breaking news
Business
-
డీజిల్లో కొత్త ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!
భారతదేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా ఎదగడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దిగుమతి చేసే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా డీజిల్లో 15 శాతం వరకు ఐసోబ్యూటానాల్ మిశ్రమాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.ఇప్పటికే పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం కలిపే చర్యలు జరుగుతున్నాయి. అయితే.. ఇథనాల్ను నేరుగా డీజిల్లో కలపడం సాధ్యం కాదు. కాబట్టి ఇథనాల్ నుంచే ఐసోబ్యూటానాల్ను ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించాలనే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన తెలిపారు. ఐసోబ్యూటానాల్ డీజిల్కు బదులుగా ఉపయోగపడగల సమర్థవంతమైన ఇంధనమని ఆయన పేర్కొన్నారు.ఈ కొత్త ఇంధన మిశ్రమంపై ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో వాహన ఇంజిన్లను కూడా ఈ ఇంధనాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సి ఉందని వివరించారు.ఐసోబ్యూటానాల్ను తరువాతి తరం బయోఫ్యూయల్గా పరిగణిస్తున్నారు. దీనికి అధిక ఎనర్జీ డెన్సిటీ ఉండటం, ఇంజిన్లతో మెరుగైన అనుకూలత కలిగి ఉండటం, తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేయడం వంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఈ ఇంధనాన్ని విస్తృతంగా ఉపయోగిస్తే.. భారత్ ముడి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. దేశంలో బయోఫ్యూయల్ ఉత్పత్తికి కొత్త అవకాశాలు కూడా ఏర్పడనున్నాయని భావిస్తున్నారు.కాగా ఇప్పటికే.. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే విజయవంతం చేసింది. దీనివల్ల దేశానికి భారీ విదేశీ మారకద్రవ్యం ఆదా కావడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గిందని, రైతులకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడ్డాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
ఏటీఎఫ్ సబ్సిడీ.. మాకొద్దులే!
పశ్చిమాసియా ప్రభావంతో పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి ఎయిర్లైన్స్కి ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ధరల స్థిరీకరణ పథకానికి ఆదరణ కరువైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దీన్ని ఉపయోగించుకోవడంపై విమానయాన సంస్థలేవీ ఆసక్తి చూపలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.వివరాల్లోకి వెళ్తే .. ప్రభుత్వం రూ. 10,000 కోట్లతో జెట్ ఫ్యూయల్ రేట్ల స్థిరీకరణ పథకాన్ని ప్రకటించింది. ఎయిర్లైన్స్ ఇందులో స్వచ్ఛందంగా చేరొచ్చు. దీని ప్రకారం మూడేళ్ల పాటు పన్నులు మొదలైనవన్నీ కలిపి లీటరుకు రూ. 115 రేటు (ఢిల్లీ ధర) చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది.సబ్సిడీపై విక్రయించడం వల్ల ఆయిల్ కంపెనీలకు నష్టాలేవైనా వాటిల్లితే ప్రభుత్వం దాన్ని భర్తీ చేస్తుంది. ఈ స్కీములో చేరని కంపెనీలు మార్కెట్ ధరలను చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది. పథకాన్ని ప్రకటించిన జూన్ 3 నాడు రేట్లు సుమారు రూ. 142 స్థాయిలో ఉండగా రూ. 115 రేటును ప్రతిపాదించారు. కానీ ప్రస్తుతం ఆ రెండింటి కన్నా ఏటీఎఫ్ ధర గణనీయంగా తగ్గి రూ. 110 స్థాయికి తగ్గింది. రూ. 38 వేల కోట్లకు ఎయిర్లైన్స్ నష్టాలు నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవడం తదితర అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానయాన సంస్థల పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. 2026–27లో ఎయిర్లైన్స్ నష్టాలు ఏకంగా రూ. 36,000–38,000 కోట్లకు పెరగనున్నాయి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. వాస్తవానికి 2027 ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ. 11,000–12,000 కోట్లకు తగ్గుతాయని ముందుగా అంచనా వేసినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయినట్లు వివరించింది. -
రూ.5 కోట్ల కారుతో పిల్లల ఆటలు.. కోర్టుకెక్కిన యజమాని!
పిల్లల చేష్టలు ఒక్కోసారి తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతుంటాయి. ఇలాగే చైనాలో నలుగురు చిన్నారులు రూ.5 కోట్లకు పైగా విలువైన ఫెరారీ సూపర్కార్ను ఆటబొమ్మగా మార్చి ధ్వంసం చేసిన ఘటన సంచలనంగా మారింది. పిల్లల తల్లిదండ్రులు తగిన పరిహారం చెల్లించేందుకు నిరాకరించడంతో కార్ యజమాని సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు చైనా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కారంతా గీతలే..సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ సంఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ నగరంలో జరిగింది. వ్యాపార పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో యజమాని తన ఎరుపు రంగు ఫెరారీ 488 జీటీబీ కారును ఆరుబయట పార్క్ చేశాడు. అతను తిరిగి వచ్చేసరికి పొరుగింటికి చెందిన 10 ఏళ్లలోపు నలుగురు పిల్లలు కారుపై ఎక్కి చిందరవందర చేసేశారు. కారు గ్లాస్పై జారుడు బల్లలా ఆడుకున్నారు. వెదురు కర్రలతో కారంతా గీతలు పెట్టేశారు.కారు హుడ్, టాప్, ఫెండర్లు, టెయిల్లైట్లు, కిటికీలు సహా పలు భాగాలపై లోతైన గీతలు కనిపించాయి. ముందు బంపర్ కూడా చీలినట్లు వెల్లడైంది. స్థానిక రిపేర్ సెంటర్ల అంచనా ప్రకారం ఒరిజినల్ పార్ట్స్తో మరమ్మతులకు సుమారు 1 లక్ష యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.12 లక్షలు) వరకు ఖర్చవుతుందని సమాచారం. ప్రత్యామ్నాయ ఆఫ్టర్మార్కెట్ విడిభాగాలు ఉపయోగిస్తే ఈ వ్యయం కాస్త తగ్గే అవకాశం ఉంది.రూ.60 వేలే ఇస్తామన్న తల్లిదండ్రులుయజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం రెండు దఫాల చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం లభించలేదు. పిల్లల తల్లిదండ్రులు కేవలం 5,000 యువాన్లు (సుమారు రూ.60 వేల వరకు) మాత్రమే పరిహారంగా చెల్లించేందుకు సిద్ధమని చెప్పినట్లు కథనాలు వెల్లడించాయి. అంతేకాక పిల్లల నుంచి క్షమాపణలు కూడా రాలేదని యజమాని ఆరోపించాడు. దీంతో పూర్తి మరమ్మతు ఖర్చును వసూలు చేసేందుకు సివిల్ దావా వేయాలని నిర్ణయించాడు. -
ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్!
భారతదేశంలో ఆధార్ ప్రతి పౌరుడికి ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ముఖ్యంగా పిల్లల కోసం ఆధార్ వివరాలు సరిగ్గా ఉండటం చాలా అవసరం. కాబట్టి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని చెబుతోంది.పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి వేలిముద్రలు, కంటి (ఐరిస్) నమూనాలు, ముఖ ఆకృతి కొంత మారుతుంది. అందువల్ల చిన్న వయస్సులో తీసుకున్న బయోమెట్రిక్ వివరాలు కాలక్రమేణా సరైన గుర్తింపును ఇవ్వకపోవచ్చు. ఈ సమస్యను నివారించడానికి యూఐడీఏఐ ఈ అప్డేట్ను తప్పనిసరి చేసింది. దీనివల్ల ఆధార్ వివరాలు మరింత ఖచ్చితంగా ఉంటాయి.ఈ బయోమెట్రిక్ అప్డేట్ ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. ఎందుకంటే వీరికి స్కూల్, కాలేజీల్లో ప్రవేశాలు లేదా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి.. ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఇంటర్న్షిప్లు, ఫెలోషిప్లకు ఆధార్ ఆధారిత గుర్తింపు అవసరం అవుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు పొందడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పిల్లల ఆధార్ వివరాలు అప్డేట్లో ఉండటం అవసరం.యూఐడీఏఐ ప్రకారం.. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఈ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రస్తుతం ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ సదుపాయం 2026 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ గడువులోపు అప్డేట్ చేయించుకుంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.ఈ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లలతో కలిసి సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా నమోదు కేంద్రానికి వెళ్లాలి. అక్కడ పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో తీసి అప్డేట్ చేస్తారు. కొన్ని నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.Mandatory Biometric Updates (MBU) are required on attaining the age of 5 & 15 years. Ensure your child's Aadhaar remains updated and accurate.UIDAI is running a special drive and MBU is now free between the age of 5-17 till 30 September 2026.Locate your nearest Aadhaar… pic.twitter.com/5yi4qYF7l0— Aadhaar (@UIDAI) July 4, 2026 -
జూన్లో ఎక్కువ మంది కొన్న కారు ఇదే!
భారత ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. వినియోగదారుల అభిరుచుల్లో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్యూవీ (SUV) వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ అద్భుత ప్రదర్శన కనబరిచింది.జూన్ నెలలో టాటా మోటార్స్ దేశీయంగా మొత్తం 63,083 ప్రయాణికుల వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 37,237 వాహనాలతో పోలిస్తే 69 శాతం వృద్ధి నమోదు చేసింది. ముఖ్యంగా పంచ్, నెక్సాన్, టియాగో కొత్త వెర్షన్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వంటి అన్ని రకాల మోడళ్లకు బుకింగ్లు పెరగగా, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా 14,800 యూనిట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించాయి.అమ్మకాల పరంగా టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచి 21,006 యూనిట్లు విక్రయించింది. టాటా నెక్సాన్ 18,335 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మారుతి సుజుకి డిజైర్ 17,899 యూనిట్లతో మూడో స్థానాన్ని దక్కించుకొని, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్గా తన స్థానాన్ని కొనసాగించింది.తరువాత స్థానాల్లో వ్యాగన్ఆర్ (16,952 యూనిట్లు), ఎర్టిగా (16,111 యూనిట్లు), స్విఫ్ట్ (15,215 యూనిట్లు), మహీంద్రా స్కార్పియో (14,097 యూనిట్లు), ఫ్రాంక్స్ (13,135 యూనిట్లు), బాలెనో (12,488 యూనిట్లు), హ్యుందాయ్ వెన్యూ (10,776 యూనిట్లు) నిలిచాయి.టాటా మోటార్స్ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నప్పటికీ, టాప్-10 జాబితాలో ఆరు మోడళ్లతో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని కొనసాగించింది. డిజైర్, వ్యాగన్ఆర్, ఎర్టిగా, స్విఫ్ట్, ఫ్రాంక్స్, బాలెనో మోడళ్లు కలిపి 91,780 యూనిట్ల అమ్మకాలు నమోదు చేశాయి. ఇది టాప్-10 కార్ల మొత్తం అమ్మకాలలో 57 శాతానికి పైగా ఉండటం విశేషం.ఇదీ చదవండి: E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!ఈసారి టాప్-10 జాబితాలో సాధారణంగా స్థానం సంపాదించే హ్యుందాయ్ క్రెటా కనిపించలేదు. సరఫరాదారుల ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఉత్పత్తి తాత్కాలికంగా అంతరాయం కలగడంతో క్రెటా అమ్మకాలు తగ్గాయి. అలాగే కొత్త వెర్షన్ విడుదలకు ముందు మారుతి సుజుకి బ్రెజ్జా అమ్మకాలు కూడా తగ్గడంతో అది కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.జూన్ నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. భారత వినియోగదారులు ఎస్యూవీ వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. టాప్-10 జాబితాలో పంచ్, నెక్సాన్, స్కార్పియో, ఫ్రాంక్స్, వెన్యూ వంటి ఐదు ఎస్యూవీలు చోటు దక్కించుకున్నాయి. అయితే ఎస్యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, డిజైర్ అత్యధికంగా అమ్ముడైన సెడాన్గా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. -
ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో అంబానీ, మిట్టల్
ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) చొరవతో ఏర్పాటైన ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలకు చోటు దక్కింది. వ్యవస్థాపక సభ్యులు, 44 మంది కమిషనర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఉన్నారు.ఈ కమిషన్కి రువాండా అధ్యక్షుడు పాల్ కగామే, సేల్స్ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్లు కో–చెయిర్గా వ్యవహరిస్తారు. వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ సామర్థ్యాలను వినియోగంలోకి తేవడానికి, దానిపై అవగాహన, నమ్మకాన్ని పెంచడానికి ఈ కమిషన్ పని చేస్తుంది. ఫౌండింగ్ మెంబర్గా సునీల్ మిట్టల్ని ప్రతిపాదించడంపై భారతి ఎంటర్ప్రైజెస్ హర్షం వ్యక్తం చేసింది. -
దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని.. బలోత్రా జిల్లాలోని పచ్పద్ర ప్రాంతంలో దేశంలోని తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-పెట్రోకెమికల్ సముదాయాన్ని ప్రారంభించారు. ఇది దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో కొత్త అధ్యాయంగా నిలిచింది. ఈ సముదాయం భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు దేశీయ పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారనుంది.ఈ రిఫైనరీని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను రూ. 79,450 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నులు. అదనంగా ఏడాదికి 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గి, దేశీయంగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ పెరుగుతుంది. దీనివల్ల దేశ ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుంది. అంతే కాకుండా.. ఈ రిఫైనరీ ఆధారంగా ఇక్కడ పెట్రోకెమికల్, ప్లాస్టిక్ పార్క్ అభివృద్ధి చెందనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడి స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీంతో రాజస్థాన్ రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందనుంది.#WATCH | Balotra, Rajasthan | Prime Minister Narendra Modi flags off refinery production tankers from the Greenfield Refinery-cum-Petrochemical Complex, developed as a joint venture between Hindustan Petroleum Corporation Limited (HPCL) and the Rajasthan Government, which PM Modi… pic.twitter.com/YHAZSdihQE— ANI (@ANI) July 4, 2026 -
ఇంటి రుణానికి తొందరగా ఇడుపు కాయితం!.. ఇదో మార్గం
ఇంటి రుణం తీసుకోవడం చాలా మంది జీవితాల్లో అతిపెద్ద ఆర్థిక బాధ్యతల్లో ఒకటి. 15 నుంచి 30 ఏళ్ల వరకు కొనసాగే ఈఎంఐలు కుటుంబ బడ్జెట్పై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అయితే రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ప్రీపేమెంట్లు చేయడం మాత్రమే మార్గం కాదు. ప్రస్తుతం అనేక బ్యాంకులు అందిస్తున్న ‘ఓవర్డ్రాఫ్ట్ (OD) లింక్డ్ హోమ్ లోన్’ సదుపాయం కూడా వడ్డీ భారం తగ్గించడంలో సహాయపడుతోంది.ఇలా పని చేస్తుంది..ఈ విధానంలో గృహ రుణాన్ని ఒక పొదుపు లేదా కరెంట్ ఖాతాతో అనుసంధానిస్తారు. రుణగ్రహీత తన వద్ద ఉన్న అదనపు నిధులను ఆ ఖాతాలో ఉంచితే, బ్యాంకు వడ్డీని మొత్తం బకాయి రుణంపై కాకుండా నికర బకాయి మొత్తంపై లెక్కిస్తుంది. ఉదాహరణకు రూ.40 లక్షల రుణ బకాయిపై లింక్డ్ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే, వడ్డీని రూ.35 లక్షలపైనే లెక్కించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతి ఈఎంఐలో వడ్డీ భాగం తగ్గి, అసలు రుణం చెల్లింపునకు ఎక్కువ మొత్తం వెళ్తుంది.ఈ సదుపాయంలోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ప్రీపేమెంట్ చేసినట్లుగా డబ్బు శాశ్వతంగా లాక్ అయిపోదు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ఇతర అవసరాల కోసం ఆ అదనపు నిధులను తిరిగి ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. అందువల్ల వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, బోనస్లు లేదా ప్రోత్సాహకాలు పొందే ఉద్యోగులు ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.అందరికీ సరిపోతుందా?నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఓవర్డ్రాఫ్ట్ హోమ్ లోన్ వల్ల కేవలం వడ్డీ పొదుపు మాత్రమే కాదు, రుణ కాలపరిమితి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు రుణ మొత్తం వేగంగా తగ్గుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికీ సరిపోదు. నెలాఖరుకు మిగులు నిధులు లేకుండా మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేసే వారికి ఈ ఫీచర్ పెద్దగా ఉపయోగపడదు.అయితే రుణగ్రహీతలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని బ్యాంకులు ఓవర్డ్రాఫ్ట్ హోమ్ లోన్లపై సాధారణ గృహ రుణాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సదుపాయాన్ని ఎంచుకునే ముందు వడ్డీ రేట్లు, ఛార్జీలు, ఉపసంహరణ నిబంధనలు, దీర్ఘకాలిక ప్రయోజనాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం.మొత్తానికి, అత్యవసర నిధులను అందుబాటులో ఉంచుకుంటూనే గృహ రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించాలని భావించే వారికి ఓవర్డ్రాఫ్ట్ లింక్డ్ హోమ్ లోన్ ఒక తెలివైన ఆర్థిక సాధనంగా మారవచ్చు. -
రూ .4.53 లక్షల ధర.. కొత్త కారు విడుదల
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లో 2026 మోడల్ క్విడ్ హ్యాచ్బ్యాక్ను విడుదల చేసింది. ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధరను రూ.4.53 లక్షలుగా నిర్ణయించింది. ఈ తాజా వెర్షన్లో డిజైన్, క్యాబిన్లో స్వల్ప మార్పులతో పాటు వేరియంట్ లైనప్ను కూడా కంపెనీ సరళీకృతం చేసింది. కారు ఎవల్యూషన్, క్లైంబర్ అనే రెండు ట్రిమ్లలో, 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ (AMT) గేర్బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.వేరియంట్లు – ధరలుఎవల్యూషన్ - 5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.4.53 లక్షలు, AMT వేరియంట్ ధర రూ.4.90 లక్షలుక్లైంబర్ - 5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.5.15 లక్షలు, AMT వేరియంట్ ధర రూ.5.61 లక్షలులైనప్లో మార్పులు2026 అప్డేట్తో ఇప్పటివరకు ఉన్న స్టాండర్డ్, టెక్నో వేరియంట్లను కంపెనీ నిలిపివేసింది. దీంతో క్విడ్ శ్రేణి ఇప్పుడు రెండు ప్రధాన ట్రిమ్లకే పరిమితమైంది. మాన్యువల్ వేరియంట్లకు కంపెనీ అధీకృత డీలర్ల ద్వారా రెట్రోఫిట్ సీఎన్జీ కిట్ కూడా అందిస్తోంది. దీని అదనపు ధర రూ.70,450గా నిర్ణయించారు.కొత్త 2026 క్విడ్లో 3డీ రెనాల్ట్ లోగో, 14 అంగుళాల స్టీల్ వీల్స్కు కొత్త డ్యూయల్-టోన్ వీల్ కవర్లు, టెయిల్గేట్పై సిల్వర్ ఫినిష్తో 'KWID' లెటరింగ్ వంటి మార్పులు చేశారు. అయితే LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), హాలోజన్ హెడ్ల్యాంప్స్, ముందు-వెనుక బంపర్ల డిజైన్లో ఎలాంటి మార్పులు చేయలేదు.క్యాబిన్లో కొత్త స్టీరింగ్ వీల్ఇంటీరియర్లో ప్రధాన మార్పు రెనాల్ట్ కైగర్ నుంచి తీసుకొచ్చిన కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్. ఇందులో ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ను కూడా సమీకరించారు. అలాగే 8 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ ఏసీ, పవర్ విండోలు వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.భద్రతా పరంగా ఎవల్యూషన్ ట్రిమ్లో డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, క్లైంబర్ వేరియంట్లో ఆరు ఎయిర్బ్యాగ్స్ అందించారు. అదనంగా రియర్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), AMT వేరియంట్కు హిల్ స్టార్ట్ అసిస్ట్, EBDతో కూడిన ABS, సీట్బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.కొత్త క్విడ్లో ఇప్పటికే ఉన్న 1.0 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్నే కొనసాగించారు. ఇది 69 బీహెచ్పీ పవర్, 92.5 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఎంపికలు లభిస్తాయి.భారత ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ విభాగంలో రెనాల్ట్ క్విడ్కు ప్రధాన ప్రత్యర్థులుగా మారుతి సుజుకి ఆల్టో K10, మారుతి సెలెరియో వంటి మోడళ్లు ఉన్నాయి. తక్కువ ధర, ఆధునిక ఫీచర్లు, సీఎన్జీ ఎంపిక వంటి అంశాలతో ఈ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రెనాల్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు రూ.11 లక్షలకే.. -
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్రం నజర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రతిపాదిత ‘యూజర్ నేమ్’ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం, మెటా సంస్థల మధ్య చర్చలు ముమ్మరమయ్యాయి. ఈ సరికొత్త ఫీచర్పై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) వివరణ కోరిన నేపథ్యంలో, మెటా ప్రతినిధులు శుక్రవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ భేటీలో ప్రభుత్వ అధికారులు తమకున్న పలు ఆందోళనలను మెటా బృందం ముందు ఉంచారు. అలాగే, గతంలో ఆదేశించినట్లుగానే మూడు రోజుల్లోగా దీనిపై సమగ్రమైన, వివరణాత్మక ప్రతిస్పందనను సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా కంపెనీ తన అధికారిక సమాధానాన్ని అందిస్తుందని నమ్మదగిన వర్గాలు వెల్లడించాయి.కేంద్రం నోటీసులు.. నిలిచిపోయిన రోల్అవుట్ఈ వారం ప్రారంభంలోనే వాట్సాప్లో యూజర్ నేమ్ల రోల్ అవుట్ ప్రక్రియపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో పూర్తిస్థాయి చర్చలు ముగిసి అన్ని అనుమానాలు నివృత్తి అయ్యే వరకు ఈ ఫీచర్ను భారతదేశంలో విడుదల చేయవద్దని కేంద్రం కంపెనీని కరాఖండిగా ఆదేశించింది. ప్రధానంగా సైబర్ భద్రత, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్ ఆన్లైన్ మోసాలకు, గోప్యతా ఉల్లంఘనలకు దారితీసే అవకాశం ఉందని పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు ఏంటి ఈ యూజర్ నేమ్ ఫీచర్?వినియోగదారుల పేర్లు ‘@’ చిహ్నంతో ప్రారంభమయ్యే ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్గా ఉంటాయి. ఇది పూర్తిగా ఐచ్ఛికం (ఆప్షనల్). ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ వ్యక్తిగత మొబైల్ నంబర్లను ఇతరులతో షేర్ చేయకుండానే మెసేజ్లు లేదా కాల్స్ రిసీవ్ చేసుకోగలుగుతారు. యూజర్ ప్రొఫైల్స్లో కనిపించే సాధారణ డిస్ ప్లే పేర్ల కంటే ఈ ‘యూజర్ నేమ్’లు భిన్నంగా ఉంటాయి. డిస్ ప్లే పేర్లు ప్రత్యేకంగా ఉండాల్సిన పనిలేదు, కానీ యూజర్ నేమ్స్ మాత్రం ఒక్కొక్కరికి యూనిక్గా ఉంటాయి. మీ ఫోన్ నంబర్ సేవ్ చేయని వ్యక్తులకు డైరెక్ట్ మెసేజ్లు, కాల్స్, గ్రూప్ చాట్లలో డిఫాల్ట్గా మీ ‘యూజర్ నేమ్’ మాత్రమే కనిపిస్తుంది.ఇతరులు దుర్వినియోగం చేయకుండా లేదా క్లెయిమ్ చేయకుండా ఉండటానికి.. కొన్ని నిర్దిష్ట వినియోగదారు పేర్లను వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజా ప్రముఖులకు మెటా ముందే కొన్ని యూజర్ నేమ్లను కేటాయించనుంది.నిపుణుల ఆందోళనమెటా సంస్థ ఎన్ని రక్షణ చర్యలు చెప్తున్నప్పటికీ సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటర్నెట్ వినియోగదారులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మోసగాళ్లు ప్రముఖ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు లేదా ప్రభుత్వ విభాగాలను పోలి ఉండేలా నకిలీ యూజర్ నేమ్స్ సృష్టించే ప్రమాదం ఉంది. దీనివల్ల సాధారణ ప్రజలు సులభంగా మోసపోయే అవకాశం ఉంది’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నోటీసుకు మెటా ఇచ్చే సమాధానం, ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపుల ఫలితం ఆధారంగానే.. భారతదేశంలో ఈ వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ అసలు ప్రారంభమవుతుందా లేదా? ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తుంది? అనేది తేలనుంది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
పాల కల్తీపై ఎఫ్డీఏ ఉక్కుపాదం
పాల కల్తీని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలపై కఠినమైన ఉత్తర్వులను జారీ చేసింది. జులై 3 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాల వ్యాపారాలకు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో సింథటిక్ పాలు, పాల కల్తీ, రవాణాలో జరుగుతున్న పలు ఉల్లంఘనలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకుంది. కల్తీదారుల పట్ల ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోందని ఎఫ్డీఏ హెచ్చరించింది.కొత్త మార్గదర్శకాలు..పాశ్చరైజ్డ్ పాలను కేవలం సీల్ చేసిన, సరిగ్గా లేబుల్ చేయబడిన, ట్యాంపర్-స్పష్టమైన (ఎవరూ మార్చడానికి వీలులేని) ప్యాకేజింగ్లో మాత్రమే విక్రయించాలి.పాలు ఎక్కడి నుంచి సేకరించారు? ఎవరికి సరఫరా చేశారు? అనే పూర్తి రికార్డులను నిర్వహించడం తప్పనిసరి. డైరీ ఫార్మ్ (వ్యవసాయ స్థాయి) నుంచి చివరి వినియోగదారుడికి అమ్మే వరకు ప్రతి దశను ట్రాక్ చేసేలా రికార్డులు ఉండాలి.పాలను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి కేవలం ఫుడ్-గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లను మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్ లేదా ఇతర నాణ్యత లేని పాత్రల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.పాలు, పాల ఉత్పత్తుల నిర్వహణ, పంపిణీ ప్రక్రియల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వార్షిక వైద్య ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.ముడి పాలపై ప్రత్యేక హెచ్చరికమార్కెట్లో వినియోగదారులకు నేరుగా విక్రయించే ముడి పాలు ప్యాకెట్లు లేదా కంటైనర్లపై ‘ఉపయోగించడానికి ముందు తప్పనిసరిగా వేడి చేయండి’ అనే హెచ్చరికను ప్రముఖంగా ప్రదర్శించాలని ఎఫ్డీఏ ఆదేశించింది.రూ.10 లక్షల వరకు జరిమానా!ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించి పాల కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. నిబంధనల ప్రకారం, కల్తీకి పాల్పడిన వారికి రూ.10 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
దిగువకు బంగారం.. పసిడి ప్రియులకు ఊరట
దేశంలో బంగారం, వెండి ధరల దౌడుకు బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు దిగువకు వచ్చాయి. ఇక వెండి ధరలు ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
‘డబ్బా ట్రేడింగ్’పై వార్నింగ్.. పోలీసులకు ఫిర్యాదు
దేశీయ స్టాక్ మార్కెట్లో అక్రమ ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) కీలక హెచ్చరిక జారీ చేసింది. లెజెండ్రీ ట్రేడర్స్ (Legendry Traders), లెట్స్ ట్రేడ్ ఇండియా (Let's Trade India) పేర్లతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న రెండు సంస్థలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎన్ఎస్ఈ తెలిపింది.ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం, లెజెండ్రీ ట్రేడర్స్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా స్టాక్ మార్కెట్ చిట్కాలు అందించడంతో పాటు, ఇన్వెస్టర్ల ట్రేడింగ్ ఖాతాలను నిర్వహించే సేవలను కూడా అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లెట్స్ ట్రేడ్ ఇండియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెళ్లు, అనుబంధ వెబ్సైట్లు, 9773687281 మొబైల్ నంబర్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది.గ్యారెంటీ లాభాలంటే నమ్మొద్దుస్టాక్ మార్కెట్లో హామీ లేదా నిర్ధారిత రాబడులు ఇస్తామని ప్రచారం చేసే ఏ వ్యక్తి లేదా సంస్థను నమ్మవద్దని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఇటువంటి పథకాలు చట్టవిరుద్ధమని, వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అలాగే యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటి ట్రేడింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది.రిజిస్టర్డ్ బ్రోకర్లేనా? ముందుగా చెక్ చేసుకోండిఈ రెండు సంస్థలు ఎన్ఎస్ఈలో నమోదైన స్టాక్ బ్రోకర్లు గానీ, అధీకృత ప్రతినిధులు గానీ కాదని ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది. కాబట్టి ఏ బ్రోకర్ లేదా సంస్థతోనైనా లావాదేవీలు చేపట్టే ముందు ఎన్ఎస్ఈ వెబ్సైట్లోని "Know/Locate Your Stock Broker" సదుపాయం ద్వారా వారి నమోదు వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించేకోవాలని ఇన్వెస్టర్లకు సూచించింది.ఏమిటీ 'డబ్బా ట్రేడింగ్'?'డబ్బా ట్రేడింగ్' అనేది సెబీ గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెలుపల జరిగే చట్టవిరుద్ధ, అనియంత్రిత ట్రేడింగ్ విధానం. ఇందులో కొనుగోలు, అమ్మకాల ఒప్పందాలు అధికారిక ఎక్స్ఛేంజీలపై అమలు కాకుండా, డబ్బా ఆపరేటర్లు తమ అంతర్గత వ్యవస్థల్లోనే సెటిల్ చేస్తారు. దీంతో ఈ ట్రేడ్లు సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీల పర్యవేక్షణకు దూరంగా ఉంటాయి.ఇలాంటి ట్రేడింగ్లో పెట్టుబడిదారులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉండదు. అధికారిక ఎక్స్ఛేంజీల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా వినియోగించుకోలేరు. అందువల్ల డబ్బా ట్రేడింగ్కు దూరంగా ఉండాలని ఎన్ఎస్ఈ మరోసారి స్పష్టం చేసింది. -
అన్ని జానర్ల డేటా నిలిపివేతకు కేంద్రం ఆదేశం!
భారతీయ టెలివిజన్ ప్రసార రంగంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశంలోని టీవీ ఛానెళ్ల భవితవ్యాన్ని, ప్రకటనల మార్కెట్ను శాసించే టెలివిజన్ రేటింగ్లను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా అమలులోకి వచ్చిన ‘టెలివిజన్ రేటింగ్స్ పాలసీ, 2026’ ప్రకారం.. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అధికారికంగా తన లైసెన్స్ను పునరుద్ధరించుకునే వరకు అన్ని రకాల జానర్ల టీవీ రేటింగ్ల ప్రచురణను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది.గతంలో కేవలం న్యూస్ ఛానెళ్లకు మాత్రమే పరిమితమైన ఈ రేటింగ్స్ నిలిపివేత విధానాన్ని ఇప్పుడు జనరల్ ఎంటర్టైన్మెంట్ (జీఈసీ), స్పోర్ట్స్, సినిమాలు, ప్రాంతీయ ఛానెళ్లతో సహా అన్ని విభాగాలకు విస్తరించడం దేశీయ ప్రసార, ప్రకటనల పరిశ్రమల్లో ఆందోళన కలిగిస్తోంది.ఆదేశాలు ఏం చెబుతున్నాయి?కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. ‘బార్క్’ సంస్థను పూర్తిగా మూసివేయడం లేదు. అయితే, నవీకరించబడిన కొత్త నియంత్రణ ఫ్రేమ్వర్క్కు సంస్థ పూర్తిగా అనుగుణంగా ఉందో లేదో ధ్రువీకరించే వరకు రేటింగ్ కార్యకలాపాలు, డేటా ప్రచురణను నిలిపివేయాలని స్పష్టం చేసింది.బార్క్ బ్యాక్-ఎండ్ వ్యవస్థలు యథావిధిగా పనిచేస్తాయని గమనించాలి. అవి ప్రేక్షకుల వ్యుయర్షిప్ డేటాను సేకరిస్తూనే ఉంటాయి. కానీ, మంత్రిత్వ శాఖ తన సమ్మతి సమీక్షను (Compliance Review) పూర్తి చేసి కొత్త విధానం కింద తాజా లైసెన్స్ మంజూరు చేసే వరకు ఎలాంటి గణాంకాలను బహిరంగంగా ప్రచురించడానికి వీల్లేదు.టెలివిజన్ రేటింగ్ వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపరచడానికి, పాలనను సరిదిద్దడానికి, ప్రేక్షకుల మెజర్మెంట్లో కచ్చితత్వాన్ని పెంచడానికి ఈ ‘టెలివిజన్ రేటింగ్స్ పాలసీ, 2026’ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రేటింగ్ ఏజెన్సీలు సవరించిన ఈ గైడ్లైన్స్కు లోబడి తమ లైసెన్సులను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.న్యూస్ ఛానల్స్ నుంచి అన్ని జానర్ల వరకు..టెలివిజన్ రంగంలో రేటింగ్స్ సస్పెన్షన్ అనేది పూర్తిగా కొత్త విషయమేమీ కాదు. గతంలో టీఆర్పీ డేటా తారుమారు అవుతోందనే ఆరోపణలు, సమగ్రతపై ఆందోళనల నేపథ్యంలో న్యూస్ ఛానెల్ రేటింగ్స్పై కొంతకాలం పాటు స్తంభింపజేశారు. కానీ, తాజా ఆదేశం టెలివిజన్ రంగాన్ని పూర్తిగా ప్రభావితం చేయనుంది. వినోదం, క్రీడలు, సినిమాలు, ప్రాంతీయ కంటెంట్తో సహా ప్రతి ఒక్క జానర్ను దీని పరిధిలోకి తీసుకొచ్చారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
బ్రాండ్ల రేటింగ్లో ‘టాటా టీ’ టాప్!
వినియోగదారుల కొనుగోలు ఆసక్తి ఆధారంగా ‘టీఆర్ఏ రీసెర్చ్’ విడుదల చేసిన తాజా ఇండెక్స్లో ‘టాటా టీ’ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రేటింగుల్లో టాటా టీ 455 పాయింట్లతో మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. బ్రిటానియా (380.3 పాయింట్లు), ప్రభుత్వ రంగ ఎస్బీఐ (283.8 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యధిక వృద్ధి సాధించిన టాప్–10 బ్రాండ్లలో ఆసుస్ ల్యాప్టాప్స్, గ్లూకాన్ డి, రేమండ్, వివో, శామ్సంగ్ టీవీలు, రిలయన్స్ జియో, శామ్సంగ్ మొబైల్ ఫోన్లు చోటు దక్కించుకున్నాయి.మరోవైపు, ప్రముఖ వాచీల బ్రాండ్ ‘టైటాన్’ ఏకంగా 552 పాయింట్లు కోల్పోయి తీవ్ర క్షీణతను నమోదు చేయగా.. హోండా మోటార్సైకిల్స్, డైకిన్ ఏసీలపై కూడా వినియోగదారుల ఆసక్తి తగ్గింది. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ‘ఆయిల్ అండ్ గ్యాస్’ విభాగం 77 శాతం క్షీణించింది. అలాగే, మాస్టర్ కార్డ్ తిరిగి ఇండెక్స్లోకి ప్రవేశించడం వల్ల ‘క్రెడిట్ కార్డ్ నెట్వర్క్’ విభాగంలో ఏకంగా 523.7 శాతం వృద్ధి నమోదైంది.సీజనల్ ట్రెండ్స్ ప్రభావం రుతుపవనాల ప్రభావంతో వినియోగదారుల కొనుగోలు ప్రాధాన్యతలు మారాయని టీఆర్ఏ నివేదిక తెలిపింది. వర్షాల వల్ల ‘టాటా టీ’, గ్లూకాన్ ‘డి’లకు డిమాండ్ పెరిగింది. చల్లబడిన వాతావరణంతో ఏసీలు (డైకిన్), టూ–వీలర్ల (హోండా) అమ్మకాలు మందగించాయి. అయితే, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని బ్రిటానియా మాత్రం బలమైన వృద్ధిని కనబరిచింది. వినియోగదారులు కేవలం బ్రాండ్లను గుర్తించడమే కాకుండా, వాటిని కొనేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారనేది ఈ ‘బైయింగ్ ఇంటెంట్’ సూచిస్తుందని టీఆర్ఏ రీసెర్చ్ సీఈఓ ఎన్. చంద్రమౌళి పేర్కొన్నారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఈ-రిక్షాల బ్యాటరీల హ్యాకింగ్ కలకలం
దేశవ్యాప్తంగా సామాన్యుడి రవాణాకు అనువుగా ఉన్న ఈ-రిక్షాలను టార్గెట్ చేస్తూ సాగుతున్న డిజిటల్ దోపిడీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ఈ-రిక్షాల బ్యాటరీలను రిమోట్ విధానంలో నిలిపివేస్తూ (షట్డౌన్) కొందరు కేటుగాళ్లు డ్రైవర్లను బ్లాక్మెయిల్ చేస్తున్న ఉదంతాలు వెలుగుచూడటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణమవుతున్న పలు ‘బ్యాటరీ మేనేజ్మెంట్ యాప్లను’ వెంటనే బ్లాక్ చేయాలంటూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.చైనా యాప్ల ద్వారా సైబర్ ముఠాల దాడులుఈ వివాదంలో ప్రధానంగా చైనా సంస్థలు అభివృద్ధి చేసిన యాప్లు ఉన్నట్లు కేంద్ర ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వీటిలో షెంజెన్ గ్రీనర్జీ టెక్నాలజీ, షెంజెన్ రుయిచువాంగ్ లినెంగ్ టెక్నాలజీ, డేలీ బీఎమ్ఎస్.. వంటి యాప్లు ఉన్నాయి. సాధారణంగా లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ల్లో ఛార్జ్, వోల్టేజ్, ఉష్ణోగ్రత, సెల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ‘బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్’ (బీఎంఎస్) ఉంటాయి. అయితే, వీటికి సరైన పాస్వర్డ్ లేదా పిన్ రక్షణ లేకపోవడంతో దుండగులు బ్లూటూత్ లేదా స్థానిక కనెక్టివిటీ ద్వారా వీటిని హ్యాక్ చేస్తున్నారు. ఇందుకు ఇంటర్నెట్ కూడా అవసరం లేకపోవడం గమనార్హం.వైరల్ వీడియోలతో వెలుగులోకి..గత వారం రోజులుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. నడుస్తున్న ఈ-రిక్షాలు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోనే ఆగిపోవడం, ఆ వెంటనే కొందరు వ్యక్తులు వచ్చి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం ఆ వీడియోల్లో కనిపించింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఇటువంటి ఘటనే కలకలం రేపింది. అక్కడి లోతి తిరాహా ప్రాంతంలో ఒక ఈ-రిక్షా ఆగిపోగా దాన్ని బాగుచేస్తానంటూ ఒక యువకుడు డ్రైవర్ నుంచి రూ.200 డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ యువకుడిని విచారించగా యాప్ ద్వారా బ్యాటరీని నిలిపివేసి ఆపై డబ్బులు గుంజే రాకెట్ నడుస్తున్నట్లు నీల్ గంగ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ తరుణ్ కురిల్ ధ్రువీకరించారు.నిబంధనల్లో లొసుగులే శాపమా?ప్రస్తుతం మనదేశంలో ఈ-రిక్షాలను ‘L5M’ కేటగిరీ వాహనాలుగా పరిగణిస్తారు. ప్రముఖ తయారీదారులు వీటికి ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ’ (ఐసీఏటీ) నుంచి సర్టిఫికేషన్ పొందుతారు. అయితే, ఐసీఏటీ నిబంధనల ప్రకారం బ్యాటరీల ఎలక్ట్రికల్, మెకానికల్ సేఫ్టీని మాత్రమే పరీక్షిస్తారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ఏఐఎస్-189 వంటి ప్రమాణాలలో సైబర్ సెక్యూరిటీ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఈ-రిక్షాలకు తప్పనిసరి చేయకపోవడమే ఈ సైబర్ దాడులకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి యాప్లను నిషేధించినప్పటికీ పాస్వర్డ్ లేని ఈ బ్యాటరీల భద్రతా లోపాలను పూర్తిస్థాయిలో సరిదిద్దడానికి మరిన్ని సాంకేతిక మార్పులు అవసరమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
స్మార్ట్ఫోన్ విభాగంలోకి ‘ఫైర్ బోల్ట్’
స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ ‘ఫైర్ బోల్ట్’ స్మార్ట్ఫోన్ విభాగంలోకి అడుగుపెడుతోంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘బోల్ట్’ అనే సరికొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్ను ఆగస్టు మధ్య నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ అర్ణవ్ కిషోర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమికంగా 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 472 కోట్లు) పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధులను ఉత్పత్తి అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్, పంపిణీ, నెట్వర్క్ విస్తరణకు కేటాయించామన్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఈ పెట్టుబడులను మరింత పెంచుతామని కిషోర్ తెలిపారు.రూ. 10,000 – రూ. 15,000 ధరల్లో ఫోన్లుఈ బ్రాండ్ కింద రూ.10,000 నుంచి రూ.15,000 ధరల శ్రేణిలో 4జీ, 5జీ స్మార్ట్ఫోన్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. రాబోయే పండగ సీజన్ కంటే ముందే దేశవ్యాప్తంగా ఈ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్లోకి వచి్చన తొలి 4–5 నెలల్లోనే 5 లక్షల నుండి 10 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్ణవ్ కిషోర్ వివరించారు.ఒప్పో ఇండియా నుంచి రెనో16 సిరీస్స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా రెనో16 సిరీస్ని ఆవిష్కరించింది. ఇందులో రెనో16, రెనో16సీ ఉంటాయి. దేశీయంగా తొలి హోలోవర్స్ 3డీ డిజైన్, 50 ఎంపీ టెలిఫోటో లెన్స్తో ఏఐ పోర్ర్టెయిట్ కెమెరా, హెచ్డీఆర్ వీడియో రికార్డింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వేరియంట్ని బట్టి స్నాప్డ్రాగన్ 7 జెన్4, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 6700 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. రెనో16 ధర రూ. 61,999 నుంచి, రెనో16సీ రేటు రూ. 46,999 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 9 నుంచి ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒప్పో ఈ–స్టోర్స్లో లభిస్తాయి. బ్యాంకును బట్టి 10 శాతం వరకు క్యాష్బ్యాక్, జీరో డౌన్పేమెంట్, రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లాంటివి ఆఫర్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
‘వికసిత్ భారత్’లో భాగస్వాములు కావాలి
భారతదేశాన్ని ‘వికసిత్ భారత్ 2047’ (అభివృద్ధి చెందిన దేశం)గా మార్చే ప్రయాణంలో భాగస్వాములు కావాల్సిందిగా ఫ్రాన్స్ వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా పరస్పర ఆర్థిక పురోగతిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. పారిస్లో జరిగిన ‘భారత్–ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్టేబుల్’ సమావేశంలో ఆమె ప్రసంగించారు.లైఫ్ సైన్సెస్, వ్యాక్సిన్లు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు), క్లినికల్ రీసెర్చ్, ప్రిసిషన్ మెడిసిన్, డిజిటల్ హెల్త్ రంగాలలో ఇరు దేశాలకు విభిన్న నైపుణ్యాలు ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ‘హెల్త్కేర్ విలువ ఆధారిత సప్లై చైన్’ను బలోపేతం చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని ఆమె కోరారు. శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తోందన్నారు. భారత్లో అమలవుతున్న ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’, ‘పీఎల్ఐ’ (ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక) పథకాలు పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్ రంగాలలో భారీ పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు.గిఫ్ట్ సిటీ వృద్ధిఅంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా వేగంగా ఎదుగుతోందని మంత్రి తెలిపారు. జూన్ 2026 నాటికి ఇందులో 1,200 కంటే అధిక సంస్థలు రిజిస్టర్ అయ్యాయని, 111 బిలియన్ డాలర్ల బ్యాంకింగ్ ఆస్తులతో పాటు, ఇప్పటివరకు మొత్తం 176 బిలియన్ డాలర్ల బ్యాంకింగ్ లావాదేవీలు జరిగాయని వివరించారు. బ్యాంకింగ్, ఫండ్ మేనేజ్మెంట్, లీజింగ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), రీఇన్సూరెన్స్ వంటి విభాగాలలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, సాంకేతికతగత పదేళ్లలో భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యిందని ఆర్థిక మంత్రి తెలిపారు. సప్లై చైన్ వైవిధ్యీకరణ, సాంకేతిక పరిణామాలు కొత్త పెట్టుబడి అవకాశాలను ఇస్తున్నాయని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీస్ రంగాలలో ఇరు దేశాలు నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. భారత్లోని డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంధన పరివర్తన రంగాలు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎంతో అనువైనవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.డిజిటల్ ఎకానమీ జోరుభారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిధిలో ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఒఎన్డీసీ వంటి విప్లవాత్మక వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో దాదాపు సగం వాటా భారత్దేనని అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 1,000 ఫ్రాన్స్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. కాగా, గత దశాబ్ద కాలంగా భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చర్యలను ఈ సదస్సులో పాల్గొన్న ఫ్రాన్స్ అగ్రశ్రేణి ఆర్థిక సంస్థల ప్రతినిధులు అభినందించారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
పసిడి ధర మళ్లీ లక్షన్నర పైకి...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో బుల్లిష్ ట్రెండ్తో పాటు యూఎస్ కరెన్సీ డాలర్ బలహీనత కారణంగా దేశీయంగా పసిడి ధర మళ్లీ లక్షన్నర (రూ.1.50 లక్షలు) మార్కును దాటింది. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.3,300 పెరిగి రూ.1,50,800 స్థాయికి చేరింది. అటు వెండి ధర కూడా తన లాభాల ర్యాలీని కొనసాగిస్తూ కేజీకి రూ. 5,000 పెరిగి రూ.2,45,000 స్థాయికి ఎగిసింది.అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు తగ్గడం, డాలర్ ఇండెక్స్ 101 పాయింట్ల దిగువకు పడిపోవడంతో బులియన్ మార్కెట్లో తాజా కొనుగోళ్లు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికాలో ఉపాధి గణాంకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందంటూ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్‡్ష చేసిన వ్యాఖ్యలు కూడా పసిడి, వెండి ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.రూ.4,200 డాలర్ల దిశగా..అంతర్జాతీయంగాబంగారం ధర ఔన్సుకు 1.4 శాతం లాభపడి 4,181.50 డాలర్లకు చేరింది. వెండి 2.44 శాతం పెరిగి 62.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లో పసిడి ధర త్వరలో 4,200 డాలర్లకు చేరే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ ప్రతినిధి కైనాత్ చైన్వాలా తెలిపారు. -
ఆధార్ యాప్తో ఉచితంగా ఈమెయిల్ అప్డేట్
న్యూఢిల్లీ: ప్రత్యేకంగా ఆధార్ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారానే ఉచితంగా ఈమెయిల్ని అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ వెల్లడించింది. జూలై 1 నుంచి 6 నెలల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. ప్రజలు తమ ఆధార్ సమాచారాన్ని అప్డేట్గా ఉంచుకునేందుకు ఇది తోడ్పడుతుందని, పారదర్శకత పెరుగుతుందని యూఐడీఏఐ తెలిపింది.సర్వీస్ని ఆధార్ యాప్లో ప్రవేశపెట్టిన 2 రోజుల్లోనే 2,50,000 మంది దీన్ని వినియోగించుకున్నట్లు వివరించింది. ఆధార్ యాప్ కొత్త వెర్షన్ని ప్రవేశపెట్టిన ఐదు నెలల్లోనే 3.1 కోట్లకు పైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. ఇప్పటివరకు 40 లక్షల మంది కొత్త ఆధార్ యూప్ను ఉపయోగించుకుని తమ మొబైల్ నంబర్లను అప్డేట్స్ చేసుకోగా, 10 లక్షల మంది అడ్రస్లను అప్డేట్ చేసుకున్నారు. -
సేల్స్ టాప్ గేర్.. డిస్కౌంట్లు రివర్స్ గేర్!
ఒకప్పుడు భారతీయ రోడ్లపై జూమ్మంటూ దూసుకెళ్లిన చిన్న కార్లు.. ఎస్యూవీల జోరుతో కొన్నేళ్లుగా చిన్నబోతున్నాయి. దీంతో సేల్స్ పెంచుకోవడం కోసం వాహన కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఇచ్చేవి. అయితే, గతేడాది చేపట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల పుణ్యమా అని మళ్లీ చిన్న కార్లకు డిమాండ్ పుంజుకుంటోంది. మరోపక్క, ఈ మాస్ మార్కెట్ విభాగంలో అమ్మకాలు ఫాస్ట్ట్రాక్లోకి రావడంతో హ్యాచ్బ్యాక్లు, ఎంట్రీలెవెల్ కార్లపై కంపెనీలు డిస్కౌంట్లలో కోత పెడుతున్నాయి.గతేడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో భారీ సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. జీఎస్టీ 2.0లో భాగంగా చిన్న కార్లు, కంపాక్ట్ ఎస్యూవీలను గతంలో ఉన్న 28% శాతం పన్ను శ్లాబ్ నుంచి 18 శాతం పన్ను శ్లాబ్లోకి చేర్చారు. దీంతో కంపెనీలు కూడా ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించడంతో ఆయా సెగ్మెంట్లలోని కార్ల ధరలు (దాదాపు 5–7 శాతం) వెంటనే దిగొచ్చాయి. దీనికి కంపెనీల డిస్కౌంట్లు కూడా తోడవడంతో చిన్న కార్లకు గిరాకీ అమాంతం పెరిగింది.ఇదే తడవుగా కార్ల కంపెనీలు ఇప్పుడు డిస్కౌంట్ల విషయంలో రివర్స్ గేర్ వేస్తున్నాయి. మారుతీ సుజుకీ పాపులర్ చిన్న కారు వ్యాగన్ఆర్పై మే నెలలో రూ.31,000 వరకు రాయితీ ఇవ్వగా.. దీన్ని జూన్లో రూ.10,000కు తగ్గించింది. బాలెనోపై కూడా డిస్కౌంట్ను రూ.31,000 నుంచి 21,000కు కట్ చేసింది. ఇక టాటా మోటార్స్ అయితే, టియాగో, పంచ్ మోడళ్లపై ప్రోత్సాహకాలను పూర్తిగా ఎత్తేయడం గమనార్హం. అంతక్రితం టియాగోపై రూ.19,000... పంచ్పై రూ.26,000 చొప్పున తగ్గింపు ఉండేదని నువామా రీసెర్చ్ వెల్లడించింది. మరో దిగ్గజం హ్యుందాయ్ సైతం ఎంట్రీ లెవెల్ మోడల్స్ గ్రాండ్ ఐ10 నియోస్, ఎక్స్టర్లపై ప్రయోజనాల్లో కోత విధించింది.రేట్లు పెరిగినా ఫుల్ డిమాండ్...జీఎస్టీ కోతకు తోడు తొలిసారి కారు కొనుగోలుదారులు ఎంట్రీ లెవెల్ కార్ల వైపు మళ్లీ మొగ్గుచూపుతుండటం, గ్రామీణ ఆదాయాల దన్నుతో చిన్న కార్ల సెగ్మెంట్కు జోష్ లభిస్తోంది. ఇదిలాఉండగా.. పశ్చిమాసియా యుద్ధం సెగతో ముడిసరుకుల ధరలు ఎగబాకిన నేపథ్యంలో వాహన కంపెనీలు రేట్ల పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి, ఏప్రిల్లో ధరలు పెంచినప్పటికీ చిన్న, కాంపాక్ట్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉందని మారుతీ డీలర్ ఒకరు వెల్లడించారు. ఇప్పటికీ జీఎస్టీ కోత ప్రయోజనం కంపెనీలకు కలిసొస్తోందన్నారు. కాగా, డిస్కౌంట్ల తగ్గింపు ట్రెండ్ను మారుతీ, టాటా మోటార్స్ డీలర్లు ధృవీకరిస్తున్నారు. టాటా మోటార్స్ తాజాగా టియాగో మోడల్లో పెట్రోల్, సీఎన్జీ, ఈవీ ఫేస్లిఫ్ట్ వేరియంట్లను ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు లేకుండానే ప్రవేశపెట్టినప్పటికీ బుకింగ్స్ భారీగానే వచ్చాయని టాటా మోటార్స్ డీలర్ ఒకరు పేర్కొన్నారు.అమ్మకాలు రయ్..హ్యాచ్బ్యాక్లు, ఎంట్రీ లెవెల్ కార్ల సేల్స్ టాప్గేర్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి రెండు నెలల్లో మారుతీ ఆల్టో, ఎస్ప్రెసో మోడల్స్ అమ్మకాలు 146 శాతం పుంజుకొని 32,341 కార్ల అమ్మకాలు నమోదు కావడం విశేషం. కాంపాక్ట్, మిడ్సైజ్ మోడళ్లయిన బాలెనో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సియాజ్ అమ్మకాలు సైతం భారీగా పెరిగాయి. ఏప్రిల్–మే నెలల్లో 31 శాతం ఎగసి 1,62,214 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వాటి అమ్మకాలు 1,23,872 మాత్రమే. అయితే, గత ఐదారేళ్లుగా చిన్న కార్ల మార్కెట్ వాటా తగ్గుతూనే వస్తోంది.మొత్తం ప్యాసింజర్ కార్లలో ఎంట్రీలెవల్ కార్ల వాటా ప్రస్తుతం 23 శాతానికే పరిమితమైంది. కోవిడ్ ముందు, అంటే 2018–19లో ఇది ఏకంగా 46% కావడం గమనార్హం. ఇప్పటికీ కారు ప్రియులు ఎస్యూవీలు, లగ్జరీ వేరియంట్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే, జీఎస్టీ కోత తర్వాత అఫర్డబుల్ కార్ల విభాగంలో కంపెనీలకు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయని.. దీనికి తాజా విక్రయాల ట్రెండ్ నిదర్శనమనేది పరిశ్రమ వర్గాల టాక్. -
భారత్ vs అమెరికా: భారీ ధర తేడాపై చర్చ!
సోషల్ మీడియాలో ఒక అమెరికన్ మహిళ షేర్ చేసిన వీడియో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె భారత్ vs అమెరికా మధ్య ఆరోగ్య సేవల ఖర్చులను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో చర్చకు దారితీశాయి. వీడియోలో ఆమె అమెరికాలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయని, అదే సమయంలో భారతదేశంలో మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయని చెప్పింది.సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో అమెరికన్ మహిళ ఈ విధంగా చెప్పారు. ''మా అత్తకు ఒక రకమైన రక్త క్యాన్సర్ ఉంది. ఆమె రెవ్లిమిడ్ అనే మందు తీసుకుంటుంది. ఈ మాత్ర ధర అమెరికాలో సుమారు 900 డాలర్లు (దాదాపు రూ.85,000), అదే మందు భారత్లో సుమారు 30 సెంట్స్ నుంచి 3 డాలర్ల వరకు (రూ.35-రూ.300 మధ్య) లభిస్తుందని ఆమె వివరించారు''. ధరల మధ్య భారీ తేడా చూసి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ కామెంట్లు పెట్టారు. కొందరు అమెరికా ఆరోగ్య వ్యవస్థపై విమర్శలు చేస్తే, మరికొందరు భారత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా తక్కువ ఖర్చుతో చికిత్స అందుతుందని కూడా గుర్తుచేశారు.ఇంకొక అమెరికన్ మహిళ విక్టోరియా కూడా ఇదే తరహా అనుభవాన్ని కొన్ని రోజులకు ముందు పంచుకున్నారు. ఆమె అమెరికా ఆరోగ్య వ్యవస్థను స్కామ్ అని అభివర్ణించారు. అమెరికాలో సుమారు 1000 డాలర్ల ఖరీదైన మందును భారత్లో కేవలం 25 డాలర్లకు కొనుగోలు చేయగలిగానని ఆమె తెలిపారు. అమెరికాలో సాధారణ ప్రజలు భారీ ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని ఆమె వ్యాఖ్యానించింది. View this post on Instagram A post shared by Liz & Shiv (@spicygori) -
అమెరికా డాలర్ కుప్పకూలుతుందా?: పీటర్ షిఫ్ హెచ్చరిక!
అమెరికన్ ఆర్థికవేత్త పీటర్ షిఫ్ (Peter Schiff) అమెరికా డాలర్ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పీటర్ షిఫ్ అభిప్రాయం ప్రకారం, అమెరికా డాలర్ విలువ భవిష్యత్తులో భారీగా పడిపోవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద స్థాయి సంక్షోభం రావచ్చని తెలుస్తోంది.2008లో జరిగిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసిన కొద్దిమంది విశ్లేషకులలో పీటర్ షిఫ్ కూడా ఒకరని చాలామంది చెబుతారు. ఆ సమయంలో అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడం, బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యలు రావడం వంటి అంశాలను ఆయన ముందే హెచ్చరించారని అంటారు. అందుకే ఆయన వ్యాఖ్యలకు కొంతమంది ఆర్థిక వర్గాల్లో ప్రాధాన్యం ఇస్తారు.ఇప్పుడు ఆయన డాలర్ గురించి చేస్తున్న వ్యాఖ్యల వెనుక ప్రధాన కారణం ఏమిటంటే.. అమెరికా ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం ఒత్తిడి కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు డాలర్పై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా దీర్ఘకాలంలో డాలర్ బలహీనపడే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆయన ''ఆర్థిక సంక్షోభానికి సిద్ధంగా ఉండాలి'' అనే హెచ్చరికలు ఇస్తున్నారు.🚨 BREAKING:THE MAN WHO PREDICTED THE 2008 CRASH, PETER SCHIFF, JUST SAID:"US DOLLAR WILL CRASH. PREPARE FOR A HISTORIC ECONOMIC COLLAPSE."HE PREDICTED THE 2008 CRASH AND CONTROLS OVER $2.18 BILLION NOWHE KNOWS SOMETHING BAD IS COMING... pic.twitter.com/d97gKHXJp4— ᴛʀᴀᴄᴇʀ (@DeFiTracer) July 2, 2026నిజానికి ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొందరు ఆయన హెచ్చరికలను తీవ్రమైన ప్రమాద సంకేతంగా చూస్తే, మరికొందరు వాటిని అతిశయోక్తిగా భావిస్తారు. డాలర్ ప్రపంచంలో ఇంకా అత్యంత బలమైన కరెన్సీగానే కొనసాగుతోంది, ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం, ట్రేడ్, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ స్థానం చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి డాలర్ విలువ తగ్గుతుందా? లేదా?, రానున్న రోజుల్లో ఆర్ధిక సంక్షోభం వస్తుందా? లేదా? అనే విషయాలను ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు.ఇదీ చదవండి: బంగారం ఉన్నవారికి శుభవార్త.. ఈ స్కీమ్తో భారీ లాభం! -
నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక అవార్డు!
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్పర్సన్, వ్యవస్థాపకురాలు అయిన నీతా అంబానీ అమెరికాలో ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. ఫ్లోరిడాలోని టాంపా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) ఆమెకు హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేశారు.ఈ అవార్డును ప్రధానంగా ఆరోగ్యం, విద్య, క్రీడలు, సంస్కృతి, సమాజ అభివృద్ధి వంటి రంగాల్లో అసాధారణ సేవలు చేసిన వ్యక్తులను గౌరవించడానికి ఇస్తారు. నీతా అంబానీ ఈ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించారు. ముఖ్యంగా సామాజిక సేవ, దాతృత్వ కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం ఆమె చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా ప్రశంసించారు.ఇదే కార్యక్రమంలో.. టాంపా మేయర్ జేన్ కాస్టర్, నీతా అంబానీకి ‘కీ టు ది సిటీ ఆఫ్ టాంపా’ను బహూకరించారు. ఇది అమెరికా అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలలో ఒకటి. సేవలను, వ్యక్తిత్వానికి, మానవతా దృక్పథం వంటి వాటికి గౌరవంగా 'ఈ నగరం మీకు స్వాగతం పలుకుతోంది' అనే సంకేతంగా ఈ గుర్తింపును ఇస్తారు.Reliance Foundation, Founder and Chairperson Mrs. Nita Ambani received the AAPI Humanitarian Award in Tampa, Florida, presented by the American Association of Physicians of Indian Origin. The award recognizes her extraordinary contributions to healthcare, education, sport,… pic.twitter.com/dDnqXEUUQd— Reliance Industries Limited (@RIL_Updates) July 3, 2026 -
ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్రం సీరియస్!
కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై అభ్యంతరకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం.. మెటాను వివరణ ఇవ్వాలని కోరింది.ఈ విషయంపై సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులకు మెటా ప్రతినిధులను పిలిపించి వివరణ కోరాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మెటా నుంచి పూర్తి వివరాలు తెలుసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ లేదా అలాంటి ప్రకటనలు సోషల్ మీడియా వేదికల్లో ఉండటం చాలా తీవ్రమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ వారం మెటాపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇది రెండోసారి. ఇటీవల వాట్సాప్లో యూజర్నేమ్ ఫీచర్ తీసుకురావాలన్న మెటా నిర్ణయంపై కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం ఈ ఫీచర్ అమల్లోకి వస్తే.. ఆన్లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉంది. ఫిషింగ్ దాడులు ఎక్కువ కావచ్చు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు పెరిగే ప్రమాదం ఉంది. ఇతరుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించడం సులభమవుతుంది. ఈ కారణాల వల్ల ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఆ ఫీచర్ను అమలు చేయవద్దని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.భారత ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ వంటి పెద్ద సోషల్ మీడియా సంస్థలు వినియోగదారుల భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అక్రమ కంటెంట్ను అరికట్టడం, వినియోగదారుల భద్రతను కాపాడడం వంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం మెటాకు హెచ్చరించింది. -
రైల్వే రికార్డ్.. రైలెక్కిన 63.81 కోట్ల మంది
దేశ ఆర్థిక వృద్ధికి ఇంజిన్గా నిలుస్తూ భారతీయ రైల్వే జూన్ 2026లో సరకు రవాణా, ప్రయాణికుల సేవల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. అధిక సరకు లోడింగ్, పెరిగిన ప్రయాణికుల రద్దీ, ఆధునిక సేవల విస్తరణతో సౌకర్యవంతమైన ప్రయాణానికి, సరకు రావాణా వృద్ధికి మొత్తంగా ఆర్థిక వృద్ధికి రైల్వే తోడ్పడుతోంది.ప్రయాణికుల రద్దీలోనూ జోరు జూన్ 2026లో ప్రయాణికుల రద్దీ సైతం స్థిరంగా పెరిగింది. గతేడాది ఇదే నెలలో 62.37 కోట్ల మంది ప్రయాణించగా, ఈసారి 63.81 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు. స్వల్ప, దూర ప్రయాణాలకు ప్రయాణికులను చేరవేసే నాన్–సబర్బన్ విభాగంలో 3.9 శాతం వృద్ధి నమోదైంది. ప్రయాణికుల సంఖ్య 28.90 కోట్ల నుంచి 30.04 కోట్లకు పెరిగింది. సబర్బన్ విభాగంలోనూ 0.9శాతం వృద్ధితో 33.46 కోట్ల నుంచి 33.77 కోట్లకు చేరినట్లు రైల్వే వివరించింది.ప్రీమియం రైలు సేవల విస్తరణతో భారతీయ రైల్వే ప్రయాణికుల సేవలను ఆధునీకరిస్తోంది. వందేభారత్ సరీ్వసుల సంఖ్య 164కు చేరింది. సామర్థ్య పెంపు, కార్యాచరణ సామర్థ్యం మెరుగుదల, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని చేపట్టే కార్యక్రమాల ద్వారా సమర్థవంతమైన లాజిస్టిక్స్, నమ్మదగిన ప్రయాణికుల సేవలు, ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలను అందించడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. జూన్ 2026లో భారతీయ రైల్వే 142.21 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసింది. గతేడాది ఇదే నెలలో 136.71 మిలియన్ టన్నులు రవాణా కాగా, ఈసారి 4 శాతం వృద్ధి నమోదైంది. సరకు రవాణా ద్వారా జూన్ 2025తో పోలిస్తే సుమారు రూ.430 కోట్ల అదనపు ఆదాయం వచి్చంది, ఇది 3 శాతం ఎక్కువ అని కేంద్ర రైల్వే శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాన వస్తువుల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎరువుల లోడింగ్ 19.1శాతం, ఇతర వస్తువుల రవాణాలో 17.3 శాతం వృద్ధి సాధించింది. ఇనుప ఖనిజం(9.4 శాతం), దేశీయ బొగ్గు(4.9శాతం), క్లింకర్ (7.2 శాతం) రవణాలోనూ వృద్ధిని కనబర్చింది. ఇది ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాల నుంచి కొనసాగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వశాఖ తెలిపింది. మొదటి త్రైమాసికంలో 419.08 మిలియన్ టన్నుల సరకు లోడ్ 2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రైల్వే 419.08 మిలియన్ టన్నుల సరకును లోడ్ చేసింది. 2025–26 ఇదే కాలంలో 413.05 మిలియన్ టన్నులు కాగా, ఈసారి స్వల్ప వృద్ధి నమోదైంది. ఇనుప ఖనిజం లోడింగ్ 7.44 శాతం, క్లింకర్ 6.54 శాతం, ఇతర వస్తువుల రవాణా 12.16% పెరిగినట్లు రైల్వేశాఖ పేర్కొంది. వేసవి కాలంలో థర్మల్ పవర్ స్టేషన్ల అవసరాలను తీర్చేందుకు గతేడాది జూన్తో పోలిస్తే ఈ జూన్లో పవర్ ప్లాంట్లకు 7 శాతం ఎక్కువ దేశీయ బొగ్గును రైల్వే సరఫరా చేసింది. దీంతో దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందినట్లు హర్షం వ్యక్తం చేసింది. -
రూ.2 కోట్లు సంపాదించే ఉద్యోగిని ఇంత సిల్లీగా తొలగించారా?
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ రూ.2 కోట్లు సంపాదించే ఓ ఉద్యోగిని కేవలం 1.95 డాలర్లు (సుమారు రూ.186) విలువైన కుకీని దొంగిలించాడనే ఆరోపణతో తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అతడు కుకీకి డబ్బులు చెల్లించినట్లు బ్యాంకు రికార్డులు నిరూపించడంతో కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో కార్యాలయాల్లో అమలవుతున్న జీరో-టాలరెన్స్ విధానాలు, సెల్ఫ్-చెక్అవుట్ వ్యవస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లేలో ఉన్న కెంటకీ ట్రక్ ప్లాంట్లో 11 సంవత్సరాలుగా ఎలక్ట్రిషియన్గా పనిచేసిన 60 ఏళ్ల కర్ట్ క్రోమ్ (Kurt Kromm) ఈ ఘటనకు కేంద్రబిందువయ్యాడు. ఈ ప్లాంట్లో ఫోర్డ్ సూపర్ డ్యూటీ పికప్ ట్రక్కులు, ఎక్స్పెడిషన్ ఎస్యూవీ, లింకన్ నావిగేటర్ వంటి వాహనాలు తయారవుతాయి.క్రోమ్ చెప్పిన వివరాల ప్రకారం, మే నెలలో రాత్రి షిఫ్ట్లో పనిచేస్తున్న సమయంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గడంతో క్యాంటీన్లోని సెల్ఫ్-సర్వీస్ కియోస్క్ వద్ద గ్రాండ్మాస్ చాక్లెట్ చిప్ కుకీ కొనుగోలు చేశాడు. మొదటి కియోస్క్లో కార్డు స్వైప్ చేసినప్పుడు లావాదేవీ విఫలమైనట్లు సందేశం కనిపించడంతో, పక్కనే ఉన్న మరో కియోస్క్లో మళ్లీ చెల్లించి కుకీ తీసుకున్నానని తెలిపాడు.వీడియో ఆధారంగా దొంగతనం ఆరోపణవారం రోజులకు అతడిని అధికారుల కార్యాలయానికి పిలిచి, సీసీటీవీ వీడియోలో కుకీకి చెల్లించకుండా తీసుకెళ్లినట్లు కనిపిస్తోందని, అందువల్ల ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేశారు. తన వద్ద ఎలాంటి వివరణ తీసుకోకుండా ప్లాంట్ నుంచి బయటకు పంపించారని క్రోమ్ ఆరోపించాడు. యూనియన్ ప్రతినిధులు క్షమాపణ చెప్పాలని సూచించినప్పటికీ, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి నిరాకరించాడు. గతేడాది తన సంపాదన 2 లక్షల డాలర్లని (రూ .1.9 కోట్లు), ఆఫీస్ క్యాంటీన్కే సుమారు 1,200 డాలర్లు (రూ .1.14 లక్షలు) ఖర్చు చేశానని, దొంగతనం చేయాల్సిన అవసరం తనకేంటని క్రోమ్ ప్రశ్నించారు.బ్యాంకు స్టేట్మెంట్తో బయటపడిన నిజంఇంటికి వెళ్లిన తర్వాత తన బ్యాంకు ఖాతాను పరిశీలించగా 1.95 డాలర్ల డెబిట్ లావాదేవీ విజయవంతంగా నమోదైనట్లు గుర్తించాడు. ఆ ఆధారాలను ఫోర్డ్ యాజమాన్యానికి, యూనియన్కు పంపించాడు. అనంతరం కియోస్క్ నిర్వహించే అరామార్క్ (Aramark) కూడా చెల్లింపు జరిగినట్లు ధ్రువీకరించింది. దీంతో ఫోర్డ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి ఉద్యోగంలో చేరాలని ఆహ్వానించింది.అయితే అప్పటికే క్రోమ్ తన ఇంటికి సమీపంలో మరో ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించాడు. గతంలో ఫోర్డ్లో పొందిన గంటకు 48 డాలర్ల వేతనం కంటే ఎక్కువగా కొత్త సంస్థలో 52.51 డాలర్లు, అదనంగా గంటకు 10 డాలర్ల బోనస్ లభించడంతో తిరిగి ఫోర్డ్లో చేరలేదు. ఉద్యోగం కోల్పోయిన ఐదు వారాల కాలానికి ఫోర్డ్ అతనికి బకాయి వేతనాన్ని కూడా చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఫోర్డ్ స్పందనవ్యక్తిగత ఉద్యోగుల వ్యవహారాలపై వ్యాఖ్యానించబోమని ఫోర్డ్ పేర్కొన్నప్పటికీ, "కొన్ని సందర్భాల్లో వ్యవహారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సి ఉండేదని తర్వాత తెలుస్తుంది. మా ఉద్యోగులతో న్యాయంగా వ్యవహరించాలనే లక్ష్యమే మా దృష్టి" అని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ఇలాంటి వివాదాలను పరిష్కరించే విధానాలను పునఃసమీక్షిస్తున్నట్లు కూడా సమాచారం. -
ఇంట్లో బంగారం ఉందా.. ఈ స్కీమ్తో భారీ లాభం!
భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన దేశ ప్రజలు బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా.. భవిష్యత్తు కోసం భద్రమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అయితే.. ఇళ్లలోని బంగారం, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉపయోగపడకుండా అలాగే ఉండిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (Gold Monetisation Scheme)ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కొత్త రూపంలో తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం.. ప్రజలు తమ ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగించేలా చేయడం. బంగారం డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లించేది. గడువు పూర్తయిన తర్వాత వారు బంగారం రూపంలో గానీ, దానికి సమానమైన నగదు రూపంలో గానీ తిరిగి పొందే అవకాశం ఉండేది. అయితే ఈ స్కీమ్ అనుకున్నంత సక్సెస్ కాలేదు.ఈ పథకం ఎందుకు విఫలమైంది?దాదాపు పది సంవత్సరాల కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే సేకరించారు. కానీ భారతీయుల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. దీన్నిబట్టి చూస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని తెలుస్తోంది.➤భారతీయ కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన లేదా భావోద్వేగ విలువ కలిగిన నగలను డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపలేదు.➤పన్ను సంబంధిత విచారణలు వస్తాయనే భయం ప్రజల్లో ఉంది.➤బ్యాంకులకు ఈ పథకం ద్వారా పెద్దగా లాభం లేకపోవడంతో వారు దీనిని ప్రోత్సహించలేదు.➤ప్రభుత్వం వడ్డీతో పాటు బంగారం ధర పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగింది.కొత్త మార్పులు ఏమిటి?గోల్డ్ మానిటైజేషన్ స్కీములో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలర్లు (బంగారు నగల వ్యాపారులు) కూడా కలెక్షన్ పార్ట్నర్లుగా పనిచేసే అవకాశం కల్పించడం.అంటే.. ఇప్పటి వరకు బంగారాన్ని కేవలం బ్యాంకుల ద్వారానే మాత్రమే డిపాజిట్ చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రజలు తమకు దగ్గరలో ఉన్న విశ్వసనీయ జ్యువెలర్ల వద్ద కూడా బంగారాన్ని ఇచ్చే అవకాశం ఉండవచ్చు. దీనివల్ల ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది, అలాగే మరింత బంగారం ఈ పథకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు➤ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది.➤విదేశాల నుంచి బంగారం దిగుమతుల అవసరం తగ్గుతుంది.➤డాలర్లపై భారతదేశం ఆధారపడటం తగ్గుతుంది.➤రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.➤దేశంలో బంగారం ఆధారిత వ్యాపారాలు మరింత పారదర్శకంగా మారతాయి.➤దిగుమతులు తగ్గడం వల్ల, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. భారతీయుల వద్ద ఉన్న బంగారంలో కేవలం 5 శాతం మాత్రమే ఈ పథకం ద్వారా సమీకరించినా, సుమారు 1,250 టన్నుల బంగారం లేదా 80-90 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. ఇది దాదాపు రెండేళ్ల పాటు బంగారం దిగుమతుల అవసరాన్ని తగ్గించే స్థాయిలో ఉంటుంది.ప్రధానమంత్రి పిలుపుఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఒక సంవత్సరం పాటు కొత్త బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 261.79 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 77,763.91 వద్ద, నిఫ్టీ 95.15 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,270.85 వద్ద నిలిచాయి.డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఏషియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్, సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్, సోలార్వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, వీల్స్ ఇండియా లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, సిమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, టీడీ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!
ఈ20 ఫ్యూయెల్ గురించి సోషల్ మీడియాలో అనేక విమర్శలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా E20 ఇంధనం వాడితే వాహనం మైలేజ్ తగ్గుతుందని, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరణకు గురవుతాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంతే కాకుండా.. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరలపై కూడా ఆయన స్పందించారు.E20 ఫ్యూయెల్ అంటే?E20 ఫ్యూయెల్ అంటే.. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన ఇంధనం. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి తయారయ్యే జీవ ఇంధనం (Biofuel). దీని వినియోగం వల్ల దిగుమతి చేసుకునే ముడి చమురు అవసరం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా కొంత మేర తగ్గుతుంది.ఈ20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గుతుందా?ఈ20 ఫ్యూయెల్ వాడితే మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంగీకరించారు. అయితే.. ఆ తగ్గుదల చాలా స్వల్పమని, అది వాహనం పరిస్థితి, డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులు వంటి అనేక అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపారు.ఇన్సూరెన్స్ క్లెయిమ్లపై స్పష్టతఈ20 ఫ్యూయల్ వాడితే వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరణకు గురవుతాయని వస్తున్న వార్తలను మంత్రి పూర్తిగా ఖండించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాయి. కాబట్టి ఈ20 పెట్రోల్ ఉపయోగించడం వల్ల ఇన్సూరెన్స్ రద్దు అవుతుందనే ప్రచారం నిజం కాదని చెప్పారు.ప్రస్తుతం దేశంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) అమలులో ఉంది. భవిష్యత్తులో 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం (E25, E27, E30) ప్రవేశపెట్టే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. అయితే అందుకు ముందు అవసరమైన అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే 22 శాతం, 25 శాతం, 27 శాతం, 30 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్కు సంబంధించిన BIS ప్రమాణాలను రూపొందించింది. అలాగే ఈ ఇంధనాలకు ఎక్సైజ్ సుంకంలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. అయితే ఇవి కేవలం నియంత్రణ పరమైన చర్యలేనని, వెంటనే అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టే ఉద్దేశం కాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం ఈ80 ఫ్యూయెల్ వినియోగించడానికి అనుకూలమైన కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. -
హైదరాబాద్లో జీతాలు ఎక్కువ.. జాబ్లు తక్కువ!
సాక్షి, సిటీబ్యూరో: అన్నీ ఉన్నా నిరుద్యోగుల ముంగిట శని అన్నట్టుగా ఉంది హైదరాబాద్ నగర పరిస్థితి. ఓ వైపు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, ఉద్యోగులకు అత్యధిక జీతాలు అందించే సిటీ ఉపాధి కల్పనలో మాత్రం చేతులెత్తేస్తోంది. ఈ వైరుధ్యాన్ని వెల్లడించాయి కేంద్ర గణాంకాల శాఖ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తొలి ‘నగర స్థాయి కారి్మక మార్కెట్ నివేదిక’ వెల్లడించింది. 46 నగరాలతో పోలిస్తే.. దాదాపు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న దేశంలోని 46 నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ ఉద్యోగాల నాణ్యత, వేతనాలు, ఉత్పాదకతలో ముందంజలో ఉంది. ఆశించిన స్థాయిలో నిరుద్యోగ నిర్మూలన జరగలేదని యువత ఉపాధి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తేల్చింది. హైదరాబాద్లో ప్రస్తుతం నిరుద్యోగ రేటు 6.8 శాతంగా నమోదైంది. ఇది మిలియన్ ప్లస్ నగరాల సగటు 4.9 శాతం కంటే ఎక్కువ. బెంగళూరు (2.8%), సూరత్ (1%), హౌరా (0.8%), రాజ్కోట్ (0.3%) వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో నిరుద్యోగం చాలా అధికంగా ఉంది. ఉద్యోగ నాణ్యతలో మేటి.. ఉద్యోగాల నాణ్యత పరంగా హైదరాబాద్కు మంచి స్థానం దక్కింది. నగరంలోని ఉద్యోగుల్లో 62.1 శాతం మంది రెగ్యులర్ వేతన ఉద్యోగాల్లో ఉండగా, మిలియన్ ప్లస్ నగరాల సగటు 58.5 శాతంగా ఉంది. ఇది హైదరాబాద్లో స్థిరమైన ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. రెగ్యులర్ వేతన ఉద్యోగుల సగటు నెలవారీ ఆదాయం రూ.31,153 కాగా, మిగిలిన నగరాల సగటు రూ.28,808 మాత్రమే. స్వయం ఉపాధి పొందుతున్న వారి సగటు నెలవారీ ఆదాయం రూ.30,075, రోజువారీ కూలీల సగటు వేతనం రూ.784గా నమోదైంది. ఉపాధి.. ఏదీ..? లేబర్ ఫోర్స్ పారి్టసిపేషన్ రేట్ హైదరాబాద్లో 55.5 శాతంగా నమోదై, మిగతా నగరాల సగటు 52.4 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే ఉద్యోగాల కోసం ప్రయతి్నంచేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, అందరికీ ఉపాధి లభించడం లేదని నివేదిక పేర్కొంది. యువత పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. 15 నుంచి 29 ఏళ్ల వయసు యువతలో 25.1 శాతం మంది ఉద్యోగంలో కానీ విద్యార్జనలో గానీ లేరు. ఇందులో యువతుల శాతం 37.3 ఉండగా, యువకుల శాతం 12.6 మాత్రమే ఉండటం గమనార్హం. -
‘అపార్ట్మెంట్ కొన్నాను.. చింతిస్తున్నాను’
సొంత ఇల్లు అనేది సగటు మధ్యతరగతి భారతీయుడి జీవితకాల కల. కానీ, సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా మారుతున్న ఆదాయ వనరులను అంచనా వేయడంలో పొరపాటుపడితే ఆ కల కాస్తా జీవితాంతం వెంటాడే పీడకలగా ఎలా మారుతుందో వివరించే ఒక తాజా ఉదాహరణ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ రెడ్డిట్లోని ‘ఆర్/పర్సనల్ ఫైనాన్స్ ఇండియా’ హ్యాండిల్ ద్వారా ఒక వ్యక్తి పంచుకున్న తన అనుభవం నేటి యువతరం ఆలోచింపజేసేదిలా ఉంది. ‘ఒక అపార్ట్మెంట్ కొన్నాను.. ఇప్పుడు చింతిస్తున్నాను’ అనే శీర్షికతో అతను పెట్టిన పోస్ట్ రియల్ ఎస్టేట్ మోజులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వేలాది మంది ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల స్థితికి అద్దం పడుతోంది.రూ.25 లక్షల జీతం.. రూ.1.5 కోట్ల ఫ్లాట్!ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఏడాది క్రితం అతను రూ.1.5 కోట్ల విలువైన ఒక అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడు. 2024లో అతని వార్షిక ఆదాయం దాదాపు రూ.25 లక్షలు. ఆ ధీమాతోనే అతను అంత పెద్ద మొత్తానికి హోమ్లోన్ తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే 2025లో అతని ఆదాయం రూ.32 లక్షలకు పెరిగింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.ఆ వ్యక్తి వేతన నిర్మాణం స్థిరంగా లేదు. అది పూర్తిగా కమీషన్లపై ఆధారపడి ఉంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల అతని వ్యాపారం ఒక్కసారిగా దెబ్బతింది. ఫలితంగా అతని నెలవారీ ఆదాయం గణనీయంగా పడిపోయింది.ప్రస్తుత పరిస్థితి‘ఇప్పుడు నా చేతికి వచ్చే జీతం కేవలం హోమ్ లోన్ ఈఎంఐ (ఈఎంఐ), ప్రాథమిక ఖర్చులకు మాత్రమే సరిపోతోంది. నిలదొక్కుకోవడానికి పార్ట్ టైమ్ జాబ్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసి ఉంటే బాగుండేది’ అని ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.ఊహించని ఖర్చులురుణ భారం ఒకవైపు వేధిస్తుంటే ఆస్తి కొనుగోలు తర్వాత వచ్చే అదనపు ఖర్చులు అతనిని కోలుకోలేని దెబ్బ తీశాయి. అపార్ట్మెంట్ సొసైటీ మెయింటెనెన్స్, ఇతర రిపేర్ల కోసం ఏకంగా రూ.2.5 లక్షలు ఖర్చయింది. ఇంట్లో తలెత్తిన ప్లంబింగ్ లోపాల వల్ల మరో రూ.50,000 అదనపు భారం పడింది. ఇవన్నీ భరిస్తూ రావడం వల్ల అతని వద్ద ఉన్న లిక్విడ్ ఎమర్జెన్సీ ఫండ్ రూ.5 లక్షలకు పడిపోయింది.మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ రూపంలో మరో రూ.10 లక్షల పెట్టుబడులు ఉన్నప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితి వస్తే తప్ప వాటిని విక్రయించడానికి అతను ఇష్టపడటం లేదు. ఫ్లాట్ కొన్న వెంటనే దాన్ని రీసేల్ చేయడం కష్టమని, ఈ ఊబి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదంటూ తోటి నెటిజన్లను సలహా కోరాడు.నెటిజన్ల రియాక్షన్‘జరిగిందేదో జరిగింది. ఒకవేళ మీ వ్యాపారం బాగా నడిచి ఉంటే మీరు ఇలా ఆలోచించేవారు కాదు. ఇది కూడా గడిచిపోతుంది. ధైర్యంగా ఉండండి’ అని ఒకరు భరోసా ఇచ్చారు. ‘నష్టాన్ని తగ్గించుకోవాలంటే వెంటనే ఆస్తిని విక్రయించండి. రీసేల్ మార్కెట్లో అపార్ట్మెంట్ అమ్మడం కష్టమే. బ్రేక్-ఈవెన్ (పెట్టిన పెట్టుబడి వస్తే చాలు) స్థాయికి వచ్చినా సరే నష్టాన్ని భరించి ఆస్తిని వదిలించుకుని అప్పు తీర్చండి’ అని మెజారిటీ నెటిజన్లు సలహా ఇచ్చారు.గుర్తుంచుకోవాల్సిన అంశాలు..మీ నెలవారీ నికర ఆదాయంలో హోమ్ లోన్ ఈఎంఐ ఎప్పుడూ 15% నుంచి 20% మించకూడదు. (ఇక్కడ బాధితుడు తన గరిష్ట ఆదాయాన్ని బట్టి లోన్ తీసుకుని ఇరుక్కుపోయాడు.వేరియబుల్ లేదా కమీషన్ ఆధారిత ఆదాయం ఉన్నవారు స్థిరమైన ఉద్యోగుల కంటే తక్కువ అప్పు తీసుకోవడం శ్రేయస్కరం.ఇల్లు కొనడమంటే కేవలం రిజిస్ట్రేషన్ ఖర్చే కాదు.. మెయింటెనెన్స్, ఇంటీరియర్, రిపేర్లు వంటి అదనపు ఖర్చుల కోసం కనీసం 5% నిధిని ముందే దాచుకోవాలి.సొంతింటి కల సాకారం చేసుకోవడం తప్పు కాదు కానీ అది మీ ప్రస్తుత ఆర్థిక స్వేచ్ఛను, మనశ్శాంతిని హరించేలా ఉండకూడదు. -
లాంచ్కు ముందే అమ్ముడైపోయాయ్!: ధర ఎంతంటే?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'కొడియాక్ ఆర్ఎస్' కారును స్కోడా ఆటో ఇండియా దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 66.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ దీనిని సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) ద్వారా దిగుమతి చేసుకుంటుంది.స్కోడా లాంచ్ చేసిన ఈ కొత్త కొడియాక్ ఆర్ఎస్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన తరువాత.. ఆరు నిమిషాల వ్యవధిలోనే అన్నీ అమ్ముడైపోయాయి. దీన్నిబట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో దీనికున్న డిమాండ్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.స్కోడా కొడియాక్ ఆర్ఎస్ కార్లను కంపెనీ మన దేశానికి కేవలం 50 యూనిట్లను మాత్రమే పరిమితం చేసింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను పెంచే అవకాశం ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా పనిచేసే ఈ లేటెస్ట్ మోడల్ 265 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.స్కోడా కొడియాక్ ఆర్ఎస్ 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీంతో ఇది భారతదేశంలో ఇప్పటివరకు లాంచ్ అయిన అత్యంత వేగవంతమైన స్కోడా మోడల్గా నిలిచింది. ఆర్ఎస్ వేరియంట్లో ప్రోగ్రెసివ్ స్టీరింగ్, 15 అడ్జస్టబుల్ సెట్టింగ్లతో కూడిన అడాప్టివ్ డాంపర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇది చూడటానికి స్టాండర్డ్ కొడియాక్ మాదిరిగా కనిపించినప్పటికీ.. కొన్ని అప్గ్రేడ్లను పొందుతుంది. వీటిలో రీడిజైన్ బంపర్లు, ఆర్ఎస్ బ్యాడ్జింగ్, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పెద్ద రూఫ్ స్పాయిలర్, డ్యూయల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి ఉన్నాయి. గ్రిల్, ORVMలు, విండో ఫ్రేమ్లు, రూఫ్ రైల్స్, డీ-పిల్లర్ అంతటా గ్లాస్ బ్లాక్ ఎలిమెంట్స్ను ఉపయోగించారు. ఈ SUV వెల్వెట్ రెడ్, మ్యాజిక్ బ్లాక్, మూన్ వైట్, స్టీల్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. కొడియాక్ ఆర్ఎస్ కారులో 12.9-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆర్ఎస్ స్పెషల్ గ్రాఫిక్స్తో కూడిన 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తుంది. పనోరమిక్ సన్రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్, హీటింగ్ అండ్ మసాజ్ ఫంక్షన్లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 13-స్పీకర్ల కాంటన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం, ఈ SUVలో తొమ్మిది ఎయిర్బ్యాగ్లు, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ సిస్టం వంటివి ఉన్నాయి. ఇది ఫోక్స్వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్కు పోటీగా ఉంది. -
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు రూ.11 లక్షలకే..
భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మరింత మంది వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘క్రెటా ఎలక్ట్రిక్’ కోసం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్ను ప్రవేశపెట్టింది. దీంతో బ్యాటరీ ధరను వాహనం ధర నుంచి వేరు చేయడం ద్వారా క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ఎక్స్షోరూమ్ ధరను రూ.10.99 లక్షలకు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానాన్ని కంపెనీ తాజాగా అధికారికంగా ప్రకటించింది.ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో అధిక ప్రారంభ వ్యయం ప్రధాన అడ్డంకిగా ఉండేది. కొత్త బాస్ మోడల్లో వినియోగదారులు కారును తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా సబ్స్క్రిప్షన్ లేదా ఈఎంఐ విధానాన్ని ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాటరీ ఈఎంఐ ఖర్చు కిలోమీటరుకు రూ.3.90 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం తగ్గి, ఈవీ యాజమాన్యం మరింత అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది.ఫీచర్లలోనూ అప్డేట్బాస్ మోడల్తో పాటు క్రెటా ఎలక్ట్రిక్లో కొన్ని కొత్త ఫీచర్లను కూడా హ్యుందాయ్ జోడించింది. అన్ని సంబంధిత వేరియంట్లలో ‘ఇంటిగ్రేటెడ్ సైడ్ ఫుట్ స్టెప్’ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో వాహనంలోకి ఎక్కడం, దిగడం మరింత సులభంగా ఉంటుంది. అలాగే వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హోమ్ ఛార్జర్ వేరియంట్లలో 7.4 కిలోవాట్ల వాల్బాక్స్ ఛార్జర్ను ప్రామాణికంగా అందిస్తోంది.రెండు బ్యాటరీ ప్యాక్లు.. 510 కి.మీ వరకు రేంజ్క్రెటా ఎలక్ట్రిక్లో 42 కిలోవాట్లు, 51.4 కిలోవాట్లు అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు కొనసాగుతున్నాయి. పెద్ద బ్యాటరీతో కూడిన లాంగ్-రేంజ్ వేరియంట్కు ఒకసారి పూర్తి ఛార్జ్తో గరిష్టంగా 510 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ (ARAI సర్టిఫైడ్) లభిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్తో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 39 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. లాంగ్-రేంజ్ వేరియంట్ 0 నుంచి 100 కిమీ వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుంది.ప్రీమియం టెక్నాలజీ ఫీచర్లుక్రెటా ఎలక్ట్రిక్లో వెహికల్-టు-లోడ్ (V2L), హ్యుందాయ్ స్మార్ట్సెన్స్ లెవల్-2 ADAS, ఐ-పెడల్ సింగిల్ పెడల్ డ్రైవింగ్, డిజిటల్ కీ, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ కూడా కంపెనీ అందిస్తోంది.ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణదేశంలో ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హ్యుందాయ్ తన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 183 ప్రాంతాల్లో 214 డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, మొత్తం 399 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే మైహ్యుందాయ్ యాప్లోని ఈవీ ఛార్జ్ ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను వినియోగదారులు గుర్తించి ఉపయోగించుకోవచ్చని తెలిపింది. -
ఆ దేశంలో మాదిరి అయితే.. లీవ్లు కష్టమే!
ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని తిరిగి వృద్ధి బాట పట్టించేందుకు ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 34 అంశాలతో కూడిన భారీ సంస్కరణల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఉద్యోగుల అనారోగ్య సెలవులపై కఠిన నిబంధనలు, మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రాయితీలు, పెన్షన్ వ్యవస్థలో మార్పులు, బ్యూరోక్రసీ తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఈ ఏడాది చివరికల్లా పార్లమెంట్లో ఆమోదింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇక నుంచి డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిప్రస్తుతం జర్మనీలో ఉద్యోగులు కొన్ని సందర్భాల్లో తొలి మూడు రోజుల వరకు డాక్టర్ను ప్రత్యక్షంగా కలవకుండానే అనారోగ్య సెలవు పొందే అవకాశం ఉంది. కొత్త సంస్కరణల ప్రకారం, ఉద్యోగి మొదటి రోజు నుంచే వైద్యుడి ధ్రువీకరణ పత్రం (మెడికల్ సర్టిఫికెట్) సమర్పించాలని యజమాని కోరే హక్కు ఉంటుంది. అలాగే ఫోన్ ద్వారా అనారోగ్య సెలవు ధ్రువీకరణ పొందే విధానానికీ ముగింపు పలకనున్నారు. దేశంలో అనారోగ్య సెలవుల రేటు అసాధారణంగా పెరగడం ఉత్పాదకతను దెబ్బతీస్తోందని మెర్జ్ ప్రభుత్వం వాదిస్తోంది.మధ్యతరగతికి పన్ను ఊరటసంస్కరణల్లో భాగంగా తక్కువ, మధ్య ఆదాయ కుటుంబాలకు ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం కల్పించనున్నారు. 2028 నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత, ఇద్దరు పిల్లలు ఉన్న, ఏడాదికి 60 వేల యూరోలు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న కుటుంబానికి సుమారు 600 యూరోలు పన్ను ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం మీద సంవత్సరానికి సుమారు 10 బిలియన్ యూరోల పన్ను ఉపశమనం కల్పించనున్నట్లు వెల్లడించింది.పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులువృద్ధాప్య జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పెన్షన్ వ్యవస్థను దీర్ఘకాలికంగా నిలబెట్టేందుకు పదవీ విరమణ వయస్సును ఆయుర్దాయానికి అనుగుణంగా దశలవారీగా పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దీంతో భవిష్యత్తులో ఉద్యోగులు చెల్లించే పెన్షన్ చందాలపై అధిక భారం పడకుండా చూడడమే లక్ష్యమని తెలిపింది.రెడ్టేప్కు కత్తెరవ్యాపారాలకు అడ్డంకిగా మారిన అనవసర అనుమతులు, రిపోర్టింగ్ నిబంధనలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియలను సరళీకృతం చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటలైజేషన్కు ప్రాధాన్యం ఇస్తూ పరిపాలనా వ్యయాన్ని తగ్గించే చర్యలకూ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఎందుకు ఈ సంస్కరణలు?గత రెండేళ్ల ఆర్థిక మందగమనం, అధిక ఇంధన ధరలు, చైనా కంపెనీల పోటీ, తగ్గిన ప్రైవేట్ పెట్టుబడులు, వృద్ధాప్య జనాభా, అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిళ్ల నేపథ్యంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లు ఎదుర్కొంటోంది. 2026లో కేవలం 0.5 శాతం వృద్ధినే ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంస్కరణలు తీసుకొచ్చినట్లు మెర్జ్ పేర్కొన్నారు. -
మెటా కలలు కల్లలైన వేళ
కృత్రిమ మేధ సాంకేతికతలో అగ్రగామిగా నిలవాలని భావించిన సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, అంతర్గత పునర్నిర్మాణం తర్వాత కూడా తాము ఆశించిన స్థాయిలో ఏఐ ఏజెంట్ల అభివృద్ధి సాగడం లేదని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ బహిరంగంగానే అంగీకరించారు. సంస్థలో జరిగిన భారీ మార్పులు ఆశించినంత సాఫీగా సాగలేదని, ఏఐ ఏజెంట్ల అభివృద్ధి పథం గత నాలుగు నెలలుగా నెమ్మదించిందని ఆయన అంతర్గత సంభాషణల్లో పేర్కొనడం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశంగా మారింది.ఏఐ కోసం భారీ కోతలు.. అయినా తప్పని నిరాశకంపెనీని పూర్తిగా ఏఐ కేంద్రీకృత సంస్థగా మార్చాలనే పట్టుదలతో మెటా ఇటీవల తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో దాదాపు 10 శాతం (సుమారు 8,000 మంది) ఉద్యోగులపై వేటు వేసింది. అలాగే గతంలో భర్తీ చేయాలనుకున్న 6,000 ఖాళీలను రద్దు చేసింది. మరోవైపు, సుమారు 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ బృందాల్లోకి మార్చింది. ఇంతటి భారీ మార్పులు చేసినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవని జుకర్బర్గ్ వ్యాఖ్యానించారు.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ‘కనీసం నాలుగు నెలలుగా ఏజెంటిక్ డెవలప్మెంట్ మేము ఊహించిన విధంగా వేగవంతం కాలేదు’ అని జుకర్బర్గ్ పేర్కొన్నారు. వినియోగదారుల తరఫున స్వయంగా పనులు చేయగల అధునాతన సాధనాలనే ఏఐ ఏజెంట్లు అంటారు. వీటి అభివృద్ధి మందగించడం మెటా వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారింది.అసంతృప్తిలో ఉద్యోగులుఏఐ మౌలిక సదుపాయాల కోసం మెటా ఈ ఏడాది ఏకంగా 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలని అంచనా వేసింది. మరెక్కడా లేని విధంగా నిధులను ఏఐ వైపు మళ్లిస్తున్నప్పటికీ అంతర్గత పునర్నిర్మాణం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ ఏడాది మార్చిలో అప్లైడ్ ఏఐ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇతర విభాగాల నుంచి 6,500 మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను ఇందులోకి మార్చారు. అయితే, ఈ ఆకస్మిక మార్పులపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఆర్థిక సంస్థలకు ఏఐ సైబర్ ముప్పు
దేశీయ ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, అంతే స్థాయిలో సైబర్ ముప్పు పొంచి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన తాజా ‘ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్’ (ఎఫ్ఎస్ఆర్)లో ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ ఐటీ, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకోవాలని తెలిపింది. రాబోయే 12 నెలల్లో ఏఐ ఆధారిత సైబర్ దాడులే ఆర్థిక రంగానికి అతిపెద్ద సవాలుగా మారనున్నాయని ఆర్బీఐ ఈ నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది.ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంప్రపంచవ్యాప్తంగా ఇతర ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంపైనే అత్యధిక సంఖ్యలో సైబర్ దాడులు జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా రష్యా, ఉక్రెయిన్ తర్వాత అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ఆర్థిక సంస్థల్లో 42 శాతం సంస్థలు భౌగోళిక అనిశ్చితి కారణంగానే సైబర్ దాడుల ముప్పు తీవ్రతరమైందని అంగీకరించాయి.ఆర్థిక స్థిరత్వానికి విఘాతం‘డిజిటల్ పరిజ్ఞానంతో ముడిపడి ఉన్న ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఒక్క సైబర్ దాడి జరిగినా అది మొత్తం వ్యవస్థను కుదిపేస్తుంది. సేవల నిలిపివేత, డేటా చోరీ, పేమెంట్ వ్యవస్థల్లో అంతరాయాల వల్ల ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న నమ్మకం సడలిపోతుంది’ అని ఆర్బీఐ హెచ్చరించింది.ఏఐ సవాళ్లు - సన్నద్ధతలో వెనుకబాటు2020 నుంచి డిజిటల్ ఆర్థిక సేవల వినియోగం విపరీతంగా పెరగడంతో సైబర్ నేరగాళ్లకు మరిన్ని అవకాశాలు చిక్కాయని నివేదిక తెలిపింది. దేశంలోని 33 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, 10 అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీల ఆధారంగా ఆర్బీఐ ఈ సర్వే నిర్వహించింది. ఏఐ సాంకేతికత వేగంగా విస్తరిస్తుండటంతో సైబర్ దాడుల తీవ్రత, వేగం, పరిధి ఊహించని స్థాయికి చేరాయని స్పష్టం చేసింది. అయితే, ఈ ఏఐ ముప్పును ఎదుర్కొనేందుకు మన ఆర్థిక సంస్థల సన్నద్ధత ఇంకా ప్రాథమిక దశల్లోనే ఉందని సర్వే గణాంకాలు చెబుతున్నాయి.మెజారిటీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఏఐ రక్షణ వ్యవస్థల్లో ఇంకా అభివృద్ధి చెందుతున్న లేదా మధ్యస్థ దశలోనే ఉన్నాయి.ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేలా పూర్తిస్థాయి సన్నద్ధత సాధించిన సంస్థల సంఖ్య చాలా తక్కువగా ఉంది.ఈ నేపథ్యంలో ప్రస్తుత సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ను మరింత బలోపేతం చేస్తూ.. నిరంతర నిఘా, ఉద్యోగుల్లో అవగాహన, తక్షణ స్పందన వంటి చర్యలపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ఆర్బీఐ సూచించింది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
దౌడు తీసిన బంగారం, వెండి ధరలు..
దేశంలో బంగారం, వెండి ధరల పరుగులు ఆగడం లేదు. క్రితం రోజున భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు మరింత దౌడు తీశాయి. ఇక వెండి ధరలూ అదే దారిలో పరుగులు పెట్టాయి. దీంతో ఈరోజూ కొనుగోలుదారులకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
560 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:41 సమయానికి నిఫ్టీ(Nifty) 186 పాయింట్లు ఎగబాకి 24,362 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 563 పాయింట్లు పెరిగి 78,062 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.78బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.02 శాతం తగ్గింది.నాస్డాక్ 0.8 శాతం నష్టపోయింది.Today Nifty position 03-07-2026(time: 09:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆడిట్ కమిటీలో ఎండీ సభ్యుడిగా ఉంటే ఏం జరగొచ్చు!
కార్పొరేట్ రంగంలో పారదర్శకతకు, సమర్థవంతమైన నిర్వహణకు ఆడిట్ కమిటీ (ఏసీ) కీలకం. కంపెనీల చట్టం, సెబీ నిబంధనల ప్రకారం ఆడిట్ కమిటీలో మెజారిటీ సభ్యులు స్వతంత్ర డైరెక్టర్లు అయి ఉండాలి. అలాగే కమిటీ చైర్మన్ తప్పనిసరిగా స్వతంత్ర డైరెక్టరే కావాలి. ఆయనకు ఆర్థిక విషయాలపై పూర్తి అవగాహన ఉండాలి (చార్టర్డ్ అకౌంటెంట్ కానవసరం లేదు). అయితే, కమిటీలోని మిగిలిన సభ్యులుగా ఎవరిని నియమించాలనే విషయమై భిన్నమైన పద్ధతులు వాడుకలో ఉన్నాయి. కొందరు నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమిస్తే, మరికొందరు మేనేజింగ్ డైరెక్టర్ లేదా హోల్-టైమ్ డైరెక్టర్లను సభ్యులుగా ఉంచుతారు. ఇంకొన్ని కంపెనీలు కేవలం స్వతంత్ర డైరెక్టర్లతోనే కమిటీని ఏర్పాటు చేస్తాయి.ఈ నేపథ్యంలో ఆడిట్ కమిటీలో కంపెనీ ఎండీ సభ్యుడిగా ఉండటం మంచిదా? లేదా కేవలం ఆహ్వానితుడిగా (ఇన్వైటీ) ఉండటం శ్రేయస్కరమా? అనే అంశంపై కార్పొరేట్ విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన అంశాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.సభ్యుడిగా ఎండీ: ప్రయోజనాలు - సవాళ్లుకంపెనీల చట్టం ప్రకారం ఎండీ అనే వ్యక్తి కేవలం ఒక డైరెక్టర్ మాత్రమే కాదు, సంస్థ రోజువారీ నిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకునే కీలక వ్యక్తి. ఆయనను ఆడిట్ కమిటీలో సభ్యుడిగా చేర్చడం వల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదురవుతాయి.ఆడిట్ కమిటీ ఎజెండాలోని చాలా అంశాలకు ఎండీ లేదా సీఎఫ్ఓ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎండీ స్వయంగా సభ్యుడిగా ఉంటే చర్చలు వేగంగా సాగుతాయి.కంపెనీ ఆర్థిక నివేదికలపై ఎండీ సంతకం చేస్తారు. ఇన్వెస్టర్లు, అనలిస్టుల సమావేశాలను ఆయనే నడిపిస్తారు. అలాంటప్పుడు ఆడిట్ కమిటీలో సభ్యుడిగా కూర్చున్నప్పుడు ప్రయోజనాల ఘర్షణ వచ్చే అవకాశం ఉంది.ఉదాహరణకు: ఏదైనా ఆస్తి విలువ తగ్గింపు విషయంలో స్టాట్యూటరీ ఆడిటర్లు, స్వతంత్ర డైరెక్టర్లు ఏకీభవించారనుకుందాం. కానీ ఎండీ మాత్రం వ్యాపార దృక్పథంతో అది అవసరం లేదని భావిస్తే.. సభ్యుడిగా ఆయన తన అభ్యంతరాన్ని ఎలా రికార్డు చేస్తారు? అక్కడ మెజారిటీ నిర్ణయమే చెల్లినప్పటికీ సభ్యుడిగా ఉన్న ఎండీకి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే.ఆహ్వానితుడిగా (ఇన్వైటీ) ఉంటే కలిగే వెసులుబాటుఎండీ సభ్యుడిగా కాకుండా కేవలం ఆహ్వానితుడిగా కమిటీ సమావేశాలకు హాజరైతే సమీక్షలు మరింత పారదర్శకంగా సాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎండీ కేవలం ఆహ్వానితుడిగా ఉన్నప్పుడు ఆడిటర్లు ఎలాంటి సంకోచం లేకుండా సంస్థలోని లోటుపాట్లను, గ్రే-ఏరియాలను (సందేహాస్పద అంశాలను) కమిటీ ముందు ఉంచగలరు.ఆహ్వానితుడిగా ఎండీ తన పరిధిలోని అంశాలపై స్పష్టమైన వివరణ ఇవ్వడానికి కట్టుబడి ఉంటారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. చాలా లిస్టెడ్ కంపెనీలు సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులను కేవలం ఆహ్వానితులుగా పిలుస్తూ ఎజెండా ప్రకారం వారి నుంచి సమాధానాలు రాబట్టే పద్ధతిని పాటిస్తున్నాయి.కొన్ని ప్రముఖ లిస్టెడ్ కంపెనీల్లో నిర్వహించిన సర్వే ప్రకారం.. మెజారిటీ సంస్థలు ఎండీని ఆడిట్ కమిటీలో సభ్యుడిగా కాకుండా ఆహ్వానితుడిగా ఉంచడానికే మొగ్గు చూపుతున్నాయి. ఇది చర్చలు నిష్పాక్షికంగా సాగడానికి దోహదపడుతుందని తేలింది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
విధానాల మార్పుతోనే గృహ సంక్షోభానికి విరుగుడు!
భారతదేశంలో సొంతిల్లు అనేది సగటు పౌరుడి జీవితకాల స్వప్నం. కానీ, ప్రస్తుత పట్టణ భారతదేశంలో (అర్బన్ ఇండియా) ఇళ్ల ధరలు సామాన్యుడికి, మధ్యతరగతికి అందనంత ఎత్తుకు చేరాయన్నది కాదనలేని చేదు నిజం. ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనాలు కాకుండా మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. అసలు సమస్య ఎక్కడుందంటే..మన ప్రస్తుత పట్టణ గృహ నిర్మాణ, భూవిధానాల్లోనే లోపాలు ఉన్నాయి. ఈ విధానాలను సమూలంగా మార్చితే తప్ప ఇళ్ల ధరలు అదుపులోకి రావు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి సరికొత్త ఆలోచనలతో కూడిన కొన్ని సూత్రాలను మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.మెట్రో నగరాల విస్తరణకు బ్రేక్..ప్రస్తుతం ఉన్న ప్రధాన మెట్రో నగరాలు ఇప్పటికే తమ సామర్థ్యానికి మించి విస్తరించాయి. సహేతుకమైన ఖర్చుతో వీటిని మరింత విస్తరించడం ఇక సాధ్యం కాదు. దీనికి పరిష్కారం..మనం సరికొత్త నగరాలను నిర్మించాలి లేదా ప్రస్తుతం ఉన్న చిన్న నగరాలను వ్యవస్థీకృతంగా విస్తరించాలి. అయితే ప్రభుత్వాలు ఒంటరిగా ఈ పని చేయలేవు. పేరున్న ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యేలా పబ్లిక్ పాలసీ ఉండాలి. ఈ విస్తరణ కేవలం ఇళ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా ఉద్యోగ, ఉపాధి, రవాణా రంగాల మేళవింపుతో సమగ్రంగా సాగాలి. అప్పుడే ప్రజలు దశలవారీగా ఆయా కొత్త ప్రాంతాలకు తరలివస్తారు. దీనివల్ల కొత్త పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా తగ్గి ఆకర్షణీయంగా మారుతాయి.మితిమీరిన ఆంక్షల తొలగింపుప్రస్తుతం ఉన్న పెద్ద నగరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై ఉన్న మితిమీరిన ఆంక్షలను దశలవారీగా ఎత్తివేయాలి. మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’ పెంచడానికి అనుమతించాలి. అంతేకాకుండా, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) వంటి నియంత్రణ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలి. దీనివల్ల మార్కెట్లోకి ఇళ్ల సరఫరా పెరుగుతుంది.ల్యాండ్ ప్రైస్ డైనమిక్స్పైన పేర్కొన్న విధంగా పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టినప్పుడు స్వల్పకాలంలో భూమి ధరలు పెరగొచ్చు. కానీ దీర్ఘకాలిక ఫలితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పట్టణ భారతదేశంలో ఇళ్ల సంఖ్య భారీగా పెరిగిన తర్వాత ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన ఇళ్ల ధరలు క్రమంగా తగ్గుతాయి. ఇళ్ల మార్కెట్ ధర తగ్గినప్పుడు దానికి అనుగుణంగా పట్టణ భూముల ధరలు కూడా దిగివస్తాయి.ఇన్వెస్టర్ల డిమాండ్ను నియంత్రించడం..ప్రభుత్వ విధానాల వల్ల ఇళ్ల ధరలు తగ్గడం ప్రారంభమైతే రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు తగ్గుతుంది. ఫలితంగా నిజమైన అవసరమున్న సగటు కొనుగోలుదారులకు ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికి కారణం..బ్యాంకు డిపాజిట్లపై వచ్చే ద్రవ్యోల్బణ, పన్నుల అనంతర ఆదాయం చాలా తక్కువగా ఉండటమే. ప్రభుత్వ రంగ బ్యాంకుల విధానాలు, పన్ను చట్టాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పన్ను చట్టాల్లో మార్పులు చేయడం ద్వారా ఈ రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను రియల్ ఎస్టేట్ నుంచి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక మార్గాల వైపు మళ్లించవచ్చు.బ్లాక్మనీకి అడ్డుకట్టరియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ల డిమాండ్కు మరో ప్రధాన కారణం..నల్లధనాన్ని ఇక్కడ దాచవచ్చనే నమ్మకం. ఈ నల్లధనాన్ని ఇక్కడ అనుమతించకపోతే అది బంగారం రూపంలోనో లేదా హవాలా మార్గంలో విదేశాలకో వెళ్లిపోతుందని, తద్వారా దేశ మూలధనం బయటకు పోతుందని కొందరు వాదిస్తారు. కానీ సమస్య నల్లధనాన్ని ఎక్కడో ఒకచోట సర్దడం కాదు. అసలు నల్లధనం పుట్టకుండా చేయడమే ముఖ్యం. బ్లాక్మనీ వ్యవస్థలోకి రాకుండా అడ్డుకుంటే రియల్ ఎస్టేట్ ధరలు ఆటోమేటిక్గా దిగివస్తాయి.క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ సడలింపు..రియల్ ఎస్టేట్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్థిక ఆస్తుల్లో పెట్టుబడి పెడితే దానికి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ను కొన్ని సంవత్సరాల పాటు తగ్గించాలి. దీనివల్ల ఇన్వెస్టర్లు తాము కొని ఖాళీగా ఉంచిన ప్రాపర్టీలను విక్రయించడానికి ముందుకొస్తారు. తద్వారా మార్కెట్లోకి ఇళ్ల సరఫరా పెరుగుతుంది. అయితే, ఈ పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆర్థిక లోటు పెరిగే ప్రమాదం ఉంది. దీనిని భర్తీ చేయడానికి ప్రభుత్వాల వద్ద అదనంగా ఉన్న మిగులు భూములను విక్రయించవచ్చు. ఇది ప్రభుత్వానికి నిధులు సమకూర్చడమే కాకుండా మార్కెట్లో భూమి లభ్యతను పెంచుతుంది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఐపీవోకి రత్నదీప్ రిటైల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా సూపర్మార్కెట్ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రత్నదీప్ రిటైల్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. వీటి ప్రకారం తాజాగా రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ప్రమోటర్లు 1.49 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.సందీప్ అగర్వాల్, మనీష్ భర్తియా, మితేష్ భర్తియా వీరిలో ఉన్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 260 కోట్లను రత్నదీప్, నేషనల్ మార్ట్ ఫార్మాట్ల కింద కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. రూ. 80 కోట్ల మేర ప్రీ–ఐపీవో చేపట్టే అవకాశం కూడా పరిశీలనలో ఉన్నట్లు రత్నదీప్ తెలిపింది. సంస్థకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలో స్టోర్స్ ఉన్నాయి. 2026 మార్చి 31 నాటికి రత్నదీప్ సెలెక్ట్, నేషనల్ మార్ట్ ఫార్మాట్ల కింద 190 స్టోర్స్ ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,273 కోట్ల ఆదాయం, రూ. 37 కోట్ల లాభం నమోదు చేసింది. -
బస్ ట్రావెల్కు చిన్న నగరాల దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి బస్సు ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని రెడ్బస్ సీఈవో ప్రకాశ్ సంగం తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో దాదాపు 1 లక్ష రూట్లలో రెడ్ బస్ సర్వీసులు అందిస్తున్నట్లు వివరించారు. ఇంటర్సిటీ బస్ ట్రావెల్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కీలకంగా ఉంటున్నాయని, గత ఆర్థిక సంవత్సరం తమ వ్యాపారంలో ఈ ప్రాంత వాటా 16 శాతంగా ఉందని సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. సీట్ల బుకింగ్, వ్యాపారపరంగా గత ఆర్థిక సంవత్సరం 18 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు.కొత్తగా డిమాండ్ ఏర్పడుతున్న ప్రాంతాలు, అంతగా సేవల్లేని ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడంపై మరింతగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఆధ్యాతి్మక కేంద్రాలపై జెన్ జెడ్ ఆసక్తిగా ఉంటోందని పేర్కొన్నారు. సదరు ప్రాంతాలకు జెన్ జెడ్ ప్రయాణికుల సంఖ్య 37 శాతం, మహిళా ట్రావెలర్ల సంఖ్య 39 శాతం మేర పెరిగిందని ప్రకాశ్ చెప్పారు. తిరుపతి, తిరువణ్ణామలై, షిరిడి, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. రైళ్లతో పోలిస్తే బస్సులతో వెసులుబాటు.. విమానాలను, రైళ్లను ఆధునీకరిస్తూ, మరింత అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. బస్సులతో మరిన్ని వెసులుబాట్లు ఉంటున్నాయని, అందుకే ప్రయాణికులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారని ప్రకాశ్ చెప్పారు. ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు, పండుగలు.. సెలవుల సీజన్లోనూ బడ్జెట్లోనే సీట్ల లభ్యత, మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ లాంటివి బస్సులకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని వివరించారు. ఆపరేటర్లను ఆకర్షించేందుకు రెడ్బస్ పలు చర్యలు తీసుకుంటోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణాలు గత ఆర్థిక సంవత్సరంలో 42 శాతం పెరిగినట్లు తెలిపారు. ఏపీ,తెలంగాణలో 700 రూట్లలో ఈవీలు నడుస్తున్నాయన్నారు. 5 శాతం పెరిగిన చార్జీలు.. రెడ్బస్ఇండియా బస్ ట్రాక్ రిపోర్ట్ ప్రకారం ఇంటర్సిటీ బస్ ట్రావెల్కి సంబంధించి గతేడాది అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు జాతీయ స్థాయిలో సీటు సగటు ధర రూ. 966గా ఉందని ప్రకాశ్ చెప్పారు. ‘నిర్వహణ భారంలో ఇంధన వ్యయాల వాటా ఎక్కువే అయినప్పటికీ ఆయా రూట్లలో సరఫరా–డిమాండ్ని బట్టి బస్సు చార్జీలు ఉంటాయి. పశి్చమాసియా పరిణామాలతో ఇంధన ధరలు పెరగడం, దాని ప్రభావంతో సీటు సగటు చార్జీ వార్షికంగా 5% పెరగడాన్ని గమనించాం. ఇంధనాల ధరలు మరింత కాలం అధిక స్థాయిలోనే ఉంటే, బస్సు చార్జీల పెంపుపరంగా ఒత్తిడి కొనసాగవచ్చు’ అని తెలిపారు. అంతర్జాతీయంగా 7 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా తమ బస్ టికెటింగ్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం 163.9 మిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వివరించారు. -
‘రిచ్ డాడ్’ జీవితాన్ని మార్చిన భారతీయ గురువు
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చదివే వర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలలో ఒకటైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన ఆలోచనలతో చర్చనీయాంశంగా మారారు. డబ్బు సంపాదించడమే జీవిత పరమావధి కాదని, ప్రతి వ్యక్తి తన జీవితం అసలు ఉద్దేశాన్ని గుర్తించి దాని కోసం పనిచేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టు వైరల్గా మారింది.కొన్నేళ్ల క్రితం ఓ భారతీయ గురువు చెప్పిన మాట తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని కియోసాకి వెల్లడించారు. "మీ శరీరం లక్ష్యం.. మీ ఆత్మ లక్ష్యాన్ని నెరవేర్చడమే" అనే ఆ బోధ అప్పట్లో తనకు పూర్తిగా అర్థం కాలేదని, ఆ సమయంలో తాను కేవలం డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమై ఉన్నానని పేర్కొన్నారు. అయితే కాలక్రమేణా తన నిజమైన లక్ష్యం బోధించడమేనని గ్రహించినట్లు చెప్పారు.విద్యార్థి దశలో చదువులో అంతగా రాణించకపోయినా, సాంప్రదాయ విద్యా విధానం తనకు నచ్చకపోయినా, ప్రజలకు ఆర్థిక విజ్ఞానాన్ని అందించడం తన జీవిత ధ్యేయంగా మారిందని కియోసాకి వివరించారు. పాఠశాలల్లో డబ్బు నిర్వహణ గురించి సరైన అవగాహన కల్పించడం లేదనే నమ్మకంతో ఐదు దశాబ్దాల క్రితమే తయారీ రంగాన్ని విడిచి, తన "రిచ్ డాడ్" నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాలను ప్రజలకు బోధించడం ప్రారంభించానని చెప్పారు. అదే నిర్ణయం తన జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు.చాలామంది జీవితమంతా ఉద్యోగం, సంపాదన, ఆర్థిక ఒత్తిళ్లలోనే గడిపేస్తున్నారని, అందువల్ల తమ అసలు జీవిత లక్ష్యాన్ని గుర్తించలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. "మానవాళికి సేవ చేయడానికి నా హృదయం ఏమి చేయాలనుకుంటోంది?" అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాలని, ఫలితం లేదా డబ్బు గురించి ఆలోచించకుండా ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఆయన ప్రకారం, నిజమైన లక్ష్యంతో చేసే పని చివరికి ఆర్థిక విజయాన్నీ తీసుకువస్తుంది.ప్రారంభంలో తాను ఉచితంగా ఆర్థిక విద్య అందించానని, "పొదుపుదారులు ఓడిపోతారు", "సరైన రుణం సంపదను సృష్టించగలదు" వంటి తన అభిప్రాయాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని కియోసాకి గుర్తు చేశారు. అయినప్పటికీ అదే ప్రయత్నం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్ల డాలర్ల వ్యాపారంగా ఎదిగిందని తెలిపారు.అమెరికా పౌరహక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలను కూడా కియోసాకి ప్రస్తావించారు. విమర్శలు, వ్యతిరేకత ఎదురైనా తన లక్ష్యాన్ని వదిలిపెట్టని కింగ్ను ఉదాహరణగా చూపిస్తూ, చివరగా "మీ ఆత్మ అసలు లక్ష్యం ఏమిటి?" అంటూ తన ఫాలోవర్లకు ప్రశ్న వేశారు.What is your life’s mission?Years ago, I was listening to an Indian Guru who said:“Your body’s mission is to fulfill your spirit’s mission.” His words shook me. At the time my body was busy making money.It took me a long time to figure out what was my spirit’s mission?…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2026 -
హైదరాబాద్ కంపెనీ రూ.1,300 కోట్ల డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫార్మసీ చెయిన్కి ఔషధాలు సరఫరా చేసే దిశగా తమ అనుబంధ సంస్థ నూమెడ్ ఫార్మా ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నట్లు సాయి పేరెంటరల్స్ వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,300 కోట్లు ఉంటుందని తెలిపింది.ఏడున్నరేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుందని, మరో మూడేళ్లు పొడిగించుకునే వీలుంటుందని వెల్లడించింది. ఏటా 12 కొత్త ప్రోడక్టులు జత అవుతుండటం వల్ల కాంట్రాక్టు విలువ, పరిధి పెరుగుతుందని వివరించింది. అంతర్జాతీయంగా ఫార్మా కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని సాయి పేరెంటరల్స్ ఎండీ అనిల్ కుమార్ కరుసాల తెలిపారు. -
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొన్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని వినియోగదారులకు తక్కువ ధరలకు విక్రయించడం వల్ల జూన్ 30 నాటికి ఆయా చమురు మార్కెటింగ్ సంస్థలకు మొత్తం రూ.74,781 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.మీడియాతో మాట్లాడిన ఆయన, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టినా, ప్రస్తుతం రిఫైనరీల్లో ప్రాసెస్ చేస్తున్న చమురు రెండు నెలల క్రితం అధిక ధరలకు కొనుగోలు చేసినదేనని వివరించారు. సాధారణంగా చమురు సంస్థలు కనీసం రెండు నెలల ముందుగానే క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేస్తాయని, ప్రస్తుతం వినియోగంలో ఉన్న నిల్వలు ఏప్రిల్–మే నెలల్లో ధరలు అత్యధికంగా ఉన్న సమయంలో సేకరించినవేనని చెప్పారు.ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్కు సగం ఇళ్లు సిద్ధంగా లేవు!పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై స్పందించిన మంత్రి, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు మరికొన్ని వారాలు స్థిరంగా తక్కువ స్థాయిలో కొనసాగితేనే ధరల సమీక్షపై ఆలోచించవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం చమురు ధరలు తగ్గినా, పాత అధిక ధరల నిల్వలు పూర్తిగా వినియోగమైన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంకేతమిచ్చారు.భారత్లో పరిమిత పెరుగుదలే..పశ్చిమాసియా సంక్షోభం సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్రోల్ ధరలు సగటున సుమారు 20 శాతం, భారత్కు పొరుగు దేశాల్లో దాదాపు 35 శాతం వరకు పెరిగాయని పూరి తెలిపారు. అయితే భారతదేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల కేవలం 5.58 శాతానికి మాత్రమే పరిమితమైందని, అదనపు భారాన్ని చమురు సంస్థలే భరించాయని పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1.07 లక్షల ఇంధన విక్రయ కేంద్రాల్లో ఎక్కడా సరఫరా అంతరాయం లేకుండా ఇంధనం అందించగలిగామని చెప్పారు.నయారా ధరల తగ్గింపుపై వివరణప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ జూలై 1 నుంచి పెట్రోల్పై లీటరుకు రూ.5, డీజిల్పై రూ.3 తగ్గించడం గురించి కూడా మంత్రి స్పందించారు. సంక్షోభ సమయంలో నయారా తన ధరలను ముందుగానే పెంచిందని, ఇప్పుడు ఆ పెంపును మాత్రమే వెనక్కి తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఆ సమయంలో వినియోగదారులపై పూర్తి భారం మోపకుండా ధరలను నియంత్రించాయని ఆయన పేర్కొన్నారు.చమురు ధరలే కీలకంఇరాన్కు సంబంధించిన ఉద్రిక్తతల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 110 డాలర్లకు పైగా చేరడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ అండర్రికవరీని భరించాల్సి వచ్చింది. అనంతరం అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సడలడంతో జూన్ ద్వితీయార్ధం నుంచి ముడి చమురు ధరలు తగ్గడం ప్రారంభమైంది. అయితే ఈ తగ్గుదల ప్రభావం దేశీయ ఇంధన ధరల్లోనూ ప్రతిబింబించాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చమురు రంగ వర్గాలు భావిస్తున్నాయి.ఇది చదివారా? పొల్యూషన్ సర్టిఫికెట్పై వాహనదారులకు ఊరట! -
ఈవీ ఛార్జింగ్కు సగం ఇళ్లు సిద్ధంగా లేవు!
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్లో సురక్షితంగా ఈవీలను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 45 శాతం ఇళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థలను అప్గ్రేడ్ (ఆధునీకరణ) చేయాల్సిన అవసరం ఉందని ఒక నివేదిక వెల్లడించింది. అలయన్స్ ఫర్ యాన్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ (ఏఈఈఈ), ఈవీ ఛార్జింగ్ ప్లాట్ఫామ్ ‘కజామ్’ భాగస్వామ్యంతో రూపొందించిన ‘ది నెట్–జీరో ట్రాన్సిషన్ స్టార్ట్స్ అట్ హోమ్: ఎనేబ్లింగ్ ఈవీ–రెడీ రెసిడెన్సెస్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ నివేదికను న్యూఢిల్లీలో విడుదల చేశారు. టైర్–1, టైర్–2, టైర్–3 నగరాల్లోని స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల సముదాయాలు, అద్దె ఇళ్లతో సహా సుమారు 80,000 పైగా నివాస ప్రాంతాల్లో ఉన్న ఈవీ ఛార్జర్ల డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. నివేదికలోని ముఖ్యాంశాలు:∙దేశంలో మొత్తం విద్యుత్ డిమాండ్లో ఈవీల వాటా 2024లో కేవలం 0.2%గా ఉండగా, 2035 నాటికి అది దాదాపు 6%కి పెరిగే అవకాశం ఉందని అంచనా. ∙ప్రస్తుతం ఈవీ కొనుగోలు చేయాలనుకునే వారిలో కేవలం 55 శాతం మందికి మాత్రమే ఇంటి వద్ద ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.∙సరైన మౌలిక వసతులు, ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల చాలామంది సాధారణ విద్యుత్ సాకెట్లు, తాత్కాలిక ఎక్స్టెన్షన్ వైర్లు, ఇతర షేర్డ్ కనెక్షన్ల ద్వారా ప్రమాదకరమైన పద్ధతుల్లో ఛార్జింగ్ చేస్తున్నారు. నిరంతర ఈవీ ఛార్జింగ్ లోడ్ను భరించేలా ఇవి రూపొందించకపోవడంతో షార్ట్ సర్క్యూట్లు, అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు ఉంది. ఇలాంటి పద్ధతుల వల్ల ఛార్జింగ్ విశ్వసనీయత తగ్గడంతో పాటు ఛార్జింగ్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, వాహన బ్యాటరీ సామర్థ్యం కూడా వేగంగా క్షీణించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కియా కొత్త కార్లు.. మార్కెట్లోకి టాప్ వేరియంట్లునివేదిక సూచనలు: ఇళ్ల వద్ద ఈవీలను సురక్షితంగా, విశ్వసనీయంగా, సులభంగా ఛార్జ్ చేసుకునేందుకు ప్రతి ఇల్లు కనీస భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలని నివేదిక సూచించింది. నిరంతర ఛార్జింగ్ లోడ్ను తట్టుకునేందుకు తగినంత విద్యుత్ లోడ్ (సాంక్షన్డ్ లోడ్)తో పాటు ప్రత్యేక ఛార్జింగ్ సర్క్యూట్ ఉండాలని పేర్కొంది. అలాగే ప్రమాణాలకు అనుగుణమైన వైరింగ్, సరైన ఎర్తింగ్, అగి్నప్రమాద భద్రతా నిబంధనలకు అనుగుణంగా సురక్షిత ప్రదేశంలో ఛార్జర్ను ఏర్పాటు చేయాలని సూచించింది. అదనంగా తగిన సామర్థ్యం గల ఎంసీబీలు, ఎర్త్–లీకేజ్ ప్రొటెక్షన్ వ్యవస్థ, అలాగే నిరంతర ఛార్జింగ్ లోడ్ను తట్టుకునే సరి్టఫైడ్ (ధృవీకరించిన) ప్రత్యేక ఈవీ సబ్–మీటర్ను ఉపయోగించాలని నివేదిక సిఫార్సు చేసింది. ఇది చదివారా? పొల్యూషన్ సర్టిఫికెట్పై వాహనదారులకు ఊరట! -
‘కొత్త EPF స్కీమ్’ అమల్లోకి.. ఏమి మారిందంటే..
‘సామాజిక భద్రత కోడ్-2020’ అమలులో భాగంగా ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్-2026’ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసింది. జూన్ 29న గెజిట్లో ప్రచురితమైన ఈ కొత్త నిబంధనలు అదే తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దాదాపు ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘ఈపీఎఫ్ స్కీమ్-1952’ స్థానంలో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు, కంట్రిబ్యూషన్ రేట్లు, యూఏఎన్ వంటి కీలక అంశాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, పరిపాలనను మరింత డిజిటల్, పారదర్శకంగా మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.కంట్రిబ్యూషన్లో మార్పు లేదుకొత్త ఈపీఎఫ్ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఉద్యోగి, యజమాని(కంపెనీ) చెల్లించే తప్పనిసరి పీఎఫ్ చందా యథాతథంగానే ఉంటుంది. ఉద్యోగి వేతనంలో 12 శాతం, యజమాని నుంచి మరో 12 శాతం చొప్పున పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసిన కొన్ని సంస్థలకు ప్రస్తుతం అమల్లో ఉన్న 10 శాతం కంట్రిబ్యూషన్ విధానమే కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15,000 వేతన పరిమితి (వేజ్ సీలింగ్)లో కూడా ఎలాంటి మార్పు చేయలేదు.వాలంటరీ పీఎఫ్కు కొనసాగింపుచట్టబద్ధంగా నిర్దేశించిన పీఎఫ్ చందాకు అదనంగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ‘వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్’ (VPF)లో మరింత మొత్తం జమ చేసే అవకాశం కొనసాగుతుంది. దీంతో ఎక్కువ పొదుపు చేయాలనుకునే ఉద్యోగులకు కొత్త స్కీమ్ కూడా అదే వెసులుబాటు కల్పించింది.పాక్షిక ఉపసంహరణలపై స్పష్టతవైద్య చికిత్స, ఉన్నత విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర అత్యవసర అవసరాల కోసం పీఎఫ్ నుంచి పాక్షికంగా డబ్బు ఉపసంహరించుకునే నిబంధనలను కొత్త స్కీమ్ మరింత స్పష్టంగా పేర్కొంది. అయితే కనీస బ్యాలెన్స్, సభ్యత్వ కాలం వంటి నిర్దిష్ట అర్హతలను పాటించాల్సి ఉంటుంది.డిజిటల్ సేవలకు పెద్దపీటఈపీఎఫ్ నిర్వహణలో డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కొత్త స్కీమ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇకపై ఎలక్ట్రానిక్ ఫైలింగ్స్, ఆన్లైన్ క్లెయిమ్స్, ఈ-పాస్బుక్, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారిత సేవలకు ప్రాధాన్యం పెరుగుతుంది. దీంతో క్లెయిమ్ల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు పారదర్శకత కూడా మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.కేంద్రానికి ప్రత్యేక అధికారంమహమ్మారులు, అంటువ్యాధులు లేదా జాతీయ విపత్తుల వంటి అసాధారణ పరిస్థితుల్లో ఈపీఎఫ్ చందా రేటును తాత్కాలికంగా తగ్గించడం లేదా వాయిదా వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కొత్త స్కీమ్ ప్రత్యేక అధికారం కల్పించింది. అవసరమైన సందర్భాల్లో ఉద్యోగులు, సంస్థలకు ఉపశమనం కల్పించడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.పీఎఫ్ ట్రస్టులకు కఠిన నిబంధనలుసొంతంగా ‘ఎగ్జెంప్టెడ్ పీఎఫ్ ట్రస్టులు’ నిర్వహించే కంపెనీలపై కొత్త స్కీమ్ మరింత కఠినమైన పాలనా నిబంధనలను అమలు చేసింది. ట్రస్టీల అర్హతలు, ఎలక్ట్రానిక్ అకౌంటింగ్, వార్షిక ఆడిట్లు, ఆన్లైన్ డిస్క్లోజర్లు వంటి అంశాలను తప్పనిసరి చేసింది. దీంతో సభ్యుల నిధుల నిర్వహణలో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుత సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేదుఇప్పటికే ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్నవారంతా ఆటోమేటిక్గా ‘ఈపీఎఫ్ స్కీమ్-2026’ పరిధిలోకి వస్తారు. వారి పీఎఫ్ బ్యాలెన్స్, ఇప్పటికే కూడబెట్టుకున్న నిధులు, సభ్యత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు. కొత్తగా అర్హత పొందే ఉద్యోగులు కూడా ఇదే స్కీమ్ కింద నమోదు అవుతారు.యూఏఎన్ యథాతథంప్రతి సభ్యుడికి కేటాయించే ‘యూనివర్సల్ అకౌంట్ నంబర్’ (UAN)లో ఎలాంటి మార్పు లేదు. ఉద్యోగులు సంస్థలు మారినా అదే యూఏఎన్ కొనసాగుతుంది. దీంతో పీఎఫ్ ఖాతా బదిలీలు, సేవా నిరంతరత సులభంగా కొనసాగుతాయి.ఇదీ చదవండి: SBI యోనో యాప్లో కొత్తగా ఏఐ ఫీచర్లుకొత్త ఈపీఎఫ్ స్కీమ్ వల్ల ఉద్యోగుల నెలవారీ పీఎఫ్ కట్, వడ్డీ రేటు లేదా ఇప్పటికే కూడబెట్టుకున్న పీఎఫ్ నిధులపై తక్షణ ప్రభావం ఉండదు. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ‘సామాజిక భద్రత కోడ్-2020’కు అనుగుణంగా ఈపీఎఫ్ వ్యవస్థను ఆధునికీకరించడం, డిజిటల్ సేవలను విస్తరించడం, పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడం మాత్రమే.ఇది చదివారా? ఆధార్, క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు -
ఐటీ కంపెనీల ఆదాయాలకు ఎఫెక్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంవోఎస్ఎల్) ఒక నివేదికలో పేర్కొంది. స్థూల పరిస్థితులు, కృత్రిమ మేథ (ఏఐ), భౌగోళిక రాజకీయాంశాలు క్లయింట్ల డిస్క్రెషనరీ వ్యయాలపైనా, అవి తీసుకునే నిర్ణయాలపైనా ప్రభావం చూపుతుండటం ఇందుకు కారణాలు కాగలవని వివరించింది.క్లయింట్లు నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం, ఆచితూచి ఖర్చు చేస్తుండటంలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయంటూ యాక్సెంచర్ ఇటీవల పేర్కొనడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని ఎంవోఎస్ఎల్ వివరించింది. క్యూ1 పనితీరు ముందుగా అంచనా వేసిన దానికన్నా తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నట్లు కేపీఐటీ టెక్నాలజీస్ సైతం వెల్లడించిన నేపథ్యంలో ఎంవోఎస్ఎల్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ కారణాలరీత్యా క్యూ1లో డిమాండ్ నెమ్మదించి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. రెండో త్రైమాసికం కూడా అదే విధంగా ప్రారంభం కావొచ్చని వివరించింది. క్యూ1లో ఐటీ కంపెనీలు తామిచ్చిన గైడెన్స్ గరిష్ట స్థాయిని కుదించవచ్చని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్నేమ్ వ్యవహారం.. కేంద్రం నోటీసులు హెచ్సీఎల్టీ వృద్ధి గైడెన్స్ని 100 బేసిస్ పాయింట్ల మేర కుదించవచ్చు. ఇన్ఫోసిస్ 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 1.5–3 శాతానికి పరిమితం చేయొచ్చు. త్రైమాసికాలవారీగా స్థిర కరెన్సీ ప్రాతిపదికన లార్జ్ క్యాప్ సంస్థల వృద్ధి 2 శాతం వరకు ఉండొచ్చు, మిడ్–క్యాప్స్ మళ్లీ రాణించి, 4.8 శాతం వరకు వృద్ధి నమోదు చేయొచ్చు. వివిధ విభాగాలవారీగా చూస్తే మెరుగైన డీల్స్ దన్నుతో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) పటిష్టంగా ఉంటోంది. హై–టెక్ విభాగం మిశ్రమంగా కనిపిస్తోంది. ఇది చదివారా? ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా? -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. ఐటీ షేర్లకు మంచిరోజు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. యూఎస్, ఇరాన్ వాణిజ్య చర్చల సానుకూల సంకేతాలపై చమురు ధరలు తగ్గడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు గణనీయంగా ఎగిశాయి. నిఫ్టీ 0.71 శాతం 169.85 పాయింట్ల లాభంతో 24,175.70 వద్ద, సెన్సెక్స్ 0.75 శాతం లేదా 579.48 పాయింట్లు పెరిగి 77,502.12 వద్ద ముగిశాయి.ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ వరుసగా 0.48 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.25 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ సెక్టోరల్ సూచీలను అధిగమించింది. 2025 మే తర్వాత ఉత్తమ ఇంట్రాడే లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ రియాల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
SBI యోనో యాప్లో కొత్తగా ఏఐ ఫీచర్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రిటైల్, బిజినెస్ కస్టమర్ల కోసం పలు ఏఐ ఆధారిత డిజిటల్ ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది. యోనో ప్లాట్ఫాంలో సేవలను మరింతగా విస్తరించింది. కొత్త కస్టమర్లు ఇప్పుడు 3–ఇన్–1 డిజిటల్ ఆన్బోర్డింగ్ ప్రక్రియ ద్వారా పొదుపు ఖాతాతో పాటు ఎస్బీఐక్యాప్ సెక్యూరిటీస్లో డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా కూడా తెరవచ్చు.అర్హత కలిగిన కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంటును కార్పొరేట్ శాలరీ అకౌంటుగా మార్చుకోవచ్చు. అలాగే వ్యాపార వర్గాల కోసం ట్రేడ్ ఫైనాన్స్ సాధనాలన్నింటిని యోనో బిజినెస్లో అనుసంధించడం ద్వారా ఈ–ట్రేడ్ సేవలను విస్తరించినట్లు బ్యాంకు తెలిపింది. యోనో బిజినెస్ వెబ్, మొబైల్ ప్లాట్ఫాంలలో ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉండేలా ఏజెంటిక్ ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ’యోనో జీ’ని బ్యాంకు ప్రవేశపెట్టింది.కృత్రిమ మేథ, డిజిటల్ ఆవిష్కరణలు, డేటా ఆధారిత విశ్లేషణలతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించాలన్న తమ లక్ష్యానికి ఇవి నిదర్శనమని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎస్బీఐకి 53 కోట్ల పైగా కస్టమర్లు ఉండగా, వారిలో 10 కోట్ల మంది యోనో యూజర్లు ఉన్నారు. -
బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!
ఈ రోజుల్లో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే, ఎంతటి ఖరీదైన స్మార్ట్ఫోన్ తీసుకున్నా కొన్నాళ్లకే బ్యాటరీ త్వరగా అయిపోతోందనే ఫిర్యాదు సాధారణం. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా హెవీ యూసేజ్ వల్ల ఫోన్లు వేడెక్కడం, చార్జింగ్ నిమిషాల్లో కరిగిపోవడం చాలామందిని వేధించే సమస్య.స్మార్ట్ఫోన్ల్లో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలకు ఒక నిర్దిష్టమైన లైఫ్ సైకిల్ ఉంటుంది. అయితే, మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ ఆయుష్షు మరింత వేగంగా తగ్గిపోతుంది. మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం రావాలంటే టెక్ నిపుణులు, మొబైల్ తయారీ సంస్థలు సూచిస్తున్న కొన్ని చిట్కాలు కింద చూద్దాం.‘100% చార్జింగ్’ రూల్కు స్వస్తి చెప్పండి!చాలామంది ఫోన్ చార్జింగ్ 0% కి పడిపోయే వరకు వాడి, ఆపై 100% అయ్యే వరకు అలాగే వదిలేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. బ్యాటరీని ఎప్పుడూ పూర్తిగా ఖాళీ చేయడం, అలాగే పూర్తిగా నింపడం వల్ల దానిపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది.గోల్డెన్ రూల్: మీ మొబైల్ బ్యాటరీ శాతాన్ని ఎప్పుడూ 20% నుంచి 80% మధ్య ఉంచడానికి ప్రయత్నించండి. చార్జింగ్ 20%కి రాగానే ప్లగ్ ఇన్ చేయడం, 80% - 85% కాగానే తీసేయడం వల్ల బ్యాటరీ లైఫ్ స్థిరంగా ఉంటుంది.రాత్రంతా చార్జింగ్ పెడుతున్నారా?రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ చార్జింగ్ పెట్టి ఉదయం తీయడం అలవాటా? ఆధునిక స్మార్ట్ఫోన్లలో చార్జింగ్ 100% కాగానే ఆటోమేటిక్గా పవర్ కట్ అయ్యే ‘స్మార్ట్ కట్’ ఫీచర్ ఉన్నప్పటికీ రాత్రంతా ప్లగ్లోనే ఉంచడం వల్ల బ్యాటరీ ‘ట్రికిల్ చార్జింగ్’ మోడ్లోకి వెళ్తుంది. దీనివల్ల బ్యాటరీ నిరంతరం రసాయన ఒత్తిడికి లోనై కాలక్రమేణా ఉబ్బిపోయే ప్రమాదం ఉంది.ఒరిజినల్ చార్జర్ మాత్రమే వాడండిమార్కెట్లో తక్కువ ధరకు దొరికే లోకల్ చార్జర్లు, కేబుల్స్ వాడటం బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. మీ ఫోన్ బాక్స్తో పాటు వచ్చిన లేదా సదరు కంపెనీకి చెందిన అధికారిక చార్జర్లను మాత్రమే వాడాలి. లోకల్ చార్జర్లు స్థిరమైన వోల్టేజ్ను అందించలేవు.హీటింగ్ సమస్యమొబైల్ బ్యాటరీల ఆయుష్షును తగ్గించే అతిపెద్ద అంశం ఉష్ణోగ్రత. ఫోన్ చార్జింగ్ అవుతున్నప్పుడు సహజంగానే కొంత వేడెక్కుతుంది. ఆ సమయంలో హెవీ గేమింగ్ ఆడటం లేదా యూట్యూబ్ వీడియోలు చూడటం అస్సలు చేయకూడదు. అలాగే, కారు డాష్బోర్డ్లపై, ఎండ తగిలే చోట్ల ఫోన్ను ఉంచకూడదు. వీలైతే, చార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ పౌచ్ తీసేయడం మంచిది.ఈ సెట్టింగ్స్ మార్చుకోండిస్క్రీన్ బ్రైట్నెస్ను ఎప్పుడూ ఫుల్గా ఉంచకుండా ఆటో బ్రైట్నెస్ మోడ్లో పెట్టండి.మీ ఫోన్లో ఆమోలెడ్ లేదా ఓలెడ్ స్క్రీన్ ఉంటే డార్క్ మోడ్ ఆన్ చేయడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై అవసరం లేనప్పుడు ఆఫ్ చేయండి.సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫోన్ ఎక్కువ పవర్ వాడుకుంటుంది. కాబట్టి అవసరమైతే కాసేపు ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి.స్మార్ట్ఫోన్ అనేది మన నిత్యజీవితంలో భాగం. దాన్ని సరైన పద్ధతిలో చార్జ్ చేయడం, అధిక వేడికి గురికాకుండా చూసుకోవడం ద్వారా బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేకుండానే ఫోన్ను కనీసం 3 నుంచి 4 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. కాబట్టి వెంటనే మీ ఫోన్ చార్జింగ్ అలవాట్లను మార్చుకోండి!ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్! -
టాటా సన్స్ లిస్టింగ్పై తేలని ఉత్కంఠ
టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ ‘టాటా సన్స్’ ఐపీఓ మార్కెట్లోకి రావాలా వద్దా అనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తుది నిర్ణయం తీసుకోనుంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (CoR) సరెండర్ దరఖాస్తులపై కేంద్ర బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. కేవలం పత్రాలు సమర్పించినంత మాత్రాన ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్వయంచాలకంగా రద్దు కాదని, ఆ రద్దు దరఖాస్తును ఆమోదించే లేదా తిరస్కరించే పూర్తి హక్కు తమకు ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో, టాటా సన్స్ దాఖలు చేసిన ‘కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’ (సీఐసీ) లైసెన్స్ సరెండర్ దరఖాస్తుపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆర్బీఐ ఈ దరఖాస్తును ఆమోదించే వరకు టాటా సన్స్పై స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవ్వాలనే నిబంధనలు యథాతథంగా అమలులో ఉంటాయి.‘పరోక్ష నిధుల స్వీకరణ’పై కొత్త సర్క్యులర్ప్రభుత్వ నిధులను పరోక్షంగా స్వీకరించడంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ఆర్బీఐ మరో కీలక సర్క్యులర్ను జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రభుత్వ నిధులకు ప్రత్యక్షంగా యాక్సెస్ లేకుండా ప్రభుత్వ నిధులు పొందే అసోసియేట్లు లేదా గ్రూప్ సంస్థల ద్వారా నిధులు అందుకుంటే దాన్ని 'పరోక్ష నిధుల స్వీకరణ'గా పరిగణిస్తారు.సెంట్రల్ బ్యాంక్ మొదట ఏప్రిల్ 29 నాటి సర్క్యులర్లో ఈ నిబంధనను చేర్చింది. అయితే జూన్ 24న ఎన్బీఎఫ్సీల కోసం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ‘నిధులకు పరోక్ష అవకాశం’ను స్పష్టంగా నిర్వచించలేదు. కాబట్టి, ఏప్రిల్ 29 నాటి నిర్వచనాన్ని పునరుద్ఘాటించేందుకే ఆర్బీఐ జూన్ 30న తాజా నోటిఫికేషన్ను జారీ చేసినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.టాటా సన్స్కే ఎందుకీ సమస్య?టాటా సన్స్ 2024లోనే తనకున్న అన్ని అప్పులను పూర్తిగా తిరిగి చెల్లించింది. టాటా మోటార్స్, టాటా స్టీల్ వంటి కొన్ని ప్రముఖ లిస్టెడ్ సంస్థలకు టాటా సన్స్లో వాటాలు ఉన్నాయి. ఈ గ్రూప్ సంస్థల ద్వారా టాటా సన్స్కు నిధులకు పరోక్ష అవకాశం ఉన్నందున, కేంద్ర బ్యాంక్ దీనిని ‘కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’గానే పరిగణిస్తోంది.లిస్టింగ్ వివాదం నేపథ్యంఆర్బీఐ 2022లో ‘అప్పర్ లేయర్’ ఎన్బీఎఫ్సీల జాబితాను విడుదల చేస్తూ వారు మూడేళ్ల వ్యవధిలో (సెప్టెంబర్ 2025 నాటికి) స్టాక్ మార్కెట్లో తప్పనిసరిగా లిస్ట్ కావాలని గడువు విధించింది. ఈ లిస్టింగ్ నిబంధనల నుంచి మినహాయింపు పొందడానికి టాటా సన్స్ 2024లో తన సీఓఆర్ను సరెండర్ చేయడానికి దరఖాస్తు చేసుకుంది. గత వారం ఆర్బీఐ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రూ.1 లక్ష కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం ఉన్న ఏ ఎన్బీఎఫ్సీ అయినా అప్పర్ లేయర్ విభాగంలోకే వస్తుందని పునరుద్ఘాటించింది.టాటా సన్స్ ఆస్తి పరిమాణం నిర్దేశిత పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉండటం, పైగా పరోక్ష నిధుల స్వీకరణ నిర్వచనం పరిధిలోకి వస్తుండటంతో.. ఆర్బీఐ ఆ సంస్థ లైసెన్స్ సరెండర్ దరఖాస్తును ఆమోదిస్తుందా లేదా తిరస్కరించి లిస్టింగ్కు ఆదేశిస్తుందా అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆర్బీఐ దరఖాస్తును తిరస్కరిస్తే టాటా సన్స్ దేశీయ స్టాక్ మార్కెట్లలో మెగా ఐపీఓగా రావాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్! -
ఏఐ రంగంలో భారత్ దూకుడు ఖాయం
ప్రపంచ సాంకేతిక రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. అయితే, ఈ రంగం కేవలం కొన్ని పాశ్చాత్య టెక్ దిగ్గజాల గుత్తాధిపత్యంలోనే ఉండిపోతుందా? లేక భారత్ వంటి దేశాలు స్వయంసమృద్ధి సాధించగలవా? అనే చర్చకు జోహో అధినేత శ్రీధర్ వెంబు సరికొత్త దిశను చూపించారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై నిరంతరం చర్చించే వెంబు.. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఏఐ కంపెనీల పోటీని ప్రశంసించడంతో పాటు భారత్లో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని చెప్పారు.మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంపై..టెక్ మార్కెట్లో అమెరికన్ కంపెనీల గుత్తాధిపత్య ధోరణిని ఎండగట్టడానికి శ్రీధర్ వెంబు ఇటీవల ఒక ఆసక్తికరమైన ఉదాహరణను పంచుకున్నారు. ఒక భారతీయ కస్టమర్ తన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో ఎదురైన అనుభవాన్ని ఆయన ఉదహరించారు.‘సదరు కస్టమర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి స్వదేశీ సాఫ్ట్వేర్ అయిన జోహో ఆఫీస్ సూట్కు మారిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పగానే.. మైక్రోసాఫ్ట్ ఒక్కసారిగా దిగొచ్చింది. తన కస్టమర్ను కోల్పోకూడదనే భయంతో ఏకంగా 90% తగ్గింపును ఆఫర్ చేసింది’ అన్నారు. పోటీ లేకపోతే ఈ దిగ్గజాలు కస్టమర్లను ఎలా దోపిడీ చేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని వెంబు పేర్కొన్నారు. మార్కెట్లో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడే వినియోగదారుడికి నిజమైన లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.‘యాంటీట్రస్ట్’ కేసు గుర్తుచేసిన జోహో బాస్మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులను విమర్శిస్తూ.. గతంలో ఆ సంస్థ ఎదుర్కొన్న చట్టపరమైన సవాళ్లను వెంబు గుర్తుచేశారు.యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ మైక్రోసాఫ్ట్ కార్ప్ (1998): మైక్రోసాఫ్ట్ చట్టవిరుద్ధంగా తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్తో పాటు 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టుకెక్కారు.పోటీని అణచివేసే కుట్ర: విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ‘ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్’ బ్రౌజర్ను ఉచితంగా ఇన్-బిల్ట్గా ఇవ్వడం ద్వారా.. అప్పట్లో పాపులర్ అయిన ‘నెట్స్కేప్ నావిగేటర్’ వంటి ప్రత్యర్థి బ్రౌజర్ల మనుగడను మైక్రోసాఫ్ట్ దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చాయి.కంపెనీ విభజన తీర్పు: ఏప్రిల్ 2000లో యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి థామస్ పెన్ఫీల్డ్ జాక్సన్.. మైక్రోసాఫ్ట్ యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందని తీర్పునిస్తూ కంపెనీని రెండుగా విభజించాలని (ఒకటి విండోస్ ఓఎస్ కోసం, మరొకటి సాఫ్ట్వేర్ ఉత్పత్తుల కోసం) ఆదేశించారు. అయితే, ఆ తర్వాత అప్పీల్లో ఈ ఉత్తర్వు రద్దయినప్పటికీ మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్య ధోరణి ప్రపంచానికి స్పష్టమైంది.చైనా ఏఐ పోటీ.. ప్రపంచానికి మేలు!ప్రస్తుతం ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గట్టి పోటీ ఇస్తోంది. చైనా ఏఐ కంపెనీల వేగవంతమైన వృద్ధిని శ్రీధర్ వెంబు సానుకూల దృక్పథంతో స్వాగతించారు. ఈ అంతర్జాతీయ పోటీ వల్ల ఏఐ మోడళ్ల శిక్షణ ఖర్చులు విపరీతంగా తగ్గుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ ధరల తగ్గుదల గ్లోబల్ ఏఐ పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడానికి, ఓపెన్ మార్కెట్ను ప్రోత్సహించడానికి కీలకమని చెప్పారు.Anthropic's latest models available worldwide. In other words, Chinese open source models posed a serious enough threat to market share.In a different context, an Indian customer of some of our products told me recently "A big Microsoft Office license renewal came up and they… https://t.co/xp8e6vVMvs— Sridhar Vembu (@svembu) July 1, 2026‘భారత్ జెన్’ ప్రాజెక్ట్: స్వదేశీ ఏఐ కల సాకారంఏఐ శిక్షణ ఖర్చులు తగ్గడం వల్ల భారతదేశానికి భారీ అవకాశాలు లభిస్తాయని వెంబు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారతదేశంలో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని నేను ఇప్పుడు బలంగా విశ్వసిస్తున్నాను. మనం నిరాశ చెందకూడదు’ అని పిలుపునిచ్చారు. భారత్లో విద్యాసంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో బహుళ ఏఐ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనికి ప్రధాన ఉదాహరణగా ఐఐటీ బొంబాయి నేతృత్వంలో సాగుతున్న ‘భారత్ జెన్’ ప్రాజెక్ట్ సాధిస్తున్న పురోగతిని వెంబు సాక్ష్యంగా చూపారు. పాశ్చాత్య దేశాల ఏఐ సాంకేతికతకు, భారతీయ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ స్వదేశీ ప్రాజెక్టులు వేగంగా భర్తీ చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. -
ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గత మూడు సెషన్ల నుంచి తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా ఈరోజు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
‘నేనేం స్కూల్ స్టూడెంట్ని కాదు సార్’
ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో మేనేజర్లు, ఉద్యోగుల మధ్య సంబంధాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అద్దం పట్టే సంఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనారోగ్య సెలవు (సిక్ లీవ్) అడిగినందుకు సదరు ఉద్యోగిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డిమాండ్ చేసిన బాస్కు ఒక జెన్ జీ ఉద్యోగి ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆన్లైన్లో చర్చకు దారితీసింది.అసలేం జరిగిందంటే..?ఎక్స్ వేదికగా వైరల్ అవుతున్న ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ ప్రకారం.. ఒక ఉద్యోగి తన మేనేజర్కు మెసేజ్ చేస్తూ, ‘సార్ నహీ ఆ పావంగా, ఫీవర్ బడ్ గయా హై’(సార్.. నేను రాలేను, నాకు జ్వరం ఎక్కువైంది) అని సమాచారం ఇచ్చాడు. దీనికి బాస్ స్పందిస్తూ, ‘చలో డాక్టర్ కే పాస్ చల్తే హై’(డాక్టర్ వద్దకు వెళ్తున్నావా) అని బదులిచ్చాడు. ప్రస్తుతానికి తాను ట్యాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నానని, అవసరమైతేనే డాక్టర్ వద్దకు వెళ్తానని ఉద్యోగి స్పష్టం చేశాడు. అయితే, అంతటితో ఆ సంభాషణ ముగియలేదు.‘డైరెక్టర్ సర్ నే కహా హై జో భీ బిమార్ హో ఉస్సే డాక్టర్ కి ప్రిస్క్రిప్షన్ లో’(అనారోగ్యంతో సెలవు అడిగే ప్రతి ఒక్కరి నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సేకరించాలని డైరెక్టర్ గారు ఆదేశించారు) అంటూ మేనేజర్ ఒత్తిడి తెచ్చాడు.మేనేజర్ మాటలకు సదరు జెన్ జీ ఉద్యోగి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘మై స్కూల్ స్టూడెంట్ నహీ హూన్ సర్. లీవ్ రెహ్తీ హై, లీవ్ మై’ (నేను స్కూల్ స్టూడెంట్ని కాదు సార్. నాకు సెలవు అందుబాటులో ఉంది, అందుకే తీసుకుంటున్నాను) అని తేల్చిచెప్పాడు. అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రిస్క్రిప్షన్ అంత తప్పనిసరి అయితే, కంపెనీ డైరెక్టరే స్వయంగా డాక్టర్ కాబట్టి తన పేరు మీద ఆయన్నే ఒక ప్రిస్క్రిప్షన్ రాసుకోమనాలని సూచించాడు. అంతేకాకుండా, తన తల్లిదండ్రులు సంతకం చేసిన లీవ్ లెటర్లు తన వద్ద లేవని, ప్రస్తుతానికి తాను విశ్రాంతి తీసుకుంటున్నందున ఇకపై వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లకు స్పందించనని చాటింగ్ను ముగించాడు.నెటిజన్ల స్పందనఈ స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపట్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. ‘భారతీయ మేనేజర్లు తమ కింద పనిచేసేవారిని ఉద్యోగులుగా కాకుండా, బానిసలుగా భావిస్తారు. జెన్ జీ ఉద్యోగి ఇచ్చిన ప్రతిస్పందన అద్భుతం’ అంటూ కొందరు సదరు యువకుడికి మద్దతుగా నిలిచారు. కంపెనీలు ఉద్యోగులకు వార్షిక సెలవులు కేటాయించినప్పుడు, ఒక రోజు అనారోగ్య సెలవు కోసం కూడా మెడికల్ సర్టిఫికెట్లు అడగడం వారిపై నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: బెంగళూరు ఐటీ కారిడార్లో ఘోరం -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 97 పాయింట్లు ఎగబాకి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 292 పాయింట్లు పెరిగి 77,216 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.38బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.22 శాతం తగ్గింది.నాస్డాక్ 0.66 శాతం నష్టపోయింది.Today Nifty position 02-07-2026(time: 09:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బెంగళూరు ఐటీ కారిడార్లో ఘోరం
ఐటీ ఉద్యోగుల పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన డేకేర్ సెంటర్లో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఐటీ రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్జెమిని బెంగళూరు క్యాంపస్లోని డేకేర్ సెంటర్లో రెండు నుంచి మూడేళ్ల వయసున్న పసిబిడ్డలను తీవ్రంగా వేధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడంతో ఐటీ వర్గాలతో పాటు ప్రజల్లో చర్చకు దారితీసింది.బాత్రూమ్లో బంధించి..జిల్లా పిల్లల సంరక్షణ యూనిట్ (డీసీపీయూ) అధికారి తిలకేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని అంశాలు కీలక విషయాలు వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. పిల్లలు ఏడుస్తున్న సమయంలో సంరక్షకులు వారిని ఓదార్చాల్సింది పోయి శారీరకంగా బెదిరింపులకు గురిచేశారు. తల్లి పాలు కూడా మరువని పసిబిడ్డల నోటిలో బలవంతంగా నీరు పోశారు. వెస్ట్రన్ టాయిలెట్ కమోడ్లపై పిల్లలను బలవంతంగా కూర్చోబెట్టి బాత్రూమ్ లోపల వేసి తాళాలు పెట్టారు. వాట్సాప్లో హల్చల్ చేసిన వీడియోల ప్రకారం.. పిల్లలను భయపెట్టడానికి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ లోపల కూడా ఉంచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఐదుగురు మహిళా కేర్టేకర్లపై కేసు నమోదుఈ అమానుష ఘటనపై జూన్ 29న బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా కేసు నమోదైంది. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మహిళా సంరక్షకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.స్పందించిన క్యాప్జెమినిఈ ఉదంతంపై తీవ్ర దుమారం రేగడంతో క్యాప్జెమిని యాజమాన్యం తక్షణమే స్పందించింది. జులై 1న కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ బ్రూక్ఫీల్డ్ పరిధిలోని హెచ్ఏఎల్ క్యాంపస్లో ఉన్న ఆన్-క్యాంపస్ డేకేర్ సదుపాయాన్ని తాత్కాలికంగా వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ‘క్యాప్జెమిని సంస్థకు తన ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సే అత్యంత ప్రధానం. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మేము పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు ఆన్-క్యాంపస్ డేకేర్ సదుపాయాన్ని తక్షణమే తాత్కాలికంగా మూసివేస్తున్నాం’ అని కంపెనీ అధికారిక ప్రతినిధి చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
కార్ల అమ్మకాల రికార్డ్
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహనాల (కార్ల) అమ్మకాలు ఈ ఏడాది జూన్ నెలలో సరికొత్త రికార్డు సృష్టించాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా దిగ్గజ కంపెనీల అద్భుత ప్రదర్శనతో మొత్తం విక్రయాలు దాదాపు 25 శాతం వృద్ధితో 4 లక్షల యూనిట్లకు చేరినట్లు అంచనా. జీఎస్టీ 2.0 అనుకూలత, రూ.12 లక్షల వరకు ఐటీ మినహాయింపులు, ఆర్బీఐ రెపో రేట్ల తగ్గింపు వంటి అంశాలు మార్కెట్లో డిమాండ్ను భారీగా పెంచాయి.అయితే, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం, ఇంధన ధరల భారం, దేశంలో రుతుపవనాల లోటు వంటి ప్రతికూలతలు భవిష్యత్తు డిమాండ్పై కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్రోల్ భారాన్ని తట్టుకోవడానికి కస్టమర్లు సీఎన్జీ, ఈవీల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. రాబోయే పండుగల సీజన్ నాటికి ఈ వృద్ధి స్థిరంగా కొనసాగాలంటే అంతర్జాతీయ ఉద్రిక్తతలు అదుపులోకి రావడం, వర్షాలు సమృద్ధిగా కురవడం అత్యంత కీలకమని ఆటో పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. -
రూపాయిపై ‘డాలర్’ ఒత్తిడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ‘డాలర్ ఇండెక్స్’ బలోపేతం కావడం దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ 60 పైసలు క్షీణించి 95.16 వద్ద ముగిసింది.డాలర్ పుంజుకోవడంతో పాటు ఇతర ఆసియా కరెన్సీల బలహీనత, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మూలధనం (పెట్టుబడులు) నిరంతరాయంగా తరలిపోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 94.67 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన రూపాయి... ఇంట్రాడేలో 94.60 – 95.29 శ్రేణిలో కదలాడింది. -
జీఎస్టీ వసూళ్లు 14 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా సరఫరా పెరగడంలాంటి సానుకూల అంశాల నేపథ్యంలో జూన్లో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) స్థూల వసూళ్లు రూ. 1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూలోలో నమోదైన రూ. 1.71 లక్షల కోట్లతో పోలిస్తే ఇది సుమారు 14% అధికం. ఈ ఏడాది మే నెలలో స్థూల వసూళ్లు రూ. 1.94 లక్షల కోట్లు. కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం దేశీయ లావాదేవీలపై స్థూల కలెక్షన్ 6.5% పెరిగి రూ. 1.35 లక్షల కోట్లకు చేరింది.ఇందులో కేంద్ర, రాష్ట్ర, సమీకృత జీఎస్టీ వసూళ్లు వరుసగా రూ. 37,376 కోట్లు, రూ. 45,116 కోట్లు, రూ. 52,282 కోట్లుగా ఉన్నాయి. దిగుమతులపై జీఎస్టీ ఆదాయం 34.6% ఎగిసి రూ. 60,038 కోట్లుగా నమోదైంది. మొత్తం రిఫండ్లు 29% పెరిగి రూ. 32,436 కోట్లుగా ఉంది. రిఫండ్లు పోగా నికరంగా వసూళ్లు 11.2% పెరిగి రూ. 1.62 లక్షల కోట్లుగా ఉన్నాయి.ఇటీవలి గణాంకాలు చూస్తే కలెక్షన్లు మధ్యమధ్యలో ఒక్కసారిగా పెరగడం కాకుండా, నెమ్మదిగా ఒక స్థాయిలో స్థిరపడుతున్నట్లుగా కనిపిస్తోందని ఏకేఎం గ్లోబల్ లీడ్ (ఇన్డైరెక్ట్ ట్యాక్స్) ఇకేష్ నాగ్పాల్ తెలిపారు. పశి్చమాసియా ఉద్రిక్తతలతో ఆర్థిక పరిస్థితులపై ప్రభావాలు పడుతున్నా జీఎస్టీ నెలవారీ వసూళ్లు క్రమంగా రూ. 2 లక్షల కోట్ల మార్కుకి చేరువవుతున్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మణి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 8.4% పెరిగి రూ. 6.32 లక్షల కోట్లకు చేరాయి. -
అనలాగ్ ఏఐతో ‘మేఘ’ జట్టు
సాక్షి, బిజినెస్ ప్రతినిధి; ఇన్ఫ్రా రంగ దిగ్గజం ‘మేఘ ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్)’ ‘ఏఐ’లోకి ఎంట్రీ ఇచ్చింది. అబుదాబి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘అనలాగ్ ఏఐ’తో కలిసి కొత్త భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసింది. ఈ జేవీలో ఇద్దరికీ చెరో 50 శాతం వాటా ఉంటుందని మేఘ సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు. బుధవారమిక్కడ అనలాగ్ సీఈఓ అలెక్స్ కిప్మాన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే రెండు మూడేళ్లలో తాము ఈ జేవీలో రూ.3,000 కోట్ల నుంచి 4,500 కోట్ల వరకూ పెట్టుబడి పెడతామని, అనలాగ్ భారత కార్యకలాపాలను పూర్తిగా ఈ జేవీయే చూస్తుందని చెప్పారాయన. కొత్త కంపెనీ పేరు, లోగో తదితర వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా అలెక్స్ కిప్మాన్ చెప్పారు. ఫిజికల్ ఏఐ... అవకాశాలు అపారం మూడేళ్ల కిందట అబుదాబి టెక్నాలజీ దిగ్గజం జీ24తో కలిసి అలెక్స్ కిప్మాన్ అనలాగ్ ఏఐని ఆరంభించారు. ఇది ప్రశ్నలకు టెక్ట్స్ రూపంలో సమాధానాలు చెప్పే ఫౌండేషనల్ ఏఐ కాదు. ఫిజికల్ ఏఐ. యంత్రాలు, పవర్ ప్రాజెక్టులు, వాహనాలు సహా భౌతిక వస్తువుల్ని సెన్సర్లతో అనుసంధానించి వాటి డిజిటల్ ట్విన్స్ను తయారు చేస్తుంది. వాటి సాయంతో దూరంగా ఉండికూడా వీటిని పర్యవేక్షించొచ్చు. యంత్రాల సామర్థ్యం పెరగటంతో పాటు ప్రమాదాల నివారణ, మెయింటెనెన్స్ అవసరాల్ని ముందే తెలుసుకోవచ్చు. స్మార్ట్ సిటీల్లో వాటర్ ఫ్లోను, ట్రాఫిక్ను సైతం దీనిద్వారా సమర్థంగా నిర్వహించవచ్చు.ఇలా చాలా ప్రయోజనాలుండటం వల్ల భారత్లో దీనికి అపార అవకాశాలున్నాయని కృష్ణారెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఇది అత్యాధునిక టెక్నాలజీ. రిఫైనరీలతో సహా అన్నిచోట్లా వినియోగించొచ్చు. మా గ్రూపు సంస్థ ఒలెక్ట్రా త్వరలో బ్యాటరీ తయారీ, ప్యాసింజర్ కార్ల తయారీలోకి ప్రవేశిస్తోంది. దానిక్కూడా అనలాగ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ పనికొస్తుంది’ అని స్పష్టంచేశారు. ఈ జేవీ భారతదేశమంతటా సేవలందిస్తుందని, ఒక్క ఎంఈఐఎల్కే కాదని, ఇప్పటికే తమకు చాలామంది క్లయింట్లున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా కిప్మాన్ చెప్పారు. అబుదాబిలో చాలాచోట్ల దీన్ని వాడుతున్నారని, డేటా సెంటర్లు, పవర్ ప్రాజెక్టుల్లోనూ మోహరించామని చెప్పారాయన.హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ తమ భాగస్వామ్య సంస్థ సారథ్యంలో హైదరాబాద్లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను త్వరలో ఏర్పాటు చేస్తామని కిప్మాన్ చెప్పారు. ఉద్యోగుల సంఖ్య మొదట్లో తక్కువే ఉంటుందని, మెల్లగా విస్తరిస్తూ వెళతామని తెలియజేశారు. వచ్చే 3 నెలల్లో తమ భారత సేవలు వాణిజ్యపరంగా మొదలవుతాయని, పైలట్ ప్రాజెక్టులు ఇప్పటికే కొనసాగుతున్నాయని చెప్పారాయన. కార్యక్రమంలో మేఘ సంస్థ డైరెక్టర్లు పి.వి.ప్రణవ్ రెడ్డి, మానస్ రెడ్డి, అనలాగ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యెన్సీ స్మిత్ పాల్గొన్నారు. -
30 ఏళ్లలోపే వ్యాపార సామ్రాజ్యాలు..
భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ యువతరం వైపు మరింతగా అడుగులు వేస్తోందని ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా అండర్30 లిస్ట్ 2026’ (Avendus-Hurun India U30 List 2026 102) స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 30 ఏళ్లలోపు వయస్సున్న 102 మంది యువ పారిశ్రామికవేత్తలు, నవ తరం వ్యాపార వారసులను ఈ జాబితా గుర్తించింది. గత ఏడాది 80 మందితో పోలిస్తే ఈసారి జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య 28 శాతం పెరగడం విశేషం. ఈ యువ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల మొత్తం విలువ సుమారు రూ.2.9 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ జాబితా ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా’ వివిధ వయసు క్యాటగిరీల సిరీస్లో తొలి భాగం కాగా, తరువాత అండర్35, అండర్40 జాబితాలు కూడా విడుదల కానున్నాయి.స్వయం ప్రతిభతో ఎదిగినవారే అధికంఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 84 శాతం మంది ఫస్ట్ జనరేషన్ ఎంట్రాప్రెన్యూర్లు. కుటుంబ వ్యాపారాల వారసుల కంటే స్వయంగా సంస్థలను ప్రారంభించి విజయవంతం చేసిన యువతే ఎక్కువగా ఉండటం భారత స్టార్టప్ రంగంలో వస్తున్న మార్పుకు నిదర్శనంగా నిలిచింది. జాబితాలో చోటు పొందిన వారి సగటు వయస్సు 28 సంవత్సరాలు కావడం మరో విశేషం.డీప్టెక్, ఏఐ, స్పేస్టెక్ హవాఈసారి జాబితాలో ప్రతి నలుగురిలో ఒకరు డీప్టెక్ లేదా హార్డ్టెక్ రంగాలకు చెందినవారే. మొత్తం 27 మంది ఈ విభాగాల నుంచి ఎంపికయ్యారు. ఇందులో ఏఐ & మెషిన్ లర్నింగ్కు చెందినవారు 8 మంది, ఈవీ & ఆటో కాంపోనెంట్స్ రంగానికి చెందినవారు ఏడుగురు, స్పేస్ టెక్ నుంచి ఆరుగురు, ఏరోస్పేస్ & డిఫెన్స్ నుంచి నలుగురు, సైబర్ సెక్యూరిటీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఏఐ ఆధారిత స్టార్టప్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపైంది.20 ఏళ్లకే జాతీయ గుర్తింపుఈ ఏడాది జాబితాలో అత్యంత పిన్న వయస్కులు 20 ఏళ్ల ఒంకార్ సింగ్ బాత్రా (Apolink), ధ్రవ్య షా (Supermemory). వీరిద్దరూ ఒకరు స్పేస్టెక్, మరొకరు ఏఐ రంగాల్లో స్టార్టప్లను నిర్మిస్తున్నారు. గత ఏడాది అత్యంత చిన్న వయస్కులు 22 ఏళ్ల వారు కాగా, ఈసారి ఆ రికార్డు 20 ఏళ్లకు చేరింది.మహిళా పారిశ్రామికవేత్తల ముద్రఈ ఏడాది ఆరుగురు మహిళా పారిశ్రామికవేత్తలు జాబితాలో చోటు సంపాదించారు. అంజలి సర్దానా (Pronto), శ్రేయా మిట్టల్, రియా మిట్టల్ (Cava Athleisure), దేవికా ఘోలాప్ (OptraSCAN), దేవాంశి కేజ్రీవాల్ (Skillmatics), సురమ్యా జైన్ (RAS Luxury Skincare) ఇందులో ఉన్నారు. వీరిలో నలుగురు తొలిసారిగా జాబితాలోకి వచ్చారు.బెంగళూరు అగ్రస్థానంస్టార్టప్ల కేంద్రంగా బెంగళూరు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈసారి 21 మంది యువ వ్యాపారవేత్తలు అక్కడి నుంచే ఎంపికయ్యారు. గత ఏడాది ఈ సంఖ్య కేవలం 7 మాత్రమే. అదే సమయంలో మెట్రో నగరాల వెలుపల నుంచి 40 మంది యువ వ్యాపారవేత్తలు ఎంపిక కావడం దేశవ్యాప్తంగా పారిశ్రామిక విస్తరణకు సంకేతంగా నిలిచింది.బిట్స్ పిలానీ మరోసారి టాప్విద్యాసంస్థల పరంగా బిట్స్ పిలానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఏడుగురు ఉండగా, ఈసారి ఆ సంస్థ పూర్వ విద్యార్థుల సంఖ్య 11కు పెరిగింది.జెప్టో, భారత్పే ముందంజఅండర్30 జాబితాలోని టాప్-10 సంస్థలు కలిపి 3.5 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు సమీకరించాయి. ఇందులో జెప్టో (Zepto) ఒక్కటే 2.3 బిలియన్ డాలర్లు, భారత్పే(BharatPe) సుమారు 650 మిలియన్ డాలర్లు సమీకరించి అగ్రస్థానాల్లో నిలిచాయి. మొత్తం జాబితాలోని యువ పారిశ్రామికవేత్తలు కలిపి 75 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు.లింక్డ్ఇన్లో ఆదిత్ పాలిచా హవాజెప్టో సహవ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచాకు లింక్డ్ఇన్లో సుమారు 3.77 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, అదే ఈ జాబితాలో అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వై కాంబినేటర్, గూగుల్ వంటి సంస్థలతో పాటు అనేక ప్రముఖ ఇన్వెస్టర్ల మద్దతు ఈ యువ సంస్థలకు లభించడం విశేషం. పిక్సెల్, జెప్టో, బోల్డ్ కేర్ వంటి స్టార్టప్లు అత్యధిక పెట్టుబడిదారులను ఆకర్షించిన సంస్థలుగా నిలిచాయి.భారత స్టార్టప్ రంగంలో కొత్త ధోరణిఈ ఏడాది నివేదికలో ప్రధానంగా కనిపించిన మార్పు సాఫ్ట్వేర్ ఆధారిత స్టార్టప్ల నుంచి డీప్టెక్, స్పేస్టెక్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్ టెక్నాలజీ వంటి హార్డ్టెక్ రంగాల వైపు యువ వ్యవస్థాపకులు వేగంగా మళ్లడం. దీంతో భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింత సాంకేతికత ఆధారిత, ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధమవుతోందని నివేదిక విశ్లేషించింది. -
వాట్సాప్ యూజర్నేమ్ వ్యవహారం.. కేంద్రం నోటీసులు
మొబైల్ నంబర్ను వెల్లడించకుండా వాట్సాప్లో సంభాషణలు ప్రారంభించేలా రూపొందించిన ‘యూజర్నేమ్’ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కొత్త వ్యవస్థ సైబర్ నేరాలు, ఫిషింగ్, ఇంపర్సనేషన్, ‘డిజిటల్ అరెస్ట్’ తరహా మోసాలకు అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్పై నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) భారత కార్యకలాపాలకు సంబంధించిన వాట్సాప్ చీఫ్ కంప్లయన్స్ అధికారికి పంపిన లేఖలో, యూజర్నేమ్ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్కు బదులుగా ప్రత్యేక యూజర్నేమ్ను ఉపయోగించి కొత్త వ్యక్తులతో చాట్ ప్రారంభించవచ్చు. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి సంప్రదించే వారికి ఫోన్ నంబర్ కనిపించకుండా ఉండేలా ఈ వ్యవస్థ రూపొందించారు. అదనపు భద్రత కోసం ఐచ్ఛికంగా ‘యూజర్నేమ్ కీ’ని కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది.అయితే, ఈ ఫీచర్ను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు లేదా ప్రముఖుల పేర్లను పోలిన యూజర్నేమ్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసగించే ప్రమాదం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాల దృష్ట్యా ఈ ఫీచర్ను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.తాజా పరిణామాల ప్రకారం, సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు భారత్లో యూజర్నేమ్ ఫీచర్ను అమలు చేయవద్దని కూడా మెటాకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. మెటా నుంచి వచ్చే వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి -
బంగారం అమ్మేసుకుంటున్నారు..
బంగారం ధరలు ఇటీవలి నెలల్లో రికార్డు స్థాయిని తాకిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో భారతీయ కుటుంబాల పసిడి కొనుగోలు ధోరణిలో ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. సాధారణంగా పాత బంగారు ఆభరణాలను కొత్త నగలుగా మార్చుకునే వినియోగదారులు, ఇప్పుడు వాటిని నేరుగా విక్రయించి నగదుగా మార్చుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలే ఈ ధోరణికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.3 నెలల్లో 50 టన్నుల బంగారంఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా దాదాపు 50 టన్నుల పాత బంగారం మార్కెట్లోకి వచ్చింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం అధికం. పాత ఆభరణాలను అమ్మి నగదు పొందేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని పలు నివేదికలు వెల్లడించాయి.మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర కొన్ని సందర్భాల్లో రూ.1.8 లక్షల వరకు చేరుకోగా, ప్రస్తుతం అది సుమారు రూ.1.4 లక్షల స్థాయికి దిగివచ్చింది. ధరలు ఇంకా రూ.1.2 లక్షల వరకు పడిపోవచ్చనే అంచనాలతో చాలామంది ఇప్పుడే విక్రయించి లాభాలను సొంతం చేసుకోవాలనే నిర్ణయానికి వస్తున్నారు.బంగారం అధిక ధరలను నగదుగా మార్చుకునే అవకాశంగా వినియోగదారులు చూస్తున్నారని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. గతంలో పాత నగలను ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే పద్ధతి ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం మాత్రం నేరుగా విక్రయించి నగదు పొందడానికే ప్రాధాన్యం పెరిగిందన్నారు.రీసైక్లింగ్ పరిశ్రమకు ఊతంఈ పరిణామం దేశంలోని సంఘటిత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు కూడా ఊతమిస్తోంది. ఇళ్లలో ఉపయోగం లేకుండా పడి ఉన్న బంగారం తిరిగి మార్కెట్లోకి రావడం వల్ల దిగుమతులపై ఆధారపడే అవసరం కొంత మేర తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, అధిక ధరల కారణంగా కొత్త బంగారు ఆభరణాల కొనుగోళ్లు మాత్రం మందగించినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
స్టాక్ మార్కెట్: ఎవరికి లాభాలు.. ఎవరికి నష్టాలు?
ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరలు తగ్గడం వంటి కారణాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండు సెషన్ల నష్టాల తర్వాత బుధవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 443.97 పాయింట్లు (0.58%) పెరిగి 76,922.64 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 631 పాయింట్లకుపైగా పెరిగి 77,110.08 గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 140.10 పాయింట్లు (0.59%) లాభంతో 24,005.85 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్, రియల్టీ రంగాలు సూచీల ర్యాలీకి ప్రధాన మద్దతు ఇచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల్లో ఈరోజు టాప్ గెయినర్లు ఏవి, టాప్ లూజర్లు ఏవి.. ఈ కింద చూద్దాం..సెన్సెక్స్ టాప్ గెయినర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుఎటర్నల్279.70+15.10+5.71%ఏషియన్ పెయింట్స్2,716+80.70+3.07%హెచ్యూఎల్2,182+63.80+3.02%కోటక్ బ్యాంక్400.45+8.20+2.10%అదానీ పోర్ట్స్1,848+38.00+2.10%ఎం&ఎం3,130+61.20+2.00%ఎస్బీఐ1,047+20.50+2.00%మారుతి సుజుకి14,395+280.00+1.99%అల్ట్రాటెక్ సిమెంట్11,456+203.00+1.81%యాక్సిస్ బ్యాంక్1,369+23.00+1.71%సెన్సెక్స్ టాప్ లూజర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుహెచ్సీఎల్ టెక్1,034-37.60-3.51%టెక్ మహీంద్రా1,362-42.50-3.03%టీసీఎస్1,983-48.91-2.41%టాటా స్టీల్185.17-2.90-1.54%ఇన్ఫోసిస్985.30-15.11-1.51%ఎల్ & టీ4,093-50.80-1.23%హెచ్డీఎఫ్సీ బ్యాంక్796.15-1.81-0.23%టైటాన్4,399-5.40-0.13%నిఫ్టీ 50 టాప్ గెయినర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుఎటర్నల్279.70+15.10+5.71%అదానీ ఎంటర్ప్రైజెస్3,144+108.00+3.55%నెస్లే ఇండియా1,454+48.60+3.46%ఏషియన్ పెయింట్స్2,716+80.70+3.07%హెచ్యూఎల్2,182+63.80+3.02%కోటక్ బ్యాంక్400.45+8.20+2.10%అదానీ పోర్ట్స్1,848+38.00+2.10%ఎం&ఎం3,130+61.20+2.00%ఎస్బీఐ1,047+20.50+2.00%మారుతి సుజుకి14,395+280.00+1.99%నిఫ్టీ 50 టాప్ లూజర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుహెచ్సీఎల్ టెక్1,034-37.60-3.51%టెక్ మహీంద్రా1,362-42.50-3.03%టీసీఎస్1,983-48.91-2.41%హిందాల్కో939.70-16.90-1.77%టాటా స్టీల్185.17-2.90-1.54%ఇన్ఫోసిస్985.30-15.11-1.51%డాక్టర్ రెడ్డీస్1,340-17.20-1.27%టాటా మోటార్స్347.80-4.40-1.25%ఎల్ & టీ4,093-50.80-1.23%హెచ్డీఎఫ్సీ లైఫ్569.95-5.90-1.03%మొత్తంగా, గ్లోబల్ సెంటిమెంట్ మెరుగుపడటం, చమురు ధరలు తగ్గడం మార్కెట్కు బలాన్నిచ్చాయి. అయితే ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడం వల్ల కొన్ని భారీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. -
కియా కొత్త కార్లు.. మార్కెట్లోకి టాప్ వేరియంట్లు
కియా ఇండియా (Kia India) తన పాపులర్ ఎస్యూవీ సెల్టోస్ లైనప్ను మరింత బలోపేతం చేస్తూ కొత్తగా జీటీఎక్స్(ఓ) (GTX(O)), ఎక్స్-లైన్(ఓ) (X-Line(O)) అనే టాప్ వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ప్రకటన ప్రకారం.. ఈ కొత్త వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 21.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో, ఇప్పటివరకు టాప్లో ఉన్న GTX(A), X-Line(A) వేరియంట్ల స్థానాన్ని ఇవి భర్తీ చేశాయి.సెల్టోస్ ప్రస్తుత బేస్ మోడల్ ధర రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద కొనసాగుతుండగా, కొత్త టాప్ వేరియంట్లు ప్రీమియం ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీతో మరింత హైఎండ్ సెగ్మెంట్ను లక్ష్యంగా చేసుకున్నాయి.ఈ కొత్త వేరియంట్లలో ప్రధాన ఆకర్షణగా ADAS Level 2 F+ సూట్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 28 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. జంక్షన్ క్రాస్ కొలిజన్ కంట్రోల్, లేన్ చేంజ్ అలర్ట్స్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ వంటి సేఫ్టీ టెక్నాలజీలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ను మరింత సురక్షితంగా మార్చేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.ఫీచర్ల పరంగా కూడా ఈ వేరియంట్లు మరింత ప్రీమియంగా ఉన్నాయి. కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్పిట్, ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్ సపోర్ట్, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్ప్లే (HUD), AQI డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, అలాగే మొబైల్ యాప్ ద్వారా నియంత్రించగల ఫ్రంట్–రియర్ డాష్క్యామ్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా రైన్-సెన్సింగ్ వైపర్లు, వన్-టచ్ పవర్ విండోస్, కియా కనెక్ట్ 2.0 ద్వారా 85కు పైగా కనెక్టెడ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.మార్కెట్లో ఈ అప్గ్రేడ్తో సెల్టోస్ పోటీ మరింత పెరిగింది. ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్ వంటి ప్రముఖ మిడ్-సైజ్ ఎస్యూవీలతో నేరుగా పోటీ పడుతోంది.ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, సెల్టోస్లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (115 బిహెచ్పి), 1.5 లీటర్ డీజిల్ (116 బీహెచ్పీ), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 బీహెచ్పీ) ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో మాన్యువల్, సివిటి, ఆటోమేటిక్, iMT, 7-స్పీడ్ DCT వంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. -
జీఎస్టీ వసూళ్లు: ఒక్క నెలలో రూ.1.94 లక్షల కోట్లు
దేశ జీఎస్టీ వసూళ్లు గడిచిన జూన్లో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. స్థూల జీఎస్టీ ఆదాయం 13.9 శాతం పెరిగి రూ.1,94,812 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఇది రూ.1,71,105 కోట్లుగా ఉండటం గమనార్హం.నికరంగా (రిఫండ్లు మినహాయించిన తరువాత) జీఎస్టీ వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ.1,62,377 కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో నెలలో రీఫండ్లు గణనీయంగా పెరిగి రూ.32,436 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29.1 శాతం అధికం.కేంద్ర జీఎస్టీ (CGST) వసూళ్లు 8 శాతం పెరిగి రూ.37,376 కోట్లకు చేరగా, రాష్ట్ర జీఎస్టీ (SGST) 4 శాతం వృద్ధితో రూ.45,116 కోట్లుగా నమోదైంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST)లోనూ బలమైన పెరుగుదల కనిపించింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఐజీఎస్టీ రూ.52,282 కోట్లుగా ఉండగా, దిగుమతులపై వసూళ్లు 34.6 శాతం భారీ వృద్ధితో రూ.60,038 కోట్లకు చేరాయి.దేశీయ స్థూల ఆదాయాలు మొత్తం 6.5 శాతం పెరిగి రూ.1,34,774 కోట్లుగా నమోదయ్యాయి. ఇది దేశీయ వినియోగం, సేవల రంగంలో కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్ను సూచిస్తోందని ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 9 శాతం వృద్ధితో రూ.30,714 కోట్ల జీఎస్టీ వసూళ్లను నమోదు చేసి మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 19 శాతం వృద్ధితో రూ.9,165 కోట్లు సాధించింది. గుజరాత్ రూ.11,743 కోట్లు (12% వృద్ధి), కర్ణాటక రూ.12,937 కోట్లు (10% వృద్ధి), హర్యానా రూ.10,065 కోట్లు (9% వృద్ధి) నమోదు చేశాయి. అయితే తమిళనాడు మాత్రం స్వల్పంగా 2 శాతం తగ్గుదలతో రూ.9,776 కోట్లకు పరిమితమైంది. -
క్లాడ్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
ఆంత్రోపిక్ సంస్థకు చెందిన శక్తివంతమైన ఏఐ మోడళ్లు ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5), ‘మైథోస్ 5’(Mythos 5)లపై విధించిన విదేశీ యాక్సెస్ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. అమెరికా వాణిజ్య శాఖ తన నియంత్రణలను తొలగించినట్లు ధ్రువీకరించిన అనంతరం ఈ మోడళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆంత్రోపిక్ అధికారికంగా ప్రకటించింది. ‘మా వినియోగదారుల సహనానికి, అలాగే మోడళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఆంత్రోపిక్ సంస్థ ఎక్స్ వేదికగా పేర్కొంది.భద్రతా హామీలతో లభించిన ఊరటఆన్లైన్లో విస్తృతంగా ప్రసారమైన ఒక లేఖలో అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సంస్థ ఇకపై ప్రత్యేక ఎగుమతి లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐ మోడళ్లతో ముడిపడి ఉన్న భద్రతా ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఆంత్రోపిక్ అంగీకరించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనితో పాటు, రాబోయే ఏఐ మోడళ్ల ప్రమాణాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, ఎలాంటి హానికరమైన కార్యకలాపాలు జరిగినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడానికి సంస్థ అంగీకరించింది.అసలేం జరిగింది? ఆంక్షల నేపథ్యం ఇదే..గత నెలలో(జూన్) డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆంత్రోపిక్ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులతో సహా విదేశీ పౌరులు ఎవరూ ఈ మోడళ్లను యాక్సెస్ చేయకుండా నిరోధించాలని ఆదేశించడంతో సంస్థ అకస్మాత్తుగా ఫేబుల్ 5, మైథోస్ 5 సేవలను నిలిపివేసింది. ఆ సమయంలో ప్రభుత్వం నిర్దిష్ట కారణాలేవీ చెప్పనప్పటికీ ఫేబుల్ 5లోని భద్రతా అంశాలపై అధికారులు ఆందోళన చెందడమే ఇందుకు కారణమని భావించారు.అయితే, గత శుక్రవారం క్లిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్వహించే అమెరికా సంస్థలకు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. ఇప్పుడు తాజాగా సాధారణ ప్రజలకు కూడా పూర్తిస్థాయి యాక్సెస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రంప్ ప్రభుత్వం వర్సెస్ ఆంత్రోపిక్ట్రంప్ పరిపాలనా యంత్రాంగానికి, ఆంత్రోపిక్ సంస్థకు మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆంక్షలు ఆ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి. గత మార్చిలో ఆంత్రోపిక్ ఏఐ సంస్థ రక్షణ శాఖ (పెంటగాన్)పై దావా వేసింది. తమ ఏఐ సాధనాలను సామూహిక నిఘా లేదా స్వయంప్రతిపత్త ఆయుధాల కోసం ఉపయోగించబోమని స్పష్టమైన హామీలు ఇవ్వనందుకు పెంటగాన్ ఈ సంస్థను సప్లై చెయిన్ రిస్క్గా లేబుల్ చేసింది. దీనిపై సంస్థ న్యాయపోరాటానికి దిగింది.మరోవైపు, చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ సైతం తమ తాజా మోడల్ సిరీస్ ‘జీపీటీ-5.6’ను మొదట కేవలం ‘విశ్వసనీయ భాగస్వాముల చిన్న సమూహం’ కోసం మాత్రమే విడుదల చేయనున్నట్లు గత వారం ప్రకటించింది.నిపుణులు ఏమంటున్నారు?ఈ పరిణామాలపై సిడ్నీ విశ్వవిద్యాలయంలోని ఏఐ, ట్రస్ట్ అండ్ గవర్నెన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బైలో స్పందిస్తూ, టెక్ వర్గాల్లో ఈ ఆంక్షల ఎత్తివేత ఊహించిందేనని అన్నారు. ‘పరిశోధకులు ఫేబుల్ 5ను జైల్బ్రేక్(ఏఐ మోడళ్లకు వాటిని తయారు చేసిన కంపెనీలు కొన్ని భద్రతా నియమాలను, నైతిక పరిమితులను విధిస్తాయి. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఈ ఏఐ మోడళ్లను నియంత్రిస్తారు) చేయగలిగారనే నివేదికలు వాస్తవ తీవ్రత కంటే ఎక్కువగా ప్రచారమయ్యాయి. అమెరికా ప్రభుత్వం అతిగా స్పందించిందని ఆలస్యంగా గ్రహించింది. ఇటువంటి నిర్ణయాలు పరిశ్రమలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఒకవేళ ఫేబుల్, మైథోస్లను నిషేధిస్తే భవిష్యత్తులో మార్కెట్లోకి వచ్చే ఇతర పోటీ నమూనాలను కూడా నిషేధించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
దిగొచ్చిన ఇంధన ధరలు!
కొంతకాలంగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ఉద్రిక్తతలతో అల్లాడిపోతున్న ఇంధన వినియోగదారులకు అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఊరట లభించింది. ఇరాన్ వివాదం సడలడం, కీలకమైన సముద్ర రవాణా మార్గాలు పునప్రారంభం కావడంతో అంతర్జాతీయంగా ముడిచమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలు మళ్లీ గాడిలో పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంతరాయాలపై ఆందోళనలు తొలగిపోవడంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ప్రైవేట్ రంగ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ రిటైల్ నెట్వర్క్లో పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఇంధన ధరలను తగ్గించిన మొదటి రిటైలర్గా నయారా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న నయారాకు చెందిన 7,000 ఇంధన స్టేషన్లలో ఈ సవరించిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. అయితే, స్థానిక పన్నులు (వ్యాట్) ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో తుది రిటైల్ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.మార్చి నాటి పెంపు ఉపసంహరణగతంలో ఇరాన్ వివాదంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఎగబాకడంతో.. మార్చి 26న నయారా సంస్థ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 పెంచింది. తాజా తగ్గింపుతో ఆ పెంపును సంస్థ పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లయింది. గ్లోబల్ మార్కెట్ స్థిరీకరణ తర్వాత ఇంధన ధరల్లో వచ్చిన మొదటి తగ్గుదల సవరణ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం గుజరాత్లోని వడినార్లో తమ 20 మిలియన్ టన్నుల (వార్షిక సామర్థ్యం) రిఫైనరీ టర్నరౌండ్ను పూర్తి చేసుకుని దేశీయ డిమాండ్ను అందుకునేందుకు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ప్రభుత్వ రంగ సంస్థల్లో మార్పు లేదు!ప్రైవేట్ రంగ సంస్థ నయారా ధరలను తగ్గించినప్పటికీ ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు మాత్రం ఇంకా పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు దేశంలోని లక్షకు పైగా ఇంధన స్టేషన్లలో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12 గాను, డీజిల్ ధర లీటరుకు రూ.95.20 గాను కొనసాగుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
బంగారం ధరలు కూల్ఆఫ్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
మైక్రోసాఫ్ట్లో మరోసారి ఉద్యోగాల కోత?
ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోమారు భారీగా ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ, త్వరలోనే కొత్త రౌండ్ లే-ఆఫ్స్ను ప్రకటించవచ్చని ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ ఇన్సైడర్ అంచనా వేసింది. ముఖ్యంగా కంపెనీకి చెందిన ఎక్స్బాక్స్ గేమింగ్ విభాగంతో పాటు సేల్స్, కన్సల్టింగ్ విభాగాల్లోని వేలాది ఉద్యోగాలపై ఈ ప్రభావం పడనుందని పేర్కొంది.గత ఏడాది (2025) మే నెలలో 6,000 మందిని, జులైలో సంస్థ మొత్తం సిబ్బందిలో 4 శాతానికి సమానమైన 9,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి జరగబోయే కోతలు కొంత తక్కువగానే ఉండవచ్చని సమాచారం. కంపెనీకున్న మొత్తం 2,20,000 మంది ఉద్యోగుల్లో ఈ తాజా లే-ఆఫ్స్ ప్రభావం 2.5% కంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నిర్ణయం?సాధారణంగా మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆర్థిక సంవత్సరాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం నాటికి ఈ ఉద్యోగాల కోతపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ గడువులో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ ప్రక్రియలో ప్రభావితమయ్యే కొంతమంది ఉద్యోగులకు అంతర్గతంగా వెంటనే కొత్త బాధ్యతలను అప్పగించే యోచనలో కూడా కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.ఏఐపై పెరుగుతున్న ఖర్చుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఏఐ అప్లికేషన్లు, సాఫ్ట్వేర్ సేవల విస్తరణకు వ్యయం పెరుగుతుండటంతో ఇతర విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు భవిష్యత్తులో ఏఐ సాఫ్ట్వేర్ సాంకేతికత వల్ల కొన్ని సంప్రదాయ సాఫ్ట్వేర్ సేవల అవసరం తగ్గుతుందనే ఆందోళనలతో అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గత నెలలో మైక్రోసాఫ్ట్ స్టాక్ సుమారు 17 శాతం మేర క్షీణించింది.గేమింగ్ విభాగంలో రీసెట్ వ్యూహంమైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ గేమింగ్ విభాగంలో ఈ మార్పులు ఊహించినవేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్స్బాక్స్ నూతన సీఈఓ ఆశా శర్మ ఇటీవల ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో.. వ్యాపారాన్ని సరికొత్తగా రీసెట్ చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ రీస్ట్రక్చరింగ్లో భాగంగానే గేమింగ్ విభాగంలో ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు స్పష్టమవుతోంది.స్వచ్ఛంద పదవీ విరమణ అస్త్రంగత ఏడాదితో పోలిస్తే ఈసారి లే-ఆఫ్స్ ప్రభావం తగ్గడానికి కంపెనీ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అమెరికాలోని ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ ఒక ప్రత్యేక బై-అవుట్ ఆఫర్ను ప్రకటించింది. వయస్సు, సర్వీస్ కాలం ఆధారంగా రూపొందించిన ఈ పథకానికి అమెరికాలోని సంస్థ మొత్తం వర్క్ఫోర్స్ (1,25,000 మంది)లో సుమారు 7 శాతం (దాదాపు 9,000 మంది) ఉద్యోగులు అర్హత సాధించారు.కంపెనీ అంచనాలకు అనుగుణంగానే అర్హులైన వారిలో మూడింట ఒక వంతు మంది ఉద్యోగులు ఈ స్వచ్ఛంద విరమణను ఎంచుకున్నారు. ఫలితంగా సంస్థకు సహజంగానే ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అయితే, కమీషన్ ఆధారిత వేతనాలు పొందే సేల్స్ ఉద్యోగులకు మాత్రం ఈ వీఆర్ఎస్ ఆఫర్ వర్తించలేదని కంపెనీ అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైంది. అందుకే ఇప్పుడు నేరుగా సేల్స్, కన్సల్టింగ్ విభాగాల్లో ఉద్యోగాల తగ్గింపునకు మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:18 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు పెరిగి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 154 పాయింట్లు పుంజుకొని 76,643 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 2.07 శాతం పుంజుకుంది.Today Nifty position 01-07-2026(time: 09:18 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కాలంతో ప్రయాణం.. క్రమశిక్షణతో లాభం!
షేర్ మార్కెట్లో అసాధారణ లాభాల కోసం వెంపర్లాడటం కంటే క్రమశిక్షణతో కూడిన సాధారణ పెట్టుబడి సూత్రాలను పాటించడమే సంపద సృష్టికి అసలైన రహస్యమని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ స్పష్టం చేశారు. చాలా మంది పెట్టుబడిదారులు విస్మరించే ఈ సరళమైన ఆర్థిక సూత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సంక్లిష్టమైన వ్యూహాలు లేదా నిరంతరం స్టాక్స్ మార్చడం వంటివి అవసరం లేదన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికే ఉత్తమ ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన పంచుకున్న కొన్ని అంశాలను కింద చూద్దాం.నితిన్ కామత్ పెట్టుబడి ఫార్ములా..మీ ఆర్థిక లక్ష్యం, కాలపరిమితిని బట్టి ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి విభాగాల్లో సరైన నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలి.విడివిడిగా స్టాక్స్ ఎంచుకుంటూ రిస్క్ తీసుకునే బదులు తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లను ఎంచుకోవడం ఉత్తమం.మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి.ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడి పెట్టే మొత్తాన్ని కూడా క్రమంగా పెంచుకుంటూ పోవాలి.నిర్ణీత కాల వ్యవధిలో మీ పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడం ముఖ్యం.ఇది వినడానికి చాలా సరళంగా అనిపించవచ్చు, కానీ ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. చాలా మంది ఇక్కడే విఫలమవుతుంటారని నితిన్ కామత్ అన్నారు.ఇన్వెస్టర్ల గందరగోళం.. మార్కెట్ సంక్లిష్టతసాధారణ ఇన్వెస్టర్లు పోర్ట్ఫోలియో నిర్మాణంలో ఎదుర్కొనే ప్రధాన సవాళ్లను కామత్ ప్రస్తావించారు.ఈక్విటీల్లో ఎంత ఉంచాలి?డెట్ (రుణం) విభాగంలో ఎంత పెట్టుబడి పెట్టాలి?బంగారం ఎంత శాతం ఉండాలి?లక్ష్యాలు దగ్గరపడుతున్నప్పుడు ఆస్తి కేటాయింపులను ఎలా మార్చాలి?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇన్వెస్టర్లను వేధిస్తుంటాయి. వీటికి తోడు మార్కెట్లో వందలాది మ్యూచువల్ ఫండ్లు, ఈటీఎఫ్లు అందుబాటులో ఉండటంతో గందరగోళం మరింత పెరుగుతుంది. ఈ సంక్లిష్టత కారణంగానే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ వైపు రాకుండా తక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు, సాంప్రదాయక బీమా పథకాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన విశ్లేషించారు.పరిష్కారంగా లైఫ్ సైకిల్ ఫండ్స్ఈ సవాళ్లకు, గందరగోళానికి చెక్ పెట్టేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవల భారతదేశంలో ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ను ప్రవేశపెట్టింది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి నిర్ణయాలను ఆటోమేట్ చేయడం ద్వారా ఈ ఫండ్స్ మెరుగైన పరిష్కారాన్ని అందిస్తాయని కామత్ అభిప్రాయపడ్డారు.ఇవి ఎలా పనిచేస్తాయి?ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యానికి (ఉదాహరణకు రిటైర్మెంట్ లేదా పిల్లల చదువు) సరిపోయే కాలపరిమితి గల ఫండ్ను ఎంచుకుంటే సరిపోతుంది. మిగతా బాధ్యత అంతా ఆ ఫండే చూసుకుంటుంది. ప్రారంభంలో (వయసు లేదా కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు) ఈక్విటీల్లో ఎక్కువ పెట్టుబడి పెడుతూ లక్ష్యం దగ్గరపడే కొద్దీ రిస్క్ తగ్గించడం కోసం క్రమంగా డెట్ (రుణ) విభాగానికి పెట్టుబడులను మళ్లిస్తుంది. ఈ విధానం వల్ల ఇన్వెస్టర్ల వయస్సు, రిస్క్ ప్రొఫైల్కు అనుగుణంగా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ అవుతుంది. -
ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో వరుసగా పెరుగుతూ వచ్చిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. తాజాగా ఒక్కో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.183 మేర తగ్గింపు ప్రకటించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులకు కొంత ఉపశమనం లభించింది.ఇటీవల ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో గత కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ ధరలు వరుసగా పెరిగాయి. మే నెలలో భారీ పెంపు నమోదు కాగా, జూన్లోనూ మరోసారి ధరలు పెరగడంతో వ్యాపార రంగంపై అదనపు భారం పడింది.తాజాగా పరిస్థితులు కొంత మెరుగుపడటంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.3,113.50గా ఉన్న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.2,930కు తగ్గింది. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో ధరల సవరణ అమలులోకి వచ్చింది.పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. దేశీయ ఉత్పత్తి మెరుగుపడటం, దిగుమతి ఎల్పీజీ కార్గోల రాక ప్రారంభం కావడంతో సరఫరా పరిస్థితులు స్థిరపడుతున్నాయి. దీంతో గతంలో విధించిన కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పరిమితులను పూర్తిగా తొలగించి, యుద్ధానికి ముందు స్థాయికి సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపింది.సంక్షోభ సమయంలో భారీగా ప్రభావితమైన సరఫరా వ్యవస్థను క్రమంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం దశలవారీ చర్యలు తీసుకుంది. ప్రారంభంలో 50 శాతం స్థాయికి పడిపోయిన బల్క్ ఎల్పీజీ సరఫరా ఇప్పుడు మళ్లీ 70 శాతం వరకు చేరిందని అధికారులు తెలిపారు. అలాగే రిఫైనరీలను ఎక్కువగా ఎల్పీజీ ఉత్పత్తికి మళ్లించడం ద్వారా దేశీయ సరఫరాను పెంచారు.ఈ తగ్గింపు కేవలం కమర్షియల్ వినియోగానికి మాత్రమే వర్తిస్తుంది. గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 40,000 టన్నుల కంటే ఎక్కువగా నిలబెట్టేలా చర్యలు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.ప్రధాన నగరాల్లో తాజా కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి:* ఢిల్లీ: రూ.2,930* హైదరాబాద్: రూ.3,178* విజయవాడ: రూ.3,115ధర తగ్గింపు నేపథ్యంలో హోటల్, రెస్టారెంట్ రంగాలకు కొంత ఊరట లభించినప్పటికీ, గత నెలల పెంపుల ప్రభావం ఇంకా కొనసాగుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఓయో ఐపీవో@ రూ. 6,650 కోట్లు
న్యూఢిల్లీ: ఓయో మాతృ సంస్థ ప్రిజమ్ .. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించి అప్డేట్ చేసిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇది పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉండనుంది.ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ కింద రూ. 1,330 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు, ఒకవేళ ఇది విజయవంతమైతే ఆ మేరకు తాజా షేర్ల జారీ పరిమాణం తగ్గనున్నట్లు సంస్థ తెలిపింది. సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (30.52% వాటా)తో పాటు సాఫ్ట్బ్యాంక్ (40.04% వాటా)తదితర షేర్హోల్డర్లు తమ వాటాలను విక్రయించడం లేదని వివరించింది. -
విజింజం పోర్టులో ఎంఎస్సీకి 49 శాతం వాటా
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్)కు చెందిన కేరళలోని విజింజం పోర్టులో 49% వాటాను స్విట్జర్లాండ్కు చెందిన ఎమ్ఎస్సీ గ్రూప్ కొనుగోలు చేయనుంది.ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్, లాజిస్టిక్స్ సంస్థ అయిన ఎమ్ఎస్సీ తన అనుబంధ సంస్థ టెర్మీనల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (టీఐఎల్) ద్వారా 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.11,800 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. భారత పోర్టు రంగంలో ఇదే అతిపెద్ద విదేశీ ప్రైవేటు పెట్టుబడిగా అదానీ పోర్ట్స్ పేర్కొంది. -
వర్షాల రాకపై వ్యాపారం !
స్టాక్ మార్కెట్ అంటే షేర్లు.. బంగారం.. కమోడిటీలు.. కరెన్సీలు మాత్రమే అనుకునే రోజులు మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, కార్బన్ క్రెడిట్లు, నీటి వినియోగం, విద్యుత్ ధరలు వంటి అంశాలపై కూడా ఫైనాన్షియల్ ఉత్పత్తులు వస్తున్నాయి. అదే దారిలో భారత్లో కూడా ‘‘వెదర్ డెరివేటివ్స్’’ అనే కొత్త కాన్సెప్ట్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. ముంబై వర్షపాతం ఆధారంగా ‘రెయిన్ ముంబై’ అనే వెదర్ డెరివేటివ్ను నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ (ఎన్సీడెక్స్) ప్రారంభించింది. వాతావరణ శాఖ (ఐఎండీ) డేటా ఆధారంగా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పర్యవేక్షణలో ఈ కాంట్రాక్టులు ట్రేడ్ అవుతాయి. రైతులకు మాత్రమే సంబంధించినవిగా పరిగణించే రుతుపవనాలు ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్లలో కూడా ‘ట్రేడింగ్ థీమ్’గా అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్వెస్టర్ల ఆసక్తిని బట్టి ముందు ముందు దేశవ్యాప్తంగా వెదర్ డెరివేటివ్స్ని ప్రారంభించేందుకు కమోడిటీ ఎక్సే్చంజ్ కసరత్తు చేస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ఏమిటీ రెయిన్ ముంబై?రెయిన్ ముంబై ఫ్యూచర్ కాంట్రాక్టు వర్షపాతం ఎక్కువా? తక్కువా? అన్న డేటాపై ఆధారపడి ట్రేడయ్యే ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ . రైతులు, పవర్ కంపెనీలు, నిర్మాణ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఇలా వర్షాల ప్రభావానికి లోనయ్యే అన్ని రంగాలకు ఇది రిస్క్ మేనేజ్మెంట్ సాధనంగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మార్కెట్ను అర్థం చేసుకునే ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలను అందిస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటివరకు వాతావరణ సంబంధిత ప్రమాదాలు జరిగినపుడు బాధితులకు బీమా మాత్రమే ప్రస్తుతం నష్టపరిహారంగా అందుబాటులో ఉంది. ఇప్పుడు మార్కెట్ ఆధారిత ‘వెదర్ ట్రేడింగ్’ వారికి కొత్త రక్షణ కవచంగా నిలుస్తుందనేది మార్కెట్ వర్గాలు అంచనా.ప్రపంచానికి పాతవే..ప్రపంచ మార్కెట్లలో ఇలాంటి డెరివేటివ్స్ కొత్త విషయమేం కాదు. అమెరికా, యూరప్లలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు, గ్యాస్ ధరలు, విద్యుత్ వినియోగం వంటి అంశాలపై ట్రేడింగ్ ఉత్పత్తులు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కార్బన్ క్రెడిట్ మార్కెట్లు అయితే బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారాయి. ఈకోవలోనే వాతావరణ మార్పులు పెరుగుతున్న సమయంలో ‘‘క్లైమేట్ ఫైనాన్స్’’ వేగంగా విస్తరిస్తోంది.ఇది పెట్టుబడులకు మాత్రమే కాకుండా, ధరల మార్పులు , వ్యాపార రిస్క్ల నుంచి రక్షణ పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. భారత్లో ఇప్పటివరకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ వరకే పరిమితమయ్యారు. కానీ భవిష్యత్తులో యువ ఇన్వెస్టర్లు లక్ష్యంగా డేటా ఆధారిత కొత్త తరహా ఫైనాన్షియల్ ఉత్పత్తులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఇన్వెస్టర్లు, మార్కెట్పై అవగాహన ఉన్నవారు ఇలాంటి విభిన్న ట్రేడింగ్ ఉత్పత్తులపై ఆసక్తి చూ పుతున్నారని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘ఆల్టర్నేటివ్ డెరివేటివ్స్’⇒ వాతావరణం ⇒ కార్బన్ క్రెడిట్లు ⇒ విద్యుత్ వినియోగం ⇒ నీటి హక్కులు ⇒ ఈఎస్జీ/ సస్టెయినబిలిటీ ఇండెక్స్లు (పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, మరియు పారదర్శక పాలనా ప్రమాణాల ఆధారంగా కంపెనీల పనితీరును అంచనా వేసే సూచీలు.) ⇒ పునరుత్పాదక ఇంధన వనరుల పత్రాలురిస్క్ ఎక్కువేడెరివేటివ్స్ అంటే అధిక రిస్క్ సాధనాలు. అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టకూడదు. మార్కెట్ ఎలా పనిచేస్తుంది? ఒడిదుడుకులు ఎలా ఉంటాయి? వంటి అంశాలు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ప్రవేశించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ అంచనాలతో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఈ మార్కెట్లో ప్రవేశించాలని హెచ్చరిస్తున్నారు. -
షాక్లున్నా ఎకానమీ ఓకే
ముంబై: అంతర్జాతీయంగా ఎదురవుతున్న షాక్లను దీటుగా ఎదుర్కొనేలా ఆర్థిక సంస్థల బ్యాలెన్స్ షీట్లు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీ ఎకానమీ పటిష్టంగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. మూలధనం, లిక్విడిటీ సమృద్ధిగా ఉండటం, అసెట్ క్వాలిటీ మెరుగుపడుతుండటం, లాభదాయకత స్థిరంగా ఉండటంలాంటి అంశాల దన్నుతో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ) సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది.మంగళవారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాలు వెల్లడించింది. షాకుల్లాంటివి ఏవైనా తలెత్తినా, తట్టుకుని నిలబడే సత్తా బ్యాంకింగ్ సిస్టమ్కు ఉన్నట్లు స్ట్రెస్ టెస్టుల్లో వెల్లడైనట్లు వివరించింది. అటు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల అసెట్ క్వాలిటీ, లాభదాయకత కూడా మెరుగుపడుతోందని వివరించింది.‘భారీ స్థాయిలో అంతర్జాతీయంగా షాక్లు ఎదురవుతున్నప్పటికీ భారత ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ చెప్పుకోతగ్గ స్థాయిలో పటిష్టంగా నిలుస్తున్నాయి. పటిష్ట వృద్ధి, ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, నిధుల లభ్యత పుష్కలంగా ఉండటంలాంటి అంశాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో తోడ్ప డుతున్నాయి’ అని ఎఫ్ఎస్ఆర్ ముందుమాటలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ⇒ సైబర్ ముప్పులపరంగా చూస్తే సమీప భవిష్యత్తులో ఏఐ ఆధారిత సైబర్ దాడుల రిస్కులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ⇒ ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ ఉత్పాదకతపరంగా ఏఐతో ప్రయోజనాలు ఒనగూరవచ్చన్న ఆశాభావంతో గ్లోబల్ ఎకానమీ పటిష్టంగానే ఉంది. ⇒ భారతీయ బ్యాంకుల్లో స్థూల మొండిబాకీలు పలు దశాబ్దాల కనిష్ట స్థాయి 1.8%కి తగ్గాయి. పరిస్థితులు ఎంత దిగజారినా 2028 మార్చి ఆఖరు నాటికి 1.9%కి మాత్రమే పెరగొచ్చు. -
పసిడి ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతున్నాయి. అయితే నేడు (మంగళవారం) పసిడి ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. దీంతో ఒక్కసారిగా గోల్డ్ రేటు పెరిగిపోయింది. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (జూన్ 30) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,30,200 రూపాయల వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలోనే పసిడి ధరల్లో భారీ మార్పు (రూ.1750 పెరిగింది) జరిగిందని స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల ధర రూ.1,40,130 నుంచి రూ.1,42,040 (రూ.1910 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పు సంభవించింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,28,600 రూపాయల నుంచి రూ.1,30,350 వద్దకు, 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,42,190 వద్దకు చేరింది.అయితే చెన్నైలో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1000 తగ్గి రూ.1,32,000 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1090 తగ్గి రూ.1,44,000 వద్ద నిలిచాయి.మొత్తం మీద దేశంలో గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేయడం వల్ల, పసిడి ప్రియులలో ఆందోళన మొదలైంది. అయితే రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు మాత్రం రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. జూలైలో 8 రోజుల సెలవు!
జూలై నెలలో మొత్తం 8 రోజులు స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇవి సాధారణ వారాంతపు సెలవులు మాత్రమే. ఇందులో 4 శనివారాలు, 4 ఆదివారాలు ఉన్నాయి. తేదీల ప్రకారం చూస్తే జూలై 4, 11, 18, 25 శనివారాలు కాగా, జూలై 5, 12, 19, 26 ఆదివారాలు మార్కెట్ సెలవులు అవుతాయి.సాధారణ వారాంతపు సెలవుల కారణంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈ క్లోజ్ అవుతాయి. కాబట్టి జూలై 2026లో తమ ట్రేడింగ్ షెడ్యూల్ను ప్లాన్ చేసుకుంటున్న పెట్టుబడిదారులు ఈ నెలలో వారపు రోజులలో స్టాక్ మార్కెట్ సెలవులు లేవని గమనించాలి. ఎందుకంటే.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) రెండూ అన్ని ట్రేడింగ్ రోజులలో యధావిధిగా పనిచేస్తాయి.ఎన్ఎస్ఈ క్యాలెండర్ ప్రకారం.. 2026లో తదుపరి వర్కింగ్ డే సెలవు సెప్టెంబర్ 14న వస్తుంది. ఆ రోజు గణేష్ చతుర్థి కారణంగా మార్కెట్ క్లోజ్.2026 సంవత్సరంలో మొత్తం 16 వర్కింగ్ డే సెలవులు షేర్ మార్కెట్కు ఉన్నాయి. రాబోయే నెలల్లో వివిధ జాతీయ, మతపరమైన పండుగల కారణంగా ట్రేడింగ్ ఉండదు. అవి..అక్టోబర్ 2: గాంధీ జయంతిఅక్టోబర్ 20: దసరానవంబర్ 10: దీపావళినవంబర్ 24: శ్రీ గురు నానక్ జయంతిడిసెంబర్ 25: క్రిస్మస్కొన్ని ముఖ్యమైన పండుగలు వారాంతాల్లో రావడంతో అదనపు సెలవులు ఉండవు. ఉదాహరణకు, ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) శనివారం కావడం వల్ల అదనపు ట్రేడింగ్ సెలవుగా ఉండదు. అలాగే దీపావళి లక్ష్మీ పూజ కూడా ఆదివారం రావడం వల్ల సాధారణ సెలవు ఉండదు. అయితే ఆ రోజున ప్రత్యేకంగా ముహూర్త ట్రేడింగ్ సెషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది. -
665 కిమీ రేంజ్.. టాటా సియెర్రా ఈవీ లాంచ్!
టాటా మోటార్స్ ఎట్టకేలకు తన సియెర్రా EVను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. ఈ ఎస్యూవీ ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.24.79 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు జులై 15 నుంచి మొదలవుతాయని సమాచారం.కొత్త సియెర్రా ఈవీ.. స్టాండర్డ్ మోడల్ కంటే కొంత భిన్నమైన డిజైన్ పొందుతుంది. ఇందులో బాడీ రంగులో ఉండే క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్, కొన్ని ప్రత్యేకమైన విజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా కొత్త డిజైన్ పొందాయి. కాగా ఇది రిషికేష్ రాపిడ్స్, నైనిటాల్ నాక్టర్న్, ప్రిస్టీన్ వైట్, అండమాన్ అడ్వెంచర్, ప్యూర్ గ్రే, బెంగాల్ రూజ్, కూర్గ్ క్లౌడ్ అనే మల్టిపుల్ కలర్ ఎంపికలలో లభిస్తుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. దీని లేఅవుట్ సాధారణ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్ప్లేతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉండటం చూడవచ్చు.ఫీచర్స్ జాబితాలో.. వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, అటానమస్ పార్కింగ్ అయిన ఈ-వ్యాలెట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, రియర్ సన్బ్లైండ్లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్గేట్ వంటివన్నీ ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ కారులో స్టాండర్డ్, ఇమ్మర్సివ్, పర్సనల్, స్నో అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. భద్రతా ఫీచర్ల జాబితాలో, ఈ కారు ADAS లెవెల్ 2 ఫీచర్లు, ESP, ఆరు ఎయిర్బ్యాగ్లు, 540-డిగ్రీ కెమెరా ఉన్నాయి.ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!టాటా సియెర్రా EV రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. వీటిలో వెనుక భాగంలో 175 kW మోటార్, ముందు భాగంలో 103 kW మోటార్ ఉన్నాయి. వెనుక మోటార్ 240 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. ముందు మోటార్ 164 Nm టార్క్ అందిస్తుంది. దీని ఫలితంగా మొత్తం 504 Nm గరిష్ట టార్క్ లభిస్తుంది..ఇది 75 kWh, 63 kWh బ్యాటరీ ప్యాక్ల ఎంపికలలో లభిస్తుంది. 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్పై 665 కి.మీ. రేంజ్ అందిస్తే, 63kWh వెర్షన్ 565 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ తగ్గుతుంది. ఈ బ్యాటరీలను 120 kW, 7.2 kW, 3.3 kW ఛార్జర్లను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. -
మస్క్ హెచ్చరిక.. టిమ్ కుక్ షాక్!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను మాత్రమే కాదు, కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల కొరత తీవ్రమవడంతో యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతోంది.యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ పరిస్థితిని 'వందేళ్లలో ఒకసారి వచ్చే వరద'తో పోల్చారు. గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, తాను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ధరల పెరుగుదల అని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం మెమరీ చిప్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.ఈ సమస్యకు ప్రధాన కారణం ఏఐ రంగం వేగంగా విస్తరించడం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం. ఈ డేటా సెంటర్లకు అధిక సామర్థ్యం గల మెమరీ చిప్లు అవసరం అవుతున్నాయి. ఫలితంగా చిప్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని ఎక్కువగా ఏఐ సర్వర్ల కోసం కేటాయిస్తున్నాయి. దీంతో ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్ల వంటి వినియోగదారుల ఉత్పత్తులకు అవసరమైన మెమరీ చిప్ల సరఫరా తగ్గిపోయింది.ప్రస్తుతం DRAM (యాప్లు పనిచేయడానికి ఉపయోగించే మెమరీ), NAND (ఫొటోలు, వీడియోలు, ఫైళ్లను నిల్వ చేసే స్టోరేజ్ చిప్లు) ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ భారీ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ వ్యయం కూడా గణనీయంగా పెరిగింది.ఈ పరిస్థితుల్లో యాపిల్ చాలా కాలం వరకు అదనపు ఖర్చును వినియోగదారులపై మోపకుండా భరించింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి సాధ్యం కాకపోవడంతో కంపెనీ మ్యాక్బుక్, ఐమ్యాక్, ఐప్యాడ్, హోమ్ప్యాడ్, యాపిల్ టీవీ వంటి ఉత్పత్తుల ధరలను 15 నుంచి 25 శాతం వరకు పెంచింది.ఉదాహరణకు, మ్యాక్బుక్ ఎయిర్ ధర 200 డాలర్లు పెరిగి 1,299 డాలర్లకు చేరగా, మ్యాక్బుక్ ప్రో ధర 300 డాలర్లు పెరిగి 1,999 డాలర్లకు చేరింది. అలాగే ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మైక్రోసాఫ్ట్ కూడా తన Xbox గేమింగ్ కన్సోళ్ల ధరలను 100 నుంచి 150 డాలర్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే మెమరీ చిప్ల కొరత ప్రభావం మొత్తం టెక్నాలజీ పరిశ్రమపైనే పడుతోంది.ఈ సమస్యను పరిష్కరించాలంటే మెమరీ చిప్ల ఉత్పత్తిని భారీగా పెంచాలని ఎలాన్ మస్క్ సూచించారు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధికి మెమరీ చిప్లే అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే టెస్లా, స్పేస్ఎక్స్, ఇంటెల్ కలిసి అత్యాధునిక చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను కూడా ప్రకటించారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్కు భారీ నష్టం.. కారణం ఇదేనా? -
ప్రపంచాన్ని మార్చిన ఆలోచన.. అలా పుట్టింది ATM పిన్!
ప్రస్తుతం జేబులో పర్సు లేకపోయినా, చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కార్డు.. దానికి తోడు నాలుగు అంకెల రహస్య కోడ్ (PIN) ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా నిమిషాల్లో నగదును చేతిలోకి తెచ్చుకోవచ్చు. బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా, మన డబ్బుకు కొండంత భద్రతను ఇచ్చే ఈ 'ఏటీఎం పిన్' వెనుక ఓ ఆసక్తికరమైన, మరెంతో ఆశ్చర్యకరమైన చరిత్ర దాగుంది. కోట్లాది రూపాయల లావాదేవీలను కాపలా కాసే ఈ అద్భుత సాంకేతికతను కనిపెట్టిన మేధావికి అప్పట్లో దక్కిన పారితోషికం ఎంతో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసు కోవాల్సిందే!1960ల కాలంలో బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా ప్రక్రియను సులభతరం చేసేందుకు అంతర్జాతీయంగా పరిశోధనలు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్కు చెందిన ఒక ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్న జేమ్స్ గుడ్ఫెలో అనే స్కాటిష్ ఇంజనీర్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. వినియోగదారుడి గుర్తింపును మానవ ప్రమేయం లేకుండా, యంత్రమే స్వయంగా ధృవీకరించేలా ఒక ప్లాస్టిక్ కార్డును, దానికి అనుసంధానంగా ఒక రహస్య సంఖ్యను (Personal Identification Number - PIN) కలిపి పనిచేసే సాంకేతికతను ఆయన 1966లో అభివృద్ధి చేశారు.కేవలం 10 పౌండ్ల బహుమతి!జేమ్స్ గుడ్ఫెలో కనిపెట్టిన ఈ పిన్ వ్యవస్థ బ్యాంకింగ్ రంగాన్నే మార్చేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఏటీఎం కేంద్రాలు ఈ భద్రతా సూత్రం ఆధారంగానే నడుస్తున్నాయి. కానీ, ఇంతటి విప్లవాత్మక ఆవిష్కరణ చేసినందుకు గాను, ఆ రోజుల్లో ఆయన పనిచేస్తున్న సంస్థ ఆయనకు అందించిన బోనస్ ఎంతో తెలుసా? కేవలం 10 పౌండ్లు మాత్రమే!ప్రస్తుత భారతీయ కరెన్సీ విలువ ప్రకారం చూస్తే ఇది సుమారు వెయ్యి రూపాయల లోపే ఉంటుంది."ఆవిష్కరణ నాదే అయినా, కంపెనీ నిబంధనల ప్రకారం నాకు దక్కిన బోనస్ కేవలం పది పౌండ్లు మాత్రమే" అని జేమ్స్ గుడ్ఫెలో తర్వాతి కాలంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం. లండన్లో మొదలైన ప్రస్థానం..జేమ్స్ గుడ్ఫెలో ఈ సాంకేతికతను రూపొందించిన మరుసటి సంవత్సరమే, అంటే 1967లో లండన్ నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు పంపిణీ యంత్రాన్ని (Cash Machine) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ సాంకేతికత ఖండంతరాలు దాటి విస్తరించింది. 1973 జూన్ 4న ఈ వ్యవస్థకు అమెరికాలో అధికారికంగా పేటెంట్ లభించడంతో, ఆధునిక ఏటీఎంల యుగం ఊపందుకుంది. భద్రతకు కేరాఫ్ అడ్రస్!.నేడు మనం ఏటీఎం సెంటర్కు వెళ్లినప్పుడు తప్పుడు పిన్ నంబర్ను వరుసగా మూడు సార్లు నమోదు చేస్తే కార్డు బ్లాక్ అయిపోతుంది. మన ఖాతాలోని సొమ్ము సైబర్ నేరగాళ్ల పాలు కాకుండా అడ్డుకునే ఈ పటిష్టమైన భద్రతా వలయానికి పునాది వేసింది ఆ 10 పౌండ్ల ఆవిష్కరణే కావడం విశేషం. ఆర్థిక రంగాన్ని డిజిటల్ వైపు నడిపించిన ఈ స్కాటిష్ మేధావి సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం, 2006లో ఆయనకు ప్రతిష్టాత్మక 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' (OBE) గౌరవాన్ని అందించింది. పారితోషికం చిన్నదైనా, ఆయన అందించిన సాంకేతికత మాత్రం ప్రపంచ మానవాళికి అందించి సేవ అమూల్యమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు!.- పసుపులేటి వెంకటేశ్వరరావు. -
మైక్రోసాఫ్ట్కు భారీ నష్టం.. కారణం ఇదేనా?
మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటి. అయితే.. ఇటీవల ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ నెలలో మాత్రమే మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 17 శాతం పడిపోగా, కంపెనీ మార్కెట్ విలువలో 570 బిలియన్ డాలర్లకు (రూ.53.9 లక్షల కోట్లు) పైగా తగ్గుదల నమోదైంది. డిసెంబర్ 2000 తర్వాత సంస్థకు ఇదే అతిపెద్ద నెలవారీ క్షీణత కావడం గమనార్హం.కంపెనీకి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధస్సు (AI)పై మైక్రోసాఫ్ట్ పెడుతున్న భారీ పెట్టుబడులు. గత కొన్నేళ్లుగా సంస్థ డేటా సెంటర్లు, ఏఐ చిప్స్, క్లౌడ్ సర్వీసులు, అలాగే కోపైలెట్ వంటి ఏఐ ఉత్పత్తుల అభివృద్ధి కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని కంపెనీ నమ్ముతున్నప్పటికీ, పెట్టుబడిదారులు మాత్రం ఆ లాభాలు ఎప్పుడు వస్తాయనే విషయంలో ఆందోళన చెందుతున్నారు.ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో అజూర్ క్లౌడ్ సేవల వృద్ధి మార్కెట్ అంచనాల కంటే కొంత తక్కువగా ఉండడం కూడా పెట్టుబడిదారుల్లో నిరాశను కలిగించింది. అంతేకాకుండా.. రాబోయే నెలల్లో కూడా కంపెనీ భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తామని ప్రకటించింది. దీంతో ఖర్చులు పెరుగుతున్నా, లాభాలు మాత్రం అదే వేగంతో పెరగడం లేదనే భావన మార్కెట్లో ఏర్పడింది.ఏఐ అనేది మైక్రోసాఫ్ట్కు ఒక గొప్ప అవకాశం అయినప్పటికీ, అదే సమయంలో ఒక సవాలుగా కూడా మారింది. భవిష్యత్తులో ఏఐ కారణంగా సంప్రదాయ సాఫ్ట్వేర్లపై డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఏఐ రంగంలో ముందుండాలంటే కంపెనీ నిరంతరం భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు ప్రస్తుతం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.అయితే.. ఈ షేర్ పతనాన్ని అందరూ ప్రతికూలంగా చూడడం లేదు. కొంతమంది ప్రముఖ పెట్టుబడిదారులు, విశ్లేషకులు కొనుగోలుకు ఇది మంచి అవకాశమని భావిస్తున్నారు. గతంలో 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి ప్రసిద్ధి చెందిన పెట్టుబడిదారు మైఖేల్ బరీ కూడా మైక్రోసాఫ్ట్ షేర్లపై దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఆయన నిర్ణయం వల్ల కంపెనీ షేర్లు కొంత మేర కోలుకున్నాయి.మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఆదాయం రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏఐ రంగంలో కంపెనీకి ఉన్న బలమైన స్థానం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయి. అయితే ఇప్పుడు పెట్టుబడిదారులు కేవలం భారీ పెట్టుబడులు పెట్టడాన్ని కాకుండా, వాటి ద్వారా నిజంగా ఎంత లాభం వస్తుందో చూడాలని కోరుకుంటున్నారు.మైక్రోసాఫ్ట్ షేర్లు పడిపోవడం అంటే ఏఐ భవిష్యత్తు బలహీనపడిందని అర్థం కాదు. ఇది పెట్టుబడిదారుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకు సంకేతం మాత్రమే. ఒకప్పుడు ఏఐలో పెట్టుబడి పెడితే చాలు అనుకునే మార్కెట్, ఇప్పుడు ఆ పెట్టుబడుల వల్ల లాభాలు వస్తున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం కోరుతోంది. అందుకే మైక్రోసాఫ్ట్కు ప్రస్తుతం ఎదురవుతున్న సవాలు ఏఐలో ముందుండటం మాత్రమే కాదు, ఆ పెట్టుబడులను స్థిరమైన లాభాలుగా మార్చి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మళ్లీ గెలుచుకోవడం కూడా. ఇదీ చదవండి: నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్! -
టెక్కీల ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్న సీఈఓ!
సాఫ్ట్వేర్ రంగం అంటేనే విలాసవంతమైన జీవితం, లక్షల్లో జీతాలు అనుకునే వారికి ఐటీ పరిశ్రమలోని మరో చీకటి కోణం షాక్కు గురిచేస్తోంది. ప్రాజెక్ట్ డెడ్లైన్ల పేరిట ఉద్యోగుల మానసిక ప్రశాంతతను హరిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ఒక టాక్సిక్ (విషపూరిత) సీఈఓ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారాంతాలతో (ఆదివారాలు) కలిపి రోజుకు 14 గంటల పాటు గొడ్డుచాకిరీ చేయించుకోవడమే కాకుండా.. ఉద్యోగుల విద్య, సామర్థ్యం, చివరికి వారి కుటుంబాలను లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ఒక సీఈఓ దారుణ ప్రవర్తనను ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు.ఆ ప్రాజెక్ట్ ముగిసేలోపే ఇంకోదానికి..కంపెనీలో చేరినప్పటి నుంచి తనకు ఎదురవుతున్న నరకాన్ని సదరు టెక్కీ సుదీర్ఘ పోస్ట్లో వివరించారు. సంస్థలో జాయిన్ అయినప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ పూర్తికాకముందే మరో దానికి మారుస్తున్నారని, దీనివల్ల దేనిపైనా స్పష్టత లేకుండా పోతోందని పేర్కొన్నారు. ‘గత నెల రోజులుగా నేను ఒక క్లయింట్-ఫేసింగ్ డేటా-మ్యాపింగ్ ప్రాజెక్ట్లో బృందంతో కలిసి పని చేస్తున్నాను. మా కంపెనీ సీఈఓనే మాకు మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. ఆయనే మాకు ఒక నిర్దిష్ట లాజిక్ ఇచ్చారు. అందుబాటులో ఉన్న డేటాను బట్టి మేము ఆ లాజిక్ను వర్తింపజేసి, విశ్లేషణను పూర్తి చేసి అవుట్పుట్ సమర్పించాం. తీరా చూస్తే, ఆ మ్యాపింగ్ తప్పని క్లయింట్ చెప్పారు’ అని టెక్కీ తెలిపారు.ఉద్యోగులపై నింద!కంపెనీకి క్లయింట్ ఇచ్చిన డేటానే అసంపూర్ణంగా ఉన్నప్పటికీ సీఈఓ మాత్రం మొత్తం నిందను బృందంపైనే నెట్టేసినట్లు డెవలపర్ ఆరోపించారు. ‘గత వారం రోజులుగా మీటింగుల్లో ఆయన ప్రవర్తన చాలా వ్యక్తిగతంగా, అవమానకరంగా మారింది. ఇది ఇక పనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కాదు. మా విద్య, సామర్థ్యాలు, కుటుంబాలు, విలువపై ఆయన దాడి చేస్తున్నారు. మేము సాంకేతిక పరిమితులను వివరించడానికి ప్రయత్నించినా లేదా ఇప్పటికే పూర్తి చేసిన పనిని చూపించినా ఆయన అసలు వినడం లేదు’ అన్నారు. బృందంలోని వారందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తానంటూ సదరు సీఈఓ నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు టెక్కీ వాపోయారు.ఆదివారాలూ వదలకుండా 14 గంటల చాకిరీఈ సంస్థలో పని గంటలు ఊహకందని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆదివారాలతో సహా నిరంతరం పని చేయించుకుంటున్నారని తెలిపారు. ‘ఇటీవలే మా టీమ్ మొత్తం ఆదివారం కూడా రాత్రి దాకా పని చేసింది. కానీ సోమవారం ఉదయం మీటింగ్కు వచ్చిన సీఈఓ.. మేము అసలు మాట వినడం లేదని, సరిగా పని చేయడం లేదని మమ్మల్ని నిందించారు. నేను మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోయాను. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి లేదా మరో ఉద్యోగానికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా నాకు సమయం దొరకడం లేదు’ అని సదరు టెక్కీ తెలిపారు. ఈ ప్రతికూల వాతావరణంలో కొనసాగాలా లేక రాజీనామా చేయాలా అని ఆన్లైన్ కమ్యూనిటీని సలహా కోరారు.నెటిజన్ల సలహాఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో ఐటీ నిపుణులు, సోషల్ మీడియా వినియోగదారులు సదరు సీఈఓ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ ఉద్యోగాన్ని వదిలేయాలంటూ టెక్కీకి మద్దతుగా నిలిచారు. ‘ఆ సీఈఓకు వ్యక్తిత్వ సమస్య ఉంది. బహుశా అతనికి థెరపీ అవసరం. ఆర్థికపరమైన కట్టుబాట్లు లేకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం వృథా’ అని ఒక యూజర్ స్పందించారు. ‘మీరు వెంటనే రాజీనామా చేయండి’ అని మరో యూజర్ చెప్పారు.కార్పొరేట్ రంగంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చ జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి నరకప్రాయమైన మేనేజ్మెంట్ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి సాధించే విజయాలు ఏ కంపెనీకైనా శాశ్వతం కాదనే సత్యాన్ని సంస్థలు గ్రహించాలని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
కరుగుతోన్న పసిడి కాంతులకు కారణాలు ఇవే..
గడిచిన కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలకు చేరుకుంటూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు, ఇటీవల అనూహ్యంగా కిందికి దిగివస్తున్నాయి. ఈ రోజు (జూన్ 30, 2026) హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ.1,40,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర సుమారు రూ.1,29,000 స్థాయికి దిగివచ్చింది. గత వారంతో పోలిస్తే ఇది భారీ పతనమనే చెప్పాలి. ఈ ఆకస్మిక మార్పునకు గల ఆర్థిక కారణాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో బంగారంపై రాబడులు అందుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణాత్మక కథనం మీకోసం.ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుపసిడి మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తే ప్రస్తుతం మూడు ప్రధానాంశాలు ఈ పతనానికి కారణమవుతున్నట్లు స్పష్టమవుతోంది.1. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరిఅమెరికా కేంద్రీయ బ్యాంక్ (యూఎస్ ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేసినప్పటికీ తాజా పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును 2027కు వాయిదా వేసింది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు, ఇతర స్థిర ఆదాయ వనరులపై రాబడి పెరుగుతుంది. దీంతో వడ్డీ లేదా డివిడెండ్ ఇవ్వని బంగారం వైపు నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.2. బలపడుతున్న అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ఫెడ్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ ఇండెక్స్ ఏడాది కాలంలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. తద్వారా డిమాండ్ తగ్గి ధరలు క్షీణిస్తాయి. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి, ముఖ్యంగా ఆసియా మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లడం దీనికి అద్దం పడుతోంది.3. పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలుగత కొద్ది నెలల్లో బంగారం ధరలు భారీగా పెరగడానికి రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా (ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్) సంక్షోభాలు ప్రధాన కారణం. అయితే ఇటీవల ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చల సరళి, కీలకమైన హార్ముజ్ జలసంధి పాక్షికంగా తెరచుకోవడం వంటి పరిణామాల వల్ల గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు 30% తగ్గాయి. దాంతో అంతర్జాతీయ ఒడిదొడుకులు తగ్గి సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్ ప్రీమియం ఒక్కసారిగా ఆవిరైపోయింది.భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ మార్గాలుప్రస్తుత ధరల తగ్గుదల అనేది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అవకాశంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర బ్యాంకుల వద్ద డీ-డాలరైజేషన్ (డాలర్పై ఆధారపడటం తగ్గించడం) ప్రక్రియలో భాగంగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి ఇంకా కొనసాగుతోంది. అయితే కేవలం భౌతిక బంగారం (నగలు) రూపంలో కాకుండా కొన్ని మార్గాల్లో పెట్టుబడి పెడితే మెరుగైన రాబడులు సాధించవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్లు: స్టాక్ మార్కెట్ ద్వారా డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ మార్గం. ఇందులో ఎలాంటి మేకింగ్ ఛార్జీలు, తరుగు ఉండవు. మనకు నచ్చినప్పుడు కరెంట్ మార్కెట్ ధరకే విక్రయించుకోవచ్చు. లాకర్ ఖర్చులు, దొంగతనం భయాలు ఉండవు.సవరీన్ గోల్డ్ బాండ్లు: ప్రభుత్వం/ఆర్బీఐ జారీ చేసే ఈ బాండ్లు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వరం. దీని ద్వారా బంగారం ధర పెరిగితే వచ్చే లాభంతో పాటు, ఏటా స్థిర వడ్డీ (అదనపు ఆదాయం) లభిస్తుంది. అంతేకాకుండా గడువు ముగిసిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉండదు. అయితే, ప్రస్తుతానికి ఈ బాండ్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది.డిజిటల్ గోల్డ్: మొబైల్ వాలెట్లు, సర్టిఫైడ్ ప్లాట్ఫారమ్ల ద్వారా కేవలం రూ.100తో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ప్రతి నెలా కొద్దికొద్దిగా బంగారం జమ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.భౌతిక బంగారం (కాయిన్స్/బిస్కెట్లు): ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటే నగల రూపంలో కాకుండా 24 క్యారెట్ల హాల్మార్క్ ఉన్న కాయిన్స్ లేదా బిస్కెట్లు కొనడం మేలు. దీనివల్ల రీసేల్ (తిరిగి అమ్మే) సమయంలో పూర్తి విలువ లభిస్తుంది.మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారానికి 10% నుంచి 15% వరకు మాత్రమే పరిమితం చేయడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒకేసారి కాకుండా ప్రస్తుత ధరల పతనాన్ని ఆసరాగా చేసుకుని విడతల వారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో స్థిరమైన, సురక్షితమైన రాబడులను అందుకోవచ్చు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు ఢమాల్! -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 249.70 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 76,478.67 వద్ద, నిఫ్టీ 80.50 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 23,865.75 వద్ద నిలిచాయి.ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్, దివ్గి టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ లిమిటెడ్, దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్, బిల్కేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహాలక్ష్మి ఫ్యాబ్రిక్ మిల్స్ లిమిటెడ్, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, AION-TECH సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్కు రూ.38.63 లక్షల జరిమానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) రియల్ ఎస్టేట్ సంస్థ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.38.63 లక్షల జరిమానా విధించింది. రెరాలో నమోదు చేయని పలు ప్రాజెక్టులను ప్రకటనలు, ప్రచారం చేయడంతో పాటు, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా నమోదు కాకుండానే ఒక ప్రాజెక్టు విక్రయాలను నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకుంది.ఖమ్మం జిల్లాకు చెందిన రాము ఫిర్యాదు మేరకు టీజీ రెరా సుమోటో విచారణ ప్రారంభించింది. సంస్థ వెబ్సైట్, బ్రోచర్లను పరిశీలించిన అనంతరం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కొన్ని ప్రాజెక్టులకు రెరా నమోదు ఉందని, మరికొన్ని తమవి కావని, సంస్థ వివరణ ఇచ్చింది. రెరా సభ్యులు జన్ను లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం, ప్రాజెక్టు నమోదు లేకుండా విక్రయాలు చేపట్టడం నిషేధమని స్పష్టం చేసింది. చదవండి: జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ‘ఫిరాన్’ తయారీ కేంద్రం -
హైదరాబాద్లో ‘ఫిరాన్’ తయారీ కేంద్రం
హైదరాబాద్: కాక్పిట్, ఇంటర్ఫేస్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేసే ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్లో తొలి తయారీ కేంద్రాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ఉన్న జీఎంఆర్ ఏవియేషన్ సెజ్లో ప్రారంభించింది.ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో దిగ్గజంగా పేరుగాంచిన ఫిరాన్ టెక్నాలజీ (Firan Technology Group).. భారత్లో తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం దేశీయ ఏరోస్పేస్ రంగంలో మరో మైలురాయి అని జీఎంఆర్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈఓ అమన్కపూర్ అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలన్నీ తమ సెజ్లో ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: తెలుగు రాష్ట్రాల్లోకి గోద్రెజ్ నింజా -
కాందిశీకుల కలలపై ‘ఖర్చు’ల కత్తి!
బ్రిటన్లో అక్రమ వలసల నియంత్రణే లక్ష్యంగా అధికార లేబర్ పార్టీ ప్రభుత్వం కీలకమైన నూతన ఆశ్రయ నిబంధనలను ప్రకటించింది. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ నిర్ణయం ప్రకారం.. భవిష్యత్తులో బ్రిటన్లో ఆశ్రయం పొందే, శాశ్వత నివాసం (పీఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే శరణార్థులు ప్రభుత్వం తమపై చేసే ఖర్చును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?బ్రిటన్ హోం శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, దేశంలో శాశ్వత నివాసం పొందాలంటే అంతకుముందు ప్రభుత్వం తమ వసతి, జీవన భత్యం కోసం ఖర్చు చేసిన 10,000 పౌండ్లు (సుమారు రూ.11 లక్షలు) తిరిగి చెల్లించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనల అమలుపై ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.భవిష్యత్తులో బ్రిటన్కు వచ్చే, ఈ మొత్తాన్ని చెల్లించగల ఆర్థిక స్థోమత ఉన్న వయోజనులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.ఈ నిబంధనలు గతంలో ఆశ్రయం పొందిన వారికి వర్తించవు. అలాగే చిన్నారులకు దీని నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.శరణార్థులు ఈ డబ్బు చెల్లించడం వల్ల పూర్తిగా పేదరికంలోకి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు కూడా చట్టంలో పొందుపరిచారు.బ్రిటన్ హోం శాఖ అంచనాల ప్రకారం ఆశ్రయం కోరుకునేవారికి తాత్కాలిక వసతి కల్పించేందుకు సగటున ఒక్కో వ్యక్తికి రోజుకు 23.25 పౌండ్లు(సుమారు రూ.2,600), హోటళ్లలో ఉంచితే రోజుకు 144 పౌండ్ల(రూ.16,000) వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా వారానికి జీవన భత్యం కూడా చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది ఆశ్రయ వసతి, సంబంధిత సాయం కోసం బ్రిటన్ సుమారు 400 కోట్ల పౌండ్లు(సుమారు 44,000 కోట్ల రూపాయలు) ఖర్చు చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో బ్రిటన్ హోం సెక్రటరీ షబానా మహమూద్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్ పన్ను చెల్లింపుదారులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఆశ్రయ సాయం పొందడం కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత కూడా. శరణార్థులకు ఆర్థిక స్థోమత చేకూరిన తర్వాత బ్రిటన్ ప్రజలకు ప్రతిగా వారు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలి’ అన్నారు.రాజకీయ ఉద్రిక్తతలు - లేబర్ పార్టీ వ్యూహంబ్రిటన్ రాజకీయాల్లో వలసల అంశం అత్యంత సున్నితమైనది. ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే ప్రధానాంశాల్లో ఇది ఒకటిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇది స్థానిక ఉద్రిక్తతలు, నిరసనలకు కూడా కారణమవుతోంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న సెంటర్ లిఫ్ట్-లేబర్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని కొందరు భావిస్తున్నారు. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రైట్ వింగ్-రిఫార్మ్ యూకే పార్టీ దేశంలో రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. దేశంలోని సుమారు ఆరు లక్షల మంది శరణార్థులను వెనక్కి పంపించేస్తామంటూ రిఫార్మ్ యూకే ఇస్తున్న హామీలు స్థానిక ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టేందుకే లేబర్ పార్టీ ఈ చర్యలకు పూనుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
పెట్రోల్, డీజిల్పై ఆంక్షలు ఎత్తివేత
దేశంలోని ఇంధన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వెలువడిన ఈ ఆదేశాల ప్రకారం.. జులై 1 (బుధవారం) నుంచి రిటైల్, కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారులు ఎలాంటి పరిమితులు లేకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు.దేశీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడంతో గతంలో విధించిన ‘మోటార్ స్పిరిట్ అండ్ హై-స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరా తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్, 2026’ నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ప్రధాన మార్పులు ఇవే..కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో క్షేత్రస్థాయిలో కింది మార్పులు అమలులోకి రానున్నాయి.రిటైల్ ఫ్యూయల్ స్టేషన్లలో (పెట్రోల్ బంకుల్లో) ఒకే వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలనే నిబంధన ఇకపై ఉండదు. జులై 1, 2026 నుంచి వాహనదారులు తమ అవసరానికి తగినంత డీజిల్ను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు.వాణిజ్య, పారిశ్రామిక రంగానికి చెందిన కొనుగోలుదారులు రిటైల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీనివల్ల వారు కేవలం తమ సొంత కన్జ్యూమర్ పంపుల నుంచే కాకుండా సాధారణ రిటైల్ బంకుల నుంచి కూడా ఇంధనాన్ని సేకరించుకోవచ్చు.ఆంక్షలు విధించడానికి కారణం..పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభంతో దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 12న అత్యవసరంగా ఈ తాత్కాలిక నియంత్రణలను ప్రవేశపెట్టింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సరసమైన ధరలకు ఇంధనాన్ని సమానంగా పంపిణీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.ధరల వ్యత్యాసంతో పెరిగిన డిమాండ్అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ సాధారణ వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ ధరలను నియంత్రించాయి. ఉదాహరణకు ఢిల్లీలో రిటైల్ బంకుల వద్ద డీజిల్ ధర లీటరుకు రూ.95.20 ఉండగా బల్క్ (భారీ) కొనుగోలుదారులకు లీటరుకు రూ.134.50గా ఉంది.ఈ భారీ ధరల వ్యత్యాసం (లీటరుకు దాదాపు రూ.39) కారణంగా భారీ పారిశ్రామిక వినియోగదారులు నేరుగా రిటైల్ బంకులను ఆశ్రయించారు. ఫలితంగా జూన్ ప్రారంభంలో చమురు సంస్థలకు డీజిల్పై లీటరుకు రూ.36.5, పెట్రోల్పై రూ.9 చొప్పున ఆదాయ నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా డిమాండ్ పెరిగి కృత్రిమ కొరత ఏర్పడింది.టెలికాం టవర్లు, ట్రక్కింగ్ కంపెనీలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులు, విద్యుత్ ఉత్పాదక పరిశ్రమలు రిటైల్ బంకుల వైపు మళ్లడంతో.. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ (నిల్వ ఉంచడం) అరికట్టేందుకు ప్రభుత్వం ఈ పరిమితిని విధించాల్సి వచ్చింది.ఇప్పుడు ఎందుకు ఎత్తివేశారు?పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమీక్ష ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సంతృప్తికరంగా ఉంది. దేశీయ సరఫరా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడటంతో పాటు సాధారణ పంపిణీ ఏర్పాట్లు పునరుద్ధరించారు. అందువల్ల జూన్ 12 నాటి ఆర్డర్ను కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన ప్రభుత్వం ఆంక్షలను ఉపసంహరించుకుంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
రూ.9.3 కోట్లు ప్యాకేజీని వదులుకుని.. ఏఐ వైపు అడుగులు
సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం.. కేవలం సరికొత్త ఆవిష్కరణలకే కాదు, ఐటీ నిపుణుల ఆలోచనా ధోరణిలో వస్తోన్న మార్పులకు కూడా వేదికవుతోంది. నెలకు లక్షల జీతం, చేతినిండా స్టాక్ ఆప్షన్లు, గూగుల్ లాంటి గ్లోబల్ టెక్ కంపెనీలో సురక్షితమైన ఉద్యోగం... సగటు ఉద్యోగి కల ఇది. కానీ, ఏటా దాదాపు రూ.9.3 కోట్ల భారీ ప్యాకేజీని సైతం కాదనుకుని ఏఐ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్గా మారింది.గూగుల్లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన 41 ఏళ్ల యూసఫ్ ఇమ్రాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఏఐ స్టార్టప్ను ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీ సామాన్యులకు కూడా అద్భుతమైన అవకాశాలను అందిస్తోందంటూ ఆయన పంచుకున్న అనుభవాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.రూ.9.3 కోట్ల ప్యాకేజీ.. ఎలా సాధ్యమైంది?సేల్స్ రంగంలో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఇమ్రాన్ 2020లో గూగుల్ సంస్థలో చేరారు. క్లయింట్లకు గూగుల్ ‘ఏఐ మెషిన్ లెర్నింగ్’ సొల్యూషన్స్ను చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన బేసిక్ శాలరీ దాదాపు 1,70,000 డాలర్లు (సుమారు రూ.1.6 కోట్లు) కాగా, కస్టమర్ డీల్స్ ద్వారా వచ్చిన కమీషన్లే ఆయన ఆదాయాన్ని పెంచాయి. డబ్ల్యూ2 ఎర్నింగ్స్(అలవెన్స్లు) ద్వారా గతేడాది ఆయన వార్షిక సంపాదన దాదాపు 9,86,000 డాలర్లు (సుమారు రూ. 9.3 కోట్లు)గా ఉంది.‘నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు మా కుటుంబం బంగ్లాదేశ్ నుంచి న్యూయార్క్కు వలస వచ్చింది. ఆ వలసదారుల కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మార్కెట్ అవసరాలు, ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించడం వల్లే నేను అంతటి కమీషన్లు సాధించగలిగాను’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.భారీ జీతాన్ని వదులుకోవడానికి కారణంమార్కెట్లో ఓపెన్ ఏఐ (ChatGPT), ఆంత్రోపిక్ (Claude) వంటి సంస్థలు సృష్టిస్తున్న సంచలనాలు ఇమ్రాన్లో ఫోమో (ఎక్కడ తాను వెనుకబడిపోతానో అనే ఆందోళన)ను రేకెత్తించాయి. గూగుల్ సురక్షితమైనదే అయినప్పటికీ భవిష్యత్తు అంతా ఏఐ స్టార్టప్లదేనని, వాటిలో ఈక్విటీ (భాగస్వామ్యం) కలిగి ఉండటం లాభదాయకమని ఆయన భావించారు. మరోవైపు, గూగుల్లో ఇటీవలి కాలంలో జరిగిన ఉద్యోగుల తొలగింపులు కూడా ఆయన ఆలోచనా విధానాన్ని మార్చాయి. ఎంత ప్రతిభావంతులైనా కార్పొరేట్ కొలువుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో సొంతంగా రిస్క్ తీసుకోవడమే ఉత్తమమని ఇమ్రాన్ నిర్ణయించుకున్నారు.రాత్రిపూట ఏఐ సాధన..సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఇమ్రాన్ వెనకడుగు వేయలేదు. పగలు ఉద్యోగం చేస్తూనే.. రాత్రులు, వారాంతాల్లో చాట్జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ఏఐ టూల్స్ సాయంతో కోడింగ్ నేర్చుకుంటూ ప్రాజెక్ట్లు డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే గత ఏప్రిల్లో గూగుల్కు గుడ్ బై చెప్పి ‘మాంగోస్టీన్ స్టూడియో’ అనే స్టార్టప్ను ప్రారంభించారు. ఇది సేల్స్ నిపుణుల కోసం ప్రత్యేక ఏఐ ఆధారిత టూల్స్ను రూపొందిస్తుంది. ఆవేశంతో కాకుండా పూర్తి ఆర్థిక ప్రణాళికతోనే ఇమ్రాన్ ఉద్యోగాన్ని వదిలేసినట్లు ఇమ్రాన్ చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
బంగారం ధరలు ఢమాల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
జూలై 1 నుంచి బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో రూ.5,632 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. బైబ్యాక్లో భాగంగా దాదాపు 46.94 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. ప్రతి షేరు ధరను రూ.12,000 గా నిర్ణయించారు. ఈ ఆఫర్ జూలై 7న ముగుస్తుందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు బజాజ్ ఆటో బోర్డు మే 6న ఆమోదం తెలపగా... మే 14న పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేర్హోల్డర్లు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 84 పాయింట్లు నష్టపోయి 23,865 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 239 పాయింట్లు తగ్గి 76,498 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 2.07 శాతం పుంజుకుంది.Today Nifty position 30-06-2026(time: 09:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తెలుగు రాష్ట్రాల్లోకి గోద్రెజ్ నింజా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ పెట్ కేర్ (జీపీసీ) సంస్థ పెంపుడు శునకాల కోసం ఉద్దేశించిన ఆహారోత్పత్తి గోద్రెజ్ నింజాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. శునకాల జీర్ణకోశం ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీవోవో నితిన్ జైన్ తెలిపారు. దీని ధర రూ. 20 నుంచి ప్రారంభమవుతుంది.ఇప్పటికే తమిళనాడులో దీన్ని ప్రవేశపెట్టినట్లు, తెలుగు రాష్ట్రాల తదుపరి ఇతర మార్కెట్లలోకి కూడా విస్తరించనున్నట్లు జైన్ చెప్పారు. త్వరలో ఇతరత్రా పెంపుడు జంతువుల ఆహారోత్పత్తులను కూడా ప్రవేశపెడతామన్నారు. నాసిక్లో 35,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో తయారీ ప్లాంటు సిద్ధమవుతోందని ఆయన వివరించారు. పెట్ కేర్ ఉత్పత్తుల పోర్ట్ఫోలియో విస్తరణపై దాదాపు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు జైన్ చెప్పారు. దేశీయంగా పెట్ ఫుడ్ విభాగం దాదాపు రూ. 5,000 కోట్లు కాగా, దక్షిణాది వాటా రూ. 2,000 కోట్లుగా ఉంటుందన్నారు. కర్ణాటక వాటా 15%గా, తెలుగు రాష్ట్రాల వాటా 8 శాతంగా ఉందని జైన్ వివరించారు. -
దక్షిణాదిలో స్మిటెన్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌందర్య సాధనాలు, లైఫ్ స్టయిల్ ఉత్పత్తులు మొదలైన వాటిని కొనుగోలుకు ముందే ట్రయల్ చేసేందుకు వీలు కల్పించే స్మిటెన్ తాజాగా దక్షిణాదిలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్లో స్టోర్ ప్రారంభించింది. కంపెనీకి ఇది ఎనిమిదో స్టోర్. 2027 నాటికి రూ. 100 కోట్ల ఆదాయం, 50 పైచిలుకు స్టోర్స్ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. విశాఖపట్నం, చెన్నై, హుబ్లి, బెంగళూరు తదితర కీలక దక్షిణాది మార్కెట్లలోను రిటైల్ నెట్వర్క్ మరింత పటిష్టం చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. -
పోస్కోతో ఈబీజీ గ్రూప్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్లో డేవూ బ్రాండ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దక్షిణ కొరియన్ సంస్థ పోస్కో ఇంటర్నేషనల్తో బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఈబీజీ గ్రూప్ వెల్లడించింది. దీని ప్రకారం భారత్లో డేవూ బ్రాండ్ ఉపకరణాల అభివృద్ధి, తయారీ, పంపిణీ, మార్కెట్ విస్తరణను ఈబీజీ గ్రూప్ నిర్వహిస్తుంది.ఇందుకోసం రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. తొలి దశలో ఫ్రిజ్లు, వాషింగ్ మెషిన్లు మొదలైనవాటిపై దృష్టి పెడుతుంది. ఢిల్లీలో మొదిట ఫ్లాగ్íÙప్ ఎక్స్పీరియన్స్ స్టోర్ త్వరలో ప్రారంభం కానుండగా, మరో మూడు ఔట్లెట్స్ సిద్ధమవుతున్నాయి. 2027 నాటికి 100 స్టోర్ల నెట్వర్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే డేవూ వన్ పేరిట సమగ్ర స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్ని కూడా ప్రవేశపెట్టాలనే యోచన ఉన్నట్లు వివరించింది. -
వాట్సాప్ భారీ అప్డేట్.. కొత్త ఫీచర్ వచ్చిందా చెక్ చేస్కోండి!
ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక ఫీచర్ను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్లో ఎవరితోనైనా మాట్లాడాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్ను షేర్ చేయాల్సి వచ్చేది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు ఇది చాలా మందికి ప్రైవసీ పరంగా అసౌకర్యంగా అనిపించేది. ఇకపై ఆ సమస్యకు చెక్ పడనుంది. ఫోన్ నంబర్ కాకుండా యూజర్ Username ద్వారానే ఇతరులతో చాట్ చేసే అవకాశం వాట్సాప్ కల్పించనుంది. ఈ విషయాన్ని సీఈవో కునాల్ షా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. "మీకు నచ్చిన పేరును ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి" అంటూ వినియోగదారులకు సూచించారు. ఈ ఫీచర్ను జూన్ 29 నుంచి దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తుండగా.. ఈ ఏడాది చివరినాటికి అందరికీ అందుబాటులోకి రానుంది.నంబర్ అవసరం లేదు.. కొత్త ఫీచర్తో ఇకపై కొత్త వ్యక్తులకు మీ ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు ఎంచుకున్న ప్రత్యేకమైన పేరును మాత్రమే షేర్ చేస్తే సరిపోతుంది. ఆ Username ద్వారా అవతలి వ్యక్తి మీతో చాట్ ప్రారంభించగలుగుతారు. కాలేజీ స్నేహితులు, ఆఫీస్ పరిచయాలు, వ్యాపార సంబంధాలు, ఈవెంట్లలో కలిసిన వ్యక్తులు లేదా గ్రూప్ల్లోని కొత్త సభ్యులతో నంబర్ పంచుకోకుండా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ తెలిపింది.ప్రైవసీకే పెద్దపీటఈ ఫీచర్ను సోషల్ మీడియా తరహాలో రూపొందించలేదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్ లేదంటే ఎక్స్ యూజర్నేమ్ల కోసం పబ్లిక్ సెర్చ్ లేదంటే డైరెక్టరీ ఉండదు. ఎవరైనా మీకు మెసేజ్ పంపాలంటే మీ ఖచ్చితమైన Username వారికి తెలిసి ఉండాలి. దీంతో అనవసర మెసేజ్లు, స్పామ్లను తగ్గించే అవకాశం ఉంటుంది.అదనపు భద్రత ఏంటంటే.. యూజర్నేమ్తో పాటు వాట్సాప్ మరో కొత్త భద్రతా ఫీచర్ను కూడా తీసుకొస్తోంది. యూజర్నేమ్ కీ(Username Key) పేరుతో వచ్చే ఈ ఆప్షన్ను యూజర్లు ఐచ్ఛికంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ను ఆన్ చేస్తే.. తొలిసారి మీకు మెసేజ్ పంపాలనుకునే వ్యక్తి యూజర్నేమ్తో పాటు మీరు సెట్ చేసిన ప్రత్యేక కీను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ కీని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. దీంతో అవాంఛిత వ్యక్తుల నుంచి మరింత రక్షణ లభిస్తుంది.ఎలా రిజర్వ్ చేసుకోవాలి?యూజర్నేమ్ రిజర్వ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ను అనుసరించండి.వాట్సాప్ను తాజా వెర్షన్కు అప్డేట్ చేయండి.సెట్టింగ్స్ను Settings ఓపెన్ చేయండి.అకౌంట్ Accountపై ట్యాప్ చేయండి.యూజర్నేమ్ Username ఆప్షన్ను ఎంచుకోండి.మీకు అందుబాటులో ఉన్న పేరును ఎంపిక చేసి కన్ఫర్మ్ చేయండి.అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం దశలవారీగా విడుదల అవుతోంది. కాబట్టి అందరికీ ఒకేసారి కనిపించకపోవచ్చు.నిబంధనలుగరిష్ఠంగా 35 అక్షరాలు ఉండవచ్చు.అవసరమైతే ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదంటే తొలగించుకోవచ్చు.ప్రముఖులు, సెలబ్రిటీలు, సంస్థలకు సంబంధించిన కొన్ని యూజర్నేమ్లను వాట్సాప్ ముందుగానే రిజర్వ్ చేస్తుంది. దీంతో నకిలీ ఖాతాలు (Impersonation) సృష్టించే అవకాశాలు తగ్గుతాయి.వ్యాపార సంస్థలు, క్రియేటర్లు తమ ఇన్స్టాగ్రామ్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్కు అనుగుణంగా Username పొందే అవకాశం కూడా ఉంటుంది.పాత చాట్లపై ప్రభావం?ఈ కొత్త ఫీచర్ వచ్చినా ప్రస్తుతం ఉన్న చాట్లు, కాంటాక్ట్లు, బ్లాక్, రిపోర్ట్, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వంటి సదుపాయాల్లో ఎలాంటి మార్పు ఉండదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలా ఉపయోగిస్తున్నారో అలాగే కొనసాగించవచ్చు.ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?యూజర్నేమ్ రిజర్వేషన్ ఫీచర్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. రాబోయే నెలల్లో దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది. మీ ప్రాంతంలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వాట్సాప్ యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఏడాది చివరినాటికి అన్ని యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
24,000 కిందికి నిఫ్టీ..
ముంబై: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ అరశాతం నష్టంతో ముగిసింది. ఐటీ, ఆటో, చమురు రంగాల షేర్లలో అమ్మకాలతో పాటు కీలక షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 372 పాయింట్లు నష్టపోయి 76,728 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 24,000 స్థాయి దిగువన 23,946 వద్ద నిలిచింది. ఫ్లాటుగా ప్రారంభమైన సూచీలు రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ 50 రీబ్యాలెన్సింగ్, బీఎస్ఈ సెన్సెక్స్ నెలవారీ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపాయి. నేడు నిఫ్టీ వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీలతో పాటు బ్యాంక్ నిఫ్టీ నెలవారీ ఎక్స్పైరీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 478 పాయింట్లు పతనమై 76,622 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు కోల్పోయి 23,925 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియాలో చైనా 1.14%, జపాన్ 0.15%, హాంకాంగ్ 1.5%, తైవాన్ 0.9% పెరిగాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశా యి. అమెరికా సూచీ లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి.ఇండెక్సుల వారీగా: బీఎస్ఈలో ఆటో (–2.11%), ఆయిల్ అండ్ గ్యాస్ (–1.40%), సర్వీసెస్ (–1.21%), ఐటీ (–1.04%) రంగాలు పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.65%, 0.60 శాతం నష్టపోయాయి.పర్సిస్టెంట్ సిస్టమ్స్: జర్మనీకి చెందిన డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ నగారో ఎస్ఈని కొనుగోలు చేసుకుంటామని ప్రకటించడంతో పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 11% నష్టపోయి రూ.4,298 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 11.63% కోల్పోయి రూ.4,277 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది.కోటక్ మహీంద్రా బ్యాంక్: ఎండీ, సీఈవోగా అశోక్ వాస్వానీ తమ పునర్నియామకాన్ని కోరడం లేదని స్పష్టం చేయడంతో కోటక్ బ్యాంకు షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3.2% నష్టపోయి రూ.396 వద్ద ముగిసింది. ఒక దశలో 3.6% పతనమై రూ.394 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. దీంతో బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.13,177 కోట్లు హరించుకుపోయి రూ. 3.93 లక్షల కోట్లకు దిగివచి్చంది.టర్టిల్మింట్ లిస్టింగ్.. ప్చ్ఇన్సూరెన్స్ కంపెనీ టర్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్ షేరు లిస్టింగ్లో నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.152)తో పోలిస్తే 10.39% డిస్కౌంటుతో రూ.136 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 13% క్షీణించి రూ.132 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% నష్టంతో రూ.135 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,987 కోట్లుగా నమోదైంది. -
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోకి జీరోధా
న్యూఢిల్లీ: ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ జీరోధా క్రమంగా ఇతర ఆర్థిక సేవల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్సు కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు సమర్పించింది. డేటా ప్రకారం జీరోధా కార్పొరేట్ అడ్వైజర్స్ ఏప్రిల్ 27న ఫైల్ చేసింది.ప్రస్తుతం ఇది సెబీ పరిశీలనలో ఉంది. ఒకవేళ లైసెన్సు లభిస్తే ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) నిర్వహణ, నిధుల సమీకరణలో కంపెనీలకు సలహాలివ్వడం, ఇతరత్రా మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసులు మొదలైనవి కంపెనీ అందించవచ్చు. ప్రస్తుతం జీరోధాకి 1.6 కోట్ల మంది పైగా కస్టమర్లు ఉండగా, కంపెనీ ప్లాట్ఫాంపై ఏటా వందల కోట్ల ఆర్డర్లు నమోదవుతుంటాయి.జీరోధా ఏఎంసీ పేరిట సంస్థకి సొంతంగా మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్సు కోసం ఇన్క్రెడ్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నియో వెల్త్ మేనేజ్మెంట్, సొసైటీ జనరాలీ సెక్యూరిటీస్ ఇండియా తదితర 12 సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్గా రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త పార్ట్టైమ్ చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ని బ్యాంక్ బోర్డు ఎంపిక చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆమోదించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆయన పదవీకాలం ఉంటుంది. ఈ ఏడాది మార్చి నెలలో అకస్మాత్తుగా వైదొలిగిన అతాను చక్రవర్తి స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే జూన్ 30 నుంచి నాలుగేళ్ల పాటు ఆయన స్వతంత్ర డైరెక్టరుగా ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్రకు లోబడి రాజీవ్ కుమార్ నియామకం ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు, ఆర్థిక రంగానికి పునరుజ్జీవం కల్పించిన వ్యక్తిగా ఆయన పేరొందారు. 2017లో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్.. నిర్ణయాత్మక విధానాలతో బ్యాంకింగ్ను గాడిలో పెట్టారు. ఆయన 25వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కూడా సేవలు అందించారు. -
ఐఐపీకి తయారీ బూస్ట్
న్యూఢిల్లీ: తయారీ రంగం పనితీరు మెరుగ్గా ఉండటంతో మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం నెల ఇది 4.9 శాతంగా ఉంది. 2022–23ని బేస్ ఇయర్గా మార్చాకా, కొత్త సిరీస్ ప్రాతిపదికన ఐఐపీ గణాంకాలను ప్రకటించడం ఇది వరుసగా రెండో నెల. ఐఐపీ సూచీలో 463 ఐటమ్ గ్రూప్లు ఉంటాయి. 234 గ్రూప్లకు మొత్తం సూచీ వెయిటేజీలో 36.02 శాతం వాటా ఉంది. తాజాగా మైనింగ్, క్వారీయింగ్ రంగం వృద్ధి మైనస్ 1.6 శాతంగా ఉండగా, తయారీ రంగం 5.5 శాతం, విద్యుత్–గ్యాస్ సరఫరా విభాగం 9.9 శాతం వృద్ధి చెందినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తయారీ రంగంలో అంతర్గతంగా 23 గ్రూప్లలో 16 గ్రూప్లు సానుకూల పనితీరు కనపర్చాయి. మోటర్ వాహనాలు (14.5%), ఎలక్ట్రికల్ పరికరాలు (20.8 %), బేసిక్ మెటల్స్ (4.6%) టాప్ 3 విభాగాలుగా నిల్చాయి. బేస్ ఎఫెక్ట్ కారణంగా జూన్లో ఐఐపీ వృద్ధి 5.7%కి మెరుగుపడొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ మేఘా ఆరోరా తెలిపారు. -
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!
భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్ ఎప్పుడూ బడ్జెట్ వినియోగదారుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది కొనుగోలుదారులు తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉన్న బైకులను కోరుకుంటారు. ఈ కారణంగానే కమ్యూటర్ బైక్స్ చాలాకాలంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథనంలో రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.టీవీఎస్ స్పోర్ట్ (రూ.55,500 - రూ.57,500)టీవీఎస్ స్పోర్ట్ అనేది బడ్జెట్ సెగ్మెంట్లో అత్యంత తక్కువ ధరలో లభించే కమ్యూటర్ బైక్లలో ఒకటి. ఇది ముఖ్యంగా రోజువారీ ఆఫీస్ వెళ్లేవాళ్లు, ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారుల కోసం రూపొందించారు. ఇది 109.7cc ఇంజిన్తో 8.1 హార్స్ పవర్ అందిస్తుంది. పెద్దగా స్పోర్టీ ఫీచర్లు లేకపోయినా, దీని అసలు బలం మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులోనే ఉంటుంది. సిటీ ట్రాఫిక్లో సులభంగా నడపగలిగేలా ఇది చాలా లైట్గా ఉంటుంది.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (రూ.58,977 - రూ.71,470)హీరో హెచ్ఎఫ్ డీలక్స్ భారతదేశంలో అత్యంత పాపులర్ కమ్యూటర్ బైక్లలో ఒకటి. దీని సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు దీన్ని చాలా మంది మొదటి ఎంపికగా మార్చాయి. ఇందులోని 97.2cc ఇంజిన్ 7.9 హార్స్ పవర్ అందిస్తుంది. మంచి మైలేజ్ అందించే ఈ బైక్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.బజాజ్ ప్లాటినా 100 (రూ.65,407)బజాజ్ ప్లాటినా 100 అనేది కంఫర్ట్ రైడింగ్ కోసం రూపొందించిన సింపుల్ కమ్యూటర్ బైక్. దీని 99.59cc ఇంజిన్ సుమారు 7.9hp పవర్ అందిస్తుంది. ఈ బైక్ సాఫ్ట్ సస్పెన్షన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. రోడ్లు కొంత కఠినంగా ఉన్నప్పటికీ ఇది సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది.బజాజ్ ప్లాటినా 110 (రూ.69,284)బజాజ్ ప్లాటినా 110 అనేది ప్లాటినా 100 కంటే కొంచెం అప్గ్రేడ్ వెర్షన్. ఇందులో 115.45cc ఇంజిన్ ఉంటుంది, ఇది 8.6hp పవర్ అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్బాక్స్ ఉండటం వల్ల హైవే రైడింగ్ కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది. సస్పెన్షన్ కూడా మెరుగ్గా ఉండటం వల్ల ఎక్కువ దూరం ప్రయాణానికి ఇది అనుకూలంగా ఉంటుంది.బజాజ్ పల్సర్ 125 (రూ.79,048 - రూ.87,527)పల్సర్ 125 ఈ జాబితాలో స్పోర్టీ లుక్ కలిగిన బైక్. ఇది 124.4cc ఇంజిన్తో 11.8hp పవర్ అందిస్తుంది. ఇది కేవలం కమ్యూటర్ బైక్ మాత్రమే కాదు, కొంచెం స్టైల్ అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా ఇస్తుంది. డిజైన్ కూడా పెద్ద పల్సర్ 150 మాదిరిగా ఉంటుంది. యువతకు బాగా నచ్చిన బైకుల్లో ఇది ఒకటి. -
జులైలో బ్యాంక్ హాలిడేస్: 12 రోజులు సెలవు!
జూలై 2026 సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాదారులు తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఇందులో ప్రాంతీయ పండుగలు, జాతీయ స్థాయి ఆచారాలు, అలాగే ప్రతి వారం వచ్చే వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి.జూలై 6న మిజోరాంలో ఎంహెచ్ఐపీ డే సందర్భంగా బ్యాంకులకు సెలవుజూలై 9న మేఘాలయలో బెహ్ డెయిన్ఖ్లామ్ పండుగ కారణంగా బ్యాంకులు పనిచేయవుజూలై 16న ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో రథయాత్ర, హరేలా వంటి పండుగల కారణంగా బ్యాంక్ సేవలు రద్దుజూలై 17న మేఘాలయలో యూ తిరోత్ సింగ్ వర్ధంతిజూలై 18న సిక్కింలో డ్రుక్పా త్షే-జి బౌద్ధ పండుగజూలై 22న త్రిపురలో ఖార్చి పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవుఇవి కాకుండా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. 2026 జూలైలో ఆదివారాలు జూలై 5, 12, 19, 26 తేదీలకు వస్తాయి. అలాగే రెండో శనివారం జూలై 11, నాలుగో శనివారం జూలై 25న కూడా బ్యాంక్ కార్యకలాపాలు ఉండవు. మొత్తం మీద బ్యాంకులకు 12 రోజులు సెలవులన్నమాట.ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. -
రూ.7000 కోట్ల బడ్జెట్.. అమల్లోకి 'ఢిల్లీ ఈవీ పాలసీ'!
ఢిల్లీ ప్రభుత్వం 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'ను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇది భారత్లో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి తీసుకున్న అన్ని చర్యలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ విధానం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం అంతర్గత దహన ఇంజిన్ (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) వాహనాలను దశలవారీగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం.ఈ పాలసీకి ప్రభుత్వం సుమారు రూ.7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీని ద్వారా వినియోగదారులు ఈవీలను కొంత తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు.పాలసీ ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్పై 100 శాతం మినహాయింపు లభిస్తుంది. అయితే.. ఈ ప్రయోజనం రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే సాధారణ పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట.ప్రభుత్వం నేరుగా కొనుగోలుదారులకు సబ్సిడీ కూడా అందిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ టూవీలర్లకు రూ.30,000 వరకు, త్రీ-వీలర్లకు రూ.50,000 వరకు, అలాగే చిన్న ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.1,00,000 వరకు సహాయం అందుతుంది.ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.. ICE వాహనాలపై దశలవారీ నిషేధం. ఇందులో భాగంగానే 2027 జనవరి 1 నుంచి ఆటో రిక్షాలు, చిన్న సరకు రవాణా చేసే వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నారు. 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్, డీజిల్, సీఎన్జీ టూవీలర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా రద్దు చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ఢిల్లీలో రోడ్డుపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది.పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. నాలుగు చక్రాల వాహనాలకు రూ.1,00,000, టూవీలర్లకు రూ.10,000, త్రీ వీలర్లకు రూ.25,000 వరకు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది.పెద్ద సరకు రవాణా వాహనాల కోసం ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ట్రక్కులకు కొన్ని నగర ప్రవేశ ఆంక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది. అంతే కాకుండా పాఠశాల వాహనాలను కూడా దశలవారీగా ఈవీలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడం మాత్రమే కాకుండా.. చార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి చేయడానికి కూడా ప్రభుత్వం కావలసిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఢిల్లీ అంతటా 30,000కు పైగా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీని ద్వారా EV వినియోగదారులకు ఛార్జింగ్ సమస్య తగ్గే అవకాశం ఉంది.The Delhi Cabinet has approved the new Delhi EV Policy 2026, a landmark initiative to curb vehicular pollution and accelerate the transition towards clean, sustainable mobility in the national capital.The policy will come into effect on 1 July 2026 and remain in force until 31… pic.twitter.com/mDvXdhVHTN— CMO Delhi (@CMODelhi) June 29, 2026 -
దాతృత్వంపై ఎలాన్ మస్క్ ట్వీట్!
ప్రపంచ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త 'ఎలాన్ మస్క్' జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలపై చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి.అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ చేసిన భారీ దాతృత్వ కార్యక్రమం సమాజానికి మేలు చేయడం కంటే కీడు చేస్తున్నాయని మస్క్ అభిప్రాయపడ్డారు.మెకెంజీ స్కాట్ ఇప్పటివరకు సుమారు 26.3 బిలియన్ డాలర్లకు పైగా వివిధ చారిటీలకు అందించారు. ఇది వ్యక్తిగత స్థాయిలో చూస్తే.. చరిత్రలోనే అత్యంత పెద్ద దానాలలో ఒకటిగా నిలిచింది. ఆమె 2019లో జెఫ్ బెజోస్తో విడాకులు తీసుకున్న తరువాత.. వచ్చిన అమెజాన్ వాటా సంపదలో ఎక్కువ భాగాన్ని సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 'యీల్డ్ గివింగ్' పేరుతో ఆమె ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,700కు పైగా నాన్ప్రాఫిట్ సంస్థలకు సహాయం చేశారు. వీటిలో హోవార్డ్ యూనివర్సిటీతో పాటు పలు వాతావరణ, సామాజిక అభివృద్ధి సంస్థలు ఉన్నాయి.Sadly, yes— Elon Musk (@elonmusk) June 28, 2026అయితే.. ఈ విస్తృత దానాలపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ, అవి సమాజానికి హానికరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక యూజర్ చేసిన వ్యాఖ్యకు సమాధానంగా ఆయన స్పందించడం, ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దీనిని చాలా మంది మెకెంజీ స్కాట్ దానాలపై పరోక్ష విమర్శగా భావించారు.ఇక 2024లో కూడా మస్క్ చేసిన ఒక పోస్ట్ ఈ చర్చను మరింత పెంచింది. అప్పట్లో ''మాజీ భార్యలు తమ మాజీ భర్తలను ద్వేషిస్తూ.. చేసే దానాలు పాశ్చాత్య నాగరికత క్షీణతకు కారణాలలో ఒకటి' అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. ఆ పోస్ట్లో తాను ఎవరి పేరును ప్రస్తావించకపోయినా, అది మెకెంజీ స్కాట్ను ఉద్దేశించి చేసినదేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో తరువాత ఆ పోస్ట్ తొలగించడం జరిగింది.ఎవరెన్ని విధాలుగా మాట్లాడినా, విమర్శించినా.. మెకెంజీ స్కాట్ మాత్రం తన దాతృత్వ విధానాన్ని కొనసాగిస్తూ, సమాజంలో వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె 'నా సంపద పూర్తిగా అయిపోయే వరకు దానం చేస్తూనే ఉంటాను' అని గతంలో ప్రకటించారు. అయితే.. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు దాతృత్వం ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందనే విషయంపై కొత్త చర్చను దారితీసాయి. -
నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్!
బంగారం, వెండి ధరలు పెరుగుతాయని సూచించే రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.తాను బంగారం ధరల విషయంలో చేసిన అంచనా తప్పిందని, ధరలు ఇంకా తగ్గిపోతాయని కియోసాకి నిజాయితీగా అంగీకరించారు. అయితే.. మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో కదలవని, పెరుగుదలతో పాటు పతనం కూడా సహజమేనని పేర్కొన్నారు. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న వేళ ఈ ట్వీట్ చేశారు.పెట్టుబడుల్లో అసలు లాభం అమ్మే సమయంలో కాకుండా, సరైన సమయంలో కొనుగోలు చేసినప్పుడే ఏర్పడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో అవి 35 వేల డాలర్ల (ఔన్సు) స్థాయికి చేరుతాయని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టే వారే నిజమైన సంపదను సృష్టించగలరని, రోజువారీ ధరల మార్పులను చూసి నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని సూచించారు.అంతే కాకుండా.. తప్పులు చేయడం సహజమని, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే విజయానికి దారి తీస్తుందని చెప్పారు. ఎలాంటి తప్పులు చేయని వారు కొత్త విషయాలు నేర్చుకోలేరని, పెట్టుబడిదారులు ఓర్పు, దీర్ఘకాలిక ఆలోచన, అనుభవాల నుంచి నేర్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.భారతదేశంలో బంగారం ధరలుమన దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (జూన్ 29) కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు వరుసగా రూ.850 (22 క్యారెట్స్), రూ.930 (24 క్యారెట్స్) తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు కొంత పతనమయ్యాయి.I was wrong. Gold still crashing!Thats real life. RD Lesson: Profuts are made when you buy…. Not when you sell.I still believe gold will be $35 k in about 5-years.But that is real life: All markets go up and down.Another RD lesson: The richest investors invest for…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 29, 2026 -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 372.10 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 76,728.37 వద్ద, నిఫ్టీ 109.75 శాతం లేదా 0.46 శాతం నష్టంతో 23,946.25 వద్ద నిలిచాయి.ప్రకాష్ పైప్స్ లిమిటెడ్, బజాజ్ హెల్త్కేర్ లిమిటెడ్, మాక్పవర్ సిఎన్సి మెషీన్స్ లిమిటెడ్, సినీవిస్టా లిమిటెడ్, బోరోసిల్ సైంటిఫిక్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, టార్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్, క్రెబ్స్ బయోకెమికల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, అటల్ రియల్టెక్ లిమిటెడ్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు.. ఇవిగో కొత్త ఫండ్స్!
పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే ఇన్వెస్టర్ల కోసం హెచ్డీఎఫ్సీ, జేఎం ఫైనాన్షియల్ కొత్త మ్యూచువల్ ఫండ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆటో రంగంతో పాటు మల్టీ అసెట్ విభాగంలో పెట్టుబడులకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి.హెచ్డీఎఫ్సీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్: దేశ ఎకానమీకి, తయారీ రంగ వృద్ధికి, ఉపాధి కల్పనకు, ఎగుమతులకు ఆటోమొబైల్ పరిశ్రమ దన్నుగా ఉంటోంది. ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడేలా హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ ప్రారంభించింది. ఇది జూలై 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.నిఫ్టీ ఆటో ఇండెక్స్ (టీఆర్ఐ)లోని దిగ్గజ ప్యాసింజర్ వెహికల్స్, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ సంస్థల స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ500 నుంచి ఎంపిక చేసిన 15 స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి.జేఎం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్: ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ తాజాగా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూలై 8న ముగుస్తుంది. ఇది ఈక్విటీలు, ఈక్విటీ సంబంధ సాధనాలు, డెట్..మనీ మార్కెట్ సెక్యూరిటీలు, పసిడి–వెండి సంబంధ సాధనాలు, ఇతరత్రా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా ఒకే ఫండ్ ద్వారా పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు ఉపయోగపడుతుంది. -
ఐవెకో కొనుగోలుతో 10 లక్షల వాహనాలు లక్ష్యం!
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అంతర్జాతీయ వాణిజ్య వాహన (కమర్షియల్ వెహికల్స్) మార్కెట్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇటలీకి చెందిన ప్రముఖ ‘ఐవెకో’ కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరిన నేపథ్యంలో.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే వార్షిక అమ్మకాల్లో మిలియన్ (10 లక్షలు) యూనిట్ల మార్కును అధిగమించాలని కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ 29న జరిగిన కంపెనీ రెండో వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి టాటా మోటార్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కొన్ని విషయాలను వెల్లడించారు.కమర్షియల్ వెహికల్ బిజినెస్ ప్రత్యేకంగా విడిపోయి స్వతంత్ర సంస్థగా లిస్ట్ అయిన తర్వాత జరిగిన ఈ సమావేశంలో చంద్రశేఖరన్ ప్రసంగిస్తూ ప్రతిపాదిత ఐవెకో కొనుగోలు టాటా మోటార్స్ అంతర్జాతీయ ఆశయాలకు వేగాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.‘ఐవెకో గ్రూప్ ఏకీకరణతో ప్రాథమికంగానే మా ఉమ్మడి వ్యాపారం 6,00,000 వాహనాల వార్షిక వాల్యూమ్తో ప్రారంభమవుతుంది. రాబోయే సంవత్సరాల్లో 10 లక్షల వాహనాల మార్కును సులభంగా దాటగలము. ఈ వ్యూహాత్మక చర్యతో ప్రపంచవ్యాప్తంగా టాప్-4 అతిపెద్ద కమర్షియల్ వెహికల్ తయారీదారుల సరసన టాటా మోటార్స్ నిలుస్తుంది’ అని ఎన్.చంద్రశేఖరన్ అన్నారు.రెండో త్రైమాసికంలో డీల్ పూర్తిప్రస్తుతం ఈ కొనుగోలుకు సంబంధించి తుది విడత రెగ్యులేటరీ అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ డీల్ పూర్తిగా ముగుస్తుందని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐవెకోకు ఉన్న అధునాతన పవర్ ట్రెయిన్, నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతలపై టాటా మోటార్స్కు పూర్తి పట్టు లభిస్తుంది. తద్వారా కంపెనీ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో మరింత బలోపేతం కానుందని చెప్పారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అసాధారణ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. గూగుల్లో పిచాయ్తో కలిసి పనిచేసిన అగ్రశ్రేణి టెక్ నిపుణులు, ‘రూబ్రిక్’, ‘గ్లీన్’ సంస్థల సహ వ్యవస్థాపకుడు అరవింద్ జైన్ ఇటీవల ఫార్చ్యూన్ మ్యాగజైన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రపంచం వెర్రి ఆలోచన అని కొట్టిపారేసిన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్ట్ను పిచాయ్ ఎలా విజయతీరాలకు చేర్చారో, ఆయన పనితీరు నుంచి తాను నేర్చుకున్న పాఠాలేమిటో జైన్ వివరించారు.భారతదేశంలోని ఒక చిన్న పట్టణం నుంచి అమెరికాకు వెళ్లిన అరవింద్ జైన్ ప్రారంభంలో గూగుల్లో చేరినప్పుడు తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి లోనైనట్లు అంగీకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన అత్యంత నిపుణులైన సహోద్యోగుల మధ్య తానొక ‘మోసగాడిలా’ (అర్హత లేకపోయినా వచ్చినట్లు) భావించానని చెప్పారు. అయితే, ఆ ప్రతిభావంతుల మధ్య కొందరు మాత్రమే ఎందుకు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్నారనే విషయాన్ని ఆయన గమనించడం ప్రారంభించారు. అలా ఆయన దృష్టిని ఆకర్షించిన అగ్రగామి నాయకుడే సుందర్ పిచాయ్.‘నేను, సుందర్ గూగుల్లో చాలా కాలం కలిసి పని చేశాం. కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరినప్పటి నుంచి సుందర్ నాకు తెలుసు. గూగుల్లో బెస్ట్ స్కూల్స్ నుంచి వచ్చిన ఎందరో మేధావులు ఉన్నా వారందరూ ఉన్నతంగా రాణించలేకపోయారు. అప్పుడే అసలు విజయ సూత్రం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. చాలా కాలం కిందట ఆన్లైన్ బ్రౌజర్ల విభాగం పూర్తిగా మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంలో ఉండేది. అప్పటికే నెట్స్కేప్ వంటి దిగ్గజాలు విఫలమవడంతో గూగుల్ క్రోమ్ ప్రాజెక్టుపై పెద్దగా నమ్మకం లేదు. దాంతో నేను కూడా ఇది చాలా చెడ్డ ఆలోచన అని భావించాను. ఎందుకంటే నేను అంత లోతుగా ఆలోచించలేకపోయాను’ అని జైన్ పేర్కొన్నారు.అప్పట్లో మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ బాల్మర్ సైతం క్రోమ్ను ఒక సాధారణ ‘రౌండింగ్ ఎర్రర్’ (లెక్కలోకి తీసుకోనవసరం లేని పొరపాటు) అని బహిరంగంగా కొట్టిపారేశారు. అందరూ అసాధ్యం అనుకున్నచోటే పిచాయ్ తన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో క్రోమ్ను ముందుకు నడిపారు. ఫలితంగా 2012 నాటికి క్రోమ్ ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్గా అవతరించి ప్రత్యర్థులను వెనక్కి నెట్టింది. ఈ విజయమే ఆగస్టు 2015లో పిచాయ్ గూగుల్ సీఈఓగా ఎదగడానికి బలమైన పునాది వేసింది.పిచాయ్ విజయ సూత్రాలుఅరవింద్ జైన్ విశ్లేషణ ప్రకారం, సుందర్ పిచాయ్ శైలి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవే..కేవలం కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదు, లక్ష్యం పట్ల విపరీతమైన పట్టుదల ఉండాలి.గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ల తరహాలోనే పిచాయ్ మనసులో సాధ్యసాధ్యాలపై ఎలాంటి పరిమితులు లేవు.ప్రతి ఒక్కరూ తెలివితక్కువది, బహుశా వాస్తవాలకు దూరంగా ఉందని భావించే పనిని మనం చేయబోతున్నాం అని నమ్మినప్పుడే మ్యాజిక్ జరుగుతుంది.రూబ్రిక్, గ్లీన్ సంస్థలతో జైన్ సంచలనాలుసుందర్ పిచాయ్ నుంచి నేర్చుకున్న ఈ క్రేజీ థాట్స్ పాఠాలే అరవింద్ జైన్ను తదుపరి కాలంలో ఒక విజయవంతమైన బిలియనీర్గా మార్చాయి. తాను గూగుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జైన్ స్థాపించిన క్లౌడ్ డేటా మేనేజ్మెంట్ కంపెనీ రూబ్రిక్, 2024లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సుమారు 5.6 బిలియన్ డాలర్లతో లిస్ట్ అయింది. అనంతరం ఆయన ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'గ్లీన్' ప్రస్తుతం 7.2 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా దూసుకుపోతోంది.జెన్-జీ నుంచి నిరంతర అభ్యాసంప్రస్తుతం ఇంతటి అంతర్జాతీయ స్థాయి విజయాన్ని అందుకున్నప్పటికీ జైన్ తన సంస్థల్లోని యువతరం(జెన్ జీ) నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపారు. యువత సరికొత్త దృక్పథాలను, వినూత్న ఆలోచనలను తీసుకువస్తుందని, నేటి వేగవంతమైన టెక్ ప్రపంచంలో అప్డేట్గా ఉండటానికి వారి ఆలోచనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
లీగల్ రివ్యూను ప్రశ్నించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఇటీవలి పరిణామాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజీనామాపై బ్యాంక్ యాజమాన్యం జరిపించిన చట్టపరమైన సమీక్షను బ్యాంక్ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి ప్రశ్నించారు. ఈ సమీక్ష అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందే తప్ప, ఇందులో వాస్తవాలు లేవని ఆరోపించారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.న్యాయ సంస్థల నివేదికపై అసంతృప్తితన రాజీనామా ప్రకటనను సమీక్షించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నియమించిన బాహ్య న్యాయ సంస్థలు (External Law Firms) సమర్పించిన నివేదికను అతాను చక్రవర్తి తప్పుపట్టారు. ఈ నివేదిక కేవలం ‘పరిమిత పరిధి/షరతులతో కూడిన నివేదిక’ అన్నారు. అంతర్గత అధికారుల ఇంటర్వ్యూల నుంచి సేకరించిన కొన్ని అంశాలు, బోర్డు సమావేశాల మినిట్స్పైనే ఈ నివేదిక ప్రధానంగా దృష్టి సారించిందని విమర్శించారు. బ్యాంక్లోని కొన్ని వ్యాపార పద్ధతులకు, తన వ్యక్తిగత విలువలకూ మధ్య వచ్చిన వైరుధ్యం వల్లే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అయితే, న్యాయ సంస్థలు ఈ ప్రాథమికాంశాన్ని వదిలేసి కేవలం కొన్ని అంశాలపైనే దృష్టి పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమీక్ష కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ‘వాడియా గాంధీ’, ‘విల్సన్ సోనీ’ అనే న్యాయ సంస్థలను నియమించినట్లు తెలుస్తోంది.బోర్డు తీరుపై ప్రశ్నలు‘నా నియామకం, రాజీనామా రెండూ కంపెనీల చట్టం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి లోబడే జరిగాయి. అలాంటప్పుడు ఈ సమీక్ష దేనికి? సమీక్ష కోసం న్యాయవాదులను నియమించడానికి గల నిబంధనలు లేదా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఏమిటో చెప్పాలని నేను బోర్డును పదేపదే కోరాను. కానీ, నా అభ్యర్థనలను బోర్డు పట్టించుకోలేదు. ఆ నిబంధనలను నాతో పంచుకోలేదు’ అని అతాను చక్రవర్తి అన్నారు.ఈ చట్టపరమైన నివేదికలను ఆయన అనవసరమైనవిగా కొట్టిపారేశారు. తన పదవీకాలంలో జరిగిన ‘ఏటీ-1 బాండ్ మిస్సెల్లింగ్’ కేసుపై బ్యాంక్ వేగంగానే స్పందించిందని చెప్పారు. అయితే, బోర్డు రూమ్ విషయాలు బోర్డు రూమ్లోనే ఉండాలనే నియమానికి కట్టుబడి తన రాజీనామాకు దారితీసిన నిర్దిష్ట వ్యాపార పద్ధతులు ఏమిటనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.త్వరలో కొత్త ఎండీ, సీఈఓఈ వివాదాల నడుమే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ గవర్నెన్స్ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంకుకు శాశ్వత ఛైర్మన్ నియామకాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీషన్ను తిరిగి నియమించే కసరత్తును ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నూతన ఛైర్మన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది బ్యాంక్ భవిష్యత్తు వ్యూహాలకు ఎంతో కీలకం కానుంది.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
రూ.45 లక్షల ప్యాకేజీ.. నెలాఖరుకు చేతిలో సున్నా!
సంవత్సరానికి రూ.45 లక్షల భారీ ప్యాకేజీ.. సమాజంలో గౌరవప్రదమైన పొజిషన్.. కానీ, నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి మిగలడం లేదు! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది బెంగళూరులో నివసిస్తున్న ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ పరిస్థితి. గతేడాది మ్యూచువల్ ఫండ్ కన్సల్టెంట్ అన్షుమన్ శర్మతో సూర్య అనే టెక్కీ మాట్లాడిన పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమం ఎక్స్లో వైరల్గా మారింది.గత 14 ఏళ్లుగా బెంగళూరులో స్థిరపడిన సూర్య.. తన భార్య, మూడున్నరేళ్ల బాబుతో కలిసి నివసిస్తున్నాడు. ఏడాదికి రూ.45 లక్షల ప్యాకేజీ ఉన్నప్పటికీ పన్నుల చెల్లింపుల తర్వాత ప్రతి నెలా అతని చేతికి వచ్చే నికర జీతం రూ.2,45,000. ఈ భారీ మొత్తం చేతికి వస్తున్నా పొదుపు చేయడం తనకు చాలా కష్టంగా మారిందని సూర్య వాపోయాడు.ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ..‘ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏంటంటే.. నెలాఖరు వచ్చేసరికి నా డబ్బు ఎక్కడికి వెళ్తుందో నాకే అర్థం కావడం లేదు. చేతిలో ఏమీ మిగలడం లేదు. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల నా సిప్ పెట్టుబడులను కూడా పెంచలేకపోతున్నాను’ అని చెప్పాడు.ఖర్చుల లెక్కలు ఇవే..సూర్య తన నెలవారీ ఖర్చుల వివరాలను కన్సల్టెంట్కు వివరించగా అందులో సింహభాగం హోమ్లోన్కే వెళ్తున్నట్లు చెప్పారు. అతని నెలవారీ ఖర్చుల విభజన ఇలా ఉంది.హోమ్ లోన్ ఈఎంఐ: రూ. 63,000 (ఇది అతని నికర ఆదాయంలో 30% కంటే తక్కువలోనే ఉండటం గమనార్హం)కుమారుడి స్కూల్ ఫీజు: రూ.11,000 (దీనికి అదనంగా రూ.3 లక్షల ప్రవేశ రుసుము ఉంది)ఆహారం, కిరాణా సామాగ్రి: రూ. 12,000ఇతర గృహ ఖర్చులు: రూ. 20,000షాపింగ్, ట్రిప్పులు, ఔటింగ్స్: రూ.32,000నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలుఈ ఇంటర్వ్యూ క్లిప్ ఎక్స్లో రీపోస్ట్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ‘భారతదేశంలో ద్రవ్యోల్బణం కంటే పేలవమైన ఆర్థిక ప్రణాళికే పెద్ద సమస్య. నెలకు రూ.2.45 లక్షలు సంపాదిస్తూ కేవలం షాపింగ్, ట్రిప్పుల కోసమే రూ.32 వేలు ఖర్చు చేయడం ఏంటి? బాబు నర్సరీ ఫీజులకే అంత పెడుతుంటే ఇక డబ్బు ఎలా మిగులుతుంది?’ అని ఒక యూజర్ చెప్పారు. మరోవైపు, ఈ వాదనను వ్యతిరేకిస్తూ కొంతమంది సూర్యకు మద్దతుగా నిలిచారు. ‘ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? ఒక వ్యక్తి కష్టపడి సంపాదిస్తూ, తన పిల్లలకు మంచి చదువు చెప్పించి, కాస్త విలాసాల కోసం ఖర్చు పెట్టుకుంటే తప్పేంటి?’ అని కౌంటర్ ఇచ్చారు.ఈ బెంగళూరు టెక్కీ ఉదంతం కేవలం ఒక్కరి సమస్య కాదు. భారతదేశంలోని మెట్రో నగరాల్లో అధిక వేతనాలు పొందుతున్న మెజారిటీ ఐటీ ఉద్యోగుల మానసిక, ఆర్థిక పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. ఆదాయం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా జీవన ప్రమాణాలు, ఖర్చులు పెంచుకుంటూ పోవడాన్ని ఆర్థిక పరిభాషలో ‘లైఫ్స్టైల్ ఇన్ఫ్లేషన్’ అంటారు. రూ.45 లక్షల ప్యాకేజీ ఉన్నా ఏమీ మిగలడం లేదు అనే భావన కలగడానికి కారణం.. భవిష్యత్తు కోసం చేసే పొదుపును ముందే పక్కన పెట్టకుండా, ఖర్చులు పోగా మిగిలినదాన్ని దాచుకుందాం అనుకోవడమేనని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు ఎగబాకి 24,067 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 64 పాయింట్లు తగ్గి 77,033 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.34బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం తగ్గింది.నాస్డాక్ 0.24 శాతం నష్టపోయింది.Today Nifty position 29-06-2026(time: 09:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్లోబల్ ఏఐ రేసులో వెనుకబడిన దేశాలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం స్టాక్ మార్కెట్లను శాసిస్తున్న వేళ ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. గ్లోబల్ ఏఐ రేసులో ఆధిపత్యం చెలాయించే స్పష్టమైన ఏఐ విజేతలు లేకపోవడంతో భారత్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు తమ అగ్రశ్రేణి కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాను కోల్పోయాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ దేశాల ప్రధాన సూచీల్లో టాప్-10 కంపెనీల మూలధన వ్యయం తగ్గడం గమనార్హం.క్షీణించిన ఆధిపత్యంప్రస్తుత గ్లోబల్ ట్రెండ్ను పరిశీలిస్తే భారత్, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో టాప్ కంపెనీల వాటా తగ్గింది. మిగిలిన ప్రధాన మార్కెట్లలో ఏఐ ఆధారిత టెక్ దిగ్గజాలు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.టాప్-10 దేశాల మార్కెట్ క్యాప్ వాటా (ఏడాది క్రితం.. ప్రస్తుతం)దేశం / మార్కెట్ఏదాది క్రితం వాటాప్రస్తుత వాటామార్కెట్ సరళిచైనా26%19%క్షీణతభారతదేశం22%19%క్షీణతహాంకాంగ్10%9.8%స్వల్ప మార్పుతైవాన్49%56%భారీ వృద్ధిదక్షిణ కొరియా~ 32%65%రెట్టింపు వృద్ధి‘ఆసియా టెక్నాలజీ మార్కెట్లో ఏఐ, మెమరీ చిప్ విజేతలు ఇండెక్స్లను లీడ్ చేస్తుంటే.. భారత్, చైనా, హాంకాంగ్లలో ఏ ఒక్క ఆధిపత్య ఏఐ విన్నింగ్ కంపెనీ లేకపోవడంతో టాప్ సంస్థల వాటా పడిపోతోంది’ అని సాక్సో మార్కెట్స్ (సింగపూర్) చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ చారు చనానా అన్నారు.తైవాన్, దక్షిణ కొరియా దేశాల దూకుడుఏఐ సరఫరా గొలుసులో కీలక పాత్ర పోషిస్తున్న కంపెనీలు ఉన్న మార్కెట్లు ఊహించని రీతిలో లాభపడ్డాయి. చిప్ తయారీ దిగ్గజం ‘తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కో’ (టీఎస్ఎంసీ) అద్భుతమైన లాభాల బాటలో పయనించడంతో తైవాన్ బెంచ్మార్క్ సూచీ ఈ ఏడాది ఏకంగా 54% పెరిగింది. అక్కడ టాప్-10 కంపెనీల వాటా 56%కి చేరింది.దక్షిణ కొరియాలో హై-బ్యాండ్ విడ్త్ మెమరీ లీడర్స్ అయిన ఎస్కే హైనిక్స్ ఇంక్, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ లీడ్తో కొరియా కోస్పి ఇండెక్స్ దాదాపు రెట్టింపు అయింది.భారత మార్కెట్ స్థితిగతులుభారతదేశ విషయానికి వస్తే నిఫ్టీ 50 బెంచ్మార్క్ ఈ ఏడాది 8% మేర క్షీణించింది. దీనికి ప్రధాన కారణం ఇండెక్స్లో సాంప్రదాయ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండటమే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వంటి భారతీయ ఐటీ దిగ్గజాలు ఇంకా సాంప్రదాయ సాఫ్ట్వేర్ సేవల్లోనే ఎక్కువగా పాతుకుపోయి ఉన్నాయి. ఇవి ఏఐ వల్ల భవిష్యత్తులో అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూచీలో భారీ వెయిటేజీ ఉన్న కంపెనీలు ఇండెక్స్ను ముందుకు లాగలేకపోతుండగా వాటిని భర్తీ చేసే కొత్త తరం ఏఐ ఇంజిన్లు ఇంకా మన మార్కెట్లో పుట్టుకురాలేదని చెబుతున్నారు.ఇదీ చదవండి: గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా? -
గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా?
ఒకప్పుడు దేశ విదేశీయులను ఆకర్షించిన గార్డెన్ సిటీ (ఉద్యాన నగరం) బెంగళూరు.. ఇప్పుడు అస్తవ్యస్త ప్రణాళికలు, కాంక్రీట్ జంగిల్గా మారుతున్న వైనంతో తన ఉనికిని కోల్పోతోందా? బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు ఐటీ కారిడార్లో చర్చకు దారితీశాయి. బెంగళూరును ఆమె నేరుగా గార్బేజ్ సిటీ(చెత్త నగరం) అని సంబోధించడం, అక్కడి పట్టణ ప్రణాళిక వైఫల్యాలను ఎండగట్టడం ఐటీ నిపుణులు, సామాన్య ప్రజల్లో చర్చకు తెరలేపింది.గ్రాఫిక్ చిత్రం ఏం చెబుతోంది?నగర రోడ్ల దుస్థితిని వివరిస్తూ కిరణ్ ఒక ఆసక్తికరమైన గ్రాఫిక్ చిత్రాన్ని షేర్ చేశారు. ‘మన గార్డెన్ సిటీని ప్రతిబింబించేలా మన రోడ్లను ఈ విధంగా రూపొందించాలి, ప్లాన్ చేయాలి. దురదృష్టవశాత్తు పచ్చదనం తగ్గుతూ చెత్త నగరంగా మారింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రాఫిక్ ఎలివేటెడ్ రోడ్ కారిడార్కు సంబంధించిన రెండు విభిన్న వెర్షన్లను పోల్చి చూపించింది.మనం నిర్మించింది (What We Built): కాంక్రీట్ విస్తరణతో కూడిన ప్రస్తుత దుస్థితి. రోడ్ల విస్తరణ పేరుతో చెట్లను పూర్తిగా తొలగించడం, పాదచారుల ఫుట్పాత్లు, సర్వీస్ రోడ్లను తుడిచిపెట్టడం, ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా చేయడం ఇందులో కనిపించింది.మనం నిర్మించాల్సింది (What We Could Have Built): పర్యావరణ అనుకూల ప్రణాళిక. అదే కారిడార్లో పాత చెట్లను కాపాడుకుంటూనే సైక్లింగ్ ట్రాక్లు, విశాలమైన ఫుట్పాత్లు, వీధి దీపాలు, బెంచీలు, చెత్త డబ్బాలు వంటి ఆధునిక పౌర సౌకర్యాలతో తిరిగి రూపకల్పన చేయవచ్చని ఆ చిత్రం చూపించింది.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా, నగర పౌరుల నుంచి తీవ్ర స్పందన తీసుకొచ్చింది. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాలకు పేలవమైన ప్రణాళిక, బలహీనమైన పాలన, అవినీతి, అధికారుల జవాబుదారీతనం లేకపోవడమే కారణమని నెటిజన్లు ఏకిపారేశారు. ‘ఈ నగరాన్ని దోచుకోవడానికి నిర్వాహకులు, రాజకీయ నాయకులు చేతులు కలిపారు. ఐరన్, సిమెంట్ మొదలైన వాటిలో ఎక్కువ కమీషన్లు దండుకోవచ్చు కాబట్టే కాంక్రీట్ రోడ్లపై ఆసక్తి కనబరుస్తారు. వారు నాటిన చెట్లలో కమీషన్లు రావు కదా!’ అని ఒక యూజర్ స్పందించారు.This is how we need to design & plan our roads that reflects our garden city image. Unfortunately it’s now a garbage city with shrinking greenery pic.twitter.com/EG29LPZd2j— Kiran Mazumdar-Shaw (@kiranshaw) June 27, 2026మరికొందరు నెటిజన్ల అభిప్రాయాలు ఇలా..భారతీయ నగరాలు ఏమాత్రం నిలకడగా లేవు. అంతర్జాతీయ నగరాల మాదిరిగా పన్నులు, ఖర్చులు వసూలు చేస్తారు. కానీ కనీస సౌకర్యాలు లేక పేద దేశంగా జీవించాల్సి వస్తోంది. సిగ్గుచేటు.ఉన్నవాటిని సరిగ్గా నిర్వహించడం, చట్టాలను కఠినంగా అమలు చేస్తే చాలు. ప్రజలు సహనం కోల్పోయారు, ఎవరూ ఏ నియమాన్ని పాటించడం లేదు. గార్డెన్ సిటీ చెత్త నగరంగా మారుతున్న విషయం ప్రభుత్వానికి, అడ్మినిస్ట్రేషన్కు తెలియదా?మొత్తం బడ్జెట్ నుంచి కమీషన్లు ఎలా పొందాలో ప్రభుత్వ ఉద్యోగులు, నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బాధ్యత, జవాబుదారీతనం లేనంత వరకు ఏదీ మెరుగుపడదు. బెంగళూరు అభివృద్ధి కోసం ఎవరైనా నిజాయితీగా ప్లాన్ చేస్తారని ఆశించడం అత్యాశే. -
అప్పు తిరిగి చెల్లించినా ‘సోర్స్’ ఉండాల్సిందే..
నేను తెలంగాణ ప్రభుత్వోద్యోగిని. నా ఆదాయం రూ.5 లక్షలు. రిటర్ను వేశాను. రిటర్న్ ప్రాసెస్ అయిపోయింది. గత సంవత్సరం మా బాబాయి వ్యాపారం కోసం బంగారం మీద రూ.15,00,000 లోన్ తీసుకున్నాను. ఈ సంవత్సరం మా బాబాయి ఆ మొత్తాన్ని రిటర్న్ చేస్తే, నేను లోన్ తీర్చివేస్తాను. ఈ వ్యవహారంలోని పన్ను చిక్కులు, ఇతర చిక్కులు తెలపండి. – రమేష్ రెడ్డి, ఈ–మెయిల్ ద్వారామీరు ప్రభుత్వోద్యోగి. మీ సంవత్సరాదాయం రూ. 5,00,000. ఇతరత్రా ఎటువంటి ఆదాయం లేదంటున్నారు. దీనికి సంబంధించిన రిటర్ను వేశారు. అది ప్రాసెస్ అయ్యింది. ఇదే సంవత్సరం బంగారం తాకట్టు పెట్టి రూ.15,00,000 లోన్ తీసుకుని, ఆ మొత్తాన్ని మీ బాబాయికి ఇచ్చారు. ఇందులో రెండు వ్యవహారాలు ఉన్నాయి. మీరు లోన్ తీసుకోవడం మొదటిదయితే, రెండోది మీరు మీ బాబాయిగారికి అప్పు ఇవ్వడం. ఈ రెండూ బ్యాంకు ద్వారా జరిగాయని అనుకుంటున్నాం. లోన్ వచ్చినప్పుడు మీ బ్యాంకు అకౌంటులో జమ, ఆ తర్వాత మీరు మీ బాబాయికి ఇచ్చినప్పుడు ఖర్చు/డెబిట్. ఈ మేరకు కాగితాలు/డాక్యుమెంట్లు, సంతకాలు, పద్దులు ఉన్నాయి కదా! (బదులుగా రెండు నగదు వ్యవహారాలయితే మాత్రం ఎంతో ముప్పు ఉంది. నగదు తీసుకోవడం, నగదు ఇవ్వడం రెండూ తప్పే. పెనాల్టీలు పడతాయి). ఇంతవరకు ఎటువంటి భయం లేదు. ఆ తర్వాత సంవత్సరం మీ బాబాయి మీకు చెక్కు ద్వారా ఇచ్చి, ఆ మొత్తం మీ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అయ్యి, అటుపైన మీరు అదే మొత్తాన్ని బంగారం కంపెనీకి అప్పు తీర్చినట్లయితే, మీ అకౌంటులో డెబిట్/ఖర్చు కనబడాలి. ఇలాగే జరిగితే, ఆ మేరకు కాగితాలు, డాక్యుమెంట్లు, సంతకాలు, పద్దులు, అవసరం అయితే కాగితాల ద్వారా వివరణ, కన్ఫర్మేషన్ ఉంటే ఎటువంటి భయం లేదు. ‘లోన్’ని ఆదాయంగా పరిగణించరు. జమని ‘లోన్’గా కాగితాల ద్వారా, థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ ద్వారా ధ్రువీకరించాలి. అలా చేస్తే ఈ వ్యవహారంలో జమల్ని ఆదాయంగా పరిగణించరు. అప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా దాన్ని ఆదాయంగా పరిగణించనవసరం లేదు. అయితే, ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఈ లావాదేవీలలో వడ్డీ ఉందా లేదా అని. వడ్డీ ఉంటే మీ ఆదాయంలో ఆ వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. వడ్డీ లేకపోతే మీరిద్దరూ రాతపూర్వకంగా ధ్రువీకరించాలి. నేను రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయ్యాను. పెన్షన్ వస్తుంది. నా భర్త లేనందున వారి పెన్షన్ నా ఆదాయంలో ‘ఫ్యామిలీ పెన్షన్’గా వస్తుంది. నా భర్త పెన్షన్, పన్ను భారం మొదలైన వ్యవహారాలన్నీ నా పాన్ నంబరు మీద నడుస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం నా భర్తకు వచ్చిన ఎరియర్స్ పన్నుకి గురి కావడం వల్ల పన్ను రికవరీ చేసి ఆ మేరకు చెల్లించి నాకు ఫారం 16 ఇచ్చారు. అప్పుడు ఆ పన్ను చెల్లింపులు నా అకౌంటులో కనిపించడం లేదని, వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులు పంపారు. –కె. శారద, బెంగళూరుఇటువంటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. పన్ను రికవరీలు జరిగి, గవర్నమెంటు ఖజానాకు చెల్లించినప్పటికీ ఆ మేరకు ఫారం 16లో సర్టిఫై అయినప్పటికీ, ఈ పద్దులు డిపార్టుమెంటు వారి దగ్గర వారు నిర్వహిస్తున్న 26ఏఎస్లో కనబడకపోతే/ఎంటర్ అవ్వకపోతే డిపార్టుమెంటు వారు పట్టించుకోరు. 26ఏఎస్లో కనిపించకపోతే ‘మనం చెల్లించలేదని’ వారి వాదన. అందుకే ఇటువంటి నోటీసులు పంపిస్తారు. ఇటువంటి నోటీసులు రాగానే ముందుగా నోటీసులో డిమాండ్ అంశాన్ని/భారాన్ని ఒప్పుకోకండి. ‘డూ యూ ఎగ్రీ’ అన్న ప్రశ్నకు ‘నో’ అని చెప్పండి.ఇప్పుడు మీ భర్తగారు రిటైర్ అయిన సంస్థకు వెళ్లి సమాచారం సేకరించండి. ఫారం 16 అడగండి. అందులో అన్ని వివరణలు ఉంటాయి. ఎంత ఎరియర్స్ వచ్చాయి, పన్ను ఎంత, అది ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, లాన్ నంబరు, ఏ తేదీనాడు చెల్లించారు.. ఈ వివరణలతో ఫారం 16ని సేకరించి, డిపార్టుమెంటు వారి పోర్టల్కి వెళ్లి వివరంగా జవాబు ఇవ్వండి. డిమాండ్ నోటీసుని ఉపసంహరించమని అడగండి. డిపార్టుమెంటు వారు అవసరమైతే మిమ్మల్ని సంబంధిత అధికారులను కలవమని చెప్పవచ్చు.. లేదా వారికి నేరుగా కాగితాలను సబ్మిట్ చేయమని చెప్పవచ్చు. దీనితో మీ సమస్యలు సమసిపోవచ్చు. ఇంకా డిమాండు విత్డ్రా కాకపోతే ‘గ్రీవెన్స్ సెల్’కి రిపోర్ట్ చేయొచ్చు. అప్పుడు ఫారం 16 కాపీని అప్లోడ్ చేయొచ్చు. కాస్త సమయం పడుతుంది. అందాకా మీకు టెన్షన్ ఉండొచ్చు. కానీ ఫారం 16లోని అంశాలు కరెక్టుగా ఉన్నంత వరకు ఎటువంటి పొరపాటు జరగదు. జాప్యం ఉండొచ్చేమో .. తప్పు జరగదు. అందుకనే ఒక సలహా. ఇన్కం ట్యాక్స్ రిటర్నులకు సంబంధించిన అన్ని వివరాలు, కాగితాలు, చలాన్లు మొదలైన వాటన్నింటిని ఎప్పుడూ భద్రపర్చుకోవాలి. -
హైదరాబాద్..ఖరీదైన జీసీసీ మార్కెట్!!
దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) సంబంధించి అద్దెల విషయంలో హైదరాబాద్ అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్గా నిలుస్తోంది. ఐఐఎం బెంగళూరు, సీఆర్ఈ మ్యాట్రిక్స్ విడుదల చేసిన 2026 తొలి త్రైమాసిక నివేదిక ప్రకారం జీసీసీ–సీపీఆర్ఈ సూచీలో 212.1 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఇతర సంస్థలతో పోలిస్తే జీసీసీ కంపెనీలు 15 శాతం అధికంగా అద్దెలు చెల్లిస్తున్నాయి. ఈ విషయంలో పుణె, బెంగళూరు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిల్చాయి. 210.7 స్కోరు దక్కించుకున్న పుణెలో జీసీసీ కంపెనీలు, ఇతర సంస్థలతో పోలిస్తే సుమారు 21 శాతం అధికంగా చెల్లిస్తున్నాయి. ఇక దేశంలోనే అతి పెద్ద జీసీసీ ఆఫీస్ మార్కెట్గా తన స్థానాన్ని నిలుపుకొన్న బెంగళూరు స్కోరు 190గా ఉంది. జాతీయ స్కోరు 165 వద్ద స్థిరంగా కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. భారీ డీల్స్, సుదీర్ఘ కాలానికి లీజులు..భారతీయ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో జీసీసీల అద్దె పోకడలను అంచనా వేయడానికి ఇది ఉపయోగకరంగా ఉండగలదని సీఆర్ఈ మ్యాట్రిక్స్, ఇండెక్స్ట్యాప్ సీఈవో అభిషేక్ కిరణ్ గుప్తా తెలిపారు. గత కొన్నేళ్లుగా మిగతా కిరాయిదార్లతో పోలిస్తే జీసీసీల ధోరణి కాస్త భిన్నంగా ఉంటోందని వివరించారు. భారీ డీల్స్, సుదీర్ఘ కాలానికి లీజులతో మొత్తం మ్యాక్రో మార్కెట్లను శాసించేలా వాటి నిర్ణయాలు ఉంటున్నాయని తెలిపారు. రవాణా సౌకర్యాలుల బాగుండి, గ్రేడ్–ఏ ఆఫీస్ క్లస్టర్లు ఉన్న ప్రాంతాలకి ప్రాధాన్యత పెరుగుతోందని పేర్కొన్నారు.పశ్చిమ భారతదేశంలోని మైక్రోమార్కెట్లలో కూడా అద్దెలు గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదిక వివరించింది. నవీ ముంబైలో రెంటల్ వృద్ధి వార్షిక ప్రాతిపదికన గత మూడేళ్లలో 13.4 శాతంగా నమోదైంది. మెరుగైన రవాణా, గ్రేడ్–ఏ కార్యాలయాలు ఉన్న ముంబై సెంట్రల్ శివార్లలో, చెన్నై నగర ఉత్తర ప్రాంత శివార్లలో ఇది ఏకంగా 22 శాతంగా రికార్డయింది. దేశవ్యాప్తంగా 100 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్, 19,000 లీజు లావాదేవీల విశ్లేషణ ఆధారంగా ఈ సూచీని రూపొందించారు.ఇదీ చదవండి: లాకర్.. సేఫేనా? -
లాకర్.. సేఫేనా?
ఏళ్ల తరబడి కూడబెట్టిన బంగారం. వారసత్వంగా వస్తున్న కుటుంబ నగలు, విలువైన ఆస్తిపత్రాలు లాకర్లో ఉంటే చాలు ఇక టెన్షన్ లేదు అనే నమ్మకం భారతీయ కుటుంబాల్లో బలంగా ఉంది. విలువైన సంపదనంతా లాకర్లో దాచేసి తాళం చెవిని చూసుకుంటూ అంతా సేఫ్ అనుకునే రోజులు పోయాయి. దేశంలోని పలు నగరాల్లో ఇటీవలి కాలంలో వరుసగా వెలుగుచూసిన బ్యాంక్ లాకర్ వివాదాలు ప్రజల నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నాయి. లాకర్లో ఉంచిన నగలు మాయమైతే బ్యాంకు బాధ్యత పరిమితమే అనే విషయం లాకర్లో వస్తువులు మాయమయ్యాక తెలుస్తోంది. నష్టపోయిన వస్తువులకు బ్యాంకులు చెల్లించే పరిహారం పోగొట్టుకున్న వాటి పూర్తి విలువలో పావువంతు కూడా ఉండదన్న విషయం అనేకమందికి చేతులు కాలాక కానీ అవగాహనకి రావడంలేదు. లాకర్ నిజంగా మీ విలువైన వస్తువులకు భద్రత ఇస్తుందా... ఇస్తే అది ఎంత భద్రత ఇస్తుంది? బంగారం, ఆస్తి పత్రాలను పూర్తిగా కాపాడుకోవాలంటే ఇంకేం చేయాలి అని వివరించి గైడ్ చేసే వెల్త్ స్టోరీ...బెంగళూరులో ఒక డాక్టర్ బ్యాంక్ లాకర్లో దాచుకున్న రూ.24 లక్షల విలువైన బంగారం పోయింది. మరో కేసులో ఢిల్లీలో ఓ కుటుంబం లాకర్లో ఎప్పటినుంచో పెడుతున్న రూ.60 లక్షల నగలు ఒకసారి కనిపించకుండా పోయాయి. సీసీటీవీలు ఉన్నాయి. ఫుటేజీల్లో పోయిన విషయం వెల్లడైంది. అయినా బాధితులకు న్యాయం అందలేదు. ఇక్కడ అసలు షాక్ ఏమిటంటే బ్యాంక్కు మీ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయాల్సిన బాధ్యత లేదు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం మీకు తెలియాల్సిన నిజం ఏమిటంటే ,బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు బాధ్యత లాకర్ రెంట్కు వంద రెట్లు మాత్రమే.. లాకర్లో వస్తువులు పోతే కస్టమర్ చెల్లించే లాకర్ రెంటుకు వంద రెట్లు నష్టపరిహారం మాత్రమే బ్యాంకు చెల్లిస్తుంది. అంటే ఒక లాకర్కు ఏడాదికి రూ.7000 అద్దె కడుతుంటే నష్టపోయినపుడు దక్కే పరిహారం రూ.7 లక్షలు మాత్రమే. పోగొట్టుకున్న మీ సంపద 70 లక్షలకు పైగా ఉన్నా దక్కేది అదే..అంటే బ్యాంక్ లాకర్ మాత్రమే విలువైన వస్తువులకు సేఫ్ కాదు. మరి బంగారాన్ని, ఇతర వస్తువులు, డాక్యుమెంట్లు ఎలా రక్షించుకోవాలి? అందుకు మల్టీ లేయర్ స్ట్రాటజీ పాటించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఒక రక్షణ పద్ధతిపై మాత్రమేఆధార పడటం ప్రమాదకరం. ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నది కూడా మల్టీలేయర్ ప్రొటెక్షన్ స్ట్రాటజీనే అదేమీ బంగారం, డాక్యుమెంట్స్కు అసలైన భద్రత.జ్యువెలరీ ఇన్సూరెన్స్ఎక్కువ మంది పట్టించుకోని పెద్ద రక్షణభారతదేశంలో నగలు కొనేవారు ఇంటికి ఒకరు చొప్పున కోట్లలో ఉన్నా కొన్న నగలకు ఇన్సూరెన్స్ చేసే వారు మాత్రం అరుదే. లక్షల విలువ చేసే నగలు కొనగానే బీమా చేస్తే దొంగతనం జరిగినపుడు అది ఇంట్లో అయినా, బయట అయినా. లాకర్ లో జరిగినా పూర్తిగా నష్టపరిహారం బీమా రూపంలో అందుతుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు, ప్రయాణాల్లో నగలు పోగొట్టుకున్నా బీమా భద్రత పూర్తిగా లభిస్తుంది.ఇది బ్యాంకు తప్పిదంవల్ల జరిగిన నష్టానికి అందే పరిహారం కంటే ఎక్కువ. బ్యాంక్ కవరేజ్ లిమిట్ను దాటి, అసలు విలువను రక్షించేది ఇదే.ప్రీమియం ఎంత? సంవత్సరానికి 0.3శాతం నుంచి 1శాతం లోపే రూ.10 లక్షల బంగారానికి రూ.3,000 రూ.10,000 వరకు మాత్రమే అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పాలసీలో మీరు డిక్లేర్ చేసిన నగలకు మాత్రమే కవరేజ్ లభిస్తుంది. బీమా చేశాక నగలు కొత్తగా కొంటే వాటిని బీమాలో అప్డేట్ చేయాలిజ్యువెలరీ వాల్యుయేషన్చిన్న తప్పు, పెద్ద నష్టంమీ నగల విలువను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మదుపు చేయించాలి. అదీ పాత బిల్లుతో కాదు. ప్రస్తుత మార్కెట్ విలువతో ఇన్సూర్ చేయించాలి. ఎందుకంటే పదేళ్ల క్రితం కొన్న బంగారం విలువ ప్రస్తుతం అనేక రెట్లు పెరిగి ఉంటుంది. పాత విలువతో బీమా చేయిస్తే పోగొట్టుకున్నప్పుడు లభించే బీమా క్లెయిమ్ తక్కువే ఉంటుంది. అందుకే నగలను ఎప్పటికప్పుడు సర్టిఫైడ్ జ్యువెలర్తో వాల్యుయేషన్ చేయించాలి. కనీసం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారైనా అప్డేట్ చేసుకోవాలి.హోమ్ సేఫ్ ఏర్పాటుఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ప్రతి ఇంట్లో ఉండాల్సిన మినీ వాల్ట్ ఉండాలి. రోజువారీ క్యాష్, నగల కోసం ఇంట్లో ఒక మంచి హోమ్ సేఫ్ ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే దృఢమైన స్టీల్ బాడీతో తయారు చేసినదై ఉండాలి. పిన్/ ఫింగర్ ప్రింట్ లాక్ సౌకర్యం ఉండాలి. అగ్ని ప్రమాదాలను తట్టుకునేలా ఫైర్ రెసిస్టెంట్ అయి ఉండాలి. గోడకు కానీ నేలకు కానీ బిగించాలి. రూ.5000 నుంచి 25000 ఖర్చుతో సేఫ్ ఏర్పాటు చేసుకుని తరచూ వేసుకునే నగలతోపాటు, లాకర్లో పెట్టిన వస్తువుల కాపీలు, రసీదులు, డాక్యుమెంట్ల జిరాక్సులు రెడీగా ఉంచుకోవాలి.హోమ్ ఇన్సూరెన్స్ అండర్ రేటెడ్ కవరేజ్చాలా మందికి హోమ్ ఇన్సూరెన్స్ ఉండదు. ఫరి్నచర్, ఎల్రక్టానిక్స్ వస్తువులతో పాటు, నగలు కూడా (సబ్ లిమిట్)తో బీమా చేయించాలి. జువెలరీ లిమిట్ ని అదనంగా పెంచుకోవచ్చు.డిజి లాకర్డాక్యుమెంట్లకు డిజిటల్ రక్షణభారత ప్రభుత్వం పౌరులందరికి అందిస్తున్న ఫ్రీ సర్వీస్ ఈ డిజిలాకర్.. డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డులు, రిజి్రస్టేషన్ కార్డులు వంటి డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో ఇక్కడ దాచుకో?వచ్చు. ఇవన్నీ ఎక్కడైనా లీగల్గా వాలిడిటీ కలిగి ఉంటాయి. ఎక్కడైనా, ఎక్కడినుంచైనా ఇంటర్ నెట్ ద్వారా, ఫోన్లో కూడా యాక్సెస్ చేయచ్చు. అయితే ఒకవిషయం గుర్తుంచుకోవాలి. డిజి లాకర్లో అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లు స్కాన్ కాపీలు మాత్రమే. రిఫరెన్స్ కోసమే. ఒరిజినల్స్ను మరోచోట సేఫ్ గా భద్రపరచుకోవాలి.ప్రాపర్టీ డాక్యుమెంట్స్స్మార్ట్ హ్యాండ్లింగ్ తప్పనిసరిఇళ్లు, స్థలాలకు సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్లు పోతే వాటిని తిరిగి పొందడానికి, కనీసం డూప్లికేట్ కాపీలు సంపాదించడానికి సంవత్సరాలు సాగుతాయి. అందువల్ల డాక్యుమెంట్ కాపీలను మల్టిపుల్ కాపీలు గా చేసి లాకర్తో పాటు, ఇంట్లో, దగ్గరి బంధువులు, స్నేహితులు దగ్గర ఒక కాపీ ఉంచాలి. హైక్వాలిటీ స్కాన్ చేయించి గూగుల్ డ్రైవ్లో, డిజిలాకర్లో అప్లోడ్ చేయాలి. ఒక కాపీని పర్సనల్ మెయిల్కి పంపుకుని సేవ్ చేసి ఉంచుకోవాలి?డాక్యుమెంటేషన్పోయిన వస్తువుల, నగల క్లెయిమ్కు ఇదే బేస్కొన్న ప్రతి నగకు ఫోటోలు తీయించాలి. వాటి వెయిట్, ప్యూరిటీ నోట్ చేసి ఉంచాలి. బిల్లులు అన్నీ ఎక్స్ ట్రా కాపీ భద్రంగా ఉంచాలి. ఎక్కడ ఉంచారో రికార్డు చేయాలి. ఈ రికార్డు లేకపోతే బీమా క్లెయిమ్ రిజెక్ట్ అయే చాన్స్ ఎక్కువ.లాకర్లో నగలు మాయమైతే ఏం చేయాలి? బ్యాంకు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. సీసీటీవీ ఫుటేజ్ అడిగి తీసుకోవాలి, వెంటనే బీమా కంపెనీకి సమాచారం అందించాలి. నగలకు సంబంధించిన ఫొటోలు, విలువకు సంబంధించిన పత్రాల కాపీలు అందించాలి. బెంగళూరు, ఢిల్లీ కేసులు యాదృచ్ఛికం కాదు నిర్లక్ష్యానికి హెచ్చరిక. అన్ని వస్తువులకు బ్యాంకు లాకరే భద్రత కాదు. అసలు భద్రత సిస్టమ్ ప్లస్ ప్లానింగ్. సేఫ్టీ అనేది ప్రమాదం సంభవించిన తర్వా త కాదు. ముందే నిర్మించుకోవాల్సిన విషయం. -
మళ్లీ పశ్చిమాసియా టెన్షన్!
పశ్చిమాసియాలో మళ్లీ అగ్గి రాజుకుంది. సీజ్ఫైర్ను ఉల్లంఘించారంటూ... ఇరాన్–అమెరికా దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం మళ్లీ అట్టుడికింది. తాజా భౌగోళిక రాజకీయ పరిణామాల సెగ ముడిచమురు ధరలపై చూపే ప్రభావం ఈ వారం మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనుందనేది విశ్లేషకులు అభిప్రాయం. సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే, దేశీయంగా వెలువడే పలు స్థూల ఆర్థిక గణాంకాలు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, రుతుపవనాల కదలికలపై కూడా ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. ఇరాన్లోని మిసైల్, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా ఎటాక్ చేసింది. మరోమారు సీజ్ఫైర్ను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అగ్రరాజ్యం హెచ్చరించింది. మరోపక్క ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వెరసి ఈ వారం క్రూడ్ ధరలపై ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. శాంతి ఒప్పందంపై ఆశలతో ముడిచమురు ధరలు చల్లారిన సంగతి తెలిసిందే. బ్రెంట్ క్రూడ్ 75 డాలర్ల దిగువకు, అంటే యుద్ధం పూర్వపు స్థాయికి చేరింది. తాజా పరిణామాలతో క్రూడ్ ధరలు మళ్లీ పుంజుకోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మార్కెట్లలో తీవ్ర ఒడిదుడులకులు ఉండొచ్చనేది నిపుణుల విశ్లేషణ. ‘పశ్చిమాసియాలో తాజా టెన్షన్లను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ఒకపక్క శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ... అమెరికా, ఇరాన్ మధ్య చోటు చేసుకున్న దాడులతో భౌగోళిక రాజకీయ రిసు్కలు ఇంకా తొలగిపోలేదని మార్కెట్లకు సంకేతాలిస్తున్నాయి. చర్చల్లో సానుకూల ఫలితాలు, ఉద్రిక్తతలు సద్దుమణిగితే రిస్క్ సెంటిమెంట్ మెరుగవుతుంది ఒకవేళ దాడులు తీవ్రమైతే ప్రపంచ వృద్ధి, ఇంధన మార్కెట్లపై అంచనాలు తారుమారవుతాయి’ అని ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ పేర్కొన్నారు. గణాంకాలపై ఫోకస్... ఈ వారం దేశీయంగా విడుదల కానున్న కొన్ని కీలక గణాంకాలు మన మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)తో పాటు హెచ్ఎస్బీసీ తయారీ సేవల పీఎంఐ డేటా వెలువడనుంది. మరోపక్క, జూన్ నెల ఆటోమొబైల్ అమ్మకాలను కూడా కంపెనీలు జూలై 1న వెల్లడించనున్నాయి. ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితిని తెలియజేయనున్న నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. మరోపక్క, అమెరికా తయారీ రంగ పనితీరును సూచించే డేటా కూడా మార్కెట్లకు కీలకమేనని మోతీలాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ (వెల్త్ మేనేజ్మెంట్) సిద్ధార్థ్ ఖేమ్కా చెప్పారు. రూపాయి.. రుతుపవనాలు ముడిచమురు ధరలు దిగిరావడం, డాలర్ల ప్రవాహాన్ని పెంచేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇటీవల రూపాయి కాస్త పుంజుకుంది. డాలర్ మారకంలో ఆల్టైమ్ కనిష్టం 96.96 స్థాయి నుంచి 94.20 వరకు బలపడింది. ప్రస్తుతం 94.50 వద్ద కదలాడుతోంది అయితే, పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతలతో క్రూడ్ ఎగబాకితే.. రూపాయికి దాని సెగ తగులుతుందని.. మళ్లీ బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, జూన్ నెల ముగుస్తున్నా.. ఇంకా రుతుపవనాలు పూర్తిగా విస్తరించలేదు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు గనుక ఇలాగే ముఖం చాటేస్తే.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని.. రానున్న రోజుల్లో నైరుతి రుతుపవనాల కదలికలపై ఇన్వెస్టర్లు గట్టిగా ఫోకస్ చేస్తారని పోన్ముడి పేర్కొన్నారు. గతవారమిలా... శుక్రవారం మన మార్కెట్లకు మొహర్రం సెలవు కారణంగా ఆసియా మార్కెట్లలో టెక్, చిప్ స్టాక్స్లో వెల్లువెత్తిన అమ్మకాలు ప్రతిబింబించలేదు. గతవారం ట్రేడింగ్ నాలుగు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 298 పాయింట్లు (0.38%) పెరిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్లు (0.17%) లాభపడి 24,056 వద్ద ముగిసింది.సాంకేతికంగా చూస్తే... పశ్చిమాసియా ప్రభావంతో మార్కెట్లు గనుక వెనకంజ వేస్తే... నిఫ్టీకి ఈ వారం 23,800 వద్ద తొలి మద్దతు లభించవచ్చు. మరింత దిగజారితే 23,640 రెండో మద్దతు స్థాయిగా నిలుస్తుంది. ఇక నిఫ్టీ పెరిగితే.. 24,200–24,300 స్థాయిలో తొలి నిరోధం ఎదుర్కొంటుంది. 24,300 స్థాయిని గనుక అధిగమించగలిగితే.. 24,500 దిశగా పయనిస్తుందనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మీ రూపాయికీ చిల్లు పడుతోందా?
బంగారాన్ని కొనవద్దంటూ ఆంక్షలు విధించినా... దిగుమతి సుంకం అమాంతం పెంచేసినా... అదంతా మన దిగుమతుల బిల్లు భారం తగ్గించుకోవటానికే. విదేశీ ప్రయాణాలు వద్దని సాక్షాత్తూ ప్రధానమంత్రి సూచించటం ఒకెత్తయితే... దేశీయంగా పెట్రోలు వాడకాన్ని తగ్గించడానికి అందులో కలిపే ఇథనాల్ మోతాదును పెంచటం కూడా చేస్తోంది ప్రభుత్వం. పైపెచ్చు 100 శాతం ఇథనాల్ అంటూ కొత్త వాహనాలను, ఇంధనాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు కూడా. ఇదంతా ఎందుకంటే దిగుమతుల బిల్లు తగ్గించుకోవటానికి. అంతకంతకూ కరిగిపోతున్న రూపాయి విలువను కాస్తయినా పటిష్ఠంగా ఉంచడానికి. కానీ డాలర్తో మారకంలో రూపాయి ఇప్పటికే భారీగా పతనమైపోయింది. ఎల్రక్టానిక్ గాడ్జెట్లతో సహా తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన చాలా వస్తువుల ధరలు పైకి ఎగిశాయి. దేశీయంగా పెట్రోలు ధరలు పెరగటం ఫలితంగా చాలా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వెరసి సామాన్యుడి బడ్జెట్ తల్లకిందులయింది. ఈ నేపథ్యంలో ఏ వర్గంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? వారు బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని వివరించేదే ఈ సాక్షి వెల్త్ స్టోరీ...ఐటీ, ఫైనాన్స్, స్టార్టప్లవ్యాప్తంగా ఒకప్పుడు పుష్కలంగా కొలువులు వచి్చనా... ఇప్పుడు ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారింది. నెలంతా అప్పులతో నెట్టుకొచ్చి జీతం రాగానే చెల్లించేసే చాలా మంది వేతన జీవులకు ఈ అనిశ్చితి సమస్యాత్మకంగా ఉంటోంది. వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐలు గుదిబండగా మారుతున్నాయి. జీతాలు పెరిగినా పెరగకపోయినా.. పెరిగిపోయే స్కూలు, కాలేజీ ఫీజులు కట్టడమెలా అని తలపట్టుకుంటున్నారు. అటు పదవీ విరమణ చేసిన వారి సంగతి తీసుకుంటే వైద్యం ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది కదా అని ఫిక్స్డ్ డిపాజిట్లలో కాస్తో కూస్తో దాచుకున్నా.. దానిపై వచ్చే వడ్డీ అంతంతమాత్రమే. ఈ వడ్డీ పెరిగే ధరల భారాన్ని తట్టుకునేందుకు సరిపోయేట్లు ఏమాత్ర ఉండటం లేదు. ఇక చిరు వ్యాపార వర్గాలను చూస్తే.. రవాణా ఖర్చులు, మెటీరియల్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పైపెచ్చు వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించుకుంటూ ఉండటంతో అమ్మకాలు పడిపోతూ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. అయిదు హెచ్చరిక సంకేతాలు.. పరిస్థితి అదుపు తప్పుతోందనడానికి ఓ అయిదు హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అవి కనిపించగానే, వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి. ఇంతకీ ఆ హెచ్చరిక సంకేతాలేమిటంటే..1. క్రెడిట్ కార్డు బాకీలను ప్రతి నెలా క్యారీ ఫార్వార్డ్ చేస్తుండటం 2. ఈఎంఐల భారం ఆదాయంలో 40 శాతానికి పైగా ఉండటం 3. అత్యవసర నిధి అంటూ లేకపోవడం 4. వచ్చే ఆదాయంలో పొదుపు మొత్తం 10% కూడా లేకపోవడం5. ఆరోగ్య బీమా లేకపోవడం ఇలా చేద్దాం.. పరిష్కారం 1: ఒక ఏడాదికి సరిపడే అత్యవసర నిధి గతంలో ఎలాంటి అత్యవసరాన్నైనా ఎదుర్కోవాలంటే ఒక ఆరు నెలల ఖర్చులకు సరిపడా దాచిపెట్టుకుంటే సరిపోయేది. కానీ జాబ్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం, హెల్త్ ఎమర్జెన్సీలు తలెత్తుతుండటం, ధరలు పరుగులు తీస్తున్న తరుణంలో కనీసం 9–12 నెలల అవసరాలకు సరిపోయేంత మొత్తాన్ని తక్షణం తీసుకోవటానికి వీలుగా పక్కన పెట్టుకోవడం అనివార్యం. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్, సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుచుకోవచ్చు. పరిష్కారం 2: కొత్త భారీ రుణాలకు దూరం.. సాధ్యమైనంత వరకు భారీ స్థాయి రుణాలకు అంటే.. లగ్జరీ కార్ లోన్స్, వ్యక్తిగత రణాలు, ఈఎంఐలతో క్రెడిట్ కార్డుల మీద పెద్ద మొత్తాల్లో కొనుగోళ్లు చేయటం వంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. పైగా వడ్డీ రేటు అధికంగా ఉండే అప్పును తీర్చేయడం లక్ష్యంగా పెట్టుకుంటే మరీ మంచిది. వడ్డీ రూపంలో కట్టాల్సిన ఒక్క రూపాయిని ఆదా చేసినా.. పన్నుల భారం లేకుండా కాస్త అదనపు ఆదాయాన్ని అందుకున్నట్లే.పరిష్కారం 3: ఈక్విటీల్లో క్రమంగా పెట్టుబడులుచారిత్రకంగా చూస్తే కరెన్సీ బలహీనపడినప్పుడల్లా బంగారం ఆదుకుంటూ వస్తోంది. పెరిగే ధరలను ఎదుర్కొనగలిగేలా ఈక్విటీలు.. అంటే షేర్లు మెరుగైన రాబడులు అందిస్తూ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయనే కారణంతో పెట్టుబడులను ఆపేయకుండా సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసే వారు.. కొనసాగిచడమే మంచిది. పరిష్కారం 4: బంగారంలో 10–15% పెట్టుబడి.. పసిడిలో ఎంతో కొంతైనా పెట్టుబడి పెడితే కష్టకాలంలో ఉపయోగపడుతుంది. కనుక మొత్తం పోర్ట్ఫోలియోలో ఓ 10–15% బంగారానికి కేటాయించండి. గోల్డ్ ఈటీఎఫ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లలో (మళ్లీ ప్రవేశపెడితే) ఇన్వెస్ట్ చేయొచ్చు. కుటుంబ అవసరాల మేరకే ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు. లేకపోతే ఎల్రక్టానిక్ పద్ధతిలో కొనుక్కోవడమే శ్రేయస్కరం. సాధారణంగా రూపాయి బలహీనపడినప్పుడు, అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగినప్పుడు పసిడికి డిమాండ్ పెరుగుతుంది. పరిష్కారం 5: బీమా కవరేజీని సమీక్షించుకోవాలిప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా, అలాగే ఆర్జించే కుటుంబ సభ్యుల పేరిట టర్మ్ పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాదు.. కవరేజీ కూడా సరిపోయేంతగా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే, ఏదైనా సంక్షోభం ముంచుకొస్తే తప్ప చాలా మందికి .. తాము తీసుకున్న బీమా కవరేజీ.. తమ అవసరాలకు సరిపోయేంతగా లేదనే విషయం తెలియదు. కాబట్టి పాలసీ తీసుకుని మర్చిపోవడం కాకుండా.. ప్రతి సంవత్సరం కవరేజీని సమీక్షించుకుంటూ, అవసరాన్ని బట్టి పెంచుకుంటూ ఉండాలి. పరిష్కారం 6: కొత్త నైపుణ్యాలు.. అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఇది అన్నింటికంటే ముఖ్యమైన పరిష్కారం. 40 ఏళ్ల పైబడిన ప్రొఫెషనల్స్ ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ, తమను తాము అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఏఐ గురించి తెలుసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియ్లల్ ప్లానింగ్ సర్టిఫికేషన్లు, తాము చేసే రంగాలకు సంబంధించి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉండాలి. తద్వారా పెట్టుబడులపై రాబడులు ఎలా ఉన్నా ఆదాయం అధికంగా ఉంటే ధరల దాడిని కొంత మేర అయినా సమర్ధంగా ఎదుర్కొనవచ్చు. పరిష్కారం 7: వివిధ ఆదాయ మార్గాలు కేవలం జీతం మీదే ఆధారపడితే సరిపోదు. వేరే వేరే ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. కన్సలి్టంగ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ట్యూషన్లు, ఆన్లైన్ సరీ్వసులు.. ఇలా అదనంగా కనీసం ఒక్క ఆదాయ మార్గమైనా పక్కన ఉంటే... ఆర్థికంగా స్ట్రెస్ కాస్త తగ్గుతుంది. పరిష్కారం 8: ‘విదేశీ’ తగ్గించుకోవాలి రూపాయి పతనం వల్ల విదేశీ ప్రయాణాలు, చదువులు, దిగుమతి చేసుకున్న గ్యాడ్జెట్లు.. చాలా ఖరీదైన వ్యవహారంగా మారతాయి. కాబట్టి అనవసరమైన అప్గ్రేడ్స్ జోలికి వెళ్లకూడదు. వీలైనంత వరకు వాయిదా వేసుకోతగిన వాటి కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం మంచిది. పరిష్కారం 9: నాణ్యమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి అనిశ్చితి నెలకొన్న వేళ.. పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్యాలెన్స్ షీటు పటిష్టంగా ఉన్నవి, స్థిరంగా క్యాష్ ఫ్లో ఉన్నవి, క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లించే కంపెనీలను పరిశీలించి, అలాంటి షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. భారీగా రుణభారం ఉన్న స్పెక్యులేటివ్ స్టాక్స్ జోలికి పోవద్దు. పరిష్కారం 10: బిజినెస్లాగే బడ్జెట్ వ్యాపారం చేస్తుంటే ప్రతిదీ ఎలా లెక్కేస్తామో ఇంటి బడ్జెట్లోనూ అలాగే ఉండాలి. ఇంటి ఈఎంఐలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, రవాణా, వినోదం ఇలా అన్నింటినీ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అనవసరమైన సబ్్రస్కిప్షన్లు, ఫుడ్ డెలివరీలు, ఆత్రం కొద్దీ కొనేసే వాటివల్ల ఎంత దుబారా అవుతోందనేది చాలా కుటుంబాలు గ్రహించవు. ఇలాంటి ఖర్చులను నివారిస్తే బోలెడు ఆదా అయినట్లే. -
కొత్త బీఎండబ్ల్యూ కారు: ధర ఎంతంటే?
బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో 'ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్డ్రైవ్'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.78 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది.బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్డ్రైవ్ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజన్, 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ పొందుతుంది. ఇది 530 bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇది 4.3 సెకన్లలో 0-100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250కిమీ/గం. ఇంజిన్ 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్డ్రైవ్ కొంత అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలో ఎం షాడోలైన్ డీటైలింగ్తో కూడిన సన్నని అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్లైట్స్, వర్టికల్ డబుల్ స్లాట్లు వంటివి మాత్రమే కాకుండా.. ప్రకాశవంతమైన M లోగోతో కూడిన బ్లాక్ కిడ్నీ గ్రిల్, గ్లాస్ బ్లాక్ ఎమ్ ఎక్స్టీరియర్ మిర్రర్స్, ఎమ్ స్పెషల్ సైడ్ స్కర్ట్లను కలిగి ఉంది. వెనుక వైపు.. సన్నని ఎల్ ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్లు ఉన్నాయి. ఈ SUV రన్ ఫ్లాట్ టైర్లతో కూడిన 21 అంగుళాల ఎమ్ లైట్-అల్లాయ్ వీల్స్పై నడుస్తుంది.లోపలి భాగంలో.. ఒకే గ్లాస్ ప్యానెల్ కింద 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల సెంట్రల్ టచ్స్క్రీన్ ఉంటాయి. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సరికొత్త బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 8.5తో పనిచేస్తుంది, ఇది బీఎండబ్ల్యూ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్ ద్వారా టచ్, వాయిస్ నియంత్రణలకు మద్దతు ఇస్తుంది.సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో ఆరు ఎయిర్బ్యాగ్లు, బ్రేక్ అసిస్ట్తో కూడిన ఏబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, క్రాష్ సెన్సార్లు, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ ఉన్నాయి. -
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు చెబుతున్నారు.మే 10న ప్రధానమంత్రి బంగారం కొనుగోలును ఒక ఏడాది వాయిదా వేయాలని చెప్పినప్పుడు, 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,53,140గా ఉండగా, వెండి ధర కేజీ సుమారు రూ.2,62,350గా ఉంది. అయితే నేటికి (జూన్ 28) ఆ ధర బంగారం ధర రూ.1,39,873కి తగ్గగా, వెండి ధర రూ.2,16,541కి పడిపోయింది. అంటే.. మోదీ ప్రకటన తరువాత గోల్డ్ రేటు సుమారు రూ.13,267 తగ్గగా, వెండి దాదాపు రూ.45,809 తగ్గింది.భారత్లో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై భారీ ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి అవసరం ఉంటే తప్పా.. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరారు.ప్రధాని విజ్ఞప్తి తరువాత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీని ద్వారా దిగుమతులను తగ్గించడంతో పాటు.. దేశీయ మార్కెట్పై నియంత్రణ సాధించాలని భావించారు. అనుకున్న విధంగానే.. ఈ నిర్ణయం వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపించిందని తెలుస్తోంది. -
క్విడ్ ఫేస్లిఫ్ట్.. లాంచ్ డేట్ ఫిక్స్!
రెనాల్ట్ తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ అయిన అప్డేటెడ్ క్విడ్ ఫేస్లిఫ్ట్ను జూలై 3న భారతదేశంలో విడుదల చేయనుంది. దశాబ్దానికి పైగా దేశంలో అమ్ముడవుతున్న క్విడ్ కారు కంపెనీకి చెందిన పాపులర్ మోడల్గా కొనసాగుతూ, దాని లైనప్లో కీలక పాత్ర పోషిస్తుంది.క్విడ్ ఫేస్లిఫ్ట్ కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై షాట్లు ఫేస్లిఫ్ట్ క్విడ్ పూర్తిస్థాయి రీడిజైన్కు బదులుగా సూక్ష్మమైన స్టైలింగ్ మార్పులను పొందుతుందని సూచిస్తున్నాయి. వెహికల్ ముందు భాగం, రెనాల్ట్ బ్యాడ్జ్, టెయిల్ ల్యాంప్ల చుట్టూ క్యామోఫ్లాజ్తో కనిపించాయి. కాబట్టి ఇది కీలకమైన విజువల్ ఎలిమెంట్స్లో అప్డేట్లను సూచిస్తుంది.అప్డేటెడ్ మోడల్లో కొత్త గ్రిల్, బంపర్లు, కొత్త లైటింగ్ అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ డిజైన్ డాసియా స్ప్రింగ్ ఈవీ నుంచి ప్రేరణ పొందవచ్చని, తద్వారా క్విడ్ను.. రెనాల్ట్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్కు అనుగుణంగా మార్చవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.లోపలి భాగంలో.. మొత్తం క్యాబిన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి క్విడ్ ఫేస్లిఫ్ట్ కొన్ని చిన్న అప్డేట్లను పొందుతుందని సమాచారం. అధికారిక ఫీచర్ల జాబితా ఏదీ వెల్లడించనప్పటికీ, అప్డేటెడ్ మోడల్లో పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభించే అవకాశం ఉంది.ఇంజిన్ పరంగా.. క్విడ్ ఫేస్లిఫ్ట్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇది ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్, త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తోనే కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ 65 bhp పవర్, 96 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కూడా అలాగే ఉంటాయని అంచనా వేస్తున్నారు, కొనుగోలుదారులు 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 5 స్పీడ్ AMT మధ్య ఎంచుకోవచ్చు.కంపెనీ ఈ కారు ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది. ఇది ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి ఆల్టో కె10, మారుతి సుజుకి సెలెరియో వంటి ప్రత్యర్థులతో పోటీని కొనసాగించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన! -
ప్రపంచ కుబేరుడి విజయ గాథ!
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ తన 55వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ (AI) వంటి రంగాల్లో చూపిన దూరదృష్టి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ సాంకేతిక ప్రపంచాన్ని రూపొందిస్తున్న వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.బాల్యం, విద్యఎలాన్ మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లు, టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1989లో ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు. అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీకి చేరినప్పటికీ, కేవలం రెండు రోజుల్లోనే దాన్ని వదులుకుని వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.వ్యాపార ప్రస్థానం ప్రారంభం1995లో తన సోదరుడితో కలిసి 'జిప్2' అనే ఆన్లైన్ సిటీ గైడ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థను 1999లో విక్రయించడంతో మస్క్కు భారీ ఆర్థిక లాభం వచ్చింది. అయితే ఆ డబ్బును ఖర్చు చేయకుండా మరో వినూత్న ఆలోచనకు పెట్టుబడిగా పెట్టారు. ఆ తర్వాత 'X.com' అనే ఆన్లైన్ ఆర్థిక సేవల సంస్థను ప్రారంభించారు. తరువాత అది 'కాన్ఫినిటీ' సంస్థతో విలీనం చెంది ప్రపంచ ప్రఖ్యాత 'పేపాల్'గా మారింది. పేపాల్ను ఈబే కొనుగోలు చేయడంతో మస్క్కు వందల మిలియన్ల డాలర్లు లభించాయి.సాంకేతిక రంగంలో విప్లవాత్మక ప్రయాణంపేపాల్ ద్వారా సంపాదించిన సంపదను మస్క్ కొత్త ఆవిష్కరణల కోసం వినియోగించారు. అంతరిక్ష ప్రయాణాన్ని చౌకగా మార్చాలనే లక్ష్యంతో స్పేస్ఎక్స్ను స్థాపించారు. అదే సమయంలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాను ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లారు. అనంతరం ట్విట్టర్ను కొనుగోలు చేసి దానికి 'X'గా పేరు మార్చారు. కృత్రిమ మేధ అభివృద్ధి కోసం xAI సంస్థను కూడా స్థాపించారు.రిస్క్ తీసుకునే ధైర్యమే విజయ రహస్యంఎలాన్ మస్క్ విజయానికి ప్రధాన కారణం కొత్త ఆలోచనలను అమలు చేయడంలో ఆయన చూపిన ధైర్యం. ఇతరులు వెనుకడుగు వేసే పరిస్థితుల్లో కూడా ఆయన భారీ పెట్టుబడులు పెట్టి కొత్త అవకాశాలను సృష్టించారు. అందుకే ఆయన వ్యాపార ప్రయాణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు ఆదర్శంగా తీసుకుంటున్నారు.ఎలాన్ మస్క్ ప్రయాణం విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. రాజకీయ వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు, వ్యాపార నిర్ణయాల కారణంగా పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొత్త సాంకేతిక ఆవిష్కరణలపై ఆయన దృష్టి మాత్రం మారలేదు. -
134 కోట్లకు టెలికం చందాదారులు
కొత్త టెలికం కస్టమర్లను ఆకర్షించడంలో ఎప్పటి మాదిరే ఎయిర్టెల్ ముందుంది. మే నెలలో 29.8 లక్షల మంది కొత్త సబ్స్క్రయిబర్లను (చందాదారులు/కస్టమర్లు) సొంతం చేసుకుంది.ఇందులో 29.26 లక్షల మంది మొబైల్ విభాగం నుంచి రాగా, 53,809 మంది కస్టమర్లు ఫిక్స్డ్లైన్ వినియోగదారులుగా ఉన్నారు. రిలయన్స్ జియో నెట్వర్క్ కిందకు 22.55 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందులో 21.54 లక్షల మంది మొబైల్ విభాగం నుంచి రాగా, మిగిలిన వారు ఫిక్స్డ్ లైన్ విభాగం నుంచి ఉన్నారు. -
E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!
ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు భారత్ మరో కీలకమైన అడుగు వేసింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ100 (E100) ఇంధనానికి సంబంధించిన నిబంధనలకు ఆమోదం తెలిపారు. దీంతో మన దేశంలో ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే మారుతి సుజుకి, టయోటా, ఎంజీ, హ్యుందాయ్ వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థలు E100 ఇంధనంతో నడిచే వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి.E100 ఇంధనంఈ100 అనేది దాదాపు 100 శాతం ఎథనాల్తో తయారైన ఇంధనం. ఇందులో సాధారణ పెట్రోల్ ఉండదు. ఇథనాల్ అనేది పునరుత్పాదక ఇంధనం. దీనిని చెరకు, మొక్కజొన్న, ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. ఈ ఇంధనంతో వాహనం పనిచేయాలంటే.. ప్రత్యేకంగా రూపొందించిన ఇంజిన్ ఉండాలి.ఈ100 ఇంధనం వల్ల లాభాలు➤విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.➤దేశంలోనే ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగం పెరుగుతుంది.➤రైతులకు చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.➤గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.➤దేశానికి ఇంధన భద్రత మెరుగుపడుతుంది.#WATCH | Nagpur, Maharashtra: Union Minister Nitin Gadkari says, “Last night at 8 PM, I signed the file, finalising the regulations to legally authorise the use of 100% ethanol. I am delighted to share that I, along with Hardeep Singh Puri, had the opportunity to launch the 100%… pic.twitter.com/BDIyTZGZF4— ANI (@ANI) June 13, 2026ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం వల్ల ఇప్పటికే రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ చమురు దిగుమతి వ్యయం ఆదా కాగా, రైతులకు సుమారు రూ.80 వేల కోట్ల ఆదాయం లభించింది.E100 ఇంధనం పెట్రోల్ను పూర్తిగా భర్తీ చేయగలదా?భవిష్యత్తులో E100 పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, అది వెంటనే సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కోట్లాది కార్లు, బైకులు, స్కూటర్లు ఈ100 ఇంధనాన్ని ఉపయోగించుకునే విధంగా తయారవ్వలేదు. కొన్ని ఈ20 ఇంధనం మాత్రమే ఉపయోగించుకోగలవు. కాబట్టి కొంతకాలం పాటు పెట్రోల్, E100 రెండూ కలిసి ఉపయోగంలో ఉంటాయి. భవిష్యత్తులో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ E100 వినియోగం కూడా పెరుగుతుంది.E100 ఇంధనాన్ని సాధారణ వాహనాల్లో ఉపయోగించలేము. ఎందుకంటే ఇథనాల్ రసాయనిక లక్షణాలు పెట్రోల్ కంటే భిన్నంగా ఉంటాయి. అందువల్ల వాహనాల్లో ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్ అవసరం. కొత్త ఇంజెక్టర్లు, బలమైన ఫ్యూయల్ పంపులు, ప్రత్యేక ఫ్యూయల్ పైపులు, ఇథనాల్ను తట్టుకునే భాగాలు అవసరం.ఇప్పటికే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ నమూనాను అభివృద్ధి చేసింది. అలాగే టయోటా, ఎంజీ, హ్యుందాయ్, సుజుకి సంస్థలు కూడా ఇలాంటి వాహనాలను తయారు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల్లో హీరో మోటోకార్ప్ స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.E100 ఇంధనం వల్ల వచ్చే సమస్యలు➤ఇథనాల్ శక్తి.. పెట్రోల్తో పోలిస్తే తక్కువ. కాబట్టి అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది.➤ప్రస్తుతం ఉన్న సాధారణ వాహనాల్లో ఈ100 ఉపయోగించలేము. ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలే అవసరం.➤దేశవ్యాప్తంగా ఈ100 అందించాలంటే పెట్రోల్ బంకుల్లో కొత్త నిల్వ ట్యాంకులు, పంపులు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు➤దేశమంతటా ఈ100 అందించే ఇంధన కేంద్రాలను ఏర్పాటు చేయాలి.➤ఎక్కువ సంఖ్యలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలి.➤ఇథనాల్ ఉత్పత్తిని స్థిరంగా పెంచుతూ వ్యవసాయ అవసరాలకు కూడా నష్టం కలగకుండా చూడాలి.➤ప్రజల్లో ఈ100 ఇంధనం గురించి అవగాహన పెంచాలి.భారతదేశం తన అవసరాలకు కావలసిన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇథనాల్ వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహిస్తోంది. -
ఆధార్, క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు
వచ్చే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆధార్ కార్డుదారులు, క్రెడిట్ కార్డు వినియోగదారులు, పాస్పోర్ట్ దరఖాస్తుదారులు, బ్యాంకు ఖాతాదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆధార్లో ఈమెయిల్ అప్డేట్కు ఉచిత అవకాశం, క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ నిబంధనల్లో మార్పులు, పాస్పోర్ట్ ఫీజుల పెంపు, బ్యాంకుల మిస్-సెల్లింగ్పై ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.ఐటీఆర్ దాఖలుకు జూలై 31 చివరి తేదీ2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2026-27) సంబంధించిన ఐటీఆర్-1, ఐటీఆర్-2 రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31, 2026 చివరి గడువు. గడువు దాటితే ఆలస్య రుసుములు, కొన్ని పన్ను విధానాలను ఎంచుకునే అవకాశాలపై పరిమితులు, అర్హత ఉన్న నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆధార్లో ఈమెయిల్ అప్డేట్యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆధార్ మొబైల్ యాప్ ద్వారా నమోదిత ఈమెయిల్ చిరునామాను అప్డేట్ చేసుకునే సేవను పూర్తిగా ఉచితంగా అందించనుంది. దీని కోసం ఇప్పటి వరకు రూ.75 రుసుము ఉండేది. అయితే ఈ రాయితీ కేవలం అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్డేట్లకే వర్తిస్తుంది.ఎస్బీఐ కార్డుల రివార్డ్ నిబంధనల్లో మార్పులుఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డు PURPLE, SELECT BLACK కార్డులకు సంబంధించిన రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. రివార్డ్ పాయింట్లు పొందే లావాదేవీలపై కొత్త పరిమితులు విధించడంతో పాటు, పాయింట్లు లభించని లావాదేవీల జాబితాను కూడా విస్తరించారు.హెచ్డీఎఫ్సీ లాంజ్ యాక్సెస్హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో మూడు ఉచిత దేశీయ విమానాశ్రయ లాంజ్ సందర్శనలను పొందాలంటే, అంతకుముందు త్రైమాసికంలో కనీసం రూ.60,000 ఖర్చు చేసి ఉండాలి. ఉదాహరణకు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి లాంజ్ సదుపాయం పొందాలంటే ఏప్రిల్-జూన్ మధ్య ఈ ఖర్చు పూర్తిచేయాల్సి ఉంటుంది.పాస్పోర్ట్ ఫీజుల పెంపుజూలై 1 నుంచి సాధారణ, తత్కాల్ పాస్పోర్ట్ల ఫీజులు పెరుగుతున్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 36 పేజీల సాధారణ పాస్పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు, తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది. ఇతర కేటగిరీల ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది.బ్యాంకుల మిస్-సెల్లింగ్పై ఆర్బీఐ కఠిన చర్యలుబ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టిస్తూ విక్రయించే ఘటనలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్త ఫ్రేమ్వర్క్ను అమల్లోకి తెస్తోంది. ఈ నిబంధనల ప్రకారం మిస్-సెల్లింగ్కు గురైన వినియోగదారులు పూర్తి రీఫండ్తో పాటు జరిగిన నష్టానికి తగిన పరిహారం పొందే హక్కు కలిగి ఉంటారు. బ్యాంకులు ఉత్పత్తుల విక్రయంలో మరింత పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయి. -
డెడ్లైన్ అలర్ట్: ఈ-కేవైసీ, ఐటీ రిటర్న్.. ఇంకా..
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. జూన్ 30 పలు కీలక విషయాలకు గడువు తేదీ. ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీ నుంచి ఆదాయపు పన్ను శాఖ పరిశీలన (స్క్రూటినీ) నోటీసుల వరకు, అలాగే త్రైమాసిక ముగింపు నేపథ్యంలో వ్యాపారాల జీఎస్టీ, టీడీఎస్ సంబంధిత సన్నాహాల వరకు పలు ముఖ్యమైన గడువులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక నష్టాలు లేదా పరిపాలనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఎల్పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశంప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ధ్రువీకరణ పూర్తి చేయని ఇతర ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులు కూడా జూన్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేనిపక్షంలో వారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమ కావడం తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్పై ఎలాంటి ప్రభావం ఉండదు. పూర్తి ధర చెల్లించి సిలిండర్ పొందవచ్చు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ-కేవైసీ పూర్తి చేసిన లేదా సబ్సిడీకి అర్హులు కాని వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు.ఐటీఆర్ స్క్రూటినీ నోటీసులకు కీలకం2025-26 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నులపై సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ నోటీసులు జారీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు జూన్ 30 చివరి గడువు. ఇది పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేయాల్సిన గడువు కాదు. కేవలం ఇప్పటికే దాఖలైన రిటర్నులను పరిశీలనకు ఎంపిక చేస్తే నోటీసులు పంపేందుకు శాఖకు ఉన్న చట్టబద్ధమైన చివరి తేదీ మాత్రమే. రిటర్నులో చూపిన వివరాలు, ఫారం 26AS, AIS, TIS, బ్యాంకు లావాదేవీలు లేదా అధిక విలువ గల ఆర్థిక లావాదేవీల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తే స్క్రూటినీకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) కూడా జూన్ 30నే ఈ గడువుగా స్పష్టం చేసింది.వ్యాపారాలకు త్రైమాసిక ముగింపుజూన్ 30తో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ముగియనుంది. దీంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఖాతాల పుస్తకాలు, టీడీఎస్, టీసీఎస్ నమోదులు, జీఎస్టీ రికార్డులు, ఇతర చట్టబద్ధమైన లెక్కలను నవీకరించుకోవాల్సి ఉంటుంది. తద్వారా జూలైలో దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్నులు, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్లను సకాలంలో సమర్పించేందుకు వీలు కలుగుతుంది.ఈ గడువులను చివరి నిమిషానికి వాయిదా వేయకుండా ముందుగానే పూర్తి చేస్తే అనవసరమైన జరిమానాలు, సబ్సిడీ జాప్యాలు, పన్ను సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
బంగారం, వెండి ధరలు ఇప్పుడిలా..
దేశంలో రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు షాక్.. అందరూ లేఆఫ్
అమెరికాకు చెందిన రిటైల్ టెక్నాలజీ సంస్థ హై-వీ (Hy-Vee) భారత్లోని తన ఇంజినీరింగ్ సెంటర్ను ఆకస్మికంగా మూసివేయడంతో సుమారు 150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒక్కరాత్రిలోనే ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగులను రాత్రి 9 గంటలకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వీడియో కాల్కు ఆహ్వానించిన సంస్థ, రీస్ట్రక్చరింగ్లో భాగంగా భారత ఇంజినీరింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే వారి కార్పొరేట్ యాక్సెస్ కూడా నిలిపివేయబడింది.ఈ ఘటనపై మాజీ ఉద్యోగి ఒకరు రెడ్డిట్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఇంటర్న్గా చేరి దాదాపు రెండేళ్లలో పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఎదిగిన తాను, "ఒక్క సమావేశంతో అంతా ముగిసిపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సంస్థ నుంచి సెవరెన్స్ ప్యాకేజీ లేదా ఎటువంటి ఆర్థిక పరిహారం కూడా అందలేదని పేర్కొన్నాడు. రియాక్ట్, నోడ్ జేఎస్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ వంటి టెక్నాలజీల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోవడం తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని తెలిపాడు.ఈ అకస్మాత్తు తొలగింపులపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఉద్యోగులకు కనీస నోటీసు లేకుండా మొత్తం టీమ్ను తొలగించడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. కొందరు ఉద్యోగుల ఆరోపణల ప్రకారం, తొలగింపుల అనంతరం సంస్థ భారత విభాగానికి సంబంధించిన లింక్డ్ఇన్ పేజీతో పాటు పలు పోస్టులను కూడా తొలగించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై సంస్థ అధికారికంగా స్పందించలేదు.ఇదిలా ఉండగా, హై-వీ ఇండియా ఇంజినీరింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ లింక్డ్ఇన్లో స్పందిస్తూ, భారత ఇంజినీరింగ్ కేంద్రాన్ని మూసేసినట్లు ధ్రువీకరించారు. ప్రభావితమైన ఇంజినీర్లు అత్యుత్తమ ప్రతిభ కలిగినవారని, వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరించాలని తన పరిచయ వర్గాలను కోరారు. అయితే ఉద్యోగుల ఆరోపణల్లో పేర్కొన్న సెవరెన్స్ ప్యాకేజీ, నోటీసు వంటి అంశాలపై సంస్థ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదివారా? ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా? -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ దుర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.అనంత్ అంబానీ అంతకుముందు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు వెల్లడించారు. ఆ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు కూడా తామే భరిస్తామన్నారు.ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులను నడిపే 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు చెల్లించడంతో పాటు, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్లోని వంతారా తహరాలో టీటీడీ గోశాలను ఆధునికీకరించేందుకు అంగీకారం తెలినట్లుగా తెలుస్తోంది. -
కొత్త కారు: సిట్రోయెన్ నుంచి ‘ఎయిర్క్రాస్ కంఫర్ట్’ ఎడిషన్
హైదరాబాద్: ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ ఇండియా, బ్రాండ్ యొక్క 108వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా తన ఎస్యూవీ ‘ఎయిర్క్రాస్ కంఫర్ట్ ఎడిషన్’ను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ. 9.09 లక్షలుగా ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లోని అన్ని వేరియంట్లలో ప్రీమియం ‘మెట్రోపాలిటాన్ బీజ్ లెదరేట్ ఇంటీరియర్లను’ ప్రామాణికంగా చేర్చి కేబిన్ కంఫర్ట్ను మరింత పెంచారు.వినియోగదారుల బడ్జెట్కు తగినట్లుగా ఇందులో యూ, ప్లస్, మ్యాక్స్ పేర్లతో మూడు ప్రత్యేక యాక్ససరీ ప్యాక్లను పరిచయం చేశారు. వీటి ద్వారా 10 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, ప్రీమియం జేబీఎల్ స్పీకర్లు జోడించారు. భద్రత కోసం ఫ్రంట్ కొలిషన్ హెచ్చరికలు చేసే అడ్వాన్స్డ్ డాష్ క్యా మ్ను అదనంగా పొందవచ్చు. ఈ ఆకర్షణీయమైన మోడల్ బు కింగ్లు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్షిప్లలో, అధికారిక డిజిటల్ వేదికలలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. -
ఏఐ.. రూ.450 లక్షల కోట్లు
ఏఐ. ఓ అనూహ్యమైన ఎకానమీని సృష్టిస్తోంది. ఈ రెండక్షరాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ... వచ్చే పదేళ్లలో ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.450 లక్షల కోట్లు) వ్యాపార అవకాశాల్ని అందించబోతోంది. ఇక ఈ ఎకోసిస్టమ్లో ఎదిగే కంపెనీల విలువైతే దీనికి వందరెట్ల పైనే ఉంటుందన్నది ఇన్వెస్ట్మెంట్ నిపుణుల అంచనా. బహుశా! పారిశ్రామిక విప్లవం తరవాత ప్రపంచం చవిచూస్తున్న అతిపెద్ద మార్పు ఇదే కావచ్చు. ఏఐ ఎంతవేగంగా మారుతోందంటే... ఇపుడిది చాట్బోట్లకో, సాఫ్ట్వేర్ ఆటోమేషన్కో పరిమితం కాదు. తయారీ, విద్య, వైద్యం, ఫైనాన్స్, వ్యవసాయం, లాజిస్టిక్స్, డిఫెన్స్, శాస్త్రీయ పరిశోధన.. ఇలా అన్నిటికీ వెన్నెముకే. ఇపుడు పోటీ మెరుగైన ఏఐ మోడల్ను సృష్టించడానికి కాదు. మొత్తం ఏఐ వ్యవస్థను చేతుల్లో ఉంచుకోవటానికి. సెమీ కండక్టర్ల నుంచి డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా, డిజిటల్ ట్విన్స్, అటానమస్ సిస్టమ్స్, పారిశ్రామిక ఏఐ, రోబోటిక్స్... ప్లస్ నైపుణ్యం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటాయన్నదే నియంత్రణాధికారానికి నిదర్శనం. ఈ అధికారం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్పొరేట్లు బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుత పరిశ్రమల్ని మార్చటంతో పాటు కొత్త పరిశ్రమల్ని సృష్టించే ఏఐ వల్ల 2030 నాటికి ప్రపంచ జీడీపీ 15 ట్రిలియన్ డాలర్లు జతపడుతుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ఎన్ని రకాలు? వీటి అవసరాలేంటి? ఆ అవసరాలను అల్లుకుని ఎదుగుతున్న కంపెనీలేంటి? వాటి వ్యాపారమెంత? విలువెంత? అంతర్జాతీయ దిగ్గజాలెవరు? లాభపడే కంపెనీలేంటి?ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపంచిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్వర్కింగ్ సిలికాన్)ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు) క్లౌడ్ అండ్ ప్లాట్ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్, హోస్టింగ్ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటంఏఐ అప్లికేషన్లు (ఎంటర్ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)సాక్షి, బిజినెస్ -
వైదొలగనున్న కోటక్ బ్యాంక్ సీఈవో వాస్వానీ
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవో అశోక్ వాస్వానీ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుత మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరే యోచన లేదని ఆయన బోర్డుకు తెలియజేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. 2024 జనవరి 1న కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవోగా బాధ్యత లు చేపట్టిన వాస్వానీ పదవీకాలం ఈ ఏడాది (2026) డిసెంబర్ 31తో ముగియనుంది. వాస్వానీ గతంలో బార్క్లేస్, సిటీ గ్రూప్ తదితర అంతర్జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అటు తర్వాత అప్పటి కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో దీపక్ గుప్తా స్థానంలో చేరారు. రేసులో కాశ్యప్, అనూప్ సాహా: అశోక్ వాస్వానీ వారసుణ్ని ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. వాస్వానీ స్థానంలో బాధ్యతలు తీసుకునేందుకు కీలకమైన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. కోటక్ బ్యాంక్లో చిరకాలంగా వివిధ హోదాల్లో పని చేసిన పరితోష్ కాశ్యప్ గతేడాదే హోల్ టైమ్ డైరెక్టరుగా నియమితులయ్యారు. ఆయన హోల్సేల్ బ్యాంకింగ్ బిజినెస్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పోలిస్తే బ్యాంకులో అనూప్ సాహా కొంత కొత్త వారు. గతంలో బజాజ్ ఫైనాన్స్ సీఈవోగా పని చేశారు. ప్రస్తుతం హోల్ టైమ్ డైరెక్టరుగా కన్జూమర్ బ్యాంకింగ్, మార్కెటింగ్ తదితర విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. -
ఐటీ ఆదాయాలకు ఏఐ బూస్ట్
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల రంగంలో దాదాపు పావు శాతం పైగా కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ)పై ప్రయోగాలు చేసే దశ నుంచి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వైపు మళ్లాయి. తద్వారా ఆ సంస్థలు ఇప్పటికే ఏఐ సర్వీసుల ద్వారా 10–12 బిలియన్ డాలర్ల ఆదాయాలను ఆర్జిస్తున్నాయి. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ న్యూయార్క్ సిటీలో నిర్వహించిన సీఈవోల సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏఐ వినియోగం పెరగడం వల్ల సంప్రదాయ ఐటీ సేవలకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఆందోళనలను వారు తోసిపుచ్చారు. ఐటీ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, పదే పదే పునరావృతమయ్యే పనులను చేయడం తగ్గుతుందని వివరించారు.. ఏఐ గవర్నెన్స్, అప్లికేషన్ల ఆధునీరణ, సైబర్సెక్యూరిటీ మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతుందని నాస్కామ్ తెలిపింది. ఏఐలో శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్ 20 లక్షల మంది పైగా ఉండగా, అధునాతన ఏఐలో ట్రైనింగ్ తీసుకున్న వారు లక్ష నుంచి రెండు లక్షల మంది ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం 85 శాతం టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్స్ వద్ద ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫాంలు ఉన్నట్లు వివరించింది. ఏజెంటిక్ ఏఐతో టెక్ సేవలకు డిమాండ్ ఏజెంటిక్ ఏఐతో సైబర్సెక్యూరిటీ, గవర్నెన్స్, కార్యకలాపాల ఆధునీకరణ తదితర విభాగాల్లో డిమాండ్ నెలకొంటుందని నాస్కామ్ తెలిపింది. దీనితో 2030 నాటికి టెక్నాలజీ సర్వీసులపై 300 – 400 బిలియన్ డాలర్ల మేర అదనంగా వెచ్చించే అవకాశం ఉందని వివరించింది. ఏఐని వినియోగంలోకి తెచ్చే క్రమంలో టెక్నాలజీని బాధ్యతాయుతంగా విస్తరించేందుకు కంపెనీలకు స్పెషలిస్ట్ పార్ట్నర్లు అవసరమవుతారని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. మోడల్స్, అప్లికేషన్స్, డేటా ప్లాట్ఫామ్లు, సైబర్సెక్యూరిటీ నియంత్రణలు, పరిశ్రమ వ్యవస్థలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానించే విశ్వసనీయమైన మోడల్ని రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదంతా కూడా సురక్షితంగా, సమర్ధవంతంగా జరిగేలా చూడటంలోనే ఐటీ సర్వీసుల అసలు సామర్థ్యాలు బైటపడతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సిబ్బంది సంఖ్యను పెంచుకోవడం కాకుండా డొమైన్ సంబంధ సొల్యూషన్స్ కనుగొనడం, ఫలితాలను కచ్చితంగా డెలివర్ చేయడంపైనే ఐటీ పరిశ్రమ వృద్ధి ఆధారపడి ఉంటుందని నంబియార్ తెలిపారు. బిజినెస్ ప్రాసెస్ సర్వీసులనేవి పనులను రొటీన్గా చేయడం కాకుండా తెలివిగా పూర్తి చేసే విధానాలకు మళ్లుతాయని కాగి్నజెంట్ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. -
భారత కంపెనీలకు ఉపశమనం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఘర్షణల కారణంగా భారత కంపెనీల లాభాదాయకత ముందు అంచనా వేసిన స్థాయిలో ప్రభావితం కాకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. యూఎస్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడంతోపాటు, ఇంధన సరఫరాలు సాధారణ స్థితికి రావడంపైనే ఈ ప్రభావం ఆధారపడి ఉంటుందని తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభంతో 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు 100 బేసిస్ పాయింట్లు (ఒక శాతం) తగ్గిపోవచ్చని తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఘర్షణలు ఎక్కువ కాలం పాటు కొనసాగొచ్చని, హర్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకోకపోవచ్చన్న అంచనా ఆధారంగా.. కంపెనీల లాభదాయకత 200 బేసిస్ పాయింట్లు తగ్గిపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ లోగడ పేర్కొనడం గమనార్హం. అమెరికా–ఇరాన్ మధ్య ఈ నెలలో కుదిరిన అవగాహన ఒప్పందంతో హర్మూజ్ జలసంధి తెరుచుకోవడం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా దిగొచ్చాయి. బ్రెంట్ బ్యారెల్ 73 డాలర్ల స్థాయికి పడిపోయింది. యుద్ధ సమయంలో ఒక దశలో 121 డాలర్ల వరకు వెళ్లడం చూశాం. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటూ, గ్యాస్ సరఫరా సాధారణ స్థాయికి చేరుకునేందుకు చాలా కాలమే పట్టొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా సరఫరా వైవిధ్యంపై దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు సగటున 80–85 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. కొన్ని రంగాలపై ఎక్కువ ప్రభావం.. పశ్చిమాసియా ఘర్షణలతో 22 రంగాల కంపెనీల లాభదాయకతపై ఎక్కువ ఒత్తిడి పడొచ్చని క్రిసిల్ లోగడ అంచనా వేయగా.. ఇప్పుడు పది రంగాలపైనే ఈ ప్రభావం చెప్పకోతగ్గ స్థాయిలో ఉంటుందని తెలిపింది. అంతేకానీ, భారీగా ఆదాయం, లాభాలు తగ్గడం ఉండదని స్పష్టం చేసింది. ఎయిర్లైన్స్ (విమానయాన సంస్థలు), సిరామిక్స్, పాలిస్టర్ టెక్స్టైల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్యాకేజింగ్, వజ్రాల పాలిíÙంగ్ కంపెనీలపై ఎక్కువగా ఒత్తిళ్లు ఉండొచ్చంటూ.. వీటికి ధరల నిర్ణయంలో వెసులుబాటు లేకపోవడం, సరఫరా సమస్యలు, అధిక ముడి సరకుల వ్యయాలు, బలహీన లాభదాయకత, అధిక మూలధన అసవసరాలు, బలహీన బ్యాలన్స్ షీట్లను కారణాలుగా పేర్కొంది. దీంతో ఈ కంపెనీల క్రెడిట్ రేటింగ్ ప్రతికూలంగా మారే రిస్క్ లేకపోలేదని తెలిపింది. ముడి చమురు ధరలు దిగిరావడం, గ్యాస్ సరఫరాలు మెరుగుపడడం చాలా రంగాలకు ఉపశమనాన్నిస్తుందని అంచనా వేసింది. దీనికితోడు ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై నిధులు ఖర్చు చేస్తుండడం, దేశీ వినియోగ డిమాండ్ ఆదాయ వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) 5.0 కింద రూ.2.55 లక్షల కోట్ల అదనపు రుణ సాయం, ఎయిర్లైన్స్కు ప్రత్యేకంగా రూ.5,000 కోట్లు అన్నవి నిధుల అవసరాలను తీరుస్తాయని అభిప్రాయపడింది. లాభాల్లోకి చమురు కంపెనీలు ఇంధన ధరలు తగ్గడంతో ఆయిల్ మార్కెటింగ్, ఎరువుల కంపెనీలు ఎక్కువగా ప్రయోజనం పొందుతాయని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు మార్చి నుంచి మే మధ్య రూ.40,000–45,000 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయని, ధరలు దిగిరావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవి నిర్వహణ లాభంలోకి తిరిగి అడుగు పెడతాయని తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా రెండు రిస్్కలు పొంచి ఉన్నట్టు తెలిపింది. యూఎస్–ఇరాన్ ఒప్పందం ముందుకు వెళ్లకుండా, ఘర్షణలు తిరిగి మొదలు కావడం ఒకటి కాగా.. ఎల్నినో కారణంగా వర్షాలు బలహీనపడితే గ్రామీణ వినియోగం సన్నగిల్లుతుందని అంచనా వేసింది. -
పర్సిస్టెంట్ సిస్టమ్స్ చేతికి నగారో
న్యూఢిల్లీ: భారత ఐటీ దిగ్గజం పర్సిస్టెంట్ సిస్టమ్స్ అంతర్జాతీయంగా భారీ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జర్మనీకి చెందిన ప్రముఖ డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ నగారో ఎస్ఈను పూర్తిగా స్వా«దీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ గెలాక్సీ జర్మనీ హోల్డింగ్ ఎస్ఈ .. నగారో షేర్ల పూర్తిగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఒక్కో షేరుకు 81 యూరోల చొప్పున నగదు రూపంలో ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు 1.3 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, 2027 మార్చి ఆఖరు నాటికి పూర్తి కావొచ్చని అంచనా. ఈ వ్యూహాత్మక విలీనంతో సుమారు 2.9 బిలియన్ డాలర్ల (రూ.24 వేల కోట్లకు పైగా) వార్షిక ఆదాయ సామర్థ్యంతో ప్రపంచ ఏఐ ఆధారిత డిజిటల్ ఇంజినీరింగ్ రంగంలో అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా పర్సిస్టెంట్ అవతరించనుంది. పర్సిస్టెంట్–నగారోకి ఉమ్మడిగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 46 వేల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉంటారు. వీరిలో అత్యధికంగా 37 వేల మంది భారత్లో, ఉత్తర అమెరికాలో 3,500 మంది, యూరప్లో సుమారు 3,000 మంది ఉంటారని సంస్థ తెలిపింది. ఈ లావాదేవీకి సంబంధించి ఇరు సంస్థలు ఇప్పటికే బిజినెస్ కాంబినేషన్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి. -
ఐటీసీ వార్షిక వినియోగదారుల వ్యయం రూ.37,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ సంస్థ ఐటీసీ ఎఫ్ఎమ్సీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) విభాగంలో తన తన దూకుడును కొనసాగిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఐటీసీకి చెందిన ఎఫ్ఎమ్సీజీ ఉత్పత్తులపై వినియోగదారులు చేసిన మొత్తం వార్షిక వ్యయం 8.8 శాతం పెరిగి రూ.37,000 కోట్లకు చేరిందని కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత్లోనే నెంబర్వన్ ఎఫ్ఎమ్సీజీ కంపెనీగా అవతరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ఐటీసీ ఉత్పత్తులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల కుటుంబాలకు చేరుతున్నాయని తెలిపింది. మూడేళ్లుగా తిరుగులేని వృద్ధి గడిచిన మూడేళ్లుగా ఐటీసీ ఎఫ్ఎమ్సీజీ ఉత్పత్తులపై వినియోగదారుల వ్యయం స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.29,000 కోట్లుగా ఉండగా, 2023–24లో 12% వృద్ధితో రూ.32,500 కోట్లకు చేరింది. 2024–25లో మరో 4.6 % పెరిగి రూ.34,000 కోట్లకు చేరగా, 2025–26లో రూ.37,000 కోట్ల మార్కును దాటింది. 2022–23 నుంచి 2024–25 మధ్య రెండేళ్లలోనే వినియోగదారుల వ్యయం సుమారు రూ.5,000 కోట్ల మేర పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ∙2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎమ్సీజీ వ్యాపారం ద్వారా ఐటీసీ రూ.24,209.75 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 10.1 శాతం అధికం. కంపెనీ లెక్కల ప్రకారం, వార్షిక వినియోగదారుల వ్యయంలో బ్రాండ్ల నికర అమ్మకాలు, పంపిణీ మార్జిన్లు, పన్నులు కూడా భాగంగా పరిగణిస్తారు. మార్కెట్లో 30కి పైగా ప్రసిద్ధ బ్రాండ్లు ప్రస్తుతం ఐటీసీ ఎఫ్ఎమ్సీజీ పోర్ట్ఫోలియోలో ఆశీర్వాద్, బింగో, సన్ఫీస్ట్, క్లాస్మేట్, యిప్పీ, మంగళ్దీప్ వంటి దాదాపు 30కి పైగా ప్రసిద్ధ బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో ఆశీర్వాద్ (గోధుమ పిండి), బింగో (స్నాక్స్), సన్ఫీస్ట్ (క్రీమ్ బిస్కెట్లు), క్లాస్మేట్ (నోట్బుక్స్) తమ తమ విభాగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయి. వినియోగదారుల మారుతున్న అలవాట్లకు అనుగుణంగా ఐటీసీ గడిచిన ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్లోకి దాదాపు 100 కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడం విశేషం. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ముడిసరుకులు, ఇంధన ధరలు భారీగా పెరిగాయని, దీనివల్ల స్వల్పకాలికంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తలెత్తాయని ఐటీసీ పేర్కొంది. అయితే, ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, మార్కెట్లో తమ పోటీతత్వాన్ని, వృద్ధి వేగాన్ని కాపాడుకోవడానికి అన్ని విభాగాలలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. భవిష్యత్ వృద్ధికి ప్రత్యేక వ్యూహం ఎఫ్ఎమ్సీజీ వ్యాపారంలో తదుపరి వృద్ధి దశపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలో కుటుంబాల వినియోగం తక్కువగా ఉన్న, తలసరి వినియోగం పరిమితంగా ఉన్న విభాగాల్లో విస్తరణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐటీసీ భావిస్తోంది. ఇప్పటికే ఉన్న 30కు పైగా ప్రధాన బ్రాండ్ల బలాన్ని ఉపయోగించుకుని విలువ ఆధారిత (వాల్యూ యాడెడ్) కొత్త ఉత్పత్తులు, అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ప్రవేశించడం కంపెనీ వ్యూహంలో కీలక భాగమని తెలిపింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను రూపొందించడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ విస్తరణ భారత మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఐటీసీ తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఎఫ్ఎమ్సీజీ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో భారత్కు సమీపంలోని వ్యూహాత్మక మార్కెట్లలో మరింత విస్తరించడం ద్వారా తదుపరి వృద్ధిని సాధించాలని ఐటీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సంజీవ్ పురి వేతనం 7 శాతం డౌన్ గత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి మొత్తం వేతనం రూ. 23.91 కోట్లకు పరిమితమైంది. పర్ఫార్మెన్స్ బోనస్, దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు / కమీషన్లు తగ్గడంతో అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.8 శాతం క్షీణించింది. తాజాగా కన్సాలిడేటెడ్ శాలరీ రూ. 3.85 కోట్లతో పాటు పనితీరు ఆధారిత బోనస్, కమీషన్లు మొదలైన వాటి రూపంలో రూ. 19.17 కోట్లు లభించాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెమ్యూనరేషన్ రూ. 25.66 కోట్లు.ఆదాయంలో సిగరెట్లదే సింహభాగం ఐటీసీ మొత్తం స్థూల ఆదాయంలో సిగరెట్ల విభాగమే ఇప్పటికీ అతిపెద్ద వాటాగా కొనసాగుతోంది. కంపెనీ ప్రొడెక్ట్స్, సర్వీసుల అమ్మకాల ద్వారా సాధించిన మొత్తం స్థూల ఆదాయం రూ.80,867.49 కోట్లు కాగా.. అందులో కేవలం సిగరెట్ల అమ్మకాల ద్వారానే రూ.37,099.65 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే కంపెనీ మొత్తం ఆదాయంలో దీని వాటా దాదాపు 45.9 శాతంగా ఉంది. -
ఏఐలోకి ‘మెగా’ఎంట్రీ!
సాక్షి, బిజినెస్: మూడు దశాబ్దాలకుపైగా ఇన్ఫ్రా రంగంలో ఉంటూ వివిధ రంగాల్లోకి విస్తరిస్తున్న స్థానిక సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) కూడా ఏఐ రంగంలోకి అడుగుపెట్టనుంది. మైక్రోసాఫ్ట్లో రెండు దశాబ్దాలు పనిచేసిన అలెక్స్ కిప్మాన్ సంస్థ అనలాగ్ ఏఐతో చేతులు కలపబోతోంది. ఈ భాగస్వామ్యం ఏ రూపంలో ఉంటుంది? ఎంత పెట్టుబడి పెడతారు? అనే వివరాలు బహుశా జూలై ఒకటిన వెల్లడి కావచ్చు. ఆ రోజున కిప్మాన్తో కలిసి నిర్వహించే సమావేశంలో ఎంఈఐఎల్ దీనిపై ప్రకటన చేసే అవకాశముంది. ఫౌండేషన్ ఏఐ కాదిది.. పారిశ్రామిక ఏఐ! చాట్ జీపీటీ, క్లాడ్, పెర్ప్లెక్సిటీ మాదిరి అనలాగ్ ఏఐ సంస్థ ఫౌండేషనల్ ఏఐ లేదా జనరేటివ్ ఏఐ కాదు... ఇది పారిశ్రామిక ఏఐ. భౌతికంగా ఇంటెలిజెన్స్ను తయారు చేస్తుంది. అంటే సెన్సర్లు, రోబోలు, న్యూరల్ నెట్వర్క్లను కలుపుతూ భౌతిక యంత్రాలకు డిజిటల్ నకళ్లను తయారు చేస్తుంది. వాహనాలు, యంత్రాలు, పరిశ్రమలు... ఇలా పనిచేసే వేటికైనా డిజిటల్ ట్విన్స్ను తయారు చేయడం ద్వారా వాటిని రిమోట్గా వేరే చోటు నుంచి మానిటర్ చేయొచ్చు. ఈ డిజిటల్ నకళ్లు నిరంతరం అప్డేట్ అవుతూ వాటి ట్విన్స్ను ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఇలా ట్రాక్ చేయడం ద్వారా నిర్వహణను ముందే ఊహించొచ్చు. సమస్యలు రాకుండా నివారించే అవకాశమూ ఉంటుంది. సీమెన్స్, స్నీడర్, జీఈ వెర్నోవా, రాక్వెల్ వంటి దిగ్గజాలున్న ఈ రంగంలోకి పూర్తి ఏఐ కంపెనీగా అడుగుపెట్టింది అనలాగ్ ఏఐ. అబుదాబికి చెందిన టెక్నాలజీ దిగ్గజం జీ24... ఈ సంస్థకు అవసరమైన పూర్తి ఫండింగ్ను ఎప్పటికప్పుడు అందిస్తోంది. అందుకే దీని విలువను ఇప్పటిదాకా ఎక్కడా వెల్లడించలేదు. వచ్చే పదేళ్లలో భారత్ సహా అన్నిచోట్లా 80 శాతానికిపైగా భారీ పరిశ్రమలు తమ కీలక ఆపరేషన్లలో డిజిటల్ ట్విన్స్ను ఉపయోగిస్తాయన్నది నిపుణుల అంచనా. తయారీ రంగంతోపాటు విద్యుత్, చమురు, గ్యాస్, రైల్వే, మెట్రో వ్యవస్థ, పోర్టులు–షిప్పింగ్, నిర్మాణ రంగం, మైనింగ్... ఇలా అన్ని రంగాలూ పారిశ్రామిక ఏఐ, డిజిటల్ ట్విన్స్ వల్ల లబ్ధి పొందుతాయనేది వారి మాట. -
భారత్లో ఓపెన్ఏఐకి కొత్త బాస్.. ఎవరీ ప్రభ్జీత్ సింగ్?
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఓపెన్ఏఐ.. భారత్లో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా 'ప్రభ్జీత్ సింగ్'ను నియమించింది.ప్రభ్జీత్ సింగ్ ఈ ఏడాది సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్లో AI వినియోగాన్ని మరింత విస్తరించడంతో పాటు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధస్సు ప్రయోజనాలను పొందేలా భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంపై ఆయన దృష్టి సారించనున్నారు.ప్రభ్జీత్ సింగ్కు టెక్నాలజీ రంగంలో విశేష అనుభవం ఉంది. గత 11 సంవత్సరాలుగా ఉబెర్లో పనిచేసిన ఆయన, చివరి ఆరేళ్లు ఆ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్కు భారతదేశం - దక్షిణాసియా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రైడ్-హెయిలింగ్ మార్కెట్లలో ఒకటైన భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కంపెనీ మొబిలిటీ వ్యాపారానికి ఆయన నాయకత్వం వహించి, దాని విస్తరణకు మార్గనిర్దేశం చేశారు.ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన సింగ్, మెకిన్సీ & కంపెనీలో అసోసియేట్ పార్టనర్గా పనిచేసి, అంతకుముందు ఉబర్లో చేరారు. కార్పొరేట్ నాయకత్వానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను, 2022లో ఐఐఎం అహ్మదాబాద్ వారి యంగ్ అలూమ్ని అచీవర్స్ అవార్డుతో ఆయనను సత్కరించారు. -
భారత్ ట్యాక్సీ.. అమిత్ షా కీలక ప్రకటన!
కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో భారత్ ట్యాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ట్యాక్సీని అడ్డుకునేందుకు కొన్ని ప్రైవేట్ క్యాబ్ సేవల సంస్థలు పోటీకి దిగుతున్నాయని ఆరోపించారు.భారత్ ట్యాక్సీ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవేనని అమిత్ షా స్పష్టం చేశారు. తమ లక్ష్యం ఇతర కంపెనీలకు నష్టం కలిగించడం కాదని.. డ్రైవర్లు, ప్రయాణికులకు న్యాయమైన సేవలు అందించడమేనని చెప్పారు. భారత్ ట్యాక్సీ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకే కొన్ని సంస్థలు తాత్కాలికంగా తక్కువ ఛార్జీలు, డ్రైవర్లకు అధిక కమిషన్లు ఇస్తున్నాయని ఆరోపించారు.కొన్ని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు మొదట నష్టాలను భరిస్తూ మార్కెట్లో పోటీదారులను తొలగించి, ఆ తర్వాత తమ ఇష్టానుసారం ఛార్జీలు నిర్ణయించే విధానాన్ని అనుసరిస్తున్నాయని అమిత్ షా అన్నారు. అయితే భారత్లో సహకార భావన ఎంతో బలంగా ఉందని, ఇలాంటి వ్యూహాలు ఎక్కువ కాలం పనిచేయవని ఆయన అన్నారు.భారత్ ట్యాక్సీ సేవలను ప్రస్తుతం గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్, ద్వారక, సోమనాథ్ మొదలైన మొత్తం 14 ప్రధాన నగరాల్లో ప్రారంభించారు. ఈ సేవలు టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీల్ ట్యాక్సీలు అనే మూడు విభాగాల్లో అందుబాటులో ఉంటాయి.భారత్ ట్యాక్సీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది దేశంలోనే తొలి సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే, డ్రైవర్ల యాజమాన్యంలోని రైడ్-హైలింగ్ ప్లాట్ఫామ్. ఇందులో డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. ప్రయాణికుడు చెల్లించిన మొత్తం ఛార్జీ నేరుగా డ్రైవర్కే అందుతుంది. దీంతో డ్రైవర్ల ఆదాయం పెరగడంతో పాటు, వారికి ఆర్థిక భద్రత కూడా లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.భారత్ ట్యాక్సీ విస్తరణపై కూడా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూలై 31లోపు నాగ్పూర్, పుణే, ముంబై, లక్నో, చండీగఢ్, జైపూర్, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభిస్తామని, అలాగే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాలు, పట్టణాలకు భారత్ ట్యాక్సీ సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.అంతే కాకుండా.. 'సహకార్ సే సమృద్ధి' అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదాన్ని రవాణా రంగంలో కూడా విజయవంతం చేయాలన్నదే తమ లక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇదే సహకార నమూనాను మరిన్ని రంగాల్లో కూడా విస్తరిస్తామని వెల్లడించారు. -
TG REAT సభ్యులుగా వేముల శ్రీకర్
తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (TG-REAT) సాంకేతిక, పరిపాలనా సభ్యుడిగా IRS మాజీ అధికారి వేముల శ్రీకర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం-2016 నిబంధనల మేరకు చేపట్టిన ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శనివారం జారీ చేసింది.1995 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన శ్రీకర్ సుమారు 26 ఏళ్లపాటు ఆదాయపు పన్ను శాఖలో వివిధ కీలక హోదాల్లో సేవలందించారు. ఇంజినీరింగ్ డిగ్రీ తర్వాత ఎంబీఏ, ఎంఏతో పాటు న్యాయశాస్త్రంలో (ఎల్ఎల్బీ) ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. ట్రిబ్యునల్ కార్యకలాపాల్లో చట్టపరమైన అంశాలకు అధిక ప్రాధాన్యం ఉండటంతో ఆయన న్యాయ విద్య, అప్పిలేట్ వ్యవహారాల్లోని అనుభవం ఉపయోగపడనుంది.పన్ను ఎగవేత కేసుల దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన శ్రీకర్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆదాయ సమీకరణ, దర్యాప్తు రంగాల్లో విశిష్ట సేవలకు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నుంచి రెండు ప్రత్యేక పురస్కారాలు అందుకున్నారు. ఆయన పర్యవేక్షించిన కీలక దర్యాప్తు కేసులు ఆదాయపు పన్ను శాఖ ప్రచురించిన ‘లెట్ అస్ షేర్’ ఉత్తమ విధానాల సంకలనంలో చోటు దక్కించుకున్నాయి.హైదరాబాద్లోని ఇన్కమ్ట్యాక్స్ టవర్స్ నిర్మాణం, బంజారాహిల్స్లో ఆదాయపు పన్ను శాఖ నివాస సముదాయాల అభివృద్ధి, తిరుపతిలో అతిథి గృహం ఏర్పాటు, నాగ్పూర్లో సిబ్బంది నివాస గృహాల నిర్మాణం వంటి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. శాఖ ఆధునీకరణ, డిజిటల్ వ్యవస్థల అమలు, కంప్యూటరీకరణ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.ముంబయిలో ఆదాయపు పన్ను కమిషనర్గా పనిచేసిన ఆయన 2021లో పదవీ విరమణ పొందారు. అనంతరం సామాజిక సేవ, సాహిత్య రంగాల్లో చురుగ్గా కొనసాగుతున్నారు. తెలంగాణ భాష, సంస్కృతి పరిరక్షణకు దశాబ్దాలుగా కృషి చేసిన ప్రముఖ సాహితీవేత్త వేముల పెరుమాళ్ల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆయన రచించిన ప్రసిద్ధ గ్రంథం ‘తెలంగాణ జాతీయాలు’ ప్రచురణలో శ్రీకర్ విశేష సహకారం అందించారు. -
పాత కార్లకు E20 పెట్రోల్ ప్రమాదమేనా?
ప్రభుత్వం ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్+ 80 శాతం పెట్రోల్) వినియోగాన్ని వేగంగా పెంచుతోంది. దేశం తన ఈ20 లక్ష్యాన్ని ముందుగానే చేరుకోవడంతో, ఈ ఇంధనం ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. అయితే వాహన యజమానుల్లో 'E20 పెట్రోల్ వాడితే ఇంజిన్కు నష్టం జరుగుతుందా?' అనే అనుమానం మాత్రం అలాగే ఉంది.నిపుణుల ప్రకారం.. అన్ని వాహనాలకు ఈ20 పెట్రోల్ హానికరం కాదు. ముఖ్యంగా ఏప్రిల్ 2023 తర్వాత తయారైన వాహనాలు ఇప్పటికే ఈ20 ఇంధనానికి అనుగుణంగా తయారయ్యాయి. ఈ కార్లు ఈ ఫ్యూయల్తో సజావుగా పనిచేస్తాయి. కానీ 2023కి ముందు తయారైన పాత వాహనాలు సాధారణంగా ఈ10 లేదా ప్యూర్ పెట్రోల్కు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అందువల్ల వాటిలో ఈ20 వాడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.పాత వాహనాల్లో సమస్యలు రావడానికి ప్రధాన కారణం.. ఇథనాల్ స్వభావం. ఇథనాల్ నీటిని ఆకర్షించే లక్షణం కలిగి ఉంటుంది. దీని వల్ల ఫ్యూయల్ ట్యాంక్లో తేమ చేరి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రబ్బర్ సీల్స్, ప్లాస్టిక్ ఫ్యూయల్ లైన్స్ వంటి భాగాలు కాలక్రమేణా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్లో మురికి పేరుకుపోయి పనితీరు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ తక్కువగా ఉండటంతో మైలేజ్ కొంత తగ్గుతుంది.ఇదీ చదవండి: రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీఅయితే.. పాత వాహన యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ20 వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవచ్చు. ఫ్యూయల్ అడిటివ్స్ వాడడం ఒక సులభమైన మార్గం. ఇవి ఇంధనంలోని ఇథనాల్ ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించగలవు. అలాగే.. పాత ఫ్యూయల్ లైన్స్ను PTFE లేదా బ్రైడెడ్ స్టీల్ లైన్స్తో మార్చడం ద్వారా దీర్ఘకాలిక రక్షణ పొందవచ్చు. ఇంజిన్ సీల్స్ను విటాన్ వంటి మెటీరియల్స్తో అప్గ్రేడ్ చేయడం కూడా ఉపయోగకరం.మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న వాహనాల్లో తుప్పు రాకుండా స్పెషల్ కోటింగ్ చేయించుకోవచ్చు. వాహనాల్లో ఈసీయూ ట్యూనింగ్ లేదా అప్డేటెడ్ మ్యాపింగ్ ద్వారా కూడా ఈ20 అనుకూలతను మెరుగుపరచవచ్చు. కాబట్టి పాత వాహనాలను ఉపయోగించేవాళ్లు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీ
ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.30 లక్షలు ఉంటే, రూ.20 లక్షల విలువైన కారును కొనుగోలు చేయడం ఆర్థికంగా సౌకర్యవంతమేనా? ఒకవేళ కొనాలంటే మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించడం మంచిదా?, లేక లోన్ తీసుకుని కొనడం మంచిదా? అనే ప్రశ్నలకు చాట్జీపీటీ వివరంగా సమాధానం ఇచ్చింది.బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల ఉద్యోగి తన పూర్తి ఆర్థిక వివరాలను చాట్జీపీటీకు అందించాడు. అతనికి సంవత్సరానికి రూ.30 లక్షల జీతం, అయితే నెలకు రూ.1.9 లక్షలు చేతికి వచ్చే ఆదాయం. కాగా అతనికి రూ.15 లక్షల పెట్టుబడులు, రూ.5 లక్షల ఎమర్జెన్సీ ఫండ్, రూ.10 లక్షల ఈపీఎఫ్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.40 లక్షల హోమ్ లోన్ ఉండగా, ప్రతి నెల రూ.40 వేల ఈఎంఐ, మరో రూ.40 వేల సిప్ పెట్టుబడులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అతని వద్ద ఎనిమిదేళ్ల పాత హ్యాచ్బ్యాక్ కారు ఉంది.ఈ నేపథ్యంలో రూ.20 లక్షల ఆన్రోడ్ ధర ఉన్న కొత్త SUV కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు పేర్కొంటూ, రెండు ఎంపికలను చాట్జీపీటీ ముందుంచాడు. మొదటిది, మొత్తం రూ.20 లక్షలను పొదుపు నుంచి తీసుకుని ఒకేసారి చెల్లించి కారు కొనడం. రెండోది, రూ.5 లక్షలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఐదేళ్ల కార్ లోన్ ద్వారా చెల్లించడం.ఈ రెండు ఎంపికలను విశ్లేషించిన చాట్జీపీటీ, కారు కొనుగోలు మాత్రమే కాకుండా, ఐదు సంవత్సరాలు, పది సంవత్సరాల పాటు కారును మెయింటెన్స్ కోసం అయ్యే మొత్తం ఖర్చును కూడా అంచనా వేసింది. ఇందులో కొనుగోలు ధర, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సర్వీసింగ్, రిపేర్లు, ఇంధనం, టైర్లు, పార్కింగ్, లోన్ వడ్డీ వంటి అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకుంది.చాట్జీపీటీ అంచనా ప్రకారం, మొత్తం డబ్బు చెల్లించి కారు కొనుగోలు చేస్తే ఐదేళ్లలో మొత్తం యాజమాన్య వ్యయం సుమారు రూ.28 నుంచి రూ.31 లక్షల మధ్య ఉండొచ్చు. అదే రూ.5 లక్షల డౌన్ పేమెంట్తో లోన్ తీసుకుంటే వడ్డీ కారణంగా ఈ ఖర్చు రూ.31 నుంచి రూ.33 లక్షల వరకు పెరగొచ్చు.పది సంవత్సరాల వ్యవధిలో నగదు చెల్లించి కొనుగోలు చేసిన కారుకు మొత్తం ఖర్చు సుమారు రూ.42 నుంచి రూ.46 లక్షలు, లోన్ తీసుకుని కొనుగోలు చేసిన కారుకు రూ.45 నుంచి రూ.49 లక్షలు అవుతుందని చాట్జీపీటీ అంచనా వేసింది. ఈ ఖర్చులో అత్యధిక భాగం కారు విలువ తగ్గడం, ఇంధనం, ఇన్సూరెన్స్, నిర్వహణ ఖర్చులు ఉంటాయని వెల్లడించింది.అయితే.. తుది నిర్ణయంలో చాట్జీపీటీ ఆసక్తికరమైన సూచన చేసింది. మొత్తం రూ.20 లక్షలను ఒకేసారి చెల్లించడం వల్ల వడ్డీ భారం ఉండదు. కానీ అలా చేస్తే ఇప్పటికే ఉన్న పెట్టుబడులు దాదాపు ఖాళీ అవుతాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన డబ్బు అందుబాటులో ఉండదు. అలాగే పెట్టుబడులు భవిష్యత్తులో ఇచ్చే వృద్ధి ప్రయోజనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.కాబట్టి.. రూ.5 లక్షల డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్లకు లోన్ తీసుకోవడం మంచి నిర్ణయం అని చాట్జీపీటీ పేర్కొంది. ఇలా చేయడం వల్ల కొంత వడ్డీ చెల్లించాల్సి వచ్చినప్పటికీ, చేతిలో నగదు నిల్వ ఉంటుంది. పెట్టుబడులు కొనసాగుతాయి. దీర్ఘకాలంలో ఆర్థిక భద్రత కూడా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.ఇదీ చదవండి: జూన్ 30 తర్వాత పాత నోట్ల రద్దు?: స్పందించిన బ్యాంక్ -
జూన్ 30 తర్వాత పాత నోట్ల రద్దు?: స్పందించిన బ్యాంక్
2026 జూన్ 30 తర్వాత పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్వీకరించదని ఒక వార్త వైరల్ సోషల్ మీడియాలో అయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. చాలామంది ఇది మరోసారి పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జరుగుతుందేమోనని భావించారు. అయితే.. ఈ వార్త పూర్తిగా అసత్యమని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారికంగా స్పష్టం చేసింది.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన అధికారిక ఫేస్బుక్ పేజీలో #FakeMessageAlert హ్యాష్ట్యాగ్తో ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, ''2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను 2026 జూన్ 30 తర్వాత మా శాఖలు స్వీకరించవని ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం పూర్తిగా తప్పు. వినియోగదారులు ఇలాంటి తప్పుడు సందేశాలను నమ్మవద్దు, ఇతరులకు పంపవద్దు. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి'' అని తెలిపింది.A false message is being circulated claiming that pre-2005 ₹10, ₹20, ₹50 & ₹100 notes will not be accepted after 30th Jun'26. Bank of Maharashtra clarifies that this information is incorrect. Customers are requested to rely only on official sources for authentic information. pic.twitter.com/afF5czNO7e— Bank of Maharashtra (@mahabank) June 26, 2026వైరల్ వార్తలో జరిగిన ప్రచారంవైరల్ అయిన కథనాల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పాత నోట్లను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని, త్వరలో ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను వెంటనే మార్చుకోవాలని భావించారు. అయితే.. ఈ ప్రచారాన్ని బ్యాంక్ పూర్తిగా ఖండించింది. అంతే కాకుండా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా దీనికి సంబంధించిన ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.ఆర్బీఐ ప్రకటన2015లో ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చలామణి తగ్గిపోయిందని, అవసరమైతే ప్రజలు వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే.. ఆ నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ (Legal Tender)గానే కొనసాగుతాయని కూడా స్పష్టంగా తెలిపింది. కొత్త నోట్లలో భద్రతా ఫీచర్లు మెరుగ్గా ఉండటంతో నకిలీ నోట్ల తయారీని అరికట్టడం సులభమవుతుందని ఆర్బీఐ వివరించింది. కానీ.. పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు లేదా చెల్లుబాటు కాకుండా చేస్తున్నట్లు ఎప్పుడూ ప్రకటించలేదు.ఇదీ చదవండి: 35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్ -
లీటరుకు 71 కిమీ మైలేజ్.. ఈ బైక్ ధర ఎంతంటే?
హీరో మోటోకార్ప్ తన ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్సైకిల్ అయిన ప్యాషన్ ప్లస్ కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. ఇది ఫీచర్ అప్గ్రేడ్లతో పాటు మెరుగైన భద్రతను అందించే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దీని ధర రూ.84,128 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).కొత్త వేరియంట్లో స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్కు బదులుగా.. ముందు వైపు డిస్క్ బ్రేక్ను అమర్చారు. ఈ అప్గ్రేడ్ ముఖ్యంగా అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చే పట్టణ ప్రాంతాల్లో, మెరుగైన బ్రేకింగ్ పనితీరును, నియంత్రణను అందిస్తుందని భావిస్తున్నారు. కొత్త ప్యాషన్ ప్లస్ డిస్క్ హెవీ గ్రే, నెక్సస్ బ్లూ, డార్క్ ఇండస్ట్రియల్ గ్రే, పెర్ల్ రెడ్ అనే నాలుగు డ్యూయల్ టోన్ రంగులలో అందుబాటులో ఉంది.బ్రేకింగ్ అప్గ్రేడ్తో పాటు, ప్యాషన్ ప్లస్ డిస్క్ పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను కూడా పొందుతుంది. ఈ కన్సోల్లో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయెల్ వార్నింగ్, సర్వీస్ రిమైండర్స్, కాల్ అండ్ SMS అలర్ట్ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ మోటార్సైకిల్లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, అదనపు భద్రత కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్, USB ఛార్జింగ్ పోర్ట్, యుటిలిటీ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటివి కూడా ఉన్నాయి.మెకానికల్గా ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి అదే 100 సీసీ ఇంజన్తో పనిచేస్తుంది, ఇది 8,000 ఆర్పీఎమ్ వద్ద 5.9 కిలోవాట్ల పవర్, 6,000 ఆర్పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ హీరో ఐ3ఎస్ (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్)తో కలిసి పనిచేస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ బైక్ 71 కిమీ/లీ మైలేజ్ ఉస్తుందని కంపెనీ చెబుతోంది.ఇదీ చదవండి: ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం!


