Business
-
మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు!
పశ్చిమాసియాలోని యుద్ధ భయం భారత్లో మందుబాబుల పాలిట శాపంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలు మన దేశంలోని మద్యం బాటిళ్ల ధరలను పెంచేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వీటి ధరలు పెరగకపోయినా సమీప భవిష్యత్తులో మద్యం మరింత ప్రియం కానుందని కొందరు భావిస్తున్నారు.బాటిళ్ల తయారీకి గ్యాస్ సెగమద్యం తయారీలో ముడిసరుకు కంటే ప్యాకేజింగ్ ఖర్చే ఇప్పుడు కంపెనీలకు భారంగా మారింది. దీనికి ప్రధాన కారణం సహజ వాయువు. మద్యం బాటిళ్లు తయారు చేసే గాజు ఫర్నెస్లను(కొలిమి) నిరంతరం మండించాలంటే గ్యాస్ తప్పనిసరి. బీర్ తయారీ ఖర్చులో ప్యాకేజింగ్ వాటా సుమారు 40% కాగా, స్పిరిట్స్ (విస్కీ, బ్రాండీ తదితరాలు)లో ఇది 20% వరకు ఉంటుంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సహజ వాయువు దిగుమతిదారు అయిన భారత్ తన అవసరాల కోసం 40% వరకు ఖతార్ పైనే ఆధారపడుతోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే అది నేరుగా గాజు బాటిళ్ల ఉత్పత్తిపై దెబ్బకొడుతుంది.ధరల పెరుగుదల ఎంత ఉండవచ్చు?ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ (ఐఎండబ్ల్యూఏ) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రాజేష్ చోప్రా అంచనా ప్రకారం, కేవలం గ్యాస్ ధరల వల్లే గాజు బాటిళ్ల ధర 15-20% పెరిగింది. దీనికి అదనంగా షిప్పింగ్ ఛార్జీలు తోడవ్వడంతో కంపెనీలు బ్రాండ్ల వారీగా 10-15% ధరల సవరణ కోరుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లలో ఈ ప్రభావం తక్షణమే కనిపించనుంది.బీర్ కొరత పొంచి ఉందా?వేసవి కాలం బీర్లకు గరిష్ట డిమాండ్ ఉండే సమయం. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో సరఫరా తగ్గితే వినియోగదారులు ఇబ్బందులు పడక తప్పదు. ‘గ్యాస్ లభ్యత తగ్గితే గాజు ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవు. ఫలితంగా బాటిళ్ల కొరత ఏర్పడి పీక్ సీజన్లో డిమాండ్కు తగ్గ సరఫరా ఉండకపోవచ్చు’ అని మెడుసా బేవరేజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్దీప్ సింగ్ హెచ్చరించారు. ప్రస్తుతం పరిశ్రమ ఇప్పటికే 12-13 కోట్ల బాటిళ్ల వార్షిక కొరతను ఎదుర్కొంటోంది. అల్యూమినియం ధరలు కూడా 15% పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.ఇన్వెంటరీయే రక్షణ కవచంప్రస్తుతానికి కొన్ని కంపెనీలు ముందస్తు జాగ్రత్తలతో గండం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. రాడికో ఖైతాన్ కంపెనీకి సొంత పవర్ ప్లాంట్ ఉండటం వల్ల ఇంధన ధరల అస్థిరత నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. అలైడ్ బ్లెండర్స్ తమ వద్ద ఒకటిన్నర నెలలకు సరిపడా గాజు బాటిళ్ల స్టాక్ ఉందని, ఇది తక్షణ షాక్ నుంచి కాపాడుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
బ్యాంకుల మార్జిన్లు డీలా
దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో స్థానిక కరెన్సీ లిక్విడిటీని పెంచేందుకు ఆర్బీఐ తీసుకునే చర్యలతో బ్యాంకుల మార్జిన్లపై ఒత్తిడి పెరగనున్నట్లు గ్లోబల్ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. మరోపక్క రూపాయిలో హెచ్చుతగ్గుల నివారణకు తీసుకునే చర్యలతో లిక్విడిటీ ప్రయత్నాలు మందగించవచ్చని తెలియజేసింది. అయితే బ్యాంకుల ప్రత్యక్ష విదేశీ కరెన్సీ రిసు్కలు మాత్రం పరిమితంకానున్నట్లు అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి(2026–27) బ్యాంకింగ్ రంగ మార్జిన్లు 0.2–0.3 శాతంమేర క్షీణించవచ్చని తెలియజేసింది. పశ్చిమాసియాలో ఆందోళనలు కొనసాగితే నిధుల సమీకరణ వ్యయాలు పెరిగి ప్రస్తుత అంచనాలు 3.1 శాతానికంటేలోపునకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నిర్వహణా లాభ/రిస్క్ వెయిటెడ్ అసెట్స్(ఆర్డబ్ల్యూఏలు) 0.3–0.4 శాతంమేర నీరసించవచ్చని తెలియజేసింది. ప్రస్తుత అంచనాలు 2.5 శాతంలో క్షీణత కనిపించవచ్చని అభిప్రాయపడింది. డిపాజిట్ వ్యయాలపై..బేస్కేస్ ప్రకారం తగినంత లిక్విడిటీ కారణంగా డిపాజిట్ వ్యయాలు తగ్గనున్నాయి. 2024 నుంచి ఆర్బీఐ కీలక రెపో రేటులో 1.25 శాతం కోత పెట్టినప్పటికీ 2026కల్లా 0.44 శాతమే డిపాజిట్ రేట్లకు బదిలీ అయినట్లు ఫిచ్ ప్రస్తావించింది. డిపాజిట్లను మించుతున్న రుణ వృద్ధి కారణంగా డిపాజిట్ల సమీకరణలో పోటీ పెరిగినట్లు వెల్లడించింది. వెరసి డిపాజిట్ రేట్లలో మరిన్ని సర్దుబాట్లకు అవకాశమున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్లు, ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల ద్వారా ఆర్బీఐ 2024–25 ద్వితీయార్థంలో లిక్విడిటీని నిలకడగా పంప్చేసినట్లు ప్రస్తావించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని కొనసాగించేందుకు క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు ఆర్బీఐ సంకేతాలిచ్చినట్లు తెలియజేసింది. అయితే కరెన్సీ ఒత్తిళ్లు కొనసాగితే లిక్విడిటీ చర్యలు పరిమితంకానున్నట్లు పేర్కొంది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా 2026 మార్చి29కల్లా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మిగులు డిపాజిట్లలో 0.5 శాతానికి చేరినట్లు వెల్లడించింది. ఫిబ్రవరిలో ఇది 0.8 శాతంకాగా.. రూపాయి సైతం 4.5 శాతం పతనమైనట్లు పేర్కొంది. రూపాయి ఒత్తిళ్లు కొనసాగితే బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ నిలిపేందుకు ఆర్బీఐకున్న అవకాశాలు తగ్గిపోనున్నట్లు వివరించింది. ఇందుకు తీసుకునే చర్యలు బ్యాంకింగ్ వ్యవస్థలో స్థానిక కరెన్సీ లిక్విడిటీని దెబ్బతీస్తుందని తెలియజేసింది. రూపాయి హెచ్చుతగ్గులు దేశీ బ్యాంకులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవని, బ్యాంకింగ్ రంగంలో విదేశీ రుణాలు సైతం 10 శాతానికంటే తక్కువేనని తెలియజేసింది. ఈ బాటలోనే తాజాగా 100 మిలియన్ డాలర్లకుపైన ఫారెక్స్ పొజిషన్లకు తెరవేయమని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించింది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
అసంఘటిత రంగంలో ఉపాధి మెరుగు
అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు 2025లో 6.18 శాతం పెరిగి 12,80,51,800కు చేరాయి. గతేడాది 74.52 లక్షల కొత్త అవకాశాలు వచ్చాయి. ఇందులో 35 లక్షల ఉపాధి అవకాశాలు ఇతర సేవల విభాగంలో ఏర్పడ్డాయి. ఈ వివరాలను అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (ఆసుసే) నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఈ వార్షిక సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 2023 అక్టోబర్ చివరికి ఈ రంగలో ఉపాధి అవకాశాలు 12,05,99,800గానే ఉన్నాయి.అసంఘటిత రంగంలో సంస్థల సంఖ్య 7.34 కోట్ల నుంచి 7.92 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఇతర సేవల విభాగంలో సంస్థల సంఖ్య 10.29 శాతం పెరిగింది. ఆ తర్వాత తయారీ రంగంలో 6.48 శాతం, వాణిజ్య విభాగంలో 6.18 శాతం చొప్పున కొత్త సంస్థలు అవతరించాయి. ఆర్థిక పనితీరును సూచించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) 10.87 శాతం ఎగిసింది. ట్రేడ్ విభాగంలో 16.77 శాతం, తయారీలో 8.52 శాతం, సేవల విభాగంలో 7.36 శాతం మేర జీవీఏ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. ఇతర సేవల విభాగం వాటా జీవీఏలో 42 శాతంగా ఉంటే, ట్రేడ్ విభాగం 37 శాతం, తయారీ 21 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఒక్కో కారి్మకుడి జీవీఏ (కార్మికుల ఉత్పాదకత) 2023–24లో ఉన్న రూ.1,49,742 నుంచి రూ.1,56,539కు చేరింది. అన్ఇన్కార్పొరేటెడ్ అంటే వ్యవసాయేతర రంగాల్లోని ప్రైవేటు సంస్థలతో కూడినది కావడం గమనార్హం. మహిళా సంస్థల్లో వృద్ధి..మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు 2023–24లో 26.2 శాతంగా ఉంటే, 2025లో 27 శాతానికి పెరిగాయి. ఒక్కో ఉద్యోగికి చెల్లించే వేతనం గతేడాది 3.88 శాతం పెరిగింది. ముఖ్యంగా ట్రేడ్ విభాగంలో కారి్మకుల వేతనం అత్యధికంగా 8.5 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్ను వినియోగించే సంస్థల సంఖ్య సైతం 26.7 శాతం నుంచి 39.4 శాతానికి పెరిగాయి. వ్యాపార నిర్వహణలో టెక్నాలజీ స్వీకరణను ఇది తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 6,70,289 సంస్థల డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
మొబైల్ డేటా జోరు
దేశీయంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరుగుతోంది. 2024లో ప్రతి యూజరు నెలకు సగటున 27.5 జీబీ వినియోగించగా 2025లో ఇది 31 జీబీకి పెరిగింది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వార్షిక మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్ (ఎంబీఐటీ) 13వ ఎడిషన్ ప్రకారం గత ఐదేళ్లలో డేటా వినియోగం వార్షిక ప్రాతిపదికన 18 శాతం మేర వృద్ధి చెందింది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ అప్లికేషన్స్, 4కే వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్లాంటి అవసరాల కోసం డేటాకి డిమాండ్ గణనీయంగా పెరిగింది. 2025లో భారత్లో మొత్తం డేటా ట్రాఫిక్ ప్రతి నెలా 27 ఎక్సాబైట్స్కి (ఈబీ) చేరింది. సంఖ్యాపరంగా 5జీ యూజర్లకు సంబంధించి భారత్.. ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.మరిన్ని విశేషాలు..డేటా ట్రాఫిక్ వృద్ధికి ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) కూడా కీలకంగా ఉంటోంది. మొత్తం 5జీ డేటాలో ఈ విభాగం వాటా 25 శాతం పైగా ఉంది. వార్షికంగా 5జీ ఎఫ్డబ్ల్యూఏ సబ్స్క్రైబర్స్ సంఖ్య రెండు రెట్లు పెరిగింది.5జీ వినియోగం వేగవంతంగా పెరుగుతుండటం, ఏఐ ఆధారిత యాప్స్ ప్రభావంతో భారత్లో మొబైల్ బ్రాడ్బ్యాండ్ విభాగం కొత్త దశలోకి అడుగుపెడుతోంది.5జీ వినియోగంలో మెట్రో సర్కిల్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆయా మార్కెట్లలో మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్లో 58 శాతం వాటా 5జీ టెక్నాలజీదే ఉంటోంది.యాక్టివ్ 4జీ డివైజ్ల సంఖ్య 2025లో 89.2 కోట్లకు చేరింది. ఇందులో 5జీ సామర్థ్యాలు ఉన్న డివైజ్ల సంఖ్య 38.3 కోట్లుగా ఉంది. బడ్జెట్ 5జీ ఫోన్ల (100 డాలర్ల లోపు ధర) సంఖ్య పది రెట్లు పైగా వృద్ధి చెందింది. గతేడాది విక్రయించిన 90 శాతం స్మార్ట్ ఫోన్లు 5జీని సపోర్ట్ చేస్తాయి.రాబోయే రోజుల్లో 2031 నాటికి భారత్లో 5జీ సబ్స్క్రయిబర్స్ సంఖ్య 100 కోట్ల స్థాయిని దాటుతుందని అంచనా.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
పుష్కరకాలం తర్వాత రూపాయి భారీ ర్యాలీ
బ్యాంకుల డాలర్–రూపాయి ఫార్వర్డ్ ట్రేడింగ్ను నియంత్రించేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకోవడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 152 పైసలు బలపడి 93.18 వద్ద ముగిసింది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 94.62 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 188 పైసలు బలపడి 92.82 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. గడిచిన 12 ఏళ్లల్లో ఒకరోజులో ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి.‘ఫారెక్స్ మార్కెట్లో మార్పులను సమీక్షించిన తర్వాత ఆర్బీఐ కొన్ని నియంత్రణ చర్యలు ప్రకటించింది. రూపాయికి సంబంధించిన నాన్–డెలివరబుల్ డెరివేటివ్ కాంట్రాక్టులను రెసిడెంట్, నాన్–రెసిడెంట్ వినియోగదారులకు అందించకుండా బ్యాంకులను ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అలాగే, ఈ ఆదేశాల తర్వాత రద్దు చేసిన ఎలాంటి ఫారెక్స్ డెరివేటివ్ కాంట్రాక్టులను అయినా మళ్లీ బుక్ చేసుకోవడాన్ని కూడా పరిమితం చేసింది. దీనివల్ల డాలర్లకున్న కృత్రిమ డిమాండ్ తగ్గడంతో రూపాయికి బలం చేకూరింది’ అని మీరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ నిపుణుడు అనుజ్ చౌదరీ తెలిపారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ సోర్స్ కోడ్ లీక్! -
సిమ్ బైండింగ్ గడువు పొడిగింపు
వాట్సాప్, టెలిగ్రాం, సిగ్నల్లాంటి మొబైల్ మెసేజింగ్ యాప్లను తప్పనిసరిగా సిమ్తో అనుసంధానం చేసేందుకు విధించిన డెడ్లైన్ని కేంద్రం డిసెంబర్ 31 వరకు పొడిగించింది. పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిమ్ బైండింగ్ నిబంధన ప్రకారం మొబైల్లో సిమ్ యాక్టివ్గా ఉంటేనే మెసేజింగ్ ప్లాట్ఫాంలు సర్వీసులు అందించాల్సి ఉంటుంది.2025 నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆపరేటర్లు దీన్ని ఫిబ్రవరి 26 నుంచి అమలు చేసి, మార్చి 28 నాటికి టెలికం శాఖకు నివేదికనివ్వాలి. సాధారణంగా సిమ్ని తొలగించినా, డీయాక్టివేట్ చేసినా లేదా విదేశాలకు వెళ్లిపోయినా, దానితో ముడిపడి ఉన్న ఇన్స్టంట్ మెసేజింగ్, కాలింగ్ యాప్లు పని చేస్తూనే ఉండటాన్ని అలుసుగా తీసుకుని సైబర్క్రిమినల్స్ నేరాలకు పాల్పడుతున్నారు. వాటిని అడ్డుకునేందుకే తాజా నిబంధనను ఉద్దేశించారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ సోర్స్ కోడ్ లీక్! -
ఆంత్రోపిక్ సోర్స్ కోడ్ లీక్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కొత్త సాంకేతికతలతో దూసుకుపోతున్న ఆంత్రోపిక్ వరుస భద్రతా లోపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వారం వ్యవధిలోనే రెండోసారి అంతర్గత కోడింగ్ సమాచారం లీక్ అవ్వడం టెక్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. తాజాగా కంపెనీకి చెందిన అత్యంత కీలకమైన కోడింగ్ సాధనం ‘క్లాడ్ కోడ్’కు సంబంధించిన సోర్స్ కోడ్ లీక్ అయినట్లు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది.ఏం జరిగింది?ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ తాజా సంఘటనలో క్లాడ్ కోడ్కు అనుసంధానించిన దాదాపు 1,900 ఫైళ్లలో 5,00,000 లైన్ల కోడ్ లీక్ అయింది. సాఫ్ట్వేర్ ప్యాకేజింగ్, డెప్లాయిమెంట్ సమయంలో జరిగిన సాంకేతిక లోపం వల్ల ఈ డేటా బయటకు వచ్చింది. గత వారమే కంపెనీకి చెందిన ‘మైథోస్’ అనే రహస్య ఏఐ మోడల్ వివరాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కోడింగ్ టూల్ సోర్స్ కోడ్ బయటకు రావడం కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. అయితే, ఈ లీక్ వల్ల కస్టమర్ డేటా లేదా గోప్యమైన క్రెడెన్షియల్స్ ఏవీ బహిర్గతం కాలేదని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.లీక్ అయిన కోడ్ ప్రాముఖ్యతలీకైన ఫైళ్లలో ‘ఏజెంటిక్ హార్నెస్’ అని పిలవబడే కీలకమైన సాఫ్ట్వేర్ లేయర్ భాగాలు ఉన్నాయి. ఇది ఏఐ మోడల్ ఇతర సిస్టమ్లతో, టూల్స్తో ఎలా అనుసంధానం చెందాలో, భద్రతా విధానాలను ఎలా అమలు చేయాలో నియంత్రిస్తుంది. ఎంటర్ప్రైజ్ క్లయింట్లు ఉపయోగించే ఈ టూల్ అంతర్గత నిర్మాణం బయటపడటం ఆందోళన కలిగించే అంశం.లోపం ఎక్కడ జరిగింది?ఈ ఘటన వెనుక ఎటువంటి సైబర్ దాడి లేదని, ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమేనని ఆంత్రోపిక్ పేర్కొంది. డెవలపర్ ప్లాట్ఫారమ్కు ‘కంపైల్డ్ వెర్షన్’ అప్లోడ్ చేయాల్సి ఉండగా పొరపాటున ఫుల్ సోర్స్ ప్యాకేజీని అప్లోడ్ చేయడం వల్ల ఇలా జరిగిందని తెలిపింది. దీనివల్ల సాధారణంగా కంపెనీ పరిధిలోనే ఉండాల్సిన అంతర్గత కోడ్, పబ్లిక్ యాక్సెస్లోకి వెళ్లిపోయింది.భద్రత సవాళ్లుకోర్ ఏఐ మోడల్ లీక్ కానప్పటికీ దాని పరిధిలోని సిస్టమ్ డిజైన్ బయటపడటం వల్ల ప్రమాదం పొంచి ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు ఈ కోడ్ను అధ్యయనం చేయడం ద్వారా ఆంత్రోపిక్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ను అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఏపీఐ డెవలప్మెంట్ తీరు తెలిస్తే హ్యాకర్లు లేదా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆ రక్షణ లేయర్లను సులువుగా దాటవచ్చు.‘ఏఐ సిస్టమ్స్ మరింత శక్తివంతంగా మారుతున్న తరుణంలో వాటి భద్రతపై కఠినమైన నిఘా అవసరమని ఈ ఘటన గుర్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నా’ అని ఆంత్రోపిక్ ప్రతినిధి తెలిపారు.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
పెట్రోకెమికల్ ఉత్పత్తులపై సుంకం మినహాయింపు
న్యూఢిల్లీ: కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను తాత్కాలికంగా (జూన్ 30 వరకు) మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. మెథనాల్, అనిహిడ్రస్ అమ్మోనియా, టోల్యూన్, స్టైరిన్, డైక్లోరో మెథేన్ (మెథిలిన్ క్లోరైడ్), వినిల్ క్లోరైడ్ మోనోమర్, పాలీ బూటాడీన్, స్టైరిన్ బూటాడీన్, అన్శాచురేటెడ్ పాలిస్టర్ రెజిన్లను సుంకాల్లేకుండా దిగుమతి చేసు కోవచ్చు. ఈ నిర్ణయం ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, టెక్స్టైల్స్తోపాటు ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, ఆటో విడిభాగాల తయారీ సంస్థలకు ఉపశమనం కల్పించనుంది. పశ్చిమాసియా సంక్షోభంతో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తుల సరఫరా స్థిరంగా ఉండేందుకు ప్రభుత్వ నిర్ణయం సాయం చేయనుంది. ఈ చర్యతో ప్రభుత్వ ఖజానాపై రూ.1,800 కోట్ల భారం పడినప్పటికీ.. ధరలస్థిరత్వానికి, ఉత్పత్తి, సరఫరా కొనసాగేందుకు సాయపడుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి సభ్యుడు సంజయ్ మంగల్ తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో వినియోగదారులపై ఈ భారం పడకుండా.. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తాజాగా తగించడం తెలిసిందే. -
క్రాష్ టు బౌన్స్బ్యాక్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనం నుంచి అనూహ్యంగా కోలుకొని స్వల్ప లాభంతో ముగిసింది. ఐటీ, బ్యాంకుల షేర్లలో బలమైన కొనుగోళ్లు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి గణనీయమైన రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇంట్రాడేలో 1,588 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 185 పాయింట్ల లాభంతో 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడే కనిష్టం నుంచి 530 పాయింట్లు కోలుకుంది. ఆఖరికి 34 పాయింట్లు పెరిగి 22,713 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా 4.67%, జపాన్ 2.43%, ఇండోనేసియా 2.24%, తైవాన్ 1.85% క్షీణించాయి. చైనా, హాంగ్కాంగ్ 1%, సింగపూర్ అరశాతం నష్టపోయాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ ఇండెక్సులు అరశాతం పతనమయ్యాయి. బ్రిటన్ సూచీ 1% పెరిగింది. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో భారీ క్రాష్: రానున్న 2–3 వారాల్లో ఇరాన్పై భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ హెచ్చరికలు, క్రూడాయిల్ ధరలు ఎగసిపడటం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ ఉదయం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 1,588 పాయింట్లు కుప్పకూలి 71,546 వద్ద, నిఫ్టీ 497 పాయింట్లు క్షీణించి 22,183 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. రికవరీ కారణాలు ఇవే: ఆర్బీఐ నియంత్రణ చర్యలతో డాలర్ మారకంలో రూపాయి విలువ గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 152 పైసలు బలపడింది. మిడ్ సెషన్ నుంచి ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన లార్జ్క్యాప్ షేర్లలో వాల్యూ బయింగ్ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం (71,546) నుంచి 2023 పాయింట్లు ఎగసి 73,569 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇంట్రాడే కనిష్టం (22,183) నుంచి 600 పాయింట్లు ర్యాలీ చేసి 22783 వద్ద గరిష్టాన్ని అందుకుంది.సాయి పేరెంటరల్స్ లిస్టింగ్ సక్సెస్ఫార్మాస్యూటికల్ కంపెనీ సాయి పేరెంటరల్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర (రూ.392)తో పోలిస్తే బీఎస్ఈలో 3% ప్రీమియంతో రూ.405 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 6.17% పెరిగి రూ.416 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 3.67% లాభంతో రూ.406 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,795.44 కోట్లుగా నమోదైంది.→ పవర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ పవరికా లిస్టింగ్లో నిరాశపరిచింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.395)తో పోలిస్తే 7.34% డిస్కౌంటుతో రూ.366 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 365 – 397 శ్రేణిలో ట్రేడైంది. చివరికి 2.53% నష్టంతో రూ.385 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,872 కోట్లుగా నమోదైంది.→ బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్ చంద్ జగదీష్ కుమార్(ఎక్స్పోర్ట్స్) పేలవంగా లిస్టయింది. బీఎస్లో ఇష్యూ ధర (రూ.212)తో పోలిస్తే 8% డిస్కౌంటుతో రూ.195 వద్ద లిస్టయ్యింది. రోజంతా నష్టాల్లో ట్రేడవుతూ చివరికి 11% పతనంతో రూ.189 వద్ద ముగిసింది. -
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కార్లు ఇవే..
2026 మొదలై మూడు నెలలు పూర్తయిపోయింది. ఈ కాలంలో లెక్కకు మించిన కార్లను దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇంకొన్ని వాహనాలను లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కథనంలో ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.ఫోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్లిఫ్ట్ఫోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్లిఫ్ట్ ఏప్రిల్ 9న లాంచ్ కానుంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సరికొత్త స్టైలింగ్తో వస్తుంది. ఇందులో అప్డేటెడ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్ఈడీ హెడ్లైట్లు, మెరుగైన ఇంటీరియర్స్ వంటివి ఉన్నాయి. అప్డేటెడ్ క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఇది బలమైన పోటీ ఇవ్వనుంది.టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ అందించే.. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానుంది. ఇది లేటెస్ట్ డిజైన్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్ పొందుతుంది. దీనిని కొనుగోలుదారులు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు సిటీ, హైవే డ్రైవ్ కోసం చాలా అద్భుతంగా ఉంటుందని సమాచారం.ఎంజీ మెజెస్టర్ఎంజీ మెజెస్టర్ కారు కూడా ఈ నెలలో లాంచ్ అయ్యే పాపులర్ కార్ల జాబితాలో ఒకటి. ఇది ఏడీఏఎస్, మసాజ్ సీట్లు, పనోరమిక్ సన్రూఫ్ వంటి వాటితో పాటు.. కొత్త ఇన్ఫోటైన్మెంట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ పొందనుంది. ఆఫ్-రోడ్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది.2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ కూడా లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇది కూడా అప్డేటెడ్ స్టైలింగ్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో సరికొత్త డాష్బోర్డ్, మెరుగైన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సేఫ్టీ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఇది సాధారణ బ్రేజ్జా కంటే కూడా మంచి పనితీరును అందిస్తుందని సమాచారం.మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్ట్మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్ట్.. లేటెస్ట్ టెక్నాలజీ, అప్గ్రేడ్ ఇంటీరియర్లను పొందుతుంది. ఇంజన్ ఆప్షన్లు దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఎస్యూవీ ప్రీమియం సౌకర్యం, మెరుగైన ఇన్ఫోటైన్మెంట్ ఉండనున్నాయి. కాబట్టి ఇది విలాసవంతమైన హంగులతో కూడిన.. గొప్ప పనితీరును ఇష్టపడే కొనుగోలుదారులకు ఇది ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు! -
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..
నాలుగైదు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం ఓ మోస్తరుగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి భారీగా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఒకింత ఆనందాన్ని కలిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ.1,38,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి రూ.1,36,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,51,420 రూపాయల నుంచి 148970 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు ఎంతలా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర 149120 రూపాయల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద ఉంది. ఉదయం ఈ ధరలు వరుసగా రూ.151570, రూ. 138950 వద్ద ఉన్నాయి.చెన్నైలో కూడా సాయంత్రానికి బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,50,000 వద్ద ఉంది. 22 క్యారెట్ల రేటు 137500 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ రేటు రూ.10000 తగ్గడంతో సిల్వర్ రూ.2.55 లక్షల వద్దకు చేరింది. ఈ రేటు ఢిల్లీలో 2.50 లక్షల రూపాయల వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరంలో వెండి రేటు కొంత తక్కువే.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు! -
2025–26లో 47 లక్షల వెహికల్స్..
గత ఆర్థిక సంవత్సరం (2025–26) రికార్డు స్థాయిలో 47 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీల అత్యుత్తమ పనితీరుతో పాటు ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో జీఎస్టీ 2.0 అమలు వాహన విక్రయాలను మరింత వేగవంతం చేసింది.కొత్త ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వేగాన్ని కొనసాగించాలని ఆటోమొబైల్ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే పశి్చమాసియా యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు, కమోడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలు పెరిగితే డిమాండ్ తగ్గొచ్చని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ 24,22,713 యూనిట్లను విక్రయించింది. 2024–25లో అమ్మకాలు 22,34,266గా ఉన్నాయి. -
భారతి ఎయిర్టెల్ రికార్డ్.. 65 కోట్ల యూజర్స్!
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది వినియోగదారుల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో చందాదారుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ టెలికాం కంపెనీ.. భారతదేశంలో మాత్రమే కాకుండా, ఆఫ్రికా అంతటా బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. GSMA ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. ఒక్క ఇండియాలో ఎయిర్టెల్కు 368 మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ద్వారా అనుసంధానించి 13 మిలియన్ల గృహాలు, దాని డిజిటల్ టీవీ సేవలను ఉపయోగించే 15 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.Bharti Airtel, the world’s second largest telecom operator by customer base, has crossed 650 million customers globally.— Bharti Airtel (@airtelnews) April 2, 2026ఆఫ్రికాలో.. ఎయిర్టెల్ ఆఫ్రికా 14 దేశాలలో 179 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ ప్రాంతంలో కంపెనీ హై-స్పీడ్ డేటా, వాయిస్ సేవలు, మొబైల్ మనీ పరిష్కారాలను అందిస్తుండగా, 52 మిలియన్లకు పైగా వినియోగదారులు దీని ఆర్థిక సేవల ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉన్నారు.ఎయిర్టెల్ సాధించిన ఈ విజయాన్ని గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. 65 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడం ఒక పెద్ద బాధ్యత. కొత్త ఆవిష్కరణలు, విశ్వసనీయమైన సేవల ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై కంపెనీ దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. టెలికాం పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడమే ఎయిర్టెల్ లక్ష్యమని ఆయన తెలిపారు. -
ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!
చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఇదేబాటలో దిగ్గజ సంస్థ ఒరాకిల్ కూడా అడుగులువేసింది. ఈ ప్రభావం ఏకంగా 30వేలమంది ఎంప్లాయిస్ మీద పడుతుంది. ఇందులో 12000 ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వారికి లభించే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒరాకిల్ తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు చెందినవారు ఉన్నారు. లేఆఫ్స్ ప్రక్రియలో అనేక మంది ఉద్యోగులు ఒక్కసారిగా తమ సిస్టమ్ యాక్సెస్ కోల్పోయి, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జాబ్ కోల్పోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు రెడ్దిట్ ద్వారా వెల్లడించారు. ఇందులోనే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కూడా వివరించారు.''కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల ప్రాథమిక జీతం చెల్లిస్తారు. అదనంగా.. వాడని సెలవుల మొత్తాన్ని నగదుగా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగి తొలగింపు సమయంలో నోటీస్ పీరియడ్కు బదులుగా ఒక నెల జీతం కూడా అందజేస్తారు. ఉద్యోగి అర్హత ఉన్నట్లయితే గ్రాచ్యుటీ కూడా లభిస్తుంది. ఇంకా.. తొలగింపు తేదీ వరకు ఉన్న పెండింగ్ జీతం కూడా పూర్తిగా చెల్లిస్తారు'' అని ఒక ఉద్యోగి పేర్కొన్నారు.కంపెనీ నుండి రెండు నెలల అదనపు ఎక్స్గ్రేషియా (ప్రత్యేక పరిహారం) కూడా లభిస్తుంది. అయితే.. ఈ మొత్తం పొందడానికి ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం అనే ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన షరతుగా కనిపిస్తోంది. అలాగే సుమారు రూ.20,000 వరకు ఇన్సూరెన్స్, ఒక నెల గార్డెనింగ్ లీవ్ జీతం లేదా దానికి సమానమైన పరిహారం కూడా ఇవ్వనున్నట్లు మరికొందరు ఉద్యోగులు వెల్లడించారు.ఇదీ చదవండి: ప్రాపర్టీ అమ్మేసిన బాలీవుడ్ నటుడు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే? -
జియో హిట్ ప్లాన్: అన్లిమిటెడ్ బెనిఫిట్స్!
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారి కోసం జియోలో ఓ పాపులర్ హిట్ ప్లాన్ అందుబాటులో ఉంది. అదే రూ. 349 ప్లాన్.ప్లాన్ వివరాలుజియో అందిస్తున్న ఈ రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా మొబైల్ సేవలను ఆస్వాదించవచ్చు.డేటా ధమాకాఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని డేటా ప్రయోజనాలే. ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజుల కాలపరిమితిలో వినియోగదారులకు మొత్తం 56 GB డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత కూడా తక్కువ వేగంతో ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యం ఉంటుంది.అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్డేటాతో పాటు, ఈ ప్లాన్ ద్వారా దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి. లోకల్, ఎస్టీడీ కాలింగ్స్ కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. -
రికార్డ్: ఒక్క నెలలో రూ. 29.53 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పండుగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు తదితర అంశాల నేపథ్యంలో ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు మార్చిలో రికార్డు స్థాయికి ఎగిశాయి. ఏకంగా రూ. 29.53 లక్షల కోట్ల విలువ చేసే 2,264 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.గతేడాది మార్చిలో నమోదైన రూ. 24.77 లక్షల కోట్లతో పోలిస్తే విలువపరంగా 19 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 26.84 లక్షల కోట్ల విలువ చేసే 2,039 కోట్ల లావాదేవీలు రికార్డయ్యాయి. డిజిటల్ చెల్లింపులు ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాయనడానికి ఇది నిదర్శనమని పేనియర్బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 85 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా యూఏఈ, సింగపూర్ తదితర ఏడు దేశాల్లో ఇది అందుబాటులో ఉంది. -
ఇంకా పూర్తిగా వెనక్కిరాని పెద్ద నోట్లు!
చలామణీలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో దాదాపు 98.45 శాతం వెనక్కి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. 2023 మే 19న ప్రకటించిన ఈ నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పుడు రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు చలామణీలో ఉండగా 2026 మార్చి 31 నాటికి ఇది రూ. 5,501 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆర్బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసుల్లో పెద్ద నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. అలాగే తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇండియా పోస్ట్ ద్వారా కూడా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించవచ్చు. -
ఉత్తర కొరియా కిమ్ ‘దొంగ ప్రయాణం’!
ఉత్తర కొరియా ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి సోషల్ మీడియాలో ఒక పాత కథనం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. చిన్నతనంలో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరుడితో కలిసి జపాన్లోని ప్రసిద్ధ 'టోక్యో డిస్నీల్యాండ్'ను సందర్శించడానికి నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించారనే వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం, 1991 మే నెలలో అప్పటికి కేవలం ఎనిమిదేళ్ల వయసున్న కిమ్ జోంగ్ ఉన్, తన సోదరుడు కిమ్ జోంగ్ చుల్తో కలిసి జపాన్లోకి అడుగుపెట్టారు. వీరు తమ గుర్తింపును దాచిపెట్టి, బ్రెజిలియన్ పాస్పోర్ట్లను ఉపయోగించి ఈ ప్రయాణం చేసినట్లు సమాచారం. కిమ్ జోంగ్ ఉన్ 'జోసెఫ్ ప్వాగ్' అనే మారుపేరుతో ఈ పత్రాలను సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.బ్రెజిల్ పాస్పోర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు?కిమ్ కుటుంబం బ్రెజిలియన్ పాస్పోర్ట్లను ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్రెజిల్లో విభిన్న జాతుల ప్రజలు నివసిస్తారు. కాబట్టి, తూర్పు ఆసియా దేశాలకు చెందిన వారు బ్రెజిలియన్ పౌరులుగా చలామణి అవ్వడం సులభం. దీనివల్ల విమానాశ్రయాల్లో భద్రతా అధికారులకు అనుమానం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.ఈ సోదరులిద్దరితో పాటు దాదాపు 10 మంది ఉత్తర కొరియా అధికారుల బృందం కూడా జపాన్లో పర్యటించినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జపాన్లో ఉన్న వీరు, టోక్యో డిస్నీల్యాండ్ను పలుమార్లు సందర్శించి అక్కడ గడిపినట్లు యోమియురి షింబున్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు గతంలోనే నివేదించాయి. ఆ సమయంలో జపాన్ భద్రతా అధికారులు వీరిని గుర్తించడంలో విఫలమయ్యారు. వారు దేశం విడిచి వెళ్లిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.సవతి సోదరుడికి తప్పని ఇబ్బందులుకిమ్ జోంగ్ ఉన్ ఈ పర్యటనను విజయవంతంగా ముగించినప్పటికీ, 2001లో ఇదే తరహా ప్రయత్నం చేసిన ఆయన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ మాత్రం అడ్డంగా దొరికిపోయారు. డొమినికన్ రిపబ్లిక్ నకిలీ పాస్పోర్ట్తో టోక్యో డిస్నీల్యాండ్కు వెళ్లే ప్రయత్నంలో నరిటా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని దేశం నుండి బహిష్కరించారు.ఈ సంఘటన వల్లనే కిమ్ జోంగ్ నామ్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వద్ద నమ్మకాన్ని కోల్పోయారని, ఫలితంగా ఉత్తర కొరియా తదుపరి వారసుడిగా కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వార్త, ఉత్తర కొరియా పాలకుల వ్యక్తిగత జీవితం, వారి రహస్య పర్యటనలపై మరోసారి చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by im just culture (@imjustculture) -
నష్టాల నుంచి లాభాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 182.26 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 73,316.58 వద్ద, నిఫ్టీ 33.70 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 22,713.10 వద్ద నిలిచాయి.రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, ఓరియంటల్ ట్రైమెక్స్ లిమిటెడ్, బ్రూక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్పోర్ట్) లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బిగ్ రిలీఫ్.. ఐటీ శాఖ కీలక నిర్ణయం
పెట్టుబడిదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 2017 ఏప్రిల్ 1కి ముందు చేసిన పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే ఆదాయానికి జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ (గార్) వర్తించవని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది.సవరించిన ఆదాయపన్ను చట్టం నిబంధనలు, 2026 కింద.. 2017 ఏప్రిల్ 1కు ముందు చేసిన పెట్టుబడులను బదిలీ చేసినప్పుడు వచ్చిన ఆదాయం గార్ పరిధిలోకి రాదని పేర్కొంది. గార్, గ్రాండ్ ఫాదరింగ్కు మధ్య గందరగోళాన్ని తాజా ప్రకటన తొలగిస్తుందని ఏకేఎం గ్లోబల్ పార్ట్నర్, పన్ను నిపుణుడు సందీప్ సెహగల్ పేర్కొన్నారు. పాత పెట్టుబడులకు రక్షణ ఉంటుందని స్పష్టం చేసినట్టు చెప్పారు.గార్ను మొదటగా 2012–13 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. విదేశీ పెట్టుబడిదారులు పన్ను తప్పించుకునే ప్రయత్నాలను అరికట్టడమే దీని లక్ష్యం. అయితే ఈ నిబంధనలపై పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనడంతో అమలు ఆలస్యమైంది. చివరకు 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచి్చంది. అదే సమయంలో పాత పెట్టుబడులకు ‘గ్రాండ్ఫాదరింగ్’ రక్షణ కల్పించారు. ‘టైగర్ గ్లోబల్’ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత గార్ అమలుపై సందిగ్ధత ఏర్పడింది.2018లో ఫ్లిప్కార్ట్ షేర్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీబీడీటీ తాజా నోటిఫికేషన్తో 2017కు ముందు పెట్టుబడులపై లాభాలు భవిష్యత్తులో కూడా గార్కు లోబడవని స్పష్టం చేసింది. మొత్తంగా ఈ నిర్ణయం విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. -
ఆ కార్ల శకం ముగిసింది.. మస్క్ ట్వీట్!
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సీఈఓ ఎలాన్ మస్క్ ధృవీకరించారు. ఈ కార్ల కోసం ఇకపై ఆర్డర్స్ తీసుకోబోమని, ఇక్కడ డెలివరీ చేయాల్సిన 600 కార్లు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''టెస్లా మోడల్ S, X మోడల్స్ ఆర్డర్లు ముగిశాయి. స్టాక్లో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక శకం ముగింపును సూచించడానికి మేము ఒక అధికారిక కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. నాకు ఆ కార్లంటే చాలా ఇష్టం. 14 సంవత్సరాల క్రితం ఉత్పత్తి ప్రారంభోత్సవంలో నేను ఇలా ఉన్నాను'' అని మస్క్ ట్వీట్ చేసారు.జనవరిలో జరిగిన టెస్లా 2025 క్యూ4 ఆదాయాల సమావేశంలో మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ ఉత్పత్తి నిలిపివేత వార్త వెలువడింది. ఆ సమయంలో.. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లకు ఇది ఒక "గౌరవప్రదమైన ముగింపు" అని ఆ బ్రాండ్ పేర్కొంది. ఇదే సమయంలో.. అవకాశం ఉన్నప్పుడే కార్లను ఆర్డర్ చేయమని మస్క్ వినియోగదారులను కోరారు. కార్ల కోసం కేటాయించిన ఫ్యాక్టరీ స్థలాన్ని ఆప్టిమస్ రోబోట్ల ఉత్పత్తి కోసం మార్చనున్నట్లు కూడా ఆ బ్రాండ్ వెల్లడించింది.Custom orders of the Tesla Model S & X have come to an end. All that’s left are some in inventory.We will have an official ceremony to mark the ending of an era. I love those cars. This was me at production launch 14 years ago: pic.twitter.com/6kvCf9HTHc— Elon Musk (@elonmusk) April 1, 202614 సంవత్సరాల మార్కెట్మోడల్ S అనేది సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని టెస్లా రూపొందించిన మొదటి వాహనం, దీనిని జూన్ 2012లో విడుదల చేశారు. ఇది 2015, 2016 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.కేవలం 2015లోనే 50,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. మోడల్ Xను 2015లో పరిచయం చేశారు. ఈ రెండు మోడళ్లు కలిసి, వాటి ఉత్పత్తి కాలమంతటా 610,000కు పైగా డెలివరీలను సాధించాయి. -
ఆఫీస్ అమ్మేసిన సల్మాన్ ఖాన్ తమ్ముడు
సినీతారలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే కొందరు అవకాశం వచ్చినప్పుడు స్థలాలు, భూములు, ఇల్లు కొనుగోలు చేసి.. తమకు అవసరం వచ్చినప్పుడు విక్రయిస్తుంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని అంధేరి వెస్ట్లో ఉన్న ఒక కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని విక్రయించారు.రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. సోహైల్ ఖాన్ రూ. 5.90 కోట్లకు ఆఫీస్ స్పేస్ విక్రయించారు. ఇది లింక్ రోడ్లోని ఆర్క్ వన్ భవనంలో 1559 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మూడు కార్ పార్కింగ్ స్థలాలతో పాటు కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని బిల్కిష్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించారు.ఈ లావాదేవీ మార్చి 27, 2026న నమోదయ్యాయి. దీనికి గాను రూ.35.40 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. 2025 అక్టోబర్లో, సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను రూ. 22 కోట్లకు విక్రయించారు. సద్గురు డెవలపర్స్ అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ కార్పెట్ భవనంలో ఉన్న ఈ ఆస్తి, సుమారు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్మెంట్లో తొమ్మిది పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. దీనిని శివాయ సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించారు. -
40 పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం రద్దు!
పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న వేళ భారత ప్రభుత్వం దేశీయ పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు కీలక అడుగు వేసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల దేశీయ పరిశ్రమలు కుదేలు కాకుండా చూసేందుకు 40 రకాల కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం పూర్తిగా మాఫీ చేసింది. ఏప్రిల్ 2, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మినహాయింపు జూన్ 30, 2026 వరకు కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.ఎందుకు ఈ నిర్ణయం?ప్రపంచ పెట్రోకెమికల్ మార్కెట్కు పశ్చిమాసియా కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ముడి పదార్థాల లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రభావం నేరుగా భారత తయారీ రంగంపై పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ‘ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో అవసరమైన ముడి పదార్థాల ధరలను స్థిరీకరించడం ద్వారా దేశీయ తయారీదారులకు రక్షణ కల్పించడమే మా ప్రాథమిక లక్ష్యం’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.ప్రయోజనం పొందే రంగాలు, ఉత్పత్తులుఈ సుంకాల మాఫీ ప్రధానంగా పారిశ్రామిక ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచే ప్రాథమిక ముడి పదార్థాలు, అధునాతన పాలిమర్లపై దృష్టి సారించింది. అందులో.. మిథనాల్, మోనోథిలిన్ గ్లైకాల్, ఫినాల్, ఎసిటిక్ ఆమ్లం, పాలిథిలిన్, పాలీప్రొపైలిన్, పాలీస్టైరిన్, పీవీసీ, ఎపోక్సీ రెసిన్లు, పాలీకార్బోనేట్లు, పీఈటీ చిప్స్ ఉన్నాయి.లాభపడే పరిశ్రమలుప్లాస్టిక్స్, ప్యాకేజింగ్టెక్స్టైల్ఫార్మాస్యూటికల్స్ఆటోమోటివ్విస్తృత ఆర్థిక వ్యూహంఈ నిర్ణయం పరిశ్రమలకు రాయితీ ఇవ్వడంతోపాటు దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టే ముందస్తు చర్య అని నిపుణులు చెబుతున్నారు. పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు పెరిగితే అది నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటి ధరల పెరుగుదలకు దారితీస్తుంది. సుంకాల రద్దు ద్వారా ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోగలుగుతుంది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
ఒక్క ఉద్యోగమూ పోదు.. దుబాయ్ కంపెనీ అధినేత హామీ
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉద్యోగుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలకు దుబాయ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సాజన్ తెరదించారు. తన సంస్థలో పనిచేస్తున్న 6,000 మందికి పైగా ఉద్యోగులకు ఆయన కొండంత అండగా నిలిచారు. ఈ క్లిష్ట సమయంలో ఎవరి ఉద్యోగానికి డోకా లేదని, అందరికీ సకాలంలో వేతనాలు అందుతాయని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.కుటుంబంలా అండగా ఉంటాంఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిజ్వాన్ సాజన్ స్పందిస్తూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. "మా 6,000 మందికి పైగా ఉద్యోగులు మమ్మల్ని విశ్వసించి, డానుబే గ్రూప్ను ఇటుక ఇటుక పేర్చి నిర్మించారు. నేడు వారికి అండగా నిలవడం నా కనీస బాధ్యత. మా గ్రూప్లో ఎటువంటి తొలగింపులు ఉండవు, అందరికీ జీతాలు సకాలంలో అందుతాయి" అని ఆయన ప్రకటించారు.ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇది 6,000 మంది ఉద్యోగుల విషయం మాత్రమే కాదు, 6,000 కుటుంబాల జీవనాధారం. మీరు నిజమైన నాయకుడు" అంటూ నెటిజన్లు ఆయనను కొనియాడుతున్నారు.హార్డ్వేర్ షాప్ నుంచి బిలియనీర్ స్థాయికి..రిజ్వాన్ సాజన్ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 1993లో కేవలం కొన్ని వేల దిర్హామ్లతో దుబాయ్లో అడుగుపెట్టిన ఆయన, మొదట ఒక హార్డ్వేర్ దుకాణంలో పనిచేశారు. 1993లోనే 'డానుబే' పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. 2014లో 'డానుబే ప్రాపర్టీస్'ను స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించారు. ఆయన సంస్థ నేడు సుమారు 5.13 బిలియన్ దిర్హామ్ల వార్షిక ఆదాయాన్ని గడిస్తోంది. దుబాయ్తో పాటు భారత్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, చైనా దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఇటీవల దుబాయ్లో 55 అంతస్తుల వాణిజ్య టవర్ను నిర్మించి, దానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పేరు పెట్టడం విశేషం. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ప్రకటించిన "2025 టాప్ 10 అత్యంత ప్రభావవంతమైన రియల్ ఎస్టేట్ లీడర్స్" జాబితాలో రిజ్వాన్ సాజన్ చోటు సంపాదించుకున్నారు. సంక్షోభ సమయాల్లో కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో, రిజ్వాన్ సాజన్ తీసుకున్న ఈ నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. View this post on Instagram A post shared by Rizwan Sajan (@rizwan.sajan) -
హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?
వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబంతోనో, స్నేహితులతోనో కలిసి రెస్టారెంట్కు వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణం. భోజనం ముగించి బిల్లు చేతికి రాగానే అన్నీ సరి చూసుకుంటాం. కానీ అందులో ‘సర్వీస్ ఛార్జీ’ పేరుతో అదనంగా 5 నుంచి 10 శాతం వరకు బిల్లులో వసూలు చేస్తుండడం గమనించే ఉంటారు. ఇది తప్పనిసరి అని హోటల్ సిబ్బంది వాదించవచ్చు, లేదా మీ అనుమతి అడగకుండానే బిల్లులో వేసేయవచ్చు. అసలు ఈ సర్వీస్ ఛార్జీని కస్టమర్లు కచ్చితంగా చెల్లించాలా? చట్టం ఏం చెబుతోంది? వంటి అంశాలను చూద్దాం.సర్వీస్ ఛార్జీ ‘ట్యాక్స్’ కాదు!చాలామంది వినియోగదారులు సర్వీస్ టాక్స్ (సేవా పన్ను)కు, ‘సర్వీస్ ఛార్జీ’కి మధ్య ఉన్న తేడా తెలియక అయోమయానికి గురవుతుంటారు. జీఎస్టీ అనేది ప్రభుత్వం విధించే చట్టబద్ధమైన పన్ను. ఇది ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా చెల్లించాలి. సర్వీస్ ఛార్జీ అనేది రెస్టారెంట్ యాజమాన్యం తమ సిబ్బంది సేవలకు గుర్తింపుగా (టిప్కు బదులుగా) విధించే రుసుము. ఇది ప్రభుత్వానికి వెళ్లే పన్ను కాదు. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) మార్గదర్శకాల ప్రకారం, సర్వీస్ ఛార్జీ అనేది పూర్తిగా ఆప్షనల్. కస్టమర్ అనుమతి లేకుండా దీన్ని బిల్లులో చేర్చడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనే అవుతుంది.రెస్టారెంట్లు ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదు?కొన్ని రెస్టారెంట్లు తమ మెనూ కార్డులో ‘మేము సర్వీస్ ఛార్జీ విధిస్తాం’ అని రాసి ఉండవచ్చు. అయితే, కేవలం మెనూ కార్డులో రాసి ఉన్నంత మాత్రాన దాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదు. సర్వీస్ ఛార్జీ చెల్లించలేదని కస్టమర్ను వేధించడం, సర్వీస్ నిరాకరించడం లేదా రెస్టారెంట్లోకి రాకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధం. వారి సర్వీసు నచ్చకపోతే లేదా మీకు ఇష్టం లేకపోతే సదరు ఛార్జీని తొలగించమని అడిగే పూర్తి హక్కు కస్టమర్లకు ఉంది.సాధారణంగా వినియోగదారులు ఏం చేస్తారు?రద్దీగా ఉన్న సమయంలో గొడవ ఎందుకని చాలామంది మౌనంగా చెల్లిస్తుంటారు. కొందరు ఇది ప్రభుత్వ పన్నుగా భావిస్తారు. ఛార్జీని తొలగించమని అడిగితే తక్కువగా చూస్తారేమోనన్న ఇంకొందరు సంకోచిస్తారు. బిల్లులో చివరలో దీన్ని కలపడం వల్ల అది మొత్తంలో భాగమని చెల్లిస్తుంటారు.అసలు ఏం చేయాలి?బిల్లు జనరేట్ కాకముందే సర్వీస్ ఛార్జీని మినహాయించి బిల్లు ఇవ్వమని కోరండి. సిబ్బందితో వాదించకుండా ఇది చెల్లించడం ఆప్షనల్ అని ప్రశాంతంగా హోటల్ యాజమాన్యానికి వివరించండి. ఒకవేళ హోటల్ యాజమాన్యం మొండిగా వ్యవహరించి బలవంతంగా వసూలు చేస్తే ఆ బిల్లును సాక్ష్యంగా ఉంచుకుని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్(1915)కు ఫిర్యాదు చేయవచ్చు.ఎలాంటి సమయాల్లో చెల్లించవచ్చు?మీకు అందించిన సర్వీసులు అద్భుతంగా ఉందని మీరు భావిస్తే ఆ సిబ్బందిని ప్రోత్సహించడానికి సర్వీస్ ఛార్జీ రూపంలో లేదా నేరుగా టిప్ రూపంలో నగదును స్వచ్ఛందంగా ఇవ్వవచ్చు. ఇది పూర్తిగా మీ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: పాకిస్థాన్కు వీసా నిలిపివేసిన ఖతార్ -
బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు
దేశంలో బంగారం, వెండిపై పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సెబీ (SEBI) తీసుకున్న కొత్త నిర్ణయాలు, పన్ను విధానాల్లో మార్పులు మీ లాభాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఆ మార్పులేంటో ఓసారి పరిశీలిద్దాం.అంతర్జాతీయ ధరలకు స్వస్తి! ఇప్పటి వరకు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల (ETF) ధరలను అంతర్జాతీయ ప్రమాణాల (LBMA) ఆధారంగా నిర్ణయించేవారు. కానీ ఏప్రిల్ 1 నుండి సెబీ (SEBI) కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఇకపై వీటి ధరలు భారతీయ ఎక్స్ఛేంజీల 'దేశీయ స్పాట్ ధర' (Domestic Spot Price) ఆధారంగానే నిర్ణయిస్తారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావం మన పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారులు భారత మార్కెట్ వాస్తవ ధరకే లావాదేవీలు జరపవచ్చు.గోల్డ్ బాండ్స్పై పన్ను పోటుఫిజికల్ గోల్డ్ కంటే సురక్షితమైనదిగా భావించే సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)విషయంలో ప్రభుత్వం పన్ను నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటి వరకు సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను మినహాయింపులు ఉండటంతో వీటిని ఉత్తమ పెట్టుబడిగా భావించేవారు. అయితే, కొత్త నిబంధనల ప్రకారం వీటిపై కూడా 'మూలధన లాభాల పన్ను' వర్తిస్తుంది.అయితే బాండ్లను జారీ చేసిన సమయంలో నేరుగా కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు ఉంచుకునే వారికి పన్ను మినహాయింపు కొనసాగుతుంది. అదే సెకండరీ మార్కెట్ (స్టాక్ మార్కెట్) ద్వారా బాండ్లను కొనుగోలు చేసిన వారు మాత్రం ఇకపై స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.డిజిటల్ గోల్డ్పై ప్రభుత్వ నిఘాడిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టే ప్రయోజనాలను పూర్తిగా పన్ను వలయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ పెట్టుబడులపై కూడా పారదర్శకమైన పన్ను విధానాన్ని తీసుకురావడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. -
పాకిస్థాన్కు వీసా నిలిపివేసిన ఖతార్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు వివిధ దేశాల్లోని దౌత్య, రవాణా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు, దానికి అమెరికా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు ఇప్పటివరకు కల్పిస్తున్న ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.రాయబార కార్యాలయం ప్రకటనవీసా ఆన్ అరైవల్ అంటే ఒక దేశానికి వెళ్లాలనుకునే ప్రయాణికులు తమ స్వదేశంలోనే ముందస్తుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. నేరుగా ఆ దేశానికి చేరుకున్న తర్వాత అక్కడి విమానాశ్రయంలోనో లేదా సరిహద్దు చెక్-పోస్ట్ వద్దనో వీసా పొందవచ్చు. ఈ తాజా పరిణామంపై దోహాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఖతార్ ఈ నిర్ణయం తీసుకుందని, పాక్ పౌరులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే ముందస్తుగానే వీసాలు పొందాలి’ అని పాక్ ఎంబసీ స్పష్టం చేసింది.ఎవరిపై ప్రభావం?ఖతార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల తక్షణం పనుల నిమిత్తం వెళ్లే వ్యాపారులకు ఇది సమస్యగా మారుతంది. స్వల్పకాలిక ప్రాజెక్టుల కోసం వెళ్లే నిపుణులు, వీసా నిబంధనల సరళీకరణతో ఖతార్ వెళ్లాలనుకున్న సందర్శకులకు ఇది అవాంతరంగా మారుతుంది. కేవలం పాకిస్థానే కాకుండా లెబనాన్ పౌరులపై కూడా ఖతార్ ఇవే ఆంక్షలు విధించింది. లెబనాన్ నుంచి వచ్చే వారు ఇప్పుడు అధికారిక ‘Hayya.qa’ ప్లాట్ఫారమ్ ద్వారా ముందుగా వీసా పొంది దాని ప్రింటెడ్ కాపీని వెంట ఉంచుకోవడం తప్పనిసరి.ఎందుకీ నిర్ణయంఖతార్ ప్రభుత్వం పాకిస్థాన్, లెబనాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని నిలిపివేయడం వెనుక ప్రధానంగా భద్రతా, దౌత్యపరమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఖతార్ భౌగోళికంగా ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉంది. దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనే అంశంపై పూర్తి నియంత్రణ సాధించాలని ఖతార్ భావిస్తోంది. వీసా ఆన్ అరైవల్ ఇస్తే ప్రయాణికుల పూర్తి నేపథ్యాన్ని వారు దేశానికి రాకముందే పరిశీలించడం కష్టం. అదే ముందస్తు వీసా అయితే, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.దౌత్యపరమైన వ్యూహాలు - పాక్ ప్రతిపాదనమరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. యుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో పాకిస్థాన్ కొన్ని ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ హార్మూజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని పునరుద్ధరించాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని పాక్ కోరుతోంది. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ బుధవారం టర్కీ, పాకిస్థాన్, ఖతార్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది! -
ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది!
ఆఫ్రికాలోని గ్రీకు ద్వీపమైన క్రీట్లో బుధవారం ప్రకృతి ఒక వింత దృశ్యాన్ని ఆవిష్కరించింది. తెల్లవారుజాము ఆకాశం అకస్మాత్తుగా గాఢమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోయింది. చూస్తుంటే భూమి మీద ఉన్నామా లేక ఇతర గ్రహంపై ఉన్నామా అన్నంతగాలా వాతావరణం మారిపోవడంతో స్థానిక నివాసితులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి.ఏమిటీ వింత? ఎందుకు ఇలా జరిగింది?శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, ఇది ఎటువంటి అతీత శక్తి వల్ల కలిగింది కాదు. కేవలం వాతావరణ మార్పుల వల్ల సంభవించిన సహజ పరిణామం. దీనికి ప్రధాన కారణం సహారా ఎడారి నుంచి వీచిన భారీ ధూళి తుఫాను. ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వీచిన బలమైన గాలులు, టన్నుల కొద్దీ సన్నని ఇసుక, ధూళి కణాలను మధ్యధరా సముద్రం మీదుగా ఉత్తర దిశగా మోసుకొచ్చాయి. ఈ ధూళి మేఘాల మార్గంలో దక్షిణ ఏజియన్ సముద్ర తీరంలో క్రీట్ ద్వీపం ఉండటంతో ఇక్కడ ప్రభావం అత్యధికంగా కనిపించింది.ఆకాశం ఎరుపు రంగులోకి ఎందుకు మారుతుంది?‘వాతావరణంలో ధూళి కణాలు దట్టంగా ఉన్నప్పుడు అవి సూర్యరశ్మిని విడగొడుతాయి(స్కాట్టరింగ్). తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన నీలం రంగు కణాలు చెల్లాచెదురైపోగా ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగులు మాత్రమే మన కంటికి చేరుతాయి. దీనినే ‘రెడ్ స్కై ఫినామినా’ అంటారు’ అని శాస్త్రవేత్తలు చెప్పారు.పర్యావరణానికి వరప్రసాదం.. కానీ..ఈ ధూళి తుఫాను చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ దీని వల్ల పర్యావరణానికి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఈ ఎడారి ధూళిలో ఇనుము, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి నేలపై చేరినప్పుడు మట్టిని, సముద్రంలో పడినప్పుడు సముద్రపు నాచును సారవంతం చేస్తాయి. అయితే, గాలి నాణ్యత (ఏక్యూఐ) భారీగా పడిపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు -
హైదరాబాద్లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పరిమితమయ్యాయి. లక్ష యూనిట్లలోపు విక్రయాలు పడిపోవడం 18 త్రైమాసికాల తర్వాత ఇదే ప్రథమం.2025 జనవరి–మార్చి కాలంలో టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 1,13,602 యూనిట్లు కాగా, 2025 చివరి త్రైమాసికంలో 1,05,527 యూనిట్లుగా ఉన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కొనుగోలు సెంటిమెంట్పై ప్రభావం చూపించినట్టు, తాజా సరఫరా తగ్గడం కూడా కారణమని ప్రాప్ఈక్విటీ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా టాప్–9లో ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు మినహా మిగిలిన అన్ని నగరాల్లో ఇళ్ల విక్రయాలు పడిపోయాయి. హైదరాబాద్లో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 11,546 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 2025 జనవరి–మార్చి కాలంలో విక్రయాలు 13,725 యూనిట్లతో పోల్చితే 16 శాతం తగ్గాయి. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 17,991 యూనిట్లుగా ఉన్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో అమ్మకాలు 17,508 యూనిట్లతో పోల్చితే 3 శాతం పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో 12,141 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2025 మొదటి త్రైమాసికంలో విక్రయాలు 10,723 యూనిట్లతో పోల్చితే 13 శాతం పెరిగాయి. చెన్నైలో 4 శాతం తక్కువగా 4,765 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ముంబైలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 20 శాతం పడిపోయి 9,186 యూనిట్లకు పరిమితమయ్యాయి. నవీ ముంబైలో ఇళ్ల విక్రయాలు 7,157 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 14 శాతం తగ్గాయి. థానేలోనూ 24 శాతం తక్కువగా 15,959 యూనిట్ల విక్రయాలు జరిగాయి. పుణెలో 16,144 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయాలు 21,640 యూనిట్ల కంటే 25 శాతం తగ్గాయి. కోల్కతాలో 8 శాతం తక్కువగా 3,872 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. కొత్త ప్రాజెక్టుల సరఫరా జనవరి మార్చి మధ్య 92,411 యూనిట్లుగా ఉంది. 2025 మొదటి క్వార్టర్లో సరఫరా 1,14,718 యూనిట్ల కంటే 19 శాతం తగ్గింది. -
గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గిందోచ్!!
దేశంలో పసిడి ధరలు దిగివచ్చాయి. కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. దాదాపు ఆరు రోజుల తర్వాత నేడు బంగారం ధరలు (Today Gold Rate) తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా భారీగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 431 పాయింట్లు నష్టపోయి 22,247 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1411 పాయింట్లు దిగజారి 71,741 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.96బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.41 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.72 శాతం పెరిగింది.నాస్డాక్ 1.16 శాతం పుంజుకుంది.Today Nifty position 02-04-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్పెక్యులేటర్లపై ఆర్బీఐ ఉక్కుపాదం
విదేశీ మార్కెట్లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది. కరెన్సీ మార్కెట్లో కృత్రిమంగా ఒత్తిడి పెంచుతున్న స్పెక్యులేటర్ల ఆట కట్టించేలా తాజాగా ఆంక్షలు జారీ చేసింది. ఇది డాలర్తో పోలిస్తే రూపాయి విలువలో రికవరీకి బాటలు వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఆఫ్-షోర్ స్పెక్యులేషన్లకు బ్రేక్తాజా మార్గదర్శకాల ప్రకారం, భారత్లో నివసించే వారు లేదా ప్రవాస భారతీయులు ఎవరూ రూపాయికి సంబంధించిన నాన్-డెలివరబుల్ డెరివేటివ్ కాంట్రాక్టులను (ఎన్డీఎఫ్) ఆఫర్ చేయకుండా అధీకృత డీలర్లపై (బ్యాంకులపై) ఆర్బీఐ నిషేధం విధించింది. ముఖ్యంగా ఆన్-షోర్ (భారత మార్కెట్), ఆఫ్-షోర్ (విదేశీ మార్కెట్) ధరల మధ్య ఉన్న తేడాను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు చేసే ఆర్బిట్రేజ్ ట్రేడ్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉంది. ఇకపై క్లయింట్లు ఫారెన్ ఎక్స్చేంజ్ డెరివేటివ్ కాంట్రాక్టులను ఒకసారి రద్దు చేసిన తర్వాత వాటిని తిరిగి బుక్ చేసుకోవడానికి అనుమతించవద్దని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.రూపాయిపై ప్రభావంసెంట్రల్ బ్యాంక్ నిర్ణయం వెలువడిన వెంటనే మార్కెట్ వర్గాల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. డాలర్-రూపాయి ఫార్వర్డ్స్ ఈ వారం ఇప్పటివరకు 1.4% పడిపోయాయి. ఇది రూపాయి బలపడుతుందనే అంచనాలకు బలం చేకూరుస్తోంది. గత దశాబ్ద కాలంలో లేనంత సాహసోపేతమైన చర్యగా బ్యాంకుల రోజువారీ ఆన్-షోర్ కరెన్సీ పొజిషన్లను 100 మిలియన్ డాలర్లకు ఆర్బీఐ పరిమితం చేసింది.‘రూపాయికి వ్యతిరేకంగా విదేశీ మార్కెట్లలో జరుగుతున్న స్పెక్యులేషన్లను అరికట్టడానికి ఇది అత్యంత కఠినమైన చర్య. గురువారం మార్కెట్లు తెరుచుకోగానే రూపాయి విలువ పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కరెన్సీ ఎక్స్పర్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.బీఐఎస్ నివేదికల ప్రకారం సింగపూర్, లండన్, హాంకాంగ్ వంటి ప్రాంతాల్లో రూపాయి సగటు రోజువారీ ఆఫ్-షోర్ ట్రేడింగ్ 149 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ భారీ మార్కెట్ భారత దేశీయ మార్కెట్ ధరలను ప్రభావితం చేస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎకనామిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ అభిప్రాయం ప్రకారం ‘మారకపు రేటు నిర్ణయాధికారాన్ని ఆన్-షోర్ మార్కెట్ పరిధిలోకి తీసుకురావాలని ఆర్బీఐ గట్టిగా ప్రయత్నిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు -
అమల్లోకి కొత్త ఐటీ చట్టం
ఆదాయపన్ను చట్టం, 2025 బుధవారం నుంచి అమల్లోకి వచి్చంది. దేశ పన్ను చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని.. వికసిత్ భారత్ దిశగా కీలక అడుగు అవుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) పేర్కొంది. ఆరు దశాబ్దాల కాలం నాటి ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో మరింత సరళతర చట్టంగా కేంద్రం దీన్ని రూపొందించడం తెలిసిందే. మరింత స్పష్టత, నిబంధనల అమలు సులభతరం, సరళమైన భాష, చదివే వారు అర్థం చేసుకునేందుకు అనుకూలత ఇందులోని ప్రత్యేకతలుగా సీబీడీటీ పేర్కొంది.కొత్త చట్టానికి మారే క్రమంలో పాత, కొత్త పన్ను చట్టాల పరిధిలో నిబంధనల అమలుకు ఇ–ఫైలింగ్ పోర్టల్ వీలు కలి్పంచనుందని సీబీడీటీ తెలిపింది. ముందటి సంవత్సరాలకు సంబంధించి అన్ని మదింపులు, అప్పీళ్లు పాత పన్ను చట్టం కిందే కొనసాగుతాయని, అసెస్మెంట్ సంవత్సరం 2026–27 (2025–26 ఆర్థిక సంవత్సరం) రిటర్నులను పాత పన్ను చట్టం కింద దాఖలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు -
ఏఐ అప్స్కిల్లింగ్పై ఫోకస్
ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ భారత మార్కెట్లో తన కార్యకలాపాలను మరింత సుస్థిరం చేసుకునే దిశగా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 50,000 మంది నిపుణులను నియమించుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగాల కల్పనతోపాటు అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతలో ఉద్యోగులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గిస్తున్న తరుణంలో డెలాయిట్ తీసుకున్న ఈ నిర్ణయం భారత టెక్ రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.నైపుణ్యాల పెంపే లక్ష్యం!ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డెలాయిట్ దక్షిణాసియా సీఓఓ నితిన్ కిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థ హెడ్కౌంట్ను తగ్గించడంపై కాకుండా, సామర్థ్యాలను బలోపేతం చేయడంపైనే దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ‘ఏఐ సాధనాల ద్వారా అత్యంత క్లిష్టమైన, అధిక విలువ కలిగిన పనులను నిర్వహించడానికి మా ఉద్యోగులను సిద్ధం చేస్తున్నాం. కేవలం పని వేగాన్ని పెంచడమే కాకుండా ఉద్యోగులు అధునాతన బాధ్యతలు చేపట్టేలా అప్స్కిల్లింగ్పై దృష్టి సారించాం’ అని తెలిపారు.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 30,000 మందికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ పూర్తి చేశారు. సంస్థ తన మొత్తం ఆదాయంలో 9% సామర్థ్యం పెంపు, శిక్షణ, ఆవిష్కరణ కార్యక్రమాల కోసం కేటాయిస్తోంది. డెలాయిట్ అంతర్జాతీయ శ్రామిక శక్తిలో దాదాపు మూడింట ఒక వంతు భారత్లోనే ఉండటం విశేషం.భారతీయ సంస్థల్లో సవాళ్లుఏఐ పట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ భారతీయ సంస్థల్లో (ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పెద్ద కార్పొరేట్ గ్రూపుల్లో) కొన్ని ప్రాథమిక ఆందోళనలు ఉన్నాయని డెలాయిట్ గుర్తించింది. సున్నితమైన సమాచారం నియంత్రిత వాతావరణంలో భద్రంగా ఉంటుందా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. ఏఐ మోడళ్ల ధరల నిర్ణయం ఎక్కువగా వినియోగం ఆధారంగా ఉంటుంది. దీనివల్ల బడ్జెట్పై భారం పడవచ్చని కంపెనీలు భయపడుతున్నాయి.భద్రత ముఖ్యంఆవిష్కరణలు ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యమని నితిన్ కిని నొక్కి చెప్పారు. ‘భారతదేశం ఏఐ అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే బలమైన భద్రతా వ్యవస్థలను నిర్మించడం అనివార్యం’ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ సాంకేతికతలపై పట్టు సాధించే క్రమంలో డెలాయిట్ భారత్లో క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభించనుంది. తద్వారా అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలకు భారతదేశాన్ని గ్లోబల్ సెంటర్గా మార్చాలని సంస్థ భావిస్తోంది.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు -
సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్)ని యూనిట్లకు ఏడాది కాలం పాటు సుంకాల్లో రాయితీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా యూనిట్లు తమ ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా ఈ చర్యలు అమల్లో ఉంటాయని తెలిపింది.ఈ మేరకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సెజ్ యూనిట్లలో తయారైన వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గనుంది. కొన్ని కేసుల్లో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) కూడా వర్తించదు. రసాయనాలు, ఎరువులు, టెక్స్టైల్స్, ఫుట్వేర్, మెషినరీ ఇలా దాదాపు అన్ని రకాల ఉత్పత్తులకు ఈ ప్రయోజనాలు అమలు కానున్నాయి. 2025 మార్చి 31కి ముందు సెజ్లలో కార్యకలాపాలు ప్రారంభించిన యూనిట్లకే ఈ మినహాయింపు వర్తిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో తాము పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకుండా ఉన్నామని, వస్తువులను దేశీ మార్కెట్లో రాయితీ రేట్లపై విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాలని ఎగుమతి యూనిట్లు డిమాండ్ చేయడం గమనార్హం.తక్కువ రేట్లుసెజ్ యూనిట్లలో తయారైన వస్తువులకు ప్రస్తుతం అమలవుతున్న 7.5 శాతం స్థానంలో 6 శాతం, 10 శాతం బదులు 9 శాతం, 12.5 శాతం, 15 శాతం బదులు 10 శాతం రేట్లు వర్తిస్తాయి. అలాగే, 20 శాతం అమలయ్యే చోట 12.5 శాతం, 20–30 శాతం బ్రాకెట్లోని వాటికి 15 శాతం, 30–40 శాతం సుంకాల పరిధిలోని వాటికి 20 శాతమే ఇకపై అమలు కానున్నాయి.ఇదీ చదవండి: ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా.. -
రూ.2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు మార్చిలో మరింత బలపడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 9% పెరిగి రూ.2,00,064 కోట్లకు చేరింది. ఇందులో దిగుమతులపై జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం 17.8% పెరిగి రూ.53,861 కోట్లుగా ఉంది. 2025–26లో నెలవారీ మూడో అత్యధిక వసూళ్లు ఇవి. 2025 ఏప్రిల్లో అత్యధికంగా రూ.2.36 లక్షల కోట్లు వసూలు కాగా, మేలో రూ.2.01 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2025 మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం రూ.1.83 లక్షల కోట్లుగా ఉంది. మార్చి నెలలో రిఫండ్లు 13.8% పెరిగి రూ.22,074 కోట్లకు చేరాయి. రిఫండ్లు మినహాయించి చూస్తే నికర జీఎస్టీ ఆదాయం 8% వృద్ధితో రూ.1.78 లక్షల కోట్లకు చేరింది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం జీఎస్టీ వసూళ్లు అంతక్రితం ఏడాదితో పోల్చి చూస్తే 8.3 శాతం పెరిగి రూ.22.27 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెపె్టంబర్లో జీఎస్టీ శ్లాబులను కుదించడం ఫలితంగా 375 ఉత్పత్తులపై పన్ను రేటు దిగిరావడం తెలిసిందే. అయినప్పటికీ జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. -
దేశీ ఎయిర్లైన్స్కి ఊరట
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగిసినప్పటికీ విమాన ఇంధనం రేట్లను భారీగా పెంచకుండా దేశీ విమానయాన సంస్థలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొంత ఊరటనిచ్చాయి. వాస్తవానికి రెట్టింపు స్థాయిలో పెంచాల్సినప్పటికీ పెంపును 8.5%కి పరిమితం చేశాయి. అయితే, వాణిజ్య గ్యాస్ సిలిండర్ (ఎల్పీజీ), ప్రీమియం పెట్రోల్ రేట్లను మాత్రం పెంచాయి. తాజా పరిమాణంతో దేశీ ఎయిర్లైన్స్కి ఏటీఎఫ్ ధర ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 8,289 (8.56%) పెరిగి రూ. 1,04,927కి చేరింది. కానీ విదేశీ ఎయిర్లైన్స్, నాన్–శెడ్యూల్డ్, చార్టర్ ఫ్లయిట్స్కి మాత్రం 114.5% ఎగిసింది. రూ.1,10,703 పెరిగి రూ. 2,07,341కి చేరింది. ఇది రూ. 2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. ‘విమాన టికెట్ చార్జీలు భారీగా పెరగకుండా ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు, దేశీ ఎయిర్లైన్స్పై భారాన్ని తగ్గించేందుకు, కీలక తరుణంలో పరిశ్రమలో స్థిరత్వాన్ని తెచ్చేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఎయిర్ కనెక్టివిటీకి ఆటంకాలు ఏర్పడకుండా చూడటం ద్వారా ఎకానమీకి కూడా ప్రయోజనం చేకూర్చగలదు’ అని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏవియేషన్ పరిశ్రమకు, విమాన ప్రయాణికులపై పెను భారం పడకుండా ఈ చర్యలు తోడ్పడతాయని ఇండిగో, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్ పేర్కొన్నాయి. సాధారణ పెట్రోల్, వంట గ్యాస్ ధర యథాతథం.. 19 కేజీల వాణిజ్య సిలిండర్ రేటు ఢిల్లీలో రూ. 195.50 మేర పెరిగి రూ. 2,078.50కి చేరింది. ప్రీమియం డీజిల్ రేటు లీటరుకు రూ. 1.50 మేర పెరిగి రూ. 92.99కి చేరగా, 100 ఆక్టేన్ పెట్రోల్ ధర రూ. 11 పెరిగి రూ. 160కి చేరింది. సాధారణ, అన్బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ వంట గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పుల్లేవు. వంట గ్యాస్ రేట్లను పెంచకపోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రతి సిలిండర్పై రూ. 380 మేర ఆదాయ నష్టం వాటిల్లుతోంది’ అని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ పేర్కొంది.ఇండిగో ఇంధన చార్జీల పెంపు..ఏటీఎఫ్ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఇంధన చార్జీలను రూ. 275–10,000 వరకు పెంచుతున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాగా ప్రయాణ దూరాన్ని బట్టి దేశీ రూట్లలో ఫ్లయిట్లకు సంబంధించి ఈ పెంపు రూ. 275–950 శ్రేణిలో, ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్లో రూ. 900 – 10,000 శ్రేణిలో ఉంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో మార్చి 14 నుంచి ఇండిగో రూ. 425 నుంచి రూ. 2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తోంది. -
కొత్త ఆర్థిక సంవత్సరం బుల్ స్టార్ట్!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని(2026–27) దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో మొదలుపెట్టింది. పశ్చిమాసియా యుద్ధం 2–3 వారాల్లో ముగిస్తుందనే ఆశలు సూచీలను పరుగులు పెట్టించాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చిది. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 1,187 పాయింట్లు పెరిగి 73,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 348 పాయింట్లు బలపడి 22,679 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2,017 పాయింట్లు ఎగసి 73,964 వద్ద, నిఫ్టీ 610 పాయింట్లు బలపడి 22,941 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే ట్రేడింగ్ చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా సూచీల లాభాలు సగానికి తుడిపెట్టుకుపోయాయి. తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.60 లక్షల కోట్లు పెరిగి రూ. 422.01 లక్షల కోట్లకు చేరింది. → ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 8%, జపాన్ 5%, తైవాన్ 4% ర్యాలీ చేశాయి. ఇండోనేíÙయా, హాంగ్కాంగ్, సింగపూర్ 2%, చైనా, థాయ్లాండ్ 1.55% పెరిగాయి. యూరప్ మార్కెట్లు 1.5% – 2% లాభపడ్డాయి. అమెరికా స్టాక్ సూచీలు 1% లాభంతో ట్రేడవుతున్నాయి. → ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. రంగాల వారీ ఇండెక్సుల్లో సరీ్వసెస్ 5%, పీఎస్యూ బ్యాంక్ 3.66%, ఇండ్రస్టియల్స్ 3.40%, క్యాపిటల్ గూడ్స్ 3.29%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.79%, కమోడిటీస్ 2.72%, ఐటీ 2.40% పెరిగాయి. సెన్సెక్స్లో ఎన్టీపీసీ (–1.64%), సన్ఫార్మా (–1.64%), పవర్గ్రిడ్ (–1.13%), అ్రల్టాటెక్ (–0.29%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి. బుల్ పరుగులు ఎందుకంటే ..ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇరాన్ యుద్ధాన్ని 2–3 వారాల్లో ముగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగవని హామీ ఇస్తే యుద్ధం ముగింపునకు సిద్ధమేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. దీంతో భారత్తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 4% క్షీణించి 100 డాలర్ల దిగువకు దిగివచ్చాయి. మూడునెలల గరిష్టానికి చేరిన అమెరికన్ బాండ్లపై రాబడులు అనూహ్యంగా దిగివచ్చాయి. దలాల్ స్ట్రీట్ మార్చిలో 11% భారీ పతనం తర్వాత షార్ట్ కవరింగ్, వాల్యూ బయింగ్ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. → జెట్ ఫ్యూయెల్ ధరలు పరిమితంగానే పెరగడంతో ఏవియేషన్ రంగానికి చెందిన ఇండిగో షేరు 6%, స్పైస్జెట్ 2% పెరిగాయి. -
హైదరాబాద్లో ఐస్ప్రౌట్ భారీ విస్తరణ
హైదరాబాద్: ప్రముఖ మేనేజ్డ్ వర్క్స్పేస్ ప్రొవైడర్ 'ఐస్ప్రౌట్' (iSprout), హైదరాబాద్లోని మీనాస్ టవర్స్లో 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఎంటర్ప్రైజ్ గ్రేడ్ కార్యాలయాన్ని ప్రారంభించింది. 20 అంతస్తుల ఈ భారీ కాంప్లెక్స్లో ఇప్పటికే 10 అంతస్తులు ప్రముఖ కంపెనీలకు లీజుకు ఇవ్వడం విశేషం. ఈ సరికొత్త విస్తరణతో భాగ్యనగరంలో ఐస్ప్రౌట్ మొత్తం పోర్ట్ఫోలియో 17 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), పెద్ద సంస్థలను లక్ష్యంగా చేసుకుని 100 నుంచి 3,000 సీట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.ఈ కొత్త కేంద్రం కేవలం కార్యాలయ సముదాయం మాత్రమే కాకుండా, ప్రతి క్లయింట్ అవసరాలకు అనుగుణంగా 'కస్టమ్ డిజైన్' చేసిన వర్క్స్పేస్లను అందిస్తోంది. హై-స్పీడ్ ఐటీ మౌలిక సదుపాయాలు, మీటింగ్ రూమ్లు, కొలాబరేషన్ సూట్లతో పాటు హై-ఎండ్ రెస్టారెంట్లు, కాఫీ షాపులు వంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం 60 రోజుల్లోనే కంపెనీల బ్రాండ్ నిబంధనల ప్రకారం కార్యాలయాన్ని సిద్ధం చేసి అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్లకు సమీపంలో ఉండటం, మెట్రో కనెక్టివిటీ ఉండటం ఈ కేంద్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఐస్ప్రౌట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 నగరాల్లో 26 కేంద్రాలను నిర్వహిస్తూ, 350కి పైగా కంపెనీలకు సేవలు అందిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 14,000 సీట్లుగా ఉన్న కంపెనీ సామర్థ్యం, 2026 నాటికి 43,000 సీట్లకు చేరుకోవడం సంస్థ వేగవంతమైన వృద్ధికి నిదర్శనం. హైదరాబాద్ తమకు అత్యంత వ్యూహాత్మక మార్కెట్ అని, గ్లోబల్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇక్కడ మౌలిక వసతుల నిర్వహణ బాధ్యతలను తాము తీసుకుంటామని ఐస్ప్రౌట్ సీఈఓ, కో-ఫౌండర్ సుందరి పాటిబండ్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
చైనా సీసీ కెమెరాలకు చెక్! ఇక కొత్త నిబంధనలు
దేశ భద్రత, సైబర్ రక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చైనాకు చెందిన పలు కంపెనీల సీసీటీవీ (CCTV) కెమెరాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇంటర్నెట్ ఆధారిత కెమెరాల నిఘాను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 1 నుండి మారిన నిబంధనలు ఇవే..ఏప్రిల్ 1 నుండి దేశంలో విక్రయించే ప్రతి ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీటీవీ కెమెరా తప్పనిసరిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన STQC (స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్) ఫ్రేమ్వర్క్ నుండి అనుమతి పొందాలి.కంపెనీలు తమ కెమెరాలలో ఉపయోగించే సిస్టమ్-ఆన్-చిప్ (SoC) లేదా ప్రాసెసర్ ఎక్కడ తయారైందో స్పష్టంగా తెలియజేయాలి.ఎన్క్రిప్షన్ టెక్నాలజీ, హార్డ్వేర్ మూలం, ఫర్మ్వేర్ భద్రత మరియు ట్యాంపరింగ్ (ట్యాంపర్ రెసిస్టెన్స్) వంటి అంశాలపై STQC అధికారులు పరీక్షలు నిర్వహిస్తారు.కెమెరా డేటాను ఇతరులు రిమోట్గా యాక్సెస్ చేసే అవకాశం ఉందో లేదో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.విదేశాల నుండి దిగుమతి చేసుకునేవే కాకుండా, భారత్లో అసెంబుల్ చేసే పరికరాలు కూడా ఈ పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. క్లియరెన్స్ లేని ఉత్పత్తుల విక్రయం ఇకపై చట్టవిరుద్ధం.ఏ బ్రాండ్లపై ప్రభావం పడుతుంది?భారత సీసీటీవీ మార్కెట్లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన హిక్ విజన్ (Hikvision), టీపీ-లింక్ (TP-Link), దహువా (Dahua) వంటి ప్రముఖ చైనా కంపెనీలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం వీరు కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.పాత కెమెరాల పరిస్థితి ఏమిటి?ఇప్పటికే ఇళ్లు, కార్యాలయాల్లో వాడుతున్న కెమెరాల విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రస్తుత కెమెరాలను స్వాధీనం చేసుకోదు. పాత కెమెరాలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, భవిష్యత్తులో ఆయా కంపెనీల నుండి వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ (మరమ్మతులు) విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.ధరలు పెరుగుతాయా?చైనా కంపెనీలకు ఆంక్షలు ఎదురైనప్పటికీ, భారతీయ బ్రాండ్లు సీపీ ప్లస్ (CP Plus), ప్రమా (Prama), క్యోబో (Kyobo), మ్యాట్రిక్స్ (Matrix), స్పర్ష్ (Sparsh) ఇప్పటికే తమ ఉత్పత్తిని భారీగా పెంచాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వీటి వాటా 80 శాతానికి చేరుకుంది. అయినప్పటికీ, భద్రతా పరీక్షల కోసం అయ్యే అదనపు ఖర్చు, సరఫరాదారుల సంఖ్య తగ్గడం వల్ల, రానున్న రోజుల్లో ముఖ్యంగా మిడ్, ప్రీమియం రేంజ్ కెమెరాల ధరలు కొంత మేర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఎయిర్టెల్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు
భారతీ ఎయిర్టెల్ తన డేటా సెంటర్ విభాగమైన 'నెక్స్ట్రా' (Nxtra)లో భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆల్ఫా వేవ్ గ్లోబల్, కార్లైల్, యాంకోరేజ్ క్యాపిటల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కలిసి సుమారు 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,300 కోట్లు) నిధులను సమకూర్చనున్నాయి. ఈ పెట్టుబడిలో భారతీ ఎయిర్టెల్ కూడా పాలుపంచుకోనుంది. ఈ నిధుల సేకరణ అనంతరం నెక్స్ట్రా సంస్థ విలువ సుమారు 3.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.ఈ ఒప్పందంలో భాగంగా ఆల్ఫా వేవ్ గ్లోబల్ 435 మిలియన్ డాలర్లు, కార్లైల్ 240 మిలియన్ డాలర్లు, యాంకోరేజ్ క్యాపిటల్ 35 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఎయిర్టెల్ సంస్థే సమకూర్చనుంది. ఈ పెట్టుబడుల తర్వాత కూడా నెక్స్ట్రాలో మెజారిటీ వాటా ఎయిర్టెల్ వద్దే ఉంటుంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డేటా సెంటర్ల విస్తరణే లక్ష్యంగా ఈ నిధులను వినియోగించనున్నారు.ప్రస్తుతం నెక్స్ట్రా సంస్థకు దేశవ్యాప్తంగా 300 మెగావాట్ల సామర్థ్యం ఉండగా, రానున్న కొన్నేళ్లలో దీన్ని 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లో శరవేగంగా పెరుగుతున్న క్లౌడ్ సేవలు, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, హైపర్స్కేలర్ డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి ఈ విస్తరణ దోహదపడనుంది. దేశీయ డేటా సెంటర్ మార్కెట్లో 25 శాతం వాటాను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.నెక్స్ట్రా ఇప్పటికే పుణెలో అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉండగా, తాజాగా చెన్నై, ముంబై, కోల్కతాలలో ఏఐ-రెడీ (AI-ready) క్యాంపస్లను నిర్మిస్తోంది. గూగుల్తో కలిసి గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 14 ప్రధాన కోర్ డేటా సెంటర్లు, 120కి పైగా ఎడ్జ్ కేంద్రాలతో నెక్స్ట్రా తన సేవలను అందిస్తోంది. ఈ కొత్త పెట్టుబడులతో భారత్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్గా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
నరెడ్కో తెలంగాణ కొత్త కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO) తెలంగాణ విభాగానికి సంబంధించి 2026-2028 కాలానికి నూతన కార్యవర్గ సభ్యులు, కీలక అధికారుల నియామకం పూర్తయింది. మంగళవారం హైదరాబాద్లోని 'ఏపీఆర్ ఐల్' వేదికగా జరిగిన అసోసియేషన్ 30వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కొత్త బృందాన్ని అధికారికంగా ప్రకటించారు.నరెడ్కో తెలంగాణ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి కొప్పుల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా కాళీ ప్రసాద్ దామెర, గోపాలకృష్ణ కొరిపల్లి, సెక్రటరీ జనరల్గా వెంకటేశ్వరరావు రావుల, కోశాధికారిగా సుధాకర్ రెడ్డి కొండల నియమితులయ్యారు.ఎంపికైన నూతన నాయకత్వ బృందం 2026 నుండి 2028 వరకు రెండేళ్ల పాటు అసోసియేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించనుంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సుస్థిర వృద్ధిని పెంపొందించడం, వృత్తిపరమైన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బృందం పనిచేయనుంది. -
గంటల్లోనే రెచ్చిపోయిన బంగారం రేట్లు
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. బుధవారం ఉదయం మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత రెచ్చిపోయాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం రూ.1800 పెరిగి రూ.1,38,850 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.3150 పెరిగి రూ.1,40,200 లకు ఎగిసింది.అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం ఉదయం రూ.1970 పెరిగి రూ.1,51,480 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మొత్తం రూ.3440 పెరిగి రూ. 1,52,950 లకు ఎగబాకింది.ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు సిల్వర్ కేజీకి రూ.15000 పెరిగి రూ.2,65,000 వద్దకు ఎగిసింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
LICకి రూ.3,750 కోట్ల నష్టం.. అనిల్ అంబానీపై కేసు
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని కష్టాలు వీడటం లేదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ద్వారా ఎల్ఐసీని (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మోసగించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తాజా కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి సుమారు రూ.3,750 కోట్ల మేర ఎల్ఐసీకి నష్టం కలిగించారనేది ప్రధాన ఆరోపణ.అసలేం జరిగింది?కేసు వివరాల ప్రకారం.. 2009 నుంచి 2012 మధ్య కాలంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCD) జారీకి పూనుకుంది. ఆ సమయంలో కంపెనీ ఆర్థిక స్థితిగతులు, ఆస్తుల భద్రతపై తప్పుడు సమాచారం ఇచ్చి ఎల్ఐసీని నమ్మించారు. దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ఎన్సీడీలను కొనుగోలు చేసేలా ఎల్ఐసీని ప్రేరేపించారు. చివరికి ఈ వ్యవహారంలో ఎల్ఐసీకి రూ.3,750 కోట్లకు పైగా నికర నష్టం వాటిల్లింది.ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తుపోయే నిజాలుబీడీఓ ఇండియా ఎల్ఎల్పీ (BDO India LLP) 2020లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఈ కుంభకోణంలోని లోతుపాతులను బయటపెట్టింది. ఆ నివేదిక ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి సేకరించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు. షెల్ కంపెనీలు, అనుబంధ సంస్థల ద్వారా ఇంటర్-కంపెనీ డిపాజిట్ల పేరుతో నిధులను స్వాహా చేశారు. ఉనికిలో లేని అమ్మకాల ఇన్వాయిస్లు, కల్పిత బిల్లులను సృష్టించి ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. సెక్యూరిటీగా చూపిన ఆస్తుల విలువను వాస్తవం కంటే భారీగా పెంచి చూపినట్లు తేలింది. కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై అవినీతి నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ, ఆర్కామ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు అధికారులు తెలిపారు.వరుస కేసులుఅనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు చేయడం ఈ నెలలో ఇది రెండోసారి. మార్చి 8న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఫిర్యాదు మేరకు రూ.1,085 కోట్ల బ్యాంకు మోసం కేసు నమోదైంది. ఇందులో పీఎన్బీకి రూ.621.39 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.463.80 కోట్ల మేర బకాయిలు పడ్డారు. తాజా ఎల్ఐసీ కేసుతో అనిల్ అంబానీ సహా మాజీ డైరెక్టర్ల చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది. -
రియల్ ఎస్టేట్కు గట్టి పోటీ ఇస్తున్న ‘ఫ్లెక్స్ ఆఫీస్’
దేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ (ఫ్లెక్స్ ఆఫీస్) పరిశ్రమ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలో ఈ రంగం ఇప్పటికే 100 మిలియన్ చదరపు అడుగుల మార్కును దాటడమే కాకుండా, లాభాల బాటలో పయనిస్తూ సరికొత్త వృద్ధి దశలోకి ప్రవేశించింది. అనరాక్ గ్రూప్నకు చెందిన ప్రముఖ ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ మార్కెట్ప్లేస్ ‘మైహెచ్క్యూ’(myHQ) విడుదల చేసిన క్యూ3 (Q3 FY26) ఫ్లెక్స్ ఆఫీస్ నివేదిక ప్రకారం.. 2028 నాటికి ఈ రంగం విలువ ఏకంగా 9 నుండి 10 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.ఒకప్పుడు కేవలం స్టార్టప్లకే పరిమితమైన ఈ రంగం.. ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs), బడా కార్పొరేట్ సంస్థల రాకతో సరికొత్త రూపును సంతరించుకుంది. కొత్తగా బుక్ అవుతున్న సీట్లలో దాదాపు 40% వాటాను ఇవే కైవసం చేసుకుంటున్నాయి. గత రెండేళ్లలో సగటు డీల్ సైజు 25 సీట్ల నుండి ఏకంగా 53 సీట్లకు పెరగడం విశేషం. దీన్నిబట్టి ప్రధాన స్రవంతి రియల్ ఎస్టేట్ వ్యూహాల్లో ఫ్లెక్స్ ఆఫీస్ల ప్రాధాన్యత ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.లాభాల బాటలో దిగ్గజాలుఈ రంగంలో 2026 ఆర్థికేడాదిలోని మూడో త్రైమాసికం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మార్కెట్లోని పలు అగ్రగామి లిస్టెడ్ ఆపరేటర్లు ఒకేసారి లాభాల్లోకి రావడం విశేషం. 'వీవర్క్ ఇండియా' (WeWork India), 'స్మార్ట్వర్క్స్' (Smartworks) రెండు సంస్థలూ లాభాలు ఆర్జించాయి. ఇందులో 'స్మార్ట్వర్క్స్' అత్యధికంగా 490 బేసిస్ పాయింట్ల మార్జిన్ వృద్ధిని నమోదు చేసి రికార్డు సృష్టించింది.వృద్ధికి ప్రధాన కారణాలు ఇవే..కార్పొరేట్ సంస్థల మొగ్గు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) సంస్థలు ఈ ఆఫీస్లను ఎక్కువగా ఎంచుకుంటుండటంతో పరిశ్రమకు దీర్ఘకాలిక స్థిరత్వం లభిస్తోంది.ఆదాయ వనరుల వైవిధ్యం: కేవలం ఆఫీస్ స్పేస్పైనే కాకుండా.. MICE (సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్లు, ఎగ్జిబిషన్లు), డే పాస్లు, ప్రైవేట్ క్యాబిన్లు, ఇతర విలువ ఆధారిత సేవల ద్వారా ఆపరేటర్లు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొత్తం ఆదాయంలో వీటి వాటా 12-16% గా ఉంది.ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరణ: బెంగళూరులోని సర్జాపూర్, హెబ్బాల్, హైదరాబాద్లోని కోకాపేట, పూణేలోని హింజేవాడి, చెన్నైలోని ఓఎంఆర్వంటి మెట్రో ప్రాంతాలతో పాటు.. అహ్మదాబాద్, కొచ్చి, ఇండోర్ వంటి టైర్-2 నగరాలు కూడా ఇప్పుడు ప్రధాన హబ్లుగా మారుతున్నాయి.భారీ పెట్టుబడులు: గ్లోబల్ ఫండ్స్ రాక, ఐపీఓ (IPO)ల ద్వారా నిధుల సమీకరణ ఈ రంగం మరింత వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తున్నాయి.సంప్రదాయ రియల్ ఎస్టేట్కు గట్టి పోటీఈ పరిణామాలపై మైహెచ్క్యూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉత్కర్ష్ కవాత్రా మాట్లాడుతూ.. ‘ఫ్లెక్స్ ఆపరేటర్లు ఇప్పుడు కేవలం తమలో తాము మాత్రమే పోటీ పడటం లేదు. సంప్రదాయ కమర్షియల్ రియల్ ఎస్టేట్తో తలపడుతూ.. ఫ్లెక్సిబులిటీ, వేగం, మూలధన సామర్థ్యంతో విజయం సాధిస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
స్టాక్ మార్కెట్లు ముగిశాయిలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. యూఎస్-ఇరాన్ యుద్ధం ముగింపు వార్తల నేపథ్యంలో ఉదయం అత్యంత భారీ లాభాలలో పయనించాయి. అయితే ప్రారంభ ఉత్సాహం మసకబారడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెషన్ ద్వితీయార్ధంలో రోజు గరిష్ట స్థాయి నుండి లాభాలు క్షీణించాయయి.ముగింపు సమయానికి నిఫ్టీ 1.56 శాతం లేదా 348 పాయింట్ల లాభంతో 22,679.40 వద్ద, సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు లేదా 1.65 శాతం పెరిగి 73,134.34 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ట్రెంట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.24 శాతం, 3.24 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ టాప్ గెయినర్గా ఉంది. నిఫ్టీ కెమికల్, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఫార్మా నష్టాల్లో నిలిచాయి. -
ఏటీఎం రూల్స్.. ఇక మారిపోయాయ్..
దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. ఈ ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేశాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ (HDFC), బంధన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్ విత్డ్రా లిమిట్ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గిందిఅయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్ను పీఎన్బీవన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.బంధన్ బ్యాంక్బంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది. సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది.ఉచిత పరిమితి మించితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఒక్కో నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.10 అదనంగా చార్జీలు ఉంటాయి. ఇక తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే రూ.25 పెనాల్టీ విధిస్తారు.ఇది చదవలేదా? 👉 బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే! -
నయారా బాటలో షెల్ ఇండియా!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన నయారా ఎనర్జీ బాటలోనే తాజాగా ‘షెల్ ఇండియా’ సైతం ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటడంతో నష్టాలను తగ్గించుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.బెంగళూరులో ధరల మోతతాజా పెంపుతో కర్ణాటక రాజధాని బెంగళూరులో షెల్ కంపెనీ అవుట్లెట్లలో ఇంధన ధరలు కింది విధంగా ఉన్నాయి. స్థానిక పన్నుల వ్యత్యాసం కారణంగా ఇతర నగరాల్లో ఈ ధరలు స్వల్పంగా అటు ఇటుగా ఉండవచ్చు.ఇంధనం రకంపెంపు (లీటరుకు)తాజా ధర (సాధారణ)ప్రీమియం వేరియంట్ ధరపెట్రోల్రూ. 7.41రూ. 119.85రూ. 129.85డీజిల్రూ. 25.01రూ. 123.52రూ. 133.52అంతర్జాతీయ సంక్షోభంఫిబ్రవరి 28 నుంచి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 60 శాతం మేర పెరిగింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా సరఫరాకు అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు ధరలను మరింత పెంచుతున్నాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో ఈ సరఫరా గొలుసులో తలెత్తే స్వల్ప మార్పులైనా దేశీయ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగ సంస్థలుముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను దాదాపు స్థిరంగా ఉంచడం గమనార్హం. అయితే ప్రైవేట్ రిటైలర్లు అయిన షెల్, నయారా వంటి సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు లభించే సబ్సిడీలు లేదా నష్టపరిహారాలు ప్రైవేట్ సంస్థలకు అందవు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తమ మనుగడ సాగించాలంటే పెరిగిన భారాన్ని కస్టమర్లపై వేయడం తప్ప మరో మార్గం లేదని ప్రైవేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్! -
30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులు
ఐటీ కంపెనీలు ఇటీవలి కాలంలో మళ్లీ లేఆఫ్ల బాటపట్టాయి. భారతీయ ఐటీ రంగంలో, ముఖ్యంగా ఒరాకిల్ (Oracle) సంస్థలో భారీ లేఆఫ్స్ బెంగళూరు లాంటి నగరాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ ఇండియా సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. త్వరలోనే మరో 30వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. దీంతో ఏ క్షణాన ‘ఈ రోజే మీ చివరి పని దినం’ అనే సందేశాన్ని మోసుకొచ్చే మెయిల్ వస్తుందేమోనని టెకీల గుండెల్లో రైళ్లు పరిగె డుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30,000 మందిని తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒరాకిల్ ఇండియాలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. మరికొన్ని వారాల్లో మరో విడత తొలగింపులు జరగవచ్చని అంచనా. రెండు దశాబ్దాల విస్తరణ తర్వాత భారతదేశ ఐటీ సేవల పరిశ్రమలో వృద్ధి వేగంగా మందగిస్తున్న తరుణంలో ఈ ఘటనలు ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్పనాయి.మంగళవారం ఉదయం 6 గంటలకు (EST) తొలగించబడిన ఉద్యోగులకు ఈ మెయిల్ పంపింది. "ఈ రోజే మీ చివరి పనిదినం" అని సంస్థ పేర్కొన్నట్లు సమాచారం. "సంస్థాగత మార్పు"ను కారణంగా చూపుతూ, ఈ ఉద్యోగాలను తక్షణమే రద్దు చేసినట్లు తెలిపింది.మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్కు చెందిన సౌరభ్ ముఖర్జీయా ఒక పోడ్కాస్ట్లో మాట్లాడుతూ, ఐటీ రంగం ఒక నిర్మాణాత్మక మందగమనంలోకి ప్రవేశిస్తోందని అన్నారు. 2005 - 2020 మధ్య, ఐటీ సేవల సంస్థలు తమ ఆదాయాలను, ఉద్యోగుల సంఖ్యను ఏటా సుమారు 15శాతం చొప్పున పెంచుకున్నాయి. అయితే, కోవిడ్ తర్వాత నియామకాలు తగ్గడంతో ఆ వేగం ఇప్పుడు 5 నుండి 6 శాతానికి పడిపోయింది.దాదాపు రెండు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన ఐటీ రంగం ఇప్పుడు మందగిస్తోందని ముఖర్జీయా వ్యాఖ్యానించారు. ఏఐ (AI) ప్రాచుర్యం పొందక ముందే ఈ మందగమనం మొదలైందని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ మార్పును మరింత తీవ్రతరం చేస్తోంది. నీతి ఆయోగ్ యొక్క 2025 నివేదిక ప్రకారం, 2031 నాటికి ఐటీ సేవలు , కాల్ సెంటర్లలోని 20శాతం వరకు ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల ప్రభావితం కావచ్చని అంచనా.ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICI Direct) నివేదిక ప్రకారం, ఐటీ రంగం "డిఫ్లేషనరీ ఫేజ్" (ధరల తగ్గుదల దశ) లోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల దాదాపు 80 బిలియన్ల డాలర్ల ఆదాయం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.అలాగే ప్రస్తుతానికి లేఆఫ్స్ ప్రభావం ఐటీ నిపుణుల జీవనశైలి , రియల్ ఎస్టేట్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది.రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావంఐటీ నిపుణుల ఆదాయంపై ఆధారపడిన బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ కోతల వల్ల ఇప్పటికే ఇల్లు కొన్నవారు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతుండగా, మిగిలిన ఉద్యోగులు భవిష్యత్తుపై భయంతో కొత్త కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు.ఖరీదైన ఇళ్ల నుండి తక్కువ ధరలో ఇళ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఖరీదైన ఇళ్లకు బదులుగా తక్కువ ధర గల ఇళ్లను ఎంచుకుంటున్నారు టెక్ నిపుణులు.మరోవైపుప్రస్తుతం ఐటీ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా AI ఆధారిత సేవలు కొత్త అవకాశాలను సృష్టించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు -
ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా..
కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కేవలం ప్రయోగశాలలకో, మొబైల్ యాప్లకో పరిమితమైన సాంకేతికత కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని అంతర్భాగం చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘మోడల్ సామర్థ్యం’ కంటే ఇప్పుడు దాని ‘నిర్వహణా సామర్థ్యం’ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటర్ప్రైజ్ ఏఐ మనుగడకు నియంత్రణ, సమన్వయం కీలకంగా మారుతున్నాయిని ప్రముఖ సంస్థ గార్ట్నర్ అంచనా వేసింది.2027 నాటికి 40 శాతం ప్రాజెక్టులు రద్దు?గార్ట్నర్ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి సుమారు 40 శాతం ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం.. అంచనాలకు మించి నిర్వహణ ఖర్చులు పెరగడం, వ్యాపార పరంగా స్పష్టమైన విలువ జోడింపు కనిపించకపోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలాఉండగా, కేవలం ఏఐ మోడల్స్ను కొనుగోలు చేయడం వల్ల లాభం లేదని, పని విధానాన్ని పునర్నిర్మించడం, పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే ఫలితాలు వస్తాయని మెకిన్సే పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.అడ్డంకిగా అవాస్తవ సమాచారంఏఐ వ్యవస్థలు ఇచ్చే సమాచారం ఎంతవరకు నమ్మదగినది? అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద కంపెనీలను వేధిస్తోంది. కేపీఎంజీ 2025 నివేదిక ప్రకారం.. 54 శాతం మంది ప్రతినిధులు డేటాలో ఉన్న అశాస్త్రీయతను ప్రధాన రిస్క్గా భావిస్తున్నారు. 45 శాతం మంది ఏఐ సృష్టించే తప్పుడు సమాచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల పైలట్ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలోకి రావడానికి జాప్యం జరుగుతోంది. ఇక్కడే గవర్నెన్స్(నియంత్రణ) ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఏఐ తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? అనే అంశాలపై స్పష్టత లేకపోతే సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.సమీకృత పరిష్కారంప్రముఖ టెక్ నిపుణుడు, ఎవాల్యుయేట్ఐక్యూ సహ వ్యవస్థాపకుడు సంజయ్ కొప్పికర్ అభిప్రాయం ప్రకారం.. ఎంటర్ప్రైజ్ ఏఐలో గవర్నెన్స్, సమన్వయం అనేవి విడివిడి అంశాలు కావు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ‘ఏఐని కేవలం అమలు చేయడం ముఖ్యం కాదు, దానిని నియంత్రించగలగడం, వివరించగలగడం, నమ్మదగినదిగా మార్చడం తక్షణ అవసరం’ అని చెప్పారు.భారీ పెట్టుబడులు - రాబడిపై ఆందోళనలుటెక్ దిగ్గజాలు జనరేటివ్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. నిత్యం కొత్త వెర్షన్లు, కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటంతో పాత టెక్నాలజీ త్వరగా కాలం చెల్లిపోతోంది. దీంతో పెట్టుబడిని ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.దాంతో కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి చిన్న, ప్రత్యేకమైన మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఏఐ ఇచ్చే అవుట్పుట్ నమ్మదగ్గదిగా ఉంటేనే క్లయింట్లు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ట్రస్ట్ను ఒక ఫీచర్గా కంపెనీలు అమ్ముతున్నాయి. పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా మానవ పర్యవేక్షణ ఉండేలా హైబ్రిడ్ వర్క్ ఫ్లోలను డిజైన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్! -
ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణపై అవగాహన మెరుగుపడినప్పటికీ పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రత విషయంలో మాత్రం ఇంకాస్త అప్రమత్తత అవసరమని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, కాంతార్తో కలిసి నిర్వహించిన ఐదో ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (ఐరిస్ 5.0)’ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దక్షిణాదిలో రిటైర్మెంట్ ఇండెక్స్ 2022లో 43 పాయింట్లు ఉండగా 2025 నాటికి అది స్వల్పంగా మారి 45కు చేరింది. అయితే జాతీయ సగటు (44 నుంచి 48కి)తో పోలిస్తే ఈ వృద్ధి నెమ్మదిగానే ఉంది.నివేదికలోని అంశాలు..దక్షిణాది ప్రజలు తమ ఫిట్నెస్పై మునుపటి కంటే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.ప్రతిరోజూ వ్యాయామం చేసే వారి సంఖ్య 37% నుంచి 44%కి పెరిగింది. ఇది జాతీయ వృద్ధి రేటు కంటే ఎక్కువ.ఆరోగ్య ధీమా: సుమారు 80 శాతం మంది తాము పదవీ విరమణ తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.డిజిటల్ హెల్త్: వెల్నెస్ యాప్లను ఉపయోగించడంలో దక్షిణాది వాసులు (18%) జాతీయ సగటు (15%) కంటే ముందున్నారు.బీమా: హెల్త్ చెకప్ల పట్ల ఆసక్తి పెరిగినప్పటికీ ఆరోగ్య బీమా వినియోగం మాత్రం 44% వద్దే నిలిచిపోయింది. ఇది జాతీయ సగటు (50%) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.10 ఏళ్లకే నిధులు ఖాళీ?పదవీ విరమణ ప్రణాళిక అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని 54% మంది భావిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం వెనుకబడి ఉన్నారు.దేశవ్యాప్తంగా 67% మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెడుతుంటే దక్షిణాదిలో అది కేవలం 61% మాత్రమే ఉంది.రిస్క్ ఉన్నా అధిక లాభాలనిచ్చే ఇన్వెస్ట్మెంట్లలో పెట్టుబడులు కేవలం 33% మాత్రమే ఉండగా, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి సాంప్రదాయ పద్ధతులపైనే (58%) ఎక్కువగా ఆధారపడుతున్నారు.తమ పొదుపు మొత్తాలు రిటైర్మెంట్ తర్వాత పదేళ్లకు మించి రావని 27% మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఆస్తులు (39%), ఇతర తక్షణ ఖర్చుల (33%) కారణంగా పదవీ విరమణ పొదుపుపై దృష్టి పెట్టలేకపోతున్నామని సర్వేలో తేలింది.ఒంటరితనం దూరంఆర్థికంగా వెనుకబడటం మినహాయిస్తే కుటుంబ మద్దతు విషయంలో దక్షిణాది వాసులు ధైర్యంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులు అండగా ఉంటారనే నమ్మకం 57 శాతానికి పెరిగింది. గతంలో 75 శాతంగా ఉన్న ఒంటరితనపు భయంతో ఉండేవారు. ప్రస్తుతం ఇది 68 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం.‘ఆరోగ్యం, వెల్నెస్ పట్ల అవగాహన పెరగడం శుభపరిణామం. అయితే ఆలోచనలకు ఆచరణ తోడైనప్పుడే పూర్తిస్థాయి పదవీ విరమణ భద్రత లభిస్తుంది. ఆర్థిక ప్రణాళికల్లో ఉన్న ఈ అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది’ అని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాహుల్ తల్వార్ అన్నారు. దక్షిణాదిలో ప్రజలు ఆరోగ్యంగా, మానసికంగా బలంగా మారుతున్నప్పటికీ ఆర్థికంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మదుపు చేయడం ద్వారానే సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు! -
లోన్ కావాలా? ఇవి తెలియకపోతే ఇబ్బందే!
ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇల్లు, కారు కొనుగోలు లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం రుణం తీసుకోవడం సర్వసాధారణం. అయితే, అవసరం కదా అని ఏ ఆర్థిక సంస్థ కనిపిస్తే అందులో అప్పు చేయడం భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు. అందుకే, ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సిన కొన్ని కీలక అంశాలను పాఠకుల కోసం అందిస్తున్నాం.క్రెడిట్ స్కోరురుణం మంజూరు చేయడంలో క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోరు ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తాయి. దరఖాస్తుకు ముందే మీ స్కోరును సరిచూసుకోండి. ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే దాన్ని మెరుగుపరుచుకున్నాకే లోన్కు వెళ్లడం ఉత్తమం.ఎలాంటి వడ్డీ రేటో ముందే తెలుసుకోండి..వడ్డీ రేట్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్థిర వడ్డీ. ఇందులో రుణ కాలపరిమితి మొత్తం వడ్డీ మారదు. రెండోది ఫ్లోటింగ్ రేటు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు మార్పులకు అనుగుణంగా వడ్డీ మారుతుంటుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీకు ఏది లాభదాయకమో నిర్ణయించుకోండి.తిరిగి చెల్లించే సామర్థ్యంనెలవారీ ఆదాయంలో 40% నుంచి 50% మించి అన్ని లోన్ల ఈఎంఐలు ఉండకుండా చూసుకోవాలి. లోన్ తీసుకునే ముందే ఆన్లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా మీరు ఎంత చెల్లించగలరో లెక్కవేసుకోండి.ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలుకేవలం వడ్డీ రేటు మాత్రమే కాదు.. లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, జీఎస్టీ వంటి వాటిపై కూడా కన్నేయాలి. ఒక్కోసారి తక్కువ వడ్డీ అని చెప్పి ఇతర ఫీజుల రూపంలో భారీగా వసూలు చేసే అవకాశం ఉంది.లోన్ కాలపరిమితికాలపరిమితి పెరిగే కొద్దీ నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది కానీ, మీరు చెల్లించే మొత్తం వడ్డీ భారం పెరుగుతుంది. కాబట్టి, మీ ఆర్థిక స్థితిని బట్టి సాధ్యమైనంత తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం తెలివైన పని.ముందస్తు చెల్లింపు నిబంధనలుమీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు లోన్ మొత్తాన్ని ముందే కట్టేయాలని అనుకుంటే బ్యాంకులు ఏమైనా పెనాల్టీలు విధిస్తున్నాయో అడగండి. ముఖ్యంగా పర్సనల్ లోన్ల విషయంలో ఈ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి.ఇతర నిబంధనలులోన్ అగ్రిమెంట్పై సంతకం చేసే ముందు ‘ఫైన్ ప్రింట్’ (లోసుగులతో కూడిన ఇతర నిబంధనలు) చదవండి. బీమా తీసుకోవాలనే నిబంధన లేదా సర్వీస్ ఛార్జీల పెంపు వంటి అంశాలు అందులో ఉండవచ్చు.ఇతర బ్యాంకుల ధరలతో పోలికఒక్క బ్యాంక్తోనే ఆగిపోకుండా కనీసం 3-4 ఆర్థిక సంస్థల ఆఫర్లను పోల్చి చూడండి. ప్రస్తుతం అనేక వెబ్సైట్లు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను ఒకే చోట పోల్చి చూసే వెసులుబాటును కల్పిస్తున్నాయి.లోన్ ఇన్సూరెన్స్దురదృష్టవశాత్తూ రుణగ్రహీతకు ఏదైనా జరిగితే, ఆ అప్పు కుటుంబ సభ్యులపై భారం కాకుండా ఉండేందుకు లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఇది తప్పనిసరి కాకపోయినా భద్రత దృష్ట్యా ఆలోచించదగ్గ విషయం.బ్యాంక్ విశ్వసనీయత, సేవలుకేవలం తక్కువ వడ్డీ ఇస్తున్నారని తెలియని యాప్ల ద్వారా లేదా గుర్తింపు లేని సంస్థల ద్వారా రుణాలు తీసుకోవద్దు. ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలను మాత్రమే ఎంచుకోండి. అలాగే వారి కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో కూడా తెలుసుకోండి.రుణం అనేది అవసరానికి ఆసరా కావాలి కానీ, అది మీ ప్రశాంతతను దూరం చేసే భారం కాకూడదు. పైన పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు! -
ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీమియం ఇంధనాలతో పాటు వాణిజ్య ఎల్పీజీ, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరికీ షాక్ ఇచ్చింది.ప్రీమియం ఇంధనాలకు ధరల సెగలగ్జరీ కార్లు, సూపర్ బైక్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్పీ100 (100-ఆక్టేన్ పెట్రోల్) ధర ఢిల్లీలో లీటరుకు ఏకంగా రూ.11 పెరిగింది. దాంతో రూ.149 నుంచి రూ.160 కు చేరింది. ఎక్స్ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) రూ.91.49 నుంచి రూ.92.99 కు పెంచింది. రెండు వారాల క్రితమే హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) తన ప్రీమియం పెట్రోల్ ధరను రూ.101.89 కు సవరించగా ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కూడా అదే బాటలో పయనించింది.రూ.2,000 దాటిన వాణిజ్య సిలిండర్ ధరవ్యాపారస్తులు, హోటళ్లు, క్యాటరింగ్ రంగంపై కమర్షియల్ ఎల్పీజీ భారం పడింది. జనవరి 1, 2026 నుంచి ఇది ఇటీవలి పెంపుతో ఐదోసార్లు ధరలు పెంచినట్లయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర (ఏప్రిల్ 1) రూ.2,078.50 (19 కిలోల సిలిండర్)గా ఉంది. మార్చి 1 నాటి ధర రూ.1,768.50. గత నెల రోజుల్లోనే రూ.310 మేర భారం పడింది.ఏటీఎఫ్ రూ.2 లక్షలువిమానయాన రంగం మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కిలోలీటరుకు రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో ధర రూ.2,07,341.22 (కిలోలీటరుకు). గతంలో 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో గరిష్టంగా రూ.1.1 లక్షలు ఉన్న ధర, ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా అన్ని రికార్డులను తుడిచివేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన ప్రయాణ భారాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ ఊరటప్రీమియం ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ సాధారణ వాహనదారులపై భారం పడకుండా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సాధారణ పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ధరల సెగ తగలకుండా చూసేందుకు మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల చమురు కంపెనీలకు కలిగే భారీ నష్టాలను భర్తీ చేయడంతో పాటు రిటైల్ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు! -
మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
1850 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 567 పాయింట్లు పెరిగి 22,901 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1874 పాయింట్లు ఎగబాకి 73,833 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.19 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.91 శాతం పెరిగింది.నాస్డాక్ 3.83 శాతం పుంజుకుంది.Today Nifty position 01-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిణామాలు కేవలం పెట్రోల్ ధరలనో, స్టాక్ మార్కెట్లనో ప్రభావితం చేస్తాయని భావిస్తే పొరపాటే. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర పోరు ఇప్పుడు సామాన్యుడి వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా దేశంలోని కండోమ్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతీయ రబ్బరు పరిశ్రమ వర్గాల తాజా సమాచారం ప్రకారం, కండోమ్ల తయారీ వ్యయం గణనీయంగా పెరగడమే కాకుండా సరఫరా గొలుసు పూర్తిగా అస్తవ్యస్తమైంది.ఏమిటీ సమస్య?భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీదారులలో ఒకటి. అయితే, ఈ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా ఇప్పుడు యుద్ధం కారణంగా సంక్షోభంలో పడింది. కండోమ్ తయారీలో వాడే సింథటిక్ రబ్బరు, ఇతర పెట్రోకెమికల్ అనుబంధ పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఎందుకు ఈ అంతరాయం?కండోమ్ల తయారీలో వాడే పాలిమర్లు, సింథటిక్ రబ్బరు, లూబ్రికెంట్లు ముడి చమురు ఉప ఉత్పత్తులు. యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధర పెరగడంతో వీటి తయారీ వ్యయం 30% నుంచి 40% వరకు పెరిగింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా భారత్కు వచ్చే రసాయనాలు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉత్పత్తి కేంద్రాల్లో ముడి పదార్థాల కొరత ఏర్పడింది. ఎర్ర సముద్రం ప్రాంతంలో అస్థిరత వల్ల నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో రావాల్సి వస్తోంది. దీనివల్ల ఫ్రైట్ ఛార్జీలు పెరగడంతోపాటు డెలివరీ సమయం 20 రోజుల నుంచి 40 రోజులకు పెరిగింది.ఎవరు ప్రభావితమవుతున్నారు?దేశంలోని దిగ్గజ కండోమ్ తయారీ సంస్థలు పెరిగిన ఖర్చులను భరించలేక ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను 10% నుంచి 20% వరకు పెంచే యోచనలో ఉన్నాయి. భారత్ నుంచి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు జరిగే కండోమ్ ఎగుమతులు మందగించాయి. ఇది దేశీయ విదేశీ మారక నిల్వలపై కూడా ప్రభావం చూపుతుంది. ఉచితంగా పంపిణీ చేసే గర్భనిరోధక సాధనాల కోసం ప్రభుత్వం వెచ్చించే బడ్జెట్ భారం పెరగనుంది.ఎక్కడ ప్రభావం ఎక్కువగా ఉంది?భారతదేశంలో రబ్బరు ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని తయారీ యూనిట్లు ఈ ముడి పదార్థాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సింథటిక్ రబ్బరు కోసం మనం సుమారు 48% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం.ఎంత మేర నష్టం?గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల రబ్బరు రసాయనాల దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. పరిశ్రమ వర్గాల లెక్కల ప్రకారం, పెరిగిన లాజిస్టిక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంల వల్ల ఒక్కో కంటైనర్ రవాణా ఖర్చు రెట్టింపు అయ్యింది.ముందున్న సవాళ్లుయుద్ధం మరికొంత కాలం కొనసాగితే కేవలం కండోమ్లే కాకుండా గ్లౌజులు, క్యాథెటర్లు వంటి వైద్య పరికరాల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారనున్నాయి. గ్లోబల్ సప్లై చైన్ ఎంతటి సున్నితమైనదో ఈ పరిస్థితి అర్థం చేస్తోంది. ఇంధన భద్రతతో పాటు రసాయన ముడి పదార్థాల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: ఎరువుల ముందస్తు కొనుగోళ్లపై అప్రమత్తత -
మళ్లీ షాక్.. పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ భారత్లోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.195.5, కోల్కతాలో రూ.218 పెరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు ఈ మేరకు ప్రకటన చేశాయి.ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.195.50 పెరగడంతో కొత్త రిటైల్ ధర రూ.2,078.50కు చేరింది. ఇప్పటికే మార్చి 1న ప్రతి సిలిండర్పై రూ.114.5 పెంచిన విషయం తెలిసిందే.సిలిండర్ల ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు వంటి కమర్షియల్ రంగంపై ప్రభావం చూపుతోంది. గృహ వినియోగదారులకు మాత్రం తాత్కాలికంగా ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర మార్చి 7న రూ.60 పెరిగి, రూ.913కు చేరింది. ఆ తర్వాతి నుంచి ఈ ధరల్లో ఎలాంటి మార్పులేదు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రధాన చమురు సంస్థలు ప్రతి నెల ఒకటో తేదీన అంతర్జాతీయ ప్రమాణాలు, కరెన్సీ మార్పిడి రేట్ల ఆధారంగా ఈ ధరలను సవరిస్తాయి.ఎల్పీజీ మార్కెట్లో మార్పులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.72గా ఉండగా, డీజిల్ రూ.87.62గా ఉంది. గత సంవత్సరం మార్చిలో లీటరుకు రూ.2 తగ్గింది. ఆ తర్వాత ఈ ధరల్లో మార్పు లేదు. -
మొబైల్స్, ఏసీ రేట్లకు రెక్కలు
ముడి వస్తువుల వ్యయాల పెరుగుదల, రూపాయి విలువ క్షీణిస్తుండటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్లాంటి ప్రతికూల పరిస్థితులతో మొబైల్స్, టీవీల నుంచి ఎయిర్ కండీషనర్ల వరకు అన్నింటి రేట్లకు రెక్కలొస్తున్నాయి. గత నవంబర్–డిసెంబర్ నుంచి స్మార్ట్ఫోన్లు, టీవీల రేట్లు ప్రతి 30–60 రోజులకోసారి పెరుగుతూనే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఉత్పత్తి పరిమాణం పెరిగే కొద్దీ, ముడి వస్తువుల వ్యయాలు తగ్గి కంపెనీలు చౌకగా ఉత్పత్తులను అందించేందుకు ప్రయత్నిస్తాయి.ఒకవేళ కొన్నాళ్లు పరిస్థితి అటూ ఇటూ అయినా అమ్మకాలను పోగొట్టుకోవడానికి ఇష్టపడక, అదనపు భారమేదైనా పడితే తామే భరించి, రేట్లను పెంచకుండా జాగ్రత్త పడుతుంటాయి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో భారాన్ని వినియోగదారులకి బదలాయిస్తున్నాయి. దీనితో ఎంట్రీ లెవెల్ టీవీలు, స్మార్ట్ఫోన్ల ధరలు తిరిగి 6–8 ఏళ్ల క్రితం నాటి స్థాయికి చేరుకుంటున్నాయి.వేసవి వడగాలి..: ఏసీల్లో పెద్ద ఎత్తున అమ్ముడయ్యే కేటగిరీ ఉత్పత్తులు, ఫ్రిజ్లు,, వాషింగ్ మెషిన్ల ధరలు కూడా ఈ నెల నుంచి భారీగా పెరుగుతున్నాయి. తొలిసారిగా కొనుక్కునే వారు ఎక్కువగా మొగ్గు చూపే 3 స్టార్ 1.5 టన్ను ఏసీల రేట్లు గతేడాది వేసవిలో సుమారు రూ. 32,000–34,000గా ఉండగా ఈ ఏప్రిల్లో రూ. 37,000–40,000కు పెరగనున్నాయి. కమోడిటీల ధరలు పెరగడం, కొత్త ప్రమాణాల అమలు కారణంగా ఏసీల రేట్లు 12 శాతం వరకు పెరగనున్నట్లు బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ ఇటీవలే వెల్లడించారు. ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు వివరించారు.మరోవైపు, ఎంట్రీ లెవెల్ 5జీ స్మార్ట్ఫోన్ల రేట్లు దీపావళి సమయంలో రూ. 10,000 లోపు ఉండగా, ప్రస్తుతం 13,000–14,000కి చేరాయి. కొన్ని బ్రాండ్స్ అయితే రాబోయే 2–3 నెలల్లో ఈ ఫోన్ల రేట్లు రూ. 20,000కి కూడా చేరొచ్చని చెబుతున్నాయి. 32 అంగుళాల స్మార్ట్ టీవీ రేటు గతేడాది రూ. 6,500 స్థాయిలో ఉంటే, ఇప్పుడు రూ. 8,500గా ఉందని, మే నాటికి రూ. 10,000కు చేరొచ్చనేది పరిశ్రమ వర్గాలు మాట. వివో, ఒప్పో, శాంసంగ్, షావోమీలాంటి బ్రాండ్లు కొన్ని స్మార్ట్ఫోన్ల రేట్లను 10 శాతం వరకు పెంచనున్నట్లు సంకేతాలిచి్చనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మెమొరీ చిప్ల రేట్లు గత 5–6 నెలలుగా పెరగడం, గల్ఫ్ యుద్ధంతో పాటు రూపాయి బలహీనపడటమనేది కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించాయి. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ వైపు చూపు..సాధారణంగా త్రైమాసికాలవారీగా రేట్లను తగ్గించడం, డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు ప్రకటించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించేందుకు, తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకపోగా రేట్లు మరో పది శాతం వరకు పెరగనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనితో డిమాండ్పైనా ప్రభావం పడుతోంది. కొత్త ఫోన్లకు బదులు సెకండ్ హ్యాండ్, రీఫర్బి‹Ù్డ ఫోన్ల వైపు కొందరు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండగా, మరికొందరు పూర్తిగా కొనుగోలు నిర్ణయాన్నే వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూ. 20,000 వరకు ఖరీదు చేసే ఫోన్లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలంటూ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసేందుకు మొబైల్ రిటైలర్ల సంఘం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది 18 శాతంగా ఉంది. -
భారత్లో ఒరాకిల్ 12,000 మందికి ఉద్వాసన
న్యూఢిల్లీ: యూఎస్ ఐటీ దిగ్గజం ఒరాకిల్ తాజాగా దేశీయంగా విధులు నిర్వహిస్తున్న 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ బాటలో ప్రపంచవ్యాప్తంగా 30,000 ఉద్యోగాలకు కోత పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెలలో మరింత మందిని ఉద్యోగాల నుంచి తప్పించనున్నట్లు సమాచారం. దేశీయంగా కంపెనీలో సుమారు 30,000 మంది పనిచేస్తున్నారు.అయితే ఈ అంశాలపై స్పందించేందుకు ఒరాకిల్ నిరాకరించడం గమనార్హం! సిబ్బందికి ఈమెయిల్ ద్వారా ఉద్యోగ కోత వివరాలను ఒరాకిల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కనీసం ఏడాదిపాటు సేవలందించిన ఉద్యోగులకు 15 రోజుల వేతనంసహా.. లీవ్ ఎన్క్యా‹Ùమెంట్, అర్హతగలవారికి గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు ఆఫర్ చేస్తోంది. -
ఎఫ్అండ్వోపై లావాదేవీల పన్ను అప్
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు నిబంధనల భారం తగ్గనుంది. ఇందుకు వీలు కల్పిం చే కొత్త ఆదాయపన్ను చట్టం– 2025 నేటి నుంచి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వస్తోంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టాన్ని సులభతరంగా తీర్చిదిద్దినట్టు కేంద్రం చెబుతోంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) పెరగనుంది. విదేశీ పర్యటనలు, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపే నిధులపై మూలం వద్దే పన్ను కోత (టీసీఎస్) తగ్గనుంది. అలాగే, భారత్ నుంచి డేటా సెంటర్ సేవలను పొందే విదేశీ కంపెనీలపై 20 ఏళ్ల వరకు పన్ను భారం ఉండదు. ⇒ కొత్త చట్టానికి మారే క్రమంలో.. ఈ–ఫైలింగ్ పోర్టల్ పాత, కొత్త పన్ను చట్టాల్లోని నిబంధనల అమలుకు వీలు కల్పించనుంది. ముందటి సంవత్సరాలకు సంబంధించి అన్ని మదింపులు, అప్పీళ్లు పాత పన్ను చట్టం కిందే కొనసాగుతాయి. ⇒ అసెస్మెంట్ సంవత్సరం 2026–27 (2025–26 ఆర్థిక సంవత్సరం) రిటర్నులను పాత పన్ను చట్టం కింద దాఖలు చేయాల్సి ఉంటుంది. ⇒ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపులు జూన్ నుంచి ప్రారంభం కానుండగా, అవి కొత్త చట్టం కిందే అమలు కానున్నాయి. ⇒ గతంలో అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనేవి ఉండేవి. ఇకపై ‘పన్ను సంవత్సరం’ అమల్లోకి రానుంది. ⇒ ఐటీఆర్లను గడువు తర్వాత దాఖలు చేసినప్పటికీ టీడీఎస్ రిఫండ్ కోరవచ్చు. ⇒ ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై ఎస్టీటీ 0.02% నుంచి 0.05 శాతానికి పెరగనుంది. ఆప్షన్ల ప్రీమియంపై ఎస్టీటీ 0.1 శాతం నుంచి 0.15 శాతానికి, ఆప్షన్ల ఎక్సర్సైజ్పై 0.125 శాతం నుంచి 0.15 శాతానికి పెరగనుంది. తద్వారా ఎఫ్అండ్వోలో స్పెక్యులేషన్ తగ్గుతుందన్నది ప్రభుత్వం అంచనా. చిన్న ఇన్వెస్టర్లు నష్టపోకుండా చూడొచ్చని కేంద్రం భావిస్తోంది. ⇒ విదేశీ పర్యాటక ప్యాకేజీల కోసం చేసే చెల్లింపులపై 20 శాతంగా ఉన్న టీసీఎస్ 18 శాతానికి తగ్గనుంది. ⇒ విదేశాల్లో వైద్యం, విద్య కోసం చేసే నగదు తరలింపులపై 5 శాతం స్థానంలో 2 శాతం టీసీఎస్ చెల్లిస్తే చాలు. ⇒ 20 ఏళ్ల పన్ను రహిత ప్రయోజనంతో డేటా సెంటర్ కంపెనీలు ప్రయోజనం పొందనున్నాయి. భారత డేటా సెంటర్ల నుంచి సేవలు పొందే విదేశీ కంపెనీలు ఇకపై పన్ను చెల్లించక్కర్లేదు. ఇది పరోక్షంగా భారత డేటా సెంటర్ కంపెనీలకు మేలు చేయనుంది. సొంతంగా భారత్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకూ ఈ ప్రయోజనం దక్కనుంది. ⇒ ఐటీ సేవలకు సంబంధించి ‘సేఫ్ హార్బర్’ విధానం కింద అర్హత పరిమితిని రూ.300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంచారు. ఐటీ, ఐటీఈఎస్, కేపీవో, కాంట్రాక్ట్ ఆర్అండ్డీ సేవలన్నీ ఐటీ సేవల కిందే పరిగణించనున్నారు. ⇒ బ్యాంకుల్లో రూ.50 వేలు మించిన జమలపై కాకుండా.. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలు మించినప్పుడు పాన్ ఇస్తే సరిపోతుంది. ⇒ ఇల్లు లేదా భూమి కొనుగోలు, విక్రయం, జాయింట్ డెవలప్మెంట్ లావాదేవీలు రూ.20 లక్షలు దాటితేనే ఇకపై పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలు. ⇒ ఇకపై ఏ వాహన కొనుగోలు అయినా విలువ రూ.5 లక్షలకు మించితే పాన్ ఇవ్వాల్సిందే. ⇒ హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తులకు చేసే చెల్లింపులు లక్ష రూపాయలు మించితే ఇకపై పాన్ తప్పనిసరి. ⇒ జీవిత బీమా పాలసీ కొనుగోలుకు పాన్ ఇవ్వడం తప్పనిసరి. -
కారు కొనాలంటే.. అదనపు భారం!
కొత్త కారు కొనాలనుకునే ప్లాన్ చేస్తున్నారా?, అయితే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరంలో మీరు కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి కారణం ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడమే.టాటా మోటార్స్ నుంచి.. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్-బెంజ్, ఎంజీ మోటార్, హోండా మోటార్స్ వంటి పలు ప్రధాన ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపును ప్రకటించాయి.బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్లు ధరలను సుమారు 2 శాతం మేర పెంచనున్నాయి. మరోవైపు. టాటా మోటార్స్ టియాగో, నెక్సాన్, సఫారీ వంటి జనాదరణ పొందిన మోడళ్ల ధరలను రూ.13,000 వరకు పెంచుతోంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. పెరుగుతున్న ఖర్చులు, బలహీనపడుతున్న రూపాయి, అధిక ముడిసరుకుల ధరలు, పెరిగిన రవాణా ఖర్చులు అని సంస్థలు వెల్లడిస్తున్నాయి. -
బంగారం ధరలు.. ఊహకందని మార్పులు!
ఇటీవల కాలంలో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే ఊహకందని విధంగా మారిపోతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే.. సాయంత్రానికి మరో రేటు ఉంది. ఈ రోజు కూడా ఇదే బాటలు గోల్డ్ రేటు అడుగులు వేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 136850 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 137050 రూపాయల వద్దకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి ధర రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ. 149290 నుంచి 149510 రూపాయల వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల ధర 10 గ్రాముల బంగారం ధర 149660 రూపాయల వద్దకు చేరగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 137200 రూపాయాల వద్దకు చేరింది. ఈ రేట్లు ఉదయానికి, సాయంత్రానికి చాలా తేడా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.అయితే.. చెన్నై నగరంలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర 149130 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుకేజీ వెండి ధర రూ.250000 వద్ద ఉంది. ఈ రోజు (మంగళవారం) కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గడంతో రూ.2.5 లక్షల వద్ద నిలిచింది. అయితే ఢిల్లీలో వెండి రేటు రూ.5000 పెరిగింది. దీంతో అక్కడ కేజీ సిల్వర్ ధర రూ.2.5 లక్షల వద్ద ఉంది. -
పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఇలా..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పీపీఎఫ్ సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగించనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు వివిధ స్మాల్ సేవింగ్స్ స్కీములపై వడ్డీ రేట్లలో మార్పులేమీ ఉండవని ఆర్థిక శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ప్రకారం సుకన్య సమృద్ధి స్కీముపై 8.2 శాతంగా, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 7.1 శాతంగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీములపై వరుసగా 7.1 శాతం, 4 శాతంగా వడ్డీ రేట్లు ఉంటాయి. కిసాన్ వికాస పత్రాలపై 7.5 శాతం, ఎన్ఎస్సీలపై 7.7 శాతం, మంత్లీ ఇన్కం స్కీముపై 7.4 శాతంగా వడ్డీ రేటు కొనసాగుతుంది. కేంద్రం చివరిసారిగా 2023–24 నాలుగో త్రైమాసికంలో కొన్ని పథకాల రేట్లను మార్చింది. -
కొచ్చి చేరుకున్న నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత!
మధ్యప్రాచ్య సంఘర్షణపై నెలకొన్న ఆందోళనల నడుమ.. ఎల్పీజీ, ముడి చమురు నౌకలు కొచ్చికి చేరుకుని వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి. ఖతార్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న 'అపోలో ఓషన్' ట్యాంకర్ నిన్న మధ్యాహ్నం కొచ్చికి చేరుకుంది. ఈ ట్యాంకర్ 9,086 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తోంది.నిన్న మధ్యాహ్నం కొచ్చికి చేరుకున్న ట్యాంకర్, గ్యాస్ను దించిన తర్వాత తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎల్పీజీని ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన వివిధ బాట్లింగ్ ప్లాంట్లకు రవాణా చేస్తారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో, దిగుమతి చేసుకున్న ఎల్పీజీ రాక చమురు కంపెనీలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.ఇదిలా ఉండగా.. రష్యా ముడి చమురు కూడా కొచ్చికి చేరుకుంది. 'నెవా' అనే చమురు ట్యాంకర్ రష్యాలోని కోస్మినో పోర్ట్ నుండి 1,084.80 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో కొచ్చికి చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే త్వరలోనే మన దేశంలో గ్యాస్ కొరత తగ్గుతుందని తెలుస్తోంది. -
నితిన్ గడ్కరీని అనుసరిస్తున్న ట్రంప్!
భారతదేశం ఇంధన దిగుమతులను తగ్గించుకోవాలంటే.. బయోఫ్యూయల్ (జీవ ఇంధనం) మీద ఆధారపడాలని, దీనివల్ల దేశ ఆర్ధిక వృద్ధి పెరుగుతుందని గడ్కరీ చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది.డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల దేశంలోని బయోఫ్యూయల్ కార్యక్రమాన్ని మరింత బలపరచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం.. ఇంధనాల్లో బయోఫ్యూయల్ మిశ్రమాన్ని పెంచేందుకు కొత్త ఫెడరల్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. దీని వల్ల ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలు పండించే రైతులకు లాభం కలగనుంది.పర్యావరణ పరిరక్షణ సంస్థ ఖరారు చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. బయోమాస్ ఆధారిత డీజిల్ మిశ్రమం 60 శాతానికి పైగా పెరుగుతుంది. ఈ ఇంధనాన్ని సాధారణంగా సోయాబీన్ నూనె, జంతువుల కొవ్వులు, ఇతర వ్యవసాయ ముడి పదార్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు. ఈ సంస్థ గ్యాసోలిన్, డీజిల్ కోసం మొత్తం పునరుత్పాదక ఇంధన అవసరాలను కూడా పెంచింది. ఇందులో భాగంగానే 2026, 2027 సంవత్సరాలకు కొత్త లక్ష్యాలను నిర్దేశించింది.బయోఫ్యూయల్ కార్యక్రమం వల్ల.. రైతుల నికర ఆదాయం 3 నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, అమెరికా వ్యవసాయ శాఖ మంత్రి బ్రూక్ రోలిన్స్ వెల్లడించారు. అయితే దీనిపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన రిఫైనరీలు ఈ విధానం వల్ల తమ ఖర్చులు పెరుగుతాయని అంటున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, సరఫరా సమస్యల కారణంగా ఇప్పటికే ఇంధన ధరలు ఒత్తిడిలో ఉన్నాయని, ఈ కొత్త నిబంధనలు మరింత భారాన్ని పెంచవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. -
80.4 శాతానికి ద్రవ్యలోటు
కేంద్ర ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి చివరికి రూ.12.52 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్రవ్యలోటు లక్ష్యంలో 80.4 శాతానికి సమానం. కానీ, అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 85.8 శాతంగా ఉండడం గమనించవచ్చు.2025–26 జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (రూ.15.58 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం.. కేంద్రానికి రూ.27.91 లక్షల కోట్ల ఆదాయం ఫిబ్రవరి చివరికి నాటికి వచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి 82 శాతం సమకూరింది. రూ.21.45 లక్షల కోట్లు పన్నుల రూపంలో, రూ.5.8 లక్షల కోట్లు పన్నేతర రూపంలో వచ్చింది. -
ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్
ఇండియాలో అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో కొత్త సీఈఓను ప్రకటించింది. పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేసిన తరువాత కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 'విలియం వాల్ష్' (Willie Walsh)ను నియమించింది.విలియం వాల్ష్ ప్రస్తుతం IATA (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అంతకంటే ముందు బ్రిటిష్ ఎయిర్వేస్, ఐఏజీ వంటి ప్రముఖ కంపెనీలలో సీఈఓగా పనిచేచినట్లు ఇండిగో వెల్లడించింది.ఇండిగో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా మాట్లాడుతూ.. విలియం వాల్ష్ ఒక అత్యుత్తమ నాయకుడని, ఆయన నాయకత్వంలో సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న విమానయాన రంగంలో ఇండిగోను మరింత బలోపేతం చేయడానికి ఆయన సరైన ఎంపిక అని చెప్పారు.తన నియామకంపై విలియం వాల్ష్ మాట్లాడుతూ.. ఇండిగోను నడిపించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సంస్థకు బలమైన పునాది, స్పష్టమైన లక్ష్యం, మంచి ప్రతిష్ట ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా.. సంస్థలోని ఉద్యోగుల కృషి, నిబద్ధత తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు, సహకారం, స్థిరమైన అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. -
పెరిగిన ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ పీజు!
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 2026 ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ ఫీజును పెంచనున్నట్లు ప్రకటించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) చేసిన ప్రకటన ఆధారంగా.. జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు, 2008కి అనుగుణంగా వార్షిక రుసుమును పెంచింది.ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ ఫీజు కోసం రూ.3075 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దీని ధర రూ.3000 ఉండేది. రేపటి నుంచి అదనంగా రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వినియోగం పెరుగుతున్న సమయంలో ఎన్హెచ్ఏఐ ఫీజును పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు హైవేలు, ఎక్స్ప్రెస్వేలపై ఉన్న 1,150 ఫీజు ప్లాజాలలో వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తాయి.వార్షిక పాస్ ప్రయోజనాలుయాన్యువల్ పాస్ తరచుగా హైవేలపై ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు) ఎంతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు లేదా 200 టోల్ క్రాసింగ్ల వరకు (ఏది ముందు పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది.దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజాల వద్ద యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ పాస్ కలిగిన వాహనదారులు.. ప్రతి ట్రిప్పుకు విడివిడిగా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి చెల్లింపు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎక్స్ప్రెస్వేలు ఈ పాస్ పరిధిలోకి రావు. అక్కడ సాధారణ ఫాస్టాగ్ చార్జీలే వర్తిస్తాయి.ఈ పాస్ ఎలా తీసుకోవాలి?వాహనదారులు తమ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్కే ఈ యాన్యువల్ పాస్ను లింక్ చేసుకోవచ్చు. ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. నగదు చెల్లించిన కొద్దిసేపట్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది.ఇదీ చదవండి: 'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా -
ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి బెటర్!
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఇటీవల రూ.95 మార్కును తాకిన నేపథ్యంలో దేశీయ కరెన్సీ స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరంగా, పటిష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇటీవల లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రూపాయి పతనంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక మూలాధారాలు పటిష్టంగా ఉన్నాయని ఆమె తెలిపారు.రూపాయి భేష్రూపాయి విలువ తగ్గుదలపై స్పందిస్తూ, ‘మిగిలిన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి పరిస్థితి బాగుంది. ఇది మెరుగైన స్థితిలోనే ఉంది’ అని మంత్రి తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు ఇస్తున్నాయని, ముఖ్యంగా మన ద్రవ్యలోటు నిర్వహణ, భారీగా ఉన్న విదేశీ మారక నిల్వలు రూపాయికి రక్షణ కవచంలా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.గణాంకాలు ఇలా..మంత్రి సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాచారం ప్రకారం, మార్చి 27 నాటికి విలువ డాలర్తో పోలిస్తే రూపాయి రూ.94.82 వద్ద ముగిసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 27, 2026 మధ్య కాలంలో రూపాయి విలువ 9.9 శాతం మేర తగ్గింది. ఫిబ్రవరి 28న మిడిల్ఈస్ట్ దేశాల్లో మొదలైన ఉద్రిక్తతల కారణంగా రూపాయి 4.1 శాతం మేర క్షీణించింది.ఆర్బీఐ పర్యవేక్షణరూపాయి విలువ అనేది మార్కెట్ బాహ్య పరిస్థితుల ఆధారంగా నిర్ణయించబడుతుందని, దీనికి ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్ట లక్ష్యాన్ని లేదా పరిమితిని విధించలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే, ఎఫ్డీఐ మార్కెట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరంతరం పర్యవేక్షిస్తోందని, విపరీతమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు జోక్యం చేసుకుంటుందని తెలిపారు. విదేశీ మారకద్రవ్యం రాకను పెంచడానికి, ఇతర దేశాల్లో రూపాయి ఆమోదాన్ని పెంచడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు రూపాయిపై ఒత్తిడిని తగ్గిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు -
ఎరువుల ముందస్తు కొనుగోళ్లపై అప్రమత్తత
రాష్ట్రంలోని సాగు భూముల్లో దుక్కులు దున్నకముందే ఎరువుల విక్రయశాలల వద్ద రైతుల సందడి పెరిగింది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే డిమాండ్ ఈసారి మార్చిలోనే రికార్డు స్థాయికి చేరింది. భవిష్యత్తులో ఎరువుల కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో అన్నదాతలు భారీగా నిల్వలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ గణంకాల ప్రకారం.. మార్చి 23 నాటికే దేశవ్యాప్తంగా ఎరువుల విక్రయాలు అంచనాలను మించిపోవడం గమనార్హం.గణాంకాలు ఏం చెబుతున్నాయి?ఎరువుమార్చి అంచనా డిమాండ్ (లక్షల టన్నుల్లో)మార్చి 23 నాటికే జరిగిన విక్రయాలుయూరియా14.9620.21డీఏపీ2.434.78కాంప్లెక్స్ ఎరువులు7.057.22ఎంఓపీ1.801.58 గత ఏడాది (2025) మార్చి నెల మొత్తం మీద జరిగిన యూరియా విక్రయాలు 16.2 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది మార్చి 23 నాటికే అది 20 లక్షల టన్నులు దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం మార్చి 14 నుంచి 23 మధ్య పది రోజుల్లోనే సుమారు 13 లక్షల టన్నుల యూరియా అమ్ముడైంది.తెలుగు రాష్ట్రాల్లో నిల్వ ధోరణితెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ అసాధారణ డిమాండ్ కనిపిస్తోంది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే వరి సాగు కోసం రైతులు ముందస్తుగానే ఎరువులను నిల్వ చేసుకుంటున్నారు. ఏటా సీజన్ సమయంలో ఎదురవుతున్న కొరతను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుగానే కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘ముఖ్యంగా తక్కువ ధర ఉండే ఎరువులు, గతంలో కొరత ఏర్పడిన వాటిపై రైతులు మక్కువ చూపుతున్నారు. జూన్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయంతోనే ఈ ముందస్తు నిల్వలు జరుగుతున్నాయి’ అని వ్యవసాయ శాస్త్రవేత్త ఏ.కె.సింగ్ అన్నారు.ప్రభుత్వ చర్యలు - క్షేత్రస్థాయి పరిశీలనఈ ఆకస్మిక విక్రయాల పెరుగుదలపై ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని భరోసా ఇస్తోంది. అయితే, పెరిగిన విక్రయాల వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించింది.స్టాక్ వెరిఫికేషన్క్షేత్రస్థాయిలో ఎరువుల నిల్వలపై భౌతిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిజంగా రైతులే కొంటున్నారా? లేక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడానికి రికార్డుల్లో విక్రయాలు చూపి నిల్వ చేస్తున్నారా? అనే కోణంలో విచారణ జరపాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కొంతమేరకు మొక్కజొన్న, చెరకు పంటల కోసం విక్రయాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు.ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు -
రేపటి నుంచి కొత్త లేబర్ కోడ్లు అమలు?
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మికుల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లు అమలుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్లిష్టమైన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో సరళీకరించిన ఈ నూతన కోడ్లను ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేయాల్సి ఉంది.స్వాతంత్య్రానికి పూర్వం నాటి పాత చట్టాలకు స్వస్తి పలికి మారుతున్న సాంకేతికత, పని వాతావరణానికి అనుగుణంగా ఈ సంస్కరణలను తీసుకువచ్చారు. గత ఏడాది నవంబర్ 21, 2025న కేంద్రం వీటిని అధికారికంగా ప్రకటించినప్పటికీ రాష్ట్రాల నిబంధనల రూపకల్పన ప్రక్రియలో ఉండటంతో అమలు తేదీపై సందిగ్ధత నెలకొంది. తాజాగా, కార్మిక శాఖ ఈ నిబంధనలను ఖరారు చేసి న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపినట్లు సమాచారం.ఏమిటి ఈ కొత్త కోడ్లు?1. వేతనాల కోడ్, 2019: వేతనాల పంపిణీ, కనీస వేతనాల క్రమబద్ధీకరణ.2. పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020: యాజమాన్యం, కార్మికుల మధ్య సత్సంబంధాలు, వివాదాల పరిష్కారం.3. సామాజిక భద్రత కోడ్, 2020: అసంఘటిత రంగ కార్మికులకు కూడా బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు.4. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, 2020: పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్య ప్రమాణాలు.జీతం లెక్కల్లో మార్పు..కొత్త కోడ్ల ప్రకారం వేతనం నిర్వచనంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఒక ఉద్యోగి పొందే మొత్తం జీతంలో ప్రాథమిక వేతనం (బేసిక్ పే), కరువు భత్యం (డీఏ), రిటైనింగ్ అలవెన్స్ కలిపి కనీసం 50 శాతం ఉండాలి. ఒకవేళ ఇతర అలవెన్సులు 50 శాతం మించితే ఆ అదనపు మొత్తాన్ని కూడా వేతనంగానే పరిగణిస్తారు. బేసిక్ పే పెరగడం వల్ల భవిష్య నిధి (పీఎఫ్), గ్రాట్యుటీ విరాళాలు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో కార్మికుడికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. అయితే ప్రతి నెలా చేతికి వచ్చే నికర జీతం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.కీలక సంస్కరణలు - ముఖ్యాంశాలుఈ నూతన చట్టాలు అమలులోకి వస్తే లింగ భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన వేతనం అందుతుంది.సామాజిక భద్రతను నిర్ధారించడానికి ప్రతి కార్మికుడికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం ఇకపై తప్పనిసరి.కాంట్రాక్ట్ లేదా నిర్ణీత కాలానికి పనిచేసే వారికి కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు అందుతాయి.ఫిర్యాదుల పరిష్కార కమిటీల్లో మహిళలకు తప్పనిసరిగా చోటు కల్పించాలి.500 మంది కంటే ఎక్కువ కార్మికులు ఉన్న సంస్థల్లో ప్రత్యేక సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి.పెన్షన్ పథకంలో మార్పులుకేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) 1995 స్థానంలో కొత్త సవరించిన పథకం రానుంది. సామాజిక భద్రత కోడ్ కింద రూపొందించే ఈ కొత్త పెన్షన్ విధానం అమలులోకి వచ్చే వరకు పాత విధానమే కొనసాగుతుంది.కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిబంధనలను ఖరారు చేసింది. ప్రస్తుతం ఇవి న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి. అయితే కార్మిక అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోని నిబంధనలను ఖరారు చేసి నోటిఫై చేయాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముసాయిదా నిబంధనలను సిద్ధం చేశాయి.ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు -
అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు
భారతీయ కుటుంబ వ్యవస్థలో నైతిక విలువలకు, చట్టబద్ధమైన బాధ్యతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం, ఒక కోడలు తన అత్తమామలకు భరణం చెల్లించాల్సిన చట్టపరమైన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.కేసు నేపథ్యం ఏమిటి?ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఒక మహిళపై ఆమె అత్తమామలు కోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడు మరణించాడని, తాము వృద్ధులమని, నిరక్షరాస్యులమని, ఎటువంటి ఆదాయ వనరులు లేని పేదలమని వారు పేర్కొన్నారు. తమ కోడలు తన భర్తకు రావాల్సిన సర్వీసు ప్రయోజనాలన్నింటినీ పొందిందని, పైగా ఆమెకు స్వతంత్ర ఆదాయం ఉన్నందున తమను పోషించాల్సిన బాధ్యత ఆమెపై ఉందని వారు వాదించారు.గతంలో ఆగ్రాలోని కుటుంబ కోర్టు ఆగస్టు 2025లో వీరి పిటిషన్ను తిరస్కరించింది. తాజాగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 144 కింద తాము భరణం పొందేందుకు అర్హులమని కోరుతూ వృద్ధ దంపతులు వేసిన రీపిటిషన్పై జస్టిస్ మదన్ పాల్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.కోర్టు వ్యాఖ్యలువిచారణ సందర్భంగా జస్టిస్ మదన్ పాల్ సింగ్ చట్టంలోని నిబంధనలను విశ్లేషించారు. ‘భరణం కోరే హక్కు అనేది కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రమే. సెక్షన్లో స్పష్టంగా పేర్కొన్న వ్యక్తుల వర్గాలకు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు) మాత్రమే ఇది పరిమితం. అత్తమామలు ఈ పరిధిలోకి రారు. నైతిక బాధ్యత అనేది ఎంత బలంగా ఉన్నప్పటికీ చట్టబద్ధమైన ఆదేశం లేని పక్షంలో దానిని చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం’ అని కోర్టు స్పష్టం చేసింది. అత్తమామలను ఈ నిబంధన పరిధిలోకి చేర్చకూడదని శాసనసభ తన విచక్షణతోనే నిర్ణయించిందని, కోడలిపై అత్తమామల పోషణ బాధ్యతను మోపడం చట్టం ఉద్దేశం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.వారసత్వ ఆస్తులపై స్పష్టతపిటిషనర్లు వాదించినట్లుగా.. కోడలు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది. అలాగే, మరణించిన కుమారుడి ఆస్తి వారసత్వానికి సంబంధించిన అంశాలు ఇటువంటి భరణం కేసుల విచారణ పరిధిలోకి రావని హైకోర్టు తేల్చి చెప్పింది.చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమారుడిపై లేదా కుమార్తెపై ఉంటుంది తప్ప, కోడలిపై అత్తమామలను పోషించాలనే చట్టపరమైన నిబంధన లేదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇటువంటి అనేక కుటుంబ వివాదాల్లో కీలకంగా నిలవనుంది.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పిల్లల భోజనానికి వాఘ్ బక్రీ చేయూత
అక్షయపాత్ర ఫౌండేషన్కు వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఫౌండేషన్ ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది ఆహార పంపిణీ వాహనాలను అందించింది. హైదరాబాద్లోని కంది, ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఈ వాహనాలను ప్రారంభించారు. వీటిలో ఐదు తెలంగాణకు, మూడు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఈ వాహనాలు ఉష్ణోగ్రత నియంత్రణ సదుపాయాలతో ఉండి, పాఠశాల పిల్లలకు వేడి, పోషకాహార భోజనం సమయానికి అందేలా సహకరిస్తాయి.ఈ ఎనిమిది వాహనాల కోసం రూ.99 లక్షలు ఖర్చు చేశారు. దీంతో వాఘ్ బక్రీ ఫౌండేషన్ ఇప్పటివరకు మొత్తం 38 వాహనాలను అందించి, సుమారు రూ.5 కోట్లను ఖర్చు చేసింది. ఈ సందర్భంగా వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాస్ దేశాయ్ మాట్లాడుతూ, ‘‘అక్షయపాత్రతో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావడం గర్వంగా ఉంది. ఈ వాహనాలు దూర ప్రాంతాల్లోని పిల్లలకు పోషకాహార భోజనాన్ని సురక్షితంగా, సమయానికి అందేలా కీలక పాత్ర పోషిస్తాయి. విద్యకు మద్దతు ఇవ్వడంలో పోషకాహారం ముఖ్యమని మేము నమ్ముతున్నాము’’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రము ఖ టీవీ యాంకర్ సుమ కనకాల హాజరయ్యారు. వాఘ్ బక్రీ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆమె ప్రశంసించారు. పిల్లల పోషణ, విద్యాభివృద్ధికి ఇది కీలకమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
డిజిటల్ చెల్లింపులకు యూపీఐ ఊతం..
దేశీయంగా డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) గణనీయంగా పెరిగిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రోత్ సోహిని రాజోలా తెలిపారు. యూపీఐ ప్రస్తుతం నెలకు 2,170 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తోందని, దేశంలో దాదాపు సగం జనాభా అంటే.. 50.4 కోట్ల మంది దీన్ని వినియోగిస్తున్నారని ఆమె వివరించారు.2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ చెల్లింపుల్లో 40 శాతం డిజిటల్ మాధ్యమంలో జరగగా, విలువపరంగా యూపీఐ వాటా అందులో 84 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు. 2021తో పోలిస్తే ఇది 1.6 రెట్లు అధికమని వివరించారు. ఆర్థిక సమ్మిళితత్వానికి కూడా యూపీఐ ఉపయోగపడుతోందన్నారు. ప్రాథమిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండే ప్రాంతాల్లో కూడా విస్తరించిందని, ప్రస్తుతం 19,000 పైచిలుకు పిన్ కోడ్స్లో అందుబాటులో ఉందని సోహిని వివరించారు. యూపీఐ వినియోగ ధోరణులు కూడా మారుతున్నాయని సోహిని చెప్పారు. చిన్న మొత్తాల్లో చెల్లించేందుకు కొత్త యూజర్లు చేరుతుండటమనేది ఈ విధానం అందరికీ అందుబాటులోకి రావడాన్ని సూచిస్తోందన్నారు. ప్రతి యూజరు చేసే చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయని సోహిని వివరించారు. ఇక వ్యక్తుల కన్నా వ్యాపార వర్గాలకు జరిపే చెల్లింపులు వరుసగా గత మూడేళ్లుగా వేగంగా పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. నిత్యావసరాలు, సూపర్మార్కెట్లు, రెస్టారెంట్లు, సర్వీస్ స్టేషన్లు, మెడికల్ స్టోర్స్ మొదలైన అన్ని చోట్లా యూపీఐ ఆమోదయోగ్యత పెరగడం ఇందుకు దోహదపడుతున్నట్లు సోహిని చెప్పారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
త్వరలోనే జియో లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(జేఎఫ్ఎస్) ఈ ఏడాదే లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ సేవలు ఆరంభించనున్నట్టు సంస్థ ఎండీ హితేష్ సేథియా ప్రకటించారు. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతులపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సంస్థ ఇటీవలే అలియాంజ్తో కలసి రీఇన్సూరెన్స్ వ్యాపారాన్ని ప్రారంభించడం గమనార్హం.జీవిత, సాధారణ బీమా వ్యాపారాలు ప్రారంభించేందుకు వీలుగా బృందాలను సిద్ధంచేసే పనిలో ఉన్నట్టు సేథియా చెప్పారు. అన్సెక్యూర్డ్, కన్జ్యూమర్ డ్యురబుల్ రుణాల్లోకి ప్రవేశించే తక్షణ ప్రణాళికేదీ లేదని స్పష్టం చేశారు. లాభదాయకత పెంచుకోవడమే తమకు ప్రస్తుత ప్రాధాన్యతగా పేర్కొన్నారు. రిస్క్, మూలధనం పరంగా తమకు కొన్ని పరిమితులున్నాయని.. ప్రైమ్ కస్టమర్లకు (అధిక విలువ కలిగిన/ప్రీమియం), సెమీ ప్రైమ్ కస్టమర్లకు సెక్యూర్డ్ రుణాలపైనే ప్రస్తుతం కంపెనీ దృష్టి సారించినట్టు చెప్పారు.ఈ వ్యూహంలో భాగంగా కస్టమర్లకు మెరుగైన ఆఫర్లను అందించనున్నట్టు తెలిపారు. కన్జ్యూమర్ డ్యురబుల్స్, అన్ సెక్యూర్డ్ రుణాల్లో రుణ ఎగవేతలు (ఎన్పీఏలు) ఎక్కువగా ఉన్నాయంటూ, గృహ రుణాల్లో ఒకింత ఇదే పరిస్థితి ఉన్నట్టు చెప్పారు. ‘‘మా ఎన్బీఎఫ్సీ వ్యాపారం, లాభదాయకత మా రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగానే ఉన్నాయి. మా కస్టమర్లు, వ్యాపారాలపై మరింత అధ్యయనం అవసరం. తగిన సమయంలో కొత్త రుణ విభాగాల్లోకి ప్రవేశించడంపై పరిశీలన చేస్తాం’’అని సేథియా తెలిపారు. జియో ఫైనాన్స్ కేవలం ఇతర బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలకు సంబంధించి వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులులను ప్రస్తుతం తన జియోఫైనాన్స్ యాప్పై ఆఫర్ చేస్తుండడం గమనార్హం.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
వడ్డీ రూ.50,000 మించితే టీడీఎస్
బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు (టీడీఎస్) నిబంధనలపై ఆదాయపన్ను శాఖ తాజాగా కీలక స్పష్టతనిచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం నిర్ణీత పరిమితిని మించినప్పుడు బ్యాంకులు కచ్చితంగా మూలం వద్దే పన్నును(టీడీఎస్) మినహాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ఐటీ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎవరికి ఎంత పరిమితి?ఆదాయపన్ను నిబంధనల ప్రకారం, డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సంబంధించి వేర్వేరు వర్గాలకు వేర్వేరు పరిమితులను నిర్ణయించారు. సాధారణ పౌరులు ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లేదా పోస్టాఫీసు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.50,000 మించితే టీడీఎస్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు నిండిన వారు)కు ఊరటనిస్తూ ఈ పరిమితిని రూ.1,00,000గా నిర్ణయించారు. వడ్డీ ఆదాయం ఈ మొత్తాన్ని దాటినప్పుడు మాత్రమే బ్యాంకులు పన్ను మినహాయింపు ప్రక్రియను చేపడతాయి.సెక్షన్ల విశ్లేషణపన్ను మినహాయింపు పరిధిలోకి వచ్చే బ్యాంకింగ్ సంస్థల గురించి ఐటీ శాఖ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఆదాయపన్ను చట్టం, 2025లోని సెక్షన్ 402 ప్రకారం.. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్, 1949 పరిధిలో పనిచేసే అన్ని సంస్థలు దీని కిందకు వస్తాయి. ఆదాయపన్ను చట్టం-1961లోని సెక్షన్ 51 కింద పేర్కొన్న ఆర్థిక సంస్థలు కూడా ఈ టీడీఎస్ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రానట్లయితే టీడీఎస్ మినహాయించకుండా ఉండేందుకు బ్యాంకులకు ఫామ్ 15జీ లేదా 15హెచ్ సమర్పించాల్సి ఉంటుంది. డిపాజిటర్లు తమ వడ్డీ ఆదాయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, తద్వారా ఆర్థిక సంవత్సరం చివరలో అనవసర పన్ను భారం పడకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
పశ్చిమాసియా యుద్ధం మరింత కాలం కొనసాగితే?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితులు ఇలాగే కొనసాగితే (ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా), దీని కారణంగా దేశీ పరిశ్రమలపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు, ఉపశమన ప్యాకేజీలను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో, దేశీయంగా వినియోగదారులపై ఈ ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం లీటరు పెట్రోల్పై రూ.3 ఎక్సైజ్ సుంకం తగ్గించగా, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. అదేవిధంగా దేశీయ సరఫరా పెంచేందుకు డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై మళ్లీ సుంకాలు విధించడం తెలిసిందే. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు ఫిబ్రవరి 28న ప్రారంభమైన తరువాత, ఇరాన్ ప్రతీకార చర్యలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సుమారు 50 శాతం వరకు పెరిగాయి. ఈ నెల ప్రారంభంలో బ్యారెల్కు 119 డాలర్ల వరకు వెళ్లగా, ప్రస్తుతం 100 డాలర్ల పైనే ట్రేడ్ అవుతున్నాయి. మన దేశ చమురు, గ్యాస్ అవసరాల్లో 88 శాతం దిగుమతి చేసుకుంటుండడం తెలిసిందే. వీటిలో ఎక్కువ భాగం హార్మూజ్ జలసంధి నుంచే వస్తుంటాయి. ఎగుమతిదారులకు అండ.. ఈ సంక్షోభం కారణంగా ఎగుమతిదారులు సరుకుల రవాణాలో ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో.. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎగుమతిదారులకు కొన్ని సడలింపులు ఇచి్చంది. రూ.497 కోట్లతో ‘రిలీఫ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం తెలిసిందే. దీంతో నౌకా రవాణా మార్గం మార్చుకోవడం కారణంగా అధిక సమయం పట్టడం, ట్రాన్స్షిప్మెంట్ హబ్ల వద్ద రద్దీ పెరగడం, బీమా చార్జీలు పెరగడం, అత్యవసర సర్చార్జీలు విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనివల్ల రవాణా (లాజిస్టిక్స్) ఖర్చులు పెరిగిపోయాయి. ఇలా పెరిగిన రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలను ఎదుర్కొనేందుకు రిలీఫ్ పథకం సాయం అందించనుంది. అలాగే, రాడ్టెప్ పథకం కింద ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31, 2026 వరకు అన్ని అర్హత గల ఉత్పత్తులపై పూర్తి ప్రయోజనాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. గత నెలలో ఈ ప్రయోజనాలను సగానికి తగ్గించడంతో ఎగుమతిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో వాటిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణ ఉపశమనం అవసరం.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా ప్రభావితమయ్యే వర్గాలు, వ్యాపారాలకు తక్షణ ఉపశమనం అవసరం. అదే సమయంలో వ్యూహాత్మక, దీర్ఘకాల అవసరాలకు వీలుగా తగినంత ద్రవ్య వెసులుబాటు కూడా అవసరమే. కేవలం ఇంధన అవసరాలే కాకుండా.. పలు కమోడిటీలు, మెటీరియల్స్ పరంగానూ దీర్ఘకాల నిల్వలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది’’అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తాజాగా నెలవారీ ఆర్థిక సమీక్ష వివరాలు విడుదల సందర్భంగా పేర్కొన్నారు. -
ఐపీఓకు ఆరు కంపెనీలు
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దేశీయ ఈక్విటీ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. అయినప్పటికీ ‘మూలధన సమీకరణకు మార్గాలు మూసుకుపోలేదు’ అనేందుకు సంకేతంగా సెబీ తాజాగా ఆరు కంపెనీల ఐపీఓలకు ఆమోదం తెలిపింది. యుద్ధ అస్థిరతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనే పబ్లిక్ ఇష్యూలకు ఆమోదం రావడం ఆసక్తికర పరిణామం. వృద్ధి ప్రణాళికలతో ముందుకొస్తున్న ఈ ఆరు కంపెనీలు సమీకరించనున్న నిధుల వినియోగం, ఆర్థిక స్థితి, భవిష్యత్ వ్యూహాలు తదితర వివరాలు ఇలా ఉన్నాయి. విభిన్న రంగాలకు చెందిన ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్, విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్, సింబయోటెక్ ఫార్మాల్యాబ్, ప్రాసోల్ కెమికల్స్, నోపేపర్ఫామ్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, షా ఇన్వెస్టర్స్ హోమ్ లిమిటెడ్లు గతేడాది సెపె్టంబర్–డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచాయి. మార్చి 25–27 మధ్య దరఖాస్తులను పరిశీలించిన సెబీ, పబ్లిక్ ఇష్యూలకు అనుమతులు మంజూరు చేసింది. ఐపీవోలు విజయవంతమైతే ఈ కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓ ద్వారా రూ.4,575 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ.3,750 కోట్ల విలువైన ఈక్విటీలను కొత్తగా జారీ చేనుంది. అదనంగా రూ. 550 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారు ‘నార్త్ఫండ్’ ఆఫర్ చేయనుంది. సమీకరించే నిధులను తన అనుబంధ సంస్థలు ఎస్ఏఈఎల్ సోలార్ పీ5 ప్రైవేటు లిమిటెడ్, ఎస్ఏఈఎల్ సోలార్ పీ4 ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడులుగా పెట్టడంతో పాటు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్నీటి శుద్ధి, మురుగు నీటి నిర్వహణ రంగానికి చెందిన ఈ సంస్థ ఐపీఓలో భాగంగా రూ.1,250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అదనంగా రూ.1,000 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్ ప్రీమియర్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఆఫర్ చేయనుంది. మొత్తంగా ఇష్యూ ద్వారా రూ. 2,250 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. సమీకరించే నిధుల ద్వారా తన అనుబంధ సంస్థల రుణాల చెల్లింపులు, అడ్వాన్స్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, సోలార్ పవర్ ప్రాజెక్టుల మూలధన వ్యయాలకు వినియోగించనుంది. సింబయోటెక్ ఫార్మాల్యాబ్ఫార్మా, బయోటెక్ రంగంలో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఐపీఓలో భాగంగా రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు రూ.2,030 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. దీంతో మొత్తం రూ.2,180 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను వ్యాపార అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది. ఫార్మా రంగంలో గ్లోబల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఐపీఓపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. ప్రాసోల్ కెమికల్స్స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ ఐపీఓ ద్వారా రూ.500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.80 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.420 కోట్ల షేర్లను విక్రయించనుంది. సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 60కు పైగా దేశాలకు ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. షా ఇన్వెస్టర్స్ హోమ్బ్రోకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓ పరిమాణాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే 54 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. సమీకరించే నిధులను వ్యాపార విస్తరణ, టెక్నాలజీ అప్గ్రేడ్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. నోపేపర్ఫామ్స్ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్) రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ రహస్య విధానంలో (కాని్ఫడెన్షియల్ ఫైలింగ్) ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది. తాజాగా సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూకు అనుమతి లభించింది. అయితే ఇష్యూ పరిమాణాన్ని ఇంకా వెల్లడించలేదు.లిస్టింగ్ బాటలో..రెంటోమోజో: ఆన్లైన్ రెంటల్, సబ్్రస్కిబ్షన్ ప్లాట్ఫామ్ రెంటోమోజో ఐపీఓకు సిద్ధమైంది. ఇందులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు సమరి్పంచింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.150 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రస్తుత షేర్హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2.83 కోట్ల ఈక్విటీలను విక్రయానికి పెట్టినట్లు ముసాయిదా పత్రాల ద్వారా తెలిసింది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపు, గిడ్డంగులు ఎక్స్పీరియన్స్ స్టోర్లు, సాధారణ కార్పొరేట్, లీజు అద్దెలు లేదా లైసెన్స్ ఫీజుల చెల్లింపు అవసరాలకు వినియోగించుకుంటామని వెల్లడించింది.భారత్ పెట్ సమీకృత ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అందించే భారత్ పెట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 120 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో రూ. 640 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 760 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులు, రూ. 36 కోట్లు మెషీనరీ, పరికరాల కొనుగోలు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1998లో ఏర్పాటైన కంపెనీ కంపెనీ పోర్ట్ఫోలియోలో పెట్ బాటిళ్లు, జార్లు, టిన్ కంటెయినర్లు, క్యాప్లు తదితర రిజిడ్ ప్యాకేజింగ్ ప్రొడక్టులున్నాయి.గతేడాది(2024–25) ఆదాయం రూ. 412 కోట్లకు చేరగా.. 51 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
రూపీ @ 95
ముంబై: ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్న తరుణంలో రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. సోమవారం డాలరుతో పోలిస్తే ఒక దశలో ఏకంగా 95 మార్కును దాటేసి ఆల్టైమ్ కనిష్ట స్థాయి 95.22ని తాకింది. ఇంట్రాడేలో 165 పైసల శ్రేణిలో తిరుగాడింది. చివరికి 15 పైసల లాభంతో 94.70 వద్ద క్లోజయ్యింది. శుక్రవారం నాడు 89 పైసలు పతనమై 94.85 వద్ద క్లోజయిన రూపాయి, రిజర్వ్ బ్యాంక్ సానుకూల చర్యల దన్నుతో, సోమవారం నాడు ట్రేడింగ్లో కాస్త పుంజుకుని 128 పైసల లాభంతో 93.62 వద్ద ప్రారంభమైంది. కానీ ఆ స్థాయి లాభాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. డాలరు ఇండెక్స్, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో రూపాయిపై ఒత్తిడి ఉంటోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 92–97 శ్రేణిలో రూపాయి తిరుగాడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, డాలరుతో రూపాయి మారకం విలువ బాగానే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పదా్నలుగేళ్లలో భారీ క్షీణత: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 9.88 శాతం క్షీణించింది. గత 14 ఏళ్లలో ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. అప్పట్లో.. 2012 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 4.2 శాతానికి పెరిగిపోయిన తరుణంలో దేశీ కరెన్సీ 12.4 శాతం పతనమైంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, డాలరు బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు లాంటి అంశాలు ఇప్పటి క్షీణతకు కారణంగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 28న పశి్చమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి చూస్తే రూపాయి విలువ 4.1 శాతం పడిపోయింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు దాదాపు 55.073 బిలియన్ డాలర్లను విక్రయించింది. డాలరుతో పోలిస్తే ఇతర ఆసియా కరెన్సీలు కూడా గణనీయంగా క్షీణించాయి. జపాన్ యెన్ 6 శాతం, ఫిలిప్పీన్ పెసో 5.74 శాతం, దక్షిణ కొరియా వాన్ 2.88 శాతం తగ్గాయి. -
2025-26కు నష్టాల వీడ్కోలు.. బేర్ బాజా!
ముంబై: ఆర్థిక సంవత్సరం 2025–26కు దలాల్ స్ట్రీట్ నష్టాలతో వీడ్కోలు పలికింది. పశ్చిమాసియా యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో మార్కెట్ రెండోరోజూ ‘బేర్’ మంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి జీవితకాల కనిష్టానికి పతనం సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,636 పాయింట్లు కుప్పకూలి 71,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 22,331 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1,809 పాయింట్లు 71,774 పాయింట్లు వద్ద, నిఫ్టీ 536 పాయింట్లు క్షీణించి 22,284 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో జపాన్ 3%, దక్షిణ కొరియా 3%, తైవాన్ 2%, హాంకాంగ్ 1% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1–0.5% లాభపడ్డాయి. అమెరికా సూచీలు అర శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, దేశీ స్టాక్ మార్కెట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7% పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 5,467 పాయింట్లు, నిఫ్టీ 1,188 పాయింట్లు పడ్డాయి. → రంగాల వారీ బీఎస్ఈ ఇండెక్సుల్లో పీఎస్యూ బ్యాంక్ 4.60%, ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ 3.50%, ఫైనాన్సియల్ సర్వీసెస్ 3.46%, టెలికమ్యూనికేషన్ 3.09%, రియల్టీ 3.03% క్షీణించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.13%, 2.14% పతనమయ్యాయి. సెన్సెక్స్ సూచీలో పవర్గ్రిడ్ (0.27%) మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ (–5.09%), ఎస్బీఐ (–3.95%), ఇండిగో (–3.80%), బజాజ్ఫిన్సర్వ్ (–3.71%) అత్యధికంగా నష్టపోయాయి. కీలక దశలోకి పశ్చిమాసియా యుద్ధంఎన్ని దాడులు చేసినా ఇరాన్ లొంగే పరిస్థితి కని్పంచకపోవడంతో అమెరికా ఆఖరి అస్త్రంగా భూతల దాడులు చేయడానికి సిద్ధమైంది. దాడులు జరిపేందుకు 3,500 మంది మెరైన్లు, సైనికులతో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని పశ్చిమాసియాకు తరలించారు. యూఎస్ భూతల దాడులు చేస్తే, ఎదుర్కోడానికి సిద్ధమేనని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధం కీలక దశకు చేరుకోవడంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలుఆర్బీఐ విధించిన ఫారెక్స్ ఆంక్షల ప్రభావంతో బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ నికర ఓపెన్ ఫారెక్స్ పొజిషన్లను రోజువారీ ట్రేడింగ్ ముగిసే సరికి 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాల్సి ఉంటుంది. దీనితో ఆర్బిట్రాజ్ పొజిషన్ల అన్వైండింగ్ నేపథ్యంలో డాలర్ విక్రయాలు పెరిగే అవకాశముంది. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం రూపాయికి తాత్కాలిక ఊరట ఇచ్చినా, బ్యాంకింగ్ షేర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ పీఎస్యూ ఇండెక్స్ 4.60 క్షీణించగా, ప్రైవేట్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3.50% పతనమైంది. ఎక్స్పైరీ ఒత్తిడితో తీవ్ర ఊగిసలాటనిఫ్టీ నెలవారీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ఎక్స్పైరీ నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లలో మార్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. సాధారణంగా నెలవారీ ఎక్స్పైరీ నెల చివరి మంగళవారం జరుగుతుంది. అయితే మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ సోమవారం నిర్వహించారు. ఆగని ఎఫ్ఐఐల విక్రయాలుపశ్చిమాసియా యుద్ధం అయిదో వారంలోకి ప్రవేశించడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఊపందుకుంది. గడిచిన 20 రోజులుగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తుండం మన మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం ఒక్క రోజే రూ.11,163 కోట్లు అమ్మకాలకు పాల్పడటం పతనం తీవ్రతకు నిదర్శనం.సీఎంపీడీఐ.. లిస్టింగ్ నిరాశకోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్(సీఎంపీడీఐ) షేరు లిస్టింగ్లో నిరాశపరించింది. ఇష్యూ ధర (రూ.172)తో పోలిస్తే 5.43 శాతం డిస్కౌంటుతో రూ.163 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ పతనంలో భాగంగా ఒక దశలో 11.45% క్షీణించి రూ.152 ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 10.43% నష్టంతో రూ.154 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,999 కోట్లుగా నమోదైంది.2 రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల ఆవిరిబేర్ ఎటాక్తో రెండు రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412.41 లక్షల కోట్లకు దిగివచి్చంది. తాజాగా సోమవారం ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 23 మధ్య) సెన్సెక్స్ 9,339 పాయింట్లు (11.48%) క్షీణించింది. -
2026 అపాచీ RTR లాంచ్: ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు 2026 అపాచీ RTR 160 4V లాంచ్ చేసింది. దీని ధర 1,25,440 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ఇది స్టాండర్డ్ బైక్ కంటే ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది.2026 అపాచీ RTR 160 4V ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ లైటింగ్ సెటప్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. USD ఫోర్కులు, TFT డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా ఇందులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ చాలా వరకు హైఎండ్ ఫీచర్స్ పొందిందన్నమాట.2026 అపాచీ RTR 160 4V పనితీరులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి డే 17.55 Bhp పవర్ అందించే 160 సీసీ ఇంజిన్ ఉంది. ఈ బైక్ స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్లను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లో ఇదే మొదటి ఫీచర్, ఇది రైడింగ్ పరిస్థితులను బట్టి పనితీరును సర్దుబాటు చేసుకోవడానికి రైడర్లకు వీలు కల్పిస్తుంది. -
రూ.84,582 కోట్ల లిక్విడిటీని విడుదల చేసిన ఆర్బీఐ
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను (లిక్విడిటీ) క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం రెండు వేర్వేరు వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలాల ద్వారా మొత్తం రూ.84,582 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టింది.వేలం వివరాలు..సోమవారం నిర్వహించిన ఈ వేలాల్లో బ్యాంకుల నుంచి అనూహ్య స్పందన లభించినప్పటికీ రెండో వేలంలో మాత్రం బిడ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. మొదటి విడతలో మూడు రోజుల వీఆర్ఆర్ వేలంలో ఆర్బీఐ రూ.50,001 కోట్లను విడుదల చేసింది. దీని కోసం రూ.57,287 కోట్ల విలువైన బిడ్లు రాగా ఆర్బీఐ రూ.50,001 కోట్ల బిడ్లను ఆమోదించింది. దీని కట్ఆఫ్ రేటు 5.34 శాతం కాగా, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.44 శాతంగా నమోదైంది.రెండో వేలం ద్వారా ఆర్బీఐ రూ.34,581 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చింది. దీని కట్ఆఫ్ రేటు 5.26 శాతం, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.30 శాతంగా ఉంది. ఈ వేలంలో నోటిఫై చేసిన మొత్తం కంటే తక్కువ బిడ్లు దాఖలయ్యాయి.మిగులు దిశగా నగదు లభ్యతప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత తీరి మిగులు బాట పట్టినట్లు కనిపిస్తోంది. మార్చి 27 నాటికి వ్యవస్థలో సుమారు రూ.1.27 లక్షల కోట్ల మిగులు నగదు ఉంటుందని అంచనా. గత కొన్ని రోజులుగా ఆర్బీఐ వివిధ కాలపరిమితులు గల వీఆర్ఆర్ వేలాల ద్వారా మొత్తం రూ.2,73,530 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని చొప్పించడం వల్ల ఇది సాధ్యమైంది. తాత్కాలిక నిధులే కాకుండా జనవరి 2026 నుంచి ఆర్బీఐ బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తూ రూ.3.50 లక్షల కోట్ల లిక్విడిటీని ఇప్పటికే వ్యవస్థలోకి చేర్చింది.ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకుల వద్ద నగదు అవసరాలు పెరుగుతాయి. ఈ క్రమంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా నగదును అందుబాటులో ఉంచడానికి ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓఎమ్ఓ కొనుగోళ్లు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఇస్తుండగా వీఆర్ఆర్ వేలాలు స్వల్పకాలిక అవసరాలను తీరుస్తున్నాయి.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ లాభాలు గడిస్తారని లేదా అందరూ నష్టపోతారని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే ఇన్వెస్టర్ ఎలా ఉండాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి? అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. దీనికి ప్రపంచ దిగ్గజ మదుపరిగా ఎంతోమందికి సుపరిచితమైన 'బఫెట్' ఫార్ములా తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నప్పుడు.. కొంతమంది మిస్ అవుతామేమో అనే ఆందోళనతో కొనుగోలు చేస్తుంటారు. నష్టం వస్తే అయ్యో అని బాధపడతారు. ఇలాంటి సమయంలో బఫెట్ చెప్పే మాట ఏమిటంటే.. 'ఎప్పుడూ వెంటపడొద్దు' ప్రతి అవకాశాన్ని వెంటాడాల్సిన అవసరం లేదు.ఒక కంపెనీ ఎంత గొప్పదైనా సరే, దాని షేర్ ధర చాలా ఎక్కువగా ఉంటే వెంటనే కొనకూడదు. సరైన విలువ వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. ఇది పెట్టుబడిదారులకు ఓపికను, నియంత్రణను నేర్పిస్తుంది. పెట్టుబడిదారుడు ఎప్పుడూ కూడా.. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి.బఫెట్ తన తత్వాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ. బేస్బాల్ క్రీడాకారుడు.. బేస్బాల్లో మంచి ఫలితం పొందాలంటే సరైన బంతి కోసం ఎదురు చూడాలి. ప్రతి బంతిని కొట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ప్రతి స్టాక్ను కొనాల్సిన అవసరం లేదు.Warren Buffett’s greatest lesson: NEVER CHASE. In the market, you have time. If an exceptional company trades at insane prices, don’t buy it.Wait for an exceptional company at a reasonable price. When you find it, invest heavily. If you don’t, wait. pic.twitter.com/s2Aax4wCj6— R (@AlphaWizarDD) March 29, 2026బఫెట్ చెప్పినట్లుగా.. మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. కానీ మనకు అర్థమయ్యే, మంచి కంపెనీలు మాత్రమే ఎంచుకోవాలి. అవి సరైన ధరలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఒక అవకాశం వదిలేస్తే.. మిమ్మల్ని ఎవరూ శిక్షించరు. కాబట్టి ఆలోచించాలి.ప్రతి స్టాక్ లేదా ప్రతి ట్రెండ్ గురించి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి విషయాలను బాగా అర్థం చేసుకోవడం చాలు. అదే నిజమైన విజయం తీసుకువస్తుంది. మీకు జీవితంలో కేవలం 20 సార్లు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తే.. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. తప్పులు తక్కువ చేస్తారు, మంచి అవకాశాలను మాత్రమే ఎంచుకుంటారు, దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదిస్తారు అని పేర్కొన్నారు. -
శ్రీలంకలో విద్యుత్ షాక్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకపై మరో భారం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 7.2%, పరిశ్రమలకు 8.7% మేర విద్యుత్ టారిఫ్లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఐఎంఎఫ్ నిబంధనలే కారణమా?అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పొందిన 2.9 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీలో భాగంగా శ్రీలంక కఠిన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కోసం కాస్ట్ రిఫ్లెక్టివ్(ఖర్చుకు అనుగుణంగా ధరలు) విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడాదికి పలుమార్లు విద్యుత్ ధరలను సవరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.మరింత పెరిగే అవకాశం ఉందా?‘యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు మరింత పెరిగితే, విద్యుత్ ఛార్జీలను మళ్లీ పెంచాలనే అభ్యర్థనను మేము పరిశీలిస్తాం’ అని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.పి.ఎల్. చంద్రలాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి సీఈబీ 13.56 పెంపును కోరినప్పటికీ ప్రస్తుతానికి దాన్ని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.తీవ్ర స్థాయిలో ఇంధన కొరతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు, ఫర్నేస్ ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. దీనిపై సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ జానక రాజకరుణ మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. ‘వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇంధన రేషనింగ్ను ప్రవేశపెట్టారు. విద్యుత్ ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. నిరంతరాయ సరఫరా కోసం రష్యా, భారత్, అమెరికా దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్లో శుద్ధి చేసిన ఇంధనం కోసం 600 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ‘ఏటీ-1 బాండ్ల’ సంక్షోభం
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పాలనాపరమైన లోపాలు, నైతిక విలువల వివాదంలో చిక్కుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్లోని ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) నిబంధనలకు విరుద్ధంగా అడిషనల్ టైర్-1 (ఏటీ-1) బాండ్లను విక్రయించిన వ్యవహారంలో బ్యాంక్ మేనేజ్మెంట్ వైఖరిపై ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంలో బ్యాంక్ అనూహ్యంగా ఆలస్యం చేసిందని ఆరోపించారు.ఏటీ-1 బాండ్లు అంటే ఏమిటి?సాధారణ బాండ్లలాగా వీటికి నిర్ణీత గడువు ఉండదు. వీటిని ‘పెర్పెచువల్ బాండ్స్’ అని పిలుస్తారు. అంటే బ్యాంక్ లాభాల్లో ఉన్నంత కాలం వీటికి వడ్డీ (కూపన్) చెల్లిస్తూనే ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లినా లేదా మూతపడే స్థితికి వచ్చినా ఈ బాండ్లలోని పెట్టుబడిని బ్యాంక్ పూర్తిగా రద్దు చేసే అధికారం ఉంటుంది.వీటిని ఎందుకు జారీ చేస్తారు?అంతర్జాతీయ ‘బాసెల్-3’ నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ వద్ద కొంత మేర కనీస మూలధనాన్ని ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో నష్టాలను తట్టుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. ఈక్విటీ షేర్లను జారీ చేసి కొత్త భాగస్వాములను చేర్చుకోవడం కంటే, బాండ్ల ద్వారా నిధులు సేకరించడం బ్యాంకులకు సులభం. దీనివల్ల బ్యాంక్ యాజమాన్య హక్కులు మారవు.దుబాయ్ బ్రాంచ్లో మిస్-సెల్లింగ్క్రెడిట్ సూయిస్ బ్యాంక్కు చెందిన అత్యంత రిస్క్తో కూడిన ఏటీ-1 బాండ్లను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన దుబాయ్, బహ్రెయిన్ శాఖల ద్వారా ఎన్ఆర్ఐ ఖాతాదారులకు తప్పుగా విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అక్రమ విక్రయాలను గుర్తించిన దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (డీఎఫ్ఎస్ఏ), బ్యాంక్ బ్రాంచ్పై కఠిన ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 26, 2025 నుంచి కొత్త క్లయింట్లను చేర్చుకోవడం లేదా కొత్త ఆర్థిక సేవలను అందించకుండా నిషేధించింది. అంతర్గత దర్యాప్తు అనంతరం, ఈ నెలలో ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను బ్యాంక్ విధుల నుంచి తొలగించింది. మరో 12 మంది సిబ్బందిపై వివిధ స్థాయిల్లో జరిమానాలు విధించినట్లు మార్చి 23 నాటి ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడైంది.ఎనిమిదేళ్లుగా ఏం చేస్తున్నారు?ఇటీవల అకస్మాత్తుగా రాజీనామా చేసిన చక్రవర్తి బ్యాంక్ తీరును తూర్పారబట్టారు. ‘గత ఎనిమిదేళ్లుగా లోపాలు జరుగుతున్నా బ్యాంక్ మౌనంగా ఉంది. అకస్మాత్తుగా ఇప్పుడు మేల్కొని చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరం. ఇది మొదట్లో కేవలం డాక్యుమెంటేషన్ సమస్యగా భావించినప్పటికీ ఇది బ్యాంక్ ప్రతిష్టకు తీరని నష్టం కలిగించింది’ అని చెప్పారు. బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ పుననియామకం విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీశన్ నియామక ప్రక్రియ తన పర్యవేక్షణలో కానీ, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (ఎన్ఆర్సీ) పరిధిలో కానీ జరగలేదని స్పష్టం చేశారు.పెట్టుబడిదారుల్లో ఆందోళనఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి సంస్థ విలువలు, నైతికత అంశాలపై విభేదించి తప్పుకోవడం బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో బ్యాంక్ షేర్ల విలువపై ప్రభావం పడకుండా ఉండేందుకు యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయితే, చక్రవర్తి రాజీనామాకు గల కచ్చితమైన కారణాలను బ్యాంక్ అధికారికంగా వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ అవకతవకలపై ఆర్బీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
గంటల వ్యవధిలో.. ఊహకందని గోల్డ్ రేటు!
సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వెండి రేటు కూడా గరిష్టంగా రూ.5000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాలలో ఉదయం రూ.1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ.1,35,900 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే గంటల వ్యవధిలో రూ.900 పెరిగినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల తులం రేటు 1,47,280 రూపాయల దగ్గర నుంచి 1,48,260 రూపాయల (రూ.980 పెరిగింది) వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,48,370 రూపాయల నుంచి 1,50,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు 1,36,050 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీలో ఉదయం 1,35,150 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,36,050 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 147430 రూపాయల దగ్గర నుంచి రూ.148410 వద్దకు చేరింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిన మార్పు.వెండి ధరఈ రోజు (సోమవారం) ఉదయం రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉన్న వెండి రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ.2.55 లక్షల వద్దకు చేరింది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ఉంది. -
డాలర్ క్రయవిక్రయాలకు ఆర్బీఐ చెక్
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారీగా పతనమవుతున్న భారత రూపాయిని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ అత్యవసర జోక్యం వల్ల బ్యాంకులు తమ బిలియన్ల డాలర్ల ఆర్బిట్రేజ్ పొజిషన్లను వదులుకోవాల్సి వస్తోంది. ఈ పరిణామంతో బ్యాంకింగ్ రంగానికి దాదాపు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఆర్బిట్రేజ్ పొజిషన్లు అంటే ఏమిటి?బ్యాంకులు తమ లాభం కోసం చేసే ఒక తెలివైన వ్యాపారమే ఈ ‘ఆర్బిట్రేజ్’. సాధారణంగా డాలర్ ధర ఆన్-షోర్ మార్కెట్ (భారతదేశంలో)లో తక్కువ ప్రీమియం ఉంటుంది. ఆఫ్-షోర్ మార్కెట్ (దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో)లో డాలర్ ధర ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దాంతో భారతదేశంలో తక్కువ ధరకు డాలర్లను కొని, విదేశీ మార్కెట్లలో ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం బ్యాంకులకు లాభం. అదే ఆర్బిట్రేజ్. ఇలా బ్యాంకులు ఇటీవల సుమారు 25 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు పొజిషన్లను నిర్మించుకున్నాయి.100 మిలియన్ డాలర్ల పరిమితిబ్యాంకులు తమ వద్ద భారీగా డాలర్లను నిల్వ ఉంచుకోవడం కూడా రూపాయి విలువ వేగంగా పడిపోవడానికి ఒక కారణంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఆర్బీఐ ‘నెట్ ఓపెన్ పొజిషన్’పై పరిమితి విధించింది. అంటే.. ఏ బ్యాంకైనా సరే బిజినెస్డే చివరలో తన వద్ద ఉన్న డాలర్ల నిల్వ (కొన్నవి - అమ్మినవి) విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంతకుముందు బిలియన్ల కొద్దీ డాలర్లను హోల్డ్ చేసిన బ్యాంకులు, ఇప్పుడు ఆ అదనపు డాలర్లను మార్కెట్లో అమ్మేయాల్సి వస్తుంది. మార్కెట్లోకి డాలర్ల సరఫరా పెరగడం వల్ల రూపాయి విలువ పుంజుకోనుంది.రూ.4,000 కోట్ల నష్టంబ్యాంకులు ఈ డాలర్లను లాంగ్టర్మ్ కోసం వ్యూహాత్మకంగా కొన్నాయి. కానీ ఆర్బీఐ ఏప్రిల్ 10 లోపు వాటిని విక్రయించాలని డెడ్లైన్ పెట్టడంతో బ్యాంకులు అమ్మాల్సి వస్తోంది. మార్కెట్ రేటు కంటే తక్కువకు లేదా అననుకూల సమయంలో అమ్మడం వల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లలో నష్టాలు నమోదవుతాయి. నిపుణుల అంచనా ప్రకారం, బ్యాంకులు హోల్డ్ చేసిన ప్రతి డాలర్ మీద రూపాయి కదలిక వల్ల వచ్చే వ్యత్యాసం, మొత్తం బ్యాంకింగ్ రంగానికి కలిపి సుమారు రూ.3,000 కోట్లు నుంచి రూ.4,000 కోట్ల నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.బ్యాంకింగ్ రంగంపై ప్రభావంఈ నిర్ణయం వెలువడగానే ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. బ్యాంకుల లాభదాయకత (క్యూ4 ఫలితాలు) దెబ్బతింటుందనే ఆందోళనతో బ్యాంక్ షేర్లు ఈరోజు మార్కెట్లో పడిపోయాయి. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా.. వంటి బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు చాలా వరకు నష్టపోయాయి. రూపాయి విలువ పడిపోతే దేశంలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరుగుతుంది. ఆ భారీ నష్టాన్ని దేశం భరించడం కంటే బ్యాంకులపై నియంత్రణ విధించి కరెన్సీని కాపాడటమే మేలని ఆర్బీఐ భావించింది. అందుకే బ్యాంకుల లాభాలకు గండి పడినా సరే కఠినమైన నిర్ణయం తీసుకుంది.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
ఏప్రిల్ నుంచి కొత్త ధరలు.. ఎంజీ మోటార్ కీలక ప్రకటన!
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, ఏప్రిల్ 01, 2026 నుంచి తమ ఉత్పత్తుల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. నిరంతరం పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను అధికారికంగా భర్తీ చేయడానికే ఈ ధరల పెంపు అని కంపెనీ వెల్లడించింది.ధరల పెరుగుదల తరువాత.. కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ, ఆస్టర్, హెక్టర్, విండ్సర్ ఈవీ రేట్లు పెరగనున్నాయి. అయితే ఎంజీ ఎం9 ప్రెసిడెన్షియల్ లిమో, ఎంజీ సైబర్స్టర్ ధరలు పెరగవు అని కంపెనీ వెల్లడించింది. కొత్త ధరలను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని ఎంజీ డీలర్షిప్ను లేదా అధికారిక ఎంజీ వెబ్సైట్ను సందర్శించమని కంపెనీ స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. భారతదేశపు మొట్టమొదటి D+ సెగ్మెంట్ SUVగా నిలవనున్న, రాబోయే మెజెస్టర్ కోసం కంపెనీ బ్రాండ్ ఒక బండిల్డ్ ఓనర్షిప్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. 5-5-5 ప్రోగ్రామ్ పేరుతో.. వారంటీ, రోడ్సైడ్ అసిస్టెన్స్, సర్వీస్ ప్రయోజనాలను ఒకే ఆఫర్గా కలపడం ద్వారా దీర్ఘకాలిక యాజమాన్య ఆందోళనలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
గూగుల్ స్మార్ట్ఫోన్.. రూ.10 వేలు తగ్గింపు!
గూగుల్ స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఇప్పుడు పిక్సెల్ 10 కొనుగోలుపై రూ.10వేలు వరకు తగ్గింపు లభిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం, మంచి కెమెరా పనితీరు, అనేక AI-ఆధారిత ఫీచర్లు కలిగిన ఫోన్ కోసం చూసేవారికి గూగుల్ పిక్సెల్ 10 ఒక మంచి ఎంపిక. దీని ధర భారతదేశంలో రూ.79999. విజయ్ సేల్స్ అధికారిక వెబ్సైట్లో, ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం రూ. 5,000 ఫ్లాట్ డిస్కౌంట్తో రూ. 74,999 కే లభిస్తోంది. అంతే కాకుండా.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, ఈఎంఐ రహిత లావాదేవీలపై అదనంగా రూ. 5,000 డిస్కౌంట్ పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా.. మీరు వన్ కార్డ్ క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు.గూగుల్ పిక్సెల్ 10 గురించిగూగుల్ పిక్సెల్ 10లో 6.3-అంగుళాల OLED డిస్ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ పొందుతుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా రక్షణ పొందుతుంది. పనితీరు పరంగా, పిక్సెల్ 10 టెన్సర్ G5 ప్రాసెసర్తో పనిచేస్తుంది, దీనికి 12GB వరకు RAM, 256GB వరకు అంతర్గత స్టోరేజ్ లభిస్తాయి. ఇది 4,970mAh బ్యాటరీ పొందుతుంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.కెమెరాల విషయానికి వస్తే, పిక్సెల్ 10లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు వైపు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP కెమెరా ఉంది. -
డాలరు ధాటికి రూపీ విలవిల
భారత కరెన్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ భారీ పతనానికి గురైంది. సోమవారం (మార్చి 30, 2026) నాటి ట్రేడింగ్లో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 95.45 స్థాయికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఈ అసాధారణ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల మంట దీనికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.పతనానికి ప్రధాన కారణాలుఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో మార్కెట్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది డాలర్కు విపరీతమైన డిమాండ్ను పెంచి, రూపాయిని బలహీనపరిచింది.చమురు ధరలుభారతదేశం తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవల బ్యారెల్కు 115 డాలర్ల మార్కు వరకు వెళ్లడంతో చమురు దిగుమతి బిల్లు భారీగా పెరిగింది. చమురు కంపెనీలు డాలర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో రూపాయిపై ఒత్తిడి తీవ్రమైంది.ఎల్పీజీ దిగుమతులుకేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా వంటగ్యాస్(ఎల్పీజీ) దిగుమతులపై కూడా యుద్ధ ప్రభావం పడింది. సరఫరాలో అంతరాయాలు కలగవచ్చనే భయంతో ముందస్తుగా నిల్వలను పెంచుకోవడానికి కంపెనీలు చేస్తున్న కొనుగోళ్లు కరెన్సీ విలువను మరింత తగ్గించాయి.విదేశీ పెట్టుబడుల ఉపసంహరణఒక్క మార్చి నెలలోనే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సుమారు 13.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించి భారత మార్కెట్ల నుంచి నిష్క్రమించారు. 2020 నాటి కోవిడ్ పరిస్థితుల తర్వాత ఈ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి వెళ్లడం ఇదే మొదటిసారి.ఆర్థిక వ్యవస్థపై ప్రభావంరూపాయి బలహీనపడటంతో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు (ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెలు) పెరిగి సామాన్యుడిపై భారం పడనుంది.పెరిగిన చమురు బిల్లుల కారణంగా దేశ కరెంట్ ఖాతా లోటు భారీగా విస్తరించే అవకాశం ఉంది.విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, విదేశీ ప్రయాణాలకు వెళ్లే వారికి ఖర్చు భారీగా పెరుగుతుంది.ఆర్బీఐ చర్యలురూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బ్యాంకుల ఫారెక్స్ పొజిషన్లపై కఠినమైన పరిమితులు విధించడంతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి డాలర్లను విక్రయించడం ద్వారా లిక్విడిటీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తోంది. అయితే, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే అత్యవసర డిపాజిట్ పథకాలను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయ స్థిరత్వం ఏర్పడే వరకు రూపాయిపై ఈ ఒత్తిడి కొనసాగేలా కనిపిస్తోంది. యుద్ధం చల్లారకపోతే రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు లేదా 2.22 శాతం నష్టంతో 71,947.55 వద్ద, నిఫ్టీ 488.20 పాయింట్లు లేదా 2.14 శాతం నష్టంతో 22,331.40 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, యారో గ్రీన్టెక్ లిమిటెడ్, దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నిన్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్, సెక్మార్క్ కన్సల్టెన్సీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఖండ్వాలా సెక్యూరిటీస్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, సూరత్వాలా బిజినెస్ గ్రూప్ లిమిటెడ్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.గమనిక: రేపు (మార్చి 31) మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
వంటగ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం..
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్ వివాదం నేపథ్యంలో ముడి చమురు, ఇంధన సరఫరాలు దెబ్బతినడంతో.. సామాన్యులకు ఉపశమనం కలిగించేలా కిరోసిన్ నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గృహ అవసరాలకు, దీపాల కోసం కిరోసిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనల్లో కేంద్రం తాత్కాలిక మార్పులు చేసింది.రాష్ట్రాల్లో తాత్కాలిక పునరుద్ధరణగతంలో కిరోసిన్ రహిత రాష్ట్రాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు దాని సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఢిల్లీ, హరియాణా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సహా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్కేఓ) అందుబాటులోకి రానుంది.కొత్త నిబంధనల ముఖ్యాంశాలుప్రభుత్వ రంగ చమురు సంస్థలు (ఓఎంసీ) నిర్వహించే ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రభుత్వం గుర్తించిన ప్రతి అవుట్లెట్లో గరిష్టంగా 5,000 లీటర్ల కిరోసిన్ నిల్వ చేసుకోవచ్చు.ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు సర్వీస్ స్టేషన్లకు మాత్రమే ఈ అనుమతి ఉంటుంది.పెట్రోలియం రూల్స్, 2002 ప్రకారం డీలర్లు, రవాణా వాహనాలకు కొన్ని కఠినమైన లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.ఈ సడలింపులు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇవి 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటాయి.భద్రతలో రాజీ లేదునిబంధనలు సడలించినప్పటికీ భద్రత విషయంలో కేంద్రం కఠినంగా ఉన్నట్లు చెప్పింది. ‘పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్లు యధావిధిగా వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సూచించిన నిర్దేశిత అవుట్లెట్ల ద్వారా మాత్రమే పంపిణీ జరుగుతుంది. ఈ కిరోసిన్ను కేవలం వంట, దీపాల వంటి గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.ఇంధన భద్రతే లక్ష్యంప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం దృష్ట్యా గృహాలపై వంటగ్యాస్ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పీడీఎస్ కింద కిరోసిన్ సరఫరాను నిలిపివేసిన చోట కూడా ప్రస్తుతం ఉన్న రిటైల్ నెట్వర్క్ను వాడుకుని తక్షణమే సరఫరాను పునరుద్ధరించడం ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
చెంపదెబ్బ కొట్టిన రోబోట్: వీడియో
హ్యుమానాయిడ్స్ రోబోల తయారీలో చైనా చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే.. అక్కడి కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రోబోలను పరిచయం చేస్తూనే ఉన్నాయి. అయితే.. కొత్త రోబోల ప్రదర్శన సమయంలో కొన్ని ఊహించని సంఘటనలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మార్చి 21న చైనాలోని షాన్సీ ప్రావిన్స్లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన.. సిబ్బంది ఆ రోబోను పక్కకు లాగడానికి ప్రయత్నించారు.అయినప్పటికీ.. అది రింగ్ మధ్యలో తన ప్రోగ్రామ్ ప్రదర్శించింది.ఈ రోబోట్.. చైనా టెక్నాలజీ సంస్థ యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన జీ1 హ్యూమనాయిడ్ మోడల్ అని తెలుస్తోంది. సుమారు 35 కేజీల బరువున్న ఈ రోబో ధర 13500 డాలర్లు. దీనిని రీసెర్చ్, ఎడ్యుకేషన్, కమర్షియల్ ఉపయోగం కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్న. ఎంత ప్రమాదకరమైన ప్రదర్శన చెప్పగా.. చిన్నారికి తగలడం అనేది చాలా బాధాకరమైన విషయం అని ఇంకొకరు పేర్కొన్నారు.Robot uprising also start small, maybe a slap here, a kick there. All to desensitize humans.pic.twitter.com/qpa8yfkIcF— The Great Translation Movement 大翻译运动 (@TGTM_Official) March 22, 2026కంపెనీలకు సూచనలురోబర్స్ తయారీ లేదా వినియోగం అనేది మంచి చర్య. అయితే వాటికి భావాలు అర్థం చేసుకోవడం, ప్రవర్తించిన విధానం పూర్తిగా తెలిసి ఉండదు. ఇలాంటి సమయంలో రోబోల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి వస్తుంది. కాబట్టి సంస్థలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోబోట్స్ తయారు చేయాలి. అంతే కాకుండా..పూర్తిగా టెస్ట్ చేసిన తరువాత వినియోగానికి ఉపయోగించడం మంచిది. లేకుండా ప్రజలకు ఇబ్బంది, లేకుండా కంపెనీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.గతంలో జరిగిన సంఘటనరష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని 2025 నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.ఇదీ చదవండి: ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా! -
యుద్ధం ఆగదు.. వాళ్లంతా నష్టపోక తప్పదు: కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రోబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. తాజా ‘ఎక్స్’ పోస్ట్లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడ్డగోలుగా ముద్రిస్తున్న డబ్బును 'ఫేక్ మనీ'గా అభివర్ణించిన ఆయన (Robert Kiyosaki), రాబోయే రోజుల్లో సంప్రదాయ పెట్టుబడులు నష్టపోక తప్పదని హెచ్చరించారు.డాలర్ విలువ పతనం - పెరుగుతున్న అప్పులుప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రిస్తుండటం వల్ల దేశాల జాతీయ అప్పులు (National Debt) విపరీతంగా పెరుగుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుందని, డాలర్లను పొదుపు చేసేవారు కాలక్రమేణా తమ సంపదను కోల్పోతారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా అమెరికా బాండ్లు సురక్షితమైనవనేది ఒక "పెద్ద అబద్ధం" అని ఆయన కుండబద్దలు కొట్టారు.చమురు సెగ.. అంతం లేని యుద్ధంప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలను ఆయన ఒక 'పవిత్ర యుద్ధం'గా అభివర్ణించారు. ఈ వివాదాలు త్వరలో ముగిసేవి కావని, దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పాత పద్ధతులకు కాలం చెల్లింది!సాధారణంగా ప్రజలు నమ్మే "చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, 401k లేదా మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయి" అనే సూత్రం ఇప్పుడు పనికిరాదని కియోసాకి కొట్టిపారేశారు. ఈ పద్ధతిని అనుసరించేవారే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఎంబీఏ (MBA) వంటి ఉన్నత డిగ్రీలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ముందు పనికిరావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.2026కు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్లు ఇవే..ఏవైతే ముద్రించడానికి వీలుపడవో అవే నిజమైన ఆస్తులని కియోసాకి నమ్ముతారు. ఆయన ప్రకారం 2026లో పెట్టుబడిదారులను కాపాడేవి బంగారం, వెండి (Real Gold & Silver), చమురు (Oil), ఆహార ధాన్యాలు (Food), క్రిప్టో కరెన్సీ (Bitcoin & Ethereum) మాత్రమే."మీ మెదడులో మీరు నింపుకునే ఆర్థిక విద్య (Financial Education) మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేనిని నమ్మాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. INVESTOR SECRET: “lf you want to be a rich investor you have to see the future.”Seeing the future today is EASY for two reasons.1: The National Debt will only go up because governments will only keep printing fake money. That means inflation will keep going up which…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 30, 2026 -
4 లక్షల చాక్లెట్లు ట్రక్కుతో సహా మాయం
"హ్యావ్ ఏ బ్రేక్.. హ్యావ్ ఏ కిట్కాట్" అనేది ఆ బ్రాండ్ ఐకానిక్ నినాదం. అయితే, కొంతమంది దొంగలు ఈ స్లోగన్ను మరీ సీరియస్గా తీసుకున్నట్లున్నారు. ఏకంగా 12 టన్నుల కిట్కాట్ చాక్లెట్లతో నిండిన ట్రక్కునే మాయం చేసి, తీపి దొంగతనానికి తెరలేపారు. ఈస్టర్ పండుగ వేళ ఐరోపాలో జరిగిన ఈ భారీ దోపిడీ ఇప్పుడు సంచలనంగా మారింది.ఏం జరిగింది?మార్చి 26న మధ్య ఇటలీలోని ఒక ఫ్యాక్టరీ నుండి పోలాండ్లోని పంపిణీదారులకు బయలుదేరిన ఈ ట్రక్కు మార్గమధ్యలో అదృశ్యమైంది. ఇందులో సుమారు 4,13,793 కిట్కాట్ యూనిట్లు ఉన్నాయి. దీనిపై మాతృ సంస్థ నెస్లే ప్రతినిధులు స్పందిస్తూ.. "వాహనం, లోడ్ జాడ ఇంకా దొరకలేదు" అని ధ్రువీకరించారు.ఫార్ములా వన్ చాక్లెట్లుదొంగిలించిన ఈ స్టాక్లో కిట్కాట్ కొత్తగా ప్రవేశపెట్టిన 'ఫార్ములా వన్ (F1)'థీమ్ చాక్లెట్లు ఉండటం గమనార్హం. గత ఏడాది F1 అధికారిక భాగస్వామిగా మారిన తర్వాత, రేసు కార్ల ఆకారంలో ఈ ప్రత్యేక వేఫర్ చాక్లెట్లను నెస్లే రూపొందించింది. ఇప్పుడు ఈ ఖరీదైన, పరిమిత ఎడిషన్ చాక్లెట్లన్నీ దొంగల పాలయ్యాయి."మా బ్రాండ్ నినాదాన్ని దొంగలు అక్షరాలా పాటించి, 12 టన్నుల చాక్లెట్లతో విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నేరస్థుల రుచిని మేము అభినందిస్తున్నప్పటికీ, ఇది వ్యాపారాలకు పెద్ద సవాలుగా మారింది" నెస్లే పేర్కొంది.నిఘా నీడలో చాక్లెట్లుఈ దోపిడీపై నెస్లే సంస్థ వినియోగదారులను, రిటైలర్లను అప్రమత్తం చేసింది. ప్రతి ప్యాకేజీపై ఉండే బ్యాచ్ కోడ్ ద్వారా ఉత్పత్తిని ట్రాక్ చేయవచ్చని చెప్పింది. ఎవరైనా అనధికారిక మార్గాల ద్వారా ఈ చాక్లెట్లను విక్రయిస్తుంటే, స్కాన్ చేసి అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ దోపిడీ వల్ల మార్కెట్లో కిట్కాట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగదని, వినియోగదారుల భద్రతకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం స్థానిక పోలీసులు, సప్లయి చైన్ భాగస్వాములతో కలిసి ఈ 'తీపి' దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.Regarding recent press coverage pic.twitter.com/Huh4EnFV2J— KITKAT (@KITKAT) March 29, 2026 -
మ్యూచువల్ ఫండ్స్: ‘సిప్’ ఇన్వెస్టర్లకు షాక్!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో పెట్టుబడులు పెడుతున్న వారికి మార్కెట్ పనితీరు షాక్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే గడిచిన ఏడాది, రెండేళ్ల కాలంలో వీటిల్లో రాబడి లేకపోగా, నష్టాలు మిగిలాయి. ముఖ్యంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో సిప్ పెట్టుబడులపై 48 శాతం వరకు నష్టపోయినవి ఉన్నాయి. 556 పథకాలను పరిశీలించగా, వీటిల్లో 486 నికర నష్టాలను ఇవ్వగా, 70 పథకాలు ఎంతో కొంత లాభాలను పంచాయి. విదేశీ ఫండ్స్లో లాభాలు.. ముఖ్యంగా గత కొంత కాలంలో దేశీ పథకాలు నష్టాలను మిగల్చగా, అంతర్జాతీయ ఫండ్స్ రాబడులు కురిపించాయి. ఇందులో క్వాంట్ టెక్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ డిజిటల్ ఇండియా ఫండ్ సైతం ఉన్నాయి. కారణాలు ఎన్నో.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై రాబడులకు గ్యారంటీ లేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక పరిణామాలకు అనుగుణంగా ఈక్విటీలు ర్యాలీ చేస్తుంటాయి. దిద్దుబాటుకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో దీర్ఘకాలం పాటు దిద్దుబాటు దశలోకి వెళ్లొచ్చు. కొన్ని సందర్భాల్లో వెంటనే కోలుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో స్మాల్, మిడ్క్యాప్లో ఎక్కువ దిద్దుబాటు కనిపిస్తుంటుంది. కనుక స్వల్పకాలానికి ఈక్విటీలు అనుకూలం కాదు. మధ్య, దీర్ఘకాలానికే వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నది నిపుణుల సూచన.కనీసం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. అయినా సరే ఐదేళ్లలోనే రాబడులు వస్తాయని చెప్పలేం. అనుకోకుండా మార్కెట్లు ఐదేళ్లపాటు దిద్దుబాటు, స్థిరీకరణ దశలోకి వెళితే రాబడులు లేకపోగా, నష్టాలూ ఎదురుకావొచ్చు. లంప్సమ్ అయినా, సిప్ అయినా రాబడులు/నష్టాలు మార్కెట్ గమనంపైనే ఆధారపడి ఉంటాయి. కనీసం 7–10 ఏళ్ల కాలంలో ఈ ప్రతికూలతలను అధిగమించి మెరుగైన రాబడులు అందుకోవచ్చని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి వ్యూహం అనుసరించాలి..? రాబడుల వెంట పరుగెత్తకుండా, గడిచిన ఏడాది కాల రాబడులను అనుసరించకుండా ఎంపిక చేసుకున్న పథకాల్లో సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులను వైవిధ్యం చేసుకునేందుకు ఇంటర్నేషనల్ ఫండ్స్కు సైతం కొంత కేటాయించుకోవాలన్నది సూచన. అంతర్జాతీయంగా ఏఐ, టెక్ ఫండ్స్కు లేదా చైనా, యూఎస్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని జెడ్ఫండ్స్ సీఈవో మనీష్ కొతారి పేర్కొన్నారు.ప్రస్తుతం అంతర్జాతీయంగా ఫండ్స్ మంచి పనితీరు వెనుక ఏఐ, టెక్ అంశాలున్నాయని చెప్పారు. సిప్ను కేవలం 2–3 ఏళ్ల కాలానికి చూడొద్దన్నారు. దీర్ఘకాలంలో మార్కెట్ అస్థిరతలను అధిగమించి, సంపద సృష్టించుకునేందుకు రూపొందించిన సాధనం సిప్ అని చెప్పారు. కనీసం 10–15 ఏళ్ల కాల దృష్టితో చూడాలన్నారు. అంతర్జాతీయ ఫండ్స్కు 10–20 శాతం మేర పెట్టుబడులు కేటాయించుకోవచ్చని, ముఖ్యంగా యూఎస్ మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచించారు. -
బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే!
మీకు ఈ వారం బ్యాంకు పనులున్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగండి! మార్చి 30 నుండి ఏప్రిల్ 5 మధ్య దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. పండుగలు, వార్షిక ఖాతాల ముగింపు, ఆదివారం సెలవుల కారణంగా ఈ వారంలో దాదాపు ఆరు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగలు, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి సందర్భాలను పురస్కరించుకుని ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు ఈ వారంలో ఆరు రోజులు మూతపడనున్నాయి. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచేది వారంలో ఒక్క రోజే అన్నమాట.సెలవుల పూర్తి వివరాలు ఇవే..మార్చి 30 (సోమవారం): మహావీర్ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు.మార్చి 31 (మంగళవారం): మహావీర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో సెలవు.ఏప్రిల్ 1 (బుధవారం): బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు (Annual Closing) సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సాధారణ వినియోగదారులకు సేవలు నిలిచిపోతాయి.ఏప్రిల్ 2 (గురువారం): మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కేరళలో బ్యాంకులు మూసివేస్తారు.ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.ఏప్రిల్ 5 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.సాధారణంగా నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. కాబట్టి ఏప్రిల్ 4 (శనివారం) నాడు బ్యాంకులు తెరిచి ఉండే అవకాశం ఉంది.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ (UPI) చెల్లింపులు (GPay, PhonePe మొదలైనవి) ఎప్పటిలాగే పనిచేస్తాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా నిధుల బదిలీ చేసుకోవచ్చు. ఏటీఎం (ATM) కేంద్రాల్లో నగదు ఉపసంహరణ సేవలు కొనసాగుతాయి.ముందస్తు ప్రణాళిక అవసరంవరుస సెలవుల దృష్ట్యా నగదు అవసరాలు లేదా చెక్కుల క్లియరెన్స్ వంటి ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా బ్యాంకింగ్ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
2022–23 రిటర్నులు వేయకపోతే..
పైన చెప్పినది 2022–23 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించినది. చెప్పాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విషయం. పరాభవ నామ సంవత్సరం ప్రారంభంలోనే ఇన్కం ట్యాక్స్ డిఫాల్టర్లకు డిపార్ట్మెంట్ వారు షాకిచ్చారు. షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందయ్యా అంటే.. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ సైకిల్ 6ని ఫాలో అవుతున్నారు. సాధారణంగా రిస్క్ మేనేజ్మెంట్లో ఆరు అంశాలు ఉంటాయి. అవేంటంటే..🔸 రిస్క్ని గుర్తించడం 🔸 వాటి విశ్లేషణ 🔸 నిర్ధారణ 🔸 తగిన చర్యలు తీసుకోవడం 🔸 పర్యవేక్షణ 🔸 నివేదికఇంచుమించు ఇదే పంథాలో డిపార్ట్మెంట్ తమ పంజా విసురుతోంది. డిపార్ట్మెంట్ వారి నిర్వహణ నిమిత్తం అంటు 2026 మార్చి 23న ఒక అంతర్గత సూచన అంటూ జారీ చేశారు. విషయం ఏమిటంటే, 2021–22 ఆర్థిక సంవత్సరం.. అంటే 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో జరిగిన పెద్ద వ్యవహారాలను బైటికి తీసి (అలాగని .. వార్తాపత్రికల్లో ప్రచురించరు), వాటిని విశ్లేషించి, అసలు రిటర్నులు వేయనివారిని, అంటే, నాన్–ఫైలర్స్ని గుర్తించి, వారి మీద చట్టరీత్యా చర్యలు చేపడతారు.ఎలా గుర్తిస్తారు?ఆర్థిక వ్యవహారాల పట్టికలు. ప్రతి సంవత్సరం స్థిరాస్తి క్రయవిక్రయాలు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో పెట్టుబడులు మొదలైన వాటికి సంబంధించి వాటి నిర్వాహక సంస్థల నుంచి డిపార్ట్మెంట్ వారికి సమాచారం చేరిపోతుంది. వార్షిక సమాచార రిటర్న్ ద్వారా ఇది జరుగుతుంది.టీడీఎస్ సర్టిఫికెట్లు. ప్రతి డిడక్టర్ టీడీఎస్ మొత్తాన్ని రికవర్ చేసి, సకాలంలో గవర్నమెంట్ ఖజానాకి చెల్లించాలి. ఆ మేరకు సరి్టఫికెట్లు 16 లేదా 16ఏ జారీ చేయాలి. అంతే కాకుండా వాటికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయాలి. వీటిలో మీకు చేసిన చెల్లింపుల వివరాలన్నీ సమగ్రంగా ఉంటాయి.టీడీఎస్లాగానే, టీసీఎస్పరంగా మీ సంబంధిత సమాచారం ఉంటుంది.జీఎస్టీ రికార్డులుఎగుమతులు–దిగుమతులు. కస్టమ్స్ అధికారి వద్ద రికార్డులు, షిప్మెంట్ రికార్డులు, హెచ్ఎస్ఈ కోడ్లు, వాళ్ల పేర్లు, టర్నోవర్ వివరాలు, విలువ.. ఈ సమాచారం అంతా ఉంటుంది.ట్యాక్స్ పేయర్స్ ప్రొఫైల్స్మీ ఆర్థిక వ్యవహారాల చిట్టాఆస్తులు.. అప్పులుఎవరితో ఏయే వ్యవహారాలు జరిపారు.థర్డ్ పార్టీతో వ్యవహారాలుఇలాంటి వివరాలన్నీ సేకరించి మీ రిటర్న్ ప్రొఫైల్, ఆర్థిక సమాచారపు ప్రొఫైల్, వ్యక్తిగత సమాచారపు ప్రొఫైల్, అకౌంట్స్, ఆస్తుల ప్రొఫైల్, ఎవరితో సంబంధం ఉందో ఆ ప్రొఫైల్, ఇతర ఏజెన్సీల ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ తర్వాత వారి దగ్గర నుండి సమాచారం అందుకోని వారి జాబితా, అందుకుని కూడా రెస్పాన్స్ ఇవ్వని వారి జాబితాలు తయారు చేసి, అందులోని నాన్–ఫైలర్స్ని బైటికి తీస్తారు. ఆ తర్వాత నోటీసులు.. ప్రక్రియ మొదలు.ఈ మేరకు దిశ, సూచనలు, సలహాలు, ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు రిటర్నులు అనవసరమైతే, వారిని వదిలేస్తారు. రిటర్నులు వేయాల్సి ఉన్నా, వేయని డిఫాల్టర్స్ని మాత్రం వదలరు. ‘ఇన్కం – ఎస్కేప్డ్‘ కింద భావించి, కథ నడుపుతారు. ఈ రోజు 2021–22 మొదలు, త్వరలోనే ఆ తర్వాత సంవత్సరాల వ్యవహారాల మీదా నిఘా ఇలాగే ఉంటుంది. తగిన జాగ్రత్త వహించండి. అందాకా కథ పోనివ్వకండి. అప్డేటెడ్ రిటర్న్స్ వేసుకునే అవకాశం ఉన్న కాగితాలతో వృత్తి నిపుణులను సంప్రదించండి.ఈ సందర్భంలో మహాభారతంలో తిక్కన రాసిన పద్యం గుర్తుంచుకోండి ‘వచ్చిన వాడు ఫల్గుణుడు. అవశ్యము గెల్తుమనంగ రాదు‘ అని. దాని అర్థం ఏమిటంటే, ఆ వచ్చిన వాడు అర్జునుడు.. యుద్ధం చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదు.. మనం సిద్ధంగా ఉండాలి. దేనికైనా ఓర్చుకోవాలి. సంధి చేసుకోవడం మంచిదని భావం.మనకు అన్వయించుకుంటే.. ఆ వచ్చేవాళ్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. విస్తృత అధికారాలతో పాటు సమాచారంతో వస్తారు. సరైన తోవలో నడుచుకోవడం శ్రేయస్కరం. -
బంగారం ధరలు ఇలా.. ఆనందంగా కొనేలా!!
దేశంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మూడు రోజుల తర్వాత నేడు బంగారం ధరలు (Today Gold Rate) కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా! -
భారీ పతనంలో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50, సెన్సెక్స్ గణనీయంగా క్షీణించాయి.ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 0.86 శాతం లేదా 195 పాయింట్లు తగ్గి 22,624 వద్ద, సెన్సెక్స్ 0.97 శాతం లేదా 720 పాయింట్లు తగ్గి 72,862 వద్ద ట్రేడ్ అవుతోంది.సెన్సెక్స్లో బీఈఎల్, ఆర్ఐఎల్, ఎన్టీపీసీ మాత్రమే లాభాల్లో పయనిస్తున్నాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.95 శాతం, 2.31 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ అతిపెద్ద డ్రాగర్లు. నిఫ్టీ మెటల్ మెరుగైన పనితీరు కనబరిచింది.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మల్టీ అసెట్ ఫండ్స్తో పెట్టుబడుల్లో వైవిధ్యం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు మల్టీ అసెట్ ఫండ్స్కి గణనీయంగా ఆదరణ పెరుగుతున్నట్లు యాక్సిస్ ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ ఆశీష్ నాయక్ తెలిపారు. ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2026 ఫిబ్రవరిలో ఈ ఫండ్స్లోకి రూ. 8,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దీనితో ఈ కేటగిరీ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 1.83 లక్షల కోట్లకు చేరిందని ఆయన చెప్పారు. ఫోలియోల సంఖ్య 49.1 లక్షలకు చేరినట్లు వివరించారు. వరుసగా నాలుగో నెలా హైబ్రిడ్ కేటగిరీకి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ సారథ్యం వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తరహా ఫండ్స్ ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీస్ (పసిడి లేదా వెండి)లో ఇన్వెస్ట్ చేస్తాయని నాయక్ వివరించారు. సాధారణంగా వివిధ సందర్భాల్లో వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకంగా స్పందిస్తాయని చెప్పారు. కార్పొరేట్ ఆదాయాలు బాగున్నప్పుడు ఈక్విటీలు పెరుగుతాయని, అలాగే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లేదా మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు డెట్ సాధనాలు ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు. ఇక ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నా, అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నా పసిడి పెరుగుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా దేశీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని వివరించారు. ‘‘ఈక్విటీ వేల్యుయేషన్స్ భారీ స్థాయిలో పెరిగిపోగా, వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని డెట్ ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. గ్లోబల్గా అనిశి్చతితో కమోడిటీల రేట్లపై అనిశ్చితి నెలకొనడం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది’’ అని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేసిన వారికన్నా మల్టీ అసెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన మదుపరుల పోర్ట్ఫోలియోల్లో ఒడిదుడుకులు కొంత తక్కువగా ఉన్నట్లు వివరించారు. ఇలా ఒకే ఫండ్ ద్వారా వివిధ అసెట్స్కి కేటాయింపులు జరిపే వ్యూహం దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు గుర్తిస్తున్నారని నాయక్ చెప్పారు. అయితే, ఈ కోవకి చెందిన ఫండ్స్ అన్నీ ఒకే రకంగా పని చేయవని గుర్తుంచుకోవాలని సూచించారు. కొన్ని ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపితే మరికొన్ని బ్యాలెన్స్డ్గా లేదా వ్యవహరిస్తాయని చెప్పారు. అలాగే కేవలం బుల్ మార్కెట్కే పరిమితం కాకుండా గతంలో వివిధ పరిస్థితుల్లో ఫండ్ ఎలా పని చేసిందనేది కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఫండ్స్ఇండియా ఏయూఎం రూ.25,000 కోట్లు
బెంగళూరు: ఫండ్స్ ఇండియా రూ.25,000 కోట్ల నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) మైలురాయిని అధిగమించింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏయూఎం రూ.20వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు వృద్ధి చెందడందో ఇది సాధ్యపడింది. ముఖ్యంగా ఏడాది కాలంలో నిర్వహణ ఆస్తులు 58 శాతం పెరగ్గా.. మూడేళ్లలోనూ ఏటా 38 శాతం చొప్పున వృద్ధి చెందినట్టు సంస్థ ప్రకటించింది.గత 12 నెలల్లో ఫండ్స్ ఇండియా రూ.2,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. సంస్థ నిర్వహణ ఆస్తుల్లో 77 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు చెందినవే. 23 శాతం మేర ధనవంతులకు చెందిన ఆస్తులు ఉన్నాయి. 30 లక్షల యూజర్లకు ఫండ్స్ ఇండియా ప్లాట్ఫామ్ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. సిప్ బుక్ రూ.142 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. -
ఆచితూచి... ఐపీఓలకు!
గత ఏడాది ఐపీవోల జోరు మామూలుగా లేదు. రిటైల్ ఇన్వెస్టర్లకు పండుగలా అనిపించింది. చాలా మటుకు ఇష్యూలు లిస్టింగ్ రోజున భారీగానే లాభాలు ఇచ్చాయి. దీనితో ఏ కంపెనీ ఇష్యూ వచ్చినా 50రెట్లు.. 100 రెట్లు సబ్స్క్రయిబ్ అయిపోయేవి. లిస్టింగ్ లాభాల కోసం అప్లై చేసుకోవడమనేది ఒక వ్యూహంగా మారిపోయింది. కానీ ఇప్పుడు అదే రిటైల్ ఇన్వెస్టర్లు.. ఐపీవో అంటే వెనక్కి తగ్గుతున్నారు. ఇష్యూలు పూర్తిగా సబ్ర్స్కయిబ్ కావడం లేదు. లిస్టింగ్లు నిరాశపరుస్తున్నాయి. ధీమా దెబ్బతింది. అందుకేనేమో! తాజాగా ఐపీఓకి వచ్చిన ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా అనుబంధ కంపెనీని సైతం రిటైలర్లు పట్టించుకోలేదు.ఈ పరిస్థితికి ప్రధాన కారణం సెంటిమెంటే. 2025లో ఐపీఓలు విజయవంతం కావడానికి ఇదే సెంటిమెంటు కారణమయితే... ఇప్పుడు రిటైలర్లు చాలా ఐపీఓలకు దూరంగా ఉండటానికి కూడా సెంటిమెంటే కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కొన్ని ఐపీఓల్లో రిటైర్లు తక్కువమంది ఇన్వెస్ట్ చేసినా... వారు కంపెనీల ఫండమెంటల్స్ చూసే ముందుకొస్తున్నారనే భావన ఉంది. ఏడాది వ్యవధిలోనే పరిస్థితి ఎందుకిలా మారిపోయింది? దీనికి కారణాలేమిటి? చిన్న ఇన్వెస్టర్ల ఆలోచనేంటి? ఏం చేస్తే బెటర్? అనే అంశాలసమాహారమే ఈ ‘సాక్షి’ వెల్త్ స్టోరీ... – సాక్షి, వెల్త్గతంలో ఐపీవో లిస్టయ్యిందంటే చాలు తక్కువలో తక్కువగా 20 శాతం నుంచి 50 శాతం వరకు లాభాలు పక్కా అనే విధంగా ఉండేది. అందుకే రిటైలర్ల విభాగంలో ఒక్కో ఇష్యూ 50 రెట్లు, 100 రెట్లు ఓబర్ సబ్ర్స్కయిబ్ అయ్యేది. నిజానికిలా ఓవర్ సబ్్రస్కయిబ్ అయినపుడు నూటికి 90 శాతం మందికి షేర్లు అలాట్ కావు. కానీ... అలాట్ అయితే లాభాలొస్తాయి కదా అనే ఆశతో ఒక్కొక్కరూ తమ కుటుంబీకులకు ఎన్ని ఖాతాలుంటే అన్ని ఖాతాల్లోనూ దరఖాస్తు చేసేవారు. కొద్దిరోజులు తమ క్యాపిటల్ లాకిన్లో ఉండటానికి కూడా ఇష్టపడేవారు. చివరికి అలాట్ అయి లిస్టింగ్ లాభాలొస్తే హ్యాపీ. కాదంటే నిట్టూర్పు. కానీ ఇటీవల చాలా ఐపీఓలు లిస్టింగ్లో పెద్దగా లాభాలివ్వలేదు. ఇష్యూ ధరకు సమానంగా ఫ్లాట్గానో లేకపోతే ఒక్కోసారి అంతకన్నా తక్కువకే లిస్టవుతున్నాయి. దీనితో ఐపీవోలో అలాట్ అయితే చాలు లాభాలు గ్యారంటీ అనే అభిప్రాయం తొలగిపోయింది.ఓవర్ప్రైసింగ్..చాలా మటుకు కంపెనీలు తమ అసలు వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ఐపీవోలకు ధర నిర్ణయిస్తున్నాయి. బులిష్ సెంటిమెంటుని క్యాష్ చేసుకుని, బయటపడిపోయేందుకు ప్రమోటర్లు ప్రయతి్నస్తున్నారనే అపవాదు ఉంది. చాలా ఐపీఓల పరిస్థితి ఇదే అయినా... ఇటీవల లెన్స్కార్ట్ వంటి ఐపీఓలపై తీవ్రమైన ఆరోపణలొచ్చాయి కూడా. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లకి ఇలాంటి వాటిల్లో ఎంట్రీ చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని, రాబడులపై స్పష్టత ఉండదని అర్థమవుతోంది. లిస్టింగ్కి ముందు.. తర్వాత..కొన్ని కంపెనీల లెక్కల మాయాజాలమో, యాదృచ్ఛికమో అర్థం కావటం లేదు కానీ.. ఐపీఓకి రావటానికి ముందు ఒకటి రెండేళ్లు అద్భుతమైన పనితీరును చూపిస్తున్నాయి. అంతకుముందు చాలా ఏళ్లు ఆ పరిస్థితి లేకపోవటం గమనార్హం. దీంతో ఆ రెండేళ్ల లెక్కలను చూపిస్తూ.. భవిష్యత్తు సూపర్ అంటూ ఊదరగొడుతున్నాయి. అది నమ్ముకుని కొనుక్కుంటే, ఆ తర్వాత వాస్తవం బోధపడుతోంది. లిస్టింగ్ అయిన తర్వాత ఎరి్నంగ్స్ తీరు చూస్తే భయపెట్టేదిగా ఉంటోంది. ఇటీవల కొన్ని డ్రోన్ కంపెనీలు ఇదే బాగోతాన్ని కళ్లకుకట్టాయి.మారిన మార్కెట్ పరిస్థితులుఇరాన్ యుద్ధ ప్రభావం కావచ్చు,. అంతకుముందు అమెరికా టారిఫ్ల వ్యవహారం కావచ్చు. ఇవన్నీ మార్కెట్లను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఒకటి తరువాత ఒకటిగా చుట్టుముడుతున్న అంతర్జాతీయ పరిణామాలతో ఎఫ్ఐఐలు భారత మార్కెట్లలో తమ షేర్లను అమ్ముతూనే వస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో జరిపిన అమ్మకాలకు దీటుగా దేశీ ఫండ్లు కొనుగోళ్లు చేసినప్పటికీ... ఇపుడు తాజా ఇరాన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. మార్కెట్లు భారీ కరెక్షన్కు గురయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. ఇక లిక్విడిటీ కూడా కష్టంగా మారుతుండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు స్పెక్యులేషన్ కన్నా క్షేమంగా ఉండటమే మిన్న అనే ధోరణికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరేం చెయ్యాలి?పరిస్థితులు ఇలా మారినంత మాత్రాన ఐపీవో మార్కెట్ మొత్తానికే కుప్పకూలిందనుకోవడానికి లేదు. తాజాగా వస్తున్న ఐపీఓల్లో రిటైలర్ల పాత్ర తగ్గినా పూర్తిగా పోలేదు. కొన్ని ఇష్యూల్లో ఫండ్లతో పాటు పెద్ద ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మార్కట్పై, సదరు కంపెనీలపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పాలి. ఈ వ్యవహారంపై దేశీ మ్యూచువల్ ఫండ్ దిగ్గజం ఒకరు స్పందిస్తూ... ‘‘గతంలో అందరికీ డబ్బులొచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని విషయాలు క్షుణ్నంగా తెలుసుకుని, ముందడుగు వేసే ఇన్వెస్టర్లకే వస్తున్నాయి. అది రిటైల్ ఇన్వెస్టర్లయినా... హెచ్ఎన్ఐలయినా’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. -
యుద్ధ పరిస్థితులే దిక్సూచి
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణమే దిక్సూచిగా నిలవనుంది. యుద్ధ భయాలు తగ్గితే ఇన్వెస్టర్లకు రిలీఫ్.. పెరిగితే మరింత ఆందోళన అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దేశీయంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానున్నప్పటికీ భారీ స్థాయిలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం(31న) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(ఏప్రిల్ 3న) సైతం పనిచేయవు. వెరసి ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. అయినప్పటికీ పలు కీలక అంశాలు మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం గత వారాంతాన మరింత విస్తరించింది. కాల్పుల విరమణ లేదా దాడులకు పాజ్ అంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. వారాంతన పరిస్థితులు క్షీణించడంతో నేడు(30న) మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గణాంకాల ఎఫెక్ట్ ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. జనవరిలో ఐఐపీ 4.8 శాతం ఎగసింది. మార్చి నెలకు గురువారం(ఏప్రిల్ 2న) హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో ఈ వారం చైనా తయారీ పీఎంఐ, ద్రవ్యోల్బణ డేటా విడుదలకానుంది. మరోపక్క యూఎస్ తయారీ పీఎంఐ, రిటైల్ అమ్మకాలు, ఉపాధి, నిరుద్యోగిత తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ధరలపై ఆందోళన వెలిబుచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు అంచనాలు ఏర్పడ్డాయి. వెరసి దేశ, విదేశీ గణాంకాలకూ ప్రాధాన్యమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చమురు, రూపాయి ఇటీవల బ్రెంట్ ముడిచమురు పీపా ధర లండన్ మార్కెట్లో 102–110 డాలర్ల మధ్య కదులుతోంది. దీంతో దేశీ క్రూడ్ బాస్కెట్ 140–150 డాలర్లస్థాయికి చేరుతోంది. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు కారణంకానుంది. దేశీ చమురు అవసరాలకు దిగుమతులపైనే అధికంగా ఆధారపడటంతో ఈ ప్రభావం రూపాయినీ దెబ్బతీస్తోంది. గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఏకంగా 95 స్థాయికి దిగజారిన విషయం విదితమే. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. తెలియజేశారు. అయితే మార్కెట్లు కుదురుకుంటే షార్ట్కవరింగ్కూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలకుతోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు సైతం కీలకంగా నిలవనున్నట్లు ప్రస్తావించారు.భారీ అమ్మకాలు.. ఈ నెలలో మరోసారి అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీస్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల 2–27 మధ్యకాలంలో రూ. 1.14 కోట్ల విలువైన(12.3 బిలియన్ డాలర్లు) దేశీ స్టాక్స్ విక్రయించా రు. వెరసి మా ర్చిలో మార్కెట్ల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఇంతక్రితం 2024 అక్టోబర్లో అత్యధికంగా రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. ఇందుకు పశ్చిమాసియా యుద్ధం, రూపాయి బలహీనత, చమురు ధరలు, వడ్డీ రేట్ల ఆందోళనలు ప్రభా వం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో గత 17 నెలల్లోలేని విధంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతిగత 4 రోజుల్లో..నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్లో గత వారం సైతం(వరుసగా ఐదో వారం) దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా నష్టాలతోనే నిలిచాయి. సెన్సెక్స్ 950 పాయింట్లు(1.3 శాతం) పతనమైంది. 73,583 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 295 పాయింట్లు(1.3 శాతం) కోల్పోయి 22,820 వద్ద స్థిరపడింది. మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.2 శాతం, స్మాల్ క్యాప్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. సాంకేతికంగా చూస్తే.. ఈ వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. 22,300–22,200 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఈ స్థాయి నుంచి జోరందుకుంటే 23,500–23,700 పాయింట్లకు చేరే అవకాశముంది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ నీరసిస్తే 72,800కు చేరవచ్చు. అమ్మకాలు కొనసాగితే ఆపై 72,250వరకూ క్షీణించే వీలుంది. ఈ స్థాయి నుంచి బలపడితే 76,000 పాయింట్లస్థాయివైపు ప్రయాణించవచ్చు.స్టాక్స్ వ్యూఇండిగో పెయింట్స్బ్రోకరేజ్: మిరాయ్ అసెట్ షేర్ఖాన్ , కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 731, టార్గెట్: రూ. 1,350ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఇండిగో పెయింట్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం 5 శాతం మెరుగుపడి రూ. 359 కోట్లకు చేరింది. ఇందుకు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ బిజినెస్ వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 339 కోట్లను తాకడం సహకరించింది. ప్రధానంగా అనుబంధ సంస్థ యాపిల్ కెమీ(రూ. 20 కోట్లు) వృద్ధి సైతం దన్నునిచ్చింది. రుతుపవనాలు కొనసాగడం, ముందుగానే దీపావళి పండుగ అయిపోవడం కారణంగా అక్టోబర్లో అమ్మకాలు మందగించాయి. ఎమల్షన్స్ అమ్మకాల పరిమాణం 3.4 శాతం, విలువ 0.2 శాతం చొప్పున క్షీణించాయి.అయితే ఎనామిల్స్, ఉడ్ కోటింగ్స్ అమ్మకాలు 20 శాతం, విలువ 19 శాతం చొప్పున జంప్చేశాయి. పుట్టీ, సిమెంట్ పెయింట్స్ అమ్మకాల పరిమాణం 2 శాతం, విలువ 5.5 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ఇక ప్రైమర్స్, డిస్టెంపర్స్ తదితరాల అమ్మకాలు 7.4 శాతం, విలువ 12.5 శాతం చొప్పున ఎగశాయి. ఉత్తమ మిక్స్, తగ్గిన ముడివ్యయాల కారణంగా స్థూల మార్జిన్లు 46.8 శాతం వద్ద నిలకడను చూపాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు(ఓపీఎం) 2.36 శాతం మెరుగుపడి 19 శాతంగా నమోదయ్యాయి.ఇందుకు ప్రకటనలు, ప్రమోషనల్(ఏఅండ్పీ) వ్యయాలు తగ్గడం తోడ్పాటునిచ్చింది. వార్షికంగా ఇవి 2.6 శాతం తగ్గి 5.6 శాతానికి పరిమితమయ్యాయి. పెయింట్ల పరిశ్రమలో క్రమానుగత రికవరీకితోడు.. వివిధ మార్కెట్లలో విస్తరించడం, సామర్థ్య పెంపు ఆదాయంలో వృద్ధికి దన్నుగా నిలవనున్నాయి. ముడివ్యయాలలో తగ్గుదల, నిలకడ కారణంగా సమీప కాలంలో లాభదాయకతకు మద్దతు లభించనుంది. రానున్న రెండేళ్ల కాలం(2026–27, 2028)లో వార్షికంగా ఆదాయం 9 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున పురోగమించగలవని భావిస్తున్నాం.ఎంఎం ఫోర్జింగ్స్బ్రోకరేజ్: ఆనంద్ రాఠీ రీసెర్చ్ ,కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 400 , టార్గెట్: రూ. 600ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఎంఎం ఫోర్జింగ్స్ అంచనాలకు అనుగుణంగా రూ. 72 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. వార్షికంగా ఇది 2 శాతం క్షీణతకాగా.. రానున్న రెండేళ్లలో కంపెనీ పనితీరు మెరుగుపడే అవకాశముంది. వార్షిక ప్రాతిపదికన 2026–28 కాలంలో ఆదాయం 13 శాతం, ఇబిటా 18 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా. ఈ కాలంలో దేశీయంగా భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన(ఎంఅండ్హెచ్సీవీ) అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకోనున్నట్లు భావిస్తున్నాం.ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోగతి, జీఎస్టీ రేట్ల సంస్కరణలతో పటిష్టమవుతున్న రీప్లేస్మెంట్ డిమాండ్ సహకరించే వీలుంది. వీటికితోడు లోబేస్ కారణంగా విదేశాలలో వాణిజ్య వాహన(సీవీ) రంగ అమ్మకాలు ఊపందుకోనున్నాయి. పర్యావరణ నిబంధనల అమలుకంటే ముందుగానే చేపట్టనున్న కొనుగోళ్లు ఇందుకు మద్దతివ్వనున్నాయి. అయితే సమీప కాలంలో అంతంతమాత్ర పనితీరు ప్రదర్శించనున్నప్పటికీ.. తాజా ఆర్డర్ల ప్రభావంతో ఆదాయంలో పరిశ్రమను మించిన వృద్ధిని సాధించనుంది. విభిన్న ప్రొడక్టులు, అధిక మెషీనింగ్కుతోడు భారీ ఫోర్జింగ్స్ మిక్స్ ఇందుకు తోడ్పాటునివ్వనున్నాయి.అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో అధిక ఎగుమతుల కారణంగా స్టాండెలోన్ ఆదాయం 11 శాతం ఎగసి రూ. 405 కోట్లను తాకింది. దేశీ ఆదాయం 14 శాతం బలపడి రూ. 256 కోట్లకు చేరింది. ఎగుమతులు 7 శాతం పుంజుకుని రూ. 148 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మార్జిన్లు 4.4 శాతం క్షీణించి 53 శాతానికి పరిమితంకాగా.. నికర లాభం 19 శాతం నీరసించి రూ. 26 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలో ఈపీఎస్ 8 శాతంమేర నీరసించవచ్చు. అయితే 2026–27, 2028లలో 12–16 శాతంమేర మెరుగుపడవచ్చని అంచనా.గమనిక: ఈ కాలమ్లో షేర్లపై ఇచ్చిన సలహాలు వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే -
తెలుసా! ఐటీ రూల్స్ మారాయి...
ఆదాయపన్ను కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కొత్త పన్ను ప్రయోజనాల్లేకపోయినా.. ఉన్న వాటిల్లో వేతన జీవులు తప్పకుండా తెలుసుకోవాల్సిన కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంటి అద్దె భత్యం, పిల్లల విద్య కోసం చేసే ఖర్చులపై మరింత అదనపు ప్రయోజనం దక్కనుంది. యాజమాన్యం సమకూర్చే కారు, ఇంటి సేవలపై పన్ను బాధ్యతలు పెరగనున్నాయి. బ్యాంకుల్లో నగదు జమలు, నగదు ఉపసంహరణల నుంచి.. ప్రాపర్టీ కొనుగోలు సమయంలో పాన్ సమర్పించడం వరకు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాహన కొనుగోళ్ల విషయంలోనూ పాన్ నిబంధనలు మారాయి. హోటల్ బిల్లులు, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ఒక పరిమితి దాటతే పాన్ సమర్పించాలి. ఇంటి యజమానితో తనకున్న సంబంధాన్ని కిరాయిదారు వెల్లడించాల్సిందే. ఇలా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను పరంగా వస్తున్న ముఖ్యమైన మార్పుల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ...ఇప్పుడు హైదరాబాద్ వాసులకూ మరింత మెరుగైన హెచ్ఆర్ఏ పన్ను ప్రయోజనం అందుబాటులోకి వస్తోంది. ఈ నగరంలోని వేతన జీవులకు ఇప్పటి వరకు వేతనంలో భాగంగా పొందే ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై పన్ను మినహాయింపు 40 శాతంగానే ఉండేది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాల్లోని వేతన జీవులకు మాత్రమే 50 శాతం పన్ను మినహాయింపు నిబంధన వర్తిస్తోంది.ఏప్రిల్ 1 నుంచి ఈ జాబితాలో కొత్తగా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు చేరనున్నాయి. దీంతో మొత్తం ఎనిమిది నగరాల పరిధిలోని వారు హెచ్ఆర్ఏపై మరింత అధిక ప్రయోజనం పొందే అవకాశం రానుంది. కొత్త ఆదాపన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి ఈ ప్రయోజనం లేదు. పాత పన్ను విధానంలో రిటర్నులు సమర్పిస్తున్న వారు హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదీ ఫార్ములా.. హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపునకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(13ఏ) కింద వీటిని పేర్కొన్నారు.ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)⇒ యాజమాన్యం నుంచి వాస్తవంగా అందుకుంటున్న నెలవారీ హెచ్ఆర్ఏ మొత్తం. ⇒ ఇక్కడ పేర్కొన్న ఎనిమిది మెట్రోల్లో నివసించే వారికి మూలవేతనం, డీఏ మొత్తంలో 50 శాతం, ఇతర మెట్రోల్లోని వారికి 40 శాతం. ⇒ వాస్తవంగా చెల్లించిన అద్దె మొత్తం నుంచి మూల వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా వచ్చే మొత్తం. ఉదాహరణకు మూలవేతనం రూ.30వేలు ఉంటే.. ఇందులో 10% రూ.3,000 అవుతుంది. ప్రతి నెలా రూ.10,000 అద్దె చెల్లిస్తున్నట్టు అయితే ఇందులో రూ.3,000 మినహాయించగా రూ.7,000 వస్తుంది. నోట్: ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే సంవత్సరం మొత్తం మీద ఆ మేరకు పన్ను మినహాయింపును ఆదాయం నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు.ఈ ప్రయోజనానికి ఇవి తప్పనిసరి.. ⇒ వేతన జీవులై ఉండాలి. ⇒ సీటీసీలో హెచ్ఆర్ఏ భాగంగా ఉండాలి. ⇒ అద్దె ఇంట్లోనే నివసిస్తూ ఉండాలి. ⇒ ఇంటి అద్దెకు సంబంధించి రుజువులు ఉండాలి. ⇒ పాత పన్ను విధానంలోనే రిటర్నులు వేయాలి.వాహన అలవెన్స్లుయాజమాన్యాలు ఉద్యోగుల అధికారిక, వ్యక్తిగత వినియోగానికి సమకూర్చే కార్ల విషయంలోనూ పన్ను పరంగా మార్పులు రానున్నాయి. 1. ఉద్యోగే కారును సొంతంగా కలిగి ఉండడం లేదా అద్దెకు తీసుకున్న సందర్భాల్లో.. అయ్యే వ్యయాలను పనిచేసే సంస్థ భరిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో.. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ప్రతి నెలా రూ.5,000తోపాటు, అదనంగా డ్రైవర్ కోసం చేసే ఖర్చు రూ.3,000పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ప్రతి నెలా రూ.7,000తోపాటు, డ్రైవర్ కోసం చేసే చెల్లింపులు రూ.3,000 పన్ను పరిధిలోకి వస్తాయి. 2. ఒకవేళ కారును యాజమాన్యం కొనుగోలు చేసి లేదా కిరాయికి తీసుకుని ఉద్యోగికి సమకూర్చిన సందర్భాల్లో.. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ప్రతి నెలా రూ.2,000తోపాటు డ్రైవర్కు చెల్లింపుల పేరిట రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాలి. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ప్రతి నెలా రూ.3,000తోపాటు డ్రైవర్కు చెల్లింపుల పేరిట రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 3. ఒకవేళ ఉద్యోగి స్వయంగా సమకూర్చుకున్న కారుపై యాజమాన్యం నిర్వహణ అలవెన్స్ చెల్లిస్తున్నట్టయితే.. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ఉద్యోగి కారు కోసం వాస్తవంగా చేసిన వ్యయం నుంచి రూ.5,000 మినహాయించగా వచ్చే మొత్తంపై పన్ను చెల్లించాలి. డ్రైవర్ కోసమూ యాజమాన్యం చెల్లింపులు చేస్తుంటే మరో రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ఉద్యోగి కారు కోసం వాస్తవంగా చేసిన వ్యయం నుంచి రూ.7,000 మినహాయించగా వచ్చే మొత్తంపై... డ్రైవర్ పేరిట మరో రూ.3,000పైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ ఒకవేళ కారును పూర్తిగా అధికారిక అవసరాల కోసమే వినియోగించినట్టయితే, అటువంటప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంటి సేవలు, యుటిలిటీలు..⇒ స్వీపర్లు, గార్డెనర్లు, వాచ్మెన్ వేతనాల కోసం ఉద్యోగులకు యాజమాన్యాలు చేసే వాస్తవ చెల్లింపులపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ గ్యాస్, విద్యుత్, నీటిని ఇతర సంస్థల నుంచి పొందినట్టయితే, ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు ఉద్యోగి చేసిన వాస్తవ చెల్లింపులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం తన సొంత వనరుల నుంచి వీటిని అందించినట్టయితే అప్పుడు ఒక్కోయూనిట్కు అయ్యే వాస్తవ వ్యయంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ⇒ ఒక సంవత్సరంలో పనిచేసే సంస్థ నుంచి పొందిన బహమతులు లేదా గిఫ్ట్ వోచర్ల విలువ రూ.15,000 మించితే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ పనిచేసే సమయంలో సంస్థ ఉద్యోగులకు ఆహారం, పానీయాలను ఉచితంగా పెయిడ్ వోచర్ల రూపంలో అందిస్తుంటే ఆ మొత్తంపై పన్ను ఉండదు. ఒక్కో భోజనం ఖర్చు గరిష్ట పరిమితి రూ.200.పిల్లల విద్య, హాస్టల్ ప్రయోజనాలుపిల్లల విద్యకు సంబంధించి చేసే ఖర్చులపై మరింత పన్ను మినహాయింపునకు ఇకమీదట అవకాశం లభించనుంది. నెలవారీ ఒక్కొక్కరికి ఉన్న రూ.100 పరిమితి రూ.3,000కు పెరగనుంది. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు సంబంధించి ఈ మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే, హాస్టల్ కోసం చేసే వ్యయాలపై ప్రస్తుతం ఉన్న నెలవారీ రూ.300 కాస్తా రూ.9,000కు పెరగనుంది. అంటే ఇంత మొత్తంపై ఇకనుంచి పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టం, 2026లోని 280 నిబంధన కింద ఈ ప్రయోజనాలను పొందుపరిచారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఈ ప్రయోజనం ఒకే విధంగా అమలు కానుంది. రుజువులు అవసరం..⇒ ఆదాయపన్ను చట్టం నిబంధనలు, 2026 కింద పాత పన్ను విధానంలో పలు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవాలని భావించే వారు తప్పకుండా డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ⇒ హెచ్ఆర్ఏ క్లెయిమ్ కోసం ఆర్థిక సంవత్సరంలో అద్దె చెల్లింపులు రూ.1,00,000 దాటితే అప్పుడు ప్రాపర్టీ యజమాని పేరు, చిరునామా, పాన్, అతడితో ఉన్న సంబంధం (రెంటల్ అగ్రిమెంట్) రుజువులు చూపించాలి. ⇒ లీవ్ ట్రావెల్ కన్సెషన్ కోసం ప్రయాణాలకు అయిన వ్యయాల రుజువులు సమర్పించాలి. ⇒ ‘ఇంటి ప్రాపర్టీ ఆదాయం’ నుంచి వడ్డీని మినహాయింపు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే గృహ రుణదాత పేరు, చిరునామా, పాన్ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. వీటిల్లోనూ మార్పులు..⇒ బ్యాంకుల్లో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేయాలంటే ప్రస్తుతం పాన్ జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి వస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు జమలు, ఉపసంహరణల లావాదేవీల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే పాన్ ఇస్తే సరిపోతుంది. ⇒ ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు/విక్రయం, ఉమ్మడి అభివృద్ధి (జాయింట్ డెవలప్మెంట్) లావాదేవీ విలువ రూ.20 లక్షలు మించితే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. ⇒ ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇతర అన్ని వాహన కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఏ వాహనం కొనుగోలు చేస్తున్నా.. రూ.5 లక్షలకు మించితే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చెల్లింపులు రూ. లక్షకు మించితే పాన్ సమర్పణ తప్పనిసరి. ⇒ జీవిత బీమా పాలసీల కొనుగోలు సమయంలో ఇకమీదట పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమల్లో ఉంది. -
స్కోడా రీకాల్.. 221 కార్లపై ఎఫెక్ట్!
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా.. తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ అయిన స్కోడా కోడియాక్కు రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 221 యూనిట్లపై పడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.స్కోడా కోడియాక్లోని ముందు సీట్ల లోపలి ఫ్రేమ్కు సంబంధించిన లోపం కారణంగా కంపెనీ రీకాల్ జారీ చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం, మార్చి 10 నుండి డిసెంబర్ 8, 2025 మధ్య తయారైన మొత్తం 221 యూనిట్లు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఈ సమస్య ముందు సీట్ల లోపలి ఫ్రేమ్ అంచులో ఉంది. ఈ లోపం వల్ల.. సైడ్ ఎయిర్బ్యాగ్లు తెరుచుకున్నప్పుడు రక్షణ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు, ఇది సైడ్ ఎయిర్బ్యాగ్ సామర్థ్యాన్ని తగ్గించి, తద్వారా వాహనంలో ఉన్నవారికి గాయాలయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.రీకాల్ ప్రభావానికి ప్రభావితమైన కార్ల యజమానులను కంపెనీ సంప్రదించనుంది. రీకాల్ ప్రక్రియలో భాగంగా అవసరమైన తనిఖీలు, సమస్యలను పరిష్కరించనుంది.స్కోడా కొడియాక్రెండవ తరం కోడియాక్ గత సంవత్సరం ఏప్రిల్లో భారతదేశంలో విడుదలైంది. ఇది 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ల TSI టర్బో-పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది, ఇది 7-స్పీడ్ DSG (డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్) ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్ స్టాండర్డ్గా లభిస్తుంది. పనితీరు పరంగా, ఈ SUV 201 bhp, 320 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.కోడియాక్ ధర వేరియంట్, కాన్ఫిగరేషన్ను బట్టి మారుతుంది. ఈ ఎస్యూవీ ధర ప్రస్తుతం రూ. 39.99 లక్షల నుంచి రూ. 45.95 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. అదే సమయంలో, స్పోర్ట్లైన్ మరియు ఎల్&కె వేరియంట్ల వంటి నిర్దిష్ట ట్రిమ్ల ధరలు వరుసగా రూ. 46.89 లక్షలు, రూ. 48.69 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. -
ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. చాలామంది పెట్టుబడిదారులు విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఫండ్స్ఇండియా గ్రూప్ సీఈఓ అక్షయ్ సప్రూ భవిష్యత్ పరిణామాల గురించి విశ్లేషించారు.భౌగోళిక రాజకీయ పరిణామాలను నియంత్రించడం చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. భవిష్యత్తులోనూ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనల కారణంగా.. పెట్టుబడిదారుడి తత్వం దారి తప్పకూడదని అక్షయ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం పాత పద్దతులను వదిలిపెట్టి.. కొత్త విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు.బంగారం ర్యాలీ చాలా వరకు పూర్తయింది. రాబోయే ఐదేళ్లలో.. ఇది గత సైకిల్ మాదిరిగా రాబడులను అందించకపోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో బంగారం ఇప్పటికే 5-10 శాతం ఉంటే, ఆ కేటాయింపును కొనసాగించవచ్చు, కానీ పెట్టుబడిని గణనీయంగా పెంచడం మంచిది కాదు. గోల్డ్ సిప్లను కొనసాగించవచ్చు, కానీ కొత్తగా చేసే ఏకమొత్తం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వెండి విషయానికొస్తే, దాని అధిక అస్థిరత, నిలకడలేని రాబడుల కారణంగా సాధారణంగా చాలామంది దానికి ప్రాధాన్యత ఇవ్వరు అని అక్షయ్ సప్రూ పేర్కొన్నారు.2030 నాటికి గోల్డ్ రేటుఇప్పుడు రూ.1,48,000 వద్ద బంగారం ధర 2030 నాటికి రూ.1.68 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్యకు చేరుకుంటుందని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఏర్పడే ఆర్థిక అనిశ్చితి అని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు' -
జేబులో జ్యూసర్.. బాటిల్ బ్యాగ్!
మీ సమ్మర్ను రిఫ్రెషింగ్గా మార్చే ‘స్మార్ట్’ మ్యాజిక్ ఇదిగో! ఈ అదిరిపోయే గాడ్జెట్స్తో చెమటలకు గుడ్ బై చెప్పేసి, చిల్ అవ్వండి!జేబులో జ్యూసర్!ఆఫీసులో ఉన్నప్పుడైనా లేదా జిమ్ పూర్తి చేసొచ్చినా, బయట దొరికే షుగర్ డ్రింక్స్ తాగి విసిగిపోయారా? ఎక్కడున్నా సరే ‘ఫ్రెష్’గా జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇందుకోసమే వచ్చేసింది ఈ రీచార్జబుల్ పోర్టబుల్ జ్యూసర్!ఇది మామూలు మిక్సీ కాదు, మీరు ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లగలిగే ఒక మినీ మ్యాజిక్ బాటిల్! పైగా దీనికి వైర్లు లేదా ప్లగ్ పాయింట్లతో పనిలేదు. ఇందులో ఉన్న పవర్ఫుల్ బ్యాటరీని మీ మొబైల్ చార్జర్ లేదా పవర్ బ్యాంక్తో చార్జ్ చేసుకుంటే చాలు. ప్రయాణాల్లో ఉన్నా, క్యాంపింగ్లో ఉన్నా సెకన్లలో తాజా ఫ్రూట్ జ్యూస్లు, స్మూతీలు రెడీ అయిపోతాయి. జ్యూసర్ లీక్–ప్రూఫ్ డిజైన్తో వస్తుంది, కాబట్టి మీ బ్యాగ్లో పెట్టుకున్నా చిందుతుందనే భయం ఉండదు. ధర రూ. 570 మాత్రమే!బాటిల్ బ్యాగ్!బయటకి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ను చేత్తో పట్టుకోలేక, బ్యాగ్లో పెడితే లోపల ఉన్న వస్తువులు తడిసిపోతాయని టెన్షన్ పడుతున్నారా? ఇకపై మీ బాటిల్ను స్టయిలిష్గా మోసుకెళ్లడానికి వచ్చేసింది ఈ వాటర్ బాటిల్ క్యారియర్ బ్యాగ్!ఇందులో బాటిల్తో పాటు మీ ఫోన్, డబ్బులు లేదా తాళాలు పెట్టుకోవడానికి ఒక జిప్పర్ పాకెట్ కూడా ఉంటుంది. పైగా దీనికి ఉన్న అడ్జస్టబుల్ షోల్డర్ స్ట్రాప్ వల్ల ఎవరికైనా ఇట్టే సెట్ అయిపోతుంది. వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల వర్షం పడినా మీ ఫోన్, బాటిల్ సేఫ్గా ఉంటాయి! ఆఫీసుకైనా, జిమ్కైనా లేదా ట్రావెలింగ్కైనా ఈ బ్యాగ్ మీకు మంచి క్లాసీ లుక్ను ఇస్తుంది. ధర రూ. 500 మాత్రమే!ఐస్ ముక్కల ‘మ్యాజిక్ కప్పు’!ఫ్రిజ్లో ఉన్న ఐస్ ట్రే నుంచి ఐస్ ముక్కల్ని తీయడానికి కుస్తీ పడుతున్నారా? తీరా తీశాక అవి అక్కడక్కడా విరిగిపోయి చిరాకు తెప్పిస్తున్నాయా? అయితే మీకోసం వచ్చేసింది ఈ సిలికాన్ ఐస్ మేకర్ కప్పు!ఇది మామూలు ఐస్ ట్రే కాదు, ఒక స్మార్ట్ సిలికాన్ సిలిండర్. ఇందులో నీళ్లు పోసి ఫ్రిజ్లో పెట్టుకుని ఐస్ తయారు చేసుకోవచ్చు. దీనికున్న చిన్న బటన్ నొక్కితే చాలు, అరవై చిన్న చిన్న ఐస్ ముక్కలు టకటకా రాలిపోతాయి! చూడటానికి కప్పులా చాలా చిన్నగా ఉంటూ, మీ ఫ్రిజ్లో అస్సలు చోటు ఆక్రమించదు. ఫుడ్ గ్రేడ్ సిలికాన్ తో తయారవ్వడం వల్ల చాలా సేఫ్, పైగా దీనికి ఉన్న మూత వల్ల ఫ్రిజ్లోని ఇతర వాసనలు ఐస్కు అంటుకోవు. ధర కేవలం రూ. 400 మాత్రమే! -
ఈ-చెక్స్ వస్తున్నాయ్.. ఆర్బీఐ కీలక ప్రకటన!
చెల్లింపు వ్యవస్థను మరింత కొత్తగా మార్చే ప్రక్రియలో భాగంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్తగా ఈ-చెక్స్ (ఎలక్ట్రానిక్ చెక్స్) ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ చర్యకు కారణం భద్రతను పెంచడం.. వ్యాపార, వినియోగదారుల అవసరాలను తీర్చడం.ఆర్బీఐ తన పేమెంట్స్ విజన్ 2028 నివేదికలో.. చెక్స్ డిజైన్, భద్రతా లక్షణాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సౌకర్యం, ఒక్కసారిగా అమలులో ఉండే విధానం, మోసాల నివారణ, కొత్త చెల్లింపు విధానాలతో సర్దుబాటు సాధ్యమవుతుందని వెల్లడించింది.ఈ-చెక్ అంటే?ఈ-చెక్ అనేది కాగితపు చెక్కుకు డిజిటల్ రూపం. అంటే దీనిని కాగితంపై కాకుండా ఆన్లైన్లో పంపుతారు. చెల్లింపుదారుడు వివరాలను నింపి, డిజిటల్ పద్ధతిని ఉపయోగించి సురక్షితంగా సంతకం చేసి, దానిని చెల్లింపు గ్రహీతకు లేదా బ్యాంకుకు పంపుతారు. బ్యాంక్ దీన్ని సాధారణ చెక్లా పరిశీలించి ప్రాసెస్ చేస్తుంది. ఇది వేగంగా, సురక్షితంగా, పేపర్ లెస్గా, ట్రాక్ చేయడానికి సులభంగా ఉంటుంది.ఇదీ చదవండి: భారత్లో దోహా బ్యాంక్ పూర్తిగా క్లోజ్! -
ఎగుమతులు షురూ.. 75 దేశాలకు సెమాగ్లూటైడ్!
మధుమేహం, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ జనరిక్ వెర్షన్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హెటిరో వెల్లడించింది. ట్రూగ్లిక్స్, రోల్మోడల్, మోటో జీ బ్రాండ్ల పేరుతో వీటిని విక్రయించనున్నట్లు వివరించింది. ఇవి డిస్పోజబుల్ పెన్ డివైజ్ల రూపంలో 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు వివిధ డోసేజీల్లో లభిస్తాయి.75 పైగా దేశాలకు దశలవారీగా వీటిని ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ముందుగా ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. నియంత్రణ సంస్థ సీడీఎస్సీవో అనుమతులు వచ్చాక దేశీయంగా కూడా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో అందుబాటు ధరలో నాణ్యమైన జనరిక్ సెమాగ్లూటైడ్ని అందించాలనేది తమ లక్ష్యమని హెటిరో ఎండీ వంశీకృష్ణ బండి తెలిపారు. -
బిగ్ షాక్.. భారత్లో ఆ బ్యాంక్ పూర్తిగా క్లోజ్!
భారతదేశంలో పదేళ్లకు పైగా తన కార్యకలాపాలను సాగించిన దోహా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. కటార్లోని దోహా బ్యాంక్ తన భారత్లోని రెండు శాఖలను మూసివేయాలని నిర్ణయించింది. కాగా ఇకపై కేవలం ఒక ప్రతినిధి కార్యాలయాన్ని మాత్రమే కొనసాగించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.దోహా బ్యాంక్ భారతదేశంలో తన కార్యకలాపాలను జూన్ 2014 లో ప్రారంభించింది. మొదటి శాఖ ముంబైలో, తరువాత కొచ్చిలో రెండవ శాఖ ప్రారంభించింది. ఆ తరువాత 2016లో ఈ బ్యాంక్ భారతీయ మార్కెట్లో వృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితులను ఉపయోగించుకుని, గల్ఫ్ దేశం, భారతదేశం మధ్య రిమిటెన్స్ (ప్యారమిటెన్స్) అవకాశాలను లబ్ధిపరచడానికి ఇండియాలో సబ్సిడియరీ స్థాపించేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తుందని వార్తలు వచ్చాయి.ఇప్పుడు దోహా బ్యాంక్ వ్యూహం మార్పుతో.. భారతదేశంలో ప్రత్యక్ష కార్యకలాపాలను తగ్గిస్తూ, ప్రతినిధి కార్యాలయం ద్వారా మాత్రమే తన ఉనికిని కొనసాగించనున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బులు జమ చేసుకోవడం విత్డ్రా చేయడం వంటివి ఇకపై ఉండదు. అయితే ఇది ఖతార్లోని ప్రధాన బ్యాంకుకు, భారతీయ కస్టమర్లకు మధ్య ఒక వారధిలా మాత్రమే పనిచేస్తుంది. అంటే వ్యాపార అవకాశాలను వెతకడం, దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం వంటి పనులకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు' -
అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ షురూ
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్), అలయంజ్ గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ తాజాగా కార్యకలాపాలు ప్రారంభించింది. దీనికి సోనియా రావల్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారు. జేవీ ద్వారా దేశీ బీమా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు సంస్థ ఎండీ హితేష్ సేథియా తెలిపారు.బీమా కంపెనీలకు వినూత్నమైన, పటిష్టమైన రిస్క్ సొల్యూషన్స్ అందించనున్నట్లు అలయంజ్ ఎస్ఈ బోర్డు సభ్యుడు క్రిస్ టౌన్సెండ్ వివరించారు. అంతర్జాతీయంగా సాంకేతిక అనుభవం, దేశీయంగా డిజిటల్, ఆర్థిక వ్యవస్థలపై అవగాహన ఇందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. -
'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'
అన్ని రంగాల్లోనూ ఏఐ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో.. చాలామంది ఉద్యోగాలు పోతాయేమో అనే భయం గుప్పెట్లో చిక్కుకున్నారు. దీనిపై కొందరు నిపుణులు మిశ్రమంగా స్పందించారు. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన రక్షణ సాంకేతిక సంస్థ పలాంటిర్ టెక్నాలజీస్.. సీఈఓ 'అలెక్స్ కార్ప్' ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృత్రిమ మేధస్సు (AI) యుగంలో కూడా ఎవరు ఎదుగుతారు? అనే విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఏఐ వల్ల ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయినా.. రెండు రకాల వ్యక్తులు మాత్రం భవిష్యత్తులో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మొదటివారు 'వృత్తి ఆధారిత నైపుణ్యాలు' కలిగిన వారు. ఉదాహరణకు మెకానిక్లు, ఎలక్ట్రిషన్లు, టెక్నీషియన్లు వంటి ప్రాక్టికల్ పనులు చేసే వ్యక్తులు. ఈ పనులను పూర్తిగా AI చేత భర్తీ చేయడం కష్టం.రెండవ వర్గం 'న్యూరోడైవర్జెంట్' వ్యక్తులు. అంటే న్యూరోడైవర్సిటీ అనే భావనకు చెందిన వారు. సాధారణంగా కాకుండా.. భిన్నంగా ఆలోచించే వారు, కొత్త మార్గాలను అనుసరించే వారు, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించే వారు వీరందరూ ఈ వర్గంలోకి వస్తారని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు.సంప్రదాయ ఉద్యోగాలైన.. సాధారణ కోడింగ్, లా వర్క్, లేదా రీడింగ్, రైటింగ్ వంటి పనులను ఏఐ సులభంగా చేస్తుంది. అంటే ఈ రకమైన ఉద్యోగాలు చేసేవారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగాల్లో పనిచేసేవారు.. తప్పకుండా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.భవిష్యత్తులో ఎక్కువ ప్రాముఖ్యత పొందేది సృజనాత్మకత, ఒరిజినల్ ఆలోచన, కొత్తదనం సృష్టించే సామర్థ్యం మాత్రమే అని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు. మనం ఒక ఆర్టిస్ట్ మాదిరిగా ఆలోచించడం నేర్చుకోవాలి. విషయాలను భిన్న కోణాల్లో చూడగలగడం, కొత్త పరిష్కారాలను కనుగొనడం చాలా ముఖ్యం అవుతుంది. ఇలాంటి వాళ్లను ఏఐ కూడా ఏమీ చేయలేదు. కాబట్టి వృత్తి నైపుణ్యాలు కలిగిన వారు, భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఏఐ ప్రపంచంలో కూడా ముందంజలో ఉండే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా! -
యుద్ధం లాభదాయకమే: కియోసాకి కామెంట్స్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక విశ్లేషకుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి యుద్ధం వల్ల కలిగే ఆర్థిక పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదని చెబుతూనే, అది ఏ విధంగా దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందో ఆయన వివరించారు.నాటి యుద్ధ జ్ఞాపకాలు..వియత్నాం యుద్ధ కాలం నాటి ఒక నిరసన గీతాన్ని ప్రస్తావిస్తూ.. "యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదు" అని ఆయన పేర్కొన్నారు. స్వయంగా వియత్నాం యుద్ధంలో (1966, 1971-72) పాల్గొన్న కియోసాకి, తన స్నేహితులను కోల్పోయిన బాధను గుర్తు చేసుకున్నారు. మూడు వారాల క్రితమే తాను వియత్నాం వెళ్లి తన పాత స్నేహితులకు వీడ్కోలు పలికి, మనశ్శాంతిని పొందినట్లు ఆయన తెలిపారు.యుద్ధం వల్ల భారంగా మారుతున్న సామాన్యుడి జీవితంప్రస్తుతం 'పవిత్ర భూముల్లో' (మిడిల్ ఈస్ట్) జరుగుతున్న యుద్ధంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల కేవలం ప్రాణనష్టం మాత్రమే కాకుండా, యుద్ధానికి దూరంగా ఉన్న దేశాల్లోని ప్రజలు కూడా ద్రవ్యోల్బణం (Inflation) వల్ల ఆర్థికంగా దెబ్బతింటారని హెచ్చరించారు. యుద్ధాల వల్ల దేశాల అప్పులు విపరీతంగా పెరుగుతాయన్నారు. పెరిగే ధరల వల్ల సామాన్యుడు పేదరికంలోకి నెట్టబడతాడని, ఆర్థిక సంక్షోభం కారణంగా ఎంతోమంది ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన విశ్లేషించారు.సంక్షోభంలోనే సంపద సృష్టియుద్ధం అనేది మానవత్వానికి నష్టమే అయినా, ఆర్థికంగా అది కొంతమందికి లాభాలను తెచ్చిపెడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. "యుద్ధం వల్ల దేశాలు అప్పుల ఊబిలో ఉన్నంత మాత్రాన మీరు ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం లేదు. సరైన ఆర్థిక విద్య (Financial Education) ఉంటే ఇలాంటి కష్టకాలంలో కూడా మీరు ధనవంతులు కావచ్చు" అని ఆయన సూచించారు. మీ మెదడు, మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలే మీ గొప్ప ఆస్తులని, మంచి గురువులను ఎంచుకుని ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు.“WAR: What is it good for?Absolutely nothing.”The above are words from a Vietnam era protest song.Tragically war is profitable. If war was not proftsble….would we have wars?FYI: I served in Vietnam twice…once in 1966 and 1971-72.I lost many friends in Vietnam. I…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 29, 2026 -
భారత్ వృద్ధిపై ఓఈసీడీ ఆశావహ అంచనాలు
న్యూఢిల్లీ: భారత్ జీడీపీపై ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య (ఓఈసీడీ) ఆశావహ అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) జీడీపీ 7.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.1 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. ఈ మేరకు మధ్యంతర అంచనాలను వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులతో ఆయా దేశాల్లో ప్రజలు, ఆర్థిక వ్యవస్థలపై ఆర్థిక భారం పడుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలాన్ని ఇది పరీక్షిస్తుందని పేర్కొంది.హర్మూజ్ జలసంధిని మూసివేయడంతోపాటు, ఇంధన వసతులను దెబ్బతీయడాన్ని ప్రస్తావించింది. ‘‘యూఎస్ టారిఫ్లు తగ్గడం భారత వృద్ధికి అనుకూలిస్తుంది. గ్యాస్ కొరతతో ఉత్పత్తి కార్యకలాపాలకు కొంత మేర విఘాతం కలగొచ్చు. అయితే, ద్రవ్యపరమైన ఉద్దీపనల మద్దతుతో దీన్ని అధిగమించొచ్చు. ఈ పరిణామాల దృష్ట్యా భారత వృద్ధి రేటు 2025–26లో ఉండే 7.6 శాతం నుంచి 2026–27లో 6.1 శాతానికి పరిమితం కావొచ్చు. 2027–28లో 6.4 శాతానికి చేరుకోవచ్చు’’అని ఓఈసీడీ తెలిపింది.ఆహారం, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం 2025–26లో ఉండే 2 శాతం నుంచి 2026–27లో 5.1 శాతం, 2027–28లో 4.1 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. వర్ధమాన దేశాల్లో ఒక్క భారత్లో మాత్రం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను సర్దుబాటు చేసేందుకు సెంట్రల్బ్యాంక్ జూన్ త్రైమాసికంతో తాత్కాలికంగా రేట్లను పెంచొచ్చని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2026లో 2.9 శాతం, 2027లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. -
‘ఇథనాల్’ ఇంధనమే ఆదుకుంటోంది..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వ 'ఇథనాల్ మిశ్రమ విధానం' (Ethanol Blending Policy) భారత్కు రక్షణ కవచంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శనివారం జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, దేశ ఇంధన భద్రతలో రైతుల పాత్రను కొనియాడారు.చమురు దిగుమతులకు అడ్డుకట్ట..ముడి చమురు దిగుమతుల కోసం వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఆదా చేయడంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన చెరకు రైతులు కీలక పాత్ర పోషించారని ప్రధాని తెలిపారు. "ఇథనాల్ మిశ్రమ విధానం లేకపోతే, మనం విదేశాల నుండి అదనంగా 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. రైతులే మన దేశ విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడారు" అని ఆయన పేర్కొన్నారు.భారత్కు అవసరమైన చమురులో దాదాపు 40% పశ్చిమాసియా నుండే అందుతోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ధరలు పెరిగినప్పటికీ, ఇథనాల్ వాడకం వల్ల భారత్ ఆ ప్రభావాన్ని తట్టుకోగలుగుతోందని ప్రధాని వివరించారు.వేగంగా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఖరీదైన ముడి చమురు దిగుమతులను తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మోదీ ప్రభుత్వ హయాంలో వేగం పుంజుకుంది. నిర్ణయించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని, గడువు కంటే ఐదేళ్ల ముందే గత ఏడాది భారత్ సాధించింది.ఈ క్రమంలో గత ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 (20% ఇథనాల్ మిశ్రమం) సరఫరా అవుతోంది. దీంతో ఇదే ఉత్సాహంతో 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారతత్ గత 10 ఏళ్లలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతేడాది జూలైలో తెలిపింది. -
నిన్న భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ఇలా..
దేశంలో పసిడి ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. రెండు రోజులు పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) ఈరోజు నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి ఊరటని చెప్పవచ్చు.అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్ పోర్ట్ల అభివృద్ధిపై కేంద్రం దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా పర్యావరణహిత పోర్టుల (గ్రీన్ పోర్ట్లు) అభివృద్ధి, సముద్ర మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, వాటర్వేస్ శాఖ తెలిపింది. ’మారిటైమ్ ఇండియా విజన్ –2030’, ’హరిత సాగర్’ మార్గదర్శకాల కింద పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది.గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రాం ద్వారా డీజిల్ టగ్ల స్థానంలో ఎలక్ట్రిక్ / హైబ్రిడ్ టగ్ల వినియోగం, పోర్టుల్లో పునరుత్పాదక శక్తి వినియోగం పెంపు, పోర్ట్ పరికరాలు, వాహనాలు, రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ, జీరో ఎమిషన్ ట్రక్కుల వినియోగం, నౌకలకు తీర ప్రాంతం నుంచే విద్యుత్ సరఫరా చేసే ‘‘వన్షోర్ పవర్ సప్లై’’ వ్యవస్థలు’ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా ‘దీన్దయాల్ పోర్ట్ అథారిటీ, పారాదీప్ పోర్ట్ అథారిటీ, వీ.ఓ.చిదంబరనార్ పోర్ట్ అథారిటీ’లను నూతన, పునరుత్పాదక శక్తి శాఖ గుర్తించినట్లు వివరించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023–24, 2024–25) ప్రధాన పోర్టుల అభివృద్ధికి సుమారు 180 ప్రాజెక్టులు ఆమోదం పొందినట్లు కేంద్రం తెలిపింది.వీటిలో ప్రధానంగా ‘పోర్టుల ఆధునీకరణ, తీర ప్రాంత రవాణా (కోస్టల్ షిప్పింగ్) అభివృద్ధి, గ్రీన్ పోర్టుల రూపకల్పన’ ఉన్నాయి. 2030 నాటికి ‘60% పైగా పునరుత్పాదక శక్తి వినియోగం, 50% పోర్ట్ పరికరాల విద్యుదీకరణ, 20% గ్రీన్ బెల్ట్ విస్తీర్ణం, కర్బన ఉద్గారాల్లో 30% తగ్గింపు (టన్ను కార్గోకు), నీటి వినియోగం 20% తగ్గింపు’ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. -
ఇల్లు ఇక్కడ కడితే తక్కువ ఖర్చు!
సొంతిల్లు అనేది ప్రతిఒక్కరికీ జీవిత కల. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆ కలను సాకారం చేసుకోవడంలో సవాలుగా మారుతున్నాయి. 2026 తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా నిర్మాణ ఖర్చులు, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక విశ్లేషణ ఈ కథనంలో..దేశంలో నిర్మాణ ఖర్చులు ఎక్కడ తక్కువ?భారతదేశంలో నిర్మాణ ఖర్చులు భౌగోళిక ప్రాంతం, రవాణా సౌకర్యాలు, కూలీల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అత్యంత సరసమైన ధరల్లో నిర్మాణాలు జరుగుతున్న నగరాలు ఇవే..అహ్మదాబాద్ (గుజరాత్): దేశంలోనే అత్యంత చౌకగా ఇల్లు నిర్మించుకోగలిగే నగరం ఇది. ఇక్కడ చదరపు అడుగుకి సగటున రూ.1,200 – రూ.1,600 ఖర్చు అవుతోంది.జైపూర్ (రాజస్థాన్): ఇక్కడ చదరపు అడుగుకి రూ.1,500 – రూ.2,200 మధ్య ధరలు ఉన్నాయి.విజయవాడ (ఆంధ్రప్రదేశ్): పెరుగుతున్న నగరమైనప్పటికీ, మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ నిర్మాణ ఖర్చులు కొంత తక్కువగా (చదరపు అడుగుకి రూ.1,400 – రూ.2,200) నమోదవుతున్నాయి.కోల్కతా: మెట్రో నగరాల్లో తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకోగలిగే చోటుగా కోల్కతా నిలుస్తోంది (సుమారు రూ.1,500 – రూ.2,500).మరోవైపు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ ఖర్చు చదరపు అడుగుకి రూ.2,500 నుంచి రూ.5,000 పైమాటే.తెలుగు రాష్ట్రాల పరిస్థితితెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లలో నిర్మాణ ఖర్చులు 10-15% పెరిగాయి. ముఖ్యంగా కూలీల కొరత, రవాణా ఛార్జీలు పెరగడం దీనికి ప్రధాన కారణం. హైదరాబాద్లో ఇంటి నిర్మాణానికి బేసిక్ క్వాలిటీలో ఒక చదరపు అడుగుకు రూ.1,700 – రూ.2,000, స్టాండర్డ్ క్వాలిటీ అయితే రూ.2,100 – రూ.2,500 ఖర్చవుతోంది. అదే ప్రీమియం/లగ్జరీ అయితే ఒక ఎస్ఎఫ్టీకి రూ.2,600 – రూ.3,800 ఖర్చు పెట్టాల్సి వస్తోంది.హైదరాబాద్ శివార్లలో (ఉదా: షాద్నగర్, ఆదిబట్ల) నిర్మాణ ఖర్చులు కొంత తక్కువగా ఉండగా, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో కూలీల రేట్లు అధికంగా ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ, గుంటూరు వంటి నగరాలలో సగటున చదరపు అడుగుకి రూ.1,400 – రూ.2,300 ఖర్చు అవుతోంది. విశాఖపట్నం వంటి నగరాల్లో స్టీల్, సిమెంట్ రవాణా సౌకర్యం వల్ల మెటీరియల్ ధరలు ఇతర ప్రాంతాల కంటే స్వల్పంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది.సగటు నిర్మాణ సామగ్రి ధరలు 2026 అంచనా ధరల ప్రకారం.. నిర్మాణ వ్యయంలో దాదాపు 60-70% ఖర్చు మెటీరియల్కే అవుతుంది. ప్రస్తుత మార్కెట్ రేట్లు ఇలా ఉన్నాయి..సామగ్రిసగటు ధరసిమెంట్ (50kg బ్యాగ్)₹350 – ₹450స్టీల్ (TMT Bars - టన్ను)₹60,000 – ₹75,000ఇసుక (రివర్ సాండ్ - టన్ను)₹1,200 – ₹2,500 (లభ్యతను బట్టి)ఎం-సాండ్ (M-Sand - టన్ను)₹900 – ₹1,500ఇటుకలు (ఒక్కోటి)₹7 – ₹12సిమెంట్ ఇటుకలు/బ్లాక్స్₹30 – ₹502026 బడ్జెట్లో సిమెంట్ పై జీఎస్టీని (GST) 28% నుంచి 18 శాతానికి, స్టీల్ పై 18% నుంచి 12శాతానికి తగ్గించడం వల్ల సామాన్యులకు కొంత ఊరట లభించింది.ఖర్చును ఎలా తగ్గించుకోవాలి?స్థానిక మెటీరియల్: రవాణా ఖర్చు తగ్గించుకోవడానికి స్థానికంగా లభించే ఇటుకలు, కంకర వాడటం ఉత్తమం.ప్లానింగ్:నిర్మాణ సమయంలో ప్లాన్ మార్పులు చేయకుండా ముందుగానే పక్కాగా సిద్ధమవ్వాలి.టెక్నాలజీ: ప్రస్తుత కాలంలో ఏఏసీ బ్లాక్స్ వాడకం వల్ల ప్లాస్టరింగ్ ఖర్చు, సిమెంట్ వినియోగం తగ్గుతుంది.ఇదీ చదవండి: సిటీ రియల్ ఎస్టేట్కు గేమ్ ఛేంజర్! -
వివో నుంచి రెండు కొత్త ఫోన్లు
న్యూఢిల్లీ: వివో ఇండియా కొత్తగా రెండు 5జీ స్మార్ట్ ఫోన్స్ని ఆవిష్కరించింది. వై21, వై11 వీటిలో ఉన్నా యి. వై 21 5జీ ధర రూ. 18,999 నుంచి, వై11 5జీ రేటు రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. నిర్దిష్ట బ్యాంక్ కార్డులతో వై21పై రూ. 1,500 వరకు, వై11పై రూ. 1,000 వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ ఉంటుంది.రెండు డివైజ్లలో 6500 ఎంఏహెచ్ బ్యాటరీలు, 6.74 అంగుళాల స్క్రీన్లు, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్లు, ఆరిజిన్ ఓఎస్6 ఆపరేటింగ్ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వై21లో 50 ఎంపీ రియర్ కెమెరా, వై11లో 13 ఎంపీ రియర్ కెమెరా ఉంటాయి. వివో ఇండియా ఈ–స్టోర్, ఈకామర్స్ ప్లాట్ఫాంలు, పార్ట్నర్ రిటైల్ స్టోర్స్లో ఇవి లభిస్తాయి. -
పునరుత్పాదక విద్యుత్పై ఎల్జీఈ ఇండియా ఫోకస్
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఎల్జీఈ ఇండియా తమ తయారీ ప్లాంట్లలో పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం రెండు సంస్థలతో దీర్ఘకాలిక సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకుంది. తమ పుణె ప్లాంటుకు 9.89 మెగావాట్స్ పీక్ (ఎండబ్ల్యూపీ) సోలార్ పవర్ కోసం హిందుజా రెన్యువబుల్స్ ఎనర్జీతో, అలాగే గ్రేటర్ నోయిడా ప్లాంటుకి సంబంధించి 11 ఎండబ్ల్యూపీ కోసం సన్ష్యూర్ ఎనర్జీతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలతో మొత్తం మీద ఏటా 50,000 గృహాల అవసరాలకు సరిపడేంతగా 3.2 కోట్ల యూనిట్ల స్వచ్ఛ విద్యుత్ జనరేట్ అవుతుందని సంస్థ వివరించింది. -
ట్యాబ్లెట్ పీసీల్లో శాంసంగ్ టాప్..
ముంబై: భారత ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ 2025లో వార్షిక ప్రాతిపదికన 2% వృద్ధి సాధించింది. ముఖ్యంగా శాంసంగ్ 31% మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలవగా.. యాపిల్ 20% వాటాతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లెనోవో (15%) మూడో స్థానంలో నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.‘‘ప్రముఖ బ్రాండ్లు చేపట్టిన వ్యూహాత్మక ఉత్పత్తి నవీకరణల కారణంగా భారత ట్యాబ్లెట్ మార్కెట్లో ప్రీమియం వైపు స్పష్టమైన మార్పు కనిపించింది. రూ.30,000–రూ.40,000 ధర విభాగం అత్యంత వేగంగా పెరుగుతున్న సెగ్మెంట్గా మారింది. ఈ విభాగంలో షిప్మెంట్లు దాదాపు 7 రెట్లు పెరిగాయి. ఇది అత్యాధునిక పనితీరు గల డివైస్లపై కస్టమర్లకు పెరుగుతున్న ఆసక్తి సూచిస్తుంది.’’ అని కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రధాన అనలిస్ట్ అన్షికా జైన్ తెలిపారు. కొనసాగిన శాంసంగ్ హవా: భారత్ ట్యాబ్లెట్ పీసీ మార్కెట్లో గతేడాది కూడా శాంసంగ్ అగ్రస్థానంలోనే కొనసాగింది. ట్యాబ్లెట్ల సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 15% వృద్ధితో మార్కెట్ వాటా 2024లో 27% నుంచి 2025లో 31 శాతానికి పెరిగింది. గెలాక్సీ ట్యాబ్ ఏ9 సిరీస్కు మంచి డిమాండ్ నెలకొనడం, తరువాత ఏ11 సిరీస్ ప్రవేశంతో వృద్ధి కొనసాగింది. రూ.15,000–రూ.30,000 విభాగంలో శాంసంగ్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. అలాగే గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిరీస్ ద్వారా ప్రీమియం విభాగంలో కూడా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. యాపిల్ వాటా స్వల్ప తగ్గుదల: మార్కెట్ వాటా స్వల్పంగా రెండు శాతం క్షీణించినప్పటికీ యాపిల్ మొత్తం మీద 20 శాతం వాటాతో శాంసంగ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. రూ.30,000– రూ.40,000 ధర విభాగంలో ఐప్యాడ్ (2025) 128జీబీ మోడల్కు మంచి డిమాండ్ ఉండటం గమనార్హం. ఐప్యాడ్ ప్రో సిరీస్లో ఓఎల్ఈడీ టెక్నాలజీ వినియోగం పెరగడంతో ప్రీమియం సెగ్మెంట్లో కంపెనీ స్థానం బలపడింది. లెనోవో 24% సప్లై వృద్ధితో 15 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోగా, షియోమీ 74% షిప్మెంట్ పెరు గుదలతో 11% మార్కెట్ వాటాను సాధించింది. మరోవైపు, ఏసర్ సప్లైలు 50% క్షీణించడంతో మార్కెట్ వాటా 2024లోని 21% నుంచి 2025లో 10 శాతానికి దిగివచి్చంది. ఎగుమతులు–తయారీ రంగాల్లో పురోగతి: 2025లో ట్యాబ్లెట్ ఎగుమతులు ఒక మిలియన్ యూనిట్లను దాటాయి. శాంసంగ్, లెనోవో ఆధ్వర్యంలో అమెరికా, యూరప్ మార్కెట్లకు సరఫరాలు పెరిగాయి. దేశీయ ఉత్పత్తి మొత్తం షిప్మెంట్లో 50 శాతానికి చేరడం లోకలైజేషన్ వేగాన్ని సూచిస్తోంది. దీంతో భారత్ గ్లోబల్ ట్యాబ్లెట్ తయారీ కేంద్రంగా ఎదుగుతోంది.2026లో వృద్ధి అంచనాలు: బలమైన డిమాండ్ ఆధారంగా 2026లో మార్కెట్ మరింత వృద్ధి చెందనుందని అంచనా. మెమరీ ధరలు ఖర్చులు, లాభాలపై ప్రభావం చూపినా..., అధిక కాని్ఫగరేషన్లు, ప్రొడక్టివిటీ డివైజ్లకు పెరుగుతున్న డిమాండ్ వృద్ధికి దోహదం చేస్తాయి. లోకలైజేషన్, సరఫరా డైవర్సిఫికేషన్తో ఎగుమతులు కీలకంగా మారనున్నాయి. ఏఐ ఆధారిత టాబ్లెట్లు, డివైస్లోనే పనిచేసే ఏఐ ఫీచర్లు కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తూ, మార్కెట్ విస్తరణకు తదుపరి దశకు పునాది వేస్తాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అభిప్రాయపడింది. -
మర్చంట్ చెల్లింపుల్లో పేటీఎం ఫస్ట్
న్యూఢిల్లీ: మర్చంట్ చెల్లింపుల్లో పేటీఎం ప్లాట్ఫామ్ దూసుకుపోతోంది. వచ్చే రెండేళ్లలో కంపెనీ వ్యాపార వృద్ధిలో ఈ విభాగం కీలకంగా ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ పేర్కొంది. కంపెనీకి ‘బై’ (కొనుగోలు) రేటింగ్ ఇస్తూ రూ.1,350 లక్ష్యాన్ని ప్రకటించింది. 2025–26 నుంచి 2027–28 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం ఏటా 22 % చొప్పున వృద్ధి చెందుతుందని (సీఏజీఆర్) అంచనా వేసింది. ఈ కాలంలో ఎబిట్డా మార్జిన్లు పెరుగుతాయని పేర్కొంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో మర్చంట్ చెల్లింపుల్లో అతిపెద్ద సంస్థగా పేటీఎం ఎదుగుతున్నట్టు వివరించింది.అధిక చెల్లింపుల లావాదేవీలతోపాటు, వేగంగా రుణా ల మంజూరును ప్రస్తావించింది. పేటీఎం ప్లాట్ఫామ్పై 4.5 కోట్ల వర్తకులు ఉన్నారని, డివైజ్ సబ్స్క్రిప్షన్ పెరుగుతున్న కొద్దీ పేటీఎం ఆదాయాలు మెరుగుపడనున్నట్టు జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. చెల్లింపుల గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) ఏటా 23% చొప్పున పెరుగుతూ 2028 మార్చి నాటికి రూ.35 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 2026 మార్చి నాటికి ఇది రూ.24 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. పేటీఎం మర్చంట్ లెండింగ్ (వర్తకులకు రుణాల మంజూరు) అన్నది రిటైల్ రుణాలను మించినట్టు తెలిపింది.యూపీఐ ద్వారా రుణ వితరణకు ఉన్న దీర్ఘకాల వృద్ధి అవకాశాలనూ ప్రస్తావించింది. ఆర్థిక సేవల ఆదాయం ఏటా 28 శాతం చొప్పున పెరుగుతూ 2028 మార్చి నాటికి రూ.12,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2028 మార్చి నాటికి రూ.1,700 కోట్ల నికర లాభాన్ని పేటీఎం ప్రకటించొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.574 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. -
2025లో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం గతేడాది (2025లో) 3.1 శాతానికి తగ్గింది. 2024లో ఇది 3.2 శాతంగా ఉంది. పీరియాడిక్ లేబర్ఫోర్స్ సర్వే, 2025 వివరాలను కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. ⇒ 15 ఏళ్లకు వయసుపైబడిన మహిళల్లో నిరుద్యోగం 2024 మాదిరే 2025లోనూ 3.1% వద్దే ఉంది. పురుషుల్లో ఇది 3.3% నుంచి 3.1 శాతానికి తగ్గింది. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 2024లో 2.4 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇది 2.5%గా ఉంది. పల్లెల్లో పురుషుల నిరుద్యోగం 2.6 %గా ఉంటే, మహిళల్లో 2.1%గా నమోదైంది. ⇒ స్వయం ఉపాధి రేటు 2024లో ఉన్న 57.5 % నుంచి 2025లో 56.2 శాతానికి తగ్గింది. ⇒ సాధారణ లేబర్ పనుల్లో ఉపాధి 20.2%గా ఉంది. ⇒ వ్యవసాయ రంగంలో ఉపాధి 2025లో 43 శాతంగా నమోదైంది. 2024లో ఉన్న 44.8 శాతంతో పోల్చితే తగ్గింది. ⇒ నిర్మాణ రంగంలో ఉపాధి రేటు 12.3 శాతం నుంచి 12 శాతానికి తగ్గింది. ఇతర సేవల్లో ఇది 12.2 శాతం నుంచి 13.1 శాతానికి పెరిగింది. ⇒ కార్మికుల ఆర్జన మెరుగుపడింది. పురుషుల సగటు ఆర్జన 2024లో రూ.22,891గా ఉంటే, 2025లో రూ.24,217కు పెరిగింది. మహిళా కార్మికుల ఆర్జన రూ.17,126 నుంచి రూ.18,353కు వృద్ధి చెందింది. -
ఇక ఎల్పీజీ బదులు ఇథనాల్
న్యూఢిల్లీ: దేశీయంగా కుటుంబాలు ఎల్పీజీకి బదులుగా ఇథనాల్ను వినియోగించడాన్ని ప్రోత్సహించవలసిందిగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ(ఎఫ్ఐపీఐ) కోరుతోంది. వంటకు శుద్ధ ఇంధనంగా ఇథనాల్ను వినియోగించేందుకు అనువైన సాంకేతికతను అభివృద్ధి చేయవలసిందిగా ఆలిండియా డిస్టిల్లరీస్ అసోసియేషన్(ఏఐడీఏ)ను కోరింది. ఎల్పీజీస్థానే బయోఇంధన వినియోగాన్ని విస్తరించడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని పెట్రోలియం పరిశ్రమ అభిప్రాయపడింది.ఇథనాల్ ఆధారిత వంట స్టవ్లపై రీసెర్చ్ కొనసాగుతున్నట్లు ఏఐడీఏ సదస్సు సందర్భంగా ఎఫ్ఐపీఐ డైరెక్టర్(డౌన్స్ట్రీమ్) ఆర్ఎస్ రవి తెలియజేశారు. ఎల్పీజీ ఎక్విప్మెంట్ రీసెర్చ్ సెంటర్(ఎల్ఈఆర్సీ) తదితర ఏజెన్సీలు, వివిధ ఐఐటీలు ఇథనాల్ ఆధారిత సమర్థవంత కుకింగ్ స్టవ్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నమూనా(ప్రొటోటైప్) స్టవ్లు సిద్ధంకానున్నట్లు వెల్లడించారు. ఇథనాల్తో వంటకు.. వంటకు ఇథనాల్ను ఇంధనంగా వినియోగించుకోగలిగే విషయంలో ఐడీఏసహా.. సంస్థ సభ్యులు రెండు విధాలుగా మద్దతివ్వవలసి ఉన్నట్లు రవి పేర్కొన్నారు. ఇథనాల్ వంట స్టవ్ల ఉత్పత్తిని పెంచేందుకు తయారీదారులకు సహకరించడంతోపాటు.. కుటుంబాలకు ప్రత్యక్షంగా ఇథనాల్ డెలివరీ అయ్యేందుకు సరఫరాల చైన్ను అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు వివరించారు. ఇథనాల్ సరఫరాల ద్వారా ప్రస్తుతం చమురు పరిశ్రమకు ఇస్తున్న మద్దతు స్థాయిలోకాకుండా ఇందుకు విభిన్నంగా వ్యవహరించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.సరఫరా చైన్ అభివృద్ధి, డెలివరీ అంశాలు కీలకమని, దేశీయంగా ఇథనాల్ను వంట ఇంధనంగా మార్పుచేసేందుకు ఏఐడీఏ ముందుకురావాలని రవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెట్రోల్లో ఇధనాల్ను 20 శాతం మిక్స్(ఈ20) చేస్తున్న సంగతి తెలిసిందే. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ20 పెట్రోల్ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది.డీజిల్లో కలిపేందుకు వీలైన ఏబీఏ ఉత్పత్తిని పెంచడం, ఇథనాల్ టు సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(ఎస్ఏఎఫ్)కు సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై అభ్యర్థనలతోపాటు.. వంటకు వీలయ్యే ఇథనాల్పై ప్రత్యేక దృష్టిపెట్టవలసిందిగా ఏఐడీఏను రవి కోరారు. బయోఇంధన వ్యవస్థలో వంట ఇంధనాన్ని చేర్చడం ద్వారా ఇంధన భద్రతను పెంచుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇందుకు చమురు పరిశ్రమ, డిస్టిల్లరీలు సహకరించుకోవడం ద్వారా దేశీయంగా ఇథనాల్ ఆధారిత వంటకు తెరతీయవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. -
బయోఎకానమీ బూమ్...!
న్యూఢిల్లీ: భారతీయ బయోఎకానమీ విలువ గణనీయంగా పెరుగుతోంది. బయోటెక్నాలజీ ఆధారిత రంగాల్లో వేగవంతమైన అభివృద్ధితో దేశీయ ‘బయోఎకానమీ విలువ 2025లో 195 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది (2024) విలువ 166 బిలియన్ డాలర్లతో పోలిస్తే 18 శాతం వృద్ధి చెందింది. బయోటెక్ రంగాన్ని బలోపేతం చేయడానికి పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ‘బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్’ (బీఐఆర్ఏసీ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విస్తరిస్తున్న బయోఎకానమీ పరిధి: ఒకప్పుడు ‘బయోఎకానమీ’ అనేది బయోఫార్మా, బయోఇండ్రస్టియల్ వంటి రంగాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. ప్రస్తుతం దీని పరిధి పెరిగింది. బయోఫ్యూయల్స్, ఎంజైమ్ సొల్యూషన్స్, డిజిటల్ బయాలజీ ప్లాట్ఫారŠమ్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్, బయోలాజిక్స్ తయారీ, వ్యవసాయ బయో ఇన్పుట్స్ వంటి విభాగాలకు విస్తరించింది. దీంతో బయోఎకానమీ విస్తృత పారిశ్రామిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తోంది. వృద్ధికి ప్రధాన కారణాలు: బయోఎకానమీ వృద్ధికి నాలుగు ప్రధాన కారణాలున్నాయి. ⇒ పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం అమలు వల్ల ఇంధన దిగుమతులు తగ్గడం ⇒ జీఎల్పీ–1 ఔషధాల వినియోగం పెరగడం ⇒ పరిశ్రమల్లో ఎంజైమ్స్, సూక్ష్మజీవాల ఆధారిత బయోసొల్యూషన్స్ వినియోగం పెరగడం... ⇒ మూడు లక్షలకు పైగా భారతీయ నిపుణులకు ఉపాధి కల్పిస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణ ఈ అంశాలన్నీ బయోఎకానమీ విస్తరించేందుకు ప్రధాన కారకాలుగా నిలిచాయి. ఈ పరిణామాల వల్ల 2025లో బయోఎకానమీకి అదనంగా 29.6 బిలియన్ డాలర్ల విలువ చేకూరింది. గడిచిన కొన్నేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా నిలిచింది. కీలకంగా బీఐఆర్ఏసీ పాత్ర బీఐఆర్ఏసీ గ్రాంట్ ఫండింగ్, ఈక్విటీ సపోర్ట్, మెంటరింగ్, భాగస్వామ్యాల ద్వారా బయోఫార్మా, మెడ్టెక్, అగ్రి బయోటెక్, హెల్త్టెక్, ఇండ్రస్టియల్ బయోటెక్, క్లీన్టెక్ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.7,000 కోట్ల పెట్టుబడులను ప్రోత్సహించింది. 900కిపైగా ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడింది. దాదాపు 35,000కు పైగా నైపుణ్య ఉద్యోగాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది.2030 నాటికి బయోఎకానమీని 300 బిలియన్ డాలర్లకు, 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ‘‘గత 14 ఏళ్లలో బీఐఆర్ఏసీ భారత బయోటెక్నాలజీ రంగాన్ని ఆవిష్కరణల ఆధారిత శక్తివంతమైన వ్యవస్థగా మార్చింది. స్టార్టప్స్, సంస్థలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వందలాది ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడింది,’’ అని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రాజేష్ ఎస్ గోఖలే తెలిపారు. -
మరో కారు లాంచ్ చేసిన బీవైడీ: ధర ఎంతంటే?
చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. అట్టో 1 ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ను '2026 బ్యాంకాక్ అంతర్జాతీయ మోటార్ షో'లో లాంచ్ చేసింది. దీని ధరలు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.12.29 లక్షల నుంచి రూ. 13.15 లక్షలు.బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ అట్టో కంటే భిన్నంగా ఉంది. ఇది క్లోజ్డ్ గ్రిల్, ఎయిర్ వెంట్లు, రెట్రో-స్టైల్ డోర్ హ్యాండిల్స్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, కుడి వైపు ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్పై ఛార్జింగ్ ఫ్లాప్, కనెక్టెడ్ టెయిల్ లైట్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి పొందుతుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది 7 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ కనెక్టివిటీతో కూడిన 10.1-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అడ్జస్టబుల్ స్టీరింగ్, వైర్లెస్ ఛార్జింగ్, నాలుగు డిస్క్ బ్రేకులు, మూడు రాడార్లతో కూడిన రియర్-వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు 38.88kWh బ్లేడ్ LFP బ్యాటరీ ప్యాక్తో 380 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 74 Bhp పవర్, 135 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. భద్రతా ఫీచర్లలో EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఆరు ఎయిర్బ్యాగ్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ టెయిల్గేట్ ఉన్నాయి. -
వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!
బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.వెండి ధరలువెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే! -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే!
మార్చి నెల దాదాపు ముగిసింది. ఇక రానున్నది ఏప్రిల్. ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితాను ఈ కథనంలో చూసేద్దాం.ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సర ముగింపు కారణంగా.. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 2: మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే సందర్భంగా.. అగర్తలా, చండీగఢ్, గౌహతి, జైపూర్, జమ్మూ, శ్రీనగర్ మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 5: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 11: రెండవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 12: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ వంటి పండుగల సందర్భంగా ఐజ్వాల్, భోపాల్, చండీగఢ్, ఇటానగర్, కోహిమా, న్యూఢిల్లీ, రాయ్పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సర దినం (నబబర్ష)/బోహాగ్ బిహు/విషు/హిమాచల్ దినం కారణంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కొచ్చి, కోల్కతా, సిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 16: బోహాగ్ బిహు సందర్భంగా గువహటిలో బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 19: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 20: బసవ జయంతి / అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా అగర్తలా బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 25: నాల్గవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 26: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
ఏప్రిల్ 1 నుంచి.. జీతంలో మార్పులు ఉంటాయా?
కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది.. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కూడా అమల్లోకి రానుంది. ఈ తరుణంలో ఉద్యోగులలో జీతభత్యాలు సంబంధించి ఆందోళన, ఆసక్తి పెరిగిపోయింది.2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో పన్ను నిబంధనలకు సంబంధించిన మార్పులు ఉండదు. అయినప్పటికీ.. జీతం నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సీటీసీ యథాతథంగా ఉన్నప్పటికీ.. జీతంలో భాగాల విభజనలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటి వరకు పన్నురహితంగా లేదా కొంత సడలింపుతో లెక్కించిన అలవెన్సులు, రీయింబర్స్మెంట్లు, ఇతర ప్రయోజనాలు అన్నీ కూడా కొత్త నిబంధనల ప్రకారం.. పన్ను పరిధిలోకి రానున్నాయి. ఇదే జరిగితే.. ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాల ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు.కార్మిక చట్టాల ప్రకారం.. బేసిక్ జీతం, మొత్తంలో సీటీసీలో 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపులు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో.. ఉద్యోగుల చేతికి వచ్చే టేక్-హోమ్ శాలరీ కొంత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కంపెనీ అందించే వివిధ సౌకర్యాలపై కూడా పన్ను విధింపు కఠినతరం అవుతుంది. కంపెనీ అందించే వసతి, వ్యక్తిగత ఉపయోగానికి ఆఫీస్ వెహికల్, డ్రైవర్, గృహ సేవలు, యుటిలిటీ బిల్లులు, పిల్లల విద్య ఖర్చులు వంటి ప్రయోజనాలు ఇప్పుడు నిర్దిష్ట పరిమితిని మించితే.. పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణిస్తారు. ఈ అంశాలకు సంబంధించి విలువ నిర్ణయ విధానాలను కూడా కొత్త నిబంధనలు స్పష్టంగా నిర్వచించాయి.ఏప్రిల్ 1 నుంచి.. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025భారతదేశంలో గత 65 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, 1961.. త్వరలో (2026 ఏప్రిల్ 1 నుంచి) రద్దు అవుతుంది. దీని స్థానంలో కొత్తగా రూపొందించిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, 2025 అమల్లోకి వస్తుంది. పాత చట్టం అనేక సవరణలతో చాలా క్లిష్టంగా మారి, 800కి పైగా సెక్షన్లు కలిగి ఉండేది.కొత్త చట్టం ముఖ్య ఉద్దేశ్యం పన్ను విధానాన్ని సులభతరం చేయడం. ఇందులో పన్ను రేట్లు లేదా ఎక్కువగా డిడక్షన్లలో పెద్ద మార్పులు లేవు. అయితే చట్టాన్ని సులభమైన భాషలో రాసి, సెక్షన్ల సంఖ్యను 819 నుంచి 536కి తగ్గించారు. అలాగే చాప్టర్ల సంఖ్యను 47 నుంచి 23కి తగ్గించారు. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకునేలా మారుతుంది.మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2026 మార్చి 31 వరకు సంపాదించిన ఆదాయం పాత చట్టం ప్రకారం పన్ను విధింపు ఉంటుంది. 2026 ఏప్రిల్ 1 తరువాత వచ్చిన ఆదాయానికి మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుంది. పాత చట్టం కింద ఉన్న కేసులు, అప్పీలు మొదలైనవి పూర్తయ్యే వరకు అదే చట్టం ప్రకారం కొనసాగుతాయి.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు! -
తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!
ఉక్రెయిన్తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న యుద్ధ వ్యయం, విస్తరిస్తున్న బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు పుతిన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తన సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని (Physical Gold) విక్రయించడం ప్రారంభించింది. 'బిఎన్ఈ ఇంటెల్లిన్యూస్' (bne IntelliNews) నివేదిక ఈ సంచలన విషయాలను వెల్లడించింది.నివేదికలోని ముఖ్యాంశాలుభారీగా విక్రయాలు: 2022 నుంచి 2025 మధ్య కాలంలో రష్యా సుమారు 150 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని విక్రయించింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే మరో 35 బిలియన్ డాలర్ల విలువైన నిల్వలను వదులుకుంది.రికార్డు స్థాయి విక్రయం: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో 3 లక్షల ఔన్సులు, ఫిబ్రవరిలో 2 లక్షల ఔన్సుల బంగారాన్ని విక్రయించింది. 2002 తర్వాత రెండు నెలల కాలంలో జరిగిన అతిపెద్ద విక్రయం ఇదే కావడం గమనార్హం.లోటు బడ్జెట్ సెగ: 2025 నాటికి రష్యా బడ్జెట్ లోటు జీడీపీలో 2.6 శాతానికి చేరింది. వాస్తవానికి ఇది 0.5% మాత్రమే ఉంటుందని అంచనా వేసినా, యుద్ధ పరిస్థితుల వల్ల అంచనాలు తలకిందులయ్యాయి.వ్యూహం మారింది..గతంలో రష్యా తన బంగారు నిల్వలపై కేవలం ఆర్థిక లావాదేవీలు (Speculative transfers) మాత్రమే చేసేది. కానీ ఇప్పుడు నేరుగా భౌతిక బంగారాన్ని (Physical Bullion) మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీనివల్ల రష్యా బంగారం నిల్వలు 74.3 మిలియన్ ఔన్సులకు పడిపోయాయి. ఇది గత నాలుగేళ్లలో అత్యల్ప స్థాయి.తగ్గిన చమరు ఆదాయం అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడంతో రష్యా ఆదాయం గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు రష్యా మొత్తం ఆదాయంలో చమురు, గ్యాస్ వాటా సగభాగం ఉండగా, ఇప్పుడది 20 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లు దాటడంతో, ఆ గరిష్ట ధరల వద్ద బంగారాన్ని అమ్మి నగదు సమీకరించుకోవాలని రష్యా భావిస్తోంది.ప్రపంచంలో ఐదో స్థానంవరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, రష్యా వద్ద ఇప్పటికీ 2,000 టన్నులకు పైగా బంగారం ఉంది. ప్రపంచంలో అత్యధిక బంగారాన్ని కలిగి ఉన్న దేశాల్లో రష్యా 5వ స్థానంలో కొనసాగుతోంది. 2014 (క్రిమియా ఆక్రమణ) నుంచి డాలర్పై ఆధారపడటం తగ్గించుకోవడానికి రష్యా ఈ నిల్వలను పెంచుకుంటూ వచ్చింది.ఆర్థిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంయుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా ప్రభుత్వం వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తోంది. వాటిలో.. నేషనల్ వెల్ఫేర్ ఫండ్: ఇందులో ఉన్న నిధులను యుద్ధ అవసరాలకు వాడుకుంటోంది.పన్నుల పెంపు: వ్యాట్ (VAT) రేట్లను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.బాండ్ల జారీ: దేశీయంగా బాండ్లను జారీ చేసి నిధులను సేకరిస్తోంది.ఉక్రెయిన్తో యుద్ధం నాలుగో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, రష్యా తన అత్యంత విలువైన 'బంగారు' నిల్వలను విక్రయించడం ప్రారంభించడం ఆ దేశ ఆర్థిక స్థితిపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
శుభ్మన్ గిల్ లగ్జరీ అపార్ట్మెంట్.. ధర తెలిస్తే షాకవుతారు!
ఇప్పటికే చాలామంది సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ముంబైలో ఆస్తులు, ఇల్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ టీమిండియా క్రికెటర్ 'శుభ్మన్ గిల్' కూడా చేరారు.శుభ్మన్ గిల్.. ముంబై నగరంలోని జుహూ ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఈ అపార్ట్మెంట్ విలువ సుమారు రూ.20.7 కోట్లు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఈ ఫ్లాట్ను పూజా లీజర్ అండ్ లైఫ్స్టైల్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేశారు.శుభ్మన్ గిల్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్మెంట్.. ముంబైలోని జుహూ తారా రోడ్డుపై ఉన్న పూజా ల్యూమినేర్ అనే భవనంలో 12వ అంతస్తులో ఉంది. గిల్ ఈ 12వ అంతస్తు మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 3,369 చదరపు అడుగులు. ఈ లావాదేవీ కోసం రూ.1.24 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు మార్చి 26, 2026న జరిగింది. మహారాష్ట్ర RERA వివరాల ప్రకారం.. ఈ భవనం ఇంకా నిర్మాణంలో ఉంది. 2029 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది.ముంబైలో ఇతర క్రికెటర్ల అపార్ట్మెంట్స్ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం గమనించదగ్గ విషయం. ఇందులో సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.👉సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా యాదవ్ ముంబైలోని డియోనార్ ప్రాంతంలో రూ.7.18 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు.👉రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ ప్రాభాదేవి ప్రాంతంలో రూ.26.30 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ను సొంతం చేసుకున్నారు.👉జహీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు రూ.11 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. -
ఆ దేశంలో ఆఫీసులు.. స్వర్గాలు!
భారతదేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే.. తెల్లవార్లు కోడింగ్, అర్ధరాత్రి వరకు మీటింగ్స్, వీకెండ్స్లో కూడా ఆఫీస్ కాల్స్. కానీ, అదే వృత్తిలో ఉంటూ స్వీడన్లో స్థిరపడిన ఓ భారతీయ యువతి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. "నిజంగా ఆఫీసులు ఇలా కూడా ఉంటాయా?" అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.వైరల్ వీడియోలో ఏముంది?స్వీడన్లో టెక్నాలజీ ప్రొఫెషనల్గా పనిచేస్తున్న స్వాతి అనే యువతి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. సాయంత్రం సరిగ్గా 4:30 గంటల సమయం.. ఆమె పనిచేసే ఆఫీసులో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. అందరూ తమ పని ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ కార్యాలయాన్ని చూపిస్తూ, అక్కడి పని సంస్కృతి గురించి ఆమె వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.పని కంటే మనిషికే ప్రాధాన్యం!స్వీడన్ కార్యాలయాల్లో అనుసరించే విధానాలు మన దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయని స్వాతి పేర్కొన్నారు. అక్కడ పని గంటల కంటే నాణ్యతకే పెద్దపీట వేస్తారు. ఆఫీసులో ఎన్ని గంటలు కూర్చున్నాం అన్నది కాదు, చేసిన పనిలో ఎంత క్వాలిటీ ఉందన్నదే అక్కడ ముఖ్యం.వ్యక్తిగత సమయం: ఉద్యోగులు ఆలస్యంగా ఉండాలని గానీ, వారాంతాల్లో పనిచేయాలని గానీ అక్కడి కంపెనీలు కోరుకోవు. పని ముగిశాక మిగిలిన సమయం పూర్తిగా వారి వ్యక్తిగత జీవితానికే (Work-Life Balance).కుటుంబానికి ప్రాముఖ్యత: కుటుంబంతో గడపడం, సొంత అభిరుచులను (Hobbies) కొనసాగించడం వల్ల ఉద్యోగులు మానసిక ప్రశాంతతతో ఉంటారని, అది వారి పనితీరును మరింత మెరుగుపరుస్తుందని స్వీడన్ యాజమాన్యాలు నమ్ముతాయి.నెటిజన్ల రియాక్షన్ వైరల్గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "భారతదేశంలో రాత్రి 9 గంటలైనా ఆఫీసు లైట్లు ఆరవు, ఇలాంటి వాతావరణం మాకెప్పుడు వస్తుందో?" అని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా.. "అందుకే విదేశాల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుంది" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి వ్యక్తిగత శ్రేయస్సు (Well-being), వృత్తిపరమైన బాధ్యతల మధ్య ఉండాల్సిన సమతుల్యతపై ఈ వీడియో మరోసారి పెద్ద చర్చకే దారితీసింది. View this post on Instagram A post shared by LifeWithSwati (@ekduniyaaisibhi) -
పెరగనున్న ఐఫోన్ ధరలు: కారణం ఇదే!
యాపిల్ కంపెనీ ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం.. భారతదేశంలో ఐఫోన్ ధరలపై ప్రభావం చూపుతుంది. దీంతో పాత మోడల్స్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 15 కొనాలనుకునే వినియోగదారులకు ఇది కొంత భారంగా మారనుంది.డిమాండ్ జనరేషన్ (DG) సపోర్ట్ అందుబాటులో ఉన్నప్పుడు.. దీని ద్వారా యాపిల్ తన రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కొన్ని రాయితీలు (ఇన్సెంటివ్లు) ఇస్తుంది. ఈ ఇన్సెంటివ్ల వల్ల రిటైలర్లు ఫోన్లను తక్కువ ధరకు అమ్మగలిగేవారు. అంటే.. ఫోన్ అధికారిక ధర (MRP) మారకపోయినా, వినియోగదారులకు తగ్గింపు ధరలో అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీ ఈ DG సపోర్ట్ను నిలిపివేయాలని నిర్ణయించింది.కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల.. రిటైలర్లు ఇకపై అంతటి తగ్గింపులు ఇవ్వలేరు. అందువల్ల.. వినియోగదారులు అదే ఫోన్ కొనడానికి సుమారు రూ.5,000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా కొంచెం పాత మోడళ్లను.. తక్కువ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారికి ప్రభావం చూపుతుంది.ఇది మాత్రమే కాకుండా.. యాపిల్ ముందుగా ఇచ్చిన క్యాష్బ్యాక్ ఆఫర్లను కూడా గణనీయంగా తగ్గించింది. గతంలో రూ.6,000 వరకు క్యాష్బ్యాక్ ఇస్తే, ఇప్పుడు అది కేవలం రూ.1,000కు తగ్గింది. దీంతో కొత్త మోడళ్లైన iPhone 17 సిరీస్ కూడా వినియోగదారులకు కొంత ఖరీదైనదిగా అనిపిస్తోంది. అయితే, ఈ DG సపోర్ట్ తొలగింపు కొత్త iPhone 17 మోడళ్లకు వర్తించదు. ఇది ప్రధానంగా పాత మోడళ్లకే పరిమితం.ఇదీ చదవండి: అందరికీ నచ్చిన కారు.. రూ.20 వేలు పెరిగిన ధర! -
అందరికీ నచ్చిన కారు.. రూ.20 వేలు పెరిగిన ధర!
హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తన కాంపాక్ట్ ఎస్యూవీ అయిన వెన్యూ ధరలను పెంచింది. పెంచిన ధరలు పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్లకు వర్తిస్తాయి. ధరలు రూ. 5000 నుంచి రూ.20000 వరకు పెరిగింది. దీంతో ధరలు శ్రేణి రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.51 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.పెట్రోల్ వేరియంట్స్హ్యుందాయ్ కంపెనీ అత్యధికంగా 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ ఇంజన్ ఎంపికలో లభించే HX5 ట్రిమ్ వేరియంట్ ధరలను రూ.20000 పెంచింది. కాబట్టి ఈ వేరియంట్ ధర రూ. 9.55 లక్షలకు చేరింది. బేస్ మోడల్ ధర రూ.8.00 లక్షల వద్ద ఉంది. అయితే ఇక HX5+, HX6T వంటి వేరియంట్స్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ DCT వేరియంట్స్ ధరలు స్వల్పంగా పెరిగాయి. HX5 DCT ధర రూ. 10.90 లక్షలు (రూ. 9,000 పెరిగింది), HX6 DCT ధర రూ. 12.16 లక్షలు (రూ. 9,000 పెరిగింది), HX8 DCT ధర రూ. 12.99 లక్షలు (రూ. 5,000 పెరిగింది). బేస్ మోడల్ HX2 టర్బో ధర రూ. 8.89 లక్షల వద్ద ఉంది. అయితే ఎన్ లైన్ వేరియంట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.డీజిల్ వేరియంట్స్1.5-లీటర్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 8,000 పెరిగాయి. దీంతో HX2 ధర ఇప్పుడు రూ. 9.87 లక్షలు, HX5 రూ. 10.87 లక్షలు, HX5 AT రూ. 11.81 లక్షలు, HX7 రూ. 12.69 లక్షలు వద్దకు చేరాయి. టాప్-ఎండ్ HX8 AT, HX10 AT ధరలు వరుసగా రూ. 13.69 లక్షలు, రూ. 15.51 లక్షలుగా ఉన్నాయి.కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3ఎక్స్ఓ, మారుతి బ్రెజ్జా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన హ్యుందాయ్ వెన్యూ ధరలు పెరగడం అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆన్-రోడ్ ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా, పన్నులు, బీమా కారణంగా నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. -
జియో మంత్లీ ప్లాన్లు.. 30 రోజులు వ్యాలిడిటీ
మొబైల్ రీచార్జ్కు సంబంధించి సాధారణంగా మంత్లీ రీచార్జ్ ప్లాన్లు అంటే 28 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంటాయి. కానీ నెలంతటికీ అంటే 30 రోజులూ వ్యాలిడిటీ ఉండే ప్లాన్లు కావాలనుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియోలో రెండు చౌకైన రీచార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నెలకు సరిపడా డేటా, కాలింగ్ ప్రయోజనాలతో పాటు కళ్లు చెదిరే అదనపు బెనిఫిట్స్, ముఖ్యంగా ఏఐ (AI) ప్రియుల కోసం ఈ ప్లాన్లో భారీ ఆఫర్లను చేర్చింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..జియో రూ. 365 ప్లాన్జియో తన వెబ్సైట్, యాప్లో రూ. 365 ధరతో కూడిన ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లకు భిన్నంగా ఇది పూర్తి 30 రోజుల కాలపరిమితితో వస్తుంది.ప్రయోజనాలుడేటా: మొత్తం 25 GB హై-స్పీడ్ డేటాకాలింగ్: అపరిమిత వాయిస్ కాల్స్.SMS: రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.టాక్ టైమ్: అదనంగా రూ. 7.47 విలువైన టాక్ టైమ్ లభిస్తుంది.ఈ ప్లాన్ కేవలం డేటాకే పరిమితం కాకుండా, భారీ సబ్-స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్-స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో 2000 GB క్లౌడ్ స్టోరేజ్, అధునాతన ఏఐ ఫీచర్లు ఉంటాయి. (గమనిక: ఈ బెనిఫిట్ కొనసాగాలంటే రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లో యాక్టివ్గా ఉండాలి).డిస్నీ+ హాట్స్టార్: 3 నెలల పాటు మొబైల్/టీవీ సబ్-స్క్రిప్షన్.జియో ఏఐ క్లౌడ్ (Jio AI Cloud): 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్.ఇతర యాప్లు: జియో టీవీ, జియో సినిమా సబ్-స్క్రిప్షన్లు.రూ. 355 'ఫ్రీడమ్ ప్లాన్'దాదాపు ఇవే ప్రయోజనాలతో జియో రూ. 355 కేటగిరీలో మరో ప్లాన్ను కూడా అందిస్తోంది. ఇది కూడా 30 రోజుల వ్యాలిడిటీ, 25 GB డేటా, అపరిమిత కాలింగ్ , పైన పేర్కొన్న ఏఐ (AI), ఓటీటీ సబ్-స్క్రిప్షన్లను కలిగి ఉంటుంది. ఇందులో అదనంగా నానో బనానా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.ఈ రూ. 365 ప్లాన్లో అపరిమిత 5G డేటా గురించి జియో అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం 4G డేటా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. -
ట్రేడింగ్ బ్రేక్.. స్టాక్ మార్కెట్ సెలవులు
స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు వచ్చే వారం తమ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం, వచ్చే వారంలో ఒక ప్రభుత్వ సెలవు దినం, వారాంతపు సెలవులు కలుపుకుని మొత్తం మూడు రోజుల పాటు మార్కెట్లు పనిచేయవు.వచ్చే వారం సెలవుల వివరాలువచ్చే వారం మార్చి 31, మంగళవారం నాడు మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీనికి తోడు సాధారణ వారాంతపు సెలవులైన ఏప్రిల్ 4 (శనివారం), ఏప్రిల్ 5 (ఆదివారం) తేదీల్లో కూడా మార్కెట్ మూసి ఉంటుంది.ఈ సెలవు దినాల్లో ఈక్విటీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), కరెన్సీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (EGR) వంటి అన్ని విభాగాల్లో ట్రేడింగ్ అందుబాటులో ఉండదు.2026లో రానున్న సెలవులు ఎన్ఎస్ఈ అధికారిక క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శని, ఆదివారాలు కాకుండా మొత్తం 16 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. రాబోయే ముఖ్యమైన సెలవులు ఇవే..మార్చి 31 - శ్రీ మహావీర్ జయంతిఏప్రిల్ 3 - గుడ్ ఫ్రైడేఏప్రిల్ 14 - డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిమే 1 - మహారాష్ట్ర దినోత్సవంమే 28 - బక్రీద్ సెప్టెంబర్ 14 - గణేష్ చవితిఅక్టోబర్ 2 - మహాత్మా గాంధీ జయంతిఅక్టోబర్ 20 - దసరాడిసెంబర్ 25- క్రిస్మస్ముహూర్త ట్రేడింగ్నవంబర్ 8 (ఆదివారం) సెలవు దినమైనప్పటికీ, దీపావళి లక్ష్మీ పూజ సందర్భంగా ప్రత్యేక 'ముహూర్త ట్రేడింగ్' కోసం కొద్దిసేపు మార్కెట్ తెరుస్తారు. దీని సమయాలను ఎక్స్ఛేంజీలు విడిగా ప్రకటిస్తాయి.మార్కెట్ రెగ్యులర్ టైమింగ్స్సాధారణ రోజుల్లో స్టాక్ మార్కెట్ పనివేళలు కింది విధంగా ఉంటాయి..ప్రీ-ఓపెన్ సెషన్: ఉదయం 9:00 నుండి 9:08 వరకు (ఆర్డర్ ఎంట్రీ).రెగ్యులర్ ట్రేడింగ్: ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 వరకు.ముగింపు సెషన్: మధ్యాహ్నం 3:40 నుండి సాయంత్రం 4:00 వరకు.బ్లాక్ డీల్ విండో: ఉదయం: 8:45 – 9:00 మధ్యాహ్నం: 2:05 – 2:20మార్కెట్ పరిస్థితులను బట్టి లేదా అత్యవసర సమయాల్లో పైన పేర్కొన్న పనివేళలను మార్చే లేదా సెలవులను సవరించే అధికారం ఎక్స్ఛేంజీలకు ఉంటుంది. -
నోకియా 14,000 మందికి లేఆఫ్
ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని శాసించిన నోకియా ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, తగ్గుతున్న ఆదాయ వనరుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించగా ఆ ప్రభావం ఇప్పుడు భారత విభాగంపై కూడా పడనుంది.కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం, నోకియా తన భారత కార్యకలాపాల్లో కీలక మార్పులు చేపట్టింది. కంపెనీ తన భారత నాయకత్వ బాధ్యతలను కొత్త వ్యక్తులకు అప్పగించింది. సమర్ మిట్టల్ కంపెనీ ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్గా నియమితులయ్యారు. ఈయనకు మునుపటి కంటే ఎక్కువ కార్యాచరణ నియంత్రణ ఇచ్చారు. విభా మెహ్రా, ఇండియా కంట్రీ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరిద్దరూ 2026 ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనుండగా ప్రస్తుతం ఇండియాలో కంపెనీ చీఫ్గా ఉన్న తరుణ్ ఛబ్రా పదవి నుంచి తప్పుకున్నారు.ఆదాయంలో భారీ క్షీణతభారత మార్కెట్లో నోకియా పనితీరు గణనీయంగా పడిపోయింది. తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం.. 2025 నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు 15 శాతం తగ్గి 393 మిలియన్ యూరోలకు (సుమారు రూ.4,290 కోట్లు) పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో నికర అమ్మకాలు 463 మిలియన్ యూరోలుగా (సుమారు రూ.5,000 కోట్లు) నమోదయ్యాయి. అమ్మకాల్లో ఈ క్షీణత వల్ల లాభదాయకతను పెంచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపు ఒక్కటే మార్గమని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా 2023లో జరిగిన మొబైల్ నెట్వర్క్లు, క్లౌడ్ సేవల విలీనం వల్ల ఏర్పడిన ‘డూప్లికేషన్’ ఉద్యోగాలను తొలగించడంపై దృష్టి సారించింది.టెలికాం రంగంలో సంక్షోభం?నోకియా మాత్రమే కాదు దాని ప్రధాన ప్రత్యర్థి ఎరిక్సన్ కూడా గత ఏడాది దాదాపు 5,000 మందిని తొలగించింది. టెక్ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపగా మెటా కూడా 15,000 మంది తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
పసిడి కెరటం.. అమాంతం పైకి లేచిన ధరలు
దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సిటీ రియల్ ఎస్టేట్కు గేమ్ ఛేంజర్!
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అస్థిరత, స్థిరమైన వడ్డీ రేట్ల కొనసాగింపు, ప్రతికూల విధానాలు.. తదితర కారణాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేసింది. దీంతో భూయజమానులు, డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు, పట్టణ స్థానిక సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రణాళికాబద్ధమైన, స్థిరమైన పట్టణాభివృద్ధికి వీలవుతుంది. మొత్తంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి టీడీఆర్ గేమ్ చేంజర్గా మారనుంది.టీడీఆర్ అంటే? రోడ్లు, డ్రైనేజీలు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక వసతుల నిర్మాణ సమయంలో ప్రభుత్వానికి భూసేకరణ తప్పనిసరి. భూములు కోల్పోయే పట్టాదారులకు ప్రభుత్వం నగదు రూపంలో పరిహారం అందిస్తుంది. అయితే ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగా కొత్తగా టీడీఆర్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో నగదు బదులుగా మార్కెట్ రేటుకు సమానంగా టీడీఆర్ బాండ్లను అందజేస్తారు. వీటితో యజమానికి ఇతర ప్రాంతంలో స్థలం ఉంటే అక్కడ అనుమతించే అంతస్తుల కంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించుకోవచ్చు. ఒకవేళ స్థలం లేకపోతే టీడీఆర్ను ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్టీఎల్), గరిష్ట వరద మట్టం(ఎంఎఫ్ఎల్), నీటి వనరులు, నాలాలకు బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే పట్టా భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేసినప్పుడు టీడీఆర్లను జారీ చేస్తుంది. టీడీఆర్ హక్కులను స్థిరాస్తి వ్యాపారులు, వ్యక్తులు కొనుగోలు చేసి అదనపు అంతస్తులు, సెట్బ్యాక్లో ఆ విస్తీర్ణం మేరకు మినహాయింపులు పొందవచ్చు. ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) దాకా విస్తరించిన జీహెచ్ఎంసీ వరకూ.., తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధి వరకూ ఇది వర్తిస్తుంది.చిన్న, మధ్య తరహా బిల్డర్లకు ప్రయోజనం తాజా టీడీఆర్ సవరణతో చిన్న, మధ్యతరహా బిల్డర్లకు ఈ నిర్ణయం గొప్ప ఊతం ఇస్తుంది. 40 అడుగుల రహదారిలో ఇది వరకు జీ+8 అంతస్తులతో పాటు టీడీఆర్తో అదనంగా రెండు అంతస్తులకు అనుమతి ఇచ్చేవారు. తాజాగా 11 అంతస్తుల వరకు వేసుకోవచ్చు. అదనపు అంతస్తుల వెసులుబాటుతో ధరలను నియంత్రించడానికి, స్థిరీకరించడానికి సహాయపడతాయి.కూకట్పల్లి, మూసాపేట, ఎస్ఆర్నగర్, ముషీరాబాద్, నారాయణగూడ, తార్నాక, సికింద్రాబాద్, కాచిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్నగర్, ప్రగతీనగర్, బాచుపల్లి వంటి ప్రాంతాలలో భవన నిర్మాణాలు చేపట్టే చిన్న, మధ్యతరహా డెవలపర్లకు ఇది వరంగా మారుతుంది. గతంలో సరైన డిమాండ్ లేక మార్కెట్ విలువలో టీడీఆర్ 25 శాతానికే అమ్ముడుపోయేవి. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని బట్టి 50–70 శాతానికి పెరుగుతుంది. టీడీఆర్ విలువ పెరగడంతో భూ యజమానులు తమ భూమిని రహదారుల విస్తరణకు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తారు. రహదారుల విస్తరణలో వేగం పెరుగుతుంది.ఆరు అంతస్తులు దాటితేనే హైరైజ్ భవన నిర్మాణ నిబంధనల మేరకు రోడ్డు వెడల్పు, ప్లాటు విస్తీర్ణం ఆధారంగా అనుమతించిన ఎత్తు వరకు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్లాటు విస్తీర్ణం 1,000 చ.మీ. దాటితేనే గరిష్టంగా 18 మీటర్ల ఎత్తు వరకు (జీ+5 అంతస్తులు) భవన నిర్మాణానికి అనుమతి ఉండేది. టీడీఆర్ను కొనుగోలు చేసినా అదనపు అంతస్తులు కట్టుకునేందుకు వెసులుబాటు లేదు. తాజా సవరణల్లో టీడీఆర్ వినియోగిస్తూ నిర్మాణం 21 మీటర్ల ఎత్తు వరకు(జీ+6 అంతస్తులు) నిర్మించుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంటే ఇక నుంచి 21 మీటర్ల ఎత్తు దాటిన భవనాలను మాత్రమే ఆకాశహర్మ్యాలుగా పరిగణిస్తారు. అలాగే ఈ నిర్మాణానికి ప్లాటు కనీస విస్తీర్ణాన్ని 750 చ.మీ.కు తగ్గించింది. కొత్త నిబంధనల ప్రకారం.. టీడీఆర్ వినియోగిస్తూ 750–2,000 చ.మీ. వరకు ప్లాటు విస్తీర్ణంలో భవన నిర్మాణాన్ని 21 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించుకోవచ్చు. అయితే పార్కింగ్, ఇతర నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే.40 అడుగుల రోడ్లలోనూ భారీ భవనాలు ప్లాటు విస్తీర్ణం 2 వేల చ.మీ.లకు మించి ఉంటే ఆ స్థలంలో టీడీఆర్ ద్వారా అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. రోడ్డు కనీస వెడల్పు 40 అడుగులకు మించి ఉంటే.. ఆ ప్లాటులో జీ+5 అంతస్తులకు మించి అదనంగా మరో 3 అంతస్తులు నిర్మించుకోవచ్చు. రోడ్డు వెడల్పు 60 అడుగులు ఉంటే అదనంగా 4 అంతస్తులు, 80 అడుగులకు మించి ఉంటే అదనంగా 5 అంతస్తులు కట్టుకోవచ్చు. అయితే అగ్నిమాపక, ఎయిర్పోర్టు, ఇతర నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.50:50 విధానంలో.. క్యూర్ పరిధిలో 10 అంతస్తులకు మించిన హైరైజ్లలో పదో అంతస్తు తర్వాత చేపట్టే అదనపు అంతస్తుల నిర్మిత స్థలంలో 10 శాతానికి టీడీఆర్ను వినియోగించాలని గతేడాది ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ప్రభుత్వం టీడీఆర్ వినియోగాన్ని తగ్గించింది. 10 అంతస్తుల నుంచి 20 అంతస్తుల వరకు నిర్మిత స్థలంలో 3 శాతం నిర్మిత స్థలానికి సమాంతరమైన, అలాగే 20 అంతస్తులకు మించితే ఆ మొత్తం నిర్మిత స్థలంలో 5 శాతం నిర్మిత స్థలానికి సమానమైన టీడీఆర్ను వినియోగించాలని తెలిపింది. భవన నిర్మాణ దరఖాస్తు సమయంలో 50 శాతం టీడీఆర్ వినియోగిస్తున్నట్లు పత్రాలు సమర్పించాలి. మిగతా 50 శాతం టీడీఆర్ పత్రాలను నివాస యోగ్యత పత్రం(ఎన్ఓసీ) జారీ సమయంలో అందజేయాల్సి ఉంటుంది. దీంతో డెవలపర్లకు ప్రారంభ మూలధన ఒత్తిడి తగ్గుతుంది.నియంత్రణ అవసరం ప్రస్తుతం మార్కెట్లో సుమారు రూ.10 వేల కోట్లకు పైగా విలువైన టీడీఆర్ సర్టిఫికెట్లు ఉన్నాయని పరిశ్రమ నిపుణుల అంచనా. అయితే కొంతమంది మధ్యవర్తులు టీడీఆర్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో నిజమైన నిర్మాణదారులు, డెవలపర్లు టీడీఆర్ను కొనుగోలు చేయడానికి ముందుకురావడం లేదు.సరఫరా, డిమాండ్ను సమతుల్య పరచాలంటే టీడీఆర్లపై ప్రభుత్వ నియంత్రణ అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే టీడీఆర్లను కొనుగోలు చేయడానికి, వినియోగించుకోవడానికి అగ్ని మాపక శాఖ నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తప్పనిసరి అనేది ప్రధాన అడ్డంకిగా మారిందని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కార్ల తయారీలో మహారాణులు
దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా మానెసర్ ప్లాంట్లో కీలకమైన మైలురాయిని అధిగమించింది. తయారీ రంగం అంటే కేవలం పురుషులకే పరిమితం అనే పాత ఆలోచనలను చెరిపివేస్తూ తొలిసారిగా 200 మంది మహిళా ఉద్యోగులతో కూడిన ప్రత్యేక అసెంబ్లీ లైన్ను కంపెనీ ప్రారంభించింది.మహిళల చేతుల్లోనే కార్ల తయారీసాధారణంగా భారీ యంత్రాలు, విడిభాగాలతో కూడిన కార్ల తయారీ కేంద్రాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అయితే, మారుతీ సుజుకి ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. కంపెనీ మానెసర్ ప్లాంట్లోని ప్రత్యేక అసెంబ్లీ లైన్లో కార్ల విడిభాగాలను అమర్చడం నుంచి తుది మెరుగులు దిద్దే వరకు ప్రతి పనిని మహిళలే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేవలం ఒకే రకమైన కారు కాకుండా సంస్థకు చెందిన వివిధ పాపులర్ మోడళ్లను ఈ మహిళా బృందం తయారు చేస్తోంది. ఈ 200 మంది మహిళా టెక్నీషియన్లకు సాంకేతిక శిక్షణను అందించిన తర్వాతే అసెంబ్లీ లైన్లోకి తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.VIDEO | Manesar: Maruti Suzuki deploys first batch of 200 women employees on car manufacturing assembly line at Manesar plant.India’s largest carmaker has introduced a fully women-run assembly line for producing multiple models, marking a significant step towards inclusion in… pic.twitter.com/OGOzZRs4Wh— Press Trust of India (@PTI_News) March 27, 2026తయారీ రంగంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని కంపెనీ అధికారులు చెప్పారు. ‘తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పని సంస్కృతి మెరుగుపడటమే కాకుండా నైపుణ్య వనరులు మరింత విస్తృతమవుతాయి’ అని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్!
ప్రపంచ దేశాలను మరో భారీ సంక్షోభం ముంచెత్తబోతోందా? పశ్చిమ ఆసియాలో ముదిరిన యుద్ధ భయాలు ఇప్పుడు సముద్ర గర్భంలోని ‘డిజిటల్ కేబుళ్ల’ను తెంచేలా కనిపిస్తున్నాయా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సముద్ర గర్భంలోని డేటా కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.ఏమిటీ వివాదం?ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్ డేటా రవాణాలో దాదాపు 95% నుంచి 97% వరకు సముద్ర గర్భంలో అమర్చిన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం (రెడ్ సీ), హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను అనుసంధానిస్తున్నాయి. ఇరాన్ తాజా హెచ్చరికలతో ఈ కేబుళ్లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు ఈ హెచ్చరికలు?2026 ఫిబ్రవరి చివర్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా నేతృత్వంలోని దళాలకు గల్ఫ్ దేశాలు ఆశ్రయం కల్పిస్తే ప్రతిచర్యగా ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని ఇరాన్ హెచ్చరించినట్లు సమాచారం. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ‘గ్రే జోన్ వార్ఫేర్’ అని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎవరు ప్రభావితమవుతారు?ఒకవేళ ఇరాన్ అనుకున్న పనిచేస్తే ఈ ముప్పు కేవలం ఒక దేశానికో లేదా ప్రాంతానికో పరిమితం కాదు. భారత్ నుంచి అమెరికా, యూరప్లకు వెళ్లే డేటా ట్రాఫిక్లో దాదాపు మూడో వంతు ఈ మార్గాల ద్వారానే వెళ్తుంది. ఇది ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూఏఈ, సౌదీ అరేబియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లు, డేటా సెంటర్లు నేరుగా ప్రభావితమవుతాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు ఇప్పటికే తమ కేబుల్ ప్రాజెక్టుల విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ‘2ఆఫ్రికా పర్ల్స్’ వంటి భారీ ప్రాజెక్టుల పనులు ఇప్పటికే నిలిచిపోయాయి.ఎలాంటి ప్రభావం ఉంటుంది?ఒకవేళ ఈ కేబుళ్లు తెగిపోతే అది కేవలం ఇంటర్నెట్లో అవాంతరం కలగడమే కాకుండా అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్లు స్తంభిస్తాయి. క్లౌడ్ సర్వీసులు, వీడియో కాల్స్, అంతర్జాతీయ సమాచార మార్పిడి నిలిచిపోతుంది. యుద్ధ ప్రాతిపదికన వీటిని బాగు చేయడం చాలా కష్టంతో కూడుకుంది. సముద్ర గర్భంలో వీటిని సరిచేయడానికి ప్రత్యేక నౌకలు కావాలి. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఆ నౌకలు అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.భారత ప్రభుత్వం అప్రమత్తంఈ పరిణామాల నేపథ్యంలో భారత టెలికాం శాఖ ఇప్పటికే అలర్ట్ అయింది. టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ వంటి సంస్థలతో అత్యవసర సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ‘సముద్ర గర్భంలోని ఈ కేబుళ్లు ఆధునిక ప్రపంచానికి ప్రాణధారలు. వీటిపై దాడి జరిగితే అది కేవలం ఒక భౌగోళిక దాడి కాదు, ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై జరిగే అతిపెద్ద దాడి అవుతుంది. దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ ముప్పును నివారించడం ఒక్కటే ప్రస్తుతానికి మార్గం’ అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి జెఫ్రీస్ నిష్క్రమణ
ప్రైవేట్ రంగం బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ నిష్క్రమించింది. బ్యాంకులో తమ పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్టైమ్ చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అతాను చక్రవర్తి ఇటీవలే అకస్మాత్తుగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ మూడు కీలక పోర్ట్ఫోలియోల్లో బ్యాంక్ షేర్లను విక్రయించి, ఎక్స్పోజర్ని తగ్గించుకున్నట్లు తాజా గ్రీడ్ అండ్ ఫియర్ నివేదికలో జెఫ్రీస్ వ్యూహకర్త క్రిస్ ఉడ్స్ తెలిపారు.జపాన్ మినహా ఏషియా లాంగ్–ఓన్లీ ఈక్విటీ పోర్ట్ఫోలియో, గ్లోబల్ లాంగ్–ఓన్లీ ఈక్విటీ పోర్ట్ఫోలియో, అమెరికా మినహా ఇంటర్నేషనల్ లాంగ్–ఓన్లీ ఈక్విటీ పోర్ట్ఫోలియో వీటిలో ఉన్నాయి. అయితే, ఈ నిర్ణయం వెనుక కారణాన్ని ఉడ్స్ తెలపలేదు. అన్ని పోర్ట్ఫోలియోల్లోనూ 4 శాతం వెయిటేజ్తో హెచ్ఎస్బీసీని చేర్చింది. జపాన్ మినహా ఏషియా పసిఫిక్ రిలేటివ్–రిటర్న్ పోర్ట్ఫోలియోలో భారత్, ఆ్రస్టేలియా వెయిటేజీని రెండు పర్సంటేజీ పాయింట్లు తగ్గించి తైవాన్ వెయిటేజీని నాలుగు పర్సంటేజీ పాయింట్ల మేర పెంచనున్నట్లు నివేదిక తెలిపింది. తన నైతిక ప్రమాణాలకు, వ్యక్తిగత విలువలకు భంగం కలిగేలా బ్యాంకులో గత రెండేళ్లుగా పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు -
వేసవి ఛాయిస్.. బస్సే బిగ్బాస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన చార్జీలు పెరగడం, రైళ్ల రద్దీ తదితర అంశాల నేపథ్యంలో వేసవి సీజన్లో బస్సు ప్రయాణాలకు గణనీయంగా డిమాండ్ పెరగనున్నట్లు అభిబస్ సీవోవో రోహిత్ శర్మ చెప్పారు. ఇక పండుగలు, పెళ్లిళ్లు, తమిళనాడు .. పుదుచ్చేరి మొదలైన చోట్ల ఎన్నికలు జరగనుండటం కూడా ప్రయాణాలకి దోహదపడనున్నట్లు ఆయన చెప్పారు. క్రూడాయిల్ రేట్ల పెరుగుదలతో విమాన ప్రయాణాలు భారంగా మారడమనేది, పరోక్షంగా బస్సు ఆపరేటర్లకు ప్రయోజనం చేకూర్చనుందని పేర్కొన్నారు.సాధారణంగా విమానాలు, రైళ్లు, వ్యక్తిగత వాహనాలతో బస్సుల సెగ్మెంట్ పోటీ పడాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, ఫ్లయిట్ చార్జీలు పెరిగినా, రైల్వే వెయిటింగ్ లిస్టులు పెరిగినా.. బస్సులకు మరింత డిమాండ్ ఏర్పడుతుందన్నారు. పీక్ సీజన్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు 25 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు శర్మ వివరించారు. హైదరాబాద్–విజయవాడలాంటి కీలక రూట్లలో డిమాండ్ ఉంటోందని శర్మ చెప్పారు.పింక్ సీట్ ఆప్షన్లాంటి భద్రతా ఫీచర్ల కారణంగా సోలోగా ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. హోలీ పండుగ వారానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా 70 శాతం పెరగ్గా, మహిళల ప్యాసింజర్ల సంఖ్య 80 శాతం పెరిగినట్లు శర్మ వివరించారు. 6.5 లక్షల రూట్లలో 6,200 ఆపరేటర్లకు అగ్రిగేటరుగా వ్యవహరిస్తున్న అభిబస్.. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉంది. ఉబర్తో జట్టు..ఇంటర్సిటీ బస్ టికెట్ బుకింగ్స్ సదుపాయాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేలా ఉబర్తో కూడా చేతులు కలిపినట్లు శర్మ చెప్పారు. దీనితో ఉబర్ యాప్ నుంచే నేరుగా పలు ప్రాంతాలకు బస్ టికెట్లను బుక్ చేసుకునే వీలుందని ఆయన వివరించారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు. టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ మొదలైనవి వీటిలో ఉన్నాయి.ఇక అష్యూర్డ్ ప్రోగ్రాం కింద బస్సుల జాప్యం, రద్దు లాంటి సేవల నాణ్యత లోపాలకు 150% వరకు రీఫండ్ ఆఫర్ చేస్తున్నామని, ప్రస్తుతం ఈ ప్రోగ్రాంలో సుమారు 360 మంది ఆపరేటర్లు చేరారని శర్మ చెప్పారు. ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ఇక్సిగోలో భాగమైన అభిబస్ ప్లాట్ఫాంపై 2026 ఆర్థిక సంవత్సరం క్యూ3లో స్థూల లావాదేవీల విలువ (జీటీవీ) 36% వృద్ధితో రూ. 670.9 కోట్లకు చేరగా, ఆదాయం 47% పెరిగి రూ. 75.5 కోట్లకు చేరింది. ప్రయాణికుల సంఖ్య 33% పెరిగి 67.3 లక్షలకు చేరింది. -
వెండి మళ్లీ వెనక్కి
న్యూఢిల్లీ: వెండి, బంగారం మరోసారి అమ్మకాల ఒత్తిడికి కుదేలయ్యాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.11,250 నష్టపోయి రూ.2.3 లక్షలకు దిగొచ్చింది. బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,900 తగ్గి రూ.1,47,800 స్థాయికి చేరింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం బులియన్ మార్కెట్లు పనిచేయలేదు. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండడం, అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 37 డాలర్లు లాభపడి 4,416 డాలర్ల స్థాయి వద్ద, వెండి ఔన్స్కు స్వల్ప లాభంతో 68.12 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. ‘‘చమురు ధరలు బలహీనపడడంతో బంగారం ధర 4,420 డాలర్ల వరకు వెళ్లింది. కానీ, తర్వాత చమురు ధరల పెరుగుదలతో దిగొచ్చింది’’అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్సింగ్ తెలిపారు. యూఎస్ ద్రవ్యోల్బణం డేటా సమీప కాలంలో బులియన్ ధరలను ప్రభావితం చేయొచ్చన్నారు. -
మళ్లీ బేర్ ఎటాక్!
ముంబై: పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా మారడంతో దలాల్ స్ట్రీట్ మళ్లీ బేర్ గుప్పిట్లోకి వచ్చింది. అమెరికా–ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే కొనసాగుతున్నాయి. చమురు సరఫరా ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 107 డాలర్లకు ఎగసింది. రూపాయి విలువ రికార్డు కనిష్టానికి దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు గత 19 రోజులుగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తూనే ఉన్నారు. అమెరికాలో ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్ 1,690 పాయింట్లు కోల్పోయి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 487 పాయింట్లు పతనమై 22,820 వద్ద నిలిచింది. సూచీల 2% పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.8.86 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.422.15 లక్షల కోట్లకు దిగిచ్చింది. ఆసియాలో జపాన్, ఇండోనేషియా, తైవాన్, థాయిలాండ్ మార్కెట్లు 1–50% నష్టపోయాయి. చైనా, హాంగ్కాంగ్, సింగపూర్ సూచీలు 0.50% మేర లాభడ్డాయి. యూరప్లో జర్మనీ డాక్స్ ఇండెక్సు 1.37%, ఫ్రాన్స్ సీఏసీ సూచీ 0.72%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్సు 0.30 శాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు 1.50 శాతం పతనంతో ట్రేడవుతున్నాయి. రోజంతా అమ్మకాలు...బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు ఒత్తిడితో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు క్షీణించి 73,534 వద్ద, నిఫ్టీ 501 పాయింట్లు పతనమై 22,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీగా ప్రభుత్వరంగ బ్యాంక్ సూచీ 4%, రియల్టీ 3.10% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.12%, 1.77 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై మళ్ళీ ‘విండ్ఫాల్ టాక్స్’ విధించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4.55% క్షీణించి రూ.1,348 వద్ద స్థిరపడింది. -
అంబానీ సంస్థకు రూ.80 వేల కోట్ల లాస్!
భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన సమయానికి కుప్పకూలాయి. ఎగుమతి పన్ను విధించాలన్న ప్రభుత్వ ఆదేశం.. అధిక చమురు ధరలు, భారత మార్కెట్పై ప్రభావం చూపుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో.. సంస్థ షేర్లు మార్చి 27, శుక్రవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో 4% పైగా పడిపోయాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)లో సుమారు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లింది.ఎన్ఎస్ఈ వెబ్సైట్ డేటా ప్రకారం.. బుధవారం మార్కెట్ ముగింపులో సుమారు రూ.19.12 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, శుక్రవారం మార్కెట్ సెషన్లో సుమారు రూ.80,000 కోట్లు తగ్గి రూ.18.32 లక్షల కోట్లకు పడిపోయింది.శుక్రవారం మార్కెట్ సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4.23% పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి అయిన రూ.1,353.20కి చేరాయి. అంతకుముందు మార్కెట్ ముగింపులో ఈ షేర్ల ధర రూ.1,413.10గా ఉంది. మధ్యాహ్నం 12:45 గంటల సమయానికి, స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఆర్ఐఎల్ షేర్లు 4.13% నష్టంతో రూ.1,354.80 వద్ద ట్రేడ్ అయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎగుమతి పన్ను విధించినట్లు.. మార్చి 27న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఈ ఎగుమతి పన్నును ఇప్పుడు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.నేటి స్టాక్ మార్కెట్శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.ఇదీ చదవండి: ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా? -
ఇంటీరియో టార్గెట్.. మార్కెట్లో రూ.550 కోట్లు!
దక్షిణాది మార్కెట్లో ఈసారి రూ. 550 కోట్లు, హైదరాబాద్లో రూ. 50 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు ఇంటీరియో బై గోద్రెజ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ నారాయణ్ సర్కార్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో సుమారు 9 శాతంగా ఉన్న వాటాను వచ్చే మూడేళ్లలో 14 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కొత్త స్టోర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన చెప్పారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా దాదాపు రూ. 70 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. రెండు రాష్ట్రాల్లో తమకు 18 షోరూమ్లు, 55 డీలర్లు, 150 రిటైలర్లు ఉన్నట్లు సర్కార్ చెప్పారు. హైదరాబాద్లో స్టోర్స్ సంఖ్య 14కి చేరినట్లు తెలిపారు.పట్టణ ప్రాంతాలతో పాటు కొత్త మార్కెట్లలోను తమ ఉత్పత్తులను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా ఇరు రాష్ట్రాల్లోను 12 కొత్త డీలర్ స్టోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు 100 రిటైలర్లను జోడించుకోవాలని నిర్దేశించుకున్నట్లు సర్కార్ చెప్పారు. టెక్ ఉద్యోగులు, మౌలిక సదుపాయాలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టుల వృద్ధితో హైదరాబాద్లో మాడ్యులర్, ఫుల్ హోమ్ సొల్యూషన్స్కి డిమాండ్ నెలకొందని వివరించారు. కర్టెన్లులాంటి సాఫ్ట్ ఫర్నిషింగ్స్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. -
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చే కియోసాకి.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో 2026 క్రాష్?, అని పేర్కొంటూనే.. 1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారని వెల్లడించారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే క్షమాపణలు అంటూ మరో ట్వీట్ చేశారు. కియోసాకి ఎందుకిలా చేశారు?, దీనికి గల కారణం ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మొదటి ట్వీట్''1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారు. 1950లో ఎడ్గార్ కేస్ కూడా 2026లో ఒక భారీ పతనం సంభవిస్తుందని అంచనా వేశారు. మీరేమనుకుంటున్నారు?.. 2026లో ఒక భారీ పతనం సంభవిస్తే, మీరు ధనవంతులు అవుతారా లేక పేదవారు అవుతారా?, నేను ధనవంతుడిని కావాలని అనుకుంటున్నాను'' అని కియోసాకి ట్వీట్ చేశారు.2026 CRASH?FUTURISTS:Nostradamus in 1500 said disaster would hit the world in 2026.Edgar Cayce in 1950 also predicted a massive crash occurring in 2026.What do you think?You may want to tune into YouTube videos for more details on these two famous futurist predictions.…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026రెండో ట్వీట్క్షమించండి అని పేర్కొంటూ.. మొదటి పోస్ట్లో, 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుందని భవిష్యత్ శాస్త్రవేత్తలైన నోస్ట్రాడమస్ (1500) మరియు ఎడ్గార్ కేసీ (1940) చేసిన అంచనాను నేను వెల్లడించాను. ఆ తరువాత ఒక స్నేహితుడు నన్ను సంప్రదించాడు.. 2026 సంక్షోభ సమయంలో నేను ధనవంతుడిని అవుతానని చెప్పినందుకు అతను నాపై కోపంగా ఉన్నాడని పేర్కొన్నారు.అతని సమస్య ఏమిటంటే.. మీలో చాలామంది అనుసరించినట్లుగా అతను నా పోస్ట్ను ఎప్పుడూ అనుసరించలేదు. అంతే కాకుండా.. ఒక సంక్షోభంలో ధనవంతులు కావాలని మీరు, నేను ప్రణాళిక వేసుకున్న విషయం అతనికి తెలియదు.నన్ను అనుసరించే అందరికీ.. నేను S&P 500, యూఎస్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు వంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టనని, లేదా నగదును పొదుపు చేయనని ఇప్పటికే తెలుసు. ప్రభుత్వం, బ్యాంకులు లేదా వాల్ స్ట్రీట్ ముద్రించే దేనిలోనూ నేను పెట్టుబడి పెట్టను. అంతే కాకుండా.. నన్ను అనుసరించే వారికి నేను KISS (కీప్ ఇట్ సూపర్ సింపుల్) సూత్రాన్ని పాటిస్తానని కూడా తెలుసు.MY APOLOGIES:In my previous X I quoted futurists Nostradamus’ 1500 and Edgar Caycees 1940 prediction that a global economic crisi would begin in 2026. A friend contacted me. He was upset with me because I stated I was going to richer during the 2026 crisis.His problem was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026నేను పశువులను పెంచి అమ్ముతాను, టెక్సాస్, నార్త్లోని నా చమురు బావుల నుంచి చమురును అమ్ముతాను, అప్పుతో కొనుగోలు చేసిన 1500 అద్దె యూనిట్లను నెలవారీగా అద్దెకు ఇస్తాను, నేను అసలైన బంగారం, వెండి, బిట్కాయిన్, మరియు ఎథేరియంలను పొదుపు చేస్తాను. మీలో చాలా మందిలాగే, నా దగ్గర కూడా మొదట్లో డబ్బు లేదు. కానీ చిన్న చిన్న ఆస్తులను కొని సంవత్సరాల తరబడి ఉంచుకున్నాను, వాటిని ఎప్పుడూ అమ్మలేదు. మీలో చాలా మందికి నేను నా మొదటి 6 బిట్కాయిన్లను $600కి కొన్నానని తెలుసు, నా దగ్గర ఉన్న డబ్బంతా అదే, మరియు నేను కొన్ని రోజుల పాటు ఏమీ తినలేదు.ఇక చివరగా.. నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ చెప్పినట్లు 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?, రాదా అని నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైతే.. నా మాట విన్న మీరు, నేను ధనవంతులమవుతామని నాకు గట్టి నమ్మకం ఉంది. అదే సమయంలో లక్షలాది మంది పేదలుగా మిగిలిపోతారు.ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!భవిష్యత్తును చూడగలిగే పెట్టుబడిదారులే ధనవంతులవుతారు. నాకు నిజమైనవి (విలువైన లోహాలు) ఇష్టం. నకిలీవి (కరెన్సీ) అంటే ద్వేషం. నువ్వేం చేయబోతున్నావు?. ఆలోచించి.. ఏమీ చేయని లక్షలాది మందిలా ఉండకు. అలోచించి నిర్ణయం తీసుకో అని కియోసాకి ట్వీట్ చేశారు.


