత్రమే కాకుండా, ఒక సంతృప్తిని, ఒక ఉద్దేశ్యాన్ని కూడా ఇవ్వాలని ఆయన ఉద్దేశ్యం.కియోసాకి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. కొందరు ఆయన మాటలతో ఏకీభవించినప్పటికీ.. మరికొందరు వ్యతిరేకించారు.చాలామంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించడం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అని అన్నారు. జీవిత లక్ష్యం అంటే ఏదో పెద్ద విజయం సాధించడంలో దొరకదు. కొన్నిసార్లు, ఒక సాధారణ పనిని నిలకడగా, చక్కగా చేయడంలో కూడా అది లభిస్తుందని ఇంకొందరు అన్నారు.9 to 5 for just $?Found it interesting my last X had so few loves relative to number of views.My previous X was dedicated to working to fulfill your spirit’s mission…your life’s purpose….for the gift of life.Working 9 to 5 just for $…seems to me…. to be an empty life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 14, 2026 -
ఏఐ జగత్తులో టాలెంట్ వార్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త ప్రాభవం అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలను విస్మయానికి గురిచేస్తోంది. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, ప్రముఖ ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సల్ను తమ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా రూ.800 కోట్ల (100 మిలియన్ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు వెలువడిన నివేదికలు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశమయ్యాయి. ఒక ఏఐ పరిశోధకుడికి ఈ స్థాయిలో పారితోషికం దక్కడం అంతర్జాతీయ సాంకేతిక చరిత్రలో అరుదైన ఘట్టం.ఎవరీ త్రపిత్ బన్సల్?త్రపిత్ బన్సల్ విజయం రాత్రికి రాత్రే సాధ్యమైంది కాదు; ఇది దశాబ్దానికి పైగా సాగిన కఠోర సాధన, నాణ్యమైన పరిశోధనల ఫలితం. 2007-2012 మధ్య ఐఐటీ కాన్పూర్ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేసిన బన్సల్, అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు. తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పట్టా పొందారు.తన పరిశోధనా కాలంలో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థల్లో ఇంటర్న్షిప్లు చేస్తూ డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) రంగాల్లో విశేష అనుభవాన్ని గడించారు. 2022లో ఓపెన్ఏఐలో చేరిన బన్సల్.. సంస్థ సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుత్సకెవర్తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఓపెన్ఏఐ అత్యంత సాంకేతిక సంక్లిష్టమైన రీజనింగ్ మోడల్ ‘ఓ1’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి గ్లోబల్ ఏఐ వర్గాల్లో గుర్తింపు పొందారు.మెటా ఎందుకింత భారీ ఆఫర్ ఇచ్చింది?ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్’ (ఏజీఐ), సూపర్ ఇంటెలిజెన్స్ సాధించేందుకు గూగుల్, మెటా, ఓపెన్ఏఐల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా, తమ 'సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్'ను బలోపేతం చేసేందుకు అత్యుత్తమ మేధావులను ఆకర్షిస్తోంది. బన్సల్కు ఉన్న మ్యాథమెటికల్ పునాది, అడ్వాన్స్డ్ ఏఐ రీజనింగ్ మోడళ్లపై ఉన్న అసాధారణ పట్టు మెటా వ్యూహాలకు కీలకంగా మారుతాయని కంపెనీ భావిస్తోంది.యువతకు సందేశంకోడింగ్ షార్ట్కట్లు, స్వల్పకాలిక కోర్సులతో కొన్ని విజయాలు సాధించాలనుకునే ఈ డిజిటల్ యుగంలో.. సుదీర్ఘ అధ్యయనం, ప్రాథమిక విజ్ఞానం, నిరంతర పరిశోధన మాత్రమే అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయని త్రపిత్ ప్రయాణం నిరూపిస్తోంది. సబ్జెక్టుపై తిరుగులేని నైపుణ్యం ఉంటే ప్రపంచమే మన కోసం వస్తుందని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో ఉద్యోగాల కోసం ఎంపికైన 200 మందికి పైగా విద్యార్థులు, యువ ఇంజనీర్ల ఆన్బోర్డింగ్ ఆలస్యంపై వివాదం ముదిరింది. ‘ఎలైట్ హైరింగ్ 2025’ కార్యక్రమం కింద ఎంపికైన అభ్యర్థులను నెలల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారంటూ ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఆగస్టు 13న కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసిన నైట్స్.. ఈ వ్యవహారంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరింది.ఆఫర్ లెటర్ ఇచ్చినా.. జాయినింగ్ డేట్ లేదునైట్స్ వివరాల ప్రకారం.. బాధిత అభ్యర్థులు ఫిబ్రవరి 2025లో విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొని టెక్నికల్, వాయిస్ అసెస్మెంట్లను పూర్తి చేశారు. ఇంటర్వ్యూ ప్రక్రియ అనంతరం 2025 జూలైలో ఆఫర్ లెటర్లు, ఆగస్టులో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LOI) అందుకున్నారు. నిర్ణీత గడువులోనే వాటిని అంగీకరించారు. అయితే ఆ తర్వాత వారి నియామక ప్రక్రియ ముందుకు సాగలేదని సంఘం ఆరోపించింది.డిసెంబర్ 2025లో అభ్యర్థులు మరోసారి విప్రో నిర్వహించిన సర్వే ద్వారా కంపెనీలో చేరేందుకు తమ ఆసక్తిని ధ్రువీకరించారు. అనంతరం మార్చి 2026లో కోడిలిటీ టెక్నికల్ అసెస్మెంట్ నిర్వహించగా, అందులోనూ ఉత్తీర్ణులయ్యారు. మార్చి 24న క్లియరెన్స్ సమాచారం అందిందని నైట్స్ పేర్కొంది. మార్చి 25న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లింక్ అందగా, మార్చి 26న అభ్యర్థులు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. చిరునామా ధ్రువీకరణకు సంబంధించిన ప్రశ్నను కూడా అదే రోజు పరిష్కరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విప్రో పోర్టల్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ 100 శాతం పూర్తయి, ‘No Action Required’గా కనిపించిందని సంఘం తెలిపింది.అన్ని నియామక దశలను పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు నిర్దిష్ట జాయినింగ్ తేదీ ఇవ్వలేదని నైట్స్ ఆరోపించింది. బాధితులు విప్రో హెచ్ఆర్, ఆన్బోర్డింగ్ హెల్ప్డెస్క్లతో పాటు ఇతర అధికారిక మార్గాల ద్వారా పలుమార్లు సంప్రదించినా స్పష్టమైన సమాధానం రాలేదని పేర్కొంది. విద్యాసంస్థలు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారులు కూడా విప్రో క్యాంపస్ సంబంధిత సిబ్బందిని సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది.ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు ఇతర అవకాశాలను వదులుకున్నారని, దీంతో విద్యా ఖర్చులు, వసతి, రోజువారీ అవసరాలు, కుటుంబ బాధ్యతల విషయంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని నైట్స్ పేర్కొంది. దీర్ఘకాలంగా స్పష్టత లేకపోవడం అభ్యర్థుల్లో మానసిక ఆందోళనకు కూడా కారణమవుతోందని తెలిపింది.కార్మిక శాఖను ఏం కోరిందంటే..విప్రోతో ఈ అంశాన్ని చర్చించి బాధిత అభ్యర్థులందరి ప్రస్తుత స్థితిని స్పష్టం చేయాలని నైట్స్ కార్మిక శాఖను కోరింది. ఆఫర్ లెటర్లు, LOIలు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయా? ఆలస్యానికి అసలు కారణం ఏమిటి? ఆన్బోర్డింగ్ ఎప్పటిలోగా పూర్తవుతుంది? అనే అంశాలపై కంపెనీ నుంచి స్పష్టమైన సమాధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. ఇక కొందరి అభ్యర్థిత్వాలను ముందుకు తీసుకెళ్లకూడదని కంపెనీ నిర్ణయిస్తే, వారిని నిరవధికంగా ఎదురుచూడనివ్వకుండా నిర్ణయం, కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కూడా కోరింది.విప్రో స్పందన ఇదీ..మరోవైపు, ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని విప్రో స్పష్టం చేసింది. కంపెనీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామక ప్రక్రియ కొనసాగుతుందని, తదుపరి అప్డేట్లను అభ్యర్థులకు తెలియజేస్తామని తెలిపింది. అయితే, ఈ వివాదంపై విప్రో నుంచి వచ్చిన ఈ స్పందనలో నిర్దిష్ట జాయినింగ్ తేదీ లేదా 200 మందికి పైగా అభ్యర్థుల కోసం టైమ్లైన్ వెల్లడించలేదు. -
సిరుల సింహాసనంపై అంబానీ సామ్రాజ్యం
భారత ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తున్న దిగ్గజ కుటుంబ వ్యాపార సంస్థలు సంపద సృష్టిలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ‘హరూన్ ఇండియా - 2026’ తాజా నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత విలువైన బహుళ తరాల (మల్టీజనరేషనల్) కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుటుంబం రూ.25.83 లక్షల కోట్ల విలువతో దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా మొదటి స్థానంలో నిలిచింది.టాప్-10 సంపన్న కుటుంబ వ్యాపారాలుర్యాంక్వ్యాపార కుటుంబంవిలువ (లక్షల కోట్లలో)1అంబానీ కుటుంబంరూ.25.832కుమార్ మంగళం బిర్లా కుటుంబంరూ.8.143జిందాల్ కుటుంబంరూ.8.024బజాజ్ కుటుంబంరూ.7.705మహీంద్రా కుటుంబంరూ.5.156అనిల్ అగర్వాల్ కుటుంబంరూ.4.457మురుగప్ప కుటుంబంరూ.3.068నాడార్ కుటుంబంరూ.2.919ప్రేమ్జీ కుటుంబంరూ.2.7210ధాని, చోక్సీ, వకీల్ కుటుంబాలురూ.2.48అదానీ గ్రూప్ మినహాయింపునకు కారణమేంటి?ఈ జాబితాలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ లేదనే ప్రశ్న సాధారణంగా ఉద్భవిస్తుంది. హరూన్ వర్గీకరణ విధానం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ తరాలుగా పరంపరగా కొనసాగుతున్న వంశపారంపర్య వ్యాపార సంస్థలను మాత్రమే ఈ జాబితాలోకి తీసుకున్నారు. గౌతమ్ అదానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని హరూన్ ‘తొలి తరం వ్యాపారం’గా పరిగణించింది. తొలి తరం వ్యాపార సంస్థల విభాగంలో అదానీ కుటుంబం రూ.19.57 లక్షల కోట్లు అగ్రస్థానంలో నిలిచింది.దేశ కార్పొరేట్ పన్ను వసూళ్లలో దాదాపు 17% వాటాను ఈ కుటుంబ వ్యాపార సంస్థలే అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి. తరాలు మారినా సుపరిపాలన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన నాయకత్వంతో ఈ వ్యాపార సామ్రాజ్యాలు గ్లోబల్ మార్కెట్లో భారత్ను అగ్రపథంలో నిలుపుతున్నాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
మరోసారి పెరగనున్న టాటా కార్ల ధరలు?
టాటా కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ మేరకు టాటా మోటార్స్ నుంచి సంకేతాలు వచ్చాయి. ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో, 2027 ఆర్థిక సంవత్సరంలో అవసరాన్ని బట్టి విడతల వారీగా, క్రమాంకితంగా ధరలు పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) యాజమాన్యం వెల్లడించింది. అయితే, మొత్తం భారాన్ని వినియోగదారులపై ఒకేసారి మోపకుండా.. ధరల సవరణతో పాటు ఖర్చుల తగ్గింపు చర్యలను కొనసాగించనున్నట్లు తెలిపింది.టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సీఎఫ్వో ధీమన్ గుప్తా 2027 ఆర్థికేడాది క్యూ1 ఫలితాల సందర్భంగా మాట్లాడుతూ, ఏడాది పొడవునా మరిన్ని “క్రమాంకిత ధరల పెంపులు” చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే తదుపరి పెంపు ఎంత శాతం ఉండొచ్చు, ఎప్పుడు అమలు చేస్తారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ప్రధాన ఉద్దేశం మార్జిన్లను కాపాడుకోవడంతో పాటు కార్లకు ఉన్న కస్టమర్ విలువ ప్రతిపాదనను దెబ్బతీయకుండా చూడటమేనని యాజమాన్యం స్పష్టం చేసింది.ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంపు2026లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ (ICE) కార్లపై 0.5% పెంపు అమలు చేసింది. ఆ తర్వాత జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, ఈవీలు సహా మొత్తం ప్యాసింజర్ వెహికల్ పోర్ట్ఫోలియో ధరలను 1.5% వరకు పెంచింది. జూలై పెంపు 2027 ఆర్థికేడాది క్యూ1 ఆర్థిక ఫలితాల్లో పూర్తిగా ప్రతిబింబించలేదని కంపెనీ తెలిపింది. అందువల్ల రెండో త్రైమాసికంలో ఆ పెంపు నుంచి కొంత ప్రయోజనం మార్జిన్లకు లభించే అవకాశం ఉంది.కమోడిటీ ఖర్చులు మరింత పెరిగే అవకాశంమరోవైపు, ముడి సరుకుల ధరలు కంపెనీకి ప్రధాన సవాలుగా మారుతున్నాయి. Q1లో కమోడిటీ సంబంధిత వ్యయ ఒత్తిడి గణనీయంగా ఉండగా, Q2లోనూ అదనపు ఖర్చు భారం ఉంటుందని యాజమాన్యం అంచనా వేసింది. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం వంటి ఇన్పుట్ ధరల కదలికలు ఆటో కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపుతున్నాయి.అమ్మకాల్లో మాత్రం జోరుధరల పెంపు నిర్ణయం వస్తున్న సమయంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ వ్యాపారంలో డిమాండ్ మాత్రం బలంగానే ఉంది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ మొత్తం 1,82,574 కార్లు, SUVలను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలోని 1,24,809 యూనిట్లతో పోలిస్తే 46% వృద్ధి. దేశీయ అమ్మకాలు 45% పెరిగి 1,80,166 యూనిట్లకు చేరాయి. -
‘ఎంపీ డెవలపర్స్’ బ్రాండ్ అంబాసిడర్గా సమంత
దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నటి సమంత కొత్త బాధ్యతలను స్వీకరించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ ‘ఎంపీ డెవలపర్స్’(MP Developers) తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా సమంతను నియమించినట్లు ప్రకటించింది.ఈ భాగస్వామ్యానికి ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ అనుబంధం ఉందని కంపెనీ చెప్పింది. ఎంపీ డెవలపర్స్ సంస్థ ప్రస్థానం, నటి సమంత కెరీర్.. రెండూ చెన్నైలోని పల్లవరం ప్రాంతం నుంచే ప్రారంభం కావడం విశేషం. చెన్నై మూలాల నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించే దిశగా సాగుతున్న తమ ప్రయాణానికి సమంత చేరిక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.14 ఏళ్ల విశ్వసనీయత.. 250కి పైగా ప్రాజెక్టులుకంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో స్థాపించిన ఎంపీ డెవలపర్స్ గత 14 ఏళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో విశేష పురోగతిని సాధించింది. ఇప్పటివరకు 250కి పైగా నివాస ప్రాజెక్టులను పూర్తి చేసింది. 3,000 కంటే ఎక్కువ కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంది. చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో ప్రస్తుతం 1.5 మిలియన్ చదరపు అడుగుల (15 లక్షల చ.అ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఎంపీ డెవలపర్స్ యాజమాన్యం స్పందిస్తూ.. ‘ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల భవనం మాత్రమే కాదు; అది ఒక కుటుంబం భవిష్యత్తు కలలకు పునాది. అత్యుత్తమ లొకేషన్, సమర్థవంతమైన డిజైన్, నిర్మాణ నాణ్యత, కస్టమర్ల సుదీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం’ అని తెలిపింది.గ్రోత్ గ్యారెంటీ హోమ్స్సొంతింటి కలను నెరవేర్చుకోవడంతోపాటు ఇల్లు కొనడాన్ని భవిష్యత్తుకు బలమైన పెట్టుబడిగా మార్చే దిశగా ఎంపీ డెవలపర్స్ ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ అనే వినూత్న భావనను అందుబాటులోకి తెచ్చింది.ఈ ప్రాజెక్టుల ప్రధాన ముఖ్యాంశాలుఅధిక అభివృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేయడి.మెరుగైన రవాణా / కనెక్టివిటీ సౌకర్యాలు కల్పించడం.ఆచరణాత్మకమైన, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించే గృహాలను రూపొందించడం.విస్తరణ దిశగా అడుగులుఈ సందర్భంగా ఎంపీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ మలినేని మాట్లాడుతూ.. ‘మా 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రోజు ఒక కీలకమైన కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 250కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేసి 3,000 కుటుంబాల విశ్వాసాన్ని పొందడం మా బాధ్యతను మరింత పెంచింది. సమంతతో ఈ కొత్త భాగస్వామ్యం మా బ్రాండ్ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. ఇది ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. తమిళనాడులోని ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు ఎన్ఆర్ఐ వినియోగదారులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అన్నారు. ‘Built for Living. Guaranteed for Growth’ అనే స్పష్టమైన విధానంతో నాణ్యమైన ఇళ్లను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబం భవిష్యత్తు పురోగతికి విలువ జోడించడమే లక్ష్యంగా ఎంపీ డెవలపర్స్ తన తదుపరి ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందన్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
10 ఏళ్లకు స్టైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్
సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ (Instagram) తన స్టైల్ మార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తన వర్డ్మార్క్ లోగో (అక్షరాల శైలి)ను రీఫ్రెష్ చేసింది. ఈ విషయాన్ని మెటా ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్గా మారాయి. గత 10 ఏళ్లుగా యాప్ పైన ఉండే వర్డ్మార్క్ మారలేదు. అందుకే ఈ మార్పు చేశాం. ఇది మరింత క్లీన్గా, మోడరన్గా ఉంటూనే ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ శైలిని ప్రతిబింబిస్తుంది అంటూ ఆదమ్ మోస్సేరి ఈ మార్పుపై వివరణ ఇచ్చారు. View this post on Instagram A post shared by Adam Mosseri (@mosseri) ఇన్స్టాగ్రామ్ పేరులోని అక్షరాల రూపాన్ని (Typography) పునఃరూపకల్పన చేశారు. పాత స్క్రిప్ట్ శైలినే కొనసాగిస్తూనే, అక్షరాలను మరింత స్పష్టంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే అందరికీ సుపరిచితమైన రంగుల గ్రాడియంట్ కెమెరా ఐకాన్ (Camera Icon)లో ఎలాంటి మార్పు లేదు. 2016లో క్లాసిక్ బ్రౌన్ కెమెరా స్థానంలో ఈ గ్రాడియంట్ ఐకాన్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనఈ కొత్త డిజైన్పై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ అసలుగుర్తింపు దెబ్బతినకుండా చక్కగా మోడరనైజ్ చేశారని కొందరు యూజర్లు మెచ్చు కుంటున్నారు. మరికొందరు ఈ డిజైన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపొందించినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. వర్డ్మార్క్లోని 'r' అక్షరం చూడటానికి 'z' లాగా కనిపిస్తోందని, ఇన్స్టాగ్రామ్ కాస్త "Instagzam" లా మారింది అంటూ మరికొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
రెడ్ జోన్లో నిఫ్టీ, సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు తగ్గి 24,325 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 291 పాయింట్లు నష్టపోయి 77,783 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.92బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.65 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.65 శాతం పెరిగింది.నాస్డాక్ 0.81 శాతం పుంజుకుంది.Today Nifty position 14-08-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
విప్రో తీరుపై ఆగ్రహం.. కేంద్ర మంత్రికి అత్యవసర లేఖ!
దేశీయ ఐటీ దిగ్గజం విప్రోలో ఎంపికైన 200 మందికి పైగా కొత్త ఇంజినీర్లు, విద్యార్థుల ఆన్బోర్డింగ్లో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘నైట్స్’ (NITES - Nascent Information Technology Employees Senate) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని బాధిత అభ్యర్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది.విప్రో ‘ఎలైట్ హైరింగ్ 2025’ ప్రక్రియ కింద ఎంపికైన 200 మందికి పైగా అభ్యర్థులకు జులై 2025లో ఆఫర్ లెటర్లు, ఆగస్టు 2025లో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ అందాయి. మార్చి 2026లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నా నేటికీ అధికారికంగా విధుల్లో చేరే తేదీ కేటాయించలేదు. కంపెనీ హెచ్ఆర్ బృందాలు, సహాయక కేంద్రాలను సంప్రదించినా ఎటువంటి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర మానసిక, ఆర్థిక ఆందోళనకు గురవుతున్నారని నైట్స్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా ఆవేదన వ్యక్తం చేశారు.నైట్స్ ప్రధాన డిమాండ్లుబాధిత అభ్యర్థుల ఆన్బోర్డింగ్కు సంబంధించి సమయ పరిమితితో కూడిన స్పష్టమైన ప్రణాళికను విప్రో ప్రకటించాలి. ఆఫర్ లెటర్లు, ఎల్ఓఐల చెల్లుబాటుపై అధికారిక ప్రకటన వెలువడాలి. ఒకవేళ ఎంపికను రద్దు చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని అభ్యర్థులకు రాతపూర్వకంగా స్పష్టం చేయాలి.క్యాంపస్ ఎంపికల్లో విప్రో ఉద్యోగం వచ్చిందనే ధీమాతో చాలామంది ఇతర కంపెనీల అవకాశాలను వదులుకున్నారని, ప్రస్తుత జాప్యం వారి కెరీర్ను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఐటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని వేధిస్తున్న అనిశ్చితి, క్లయింట్ ప్రాజెక్టుల మందగమనమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై విప్రో యాజమాన్యం స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే! -
ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!
ఇంటి ముందు సొంత కారును నిలిపే సౌకర్యం కూడా ఇకపై ఉచితం కాదు. అవును.. దేశంలోనే ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, రోడ్ల దురాక్రమణను అరికట్టేందుకు పట్టణాభివృద్ధి శాఖ ‘గ్రేటర్ బెంగళూరు అథారిటీ (పార్కింగ్) నిబంధనలు-2026’ ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ విధానం ప్రకారం నివాస ప్రాంతాల్లోని రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తే రకాన్ని బట్టి ఏటా గరిష్ఠంగా రూ.25,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.వాహన రకాన్ని బట్టి వార్షిక రుసుములుప్రతిపాదిత డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం నివాస వీధుల్లో పార్కింగ్ చేయడానికి వార్షిక పర్మిట్ తప్పనిసరి. అందుకోసం హ్యాచ్బ్యాక్ / చిన్న కార్లకు ఏటా రూ.15,000, సెడాన్ కార్లకు ఏటా రూ.20,000, ఎస్యూవీలకు ఏటా రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పర్మిట్ కాలపరిమితి ఏడాది మాత్రమే. అయితే, భవన నిర్మాణ నిబంధనలకు లోబడి సొంత స్థలంలో నిర్ణీత పార్కింగ్ సదుపాయం ఉన్న నివాసాల వద్ద మాత్రమే పర్మిట్లు మంజూరు చేస్తారు. రహదారి వెడల్పు కనీసం 6 మీటర్లు ఉండి ట్రాఫిక్కు ఆటంకం కలగని చోట్లే ఈ పర్మిట్ చెల్లుబాటు అవుతుంది.ఆన్-స్ట్రీట్, ఆఫ్-స్ట్రీట్ చార్జీలువాణిజ్య, ప్రధాన రహదారులను ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరించారు. ఆన్-స్ట్రీట్ పార్కింగ్లో భాగంగా కార్లకు గంటకు రూ.40-రూ.80 వరకు, ద్విచక్ర వాహనాలకు రూ.20-రూ.40 వరకు వసూలు చేయనున్నారు. రెండు గంటలు దాటితే చార్జీలు మరింత పెరుగుతాయి. బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలను ప్రోత్సహించేందుకు ఆఫ్-స్ట్రీట్ చార్జీలను తగ్గించారు. కార్లకు నెలకు రూ.2,000-రూ.4,000 కాగా రాత్రి వేళల్లో (రాత్రి 8-ఉదయం 8 వరకు) 50% రాయితీ ఇవ్వనున్నారు.అభ్యంతరాలకు 30 రోజుల గడువుప్రజాభిప్రాయాలు, అభ్యంతరాల సమర్పణకు ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చింది. వాహనాల విచ్చలవిడి పార్కింగ్ను నియంత్రించాలని చూస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇది మధ్యతరగతి ప్రజలపై అదనపు భారమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆటో’ సేల్స్ అదుర్స్
న్యూఢిల్లీ: దేశీయ వాహన పరిశ్రమ జూలైలో ఇప్పటివరకు అత్యుత్తమ విక్రయాలను నమోదు చేసింది. ప్రయాణికుల వాహన(పీవీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 34.3% పెరిగి 4,57,810 యూనిట్లకు చేరాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాది జూలైలో పీవీ సేల్స్ 3,40,772 యూనిట్లుగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి ద్విచక్ర వాహనాల విక్రయాలు 22.6 శాతం వృద్ధితో 19,23,483 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో ఇవి 15,69,120 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రిచక్ర వాహన సేల్స్ 33.4 శాతం పెరిగి 92,560 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో ఇవి 69,403 యూనిట్లుగా ఉన్నాయి. ‘భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ జూలైలో ఇప్పటివరకు అత్యుత్తమ విక్రయాలను నమోదు చేసింది. పీవీలు, త్రిచక్ర, ద్విచక్ర వాహనాల విభాగాల్లో బలమైన రెండంకెల వృద్ధి నమోదైంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ సానుకూల ధోరణి పండుగల సీజన్లోకి ప్రవేశిస్తున్న వేళ కూడా కొనసాగుతోంది. ఈసారి వినియోగదారుల సెంటిమెంట్ బలంగా ఉంటుందని ఆశిస్తున్నాము’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
టాటా మోటార్స్ పీవీ రివర్స్ గేర్!
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ పీవీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 79 శాతం క్షీణించి రూ. 859 కోట్లకు పరిమితమైంది. సరఫరా చైన్ సమస్యలకుతోడు కమోడిటీల ధరల పెరుగుదల లాభాలను దెబ్బతీసింది. గతేడాది (2025–26) ఇదే కాలంలో రూ. 4,003 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 9% పుంజుకుని రూ. 95,799 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 87,677 కోట్ల టర్నోవర్ అందుకుంది. జాగ్వార్ ల్యాండ్రోవర్ (జేఎల్ఆర్) వాహన టోకు (హోల్సేల్) అమ్మకాలు 9% నీరసించాయి. ఇందుకు తాత్కాలిక సరఫరా సమస్యలు, పశ్చిమాసియా సంక్షోభం తదితర అంశాలు ప్రభావం చూపాయి. దేశీ బిజినెస్ ఆదాయంలో 65 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్ పీవీ షేరు 2% లాభపడి రూ.350 వద్ద ముగిసింది. -
జూలైలో ఎగుమతులు జూమ్!
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్–ఇంజినీరింగ్ గూడ్స్, సముద్ర ఉత్పత్తుల దన్నులతో జూలైలో భారత్ ఎగుమతులు భారీగా ఎగబాకాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 19.63% వృద్ధితో 44.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 జూన్ (3.12% అప్) తర్వాత ఎగుమతులు ఈ స్థాయిలో వృద్ధి చెందడం ఇదే తొలిసారి. మరోపక్క, దిగుమతులు కూడా పెరగడంతో వాణిజ్య లోటు 6 నెలల గరిష్టానికి చేరింది. 31.98 బిలియన్ డాలర్లను తాకింది. క్రూడాయిల్ అధిక దిగుమతుల ప్రభావంతో జూలైలో మొత్తం దిగుమతులు 17.52% ఎగసి 76.22 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలివీ.. → జూలైలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 72–95 డాలర్ల మధ్యలో కదలాడింది. 17.64 శాతం పెరుగుదలతో 18.31 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంది. మొత్తం దిగుమతుల్లో ఇది 24 శాతం కావడం గమనార్హం. → పశ్చిమాసియా దేశాలకు కూడా జూలైలో ఎగుమతులు 8.62 శాతం పెరిగి 5.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 7 బిలియన్ డాలర్లకు (67.64 శాతం వృద్ధి), ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 6 బిలియన్ డాలర్లకు (57.4% అప్), ఇంజినీరింగ్ గూడ్స్ ఎగుమతులు 12.24 బిలియన్ డాలర్లకు (17.7 శాతం వృద్ధి) చేరాయి. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై కాలంలో ఎగుమతులు 17 శాతం జంప్ చేసి 173.78 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దిగుమతులు సైతం 19.27 శాతం ఎగసి 292.38 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 118.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. → కాగా, జూలై నెలలో సరీ్వసుల ఎగుమతులు 35.89 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 18.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.పసిడి దిగుమతులపై సుంకాల ఎఫెక్ట్కస్టమ్స్ సుంకాల భారీ పెంపు ప్రభావంతో జూలైలో బంగారం, వెండి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ దిగుమతులు కేవలం 4.77% వృద్ధితో 4.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సిల్వర్ దిగుమతులు ఏకంగా 66.1% దిగజారి 171.68 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మే 13న ఈ రెండు విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను 6% నుంచి 15%కి పెంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్–జూలై కాలంలో 15.17 బిలియన్ డాలర్ల (32.4% అప్) విలువైన పసిడి దిగుమతులు జరగ్గా... వెండి దిగుమతులు 50.8% ఎగసి 718.42 మిలియన్ డాలర్లను తాకాయి. అమెరికా, చైనాలకు రయ్... జూలైలో అమెరికాకు భారత్ నుంచి 9.02 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. గతేడాది జూలైతో పోలిస్తే 12.85% వృద్ధి చెందాయి. అమెరికా నుంచి మన దేశానికి దిగుమతులు సైతం 18.1% పెరిగి 5.5 బిలియన్ డాలర్లను తాకాయి. అమెరికా జూలై 24 నుంచి భారత్పై 10% అదనపు సుంకాలను విధించడం తెలిసిందే. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇక చైనాకు మన ఎగుమతులు 2.2 బిలియన్ డాలర్లకు (64.57% వృద్ధి) చేరాయి. దిగుమతులు 34.42% ఎగసి 14.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.. -
ఒక్కసారే రీచార్జ్.. 412 రోజులు నో టెన్షన్!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 2399 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.నిజానికి చాలా కంపెనీలు యాన్యువల్ ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం మరో 47 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తుంది. అంటే ఏడాది పూర్తయినా ఇంకా కొన్ని రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.This Independence Day, give yourself the freedom from frequent recharges.Get 412 days of BSNL connectivity with one recharge, including 47 extra days beyond a year.Recharge smart via #BReX 👉 https://t.co/SpaVXw85OI#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife… pic.twitter.com/qGtt7WkKxS— BSNL India (@BSNLCorporate) August 13, 2026 -
గంటల వ్యవధిలోనే.. బంగారం ధరల్లో భారీ మార్పు!
భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ రోజు (గురువారం) ఉదయం రూ.1,55,130 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, సాయంత్రానికి రూ.1,53,600 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు తారుమారైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో గురువారం (13 ఆగస్టు) రూ.1,55,130 (24 క్యారెట్స్) రూ.1,42,200 (22 క్యారెట్స్) వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.153600, రూ.140800 వద్దకు చేరింది. అంటే ధరలు వరుసగా రూ.1530, రూ.1400 తగ్గాయన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా సాయంత్రానికి, ఉదయానికి రేట్లలో చాలా తేడా కనిపించింది. ఉదయం 1,42,350 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,40,950 వద్దకు చేరగా.. 24 క్యారెట్ల రేటు 1,55,280 రూపాయల నుంచి 1,53,750 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,42,200 వద్ద, 24 క్యారెట్ల ధర రూ.1,55,130 వద్దనే ఉన్నాయి. వెండి రేటు మాత్రం రూ.2.60 లక్షలు (కేజీ ధర) వద్ద ఉంది. -
AI భయం.. జుకర్బర్గ్ గుడ్న్యూస్!
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఈ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయా? అనే భయం చాలామందిలో ఉంది. అయితే మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మాత్రం భవిష్యత్తులో ఉద్యోగాలకు కొరత ఉండదని అంటున్నారు.ఏఐ కొన్ని పనులను సులభంగా చేసినప్పటికీ.. అది మనుషులను పూర్తిగా భర్తీ చేయదు. కాబట్టి ఏఐ అనేది ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా మారుతుందని జుకర్బర్గ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో చిన్న టీమ్లతోనే పెద్ద కంపెనీలను నడిపే పరిస్థితి రావచ్చు. కంపెనీల పరిమాణం తగ్గినా.. కొత్త రకాల వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని ఆయన అన్నారు.అయితే.. అంత్రోఫిక్ సీఈఓ డారియో ఆమోడెయ్ మాత్రం ఏఐ వల్ల ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లా, ఫైనాన్స్, కన్సల్టింగ్, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాల్లో పదేపదే చేయాల్సిన పనులను AI సులభంగా చేయగలదు. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి.. తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని చేయించుకునే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. -
వివాదంలో బిల్గేట్స్ కుమార్తె.. 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదా?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ కుమార్తె 'ఫీబీ గేట్స్' వివాదంలో చిక్కుకుంది. ఆమె స్థాపించిన స్టార్టప్ ఫియా (Phia) కుకీ స్టఫింగ్’కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి.ఫీబీ గేట్స్, సోఫియా కియానీ కలిసి ఫియా స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఏఐతో నడిచే డిజిటల్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ కూపన్లు వెతకడం, మంచి ధరలు చూపించడం, ఉత్పత్తుల వివరాలు అందించడం దీని పని. అయితే ఇప్పుడు ఈ కంపెనీ 'కుకీ స్టఫింగ్' అనే అనుమానాస్పద మార్కెటింగ్ పద్ధతిని ఉపయోగించిందనే ఆరోపణలు రావడంతో వార్తల్లో నిలిచింది.కుకీ స్టఫింగ్ అంటే ఏంటి?సాధారణంగా మనం ఒక కంపెనీ ఇచ్చిన కూపన్ లేదా లింక్ ద్వారా షాపింగ్ చేస్తే.. ఆ కొనుగోలు ఆ కంపెనీ ద్వారా జరిగిందని గుర్తించడానికి బ్రౌజర్లో ఒక చిన్న ట్రాకింగ్ ఫైల్ను కుకీగా ఉంచుతారు. దీని ద్వారా కంపెనీకి కొంత కమిషన్ వస్తుంది. కానీ.. మనం ఆ కంపెనీ కూపన్ ఉపయోగించకపోయినా.. ఆ లింక్పై క్లిక్ చేయకపోయినా సాఫ్ట్వేర్ మన బ్రౌజర్లో కుకీని పెట్టి, ఆ కొనుగోలు తమ వల్లే జరిగిందని చూపిస్తే దాన్ని 'కుకీ స్టఫింగ్' అంటారు. అంటే.. తాము చేయని అమ్మకానికి కూడా కమిషన్ తీసుకునే ప్రయత్నం అన్నమాట.20 ఏళ్లు జైలు శిక్ష?అమెరికాలో ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. కుకీ స్టఫింగ్ అనేది ఫెడరల్ వైర్ ఫ్రాడ్ కిందికి వస్తుంది. కాబట్టి నేరం రుజువైతే ఏకంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.అయితే ఈ ఆరోపణలపైనా ఫియా సంస్థ స్పందిస్తూ.. ఈ సమస్యను తాము గుర్తించినట్లు పేర్కొంది. ఇది ఒక సాంకేతిక లోపమని స్పష్టం చేస్తూ.. దీనికి కారణమైన ఫీచర్లను తొలగించమని.. భాగస్వామ్య సంస్థలను నిధులను వెనక్కు ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు చెప్పింది.నిజానికి ఈ కుకీ స్టఫింగ్ విషయం వ్యవస్థాపకులు ఏడు నెలలకు ముందే తెలుసని సమాచారం. ఇదే నిజమైతే ఫీబీ గేట్స్ చిక్కుల్లో పడ్డట్టే. అయితే ఈ ఫీచర్లను జులైలో నిలిపివేయడంతో.. కంపెనీ ఆదాయం భారీగా తగ్గిందని తెలుస్తోంది. అంటే ఫియా ఇప్పటికే భారీ లాభాలను గడించినట్లు స్పష్టమవుతోంది.Again, this is called cookie stuffing!On a simple level, it’s automatically injecting affiliate tracking cookies to claim commissions on sales you didn’t drive.It’s typically treated as federal wire fraud in US courts.There’s a possibility of a max penalty of up to 20 years… https://t.co/Oiz6PyJ0Qm— Ariel Givner (@GivnerAriel) August 11, 2026 -
142 కిమీ రేంజ్ అందించే స్కూటర్ లాంచ్!
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ అయిన యాంపియర్, 30కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన 'మాగ్నస్ జి మ్యాక్స్' అప్డేటెడ్ వెర్షన్ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షలు కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త సిన్నమోన్ కాపర్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది.ఫీచర్ల విషయానికి వస్తే.. మాగ్నస్ జి మ్యాక్స్లో ఇప్పుడు హిల్ హోల్డ్, క్రూజ్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రద్దీగా ఉండే పార్కింగ్ ప్రదేశాలలో యజమానులు స్కూటర్ను గుర్తించడంలో సహాయపడే ఫైండ్ మై స్కూటర్ అండ్ పింగ్ మై స్కూటర్ వంటి భద్రతా ఫీచర్లు కూడా దీనికి లభిస్తాయి.యాంపియర్ కనెక్ట్ యాప్తో మెరుగైన కనెక్టివిటీ కోసం ఈ స్కూటర్లో అప్డేట్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. నావిగేషన్, ఇతర వాహన సమాచారాన్ని కొత్త 5 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూడవచ్చు. ఇతర కనెక్టెడ్ ఫీచర్లలో రియల్ టైమ్ ఛార్జింగ్ స్టేటస్, లైవ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, తెఫ్ట్ అండ్ టో అలర్ట్లు, రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్, సర్వీస్ బుకింగ్, ఛార్జింగ్ హిస్టరీ, బ్యాటరీ హెల్త్ ఇన్సైట్స్ ఉన్నాయి.మాగ్నస్ జి మ్యాక్స్కు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్లు కూడా లభిస్తాయి. ఇవి సాఫ్ట్వేర్ అప్డేట్లను రిమోట్గా ఇన్స్టాల్ చేయడానికి.. స్కూటర్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోని సాఫ్ట్వేర్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి.మాగ్నస్ జి మ్యాక్స్ 3 kWh బ్యాటరీ ప్యాక్తో పాటు 2.4 kW మోటార్ను కలిగి ఉంది. సర్టిఫైడ్ రేంజ్ 142 కిమీ. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కి.మీ.లు. బ్యాటరీకి 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ.ల వారంటీ వర్తిస్తుంది. -
ఒక్క పెంట్హౌస్ రూ.271 కోట్లు.. ఇది లగ్జరీ సామ్రాజ్యం!
గురుగ్రామ్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో డీఎల్ఎఫ్ (DLF) సంస్థ మరోసారి రికార్డు స్థాయి ధరలతో వార్తల్లో నిలిచింది. డీఎల్ఎఫ్కు చెందిన ‘ది డాలియాస్’లో వ్యాపారవేత్త మానవ్ సర్దానా రూ.271 కోట్లకు పెంట్హౌస్ కొనుగోలు చేయడం దేశంలోనే అత్యంత ఖరీదైన సింగిల్-యూనిట్ రెసిడెన్షియల్ డీల్స్లో ఒకటిగా నిలిచింది. 17,200 చదరపు అడుగుల సూపర్ ఏరియా, 10,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉన్న ఈ పెంట్హౌస్కు సూపర్ ఏరియా ప్రాతిపదికన చదరపు అడుగుకు సుమారు రూ.1.58 లక్షలు, కార్పెట్ ఏరియా ప్రకారం దాదాపు రూ.2.6 లక్షలు ధర పలికింది.అయితే ఈ రూ.271 కోట్ల డీల్ డీఎల్ఎఫ్ గురుగ్రామ్ లగ్జరీ హౌసింగ్ ప్రయాణంలో ఒక్కసారిగా వచ్చిన మైలురాయి కాదు. ‘ది మాగ్నోలియాస్’ నుంచి ‘ది కామెలియాస్’, అక్కడి నుంచి ‘ది డాలియాస్’ వరకు సంస్థ క్రమంగా అత్యంత సంపన్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న ప్రత్యేకమైన రెసిడెన్షియల్ సెగ్మెంట్ను నిర్మించింది. డీఎల్ఎఫ్ స్వయంగా గురుగ్రామ్లోని ఈ ప్రాజెక్టులను తన ‘సూపర్ లగ్జరీ రెసిడెన్సెస్’ పోర్ట్ఫోలియోలో భాగంగా పేర్కొంటోంది.మాగ్నోలియాస్.. రూ.45 కోట్ల నుంచి మొదలుఈ లగ్జరీ నిచ్చెనలోని పాత మెట్లలో ‘ది మాగ్నోలియాస్’ ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ వివరాల ప్రకారం.. ఇక్కడ 4-BHK ఇళ్ల పరిమాణం సుమారు 6,350–6,400 చదరపు అడుగులు ఉండగా, ధరలు దాదాపు రూ.45 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. లాన్ టెర్రస్లు, క్లబ్హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, స్కేటింగ్ రింక్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.కామెలియాస్.. లగ్జరీకి మరో నిర్వచనంమాగ్నోలియాస్ తర్వాత డీఎల్ఎఫ్ మరింత ఎత్తైన సెగ్మెంట్ను ‘ది కామెలియాస్’తో నిర్మించింది. డీఎల్ఎఫ్ ప్రకారం.. ఇది గోల్ఫ్ లింక్స్లోని తన సూపర్ లగ్జరీ రెసిడెన్షియల్ కమ్యూనిటీల్లో అత్యంత విలాసవంతమైన ఆఫర్లలో ఒకటి. గోల్ఫ్ కోర్స్, ల్యాండ్స్కేపింగ్, ఆర్కిటెక్చర్, వెల్నెస్, క్లబ్హౌస్, వ్యక్తిగతీకరించిన సేవలను ఒకే నివాస అనుభవంలో కలపడం దీని ప్రధాన లక్ష్యం. కామెలియాస్లోని నివాసాల పరిమాణం సుమారు 7,350 చదరపు అడుగుల నుంచి 16,290 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ప్రాజెక్టులో ప్రత్యేకమైన పెంట్హౌస్లు కూడా ఉన్నాయి. 2024 డిసెంబరులో ఇక్కడ 16,290 చదరపు అడుగుల పెంట్హౌస్ రూ.190 కోట్లకు విక్రయమైంది.ఇప్పుడు డాలియాస్.. రూ.271 కోట్ల రికార్డుడీఎల్ఎఫ్ లగ్జరీ ప్రయాణంలో తాజా అధ్యాయం ‘ది డాలియాస్’. గోల్ఫ్ కోర్స్ రోడ్లోని డీఎల్ఎఫ్5 గోల్ఫ్ లింక్స్లో వస్తున్న ఈ ప్రాజెక్టులో 420 నివాసాలు, 8 టవర్లు, 29 స్థాయిలు ఉన్నాయి. సుమారు 7.4–7.5 మిలియన్ చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో పాటు 15 ప్రత్యేక డ్యూప్లెక్స్ పెంట్హౌస్లు, భారీ క్లబ్హౌస్ వంటి సదుపాయాలను డీఎల్ఎఫ్ అభివృద్ధి చేస్తోంది.ఇక్కడ ఇప్పటికే భారీ లావాదేవీలు జరిగాయి. 2025లో ఢిల్లీ-ఎన్సీఆర్కు చెందిన ఓ పారిశ్రామికవేత్త నాలుగు అపార్ట్మెంట్లను కలిపి సుమారు 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.380 కోట్లకు కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. నాలుగు యూనిట్లను పరస్పరం అనుసంధానించి పెద్ద నివాసంగా మార్చేలా ఈ కొనుగోలు జరిగింది.ఇక తాజాగా మానవ్ సర్దానా రూ.271 కోట్లకు కొనుగోలు చేసిన పెంట్హౌస్ ఈ ప్రాజెక్టును మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చింది. ఈ డీల్ సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ స్థాయిలో కొత్త బెంచ్మార్క్ను సృష్టించిందని రియల్ ఎస్టేట్ రంగంలోని వర్గాలను ఉటంకిస్తూ పలు నివేదికలు పేర్కొన్నాయి.అసలు విలాసం.. ‘చిరునామా’లోనే..ఈ మూడు ప్రాజెక్టుల మధ్య కనిపించే సామ్యాన్ని కేవలం చదరపు అడుగుల ధరతో కొలవలేం. డీఎల్ఎఫ్5 గోల్ఫ్ లింక్స్లోని ప్రదేశం, గోల్ఫ్ కోర్స్ వ్యూస్, పచ్చదనం, క్లబ్ సదుపాయాలు, భద్రత, ప్రైవసీ, హాస్పిటాలిటీ సేవలు కలిసి ఈ ఇళ్లను ‘లగ్జరీ ప్రాపర్టీ’ నుంచి ‘ట్రోఫీ హోమ్’ స్థాయికి తీసుకెళ్తున్నాయి. డీఎల్ఎఫ్ ప్రకారం.. గోల్ఫ్ లింక్స్ ప్రాంతం రెండు గోల్ఫ్ కోర్సులు, 200 ఎకరాలకు పైగా లాన్, ర్యాపిడ్ మెట్రో, ప్రధాన వ్యాపార కేంద్రాలకు కనెక్టివిటీతో కూడిన ప్రత్యేకమైన నివాస పర్యావరణాన్ని అందిస్తోంది. -
డబ్బు, పేరు కాదు.. అందుకే 'రిచ్ డాడ్' బుక్ రాశా!
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత ''రాబర్ట్ కియోసాకి'' ఒక ట్వీట్లో చాలా సింపుల్గా ఒక లోతైన విషయాన్ని చెప్పారు. ఆయన ఒకప్పుడు రాక్ అండ్ రోల్ బిజినెస్లో పనిచేస్తూ.. ది పోలీస్, వాన్ హాలెన్, ఐరన్ మైడెన్ వంటి ప్రముఖ బ్యాండ్ల కోసం ఉత్పత్తులు తయారు చేసేవారు. ఆ సమయంలో ఆయనకు మంచి డబ్బు వచ్చేది, ఫేమస్ బ్యాండ్లతో కలిసి ఉండే అవకాశం ఉండేది. జీవితం చాలా సరదాగా, విజయవంతంగా ఉన్నప్పటికీ.. తనలో మాత్రం ఏదో లోటు ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు.ఆ సమయంలోనే ఆయన డాక్టర్ ఆర్. బక్మినిస్టర్ ఫులర్ను కలిశారు. కొంతకాలం పాటు ఆయన దగ్గర చదువుకున్నారు. ఆ సమయంలో తాను చెప్పిన మాటలు కియోసాకిని బాగా ప్రభావితం చేశాయి. మన జీవితం కేవలం మన కోసం, మన డబ్బు కోసం, మన సుఖం కోసం మాత్రమే కాదని అర్థం చేసుకున్నారు.చాలామంది జీవితంలో ఒక దశకు వచ్చిన తర్వాత ''నేను ఇది ఎందుకు చేస్తున్నాను?'', ''నా జీవితానికి అసలు అర్థం ఏంటి?'' అని ఆలోచిస్తారు. కియోసాకి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. డబ్బు ఉన్నా, పేరు ఉన్నా, ఆనందంగా ఉన్నా తనకు ఏదో లోటుగా అనిపించింది. దాంతో ఆయనకు అర్థమైన విషయం ఏమిటంటే.. డబ్బు సంపాదించడం మాత్రమే జీవిత లక్ష్యం కాదు. మన వల్ల ఇతరులకు ఎంత ఉపయోగం జరుగుతోంది అనేదే అసలు విషయం.ఆ ఆలోచనను తన జీవితంలో అమలు చేసిన తర్వాతే కియోసాకి క్యాష్ఫ్లో అనే బోర్డ్ గేమ్ను రూపొందించారు, అలాగే రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రాశారు. వీటి ద్వారా ప్రజలకు డబ్బు గురించి, పెట్టుబడుల గురించి, ఆర్థిక స్వేచ్ఛ గురించి కొత్తగా ఆలోచించే అవకాశం కల్పించారు.అంటే.. తనకు తెలిసిన విషయాలను తన దగ్గరే ఉంచుకోకుండా, వాటిని ఇతరులతో పంచుకోవడం ద్వారా తన జీవితానికి ఒక అర్థం దొరికిందని ఆయన చెప్పాలనుకున్నారు.కియోసాకి చెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మన జీవిత లక్ష్యం ఎప్పుడూ మనకు వెంటనే అర్థం కాదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటాం. కానీ ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకు వెళ్తే.. మన దారి మనకే క్రమంగా అర్థమవుతుంది. జీవితంలో ఎంత డబ్బు సంపాదించాం అనేదాని కంటే, మన వల్ల ఎంతమంది జీవితాల్లో మంచి మార్పు వచ్చింది అనేది కూడా ముఖ్యమే.చివరికి ''నీ జీవిత లక్ష్యం ఏంటి? దేవుడు నిన్ను ఈ భూమిపైకి ఎందుకు పంపాడు?'' ఇవి ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన విషయాలు అని కియోసాకి తన ట్వీట్ ముగించాడు. మొత్తం మీద జీవితం అంటే కేవలం మన కోసం బతకడం కాదు. మన ప్రతిభ, మన అనుభవం, మన సంపాదన, మన జ్ఞానం ద్వారా ఇతరులకు ఉపయోగపడేలా జీవించినప్పుడే మన జీవితానికి నిజమైన అర్థం వస్తుందని ఆయన స్పష్టం చేశారు.WORDS of TRANSFORMATION💥Years ago, I was making a lot of money in the Rock n Roll business developing products for bands such as the Police, Van Halen, Iron Maiden and more. It was fun because I often got to hangout back stage with the band. As much fun and profitable as…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 13, 2026 -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 113.61 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో.. 78,079.96 వద్ద, నిఫ్టీ 40.10 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 24,395.85 వద్ద నిలిచాయి.ఆస్ట్రల్ లిమిటెడ్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, శారదా ఎనర్జీ & మినరల్స్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఫిజిక్స్వాలా లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టాటా సన్స్ చైర్మన్ రాజీనామా.. కొత్త బాస్కు బిగ్ సవాల్!
వచ్చే ఐదేళ్లలో దాదాపు 120 బిలియన్ డాలర్ల (రూ.11.45 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని టాటా సన్స్ పెద్ద ప్లాన్ వేసుకుంది. కానీ.. చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఆకస్మిక రాజీనామాతో ఈ ప్రణాళికపై కొంత అనిశ్చితి ఏర్పడింది. కొత్త నాయకుడు వచ్చే వరకు.. కొన్ని భారీ ప్రాజెక్టులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.చంద్రశేఖరన్ దాదాపు పదేళ్ల పాటు టాటా గ్రూప్ను నడిపారు. ఈ సమయంలో ఆయన టాటా భవిష్యత్తు కోసం సెమీకండక్టర్ చిప్స్, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు, ఏఐ డేటా సెంటర్లు వంటి కొత్త రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ ప్రాజెక్టులు వెంటనే లాభాలు ఇచ్చేవి కావు. అయితే.. వీటికి చాలా డబ్బు, సమయం, టెక్నాలజీ అవసరం. ఇలాంటి సమయంలో చంద్రశేఖరన్ తప్పుకోవడం సంస్థ వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉంది.చంద్రశేఖరన్ రాజీనామా తరువాత.. నోయెల్ టాటా సంస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే.. చంద్రశేఖరన్ భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నోయెల్ మాత్రం ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారు. ఎక్కువ కాలం తర్వాత లాభాలు వచ్చే ప్రాజెక్టుల కంటే, పెట్టిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశమున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.అందుకే.. టాటా బోర్డు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను మళ్లీ పరిశీలిస్తోంది. ముఖ్యంగా సెమీకండక్టర్ ప్లాంట్, ఎయిర్ ఇండియా, టాటా డిజిటల్ వంటి వ్యాపారాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఇందులో పెట్టుబడులు పెడితే.. ఎంత లాభం వస్తుంది, పెట్టుబడి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలను బోర్డు తెలుసుకోవాలనుకుంటోంది. అంటే టాటా ఇప్పుడు కేవలం పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం మాత్రమే కాకుండా, వాటి ఫలితాలు మరియు ఖర్చులను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.టాటా గ్రూప్ ఇప్పటికే జాగ్వార్ ల్యాండ్ రోవర్, తాజ్ హోటల్స్, ఎయిర్ ఇండియా, టెట్లీ టీ వంటి పెద్ద వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, ఏఐ డేటా సెంటర్లు వంటి కొత్త రంగాల్లోకి అడుగుపెడుతోంది. ఈ పెట్టుబడులు టాటాకు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా ముఖ్యమైనవి.భారత్ను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి టాటా పెట్టుబడులు ఉపయోగపడతాయి. అందుకే.. కొత్త టాటా చైర్మన్ ముందు పెద్ద బాధ్యత ఉంది. చంద్రశేఖరన్ ప్రారంభించిన పెద్ద ప్రణాళికలను కొనసాగించాలా, లేక పెట్టుబడులను కొంత తగ్గించి ముందుగా లాభాలపై దృష్టి పెట్టాలా అనేది నిర్ణయించాలి.ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. EV కొనేవారికి గుడ్న్యూస్! -
‘టాటా’ సామ్రాజ్యానికి గుండెకాయ.. ‘బాంబే హౌస్’
ముంబై ఫోర్ట్ ప్రాంతంలోని ప్రశాంతమైన హోమి మోడీ వీధిలో కనిపించే నాలుగు అంతస్తుల చారిత్రక భవనం.. బయటకు చూస్తే సాధారణ కార్యాలయ భవనంలానే అనిపిస్తుంది. కానీ అదే ‘బాంబే హౌస్’. దాదాపు శతాబ్ద కాలంగా టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి ఇది ప్రధాన కార్యాలయం మాత్రమే కాదు.. కీలక నిర్ణయాలకు సాక్షిగా నిలిచిన కార్పొరేట్ చరిత్రకు చిరునామా. ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు (2027 ఫిబ్రవరిలో తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత) ప్రకటించడంతో మరోసారి బాంబే హౌస్పై ఆసక్తి పెరిగింది.1924లో మొదలైన ప్రయాణంబాంబే హౌస్ కథ 1920లో ప్రారంభమైంది. టాటా సన్స్ రెండో చైర్మన్ సర్ దొరాబ్జీ టాటా.. బాంబే మునిసిపాలిటీ నుంచి ఫోర్ట్ ప్రాంతంలో సుమారు 21,285 చదరపు అడుగుల విస్తీర్ణంలోని రెండు స్థలాలను కొనుగోలు చేశారు. అనంతరం భవనం నిర్మాణ బాధ్యతలను అసోసియేటెడ్ బిల్డింగ్ కంపెనీకి అప్పగించారు.స్కాటిష్ ఆర్కిటెక్ట్ జార్జ్ విట్టెట్ దీనికి రూపకల్పన చేశారు. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం (ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ) వంటి ప్రముఖ నిర్మాణాల రూపకల్పనతో విట్టెట్ అప్పటికే పేరు సంపాదించారు. బాంబే హౌస్ నిర్మాణం 1924లో పూర్తయి జూలై 1న తలుపులు తెరుచుకుంది.ఈ భవనానికి ‘టాటా హౌస్’ అని పేరు పెట్టకుండా ‘బాంబే హౌస్’ అని పిలవడం వెనుక కూడా ప్రత్యేక భావన ఉంది. టాటా గ్రూప్ ఎదుగుదలకు కేంద్రంగా నిలిచిన బొంబాయి నగరంతో సంస్థకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ పేరు పెట్టారు.ఎడ్వర్డియన్ అందం.. భారతీయ వారసత్వంబాంబే హౌస్ నిర్మాణం ఎడ్వర్డియన్ నియో-క్లాసికల్ శైలిని ప్రతిబింబిస్తుంది. మలాడ్ రాతితో నిర్మించిన ముఖభాగం, సమతుల్య ఆకృతి, పెద్ద జార్జియన్ తరహా కిటికీలు, అలంకార కార్నిస్లు ఈ భవనానికి ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. మొదట భవనం బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మూడు పై అంతస్తులతో నిర్మించారు. 1941-42లో నాలుగో అంతస్తును చేర్చారు. ప్రస్తుతం ఇదే అంతస్తులో చైర్మన్ కార్యాలయం, బోర్డు రూమ్ ఉన్నాయి.బయటి రూపాన్ని దాదాపు యథాతథంగా కాపాడుకుంటూనే లోపలి భాగాలను కాలానుగుణంగా మార్చుకుంటూ వచ్చారు. పాత కళాఖండాలు, ఫర్నిచర్, జ్ఞాపికలు, చారిత్రక బోర్డు రూమ్ వంటి అంశాలు భవనానికి పాతకాలపు ప్రత్యేకతను కొనసాగిస్తున్నాయి.టాటా సామ్రాజ్యంలోని కీలక నిర్ణయాలకు వేదికబాంబే హౌస్లో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు టాటా గ్రూప్ చరిత్రలో అనేక మలుపులకు దారి తీశాయి. ఒకప్పుడు టెక్స్టైల్స్, హోటళ్లు, ఉక్కు, విద్యుత్ వంటి నాలుగు ప్రధాన వ్యాపారాల కేంద్రంగా ఉన్న ఈ భవనం.. తర్వాత విస్తరిస్తూ వచ్చిన టాటా సామ్రాజ్యానికి నాడీ కేంద్రంగా మారింది.జేఆర్డీ టాటా కాలంలో విమానయాన రంగంలో టాటా గ్రూప్ అడుగులు వేయడానికి సంబంధించిన కీలక ఆలోచనలు కూడా ఈ సంస్థాగత వాతావరణంలోనే రూపుదిద్దుకున్నాయి. దశాబ్దాల తర్వాత 2007లో టాటా స్టీల్.. కోరస్ను సుమారు 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన భారీ అంతర్జాతీయ ఒప్పందం వంటి వ్యూహాత్మక నిర్ణయాలకు కూడా బాంబే హౌస్ కీలక కేంద్రంగా నిలిచింది.2017లో చంద్రశేఖరన్ తీసుకున్న కీలక నిర్ణయంబాంబే హౌస్ దాదాపు 94 ఏళ్ల చరిత్రలో 2017 వరకు పెద్ద స్థాయి సమగ్ర పునరుద్ధరణకు దూరంగానే ఉంది. టాటా సన్స్ చైర్మన్గా ఎన్. చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భవనాన్ని పూర్తిగా ఆధునీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు.ఆర్కిటెక్ట్, అర్బన్ కన్జర్వేషన్ నిపుణురాలు బృందా సోమయ్య నేతృత్వంలోని బృందం ఈ ప్రాజెక్టును చేపట్టింది. కేవలం తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేసి 2018 జూలై 29న జేఆర్డీ టాటా జయంతి సందర్భంగా బాంబే హౌస్ను తిరిగి ప్రారంభించారు. రతన్ టాటా ఈ పునరుద్ధరించిన భవనాన్ని ప్రారంభించారు.పునరుద్ధరణలో భవనం చారిత్రక రూపాన్ని కాపాడుతూ ఆధునిక కార్యాలయ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఓపెన్ వర్క్స్పేస్లు, సహకార ప్రాంతాలు, డిజిటల్ మీటింగ్ రూమ్లు, టాటా ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. పాత బోర్డు రూమ్కు కూడా ఆధునిక సాంకేతిక సదుపాయాలు జోడించారు.వీధి కుక్కలకు వెల్కమ్!బాంబే హౌస్ ప్రత్యేకతల్లో అత్యంత ఆసక్తికరమైనది అక్కడి వీధి కుక్కల సంప్రదాయం. దశాబ్దాలుగా భవనానికి వచ్చే కుక్కలను ఉద్యోగులు, సంస్థ ఆహ్వానితుల్లానే ఆదరిస్తున్నారు. 2018 పునరుద్ధరణలో వాటి కోసం ప్రత్యేక కెన్నెల్ను కూడా ఏర్పాటు చేశారు. నిద్రించే ప్రదేశం, సౌకర్యవంతమైన వాతావరణం, ఆహారం, వైద్య సంరక్షణ వంటి ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. టాటా గ్రూప్ స్వయంగా పేర్కొన్నట్టుగా, ఈ కుక్కలకు బాంబే హౌస్లోకి ప్రవేశించేందుకు ఉద్యోగుల మాదిరిగా యాక్సెస్ కార్డు అవసరం లేదు.నేటికీ అదే చిరునామా2024లో బాంబే హౌస్ తన శతాబ్దిని పూర్తి చేసుకుంది. టాటా గ్రూప్ అధికారిక చరిత్ర ప్రకారం, ఈ భవనం నేటికీ గ్రూప్నకు గ్లోబల్ హెడ్క్వార్టర్స్గా కొనసాగుతోంది. వందేళ్లలో టాటా గ్రూప్ నాలుగు ప్రధాన వ్యాపారాల నుంచి అనేక రంగాల్లో విస్తరించిన బహుళజాతి వ్యాపార సమూహంగా మారినా.. దాని సంస్థాగత హృదయం మాత్రం బాంబే హౌస్గానే ఉంది. అంతేకాదు, వారసత్వ భవనంగా ఉన్నప్పటికీ సుస్థిరత చర్యలకు గుర్తింపుగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం రేటింగ్ పొందిన తొలి భారతీయ హెరిటేజ్ భవనంగా ఇది నిలిచింది.ఇప్పుడు చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త చైర్మన్కు బాధ్యతలు అప్పగించేందుకు మార్గం సుగమం చేశారు. దీంతో టాటా గ్రూప్ తదుపరి నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే ఆ నాయకత్వ మార్పు ఎక్కడి నుంచి సాగుతుంది అంటే.. సమాధానం మాత్రం ఇప్పటికీ అదే.. ముంబైలోని ఈ చారిత్రక ‘బాంబే హౌస్’ నుంచే. -
127 శాతం లాభంతో ఫ్లాట్ అమ్మిన మాధురీ దీక్షిత్!
బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ నెనె దేశంలోనే అత్యంత ఖరీదైన ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి తమ పెట్టుబడి వ్యూహాన్ని చాటుకున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన జుహు ప్రాంతంలో ఉన్న తమ అపార్ట్మెంట్ను రూ.4.40 కోట్లకు విక్రయించారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డేటా విశ్లేషణ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ అందించిన అధికారిక సమాచారం ప్రకారం జులై 3న ఈ లావాదేవీ నమోదు పూర్తయింది.విక్రయ వివరాలుమిలిటరీ రోడ్లోని ‘ది డీప్ వర్షా కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ పరిధిలోని ఐరిస్ పార్క్ భవనంలో ఉన్న ఈ ఫ్లాట్ విస్తీర్ణం 774 చదరపు అడుగులు. ఈ ఆస్తిని సచిన్ శేఖర్ శెట్టి అనే కొనుగోలుదారుడు సొంతం చేసుకున్నారు. దీని కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కింద రూ.26.40 లక్షలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా రూ.30,000 చెల్లించారు. కాగా, ఈ ఫ్లాట్కు సంబంధించిన కార్ పార్కింగ్ స్థలాన్ని వీరు గతేడాది డిసెంబర్లోనే వేరే వ్యక్తికి వేరుగా విక్రయించడం గమనార్హం.14 ఏళ్లలో 127 శాతం లాభం2012 జూన్ 4న మాధురి దంపతులు ఈ ఫ్లాట్ను రూ.1.94 కోట్లకు కొనుగోలు చేశారు. దాదాపు 14 ఏళ్ల పాటు దీనిని తమ వద్దే ఉంచుకుని ఇప్పుడు రూ.4.40 కోట్లకు విక్రయించడం ద్వారా 127 శాతానికి పైగా క్యాపిటల్ అప్రిసియేషన్ (మూలధన లాభం) సాధించారు.గత ఎనిమిది నెలల్లో మూడో విక్రయంమాధురీ దీక్షిత్ గత ఎనిమిది నెలల కాలంలో ముంబైలో ఆస్తులను విక్రయించడం ఇది మూడోసారి. డిసెంబర్ 2025లో ఇదే జుహు భవనంలో ఉన్న మరొక 780 చ.అడుగుల ఫ్లాట్ను రూ.3.90 కోట్లకు విక్రయించారు (99.22% లాభం). జూన్ 2026లో అంధేరి వెస్ట్లోని 1,594 చ.అడుగుల కమర్షియల్ ఆఫీస్ స్పేస్ను రూ.4.85 కోట్లకు అమ్మేశారు. 18 ఏళ్ల క్రితం రూ.52.5 లక్షలకు కొన్న ఈ ఆఫీసుపై ఏకంగా 824% రాబడి రావడం విశేషం. -
సబ్సిడీల కోతతో ‘ఈ-బస్’ ఆపరేటర్లకు ఆర్థిక సెగ
దేశంలో కాలుష్య రహిత ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ బస్సుల (ఈ-బస్) విస్తరణ ప్రక్రియ కీలక మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు ఫేమ్ పథకం కింద అందించిన ప్రత్యక్ష కొనుగోలు సబ్సిడీలు క్రమంగా తగ్గుతుండటంతో ఈ-బస్ ఆపరేటర్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొత్త పథకాలైన ‘పీఎం ఈ-డ్రైవ్’, ‘పీఎం-ఈబస్ సేవా’ల్లో ప్రభుత్వం నేరుగా సబ్సిడీలు ఇవ్వడానికి బదులు నిధుల సురక్షిత విధానాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆపరేటర్లకు మూలధన సేకరణ సవాలుగా మారింది.ఆర్థిక భారం.. నిర్వహణ సవాళ్లుఒక సాధారణ డీజిల్ లేదా సీఎన్జీ బస్సు వ్యయంతో పోలిస్తే 12 మీటర్ల ఈ-బస్ ధర రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుంది (దాదాపు 2.5-3 రెట్లు ఎక్కువ). ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష సబ్సిడీ తగ్గిపోవడంతో రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే, బ్యాంకులు ఇచ్చే రుణ కాలపరిమితి కేవలం 5-7 ఏళ్లు మాత్రమే ఉండటం, 7-8 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ వ్యయంతో బ్యాటరీ మార్పిడి చేయాల్సి రావడం ఆపరేటర్ల లాభదాయకతను దెబ్బతీస్తోంది.పేమెంట్ సెక్యూరిటీ మెకానిజంరాష్ట్ర రవాణా సంస్థల నుంచి బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించి పెట్టుబడిదారుల్లో నమ్మకం నింపేందుకు ప్రభుత్వం రూ.3,435 కోట్ల వ్యయంతో పీఎస్ఎంను అందుబాటులోకి తెచ్చింది. ఇది దాదాపు 27,555 బస్సులకు క్రెడిట్ గ్యారెంటీని ఇస్తున్నప్పటికీ ప్రాథమిక మూలధన కొరతను తీర్చడంలో ఇది పాక్షిక ప్రయోజనాన్నే ఇస్తోంది.పరిష్కారాలు.. నిపుణుల అభిప్రాయంరేటింగ్ సంస్థ ఇక్రా నివేదికల ప్రకారం.. దీర్ఘకాలిక నిర్వహణ వ్యయం పరంగా డీజిల్ బస్సుకు కిలోమీటరుకు రూ.51 ఖర్చయితే ఈ-బస్సుకు రూ.39 మాత్రమే అవుతుంది. ఈ ఆర్థిక ప్రయోజనం దృష్ట్యా 2030 నాటికి దేశీయ బస్సు మార్కెట్లో ఈ-బస్సుల వాటాను 30 శాతానికి చేర్చాలన్న లక్ష్యం నెరవేరాలంటే కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ-బస్ ఫైనాన్సింగ్ను ప్రాధాన్యతా రంగ రుణాల పరిధిలోకి తీసుకురావాలి.బ్యాంకులు రుణాల తిరిగి చెల్లింపు కాలపరిమితిని 10-12 ఏళ్లకు పెంచాలి.ప్రైవేట్ రవాణా రంగానికి కూడా మౌలిక వసతుల కల్పనలో దీర్ఘకాలిక రుణ సదుపాయాలు కల్పించాలి. -
టాటా సన్స్ నూతన సారథి ఎవరు?
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరి 20తో తన పదవీ కాలాన్ని ముగించి బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో కార్పొరేట్ ప్రపంచంలో పెద్దఎత్తున చర్చ మొదలైంది. బోర్డులో సర్వామోదం లభించకపోవడం, ప్రధాన వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాతో వ్యూహాత్మక విధానాలపై ఏర్పడిన వ్యత్యాసాల నేపథ్యంలో ‘చంద్ర’గా ప్రాచుర్యం పొందిన ఆయన మూడోసారి పదవీకాలాన్ని కోరకూడదని నిశ్చయించుకున్నారు. తొమ్మిదేళ్ల తన హయాంలో సెమీకండక్టర్లు, ఈవీ రంగాలు, ఎయిర్ ఇండియా పునరుద్ధరణ, డిజిటల్ వ్యాపారాల్లో గ్రూప్ను నూతన శిఖరాలకు చేర్చిన ఆయన సజావుగా నాయకత్వ మార్పిడి జరిగేలా త్వరలోనే వారసుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని బోర్డును కోరారు.టాటా సన్స్ నిబంధనావళి (ఆర్టికల్ 118) ప్రకారం నూతన ఛైర్మన్ను ఎంపిక చేసేందుకు టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ బోర్డు ప్రతినిధులతో కూడిన ఐదుగురు సభ్యుల హై-పవర్ సెలేక్షన్ కమిటీ కొద్దిరోజుల్లో ఏర్పాటవుతోంది.ఈ వారసత్వ రేసులో టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ టీవీ నరేంద్రన్ (61) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టాటా గ్రూప్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నరేంద్రన్.. సంక్షోభంలో ఉన్న భూషణ్ స్టీల్ విలీనాన్ని విజయవంతంగా ముగించారు. అంతేకాకుండా, కళింగనగర్ ప్లాంట్ విస్తరణ, యూరప్లో గ్రీన్ స్టీల్ దిశగా వేగవంతమైన పరివర్తనను సాధించి, టాటా స్టీల్ను స్థిరమైన లాభాల బాట పట్టించారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆయనకున్న పట్టు, కార్యనిర్వాహక సామర్థ్యం ఆయనను కీలకంగా నిలబెట్టాయి.నరేంద్రన్తో పాటు టీసీఎస్ సీఈఓ కే.కృతివాసన్, జేఎల్ఆర్ సీఈఓ పి.బి.బాలాజీ, టాటా మోటార్స్ ఈవీ విభాగాధిపతి శైలేష్ చంద్రల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే, గ్రూప్లోని ఎగ్జిక్యూటివ్ రిటైర్మెంట్ వయోపరిమితి (65 ఏళ్లు) నిబంధన, 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ దృక్పథానికి పూర్తిగా అనుగుణంగా నడుచుకునే నేతను ఎంచుకోవడం బోర్డు ముందున్న ప్రధాన సవాలు. 280 బిలియన్ డాలర్ల సమూహానికి అంతర్గత నాయకుడే ప్రాతినిధ్యం వహిస్తారా లేక వెలుపలి నుంచి మరోవ్యక్తిని రంగంలోకి దించుతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.ఇదీ చదవండి: వివాదాస్పద కంటెంట్కు యాడ్ మనీ! -
ఊరికే ‘వావ్’ అన్నారనుకో.. ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్లకు వార్నింగ్!
సోషల్ మీడియాలో ఫుడ్ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇకపై ఏదిపడితే అది చెప్పేయడానికి వీల్లేదు. ఆహార ఉత్పత్తులపై తప్పుడు, అతిశయోక్తి లేదా ధ్రువీకరించని క్లెయిమ్లను ప్రచారం చేయొద్దంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తాజాగా హెచ్చరించింది. ఉత్పత్తిని ప్రమోట్ చేసే ముందు అందులోని క్లెయిమ్లు నిజమైనవా, ధ్రువీకరించగలిగినవా, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది.‘గొప్ప ప్రభావంతో గొప్ప బాధ్యత వస్తుంది’ అనే సందేశంతో FSSAI ఈ అంశాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేసే సమయంలో తమ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఇన్ఫ్లుయెన్సర్లకు సూచించింది. ధ్రువీకరించని లేదా తప్పుదోవ పట్టించే ఆహార క్లెయిమ్లను ప్రచారం చేస్తే చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.ఆరోగ్య ప్రయోజనాల క్లెయిమ్లపై నిఘాహెల్త్ డ్రింక్స్, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటి ఉత్పత్తులకు సోషల్ మీడియా ప్రమోషన్లు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘ఇమ్యూనిటీని పెంచుతుంది’, ‘పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది’ వంటి ఆరోగ్య సంబంధిత క్లెయిమ్లను ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేయకూడదని FSSAI సూచిస్తోంది.FSSAI నిబంధనల ప్రకారం ఆహార ఉత్పత్తులపై చేసే క్లెయిమ్లు నిజమైనవి, స్పష్టమైనవి, అర్థవంతమైనవి, వినియోగదారులను తప్పుదోవ పట్టించనివిగా ఉండాలి. ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించిన క్లెయిమ్లకు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రకటనలోని క్లెయిమ్లు ఉత్పత్తి లేబుల్పై ఉన్న సమాచారంతోనూ సరిపోవాలి.‘100%’ క్లెయిమ్లపైనా కఠిన వైఖరిఆహార రంగంలో ‘100% ప్యూర్’, ‘100% నేచురల్’, ‘100% ఆర్గానిక్’ వంటి పదాల వినియోగంపై కూడా FSSAI ఇటీవల కఠినంగా వ్యవహరిస్తోంది. ‘100%’ అనే పదం ఆహార నిబంధనల్లో లేదని, ఇలాంటి క్లెయిమ్లు వినియోగదారుల్లో ఉత్పత్తి సంపూర్ణంగా స్వచ్ఛమైనదనే తప్పుదారి పట్టించే భావన కలిగించే అవకాశం ఉందని రెగ్యులేటర్ గతంలో స్పష్టం చేసింది.తాజాగా డాబర్ ఇండియా విషయంలోనూ ఇదే అంశం చర్చనీయాంశమైంది. తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్, వర్జిన్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీరు, కొబ్బరి పాలు తదితర ఉత్పత్తులపై ‘100%’ క్లెయిమ్లను FSSAI అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ అంశంలో తాజా పరిణామంగా ఢిల్లీ హైకోర్టు FSSAI ఆదేశంపై తాత్కాలిక స్టే విధించింది. దీంతో డాబర్కు ప్రస్తుతం సంబంధిత ఉత్పత్తులను విక్రయించేందుకు తాత్కాలికంగా అవకాశం లభించింది. కేసు కోర్టు పరిశీలనలో ఉంది.ఇన్ఫ్లుయెన్సర్లకు ఇప్పటికే ఉన్న బాధ్యతలుఫుడ్ ప్రమోషన్ల విషయంలో FSSAI నిబంధనలతో పాటు వినియోగదారుల వ్యవహారాల శాఖ రూపొందించిన 2022లోని తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ఎండార్స్మెంట్ల మార్గదర్శకాలు కూడా కీలకంగా ఉన్నాయి. వీటి ప్రకారం సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేసే ముందు తగిన డ్యూ డిలిజెన్స్ చేయాలి. వారి ఎండార్స్మెంట్ నిజమైన అభిప్రాయం లేదా అనుభవాన్ని ప్రతిబింబించాలి. తప్పుడు లేదా మోసపూరిత క్లెయిమ్లకు మద్దతు ఇవ్వకూడదు.ఆరోగ్యం, వెల్నెస్ ఉత్పత్తులను ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేక మార్గదర్శకాలు కూడా సూచిస్తున్నాయి. క్లెయిమ్లకు తగిన ఆధారాలు ఉన్నాయో లేదో పరిశీలించడం, అవసరమైనప్పుడు ఆధారాలు లేదా మూలాలను వెల్లడించడం, తప్పుడు లేదా అతిశయోక్తి సమాచారాన్ని ప్రచారం చేయకపోవడం వంటి బాధ్యతలను అవి నిర్దేశిస్తున్నాయి.తప్పుదోవ పట్టిస్తే జరిమానా కూడా..తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా ఎండార్సర్పైనా చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నాయి. వినియోగదారుల రక్షణ చట్టం కింద మొదటి ఉల్లంఘనకు రూ.10 లక్షల వరకు, పునరావృత ఉల్లంఘనకు రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా నిర్దిష్ట కాలానికి ఎండార్స్మెంట్ చేయకుండా నిషేధించే చర్యలు కూడా ఉండొచ్చు.అందుకే ఇకపై ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఉత్పత్తి రుచి చూసి ‘వావ్’ అనడం మాత్రమే కాకుండా, దాని ఆరోగ్య ప్రయోజనాలు, స్వచ్ఛత, పోషక విలువలు వంటి అంశాలపై తాము చేసే ప్రతి క్లెయిమ్ వెనుక ఆధారం ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. ఫాలోవర్ల నమ్మకాన్ని ఉపయోగించి చేసే ప్రతి ఫుడ్ ప్రమోషన్కు బాధ్యత కూడా అంతే స్థాయిలో ఉంటుందని FSSAI తాజా హెచ్చరిక స్పష్టం చేస్తోంది.With great influence comes great responsibility! Before endorsing a food product, ensure that claims are truthful, verifiable & compliant with the law. Promoting misleading or unverified food claims can attract legal consequences. Verify before you amplify.#FSSAIRegulations pic.twitter.com/t0UQzRTnPq— FSSAI (@fssaiindia) August 11, 2026 -
గిగ్ కార్మికులకు రిటైర్మెంట్ భద్రత
ఫుడ్ డెలివరీ, రైడ్ షేరింగ్, క్విక్ కామర్స్ వంటి డిజిటల్ వేదికల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికుల భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా పీఎఫ్ఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ ఉద్యోగాల వలె పదవీ విరమణ ప్రయోజనాలు లేని ఈ అసంఘటిత రంగాన్ని జాతీయ పింఛను విధానం (ఎన్పీఎస్) పరిధిలోకి తీసుకురావడానికి ‘ఈ-శ్రామిక్’ (ప్లాట్ఫామ్ సర్వీస్ పార్ట్నర్) నమూనాను పీఎఫ్ఆర్డీఏ ప్రచారం చేస్తోంది.సరళమైన విరాళాల విధానంగిగ్ కార్మికుల నెలవారీ ఆదాయంలో ఉండే హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్ను సులభతరంగా తీర్చిదిద్దారు. కార్మికులు కేవలం రూ.99 వంటి నామమాత్రపు చందాతో పొదుపును ప్రారంభించవచ్చు. అయితే, విరాళాలపై నిర్బంధ కనీస పరిమితి (మ్యాండేటరీ ఫ్లోర్) ఏదీ విధించలేదు. ఈ విధానంలో పొదుపు మొత్తాన్ని కార్మికుడు ఒక్కడే చెల్లించవచ్చు లేదా అగ్రిగేటర్ సంస్థ పూర్తిగా భరించవచ్చు లేదా ఇద్దరూ కలిసి సంయుక్తంగా జమ చేసే వెసులుబాటును కల్పించారు.ఆధార్ కేవైసీ.. ఖాతా పోర్టబిలిటీఅగ్రిగేటర్లతో అనుబంధం ఉన్న ‘పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్’(పీఓపీ)ల ద్వారా నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఆధార్ ఆధారిత కేవైసీ, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పిస్తే చాలు కార్మికుడికి శాశ్వత రిటైర్మెంట్ ఖాతా సంఖ్య (ప్రాన్) కేటాయిస్తారు. ఈ వ్యవస్థలో ఉన్న ప్రధాన ప్రయోజనం.. పోర్టబిలిటీ. కార్మికుడు ఒక సర్వీస్ ప్లాట్ఫామ్ నుంచి మరొక దానికి మారినప్పటికీ అతడి పెన్షన్ ఖాతా యథాతథంగా కొనసాగుతుంది.దేశీయ శ్రామిక శక్తిలో వేగంగా పెరుగుతున్న గిగ్ విభాగాన్ని అధికారిక సామాజిక భద్రతా వలయంలోకి చేర్చడానికి ఇది ఒక విప్లవాత్మక అడుగు. అయితే, ఎన్పీఎస్ రాబడులు మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉండటం, కార్మికులకు స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల క్రమబద్ధమైన విరాళాలు సేకరించడం ప్రధాన సవాలుగా మారవచ్చు. ఈ పథకం ఆశించిన విజయం సాధించాలంటే జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ వంటి అగ్రిగేటర్ సంస్థలు తమ పార్ట్నర్లలో అవగాహన పెంచి స్వచ్ఛందంగా ప్రొత్సహించడం చాలా అవసరం.ఇదీ చదవండి: వివాదాస్పద కంటెంట్కు యాడ్ మనీ! -
వివాదాస్పద కంటెంట్కు యాడ్ మనీ!
సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. కంపెనీకి ఉన్న సొంత కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ద్వేషాన్ని పెంచేలా ఉండే వివాదాస్పద పోస్టులకు కూడా ప్రకటనల ద్వారా ఆదాయాన్ని (యాడ్ మనీ) చెల్లిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు ఇప్పుడు మెటా చర్యలపై తీవ్రంగా నిఘా పెట్టాయి.ఇన్వెస్టర్లలో ఆందోళనకంపెనీ అమలు చేస్తున్న పెర్ఫార్మెన్స్-బేస్డ్ మోనెటైజేషన్ విధానం వ్యూస్, వాచ్టైమ్ ఆధారంగా క్రియేటర్లకు నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో నాజీయిజం, అహంకారం, వ్యాక్సిన్ వ్యతిరేక ప్రచారాలకు సంబంధించిన పోస్టులకు కూడా ప్రకటనల ఆదాయం మళ్లుతుండటం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. కంటెంట్ మోడరేషన్ ప్రమాణాలకు, ఇన్కమ్ పంపిణీ మోడల్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది బయటపెడుతోంది.సాంకేతిక వైఫల్యాలుభారత్లోనూ మెటా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. అక్రమ పెయిడ్ కంటెంట్ను ప్రచారం చేయడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోపై పొరపాటున పరిమితులు విధించడం.. వంటి సాంకేతిక వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మెటా ప్రతినిధులు ఇటీవలే అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఇటువంటి వరుస లోపాల వల్ల ప్లాట్ఫామ్లకు లభించే చట్టబద్ధ రక్షణ హోదా ముప్పులో పడే అవకాశముంది.మరోవైపు, పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిన కేసులో అమెరికా కోర్టు మెటాకు 567 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,750 కోట్లు) భారీ జరిమానా విధించింది. దీనికి తోడు కృత్రిమ మేధ మౌలిక వసతులకై మెటా బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తుండటంతో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లు, ఫ్రీ క్యాష్ ఫ్లోపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ద్వేషపూరిత కంటెంట్కు చెక్ పెడుతూ యూజర్ ఎంగేజ్మెంట్ను కాపాడుకునేలా తన ఆల్గోరిథమ్లను సవరించకపోతే రాబోయే రోజుల్లో నియంత్రణ చర్యలు మరింత కఠినతరమై, మార్కెట్లో వాటాదారుల నమ్మకం దెబ్బతినే ప్రమాదముంది.ఇదీ చదవండి: పిల్లలను కనట్లేదు! గ్లోబల్ ఫెర్టిలిటీ పతనం -
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం రేటు ఇలా..
దేశంలో బంగారం ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు మళ్లీ హాట్రిక్ కొట్టేశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా ఉపశమనం దక్కలేదు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు) -
మారుతి కార్లపై భారీ ఆఫర్లు.. బంపర్ డిస్కౌంట్లు
మారుతి సుజుకి నెక్సా కార్ల కొనుగోలుదారులకు ఆగస్టు 2026లో ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ అప్గ్రేడ్, సంస్థాగత ప్రయోజనాలు వంటి వాటిని కలిపి కొన్ని మోడళ్లపై భారీగా ప్రయోజనాలు అందిస్తోంది. ఈ నెలలో అత్యధికంగా మారుతి సుజుకి ఇన్విక్టోపై రూ.1.55 లక్షల వరకు ప్రయోజనం అందిస్తోంది. అయితే అన్ని ఆఫర్లు ప్రతి కస్టమర్కు ఒకేలా వర్తించవు. నగరం, డీలర్, వాహనం వేరియంట్, స్టాక్, ఎక్స్ఛేంజ్ వాహనం వయసు వంటి అంశాలపై తుది ఆఫర్ ఆధారపడి ఉంటుంది.ఇన్విక్టోపై రూ.1.55 లక్షల వరకు..నెక్సా శ్రేణిలో అత్యధిక ప్రయోజనం ఇన్విక్టోపై లభిస్తోంది. ఈ ప్రీమియం ఎమ్పీవీపై రూ.55,000 కన్జ్యూమర్ ఆఫర్తో పాటు అర్హతను బట్టి రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.50,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.30,000 లాయల్టీ అప్గ్రేడ్, రూ.20,000 ఇన్స్టిట్యూషనల్ డిస్కౌంట్ ఉన్నాయి. మొత్తం ప్రయోజనం రూ.1.55 లక్షల వరకు చేరుతుంది. ఇన్విక్టో ఎక్స్షోరూమ్ ధర రూ.24.97 లక్షల నుంచి రూ.28.61 లక్షల వరకు ఉంది. ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్కు ప్రత్యర్థిగా నిలుస్తోంది.గ్రాండ్ విటారాపై భారీ బెనిఫిట్స్ఆగస్టు ఆఫర్లలో గ్రాండ్ విటారా కూడా కీలకంగా ఉంది. సిగ్మా పెట్రోల్ వేరియంట్పై గరిష్ఠంగా రూ.1.30 లక్షల వరకు ప్రయోజనం, డెల్టా పెట్రోల్ వేరియంట్లపై రూ.1.20 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. జీటా, ఆల్ఫా, ఏడబ్ల్యూడీ వేరియంట్లకు రూ.1.20 లక్షల వరకు బెనిఫిట్స్తో పాటు ఐదేళ్ల ఎక్స్టెండెడ్ వారంటీని అందిస్తున్నారు.స్ట్రాంగ్ హైబ్రిడ్ గ్రాండ్ విటారాకు రూ.1.25 లక్షల వరకు ఇతర ప్రయోజనాలతో పాటు ఐదేళ్ల ఎక్స్టెండెడ్ వారంటీ, ఢిల్లీలో రోడ్ ట్యాక్స్ మినహాయింపు ద్వారా గరిష్ఠంగా మరో రూ.1.85 లక్షల వరకు ప్రయోజనం లభించవచ్చు.సీఎన్జీ గ్రాండ్ విటారా విషయానికి వస్తే డెల్టా సీఎన్జీపై రూ.1.05 లక్షల వరకు, జీటా సీఎన్జీపై రూ.95,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. గ్రాండ్ విటారా ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టయోటా హైరైడర్ వంటి మోడళ్లతో పోటీపడుతోంది.XL6పై రూ.50,000 వరకు..ప్రీమియం ఆరు సీట్ల ఎమ్పీవీ XL6 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.50,000 వరకు ప్రయోజనం అందిస్తోంది. ఇందులో రూ.20,000 కన్జ్యూమర్ ఆఫర్, అర్హతను బట్టి రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.15,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. ఈ మోడల్ ఎక్స్షోరూమ్ ధర రూ.11.57 లక్షల నుంచి రూ.14.37 లక్షల వరకు ఉంది.జిమ్నీపై రూ.35,000 క్యాష్ డిస్కౌంట్ఆఫ్రోడ్ ఎస్యూవీ జిమ్నీపై అన్ని వేరియంట్లకు రూ.35,000 కన్జ్యూమర్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ నెల స్కీమ్లో ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ లేదా సంస్థాగత బోనస్లు లేవు. జిమ్నీ ధర రూ.12.39 లక్షల నుంచి రూ.14.37 లక్షల వరకు ఉంది. ఇది మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా వంటి మోడళ్లకు పోటీగా కొనసాగుతోంది.బాలెనోపై రూ.30,000 వరకు..నెక్సా ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో పెట్రోల్ మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లపై రూ.30,000 వరకు ప్రయోజనం లభిస్తోంది. ఇందులో రూ.5,000 కన్జ్యూమర్ ఆఫర్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.10,000 స్క్రాపేజ్ ప్రయోజనం ఉన్నాయి. సీఎన్జీ వేరియంట్లపై రూ.25,000 వరకు బెనిఫిట్ అందిస్తున్నారు. బాలెనో ఎక్స్షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.17 లక్షల వరకు ఉంది.ఫ్రాంక్స్పై రూ.20,000 వరకు..కాంపాక్ట్ ఎస్యూవీ తరహా క్రాసోవర్ ఫ్రాంక్స్పై రూ.20,000 వరకు ప్రయోజనం ఉంది. టర్బో-పెట్రోల్ వేరియంట్లకు రూ.5,000 కన్జ్యూమర్ ఆఫర్తో పాటు రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లభిస్తుంది. ఇతర పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.15,000 వరకు ప్రయోజనం ఉంది. ఫ్రాంక్స్ ధర రూ.6.85 లక్షల నుంచి రూ.11.84 లక్షల వరకు ఉంది.కొనుగోలుదారులు గమనించాల్సింది..ఆగస్టు 2026 నెక్సా ఆఫర్లు ఆగస్టు 4 నుంచి అమల్లో ఉన్నట్లు తాజా డీలర్-స్కీమ్ ఆధారిత సమాచారం చెబుతోంది. అయితే ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ, కార్పొరేట్ ప్రయోజనాలను అన్ని సందర్భాల్లో కలిపి పొందే అవకాశం ఉండకపోవచ్చు. అంతేకాదు, డీలర్ స్టాక్, నగరం, వేరియంట్, కస్టమర్ అర్హత ఆధారంగా తుది డీల్ మారవచ్చు. కాబట్టి కారు బుక్ చేసే ముందు సమీప నెక్సా డీలర్ వద్ద ఆఫర్ బ్రేకప్, ఎక్స్షోరూమ్ ధర, ఇన్సూరెన్స్, ఆర్టీఓ, యాక్సెసరీస్ తదితరాల పూర్తి కోట్ తీసుకోవడం మంచిది. -
స్టాక్ మార్కెట్లో రెడ్ అలర్ట్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ(Nifty) 88 పాయింట్లు తగ్గి 24,349 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 174 పాయింట్లు నష్టపోయి 77,789 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.01బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.67 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.నాస్డాక్ 0.54 శాతం పుంజుకుంది.Today Nifty position 13-08-2026(time: 9:44 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పిల్లలను కనట్లేదు! గ్లోబల్ ఫెర్టిలిటీ పతనం
ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతుండటం భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు జనాభా పెరుగుదల ప్రధాన సమస్యగా నిలిచిన చోట ఇప్పుడు వయోధిక వృద్ధులు ఎక్కువవడం, శ్రామిక శక్తి తగ్గుతుండడం సవాళ్లుగా పరిణమిస్తున్నాయి. జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1(ప్రతి మహిళకు) సంతానోత్పత్తి సగటు స్థాయి కంటే తక్కువకు జననాల రేటు పడిపోతుండటంతో అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.సామాజిక సంక్షేమ పథకాలు భారంజనాభా నిష్పత్తిలో వస్తున్న ఈ మార్పు ప్రభుత్వాల బడ్జెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పనిచేసే వయసున్న యువ శ్రామిక శక్తి తగ్గి, రిటైర్ అయ్యే వృద్ధుల సంఖ్య పెరగడంతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం క్షీణిస్తోంది. అదే సమయంలో పెన్షన్ వ్యవస్థలు, ఉచిత వైద్య సేవలు, సామాజిక సంక్షేమ పథకాల నిర్వహణ భారం ప్రభుత్వాలపై విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల అనేక దేశాలు జాతీయ అప్పుల బారిన పడే ప్రమాదం ఏర్పడటంతో పాటు సామాజిక స్థిరత్వం కోసం కఠినమైన ఆర్థిక విధానాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.ఎక్కువ ఉత్పాదకతకు ప్రత్యామ్నాయాలుఈ శ్రామిక కొరత అంతర్జాతీయ పెట్టుబడుల సరళిని, సాంకేతిక వినియోగాన్ని కూడా వేగంగా మారుస్తోంది. తక్కువ మంది కార్మికులతో ఎక్కువ ఉత్పాదకతను సాధించేందుకు పరిశ్రమలు ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు, పెరుగుతున్న వయోవృద్ధుల జనాభాకు అనుగుణంగా హెల్త్కేర్, లాంగ్-టర్మ్ కేర్ ఫెసిలిటీస్, సీనియర్ కేర్ ఇన్సూరెన్స్ వంటి రంగాలకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు ఆ దిశగా దృష్టి సారిస్తున్నారు.భారత్లో పరిస్థితి ఇలా..భారతదేశంలో కూడా అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగానే సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నప్పటికీ ఇక్కడ స్పష్టమైన ప్రాంతీయ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల తరహాలోనే తక్కువ జనన రేటును నమోదు చేస్తున్నాయి. అయితే బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ జనన రేటు అధికంగానే ఉంది. ఈ అసమానతల కారణంగా రాబోయే దశాబ్దాల్లో దేశీయ ఆర్థిక వృద్ధి ప్రక్రియ రాష్ట్రానికో రకంగా ఉండబోతోంది.ఇప్పుడేం చేయాలంటే..భవిష్యత్తులో శ్రామిక శక్తి తగ్గిపోవడం వల్ల ఏర్పడే లోటును సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయకపోతే ఆర్థిక మందగమనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న వయోభారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వాలు తమ సామాజిక వ్యయ విధానాలు, వలస విధానాలను పునపరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. సరైన ఆర్థిక ప్రణాళికలతో ముందడుగు వేసినప్పుడే ఈ జనాభా సవాలును జయించడం సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: ప్రభుత్వ పాఠశాలల్లో 73% డ్రాపౌట్ -
ప్రభుత్వ పాఠశాలల్లో 73% డ్రాపౌట్
దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ తీవ్ర మౌలిక, నిర్మాణాత్మక సవాళ్లతో కొట్టుమిట్టాడుతోందని పార్లమెంటరీ అంచనాల కమిటీ (కమిటీ ఆన్ ఎస్టిమేట్స్-10వ నివేదిక, 2026-27) లోక్సభలో ప్రవేశపెట్టిన నివేదిక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. దేశంలో హయ్యర్ సెకండరీ విద్య పూర్తికాకుండానే ఏకంగా 73 శాతం మంది విద్యార్థులు బడి మానేస్తున్నారని (డ్రాపౌట్) కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(UDISE 2024-25) డేటా ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక దేశ మానవ వనరుల వికాసానికి ఈ గణాంకాలు తీవ్ర విఘాతమని స్పష్టం చేసింది.నిర్మాణాత్మక లోపాలువిద్యా దశలు పెరిగేకొద్దీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోందని నివేదిక పేర్కొంది. ప్రాథమిక (ప్రైమరీ) స్థాయిలో 6.1 కోట్లకు పైగా ఉన్న విద్యార్థుల చేరికలు అప్పర్ ప్రైమరీ నాటికి 4 కోట్లకు, సెకండరీ స్థాయికి 2.3 కోట్లకు, ఆపై హయ్యర్ సెకండరీ స్థాయికి చేరేసరికి కేవలం 1.6 కోట్లకు పడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 9.11 లక్షలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉండగా హయ్యర్ సెకండరీ విద్యాసంస్థలు కేవలం 90,866 మాత్రమే ఉండటం ఈ అసమానతకు ప్రధాన కారణమని కమిటీ విశ్లేషించింది.దివ్యాంగ విద్యార్థుల వసతులు.. నిధుల నిరుపయోగంప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల(CwSN) మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర విద్యాశాఖ తీవ్ర విఫలమైందని కమిటీ ఎత్తి చూపింది. దేశంలోని 14.7 లక్షల పాఠశాలల్లో సగానికి పైగా పాఠశాలల్లో హ్యాండ్రైల్స్తో కూడిన ర్యాంపులు, ప్రత్యేక మరుగుదొడ్లు లేవు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో CwSN మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన రూ.4.82 కోట్లలో కేవలం రూ.2.60 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. అలాగే ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకానికి కేటాయించిన రూ.9.62 కోట్లలో కేవలం రూ.80.50 లక్షలు మాత్రమే వెచ్చించడం విద్యాశాఖ నిధుల వినియోగంలో నిర్లక్ష్యాన్ని చాటుతోంది.సిఫార్సులుజాతీయ విద్యా విధానం ఆశయాలకు అనుగుణంగా సమ్మిళిత విద్యను అందించాలంటే విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ప్రాథమిక పాఠశాలలను హయ్యర్ సెకండరీ స్థాయికి అప్గ్రేడ్ చేయాలని కమిటీ సూచించింది. కేటాయించిన బడ్జెట్ పూర్తిస్థాయిలో సమర్థవంతంగా ఖర్చయ్యేలా కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
రిటైర్మెంట్ నిధికి ఏది శ్రీరామరక్ష?
ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టిన ప్రతి వేతన జీవిని వేధించే ప్రధాన ప్రశ్న.. ‘నా భవిష్యత్తు అవసరాలకు, రిటైర్మెంట్ నిధికి ఈపీఎఫ్ మేలా? లేక పీపీఎఫ్ ఉత్తమమా?’. ప్రభుత్వం అందించే ఈ రెండు పబ్లిక్ సేవింగ్స్ స్కీమ్లూ సురక్షితమైనవే అయినప్పటికీ వాటి వార్షిక రాబడులు, విత్డ్రా నిబంధనలు, పన్ను ప్రయోజనాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి.వడ్డీలో తేడాఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ప్రస్తుతం 8.25% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే 12 శాతం మొత్తానికి సమానంగా యాజమాన్యం కూడా కాంట్రిబ్యూట్ చేయడం ఈపీఎఫ్లో అతిపెద్ద ప్లస్ పాయింట్. మరోవైపు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ప్రస్తుతం 7.1% వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో కేవలం వ్యక్తిగత పెట్టుబడికి మాత్రమే అవకాశముంటుంది. ఆర్థిక చక్రవడ్డీ ప్రాతిపదికన చూస్తే ఈపీఎఫ్ అందించే అధిక వడ్డీ రేటు సుదీర్ఘ కాలంలో పెద్ద మొత్తంలో నిధి రూపుదిద్దుకోవడానికి దోహదపడుతుంది.పన్ను ప్రయోజనాలుపన్ను ప్రయోజనాల విషయానికి వస్తే రెండు స్కీమ్లూ ప్రాథమికంగా ఒకే కేటగిరీ కిందకే వస్తాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రెండింటిలోనూ మినహాయింపు పొందే వీలుంది. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్లో ఉద్యోగి కాంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే ఆ పైబడిన మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. కానీ పీపీఎఫ్లో ఏటా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయడానికి పరిమితి ఉంటుంది. వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు.ఏది ఉత్తమం?భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలనుకునే వేతన జీవులకు ఈపీఎఫ్ ప్రాథమిక ప్రాధాన్యతగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సంస్థ ఇచ్చే కాంట్రిబ్యూషన్, 8.25% వడ్డీ కలవడం దీనికి ప్రధాన కారణం. ఇక అదనంగా పొదుపు చేయాలనుకునేవారు లేదా పన్ను మినహాయింపుల కోసం తమ పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసేందుకు పీపీఎఫ్ను సెకండరీ ఆప్షన్గా ఎంచుకోవడం ఉత్తమం. వీపీఎఫ్ (Voluntary Provident Fund) ద్వారా ఈపీఎఫ్లోనే అదనపు నిధులు కేటాయించడం కూడా సురక్షితమైన, అధిక రాబడినిచ్చే వ్యూహంగా మారుతుంది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
జియో ఫైనాన్షియల్లో బోఫా భారీ పెట్టుబడి
ముంబై: ముకేశ్ అంబానీ ప్రమోట్ చేసిన ఎన్బీఎఫ్సీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా(బోఫా) 1.9 బిలియన్ డాలర్లు (రూ. 18,268 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా జియో క్రెడిట్లో 49.9% వాటా సొంతం చేసుకోనుంది. ఇందుకు రెండు సంస్థలు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జియో ఫైనాన్షియల్ తెలిపింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ, వారంట్ల జారీ ద్వారా బోఫా ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. భాగస్వామ్యం ద్వారా ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లలో బోఫా నైపుణ్యంతో, దేశీ మార్కెట్లో జియో ఫైనాన్షియల్ డిజిటల్ కార్యకలాపాలను మిళితం చేయనున్నట్లు వివరించింది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన జియో క్రెడిట్కు 2026 జూన్కల్లా రూ. 30,667 కోట్ల నిర్వహణ ఆస్తులున్నాయి.ఈ వార్తల నేపథ్యంలో జియో ఫైనాన్షియల్ షేరు దాదాపు 1 శాతం పెరిగి రూ.255 వద్ద ముగిసింది. -
లలితా జ్యువెలరీ @ రూ. 190–201
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల రిటైల్ కంపెనీ లలితా జ్యువెలరీ పబ్లిక్ ఇష్యూకి రూ. 190–201 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 17న ప్రారంభమై 19న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు 14న ఈక్విటీ షేర్లు ఆఫర్ చేయనుంది. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా కొత్త స్టోర్ల ఏర్పాటుకు వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వినియోగించనుంది. 1985లో టీనగర్(చెన్నై)లో తొలి స్టోర్ను ఏర్పాటు చేసిన కంపెనీ ఈ నెల 24న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానుంది. కంపెనీ విలువ రూ. 11,250 కోట్లుగా నమోదయ్యే వీలుంది. కంపెనీ ప్రధానంగా బంగారం, వెండి, వజ్రాలతోకూడిన ఆభరణాలను విక్రయిస్తోంది. -
చంద్రశేఖరన్.. ‘టాటా’!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కార్పొరేట్ సామ్రాజ్యంలో నాయకత్వ సంక్షోభం తారస్థాయికి చేరింది. గ్రూప్ అధిపతిగా పదేళ్ల ‘చంద్ర’ శకానికి ఇక తెరపడనుంది. టాటా సన్స్ చైర్మన్ పదవికి గుడ్బై చెబుతున్నట్లు నటరాజన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. 2027 ఫిబ్రవరిలో తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత వైదొలగనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని బుధవారం టాటా సన్స్ బోర్డుకు తెలియజేశారు. నాయకత్వ మార్పు సజావుగా పూర్తయ్యేలా చూసేందుకు తన వారసుడి ఎంపికను త్వరగా పూర్తి చేయాల్సిందిగా బోర్డును కోరారు. కొనసాగింపుపై అనిశ్చితి... టాటా ట్రస్టుల చైర్మన్ నోయెల్ టాటాతో నెలకొన్న విభేదాలు, పునర్నియామకంపై సుదీర్ఘ ప్రతిష్టంభన నేపథ్యంలో చంద్రశేఖరన్ తాజా నిర్ణయం వెలువడింది. కాగా, టాటా సన్స్ చైర్మన్గా పునర్నియామకంపై నెలల తరబడి అనిశ్చితి కొనసాగుతోంది. గ్రూపు హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్లో 51.54 శాతం వాటా కలిగిన సర్ దొరాబ్జీ ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ మరో అయిదేళ్లపాటు చైర్మన్గా తన పదవీ కాలాన్ని పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఈ ప్రతిపాదనను ఈ ఏడాది ఫిబ్రవరి 24న టాటా సన్స్ బోర్డు, ఎంపిక కమిటీ ముందుంచగా, ఒక బోర్డు సభ్యుడు (డైరెక్టర్) దానికి మద్దతివ్వకపోవడంతో అది ముందుకు సాగలేదన్నారు. ఈ ప్రతిపాదనతో విభేదించిన డైరెక్టర్ పేరును ప్రస్తావించకుండా, బోర్డు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే నిర్ణయం వాయిదా పడిందని వెల్లడించారు. ఆరు నెలల తర్వాత కూడా ఈ ప్రతిపాదనకు అతీగతీ లేదని, టాటా సన్స్ పర్యవేక్షణలో అనేక వ్యూహాత్మక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నందున నాయకత్వం విషయంలో అనిశ్చితి తారస్థాయికి చేరిందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. నోయెల్ రాకతో విభేదాలు.. 2024లో రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్టుల పగ్గాలు ఆయన సవతి సోదరుడైన నోయెల్ టాటా చేతికొచ్చిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచీ చంద్ర, నోయెల్ మధ్య విభేదాలు మొదలయ్యాయని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టాటా సన్స్ లిస్టింగ్కు నోయెల్ నో చెబుతుండగా.. చంద్ర దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే బోర్డులో ప్రాతినిధ్యం విషయంలో కూడా ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. కాగా, టాటా సన్స్ను లిస్టింగ్ చేయకుండా షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ను బయటికి పంపించే విధంగా ఐదేళ్ల వ్యూహాత్మక రోడ్మ్యాప్ విషయంలో స్పష్టతనివ్వాలని టాటాలు చంద్రను కోరారు. అయితే, దీనిపై చంద్ర నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో పునర్నియామకంపై ప్రతిష్టంభనకు దారితీసింది.ఇంటర్న్గా చేరి.. అత్యున్నత స్థానానికి! → ‘చంద్ర’గా అందరికీ సుపరిచితమైన 63 ఏళ్ల నటరాజన్ చంద్రశేఖరన్.. కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి 1987లో టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్లో ఇంటర్న్గా చేరారు. 22 ఏళ్లలో ఏకంగా 2009లో ఆ కంపెనీ సీఈఓ స్థానానికి చేరారు. → ఇక సైరస్ మిస్త్రీని అర్ధంతరంగా తొలగించిన తర్వాత తాత్కాలిక చైర్మన్గా కొన్నాళ్లు రతన్ టాటా మళ్లీ పగ్గాలు చేపట్టారు. ఆయన వారసుడిగా 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్ చైర్మన్ పదవిలో చంద్ర టాటా సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. టాటా సన్స్ పగ్గాలు తొలిసారి పార్సీయేతర, టాటాల కుటుంబానికి చెందని వ్యక్తికి దక్కడం విశేషం. → చంద్ర హయాంలో దాదాపు దశాబ్దకాలంలో గ్రూపు ఆదాయం రెట్టింపు కాగా, లాభం మూడింతలైంది. 2024–25లో గ్రూపు మొత్తం ఆదాయం 180 బిలియన్ డాలర్లను దాటింది. 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలున్న టాటా గ్రూపులో 31 లిస్టెడ్ కంపెనీలున్నాయి. వాటి మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.26 లక్షల కోట్లు (360–380 బిలియన్ డాలర్లు). ఇది పాకిస్తాన్, పోర్చుగల్, గ్రీస్ ఉమ్మడి జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం. → స్టీల్, ఆటో వంటి బలమైన సంప్రదాయ బిజినెస్ల నుంచి గ్రూపును ఏవియేషన్, ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్స్, బ్యాటరీలు, డిజిటల్ కామర్స్ వంటి ఆధునిక వ్యాపారాల దిశగా నడిపించిన ఘనత చంద్ర సొంతం. 2022లో ఏయిరిండియాను మళ్లీ టాటా గూటికి చేర్చారు. బిగ్బాస్కెట్, 1ఎంజీ వంటి పలు నవ తరం కంపెనీలను కొనుగోలు చేశారు. → మరోపక్క, అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నారు. 2025లో ఎయిరిండియా బోయింగ్ 787 విమాన ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోవడం చంద్రశేఖరన్కు మాయని మచ్చగా మిగిలింది. అంతేకాదు, ఎయిరిండియా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.22,238 కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏఐ ప్రభావంతో టీసీఎస్ సహా టెక్ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి, జేఎల్ఆర్పై సైబర్ దాడుల ప్రభావం వంటివి ఉన్నాయి.వారసుడెవరు? చంద్ర ప్లేసులో టాటా గ్రూప్నకు కొత్త వారసుడి ఎంపిక ఇప్పుడు కత్తిమీద సామేనని పరిశీలకులు అంటున్నారు. టాటా ట్రస్టుల్లో పాలనాపరమైన విభేదాలు, గ్రూపు భారీ పెట్టుబడి లక్ష్యాలు, కొన్ని కంపెనీల భారీ నష్టాలు, టాటా ట్రస్ట్లు, టాటా సన్స్ మధ్య సరైన సమన్వయాన్ని నెలకొల్పడం, ఇతరత్రా సవాళ్ల నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని నియమించడం అంత సులువు కాదనే వాదనలున్నాయి. చైర్మన్గా మళ్లీ టాటాల కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారా లేదంటే, బయటి వ్యక్తినే కొనసాగిస్తారా అనేది కీలకంగా మారనుంది. కాగా, టాటా ట్రస్టుల చైర్మన్ నోయెల్ టాటా పేరు కూడా రేసులో ఉంది. కానీ, టాటా సన్స్ కొత్త నిబంధనల ప్రకారం ట్రస్టులకు సారథ్యం వహిస్తున్న వ్యక్తి అదే సమయంలో టాటా సన్స్ పగ్గాలు చేపట్టడానికి వీల్లేదు. ఇదే ఆయనకు ప్రధాన అడ్డంకి. అయితే, కొత్త చైర్మన్ నియామకంలో మాత్రం నోయెల్దే కీలక పాత్ర కానుంది.ఆధిపత్య పోరు... టాటా ట్రస్టులు, టాటా సన్స్ బోర్డుల్లో అధిపత్య పోరుతో సీనియర్లు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. 2024లో నోయెల్ టాటా ట్రస్ట్ల పగ్గాలు చేపట్టాక ఇది మరింత జోరందుకుంది. రతన్ టాటాకు నమ్మకస్తులైన విజయ్ సింగ్, మెహ్లీ మిస్త్రీ, ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ చంద్ర నిష్క్రమణ దీనికి నిదర్శనం. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో టాటా ట్రస్ట్లకు సుమారు 66% వాటా ఉండటంతో బోర్డు నిర్ణయాలపై దానిదే పూర్తి ఆధిపత్యం. ప్రస్తుతం టాటా సన్స్లో చంద్ర, టాటా ట్రస్ట్ల చైర్మన్ నోయెల్ టాటా, వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, గ్రూప్ సీఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, ఇండిపెండెంట్ డైరెక్టర్లు హరీష్ మన్వానీ, అనితా మరంగోలీ జార్జ్.. ఆరుగురు డైరెక్టర్లుగా ఉన్నారు. టాటా సన్స్ లిస్టింగ్తో పాటు అనేక విషయాల్లో డైరెక్టర్లు వర్గాలుగా విడిపోవడంతో బోర్డు రూమ్ యుద్ధం తీవ్రమైంది. టాటా సన్స్ లిస్టింగ్ను నోయెల్ వ్యతిరేకిస్తుండగా.. చంద్ర తదితరులు సై అంటున్నారు. మరోపక్క, నోయెల్ తన కుమారుడు నెవిల్లే టాటాతో పాటు టైటాన్ మాజీ చీఫ్ భాస్కర్ భట్ను సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (అన్నింటిలో పెద్దది)లోకి తీసుకొని మరింత పట్టుబిగించారు. బోర్డు సభ్యుల మధ్య విభేధాలు, కొందరి రాజీనామాలకు ఈ ట్రస్టే కేంద్ర బిందువుగా మారింది!!నాయకత్వంపై స్పష్టత ముఖ్యం..టాటా గ్రూప్లో 40 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పని చేశాను. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు నా వంతు సహకారం అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. నా పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగుస్తుంది. ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, భాగస్వాములు, ఇతర పక్షాలకు నాయకత్వంపై స్పష్టత ఇవ్వడం చాలా కీలకం. అయితే, ఆరు నెలలుగా నా పునర్నియామక ప్రతిపాదనపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఫిబ్రవరి 20 తర్వాత చైర్మన్గా కొనసాగబోనని బోర్డుకు తెలియజేశాను. గ్రూపుతో 40 ఏళ్ల నా అనుబంధంలో మీరు (ఉద్యోగులు) చూపిన ప్రేమ, ఆప్యాయతలు వెలకట్టలేనివి. ఈ స్థాయికి చేరుకుంటానని ఎన్నడూ ఊహించలేదు. అయితే, ఎవరి కెరీర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందే, మరొకరు ఆ బాధ్యతలు చేపట్టాల్సిందే. టాటా అనేది గౌరవనీయమైన పేరు. మీ కృషి వల్లే అది సాకారమైంది. సంస్థ ప్రగతి పథంలో కొనసాగుతుంది. ఉద్యోగులందరికీ అవకాశాలు లభిస్తూనే ఉంటాయి. నా నిష్క్రమణకు సంబంధించి వస్తున్న ఊహాగానాలు, వదంతులు, కుట్ర సిద్ధాంతాలను మీరెవరూ పట్టించుకోవద్దు.– ఎన్. చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్ -
బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు
బంగారం మరోసారి ఆల్టైమ్ గరిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారాన్ని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా, అమెరికా డాలర్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్లకు బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని ఆయన అన్నారు.1971 ఆగస్టు 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్ను బంగారంతో మార్పిడి చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని కియోసాకి ప్రస్తావించారు. అప్పట్లో ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పినా, 54 ఏళ్లుగా అది కొనసాగుతోందని అన్నారు. అంతకుముందు డాలర్ విలువకు బంగారం ఆధారం ఉండేదని, ఆ తర్వాత అది ప్రభుత్వంపై, దాని విశ్వసనీయతపై ఆధారపడే కరెన్సీగా మారిందని వివరించారు.అమెరికా అప్పులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ డాలర్ నిల్వలను బంగారంగా మార్చుకునే ధోరణి పెరుగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ‘‘ఎవరైతే హామీలు ఇస్తున్నారో.. వారే ఇప్పుడు ఆ హామీల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అనే అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు.తన ‘రిచ్ డాడ్’ నుంచి నేర్చుకున్న పాఠాన్ని ప్రస్తావిస్తూ.. ఇతరుల హామీపై ఆధారపడే డబ్బు, ఎవరి హామీ అవసరం లేని డబ్బు అనే రెండు రకాల సంపద ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. అయితే బంగారాన్ని కేవలం కొనుగోలు చేసి భద్రపరచడం కంటే, బంగారాన్ని ఉత్పత్తి చేసే గనుల్లో పెట్టుబడి పెట్టడమే మెరుగైన వ్యూహమని ఆయన సూచించారు.బంగారు గనుల్లో పెట్టుబడి పెడితే బంగారం విలువతో పాటు గని ద్వారా వచ్చే ఆదాయం, భవిష్యత్తులో ఆ వ్యాపారం పెరిగే కొద్దీ లభించే విలువ కూడా పెట్టుబడిదారుడికి దక్కుతుందని కియోసాకి వివరించారు. ఈ సందర్భంగా ‘ది క్యాపిటల్ క్లబ్’ పేరుతో పెట్టుబడి అవకాశాలను అందించే సంస్థను, దాని ద్వారా బంగారం-వెండి మైనింగ్ ఆపరేషన్లో పెట్టుబడి అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు. -
బంగారం భారీ ధరలకు అదే కారణం..
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్లు పసిడిపై ఆసక్తి చూపారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 1శాతానికిపైగా పెరిగింది.అమెరికా జూలై వినియోగదారుల ధరల సూచీ (CPI) నెలవారీగా 0.1 శాతం పెరిగింది. జూన్లో ఇది 0.4 శాతం తగ్గింది. జూలై గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఫెడ్ సెప్టెంబర్లో రేట్ల పెంపు చేసే అవకాశం తగ్గిందన్న అభిప్రాయం మార్కెట్లో నెలకొంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే లేదా స్థిరంగా ఉండే పరిస్థితుల్లో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.ఈ పరిణామానికి తోడు అమెరికా డాలర్ బలహీనపడటం కూడా పసిడికి కలిసొచ్చింది. డాలర్లో ధర నిర్ణయించే బంగారం ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు చౌకగా మారడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో స్పాట్ గోల్డ్ 100 రోజుల మూవింగ్ యావరేజ్ పైకి ఎగబాకింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ ధరలపైనా కనిపించింది. హైదరాబాద్, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆగస్ట్ 12) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1040 పెరిగి రూ.1,54,860 లకు, 22 క్యారెట్ బంగారం రూ.950 ఎగిసి రూ.1,41,950 వద్దకు చేరింది.ఇదిలా ఉంటే, సెప్టెంబర్లో ఫెడ్ నిర్ణయంపై మార్కెట్ల దృష్టి కొనసాగుతోంది. జూలై 29న జరిగిన సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంకు బెంచ్మార్క్ పాలసీ రేటును 3.50%-3.75% పరిధిలోనే కొనసాగించింది. అయితే ముగ్గురు ఫెడ్ అధికారులు రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేయడం ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలు ఉన్నాయని సూచించింది.ఇక బంగారం తదుపరి కదలికకు అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) కీలకం కానుంది. PPI అంచనాల కంటే ఎక్కువగా వస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయన్న సంకేతాలు వెలువడి, ఫెడ్ రేట్లపై అంచనాలు మళ్లీ మారే అవకాశం ఉంది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు, చమురు ధరలు కూడా బంగారం ధరను ప్రభావితం చేయనున్నాయి. -
తళుక్కుమనే ‘హ్యుందాయ్ ఎక్స్టర్ నైట్’.. ధర ఎంతంటే?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త 2026 ఎక్స్టర్ నైట్ ఎడిషన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్లాక్-థీమ్ డిజైన్, స్పోర్టీ రెడ్ యాక్సెంట్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ మైక్రో ఎస్యూవీ ధర రూ.8.14 లక్షల (ఎక్స్షోరూమ్) నుంచి ప్రారంభమవుతోంది. 2024లో తొలిసారి వచ్చిన ఎక్స్టర్ నైట్ ఎడిషన్కు కొనసాగింపుగా ఈ కొత్త వెర్షన్ను తీసుకొచ్చారు. కాగా, ఎక్స్టర్ ఇప్పటికే దేశంలో 2 లక్షలకు పైగా కస్టమర్లను చేరుకుంది.కొత్త ఎక్స్టర్ నైట్లో ప్రధాన ఆకర్షణ దాని నలుపు రంగు స్టైలింగ్. ముందు, వెనుక భాగాల్లో మ్యాట్ బ్లాక్ ఎక్స్టర్, హ్యుందాయ్ లోగోలు, డార్క్ గ్రే బంపర్లు, సైడ్ సిల్ గార్నిష్లు ఉన్నాయి. 15 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్కు ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు జత చేశారు. ప్రత్యేకమైన ‘Knight’ ఎంబ్లమ్ కూడా ఉంటుంది. ఈ మార్పులతో సాధారణ ఎక్స్టర్తో పోలిస్తే వాహనానికి మరింత బోల్డ్, స్పోర్టీ లుక్ వచ్చింది.క్యాబిన్లోనూ ఇదే డార్క్ థీమ్ను కొనసాగించారు. బ్రాస్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ప్రత్యేకమైన బ్లాక్ సెమీ-ఫ్యాబ్రిక్ సీట్లు, అంబర్ ఫుట్వెల్ లైటింగ్, బ్లాక్ డి-కట్ స్టీరింగ్ వీల్ వంటి అంశాలు ఉన్నాయి. మొత్తంగా బయట నలుపు, లోపల నలుపు రంగుల కలయికకు స్పోర్టీ టచ్ ఇచ్చారు.ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ 83 పీఎస్ పవర్, 113.8 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్జీ వెర్షన్లో 69 పీఎస్ పవర్, 95.2 ఎన్ఎం టార్క్ లభిస్తుంది. సీఎన్జీ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే వస్తుంది.భద్రత విషయంలో 2026 ఎక్స్టర్కు 6 ఎయిర్బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ (HAC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (VSM), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు స్టాండర్డ్గా ఉన్నాయి. కొత్త ఎక్స్టర్లో డ్యాష్క్యామ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి టెక్నాలజీ ఫీచర్లను కూడా హ్యుందాయ్ అందిస్తోంది.ధర విషయానికి వస్తే.. 2026 హ్యుందాయ్ ఎక్స్టర్ నైట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.8.14 లక్షలు (ఎక్స్షోరూమ్). ఎక్స్టర్ నైట్ శ్రేణి ప్రధానంగా HX6లోని పెట్రోల్, సీఎన్జీ ఎంపికలతో పాటు HX10 పెట్రోల్-ఏఎంటీ వేరియంట్లో అందుబాటులో ఉంది. సాధారణ వేరియంట్పై నైట్ ఎడిషన్కు బ్లాక్ ఎక్స్టీరియర్, ప్రత్యేక ఇంటీరియర్ కోసం అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది.మార్చి 2026లో హ్యుందాయ్ ఎక్స్టర్ను అప్డేట్ చేసినప్పుడు దీని ప్రారంభ ఎక్స్షోరూమ్ ధర రూ.5.79 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఎక్స్టర్ ధరలు వేరియంట్ను బట్టి మారుతున్నాయి. -
ఏనుగుల దినోత్సవం .. ‘వంతారా’ విస్తృత కార్యక్రమాలు
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంక్షేమం, సంరక్షణ, సంరక్షకులకు మద్దతు, అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞాన మార్పిడిని మరింత విస్తరించేందుకు వంతారా పలు కార్యక్రమాలను ప్రకటించింది. పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ప్రయాణం గౌరి అనే ఏనుగును రక్షించడంతో ప్రారంభమై ప్రస్తుతం 260కుపైగా ఆసియా ఏనుగులకు ప్రత్యేక సంరక్షణ అందిస్తోంది.హాథీ గావ్లో ప్రత్యేక సంరక్షణ కేంద్రంరాజస్థాన్లోని జైపూర్ హాథీ గావ్లో ఏనుగుల సంరక్షణ, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వంతారా, రాజస్థాన్ అటవీ శాఖతో కలిసి పనిచేయనుంది. ఇందులో ఆధునిక ఏనుగుల ఆసుపత్రి, పోషకాహార కేంద్రం, హైడ్రోథెరపీ సదుపాయాలతో కూడిన చికిత్స–సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వృద్ధ ఏనుగుల కోసం ప్రత్యేక రిటైర్మెంట్ అండ్ కేర్ సెంటర్ను కూడా అభివృద్ధి చేయనున్నారు.182 ఏనుగులకు వైద్య, సంక్షేమ సేవలుఅస్సాం, అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, అండమాన్–నికోబార్ దీవుల్లోని ఎనిమిది ప్రాంతాల్లో వంతారా ఇటీవల భారీ ఏనుగుల సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర అటవీ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 182 ఏనుగులకు ఆరోగ్య, సంక్షేమ సేవలు అందించగా, 242 మంది మహౌత్లకు శిక్షణ ఇచ్చారు. ఏనుగుల ఆరోగ్యం, మానవీయంగా నిర్వహించడం, ప్రథమ చికిత్స, మస్ట్హ్ నిర్వహణ వంటి అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించారు. వెటర్నరీ, సంక్షేమ కిట్లతో పాటు పోషకాహార సహాయాన్ని కూడా అందించారు.పిల్లల్లో కరుణ పెంచేందుకు ‘మై ఫ్రెండ్ లీలావతి’పిల్లల్లో ఏనుగుల పట్ల ప్రేమ, కరుణ, బాధ్యతాభావాన్ని పెంపొందించేందుకు వంతారా ‘మై ఫ్రెండ్ లీలావతి’ పేరుతో సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. చిన్నతనంలో తల్లి నుంచి వేరై సర్కస్లో సంవత్సరాలు గడిపిన లీలావతి, సర్కస్ టెంట్లో అగ్నిప్రమాదం కారణంగా తీవ్ర గాయాలకు గురైంది. ప్రస్తుతం వంతారాలో సంరక్షణ పొందుతున్న లీలావతి కథ ఆధారంగా పిల్లలకు పజిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజేతలకు లీలావతి గిఫ్ట్ హ్యాంపర్తో పాటు వంతారాను సందర్శించి ఆ ఏనుగును, సంరక్షకుడిని కలిసే అవకాశం కల్పించనున్నారు.మానవ–ఏనుగు ఘర్షణలపై అంతర్జాతీయ సహకారంమనుషులకు, ఏనుగులకు మధ్య ఘర్షణలను తగ్గించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎలిఫెంట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ (EPI) ఫౌండేషన్కు వంతారా గ్రాంట్ అందిస్తోంది. 2027 మార్చిలో బ్యాంకాక్లో జరిగే గ్లోబల్ హ్యూమన్–ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ సమ్మిట్, అంతర్జాతీయ హ్యూమన్–వైల్డ్లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కోఎగ్జిస్టెన్స్ సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా దేశాల నిపుణులు, సంరక్షణ కార్యకర్తలు, యువ ప్రతినిధుల భాగస్వామ్యానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.ఆసియా ఏనుగుల పరిధిలోని మొత్తం 13 దేశాల ప్రతినిధులతో పాటు ఆఫ్రికాలోని కనీసం ఐదు దేశాల ప్రతినిధులు, యువ సంరక్షణ కార్యకర్తలకు ఈ కార్యక్రమం ద్వారా అవకాశం లభించనుంది. భారత్లో తొలిసారిగా EPI యూత్ అంబాసిడర్స్ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూడా ఈ సహకారం ఉపయోగపడనుంది.అత్యవసర సేవలకు ఆధునిక సాంకేతికతక్షేత్ర స్థాయిలో మానవ–ఏనుగు ఘర్షణలను ఎదుర్కొనేందుకు వంతారా ర్యాపిడ్ రెస్పాన్స్ వెటర్నరీ బృందాలను, థర్మల్ డ్రోన్ నిఘాను, స్థానిక సమాజాలతో అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. గాయపడిన ఏనుగులకు తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు మనుషులు, ఏనుగులు పరస్పర సహజీవనం సాగించేలా దీర్ఘకాలిక చర్యలను చేపడుతోంది.ఈ సందర్భంగా వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ మాట్లాడుతూ.. ప్రతి ఏనుగుకు ప్రత్యేకమైన కథ ఉంటుందని, వాటి సంక్షేమం పట్ల బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గౌరి రక్షణతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు అనేక ఏనుగుల సంక్షేమం, సంరక్షకులకు మద్దతు, విజ్ఞాన మార్పిడి, అంతర్జాతీయ పరిరక్షణ కార్యక్రమాల వరకు విస్తరించిందని పేర్కొన్నారు. -
రీచార్జ్ షాక్.. నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు
ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు భారతి ఎయిర్టెల్ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరల వద్ద ఉన్న నాలుగు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను కంపెనీ తొలగించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆయా ప్లాన్లను వినియోగిస్తున్న కస్టమర్లు ఇకపై అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ప్యాక్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా రూ.299 ప్లాన్ తొలగింపు వినియోగదారులపై ఎక్కువ ప్రభావం చూపనుంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందించే ఈ ప్లాన్కు బదులుగా ఇప్పుడు రూ.349 ప్యాక్ ప్రధాన ప్రత్యామ్నాయంగా మారింది. ఇందులో రోజుకు 2 జీబీ డేటాతో పాటు ఇతర సాధారణ ప్రయోజనాలు లభిస్తాయి. అంటే గతంలో రూ.299 చెల్లించిన వినియోగదారుడు ఇప్పుడు అదే తరహా నెలవారీ రీచార్జ్ కోసం కనీసం రూ.50 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సుమారు 16.7 శాతం పెరుగుదలకు సమానం.మధ్యస్థ ధరల విభాగంలోనూ ఎయిర్టెల్ కొన్ని ఎంపికలను తగ్గించింది. రూ.579, రూ.619, రూ.649 ప్యాక్లు అందుబాటులో లేకపోవడంతో ఆయా ధరల వద్ద రీచార్జ్ చేసుకునే అవకాశం కస్టమర్లకు తగ్గింది. తాజా నివేదికల ప్రకారం, కొన్ని సర్కిళ్లలో మరికొన్ని ప్లాన్లలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రతి వినియోగదారుడి ఎయిర్టెల్ నంబర్, సర్కిల్ను బట్టి ప్రస్తుతం కనిపించే ప్లాన్లు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది.ఈ పరిణామాన్ని సాధారణ టారిఫ్ పెంపుగా కాకుండా, ఎంపిక చేసిన ధరల విభాగాల్లో ప్లాన్లను పునర్వ్యవస్థీకరించే చర్యగా చూడవచ్చు. చౌకైన ప్యాక్లను తొలగించి తదుపరి ధరల ప్లాన్ల వైపు కస్టమర్లను మళ్లించడం ద్వారా ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచుకోవడం కంపెనీ వ్యూహంలో భాగమై ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
క్యాబ్, ఆటో డ్రైవర్లకు కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే లైసెన్స్పై వేటు!
మహారాష్ట్రలో ఆటో-రిక్షా, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్లను నడిపే వాణిజ్య ప్రయాణికుల వాహన డ్రైవర్లకు మరాఠీ భాషపై ఆచరణాత్మక పరిజ్ఞానం తప్పనిసరి కానుంది. ఇందుకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం మోటార్ వెహికల్స్ రూల్స్లో మార్పులు చేసింది. ఈ నిబంధనలను ఆగస్టు 16, 2026 నుంచి కఠినంగా అమలు చేయనున్నట్లు రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఇప్పటికే ప్రకటించారు.కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులతో ప్రాథమికంగా మాట్లాడేందుకు, వారి అవసరాలను అర్థం చేసుకునేందుకు సరిపడే స్థాయిలో డ్రైవర్కు మరాఠీపై పరిజ్ఞానం ఉండాలి. ఈ నిబంధన కేవలం డ్రైవర్లకే కాకుండా సంబంధిత పర్మిట్ హోల్డర్లకు కూడా వర్తిస్తుంది. మోటార్ వెహికల్స్ రూల్స్లోని 4, 22, 78, 85 నిబంధనలకు చేసిన సవరణల ద్వారా భాషా పరిజ్ఞానాన్ని లైసెన్స్, పర్మిట్కు సంబంధించిన నిబంధనల్లోకి తీసుకొచ్చారు.పాటించకపోతే ఏమవుతుంది?మరాఠీలో కనీస స్థాయి సంభాషణ కూడా చేయలేని డ్రైవర్కు ముందుగా నెల రోజుల గడువు ఇచ్చే విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ గడువులోనూ అవసరమైన భాషా పరిజ్ఞానం సాధించకపోతే డ్రైవింగ్ అనుమతిని మూడు నెలల వరకు సస్పెండ్ చేయవచ్చు. ఆ తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే లైసెన్స్ లేదా సంబంధిత బ్యాడ్జ్ను రద్దు చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే వేలాది మందికి శిక్షణఈ నిబంధన అమలుకు ముందు ప్రభుత్వం డ్రైవర్లకు మరాఠీ నేర్పేందుకు శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టింది. హిందూహృదయసమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మరాఠీ శిక్వాణీ అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మూడు నెలల ఫంక్షనల్ మరాఠీ శిక్షణ పూర్తి చేసినట్లు ఆగస్టు 7న వెల్లడైంది.అంతకుముందు మే 1 నుంచే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, డ్రైవర్లకు భాష నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆగస్టు 15 వరకు 100 రోజుల గడువు ఇచ్చింది. ఈ కాలంలో రాష్ట్రంలోని ఆర్టీవోలు, డిప్యూటీ ఆర్టీవోల పరిధిలో తనిఖీలు, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచే ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుసగా రెండవ రోజు పడిపోయాయి. సెన్సెక్స్ 187.90 పాయింట్లు 0.24 శాతం క్షీణించి 77,966.35 వద్ద, నిఫ్టీ 35.75 పాయింట్లు లేదా 0.15 శాతం క్షీణించి 24,435.95 వద్ద స్థిరపడ్డాయి.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), మాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.18 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ ఐటీ 1.54 శాతం క్షీణించి చెత్త పనితీరు కనబరిచింది. ఇదిలా ఉండగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 2శాతం పెరిగి సహచర రంగాలను అధిగమించింది. -
3,718 యాప్లు బ్లాక్.. రూ.11,158 కోట్లు సేవ్!
సైబర్ నేరాలు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గడిచిన జూన్ 30 నాటికి చట్టవిరుద్ధమైన, మోసపూరిత రుణ యాప్లతో సహా 3,718 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్సభకు తెలిపింది. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRMS) ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.రూ.11,158 కోట్ల నష్టం నివారణ2021లో ప్రారంభమైన సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ ద్వారా ఇప్పటివరకు 32.80 లక్షలకు పైగా సైబర్ మోసం ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా తీసుకున్న చర్యలతో రూ.11,158 కోట్లకు పైగా మోసపూరిత నష్టాన్ని నివారించగలిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. బీజేపీ ఎంపీ పీసీ మోహన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.సిమ్ కార్డులు, ఐఎంఈఐ నంబర్లపై చర్యలుఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69-ఎ, 79(3)(బి) కింద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) చర్యలు చేపట్టింది. పోలీసు అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్రం తెలిపింది.సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఎస్లు, కాలర్ ట్యూన్లు, సోషల్ మీడియా, టెలివిజన్, రేడియోతో పాటు పాఠశాలలు, సినిమాలు, సెలబ్రిటీ ఎండార్స్మెంట్లు, ఐపీఎల్ ప్రచార కార్యక్రమాలను కూడా ప్రభుత్వం వినియోగిస్తోంది.మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు ‘సస్పెక్ట్ రిజిస్ట్రీ’బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో I4C 2024 సెప్టెంబర్లో ‘సస్పెక్ట్ రిజిస్ట్రీ’ని ప్రారంభించింది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి 30.48 లక్షలకు పైగా అనుమానిత ఐడెంటిఫైయర్లు, 32.08 లక్షలకు పైగా లేయర్-1 మ్యూల్ ఖాతాల వివరాలను సంబంధిత సంస్థలతో పంచుకున్నారు. ఈ వ్యవస్థ ద్వారా జూన్ 30, 2026 నాటికి రూ.25,698 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేయగలిగినట్లు ప్రభుత్వం తెలిపింది.ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త మాడ్యూళ్లుసైబర్ క్రైమ్ ఫిర్యాదులను ఏకరీతిగా నిర్వహించేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్-సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను జారీ చేసింది. మోసపూరితంగా తరలించిన నిధుల రికవరీకి తోడ్పడటంతో పాటు స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాలు, తాత్కాలిక లియన్ మార్క్లకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్, గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ ఏప్రిల్ 2026లో ప్రారంభమయ్యాయి. -
యూపీ ప్రభుత్వం గోమూత్రం కొనుగోలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గోశాలల ఆర్థిక స్వావలంబన, ఆయుర్వేద రంగ ప్రోత్సాహం లక్ష్యంగా గోమూత్ర సేకరణ పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రభుత్వ, స్వచ్ఛంద గోశాలల నుంచి గోమూత్రాన్ని సేకరించి ప్రాసెసింగ్ ద్వారా ఆయుర్వేద ఔషధాలు, ప్రాకృతిక ఎరువులు, క్రిమిసంహారకాల తయారీకి ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. గోవుల సంరక్షణ భారాన్ని తగ్గించి గోశాలలను స్వయంసమృద్ధి కేంద్రాలుగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.రైతులు, పశుపోషకుల నుంచి లీటర్ గోమూత్రాన్ని రూ.10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. (భవిష్యత్తులో ఈ ధరను లీటరుకు రూ.20కి పెంచే ప్రతిపాదన కూడా ఉంది). అయితే, ఈ ప్రాజెక్ట్పై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. రాష్ట్రంలో నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్న వీధి పశువుల తీవ్ర సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి పథకాలను తెరపైకి తెస్తోందని సమాజ్వాదీ పార్టీ విమర్శించింది. మౌలిక వసతులు, ఉపాధి వంటి కీలక అంశాలను పక్కనపెట్టి గోమూత్ర సేకరణపై దృష్టి సారించడం పాలనా ప్రాధాన్యతల లోపానికి నిదర్శనమని ఆరోపించింది.ఆర్థిక సంస్కరణా?విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గో ఆధారిత ఉత్పత్తులను (పంచగవ్య) వాణిజ్యపరంగా ప్రోత్సహించడం ఒక వైపు సాంప్రదాయ విధానమే అయినా, దాని అమలు తీరుపై అనేక సవాళ్లు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. సేకరించిన గోమూత్రానికి నాణ్యతా ప్రమాణాలు పాటించడం, శాస్త్రీయ శుద్ధి, సక్రమమైన మార్కెటింగ్ నెట్వర్క్ ఏర్పరచడం ప్రాజెక్ట్ విజయానికి అత్యంత కీలకం.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
డీజిల్లో ఇథనాల్ ప్రయోగం ఫెయిల్
పెట్రోల్ బాటలోనే డీజిల్లోనూ ఇథనాల్ను కలిపి విదేశీ ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి సాంకేతిక విఘాతం ఎదురైంది. డీజిల్లో ఇథనాల్ మిశ్రమం నాణ్యతా ప్రమాణాల పరిధిలోని అత్యంత కీలకమైన ‘ఫ్లాష్ పాయింట్’ (ఇంధనం మండిపోయే కనిష్ఠ ఉష్ణోగ్రత) పరీక్షలో విఫలమైందని కేంద్ర మంత్రి సురేష్ గోపి పార్లమెంట్లో రాతపూర్వకంగా వెల్లడించారు.ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓంఎంసీ) తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ) కేంద్రాలు, గుర్తింపు పొందిన ప్రయోగశాలలు, వాహన తయారీదారుల భాగస్వామ్యంతో దీనిపై శాస్త్రీయ మూల్యాంకనం నిర్వహించాయి. సాధారణ డీజిల్తో పోలిస్తే ఇథనాల్ను కలిపినప్పుడు ఇంధనం ఫ్లాష్ పాయింట్ గణనీయంగా తగ్గిపోతోందని ఈ అధ్యయనంలో తేలింది. స్వచ్ఛమైన డీజిల్కు నిర్దేశించిన సురక్షిత ఫ్లాష్ పాయింట్ ప్రమాణాలను ఇథనాల్ మిశ్రమం అందుకోలేకపోతోంది. సాంకేతికంగా ఫ్లాష్ పాయింట్ తక్కువగా ఉంటే ఇంధనం రవాణా, నిల్వ ప్రక్రియల్లో తీవ్ర ప్రమాదాలు జరగడంతో పాటు ఇంజిన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సాంకేతిక లోపాలను పూర్తిగా నివారించే వరకు డీజిల్లో ఇథనాల్ మిశ్రమాన్ని విస్తృత వినియోగంలోకి తీసుకురావడం సాధ్యపడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ సందర్భంగా డీజిల్లో ఐసోబుటనాల్ కలపడంపై ప్రశ్నించగా.. ప్రస్తుతం ఎలాంటి ఐసోబుటనాల్ మిశ్రమాన్ని వినియోగించడం లేదని మంత్రి తెలిపారు. అలాగే పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతమున్న 20 శాతం (E20) కంటే పెంచే ఆలోచన కూడా లేదని తేల్చిచెప్పారు.అయితే, దేశంలో చమురు కంపెనీల వద్ద పెరుగుతున్న ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, ఎల్పీజీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇథనాల్ను ‘క్లీన్ కుకింగ్ ఫ్యూయల్’(స్వచ్ఛమైన వంట ఇంధనం)గా ఉపయోగించడంపై కేంద్రం అధ్యయనం చేస్తోంది. ఇండియన్ ఆయిల్, హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం భాగస్వామ్యంలోని ఎల్పీజీ ఇక్విప్మెంట్ రీసెర్చ్ సెంటర్ దీనికి సంబంధించిన ఆవిష్కరణలపై పనిచేస్తోంది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
ఐటీ ఉద్యోగులకు గట్టి షాక్
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ ఐటీ ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి వేగంగా మళ్లుతున్న వేళ వ్యయ నియంత్రణే లక్ష్యంగా మరో విడత భారీ ఉద్యోగాల తొలగింపునకు ప్రణాళికలు రచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే (మే 31 నాటికి) కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతం మందికి (సుమారు 21,000 మంది) లేఆఫ్స్ ప్రకటించింది. దీనివల్ల ఒరాకిల్ ప్రపంచవ్యాప్త సిబ్బంది సంఖ్య 1,62,000 నుంచి 1,41,000కు పడిపోయింది. ఈ కోతలకు పునర్వ్యవస్థీకరణ ఖర్చుల కింద కంపెనీ ఏకంగా 1.8 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది.సెప్టెంబరు నాటికి మరో విడత సిద్ధం!తాజా నివేదికల ప్రకారం, కంపెనీ మేనేజర్లకు నోటీసులు అందిస్తూ బాధితుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 1 నాటికల్లా కొన్ని విభాగాల్లో డబుల్ డిజిట్ (10 శాతానికి పైగా) స్థాయిలో ఉద్యోగులకు గుడ్బై చెప్పేందుకు ఒరాకిల్ ప్రణాళిక రూ పొందించినట్లు సమాచారం.ఏఐ రేసులో భారీ పెట్టుబడులుఈ భారీ లేఆఫ్స్కు ప్రధాన కారణం కంపెనీ ఏఐ మౌలిక సదుపాయాల కోసం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్సే. ఎన్విడియా ప్రాసెసర్లు, ఆధునిక డేటా సెంటర్ల నిర్మాణానికి ఒరాకిల్ బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల కోసం ఒరాకిల్ గతంలో 43 బిలియన్ డాలర్ల రుణాలు స్వీకరించింది. దాంతో కంపెనీ మొత్తం అప్పు 129.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా డేటా సెంటర్ లీజులు 260 బిలియన్ డాలర్లకు పెరిగాయి.ఏఐ వల్లే ఇదంతా..ఒరాకిల్ ఇటీవలే అమెరికన్ మార్కెట్ రెగ్యులేటర్ ఎస్ఈసీకి సమర్పించిన వార్షిక నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. కంపెనీ అంతర్గత నిర్వహణలో కృత్రిమ మేధ సాంకేతికతల వాడకం విస్తరించడం వల్లే సిబ్బంది తగ్గించాల్సి వస్తోందని చెప్పింది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగవచ్చని అంగీకరించింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా!
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్లో ఊహించని నాయకత్వ పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఆగస్టు 18న జరగనున్న అత్యంత కీలకమైన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ముందు ఈ వార్త బయటకు రావడం కార్పొరేట్ వర్గాలను విస్తుపోయేలా చేసింది. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 2027 వరకు ఉన్న తన ప్రస్తుత పదవీ కాలాన్ని పూర్తి చేస్తానని, ఆ తర్వాత మళ్లీ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తదుపరి సారథి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ఆయన బోర్డును కోరినట్లు సమాచారం.ట్రస్ట్ – బోర్డు మధ్య వ్యూహాత్మక విభేదాలుగత కొంతకాలంగా టాటా సన్స్ ప్రధాన వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్(నోయెల్ టాటా నేతృత్వంలో)కు, డైరెక్టర్ల బోర్డుకు మధ్య నూతన వ్యాపారాల పనితీరు, మూలధన కేటాయింపులపై లోతైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరొక ఐదేళ్లు పొడిగించే అంశంపై బోర్డులో ఏకాభిప్రాయం కుదరకపోవడం, అలాగే టాటా సన్స్ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయకూడదనే షరతులతో పాటు బోర్డు ప్రాతినిధ్యంపై ఇరువర్గాల మధ్య విభేదాలు ముదిరాయి. పదేపదే మళ్లీ తెరపైకి వస్తున్న అంతర్గత వివాదాల కంటే గౌరవంగా తప్పుకోవడమే మేలని చంద్రశేఖరన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.సరికొత్త ఎత్తులకు చేరిన సంస్థ2016లో సైరస్ మిస్త్రీ నిష్క్రమణ తర్వాత 2017 ప్రారంభంలో టాటా సన్స్ మొదటి నాన్-ఫ్యామిలీ, నాన్-పార్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్, గ్రూప్ను నూతన శిఖరాలకు తీసుకెళ్లారు. టీసీఎస్ సీఈఓ స్థాయి నుంచి గ్రూప్ సారధిగా ఎదిగిన ఆయన హయాంలో కంపెనీ రాబడి, నికర లాభాలు గణనీయంగా పెరిగాయి. ఎయిరిండియా పునరుద్ధరణ, డిజిటల్ వ్యాపారాల విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ముందంజ వంటివి ఆయన దార్శనికతకు నిదర్శనాలు. అయితే ఇటీవల కాలంలో ఎయిరిండియాపై రెగ్యులేటరీ నిఘా, బ్రిటన్లో జాగువార్ ల్యాండ్ రోవర్పై సైబర్ దాడి, టీసీఎస్ ఎదుర్కొంటున్న మార్కెట్ ఒత్తిళ్లు కొంత సవాలుగా మారాయి.కుదేలైన స్టాక్ ధరలుఈ వార్త విస్తరించడంతోనే దలాల్ స్ట్రీట్లో తీవ్ర అలజడి రేగింది. టాటా గ్రూప్నకు చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రధానంగా గ్రూప్ ఫ్లాగ్షిప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు అత్యధికంగా 4.1 శాతం పతనమవ్వగా, టాటా మోటార్స్, టాటా స్టీల్ సహా ఇతర అనుబంధ సంస్థలు నష్టాలను చవిచూశాయి. 2024 చివర్లో రతన్ టాటా కన్నుమూసిన నాటి నుంచి గ్రూప్లో అంతర్గత విభేదాలు ముదురుతుండటం, ఇప్పుడు చంద్రశేఖరన్ వైదొలగడం 400 బిలియన్ డాలర్ల సామ్రాజ్యానికి కొత్త నాయకత్వ సవాలును తెచ్చిపెట్టింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
గాల్లోనే నిలిచిపోయిన ఇంజిన్
కోల్కతా నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో గాల్లో ఉండగానే తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. విమానం చెన్నై విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా ఎడమ వైపు ఇంజిన్ నిలిచిపోయింది. దీంతో పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించి ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానంలో 224 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. అయినప్పటికీ పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అలర్ట్ అయిన విమానాశ్రయ బృందాలుకోల్కతా (సీసీయూ) నుంచి చెన్నై (ఎంఏఏ) బయలుదేరిన ఇండిగో 6E-723 విమానం మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయం సమీపంలోకి రాగానే ఎడమ ఇంజిన్ విఫలమైంది. రాత్రి 11:29 గంటలకు పైలట్ అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరడంతో చెన్నై ఎయిర్పోర్ట్ అథారిటీ వెంటనే స్పందించి విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ అమలు చేసింది. రన్-వే 25 వద్ద ఫైర్ ఇంజిన్లు, వైద్య బృందాలు, అత్యవసర రెస్క్యూ వాహనాలను సిద్ధంగా ఉంచారు.ఒక్క ఇంజిన్తోనే సురక్షిత ల్యాండింగ్అన్ని భద్రతా చర్యల మధ్య రాత్రి 11:37 గంటలకు పైలట్ ఒకే ఇంజిన్ సాయంతో విమానాన్ని రన్-వే 25పై క్షేమంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 224 మంది సురక్షితంగా కిందకు దిగడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ సజావుగా సాగడంతో రాత్రి 11:47 గంటలకు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అనంతరం సాధారణ విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.డీజీసీఏ దర్యాప్తుఈ సాంకేతిక వైఫల్యంపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. గాల్లో ఉండగా ఇంజిన్ ఆగిపోవడానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు సాంకేతిక నిపుణుల బృందం విమానాన్ని పరిశీలిస్తోంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటామని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
నయా భారత్.. నగరాల హవా!
భారతదేశంలో వేగంగా చోటుచేసుకుంటున్న జనాభా మార్పులు రాబోయే దశాబ్దాల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్గా మారనున్నాయి. పని చేస్తున్న జనాభా పెరుగుదుల, విస్తరిస్తున్న మధ్యతరగతి, వేగవంతమైన పట్టణీకరణ కలసి వినియోగ రంగాన్ని, విద్యుత్తు, ఇంధన అవసరాలను మెరుగైన స్థాయికి తీసుకెళ్తున్నాయి.వినియోగ వైఖరిలో మార్పులుగతంలో కేవలం ప్రాథమిక అవసరాలకే పరిమితమైన భారతీయ కుటుంబాల వ్యయం, ప్రస్తుతం మెరుగైన జీవనశైలి, ప్రీమియమైజేషన్ వైపు మళ్లుతోంది. 2030 నాటికి దేశంలో పట్టణ జనాభా దాదాపు 40 శాతానికి (సుమారు 60 కోట్లు) చేరనుండటంతో పాటు మధ్యతరగతి గృహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధాన మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్-2, టైర్-3 నగరాలు (కన్జ్యూమర్ సిటీస్) సరికొత్త వినియోగ కేంద్రాలుగా అవతరిస్తున్నాయి. డిజిటల్ నెట్వర్క్, ఎలక్ట్రానిక్స్, వాహనాలు, గృహోపకరణాలు, క్విక్ కామర్స్ వ్యాపారాల్లో వృద్ధి నమోదువుతోంది.ఇంధన రంగానికి సవాళ్లు.. పెట్టుబడుల అవకాశాలుపట్టణీకరణ పెరగడంతో ఇళ్లలో ఏసీలు, డిజిటల్ పరికరాలు, రవాణా రంగంలో వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది దేశీయ విద్యుత్తు డిమాండ్ను రికార్డు స్థాయికి తీసుకెళ్తోంది. ఈ భారీ డిమాండ్ను అందుకోవడానికి సంప్రదాయ విద్యుత్తు వ్యవస్థలతో పాటు సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. 2036 నాటికి పట్టణ మౌలిక వసతుల కల్పనకు సుమారు 840 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని ఆర్థిక రంగానికి చెందిన అధికారిక అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.భారతదేశ జనాభా అనుకూలత దేశానికి లభించిన ఒక గొప్ప ఆర్థిక అవకాశమని నిపుణులు చెబుతున్నారు. అయితే, పెరుగుతున్న వినియోగం, ఇంధన డిమాండ్కు అనుగుణంగా గ్రిడ్ ఆధునీకరణ, క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, సుస్థిర మౌలిక సదుపాయాలను సకాలంలో నిర్మించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలి. సరైన ప్రణాళికలు అమలైతేనే ఈ జనాభా పరిణామం వికసిత్ భారత్ స్వప్నానికి బలమైన పునాదిగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’ -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు తగ్గి 24,428 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 127 పాయింట్లు నష్టపోయి 78,030 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.86బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 89.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.32 శాతం తగ్గింది.నాస్డాక్ 0.6 శాతం నష్టపోయింది.Today Nifty position 12-08-2026(time: 9:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టాటా సన్స్లో నాయకత్వ సంక్షోభం
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్లో మరోసారి నాయకత్వ ఘర్షణలు బహిర్గతమవుతున్నాయి. ఆగస్టు 18న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కంటే ముందే టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.విభేదాలకు ప్రధాన కారణాలురతన్ టాటా అనంతరం టాటా ట్రస్ట్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నోయెల్ టాటాకు, చంద్రశేఖరన్కు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఎయిరిండియా, టాటా డిజిటల్, ఎలక్ట్రానిక్స్ వంటి కొత్త వ్యాపారాల్లో పురోగతి స్తంభించడం, పెరిగిన నష్టాలపై నోయెల్ టాటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. చంద్రశేఖరన్ డైరెక్టర్ పదవి పొడిగింపుపై పూర్తిస్థాయి మద్దతు ఇచ్చేందుకు నోయెల్ టాటా సుముఖంగా లేరని, మరో ఐదేళ్లకు బదులుగా కేవలం రెండేళ్ల కాలాన్ని మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఏజీఎంలో ఓటింగ్ ద్వారా వివాదాస్పదంగా తప్పుకోవడం కంటే ముందే గౌరవప్రదంగా రాజీనామా చేయాలని చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు చెబుతున్నారు.చట్టపరమైన ప్రాధాన్యత.. చిక్కులుఈ వివాదానికి మరింత సంక్లిష్టతను చేకూర్చింది మహారాష్ట్ర చారిటీ కమిషనర్ నిర్ణయం. పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ ఉల్లంఘనల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ‘సర్ రతన్ టాటా ట్రస్ట్’ ఎలాంటి కీలక సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. టాటా సన్స్లో దాదాపు 66% వాటా కలిగిన ట్రస్టుల ప్రతినిధులు లేకుండా ఏజీఎం నిర్వహణ, ఓటింగ్ చెల్లుబాటుపై చట్టపరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2017లో సైరస్ మిస్త్రీ నిష్క్రమణ తర్వాత టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్, గ్రూప్ను ఆధునిక సాంకేతిక, ఏవియేషన్ రంగాల వైపు విజయవంతంగా నడిపించారు. ఒకవేళ ఆయన ఏజీఎంకు ముందే తప్పుకుంటే గ్రూప్ షేర్లపై తాత్కాలిక ఒత్తిడి పెరగడంతో పాటు మళ్లీ కొత్త చైర్మన్ అన్వేషణ ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’ -
వందే భారత్లో ప్రయాణించిన నిర్మలా సీతారామన్
బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ నుంచి రాజస్థాన్లోని జైపూర్కు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో పయనం అయ్యారు. ‘రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ ప్రాతిపదికన జైపూర్లో ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది.ఈ ప్రయాణంలో భాగంగా రైలులోని సహ ప్రయాణికులతో మంత్రి నేరుగా ముచ్చటించారు. ప్రత్యేకించి మీడియా ఎడ్యుకేషన్ అభ్యసిస్తున్న విద్యార్థులు, యువ జర్నలిస్టులతో ఆమె సంభాషించారు. అంతర్జాతీయ భూరాజకీయాలు (జియోపాలిటిక్స్), భారత ఆర్థిక వ్యవస్థ, ప్రాధాన్య రంగాలు, యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆకాంక్షలపై వారితో చర్చించారు. దేశ విధాన నిర్ణేతతో నేరుగా అభిప్రాయాలు పంచుకునే అవకాశం దక్కడంపై యువకులు సంతోషం వ్యక్తం చేశారు.During the train journey, two students pursuing post graduation in media studies, and two young media professionals also accompanied FM Smt. @nsitharaman to Jaipur.The four youngsters had freewheeling discussion with the Union Finance Minister on geopolitics, economy, and… https://t.co/I0T8QDzEYY pic.twitter.com/eU5zCAq21s— Ministry of Finance (@FinMinIndia) August 11, 2026ఒకపక్క ఉన్నతస్థాయి దౌత్య సమావేశానికి వెళ్తూనే వందే భారత్లో ప్రయాణించి ప్రయాణికులతో, యువతతో మమేకం కావడం మంత్రి విలక్షణ శైలిని ప్రతిబింబిస్తోందని కొందరు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించింది.ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’ -
గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్, డెరివేటివ్లకు కొత్త రూల్స్
దేశీయ మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గోల్డ్, సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్), బులియన్ డెరివేటివ్లకు భద్రతగా ఉండే భౌతిక బంగారం, వెండి నిల్వల నిర్వహణపై కీలక సంస్కరణలు చేపట్టింది. 2021 నాటి సెబీ (వాల్ట్ మేనేజర్స్) నిబంధనల పరిధిని విస్తరిస్తూ తాజాగా ఒక సమగ్ర ప్రతిపాదనా పత్రాన్ని విడుదల చేసింది.ప్రస్తుతం కేవలం ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) వ్యవస్థకు మాత్రమే పరిమితమైన వాల్ట్ మేనేజర్ల నిబంధనలను ఇకపై సెబీ పరిధిలోకి వచ్చే అన్ని పసిడి, వెండి ఈటీఎఫ్లు, కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్టుల వెనుక ఉన్న భౌతిక బులియన్ నిల్వలకు కూడా వర్తింపజేయాలని భావిస్తోంది. (డిజిటల్గా లేదా స్టాక్ మార్కెట్లో గోల్డ్/సిల్వర్ ఈటీఎఫ్లు లేదా కమోడిటీ కాంట్రాక్టులు కొన్నప్పుడు ఆ పెట్టుబడికి సమానమైన అసలైన భౌతిక బంగారాన్ని లాకర్లలో(వాల్ట్) సురక్షితంగా ఉంచాల్సి ఉంటుంది. అలా ఉంచే సెక్యూరిటీ సంస్థలనే వాల్ట్ మేనేజర్లు అంటారు).ముఖ్యమైన సంస్కరణలుమ్యూచువల్ ఫండ్స్, కమోడిటీ ఎక్స్ఛేంజీలు భద్రపరిచే భౌతిక బంగారం, వెండి నాణ్యతా పరిశీలన, ఆడిటింగ్, డిజిటలైజేషన్, సెక్యూరిటీ విధానాల్లో కఠినమైన ఏకరూపత ఏర్పడుతుంది.వాల్ట్ మేనేజర్లను నేరుగా సెబీ నియంత్రణ పరిధిలోకి తీసుకురావడం వల్ల భౌతిక నిల్వల నిర్వహణలో వ్యత్యాసాలు, అక్రమాలకు తావుండదు. ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు స్టోరేజ్ భద్రతపై మరింత నమ్మకాన్ని ఇస్తుంది.స్వదేశీ ఎక్స్ఛేంజీల స్పాట్ ధరలను వర్తింపజేసేందుకు సెబీ ఇప్పుడు భౌతిక నిల్వల భద్రతలోనూ సమగ్ర పారదర్శకత తీసుకొస్తోంది.ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల వేళ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల్లో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం, ఆస్తుల పరిమాణం నిత్యం మారుతోంది. ఈ నేపథ్యంలో సెబీ తీసుకొస్తున్న నిబంధనల విస్తరణ భారతీయ బులియన్ మార్కెట్ల స్థిరత్వానికి, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు కీలకమైన అడుగుగా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై వాటాదారులు, మార్కెట్ వర్గాల నుంచి సెబీ ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది.ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’ -
తప్పుల్ని టెక్నాలజీకి ఆపాదించొద్దు
ముంబై: బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడళ్లను రూపొందించేటప్పుడు, నిర్ణయాలపై అర్థవంతమైన మానవ పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలని బ్యాంకర్లకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. తప్పుడు నిర్ణయాలకు టెక్నాలజీ టూల్స్ను నిందించడం ఆర్బీఐకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ జరిగిన వార్షిక ‘ఫిబాక్’ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు మానవ విచక్షణను ఏఐతో భర్తీ చేస్తే సరిపోదని, నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే విధంగా ఏఐని సరైన రీతిలో వినియోగించుకోవాలని బ్యాంకులను కోరారు.ఏఐని అదుపులో పెట్టాల్సిన ఒక రిసు్కలా కాకుండా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన సామర్థ్యంగానే ఆర్బీఐ పరిగణిస్తోందని మల్హోత్రా చెప్పారు. కాబట్టి బ్యాంకులు ప్రేక్షక పాత్రకు పరిమితం కాకుండా, ఈ టూల్స్ను అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ఒక బ్యాంకు తీసుకునే నిర్ణయానికి అంతిమ బాధ్యత దానిదే కావాలి తప్ప విక్రేతదో లేదంటే ఆల్గారిథమ్దో కాకూడదు. ఏఐ మోడల్ నిర్ణయం తీసుకుందని మనం చెప్పలేం. వినియోగదారుడికైనా, అదేవిధంగా బ్యాంకుకైనా అది ఎప్పటికీ ఆమోదయోగ్యమైన సమాధానం కాదు’ అని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. కస్టమర్ సర్వీసులతో సహా వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఈ మధ్య పలు భారతీయ బ్యాంకులు ఏఐ టూల్స్ను భారీగా వాడుకోవడం, ఏఐ వల్ల కొంత కాలానికి వివిధ రంగాల్లో ఉద్యోగ కోతలు తప్పవన్న ఆందోళనల నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సైబర్ సెక్యూరిటీ రిసు్కలు పొంచి ఉన్నాయ్... సైబర్ సెక్యూరిటీ రిసు్కలతో సహా ఏఐ వల్ల బ్యాంకింగ్ రంగానికి తలెత్తే ముప్పుల పట్ల బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ఇటీవల ఒక ఏఐ మోడల్ స్వయంగా సిస్టమ్పై దాడి చేసిన సంఘటనను ఆయన ఉదహరించారు. ఏఐ మోడళ్లు పక్షపాత ధోరణితో వ్యవహరించే రిస్కులు కూడా ఉంటాయన్నారు. ముఖ్యంగా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలు, హోదాలు, అదేవిధంగా కొన్ని వర్గాల పట్ల ఇష్టం, అయిష్టం చూపించే ధోరణులు ఉండొచ్చని ఆయన హెచ్చరించారు. డేటా గోప్యత అనేది కేవలం చట్టపరమైన నిబంధనలను పాటించడానికే పరిమితం కాకుండా చూసుకోవాలన్నారు. బ్యాంకుల్లో వాస్తవంగా ఎలాంటి ఏఐ మోడళ్లు పనిచేస్తున్నాయనేది ఆర్బీఐకి తెలియాలని, కాబట్టి ఆయా మోడల్స్కు సంబంధించిన పూర్తి జాబితాను నిర్వహించాలని కూడా బ్యాంకులకు మల్హోత్రా సూచించారు. -
ఈ–టూవీలర్లకు ‘పీఎం’ స్కీము పొడిగింపు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ’పీఎం ఈ–డ్రైవ్’ స్కీము గడువును 2028 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. అయితే, దీనిపై ఇచ్చే సబ్సిడీని రూ. 5,000 నుంచి (కిలోవాట్హవర్కి – కేడబ్ల్యూహెచ్) సగానికి రూ. 2,500కి తగ్గించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 2025 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ప్రతి కేడబ్ల్యూహెచ్ సామర్థ్యానికి రూ. 2,500 మేర సబ్సిడీ పొందవచ్చు. ఒక్కో వాహనంపై సబ్సిడీ గరిష్టంగా రూ. 5,000 ఉంటుంది.గతంలో, అంటే, 2024–25 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ ప్రతి కేడబ్ల్యూహెచ్కి రూ. 5,000గాను, గరిష్ట పరిమితి రూ. 10,000గాను ఉంది. తాజా ప్రోత్సాహకాన్ని పొందాలంటే ఈ–టూవీలర్ ఎక్స్–ఫ్యాక్టరీ రేటు గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలుగా ఉంటుంది. ఈ స్కీము తాజా విడత కోసం కేంద్రం రూ. 2,767 కోట్లు కేటాయించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు అమలయ్యే పీఎం ఈ–డ్రైవ్ పథకానికి మొత్తం రూ. 11,900 కోట్లు వెచ్చిస్తోంది. -
పసిడి తగ్గేదేలే..
న్యూఢిల్లీ: ఆయిల్ రేట్లు అంతర్జాతీయంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ బులియన్పై పెట్టుబడులకు సంబంధించి ట్రేడర్ల నుంచి గణనీయంగా డిమాండ్ నెలకొనడంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ ర్యాలీ కొనసాగించి, మంగళవారం ఏకంగా రెండు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,57,200కి చేరింది. గత 6 ట్రేడింగ్ సెషన్లలో బంగారం రేటు రూ. 9,800 (సుమారు 6.65%) పెరిగింది. మరోవైపు, వెండి కూడా అదే ధోరణిలో కేజీకి ఇంకో రూ. 2,000 పెరిగి రూ. 2,42,000కి చేరింది. ఇది కూడా దాదాపు 2 నెలల గరిష్ట స్థాయి.


