breaking news
Business
-
నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్
డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం, బిట్కాయిన్ రెండింటిపైన పెట్టుబడులు పెరుగుతాయని, మార్కెట్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని.. జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ 'క్రిస్టోఫర్ వుడ్' పేర్కొన్నారు. గుర్గావ్లోని జెఫరీస్ ఇండియా ఫోరమ్లో మాట్లాడుతూ.. తన పోర్ట్ఫోలియో కేటాయింపులను కూడా వెల్లడించారు.ప్రస్తుతం పసిడి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. బంగారం ఔన్సుకు 3,698 డాలర్లకు పెరిగిన సమయంలో.. భారతదేశంలో కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.11 లక్షలు దాటేసింది.ఔన్స్ బంగారం 3600 డాలర్లకు చేరుతుందని.. నేను 2002లోనే అనుకున్నాను. ఊహించినట్లుగానే గోల్డ్ ఆ లక్ష్యాన్ని చేరుకుందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గోల్డ్ కొత్త ట్రేడింగ్ శ్రేణిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బంగారం (ఫిజికల్ గోల్డ్)పై ఆశ ఉన్నప్పటికీ.. నాకు గోల్డ్ మైనింగ్ స్టాక్లనే ఆసక్తి ఉందని అన్నారు. అయితే ఇది మొత్తం కంపెనీల లాభాల మీద ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబిట్కాయిన్ల విలువ కూడా భారీగా పెరుగుతోంది. నేను బంగారం & బిట్కాయిన్ రెండింటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ధనవంతులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవచ్చు. వారంతా బిట్కాయిన్ను కొనుగోలు చేస్తారు. రాబోయే కాలం మొత్తం బిట్కాయిన్, బంగారంతోనే ముడిపడి ఉందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. -
2025 నాటికి రెండు కోట్ల వాహనాలు: సీపీసీబీ అంచనా
నిర్దిష్ట వయసు దాటిన వాహనాలను ప్రజా రహదారులపై నడపడం నిషిద్ధం. ఇలాంటి వాహనాలను స్క్రాపేజ్ సెంటర్లకు తరలించాలని ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది. దీనికోసం స్క్రాపేజ్ సెంటర్లు కూడా పుట్టాయి. ఈ సెంటర్లలో పాత వాహనాలను తుక్కు చేసి.. రీసైక్లింగ్ చేస్తారు.రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన లైట్ వెయిట్ మోటర్ వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లు పైబడినవి 34 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) అంచనాల ప్రకారం.. 2025 నాటికి దేశవ్యాప్తంగా 2 కోట్ల పైచిలుకు వాహనాల జీవితకాలం ముగియనుంది. వీటన్నింటిని అలాగే వదిలేస్తే.. అవి మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా.. గాలి, నీరు, మట్టిని కూడా కాలుష్యం చేస్తాయి. కాబట్టి వీటన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు.. 75 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో స్క్రాపింగ్ విధానం సవ్యంగా అమలు కావడానికి.. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. దీంతో స్క్రాప్ కొనుగోలు చేసే కంపెనీలు చెల్లించాల్సిన జీఎస్టీ తగ్గింది. ఇది రీప్లేస్మెంట్ వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణహితమైన విధానాలను ప్రోత్సహించేందుకు తోడ్పడుతుంది.ఇదీ చదవండి: రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్కు ముందే ఫుల్ డిమాండ్భారత్లోనే అతి పెద్ద రీసైక్లింగ్ వ్యవస్థఆసియాలోనే అగ్రగామి సర్క్యులర్ ఎకానమీ, సస్టైనబిలిటీ సొల్యూషన్స్ సంస్థ రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (ఆర్ఈఎస్ఎల్) రీ కార్మ (Re Carma), భారత్లోనే అతి పెద్ద ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్ (ఈఎల్వీ) రీసైక్లింగ్ వ్యవస్థగా ఆవిర్భవించింది. ఢిల్లీ ఎన్సీఆర్ జాఝర్లోని రిలయన్స్ మోడల్ ఎకనమిక్ టౌన్షిప్లో గల రీ కార్మ ఫ్లాగ్షిప్ అధునాతన కేంద్రం ఏడాదికి 30,000 కంటే ఎక్కువ వాహనాలను (ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాలు, ఎర్త్మూవింగ్ ఎక్విప్మెంట్ మొదలైనవి) తుక్కు చేస్తోంది. ఈ హబ్ కాకుండా, రీ కార్మ దేశవ్యాప్తంగా తమ ఫ్రాంచైజీ, భాగస్వాముల నెట్వర్క్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. -
అనురాగ్ యూనివర్శిటీ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ మధ్య ఒప్పందం
అనురాగ్ యూనివర్సిటీ, ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. ఈ సహకారంలో భాగంగా.. ఎంఎస్ఎన్ ఉద్యోగుల కోసం అనురాగ్ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగం, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన బ్రిడ్జ్ కోర్సు (MSN Labs Bridge Course) నిర్వహిస్తారు.ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన, అతిథుల స్వాగతంతో ప్రారంభమైంది. అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ హెడ్, కార్యక్రమ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ సవితా బెల్వాల్, సెల్ఫ్-డైరెక్టెడ్ టీమ్స్ (SDT) బ్రిడ్జ్ కోర్సు గురించి వివరించారు. ఈ కోర్సును MSN ల్యాబ్స్తో కలిసి ఉద్యోగుల జ్ఞానం, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ధ్యేయంగా రూపొందించారు.ఈ సందర్భంగా డాక్టర్ సవితా బెల్వాల్ మాట్లాడుతూ.. "ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్తో కుదుర్చుకున్న ఈ అవగాహన ఒప్పందం పరిశ్రమ-విద్యాసంస్థల సహకారానికి ఒక బలమైన ఉదాహరణ. ఈ బ్రిడ్జ్ కోర్సు ద్వారా, మేము శిక్షణ పొందుతున్నవారికి సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు, ఆచరణాత్మక నైపుణ్యాలను కూడా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా వారు పరిశ్రమ అవసరాలకు సిద్ధమయ్యేలా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా తీర్చిదిద్దుతాం. ఫార్మా రంగంలోని వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి పరిశ్రమ, విద్యాసంస్థలు నిరంతరం ఒకదాని నుంచి మరొకటి నేర్చుకునే నమూనాను సృష్టించడమే మా లక్ష్యం" అని అన్నారు.ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ కీలక పాత్ర పోషిస్తుంది. పరిశ్రమకు సంబంధించిన శిక్షణా మాడ్యూళ్లను రూపొందించడం, లెక్చర్లు, ల్యాబొరేటరీ సెషన్లను నిర్వహించడం, శిక్షణ పొందుతున్నవారి పురోగతిని, మూల్యాంకనాలను పర్యవేక్షించడం వంటివి చేస్తుంది.ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ హెచ్ఆర్ (ఏపీఐ) హెడ్ అయిన కె. ఎల్. ఎన్. మూర్తి మాట్లాడుతూ.. "భారతదేశంలో ఫార్మా ప్రతిభను అభివృద్ధి చేయడానికి అనురాగ్ యూనివర్శిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థతో భాగస్వామ్యం అవసరం అని మేము బలంగా భావించాం. ఈ సహకారం మా నూతన ఉద్యోగులు సరైన సైంటిఫిక్ పరిజ్ఞానం, ఆచరణాత్మక శిక్షణ, సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యాలతో తమ వృత్తి జీవితంలో సులభంగా ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని మనం కలిసి తయారు చేస్తున్నాం" అని పేర్కొన్నారు.అనురాగ్ యూనివర్సిటీకి చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్, పరీక్షల విభాగం, విద్యార్థి వ్యవహారాల డీన్స్తోపాటు ఎల్ అండ్ డీ (లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్) డైరెక్టర్ అయిన జావిద్ జమాల్ సమావేశంలో ప్రసంగించారు. పరిశ్రమకు సిద్ధంగా ఉండే నిపుణులను తయారు చేయడంలో విద్యాపరమైన తోడ్పాటు ఎంత ముఖ్యమో వారు తమ ప్రసంగంలో నొక్కి చెప్పారు.ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్తో కుదుర్చుకున్న ఈ అవగాహన ఒప్పందం ఫార్మా రంగంలో అనురాగ్ యూనివర్శిటీకి రెండో ముఖ్యమైన సహకారం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య దీర్ఘకాలిక సమన్వయాన్ని పెంపొందించడానికి యూనివర్శిటీ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవి విద్యార్థులకు, శిక్షణ పొందుతున్నవారికి ఆచరణాత్మక నైపుణ్యాలు, అనుభవం, ఫార్మా కెరీర్లలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 594.95 పాయింట్లు లేదా 0.73 శాతం లాభంతో.. 82,380.69 వద్ద, నిఫ్టీ 169.90 పాయింట్లు లేదా 0.68 శాతం లాభంతో 25,239.10 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో.. కొఠారి ప్రొడక్షన్, రవీందర్ హైట్స్, రెడింగ్టన్, లక్ష్మీ డెంటల్, పావ్నా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు చేరాయి. శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ, మాగ్నమ్ వెంచర్స్, థెమిస్ మెడికేర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్కు ముందే ఫుల్ డిమాండ్
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త ఎస్యూవీ విక్టోరిస్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 10.5 లక్షల నుంచి రూ. 19.99 లక్షలు (ఎక్స్షోరూం). ఈ కారు హైబ్రిడ్, ఫోర్ వీల్ డ్రైవ్, సీఎన్జీ, స్మార్ట్ హైబ్రిడ్ తదితర 21 వేరియంట్స్లో లభిస్తుంది. బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు 1,000 చొప్పున వస్తున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. ఇప్పటివరకు 10,000 బుకింగ్స్ వచ్చాయని వివరించారు.సెప్టెంబర్ 22 నుంచి విక్టోరిస్ అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మిడ్–సైజ్ ఎస్యూవీ మార్కెట్లో అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మిడ్ సైజ్ ఎస్యూవీలు 10 లక్షలు అమ్ముడవగా, 1.94 లక్షల యూనిట్లతో హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా అగ్రగామిగా ఉంది.ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు -
‘ఒక్క క్లిక్తో బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం’
సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న టెక్నాలజీలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరస్థులు సామాన్య ప్రజలను టార్గెట్ చేసే వీలుందని ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతా వేదికగా హెచ్చరించారు. ఇటీవల జెమిని నానో బనానా మోడల్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.నానో బనానాగూగుల్ గత నెలలో జెమిని యాప్కు ‘నానో బనానా’ సంబంధించిన ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటింది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను సృష్టించింది. వేగం, కచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులకంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.సారీ ట్రెండ్..సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం నానో బనానా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది. తాజాగా బనానా మోడల్ తరహాలోనే ‘సారీ ట్రెండ్’ కూడా వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ టెక్నాలజీలను ఉపయోగించుకుని సామాన్య ప్రజలపై మోసాలకు ఒడిగట్టే అవకాశం ఉంటుందని, వెబ్సైట్ల్లో ఫొటోలు అప్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సజ్జనార్ చెప్పారు.నకిలీ వెబ్సైట్లు.. అనధికార యాప్లు..‘ఇంటర్నెట్లో ట్రెండింగ్ టాపిక్లతో జాగ్రత్తగా ఉండండి! నానో బనానా ట్రెండింగ్ క్రేజ్ ఉచ్చులోపడి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకుంటే, సైబర్ మోసాలు జరగడం ఖాయం. కేవలం ఒక్క క్లిక్తో మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నేరస్థుల చేతుల్లోకి చేరుతుంది. ఫొటోలు లేదా వ్యక్తిగత వివరాలను నకిలీ వెబ్సైట్లు లేదా అనధికార యాప్ల్లో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ ఫొటోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి’ అని సజ్జనార్ ఎక్స్తో చెప్పారు.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ -
మళ్లీ తెరపైకి పని గంటల వివాదం: నెటిజన్లు ఫైర్!
వారానికి 72 గంటల పని వాదనలు సద్దుమణిగాయి అనుకునేలోపే.. మళ్లీ ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఏఐ స్టార్టప్ మెర్కోర్లో పనిచేస్తున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. వారానికి 72 నుంచి100 గంటలు పనిచేసిన తన అనుభవాన్ని పంచుకున్న తర్వాత ఇది చర్చకు దారితీసింది.మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి ప్రణవ్ మెహతా.. అన్ని కాలాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని అభివర్ణిస్తూ, వారానికి 72 గంటల పని అంటే మొదట్లో కొంత భయంగా అనిపించవచ్చు. అప్పుడప్పుడు ఇది 100 గంటలకు కూడా విస్తరిస్తుందని పేర్కొన్నాడు. వారానికి 40 గంటల పని, అనుకున్న లాభాలను అందించదని అన్నారు. మెర్కోర్ సీఈఓ బ్రెండన్ ఫుడీ చేసిన పోస్ట్కు ప్రతిస్పందనగా మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు.మెర్కోర్ సీఈఓ బ్రెండన్ ఫుడీ.. కంపెనీ ఆదాయం 17 నెలల్లోనే 1 నుంచి 500 మిలియన్లకు పెరిగింది. దీనిని ఎప్పటికప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని పేర్కొన్నాడు. కంపెనీ ఇప్పుడు 10 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానంవారానికి 72 గంటల పనిపై ప్రణవ్ మెహతా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకతకు దారితీశాయి. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు అధిక పని గంటలను కీర్తించడాన్ని విమర్శించారు. ఇంత ఎక్కువ గంటలు పనిచేయడం వెనుక ఉన్న మనస్తత్వాన్ని ఒకరు ప్రశ్నించగా.. ఎక్కువ పనిగంటలు వల్ల తలెత్తే ఇబ్బందులను గురించి పట్టించుకోరా, మీ ఉద్దేశం ఏమిటి? అని మరొకరు అన్నారు.Fastest growing company of all time.The 72-hour work week might sound daunting at first (occasionally stretches to 100)But the growth, the learning curve, the pace- is truly unmatched.A comfy 40-hour week won't offer the same upside. Not the same energy, not the same… https://t.co/m3K4xTWVBn— Pranav Mehta (@i_pranavmehta) September 15, 2025 -
కీ చెయిన్ కెమెరా.. ధర ఎంతంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వస్తువుల పరిమాణంలో, అందుకు ఉపయోగించే పరికరాల్లో మార్పులొస్తున్నాయి. గతంలో పెద్ద రూమ్ సైజ్లో ఉండే కంప్యూటర్ ఇప్పుడు మడిచి జేబులో పెట్టుకునేంత సైజ్లోకి మారిపోయింది. సాంకేతిక విభిన్న విభాగాల్లో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఇది కెమెరా తయారీ పరిశ్రమలోనూ విశేష మార్పులకు నాంది పలికింది. గతంలో సూట్కేస్ సైజ్లో ఉండే కెమెరాలు టెక్నాలజీ సాయంతో ప్రస్తుతం ‘కీ చెయిన్’ సైజ్లోకి వచ్చేశాయి. అవును.. కేవలం 30 గ్రాముల బరువుండే కెమెరాను కొడాక్ కంపెనీ ‘చార్మెరా’ పేరుతో ఇటీవల ఆవిష్కరించింది.కొడాక్ చార్మెరా ఫీచర్లు..ఇది ఒక మినీ కెమెరా.దీని ధర కేవలం 30 డాలర్లు(సుమారు రూ.2,500). రిటైలర్ను అనుసరించి ధరలో మార్పులుంటాయని గమనించాలి.దీన్ని ‘బ్లైండ్ బాక్స్’ల్లో విక్రయిస్తున్నారు. (ఇది డిలివరీ అయ్యే వరకు రంగు / డిజైన్ తెలియదు).ఇది 30 గ్రాముల బరువు ఉంటుంది.1.6 మెగా పిక్సెల్ కెమెరా సామర్థ్యం ఉండి, జేపీఈజీ ఫార్మాట్లో ఫొటోలు (1440×1440) సేవ్ చేస్తుంది.30fps ఈవీఐ వీడియోఎస్సీడీ స్క్రీన్ + వ్యూఫైండర్యూఎస్బీ టైప్-C ఛార్జింగ్.మైక్రో ఎస్డీ స్లాట్ (128GB వరకు)ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్ -
ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్
భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాలు పెంచే లక్ష్యంతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని పాదుర్లో రూ.5,700 కోట్ల వ్యయంతో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ (ఎస్పీఆర్) యూనిట్ను నిర్మించనున్నట్లు తెలిపింది. దేశంలోని ప్రైవేట్ రంగ సంస్థ ఈ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చొరవ సాంప్రదాయకంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్న ఇంధన భద్రతలో పరివర్తనాత్మక మార్పును సూచిస్తుంది.వ్యూహాత్మక ముందడుగుఈ ప్రాజెక్ట్ ద్వారా 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) ఎస్పీఆర్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారతదేశం అత్యవసర ముడి చమురు నిల్వలకు గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 5.33 ఎంఎంటీ వ్యూహాత్మక నిల్వలను పెంచడానికి ఈ సదుపాయం తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిల్వల ద్వారా పూర్తి సామర్థ్యంతో 8-9 రోజుల జాతీయ ముడి చమురు డిమాండ్ను తీర్చవచ్చు. కొత్త స్టోరేజీ అందుబాటులోకి వస్తే మరిన్ని రోజులు ఇంధన భద్రత ఉంటుందని చెబుతున్నారు.ఇది అమలులోకి వస్తే ప్రపంచ సరఫరా అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ఊహించని డిమాండ్ పెరిగినా దేశ ఇంధన బఫర్కు తోడ్పడుతుంది. ఈ రిజర్వ్ను నిర్మించడానికి ఎంఈఐఎల్కు ఐదేళ్ల సమయం అవసరం అవుతుందని తెలిపింది. 60 సంవత్సరాల పాటు కంపెనీ దీని నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. ప్రస్తుత ప్రపంచ చమురు ధరల ప్రకారం ఈ కెపాసిటీలో ముడి చమురు నింపే ఖర్చు 1.25 బిలియన్ డాలర్లు (రూ.11,020 కోట్లు)గా అంచనా వేశారు. దాంతో ఇది భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద ప్రైవేట్ రంగ పెట్టుబడిగా నిలిచింది. ఈ స్టోరేజ్ యూనిట్ను కంపెనీ నేరుగా నిర్వహించవచ్చు లేదా ఇతర చమురు నిర్వహణ సంస్థలకు లీజుకు ఇవ్వొచ్చు.ప్రత్యేకతలు..మొదటి ప్రైవేట్ ఎస్పీఆర్: ఇంధన నిల్వల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని వైవిధ్యం చేస్తుంది.పబ్లిక్-ప్రైవేట్ సినర్జీ: జాతీయ భద్రతతో అనుసంధానించిన మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్ సంస్థలు పాల్గొనేలా ప్రభుత్వ దృక్పథం మారడాన్ని ప్రతిబింబిస్తుంది.ఇంధన భద్రత: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశ చమురు నిల్వలకు కీలకంగా మారనుంది.వ్యూహాత్మక ప్రదేశం: పదుర్ ఇప్పటికే ఎస్పీఆర్ మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఉంది. ఇది లాజిస్టిక్, కార్యాచరణ సామర్థ్యాలను సులభతరం చేస్తుంది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
యూఎస్లో శ్రామిక కొరతను అందిపుచ్చుకునేలా..
ఐటీ జాబ్స్ కాకుండా విదేశీయుల కోసం యూఎస్లో చాలానే ఉద్యోగాలు ఉన్నాయి. యూఎస్లో పెరుగుతున్న శ్రామిక కొరత దృష్ట్యా భారత యువతకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలుసుకుందాం. ఐటీ కాకుండా అమెరికాలో ప్రస్తుతం నర్సింగ్, హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ), స్కిల్డ్ ట్రేడ్ ఉద్యోగాలు (వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ వంటివి), వ్యవసాయ రంగాల్లో భారతీయ యువతకు అవకాశాలు ఉన్నాయి.కొన్ని సంస్థల సర్వేల ప్రకారం.. భారతదేశంలో 18-40 సంవత్సరాల వయసు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయసు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు. మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్గా ఎదగడానికి భారత్కు అవకాశం ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన యూఎస్ వంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్లుగా యువ జనాభా అంతంతమాత్రంగానే ఉంది. ఈ వ్యత్యాసాన్ని భారత్ భర్తీ చేస్తుంది.యూఎస్లో ఐటీయేతర ఉద్యోగ అవకాశాలునర్సింగ్, ఆరోగ్య సంరక్షణ: అమెరికాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో నర్సులకు, ఇతర ఆరోగ్య నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ): హోటల్ నిర్వహణ, క్యాటరింగ్ వంటి హాస్పిటాలిటీ రంగాల్లో కూడా భారతీయ యువతకు అవకాశాలు లభిస్తాయి.నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలు: వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, గృహ నిర్మాణ కార్మికులు.. వంటి నైపుణ్యం కలిగిన ట్రేడ్ల్లో కూడా అమెరికాలో కొరత ఉంది. దీనికి తగిన శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు దొరుకుతాయి.వ్యవసాయం: అమెరికా వ్యవసాయ రంగంలో కూడా వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం అమెరికా వీసా విధానాలు కఠినతరం కావడంతో ముఖ్యంగా హెచ్-1బీ వీసా వంటి వాటికి ఎంతో పోటీ ఉంది. భారత యువత వీటిని అందిపుచ్చుకోవడానికి సంబంధిత రంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలి. విద్యార్హతలు సంపాదించాలి. అమెరికా వీసా నిబంధనలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా దరఖాస్తు ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.వీసా విధానాలువీసా పేరుఉపయోగం / లక్ష్యంH‑2Aవ్యవసాయ రంగంలో సీజనల్ వర్కర్ల కోసం ఈ వీసా పని చేస్తుంది.H‑2Bవ్యవసాయేతర సీజనల్ / తాత్కాలిక ఉద్యోగాలు (హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, పార్క్స్, రిసోర్ట్స్ మొదలైనవి)L‑1కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ లేదా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వర్కర్లుO‑1అత్యుత్తమ ప్రతిభ (ఆర్ట్స్, అథ్లెటిక్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్సెస్) ఉన్నవారికీ ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
82,000 మార్కు చేరిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు పెరిగి 25,128కు చేరింది. సెన్సెక్స్(Sensex) 216 పాయింట్లు పుంజుకుని 82,002 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కారు రుణాలు వద్దు బాబోయ్!
జీఎస్టీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో తమ కారు రుణం రద్దు చేయాలని కోరుతూ బ్యాంక్లకు అభ్యర్థనలు పెరిగిపోతున్నాయి. 1,200సీసీ వరకు సామర్థ్యం కలిగిన కార్లను 28 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ శ్లాబు కిందకు మారుస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. వీటితోపాటు 40 శాతం శ్లాబులోకి మార్చినప్పటికీ, అదనపు లెవీలు లేకపోవడంతో ఖరీదైన కార్ల ధరలు సైతం తగ్గనున్నాయి.ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఒక్కో కారుపై రూ.3 లక్షల వరకు ధర తగ్గనుంది. దీంతో ఇప్పటికే కార్ల కొనుగోలుకు రుణ ఆమోదాలను పొందిన కస్టమర్లు బ్యాంక్ శాఖలను సంప్రదిస్తున్నారు. జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాతే కారు కొనుగోలు చేసుకుంటామని బ్యాంక్ అధికారులకు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వరంగ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రుణాన్ని రద్దు చేసుకోవడం వల్ల నష్టపోయే దాని కంటే జీఎస్టీలో మార్పుల ఫలితంగా ఒక్కో కారుపై తగ్గే ధర అధికంగా ఉంటున్నట్టు చెప్పారు. దీంతో కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత తిరిగి రుణానికి దరఖాస్తు చేసుకోవాలనే యోచనలో కస్టమర్లు ఉన్నట్టు తెలిపారు. హైఎండ్ వేరియంట్స్ పట్ల ఆసక్తికారు డీలర్లు ఇప్పటికే జారీ చేసిన ఇన్వాయిస్లకు సంబంధించి పాత జీఎస్టీ రేట్లు అమలవుతాయని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేవారు. దీని ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి జారీ చేసే ఇన్వాయిస్లకు కొత్త రేట్లు అమలవుతాయని తెలుస్తోంది. ధరలు తగ్గడంతో మరిన్ని ఫీచర్లు ఉన్న మెరుగైన మోడళ్లకు వెళ్లాలని కొందరు కొనుగోలు దారులు భావిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం కార్లపై 28 శాతం జీఎస్టీతోపాటు, వాటి సామర్థ్యానికి అనుగుణంగా ఒక శాతం నుంచి 22 శాతం వరకు కాంపన్సేషన్ సెస్సును అమలు చేస్తున్నారు. దీంతో నికర రేటు 29% నుంచి 50 శాతం మధ్య ఉంటోంది. సెపె్టంబర్ 22 నుంచి 1,200 సీసీ సామర్థ్యం మించని పెట్రోల్, 1,500 సీసీ సామర్థ్యం మించని డీజిల్ కార్లపై 18 శాతం జీఎస్టీ రేటు, అంతకుమించిన వాటికి 40 శాతం రేటు అమల్లోకి రానుంది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
7 ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లు ఊగిసలాడుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సెబీ తాజాగా 7 కంపెనీలను అనుమతించింది. జాబితాలో కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్,కెనరా రొబెకో, హీరో మోటర్స్ తదితర కంపెనీలున్నాయి. ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటికే 55 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా సుమారు రూ. 75,000 కోట్లు సమీకరించాయి. మరో 12 కంపెనీలు రెండు, మూడు వారాల్లో ఐపీవోకు రానున్నాయి. తాజా వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇటీవల జోరుగా లిస్టవుతున్న పలు కంపెనీల బాటలో మరో 7 కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు దారి ఏర్పడింది. సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిధుల సమీకరణ బాటలో సాగనున్నాయి. ఐపీవోకు అనుమతి పొందిన కంపెనీల జాబితాలో కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా రొబెకో ఏఎంసీ, హీరో మోటార్స్సహా ఎమ్వీ ఫొటోవోల్టాయిక్ పవర్, పైన్ ల్యాబ్స్, మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్, ఎంటీఆర్ ఫుడ్స్ చేరాయి. ఈ ఏడాది(2025) ఏప్రిల్–జూలై మధ్య ఈ కంపెనీలన్నీ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వెరసి ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మర్చంట్ వర్గాలు తెలియజేశాయి. అత్యధిక శాతం కంపెనీలు ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణ, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. మరోవైపు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులకు తమ పెట్టుబడులు విక్రయించేందుకు సైతం వీలు కల్పించనున్నాయి. జీవిత బీమా సంస్థ పీఎస్యూ దిగ్గజం కెనరా బ్యాంక్ బీమా అనుబంధ సంస్థ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ తాజాగా క్లియరెన్స్ ఇచ్చినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూలో భాగంగా సంస్థ 23.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో కెనరా బ్యాంక్ 13.77 కోట్ల షేర్లు, ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) 9.5 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఈ బాటలో హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ సైతం 47 లక్షల షేర్లు విక్రయించనుంది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ను కెనరా బ్యాంక్, పీఎన్బీ, హెచ్ఎస్బీసీ గ్రూప్ ప్రమోట్ చేశాయి. 2024 మార్చికల్లా నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం)రీత్యా మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది.ఫిన్టెక్ కంపెనీపీఈ దిగ్గజాలు టెమాసెక్, పీక్ 15 పార్ట్నర్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఫిన్టెక్ కంపెనీ పైన్ ల్యాబ్స్ ఐపీవోలో భాగంగా రూ. 2,600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు మరో 14.78 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. లోక్వీర్ కపూర్సహా.. టెమాసెక్, పీక్ 15 పార్ట్నర్స్, యాక్టిస్ తదితర సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 870 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 760 కోట్లు క్లౌడ్, డిజిటల్ చెక్ఔట్ పాయింట్లు తదితర ఐటీ మౌలికసదుపాయాలపై వెచి్చంచనుంది.రూ. 1,200 కోట్లపై కన్నుపబ్లిక్ ఇష్యూలో భాగంగా హీరో మోటార్స్ రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,200 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రమోటర్ సంస్థలలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ. 390 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 285 కోట్లు రుణ చెల్లింపులకు, యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్లోగల యూనిట్ విస్తరణకు రూ. 237 కోట్లు(పరికరాల కొనుగోలుకి) వెచి్చంచనుంది.అసెట్ మేనేజ్మెంట్ఐపీవోలో భాగంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ).. కెనరా రొబెకో ఏఎంసీ 4.98 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని సంస్థ ప్రమోటర్లు కెనరా బ్యాంక్(2.59 కోట్ల షేర్లు), ఓరిక్స్ కార్పొరేషన్ యూరోప్ ఎన్వీ(2.39 కోట్ల షేర్లు) ఆఫర్ చేయనున్నాయి. వెరసి ఐపీవో నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్లకు చేరనున్నాయి.సోలార్ పరికరాలుఐపీవో ద్వారా సోలార్ పరికరాల తయారీ కంపెనీ ఎమ్వీ ఫొటొవోల్టాయిక్ పవర్ రూ. 3,000 కోట్లు అందుకోవాలని ప్రణాళికలు వేసింది. వీటిలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 2,144 కోట్లు, ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా మరో రూ. 856 కోట్లు చొప్పున సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,608 కోట్లు అనుబంధ సంస్థలతోపాటు కంపెనీ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఒర్క్లా ఇండియాఎంటీఆర్ ఫుడ్స్, ఈస్టర్న్ బ్రాండ్లతో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు విక్రయించే ఒర్క్లా ఇండియా(మాతృ సంస్థ) ఐపీవో ద్వారా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లతోపాటు.. ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. మణిపాల్ పేమెంట్బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్ కార్ట్ తయారీ కంపెనీ మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
నాలుగు నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
ఆహార, తయారీ వస్తు రేట్ల పెరుగుదలతో ఆగస్ట్ నెలలో టోకు ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ట స్థాయిలో 0.52 శాతంగా నమోదైంది. గత రెండు నెలల పాటు నమోదైన క్షీణత (మైనస్) నుంచి బయటపడింది. జూలైలో మైనస్ 0.58 శాతం, జూన్లో మైనస్ 0.19 శాతం చొప్పున టోకు ద్రవ్యోల్బణం నమోదైంది. 2024 ఆగస్ట్ నెలలో ఇది 1.25 శాతంగా ఉంది. టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) వివరాలను పరిశ్రమల శాఖ విడుదల చేసింది. ఆహార, తయారీ వస్తువులు, నాన్ మెటాలిక్ మినరల్ ఉత్పత్తులు, రవాణా ఎక్విప్మెంట్ ధరలు పెరగడం వల్లే టోకు ద్రవ్యోల్బణం సానుకూల స్థితిలోకి వచ్చినట్లు తెలిపింది. ఆహార విభాగంలో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 3.06 శాతంగా నమోదైంది. జూలైలో ఇది మైనస్ 6.29 శాతంగా ఉంది.కూరగాయల విభాగంలో మైనస్ 14.18 శాతంగా, పప్పుల్లో మైనస్ 14.85 శాతంగా ద్రవ్యోల్బణం ఉంది. జూలైలో ఇవి వరుసగా 28.96%, 15.12% చొప్పున ఉన్నాయి.ఆలుగడ్డల విభాగంలో మైనస్ 44.11 శాతం, ఉల్లిగడ్డల విభాగంలో మైనస్ 50.46 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదైంది. విద్యుత్, ఇంధన విభాగంలో మైనస్ 3.17 శాతం ద్రవ్యోల్బణం నెలకొంది. జూలైలో ఇది మైనస్ 2.43 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల విభాగంలో టోకు ద్రవ్యోల్బణం జూలైలో 2.05 శాతంగా ఉంటే, ఆగస్ట్లో 2.55 శాతానికి పెరిగింది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
ఆగస్టులో ఎగుమతులు జంప్
ఎగుమతులు ఆగస్ట్లో మెరుగైన వృద్ధిని చూశాయి. 35.1 బిలియన్ డాలర్ల విలువైన (సుమారు రూ.3.09 లక్షల కోట్లు) వస్తు ఎగుమతులు నమోదయ్యాయి. అదే సమయంలో దిగుమతులు 10.12 శాతం తగ్గి 61.59 బిలియన్ డాలర్లు (రూ.5.42 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో ఆగస్ట్ నెలలో వాణిజ్య లోటు 26.49 మిలియన్ డాలర్లకు (రూ.2.33 లక్షల కోట్లు) పరిమితమైంది. క్రితం ఏడాది ఆగస్ట్లో వాణిజ్య లోటు 35.64 బిలియన్ డాలర్లతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఈ ఏడాది ఆగస్ట్లో బంగారం దిగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 56 శాతం తగ్గడం అనుకూలించింది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్ట్లో వస్తు, సేవల ఎగుమతులు అన్నీ కలిపి 69.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో ఇవి 63.25 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఆగస్ట్లో వస్తు, సేవల దిగుమతులు 79.04 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 9.88 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. భారత ఉత్పత్తులపై అమెరికా రెండు విడతల్లో విధించిన మొత్తం 50 శాతం టారిఫ్లు ఆగస్ట్ నుంచి అమల్లోకి రాగా, ఇదే నెలలో ఆ దేశానికి 6.86 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. భారత ఎగుమతుల్లో అమెరికాయే మొదటి స్థానంలో నిలిచింది.యూఏఈకి 3.24 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్కు 1.83 బిలియన్ డాలర్లు, చైనాకి 1.21 బిలియన్ డాలర్లు, యూకేకి 1.14 బిలియన్ డాలర్ల చొప్పున ఎగుమతులు వెళ్లాయి.ఇక చైనా నుంచి అత్యధికంగా 10.91 బిలియన్ డాలర్ల వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత రష్యా నుంచి 4.83 బిలియన్ డాలర్లు, యూఏఈ నుంచి 4.66 బిలియన్ డాలర్లు, యూఎస్ నుంచి 3.6 బిలియన్ డాలర్లు, సౌదీ నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు నమోదయ్యాయి. బంగారం దిగుమతులు 56.67 శాతం తగ్గి 5.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల ఎగుమతుల వరకే చూస్తే 34.06 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2024 ఆగస్ట్లో సేవల ఎగుమతులు 30.36 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. ఎల్రక్టానిక్స్ వస్తు ఎగుమతులు 2.93 బిలియన్ డాలర్లు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు 9.9 బిలియన్ డాలర్లు, రత్నాభరణాలు 2.31 బిలియన్ డాలర్లు, పెట్రోలియం ఉత్పత్తులు 4.48 బిలియన్ డాలర్లు, ఫార్మా ఎగుమతులు 2.51 బిలియన్ డాలర్ల చొప్పున ఆగస్ట్లో నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఐదు నెలల్లో వస్తు సేవల ఎగుమతులు 349.35 బిలియ్ డాలర్లుగా ఉన్నట్టు వాణిజ్య శాఖ అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 329 బిలియన్ డాలర్ల కంటే 6.18 శాతం అధికం.ఆగస్ట్ చివరి నాటికి వాణిజ్య మిగులు 80.97 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
ఐపీవో బాటలో మెడికవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్కేర్ సేవల దిగ్గజం మెడికవర్ వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల విస్తరణకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ప్రస్తుత రుణభారం సుమారు రూ.1,000 కోట్లుగా ఉంది. సంస్థ సీఎండీ అనిల్ కృష్ణ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. కొత్తగా రెండు ఆస్పత్రులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. గ్రూప్లో 24వదైన సికింద్రాబాద్ హాస్పిటల్ను మంగళవారం (నేడు) ప్రారంభించనుండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో మరొకటి (500 బెడ్స్ సామర్థ్యం) అందుబాటులోకి వస్తుందని కృష్ణ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం సుమారు రూ. 1,850 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 2,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఇక కొత్త ఆస్పత్రితో కలిపి నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర) పడకల సామర్థ్యం 5,800గా ఉంటుందని కృష్ణ చెప్పారు. హైదరాబాద్ చందానగర్లో 150 పడకల విస్తరణతో మొత్తం బెడ్స్ సంఖ్య 6,400కి చేరుతుందన్నారు. ఐపీవోకి సంబంధించి వంద కోట్ల డాలర్ల దాకా వేల్యుయేషన్ అంచనా వేస్తున్నట్లు కృష్ణ చెప్పారు. చిన్న పట్టణాలపై మరింత ఫోకస్ ... ప్రస్తుతం తమకు కార్యకలాపాలున్న ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కృష్ణ తెలి పారు. బెంగళూరు, పుణేల్లాంటి నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు వివరించారు. అవకాశం వస్తే 300 –350 బెడ్స్ సామర్థ్యాలు ఉండే ఇతర ఆస్పత్రుల కొనుగోలు అంశాన్నీ పరిశీలిస్తామని చెప్పారు. సాధా రణంగా లీజు ప్రాతిపదికన ప్రాంగణాలను తీసుకుంటున్న తాము ఇకపై తమ కార్యకలాపాల కోసం పూర్తి స్థాయిలో ప్రాపర్టీని కొనుగోలు చేయడంపై ఫోకస్ పెట్టనున్నట్లు వివరించారు. వైద్య సదుపాయాలు విస్తృతంగా పెరుగుతున్నప్పటికీ, ప్రతిభావంతులైన వైద్యుల కొరత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అధునాతన టెక్నాలజీ గల పరికరాల దిగుమతి వ్యయాలు పెరిగిపోవడమనేది, చికిత్స వ్యయాల పెరుగుదలకు దారితీస్తున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన, కచి్చతమైన చికిత్సను అందించడంలో కృత్రిమ మేథ (ఏఐ) కీలకపాత్ర పోషించగలదని కృష్ణ చెప్పారు. -
ఐటీఆర్ దాఖలుకు మరొక రోజు గడువు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్లు) దాఖలుకు చివరి రోజు (సెపె్టంబర్ 15) అయిన సోమవారం ఈ–ఫైలింగ్ పోర్టల్పై భారీ రద్దీ కనిపించింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో ఎకరవు పెడుతూ, గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. తొలుత ఎలాంటి సమస్యల్లేవన్న ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ).. సెపె్టంబర్ 16వ తేదీ వరకు (మరొక రోజు) గడువు పొడిగిస్తున్నట్టు రాత్రి 11 గంటల తర్వాత ఎక్స్ ప్లాట్ఫామ్పై ప్రకటించింది. ఐటీ పోర్టల్లో సమస్యలు ఎదురవుతున్నట్టు గత కొన్ని రోజులుగా వ్యక్తులు, చార్టర్డ్ అకౌంటెంట్లు సోషల్ మీడియా ద్వారా ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లారు. పన్ను చెల్లింపులు, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) డౌన్లోడ్లో సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొంటూ, గడువు పొడిగించాలని కోరారు. ముఖ్యంగా ఇ–ఫైలింగ్ పోర్టల్పై లాగిన్ కాలేకపోయామంటూ పలువురు అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. పెద్ద సంఖ్యలో రిటర్నులు..7 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలైనట్టు సీబీడీటీ ప్రకటించింది. 2025–26 అసెస్మెంట్ సంవత్సరానికి (2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) ఇంకా రిటర్నులు దాఖలు చేయని వారు వెంటనే ఆ పని పూర్తి చేయాలని సూచించింది. గత ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్లు) రిటర్నుల సమర్పణకు జూలై 31 గడువు తేదీ కాగా, దీన్ని సెపె్టంబర్ 15 వరకు పొడిగించడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. -
జీడీపీకి ఏఐ దన్ను!
న్యూఢిల్లీ: పరిశ్రమలవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో ఉత్పాదకత, సిబ్బంది పని సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనితో 2035 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 500–600 బిలియన్ డాలర్ల మేర విలువ జత కాగలదని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. వచ్చే దశాబ్దకాలంలో వివిధ రంగాలవ్యాప్తంగా ఏఐ వినియోగంతో గ్లోబల్ ఎకానమీకి 17–26 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల విలువ జతవుతుందని పేర్కొంది. భారీ సంఖ్యలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) నైపుణ్యాలున్న సిబ్బంది లభ్యత, పరిశోధన..అభివృద్ధి వ్యవస్థ విస్తరిస్తుండటం, డిజిటల్..సాంకేతిక సామర్థ్యాలు మెరుగుపడుతుండటం తదితర అంశాలు అంతర్జాతీయ ఎకానమీలో భారత్ కీలకపాత్ర పోషించేందుకు తోడ్పడగలవని నివేదిక తెలిపింది. గ్లోబల్ ఏఐ విలువలో భారత్ 10–15 శాతం వాటాను దక్కించుకోవచ్చని వివరించింది. ఆవిష్కరణలను ప్రోత్సహించాలి: నిర్మల అందరికీ మేలు చేసే టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా నియంత్రణలు ఉండాలే తప్ప వాటిని అణచివేసే విధంగా ఉండకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఏఐ టెక్నాలజీలను వినియోగించడమే కాకుండా వాటిని వివిధ రంగాలు బాధ్యతాయుతంగా ఉపయోగించుకునేలా చూడటంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ఏఐ అనేక మార్పులకు లోనవుతూ, చాలా వేగంగా పురోగమిస్తోందని మంత్రి చెప్పారు. టెక్నాలజీ పరుగుకు అనుగుణంగా నియంత్రణలు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధి వేగం పుంజుకోవాలంటే ఉత్పాదకత పెరగాలని, ఇందుకోసం పరిశ్రమలు ఏఐని తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు, మన జీవన విధానాన్ని కృత్రిమ మేధ గణనీయంగా మార్చేయనున్న నేపథ్యంలో ఏఐ టెక్నాలజీలో భారత్ ముందుండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.నివేదికలో మరిన్ని విశేషాలు..→ నిర్ణయాలు తీసుకోవడం, వసూళ్లు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ రూపురేఖలను ఏఐ సిస్టమ్లు మార్చివేయగలవు. ప్రత్యామ్నాయ డేటా వనరులను ఉపయోగించి బ్యాంకులు రుణాలపై మరింత కచి్చతత్వంతో, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా ఏఐ వినియోగం ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాలకు సంబంధించిన సవాళ్లు సుమారు మూడో వంతు పరిష్కారం కాగలవు. → టెక్నాలజీ సరీ్వసుల్లో కొత్త ఆవిష్కరణలు.. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయి. → ప్రస్తుత 5.7 శాతం వృద్ధి రేటు ప్రకారం 2035 నాటికి భారత జీడీపీ 6.6 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ ఆకాంక్షిస్తున్నట్లుగా 8 శాతం వృద్ధి సాధిస్తే మరో 1.7 ట్రిలియన్ డాలర్లు పెరిగి 8.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. → ఏఐతో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నప్పటికీ, దీనితో ప్రస్తుతం ఉన్న అనేక ఉద్యోగాలు తగ్గుతాయి. ప్రధానంగా క్లరికల్, రొటీన్ పనులు, నైపుణ్యాలు అంతగా అవసరంలేని ఉద్యోగాలు ఈ జాబితాలో ఉంటాయి. ఆర్థిక సేవలు, తయారీ రంగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2035 నాటికి ఆయా రంగాల జీడీపీ విలువలో కృత్రిమ మేథ వాటా దాదాపు 20–25 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ఏఐ ఆధారిత ఉత్పాదకత, సామర్థ్యాల మెరుగుదలతో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో 50–55 బిలియన్ డాలర్ల అవకాశాలు లభిస్తాయని రిపోర్ట్ వివరించింది. -
హైదరాబాద్లో అంతర్జాతీయ యుఎక్స్ఇండియా సదస్సు
మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. 21వ అంతర్జాతీయ యూఎక్స్ఇండియా25 సదస్సు (UXINDIA 2025) ఈ నెల 18 నుంచి 20 వరకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరుగనుంది. ఈ సదస్సులో 1,400 మందికి పైగా ప్రతినిధులు, 80 మందికి పైగా నిపుణులు, 10 మంది ప్రధాన వక్తలు పాల్గొననున్నారు.బెంగళూరులో రెండు ఎడిషన్స్ తర్వాత, యుఎక్స్ఇండియా హైదరాబాద్ను డిజైన్ సంభాషణ, ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం థీమ్, ‘డిజైన్: ఒక జీవన విధానం’ వ్యవస్థాపకత భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు, వెంచర్లను రూపొందించడంలో డిజైన్, కృత్రిమ మేధస్సుల శక్తివంతమైన కలయికను ఇది తెలియజేస్తుంది.ఈ కార్యక్రమంలో డిజైన్ ప్రదర్శనలు ఉంటాయి. వీటిలో కొత్త ఆవిష్కరణలతో కూడిన వ్యాపార ఆలోచనలను యువ వ్యాపారవేత్తలు పెట్టుబడిదారుల ముందు ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ప్రపంచ నాయకులు మాత్రమే పాల్గొనే ప్రత్యేక వేదికలో వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా 2030 నాటికి ఒక మిలియన్ మహిళలకు డిజైన్ విద్య అందించాలన్న యూఎంఓ లక్ష్యం దిశగా, మహిళా డిజైనర్ల పాత్రపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు.మైక్రోసాఫ్ట్, క్యాండెసెంట్, కాగ్నిజెంట్, ఫ్రెష్వర్క్స్, ఫిలిప్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు డిజైన్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై చర్చించనున్నారు. అలాగే, ఉత్పత్తులు, ఆవిష్కరణలలో వేగంగా ఎదుగుతున్న కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యం పొందనుంది. “ఈ ఏడాది యూఎక్స్ ఇండియా సదస్సు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు,” అని యూఎంఓ డిజైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాపు కలాధర్ అన్నారు. -
'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్కార్ట్
భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన వార్షిక అట్టహాసమైన షాపింగ్ ఫెస్టివల్ 'ది బిగ్ బిలియన్ డేస్ (TBBD) 2025' తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుండగా, ఫ్లిప్కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు సెప్టెంబర్ 22న అంటే 24 గంటల ముందే ప్రత్యేక యాక్సెస్ లభించనుంది. సెప్టెంబర్ 8న ప్రారంభమైన ‘అర్లీ బర్డ్ డీల్స్’ ఇప్పటికే బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఉత్సాహాన్ని కలిగించాయి.ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ను భారత్లోని అత్యంత వేగవంతమైన డెలివరీ సేవ అయిన ‘ఫ్లిప్కార్ట్ మినిట్స్’ కూడా భాగస్వామ్యం చేయనుంది. 19 నగరాల్లో 3,000 పిన్కోడ్లకు 10 నిమిషాల్లో డెలివరీ అందించనుంది. అదేవిధంగా, స్మార్ట్ఫోన్లు, ఏఐ ల్యాప్టాప్లు, 4కే టీవీలు, కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వంటి ప్రీమియం ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరలకు లభించనున్నాయి.ఫ్లిప్కార్ట్ ఈ ఫెస్టివ్ సీజన్లో అభివృద్ధి చెందుతున్న నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. షాప్సీ ద్వారా రూ.29/- నుండి ప్రారంభమయ్యే డీల్స్, 100% సూపర్ కాయిన్ల రివార్డ్స్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. సప్లై చైన్ విభాగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, 400 కొత్త మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వేగవంతమైన డెలివరీకి మార్గం వేసింది.ఇతర బ్యాంకింగ్ భాగస్వామ్యాలు, క్యాష్బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, యూపీఐ డిస్కౌంట్లు మొదలైన వాటితో ఫ్లిప్కార్ట్ ఈ బిగ్ బిలియన్ డేషస్ను ఇండియా డిజిటల్ ఫ్యూచర్కి దారితీసే వేడుకగా మార్చేందుకు సిద్ధమైంది. -
తొలి ప్రైవేట్ స్టార్టప్ పార్క్.. గ్రామీణ యువకుడి ప్రయత్నం
భారతదేశంలో స్టార్టప్లు ఎదుర్కొంటున్న వ్యవస్థాపిత అవరోధాలను తొలగించేందుకు ఒక యువ పారిశ్రామికవేత్త ముందుకొచ్చాడు. గ్రామీణ కేరళకు చెందిన షఫీ షౌఖత్.. బెంగళూరులో రూ.600 కోట్లు విలువ చేసే స్టార్టప్ పార్క్ను స్థాపించి దేశవ్యాప్తంగా వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయగల నూతన వ్యవస్థను నిర్మిస్తున్నారు.గ్రామం నుంచి గ్లోబల్ దిశగా..స్టార్టప్లకు అవసరమైన మార్గనిర్దేశం, పెట్టుబడులు వంటి వనరులేవీ లేని కేరళలోని ఒక చిన్న గ్రామంలో షఫీ షౌఖత్ పెరిగారు. ఈ అనుభవం కారణంగా, తాను ఏర్పాటుచేసే స్టార్టప్ పార్క్లో ప్రతి సమస్యకు ప్రత్యేక పరిష్కార మార్గాలు ఉండేలా, “ప్రాబ్లం-ఫస్ట్ ఫ్రేమ్వర్క్”ను రూపొందించారు.“సాధారణ ప్రోగ్రామ్స్ తో యూనిక్ సమస్యలు పరిష్కరించలేము” అని చెప్పే షౌఖత్ “ఎగ్జిక్యూషన్ ఆధారంగా, మెజరబుల్ ఇంపాక్ట్ వచ్చే విధంగా వ్యవస్థలు రూపొందించాలి” అంటున్నారు.స్టార్టప్ పార్క్ లక్ష్యాలుదేశవ్యాప్తంగా ఉన్న యువ వ్యవస్థాపకులను అనుసంధానించడంవ్యక్తిగత అవసరాలకు తగిన మెంటార్షిప్, పెట్టుబడి అవకాశం కల్పించడంప్రభుత్వాల కోసం పాలసీ ప్రయోగశాలగా పనిచేయడంపెట్టుబడిదారులకు డేటా ఆధారంగా దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించడంలో సహకారంనెక్స్ట్ లీడర్స్ ప్రోగ్రామ్షౌఖత్ ప్రారంభించిన నెక్స్ట్ లీడర్స్ ప్రోగ్రామ్కు ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది. ఇందులో హై-పొటెన్షియల్ వ్యక్తుల ఎంపిక, వారి ప్రతిభకు తగ్గ స్టార్టప్ అనుభవం, పరిశ్రమ ప్రముఖుల నుంచి స్రాటెజిక్ మార్గదర్శనం, పెట్టుబడిదారులు, పాలిసీ మేకర్లు ఉన్న నెట్వర్క్ను అందుబాటులోకి తేవడం వంటివి ఉన్నాయి.భారత స్టార్టప్ భవిష్యత్తుకు కొత్త నమూనాసాధారణ ఇంక్యుబేటర్ల కన్నా షౌఖత్ రూపొందిస్తున్న ఈ మోడల్ ఒక కొత్త దిశను సూచిస్తుంది. ఇది సిద్ధాంతాల కంటే కార్యాచరణకు, వెయిన్ గణాంకాల కంటే నిజమైన ప్రభావానికి, పోటీ కంటే భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది.ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఈ మోడల్ను అధ్యయనం చేస్తుండటం గమనార్హం. భారతదేశం 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల స్టార్టప్ ఆర్థికవ్యవస్థగా అభివృద్ధి చెందబోతున్న సమయంలో, షఫీ షౌఖత్ తీసుకుంటున్న అడుగులు దేశం భవిష్యత్తు పారిశ్రామికతకు ఒక శక్తివంతమైన బేస్గా నిలవవచ్చునన్న అంచనాలు ఉన్నాయి. -
ప్రపంచంలో కార్మిక కొరత.. భారత్కు మంచి అవకాశం
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్ గా ఎదగడానికి భారతదేశానికి సువర్ణ అవకాశం ఉందని గతి (GATI) ఫౌండేషన్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) నివేదిక పేర్కొంది.ఈ నివేదిక ప్రకారం.. 2047 నాటికి, ప్రపంచ కార్మిక కొరత 200-250 మిలియన్లకు (20 కోట్ల నుంచి 25 కోట్లు) చేరుకుంటుందని అంచనా. అంటే అంత మంది కార్మికుల అవసరం ఏర్పడుతుందని అర్థం. యువ జనాభా, పెరుగుతున్న శ్రామిక శక్తితో భారతదేశం ఈ అంతరాన్ని పూరించడంలో సహాయపడటానికి బలమైన స్థితిలో ఉంది.5 కోట్ల ఉద్యోగ అవకాశాలు యూఎస్, యూకే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు వృద్ధాప్య జనాభా కారణంగా తక్కువ మంది యువ కార్మికులను చూస్తున్నాయి. దీంతో ఇది మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టపోతుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. వాటిలో కనీసం కోటి ఉద్యోగాలను భారత్ భర్తీ చేయగలదు.భారత్కు పెద్ద అనుకూలతభారతదేశంలో 18-40 సంవత్సరాల వయస్సు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయస్సు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాలలో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు ఇంటికి పంపుతున్నారు.మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది.చేయాల్సిందిదే..ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటే కొన్నింటిని మెరుగుపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయేవిధంగా కార్మికుల నైపుణ్యాలు, శిక్షణను మెరుగుపరచడం.వేగవంతమైన, సురక్షితమైన, మరింత పారదర్శక వలస వ్యవస్థలను నిర్మించడం.ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ, తయారీ వంటి రంగాలపై దృష్టి పెట్టడం.విదేశాలకు వెళ్లే కార్మికుల కోసం నైతిక, డిజిటల్-ఫస్ట్ ఉద్యోగ మార్గాలను సృష్టించడం. -
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్లు
వివిధ మార్కెట్క్యాప్లవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే ‘ఫ్లెక్సీ క్యాప్ ఫండ్’ను ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) సెప్టెంబర్ 24న ప్రారంభమై అక్టోబర్ 8న ముగుస్తుంది. ఇది తమ తొలి ఫండ్ అని సంస్థ ఎండీ మధు లూనావత్ తెలిపారు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుందని, నిఫ్టీ 500 టీఆర్ఐ దీనికి బెంచ్మార్క్గా ఉంటుందని పేర్కొన్నారు.ప్రైవేట్ ఈక్విటీ సంస్థల తరహాలో కూలంకషంగా అధ్యయనం చేసి ఫండమెంటల్స్, వేల్యుయేషన్లు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని మధు వివరించారు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పాంటోమత్ గ్రూప్లో ది వెల్త్ కంపెనీ భాగంగా ఉంది. పలు ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్ (ఏఐఎఫ్)ను కూడా నిర్వహిస్తోంది.హెచ్డీఎఫ్సీ ‘డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్’ ఎఫ్వోఎఫ్ .. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 24 వరకు అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్క్యాప్లవ్యాప్తంగా దేశీయంగా ఈక్విటీ ఆధారిత స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.పలు ఫండ్ మేనేజర్ల అనుభవం, వివిధ రకాల పెట్టుబడుల ధోరణులు, క్రమశిక్షణతో కూడుకున్న రీబ్యాలెన్సింగ్ ప్రయోజనాలన్నింటినీ ఈ ఒక్క ఫండ్తో పొందవచ్చని హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ నవ్నీత్ మునోట్ తెలిపారు. ఎన్ఎఫ్వో వ్యవధిలో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.ఇదీ చదవండి: జియో బ్లాక్రాక్ తొలి ఫండ్.. -
ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు విడుదల
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎఫ్ 31 సిరీస్ను భారత్లో లాంచ్ చేసింది. ఎఫ్ 31, ఎఫ్ 31 ప్రో, ఎఫ్ 31 ప్రో ప్లస్ అనే మూడు మోడళ్ల స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లన్నీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అన్నింటిలోనూ ఏఐ ఆధారిత ఫీచర్లు చాలానే ఇచ్చారు. వాటి స్పెసిఫికేషన్లు ఏంటి.. ధరలు ఎంత.. ఎక్కడ కొనుక్కోవాలి.. తదితర వివరాలను ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.ఒప్పో ఎఫ్31 5జీ సిరీస్ ధరలు, లభ్యతఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.34,999. హిమాలయన్ వైట్, జెమ్స్టోన్ బ్లూ, ఫెస్టివల్ పింక్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. అదే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. డెసెర్ట్ గోల్డ్, స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.ఒప్పో ఎఫ్31 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.22,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.24,999. క్లౌడ్ గ్రీన్, మిడ్నైట్ బ్లూ, బ్లూమ్ రెడ్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో, ఎఫ్31 ప్రో ప్లస్ స్టార్ట్ఫోన్లు సెప్టెంబర్ 19 నుంచి ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఒప్పో ఎఫ్ 31 5జీ మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది.ఆఫర్లుఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా బ్యాంకుల ఎంపిక చేసిన కార్డులను ఉపయోగించుకుంటే 10 శాతం వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది. 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ వినియోగించుకోవచ్చు. ప్రమాదవశాత్తు డ్యామేజీ అయితే 180 రోజుల ఉచిత కేర్ ఉంటుంది. ఇవి కాక ఆరు నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ప్లాన్ లు, మొదటి రోజు ప్రీ-బుక్ లేదా కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన కార్డులు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ లపై బ్యాంక్ డిస్కౌంట్ వంటివి ఉంటాయి.స్పెసిఫికేషన్లుమూడు మోడళలోనూ కొన్ని ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ప్రో ప్లస్ 6.8-అంగుళాల డిస్ప్లే, మిగిలిన రెండు 6.5-అంగుళాల స్క్రీన్లను కలిగి ఉన్నాయి. అన్నింటికీ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటు ఉంటుంది. ప్రతి ఫోన్లోనూ 80వాట్ల సూపర్వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అన్ని ఫోన్లూ క్వాల్కామ్ స్నాప్గ్రాడన్ 7 జెన్ 3 చిప్సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై పనిచేస్తాయి. ఇక కీలకమైన కెమెరా విషయానికి వస్తే ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ ఫోన్లకు ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇవ్వగా ఒప్పో ఎఫ్31 5జీ ఫోన్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రియర్ కెమెరా మాత్రం అన్ని ఫోన్లకూ ఒకేలా 50ఎంపీ + 2ఎంపీ ఇచ్చారు.ఇదీ చదవండి: ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు విడుదల.. భారీ బ్యాటరీతో ప్రత్యేక ఫీచర్లు -
‘టీసీఎస్లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ చుట్టూ రోజుకో వివాదం రేగుతోంది. భారీగా లేఆఫ్ల ప్రకటనతోపాటు ఆ సంస్థలో బలవంతంగా రాజీనామాలు, ఉద్యోగ విరమణలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మరో ఉద్యోగి తనను రాజీనామా చేయాలని బలవంతం చేశారని ఆరోపిస్తున్నారు.ఈ మేరకు ప్రొఫెషనల్ సామాజిక ప్లాట్ఫామ్ రెడిట్లో షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. 3,000 కు పైగా అప్ ఓట్లు, వందలాది కామెంట్లు వచ్చాయి. ఇది దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థలలో ఒకటైన టీసీఎస్లో విషపూరిత పద్ధతులపై విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది.తనను టీసీఎస్లో జూనియర్ టెక్ ఉద్యోగిగా చెప్పుకొన్న రెడిటర్ అదే తన మొదటి ఉద్యోగంగా పేర్కొన్నారు. మూడు రోజుల ముందు మీటింగ్ హాల్కు పిలిచి అక్కడ తనను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని హెచ్ఆర్ ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. అయితే తాను రాజీనామా చేయడానికి నిరాకరించానని, అందుకు తనను టర్మినేట్ చేసి వ్యతిరేక రివ్వూలు ఇస్తానని బెదిరించారని, అయినప్పటికీ తాను రాజీనామా చేయను.. మీకు నచ్చినట్లు చేసుకోండని చెప్పానని రాసుకొచ్చారు.అంతేకాక సంస్థలో పని వాతావరణం గురించి కూడా పలు ఆరోపణలు చేశారు. జీతం చాలా తక్కువే అయినా దాని వర్క్ కల్చర్, ఉద్యోగ భద్రత కారణంగా తాను టీసీఎస్ లో చేరానని, కానీ దానికి ఇప్పుడు చింతిస్తున్నానని వాపోయారు. ‘రతన్ టాటా తరువాత, ఈ కంపెనీ గందరగోళానికి గురైంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు! -
భారత్లో రూ.22.98 లక్షల బైక్ లాంచ్
లగ్జరీ మోటార్సైకిల్ బ్రాండ్ అయిన డుకాటి.. '2025 మల్టీస్ట్రాడా వీ4'ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ అడ్వెంచర్ టూరర్ ప్రారంభ ధర రూ. 22.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిని కొత్త అప్డేట్లతో పాటు.. మెరుగైన ఇంధన సామర్థ్యం అందించేలా కూడా నిర్మించారు.2025 డుకాటి మల్టీస్ట్రాడా వీ4.. డబుల్ ఫ్రంట్ హెడ్లైట్ పొందుతుంది. రైడర్ కాళ్లకు ఎక్కువ స్పేస్ అందించడానికి.. పన్నీర్లు, టాప్ కేస్ వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: హైబ్రిడ్ vs ఎలక్ట్రిక్ కార్లు: ప్రయోజనాలుమల్టీస్ట్రాడా వీ4 బైక్.. 6.5 ఇంచెస్ ఫుల్ TFT కలర్ స్క్రీన్, 4 పవర్ మోడ్లు, 5 రైడింగ్ మోడ్లు (స్పోర్ట్, టూరింగ్, అర్బన్, వెట్, ఎండ్యూరో), డుకాటి వెహికల్ అబ్జర్వర్ (DVO), డుకాటి వీలీ కంట్రోల్ (DWC), డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (DTC), ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ (EBC), క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది 1,158cc గ్రాంటురిస్మో ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 170 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఎటువంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు మందగించాయి. అయితే ఈ వారం చివర్లో రానున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై ట్రేడర్లు దృష్టి సారించారు. ముగింపులో బీఎస్ఈ సెన్సెక్స్ 118.96 పాయింట్లు లేదా 0.15 శాతం స్వల్పంగా తగ్గి 81,785.74 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 44.8 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టపోయి 25,069.2 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ ఇండెక్స్ లో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టైటాన్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్స్ లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ (జొమాటో), అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.అయితే, విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.44 శాతం, 0.76 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 2.41 శాతం పెరిగి టాప్ గెయినర్ గా ఉంది. ఫ్లిప్ సైడ్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.58 శాతం, నిఫ్టీ ఫార్మా 0.64 శాతం క్షీణించాయి. -
కళ్లజోడుకు గుడ్బై?: సర్జరీ లేకుండా.. రెండేళ్లు!
వయసు పెరిగే కొద్దీ.. దాదాపు అందరికీ ప్రెస్బయోపియా (కంటిచూపు లోపం) వస్తుంది. అప్పుడు చదవడం లేదా ఫోన్ను ఉపయోగించడం వంటి క్లోజప్ విషయాలపై దృష్టి పెట్టడం కొంత కష్టతరమవుతుంది. దీనికోసం రీడింగ్ గ్లాసెస్పై ఆధారపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరిశోధకులు ప్రత్యేక కంటి చుక్కలను తయారు చేశారు. ఇది కొంతకాలం పాటు గ్లాసెస్ను వదిలించుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిరెండు సంవత్సరాల పాటు జరిగిన ఒక అధ్యయనంలో.. కంటి చుక్కలను తయారు చేశారు. వీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల, కళ్లజోడుతో పనిలేకుండానే చిన్న అక్షరాలను చదివే సామర్థ్యం మెరుగుపడిందని తేలింది. అధ్యయనంలో.. చాలా మంది వ్యక్తులు చుక్కలను ఉపయోగించిన తర్వాత ప్రామాణిక కంటి చార్టులో (జేగర్ చార్ట్) రెండు లేదా అంతకంటే ఎక్కువ అదనపు పంక్తులను చదవగలిగారు. ఈ చుక్కలను ఉపయోగించడం వల్ల.. రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిని పొందవచ్చని చెబుతున్నారు.ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్స్ (ESCRS)లో ప్రచురించారు. కంటి చూపు పెరగడానికి ఉపయోగించే.. చుక్కల మందులో పైలోకార్పైన్ (కన్ను దగ్గరగా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది), డైక్లోఫెనాక్ (కొంతమందికి కలిగే చికాకును నివారించడంలో సహాయపడుతుంది) ఉపయోగించినట్లు వెల్లడించారు.రోజుకు రెండుసార్లుసాధారణంగా ప్రజలు.. రోజుకు రెండుసార్లు చుక్కలను ఉపయోగిస్తారు. అవసరమైతే మూడవ మోతాదును కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రెస్బయోపియా (Presbyopia) ప్రభావాన్ని బట్టి.. రోజుకు ఎన్నిసార్లు ఉపయోగించాలనేది నిర్దారించడం జరుగుతుంది. ప్రెస్బయోపియా తీవ్రత తక్కువగా ఉంటే తక్కువసార్లు, ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ కోసం ఎక్కువసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికకంటి చూపు మందగించడం వల్ల.. కొంతమంది ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ వద్దనుకుని, సరళమైన పద్దతిలో సమస్య పరిష్కరించుకోవడానికి ఈ చుక్కల మందు ఉపయోగపడుతుంది. అయితే ప్రెస్బయోపియా ప్రభావం తగ్గించడానికి ఉపయోగించే చుక్కల మందు వల్ల.. స్వల్ప చికాకు లేదా తేలికపాటి తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలను నిర్మూలించడానికి మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు. -
జియో బ్లాక్రాక్ తొలి ఫండ్..
జియోబ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ తొలి యాక్టివ్ ఈక్విటీ ఫండ్ ‘జియోబ్లాక్రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్’ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 23న ప్రారంభం కానుంది. ‘‘ఇది మాకు తొలి యాక్టివ్ ఫండ్ అవుతుంది. మరో మూడు నాలుగు యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్ కూడా త్వరలో రానున్నాయి. ఈటీఎఫ్లను సైతం తీసుకొస్తాం’’అని జియోబ్లాక్రాక్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రిషి కోహ్లీ ప్రకటించారు.అంతర్జాతీయంగా నిరూపితమైన ఎస్ఏఈ ప్లాట్ఫామ్పై దీన్ని నిర్మించామని, 400 సంకేతాల ఆధారంగా, టెక్నాలజీ సాయంతో పెట్టుబడులు పెట్టనున్నట్టు, దీనివల్ల వ్యక్తుల ప్రమేయానికి సంబంధించి రిస్క్ తగ్గుతుందని జియోబ్లాక్రాక్ తెలిపింది.నష్టాల రిస్క్ను పరిమితం చేయడం, స్థిరమైన రాబడిని తెచ్చిపెట్టడం జియోబ్లాక్రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ లక్ష్యమని పేర్కొంది. జియోబ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ అన్నది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్రాక్ ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్ కంపెనీ కావడం గమనార్హం. -
జీఎస్టీ తగ్గింపుతో 140 కోట్ల మందికి ప్రయోజనం
కొత్త జీఎస్టీ సవరణల్లో భాగంగా 350కు పైగా వస్తువుల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకున్నామని, దీనివల్ల 140 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ తగ్గింపు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. చెన్నై ఆళ్వార్పేటలోని మ్యూజిక్ అకాడమీలో ఆదివారం ‘జీఎస్టీ సంస్కరణలు – రైజింగ్ ఇండియా కోసం పన్ను సంస్కరణలు’ అనే అంశంపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దీపావళికి ముందు జీఎస్టీ తగ్గింపు వల్ల వస్తువుల కొనుగోళ్లు మరింత వేగం పుంజుకుంటాయన్నారు. నిత్యావసర వస్తువులకు జీఎస్టీని తగ్గించడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు మరింత లాభం చేకూరుతుందన్నారు. జీఎస్టీ పన్ను సంస్కరణల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి సంస్థ ఈ తగ్గింపును ప్రజల్లో తీసుకెళ్తుందన్న నమ్మకం ఉందన్నారు.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
హైబ్రిడ్ vs ఎలక్ట్రిక్ కార్లు: ప్రయోజనాలు
భారతదేశంలో ఫ్యూయెల్ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా కొందరు వీటిని ఎంచుకుంటారు. ఈ కథనంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు గురించి తెలుసుకుందాం.హైబ్రిడ్ కార్లుహైబ్రిడ్ కార్లు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE)ను విద్యుత్ మోటారుతో కలుపుతాయి. ఎంచుకునే హైబ్రిడ్ రకాన్ని బట్టి.. ఆ కారు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటరుతో నడుస్తుంది. ఇవి మైల్డ్ హైబ్రిడ్ (చిన్న ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్కు సపోర్ట్), ఫుల్ హైబ్రిడ్ (ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పనిచేస్తాయి), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పెద్ద బ్యాటరీ, ప్లగ్ ద్వారా చార్జ్ చేయవచ్చు) అని మూడు రకాలుగా ఉంటాయి.ప్రయోజనాలు●ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగపడతాయి.●పూర్తిగా ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా కాకుండా.. హైబ్రిడ్ కార్లకు ఇంధన స్టేషన్లలో ఫ్యూయల్ నింపుకోవచ్చు.●సాంప్రదాయ కార్ల కంటే తక్కువ ఉద్గారాలు వెలువడతాయి.●సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లుఎలక్ట్రిక్ కార్లుఇవి పూర్తిగా బ్యాటరీలతోనే నడుస్తాయి. వీటిని మళ్ళీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. వీటికోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.ప్రయోజనాలు●తక్కువ నిర్వహణ ఖర్చు●పన్ను ప్రయోజనాలు, సబ్సిడీల వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయి●సైలెంట్ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు. ఇందులో ఇంజిన్ లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది.●ఉద్గారాలు సున్నా శాతం, కాలుష్య కారకాలు విడుదల కావు. -
సెస్ల లక్ష్యం నీరుగారుతోందా?
కేంద్రం సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులను అమలు చేస్తున్న నేపథ్యంలో సెస్లను సవ్యంగా ఉపయోగించుకోవడం పట్ల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సెస్లు.. నిర్దిష్ట ప్రయోజనాల కోసం ప్రభుత్వం విధించే అదనపు పన్నులు. అయితే వీటి వినియోగంపై పారదర్శకత చాలా కాలంగా చర్చకు దారితీస్తోంది. విద్య, ఆరోగ్యం లేదా మౌలిక సదుపాయాలు వంటి ప్రజా సంక్షేమం కోసం నిధులకు ఉద్దేశించినవే ఈ సెస్లు. చాలా సేవలపై ప్రభుత్వం విధిస్తున్న సెస్లు వాటికి ఉద్దేశించిన ప్రయోజనాన్ని అందించడంలో విఫలమవుతున్నాయనే వాదనలున్నాయి.రాష్ట్రాలను పక్కదారి పట్టించే సాధనంగా..ఇతర పన్నుల మాదిరిగా కాకుండా, ఆదాయశాఖ నియమాల ప్రకారం.. సెస్లు, సర్ఛార్జీలు రాష్ట్రాలతో పంచుకునేందుకు వీలుండదు. వీటిపై పూర్తి అధికారం కేంద్రానిదే. వాస్తవానికి దశాబ్దాల నుంచి సెస్లు వివిధ విభాగాల్లో పెరుగుతూ వస్తున్నాయి. 2018 అధ్యయనం ప్రకారం.. 1944 నుంచి 44 విభిన్న సెస్లను గుర్తించారు. 2017లో జీఎస్టీని ప్రారంభించినప్పుడు 26 సెస్లను రద్దు చేసి, ఉన్నవాటిలో కొన్నింటి రేట్లను పెంచారు. ఈ సెస్ల్లో రాష్ట్రాల ఆదాయ లోటును భర్తీ చేయడానికి సిన్ గూడ్స్, లగ్జరీ వస్తువులపై వసూలు చేసే పరిహార సెస్ (జీసీసీ) ఒక్కదాన్ని మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటున్నారు.పర్యవేక్షణ కరవు..రాజ్యాంగంలోని ఆర్టికల్ 270, 271 సెస్లను ప్రస్తావించినప్పటికీ వాటి వినియోగం అస్పష్టంగా ఉంది. సెస్ల నుంచి సమకూరే నిధులు కన్సాలిడేటెడ్ ఫండ్కు కాకుండా పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాకు వెళ్తున్నాయి. ఈ యంత్రాంగం ద్వారా సెస్ నిధులను ఆయా విభాగాలు, విద్య, వైద్య, ఇతర మౌలిక సదపాయాలు సృష్టించేందుకు కేటాయించాలి. కానీ బడ్జెట్ పరిశీలనలో వీటి ఊసే ఎత్తడం లేదనే వాదనలున్నాయి.ఆడిట్ చేయకపోతే అంతే సంగతులు..కన్సాలిడేటెడ్ ఫండ్ కేటాయింపులతోపాటు పబ్లిక్ అకౌంట్ ఫండ్స్పై కఠినమైన పర్యవేక్షణ ఉండదనే అభిప్రాయాలున్నాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆడిట్ చేయకపోతే వీటిపై అసలు రివ్యూనే చేయరని కొందరు భావిస్తున్నారు. ఇటీవల కాగ్ నివేదిక ఈ సమస్యను హైలైట్ చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సెస్లు, సర్ఛార్జీల నుంచి రూ.4.88 లక్షల కోట్లు సేకరించింది. ఇది స్థూల పన్ను ఆదాయంలో 14 శాతంగా ఉంది. అయితే ఇందులో రూ.3.57 లక్షల కోట్లు సెస్ ద్వారానే సమకూరింది. అయినప్పటికీ ఈ నిధులను నిబంధనల ప్రకారం ఉద్దేశించిన ప్రయోజనాల కోసం ఉపయోగించారా.. లేదా.. అనే దానిపై పారదర్శకత లోపించిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చమురుపై విధిస్తోన్న సెస్ ద్వారా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2.95 లక్షల కోట్లు సమకూరింది. అందులో కేవలం రూ.902 కోట్లు మాత్రమే చమురు పరిశ్రమ అభివృద్ధి నిధి (OIDB)కు బదిలీ చేశారు.ఇదీ చదవండి: వారం రోజులుగా ఖాళీగా ఉంటున్న ట్రక్కు డ్రైవర్లు -
వ్యాపారస్తులకు ఊహాజనిత పన్నులు
లెక్కలు, స్టేట్మెంట్లు రాయకుండా, వోచర్లు లేకుండా, పుస్తకాలు నిర్వహించకుండా కేవలం టర్నోవర్, వసూళ్ల మీద కొంత శాతం అంటే నిర్దేశిత శాతం లేదా అంత కన్నా ఎక్కువ శాతాన్ని నికర లాభంగా డిక్లేర్ చేసే వెసులుబాటు/విధానాన్ని ‘ఊహాజనిత పన్ను విధానం’ అని అంటారు. ఆంగ్లంలో Presumptive Taxationగా పిలుస్తారు.ఒక సంవత్సర టర్నోవర్ మీద 8% అనుకొండి. కేవలం 8% మొత్తాన్ని నికర ఆదాయంగా పరిగణిస్తారు. మీరు లెక్కలు నిర్వహించి, శ్రమపడి, ఏ లెక్కలూ తేల్చాల్సిన అవసరం లేదు. టర్నోవర్ మీద 8% లేదా అంతకంటే ఎక్కువగా.. 9 శాతం, 10 శాతం, 11 శాతం ఇలా ఎంతైనా స్వచ్ఛందంగా మీకు నచ్చిన రేటు ప్రకారం నికర ఆదాయం లెక్కించుకోవచ్చు. ఇది ఎవరికి వర్తిస్తుంది.➤రెసిడెంట్ వ్యక్తికి ➤రెసిడెంట్ హిందూ ఉమ్మడి కుటుంబానికి ➤రెసిడెంట్ భాగస్వామ్య సంస్థలకిక్లుప్తంగా చెప్పాలంటే ఈ పద్దతి నాన్ రెసిడెంట్లకు వర్తించదు. నిర్దేశిత ఇండ్రస్టియల్ జోన్లు, ప్రాంతాల్లోని వ్యాపారానికి వర్తించదు. ఇది కాకుండా వాహనాలు అద్దెకు నడిపేవారు, ఏజెన్సీ వ్యాపారం చేసేవారు, కమీషన్, బ్రోకరేజ్లకు ఇది వర్తించదు. అంతేకాకుండా సంవత్సరపు టర్నోవర్/వసూళ్లు రూ.2 కోట్లు దాటిన వాటికి వర్తించదు. చిరు వ్యాపారస్తులకు ఊరటగా ఈ వెసులుబాటు కల్పించారు. జీఎస్టీ చట్టంలో చిన్న చిన్న వ్యాపారస్తులకు రికార్డుల నిర్వహణలోగానీ, రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియకి గానీ, వర్తించే రేటు విషయంలో ఎటువంటి వెసులుబాటు లేదు. ఆదాయపు పన్ను శాఖ వారిని అభినందించాలి. ఇది నిజంగా చాలా పెద్ద ఉపశమనం అని చెప్పాలి.నగదు వ్యవహారాలు చేయకపోతే మంచిదినగదు రహిత వ్యవహారాల విషయంలో మరింత రిలీఫ్ కల్పించారు. మొత్తం టర్నోవర్లో వ్యవహారాలు బ్యాంకు ద్వారా జరిగి, కేవలం 5% నగదు వస్తే పైన చెప్పిన పరిమితిని రూ.2 కోట్లుగా గాకుండా రూ.3 కోట్లుగా తీసుకుంటారు. నగదులో వసూళ్ళు లేదా రావడం అంటే ... నగదు, అకౌంటు పే కాని చెక్కు, అకౌంటు పే కాని బ్యాంకు డీ.డీ. దీనర్థం ఏమిటంటే బ్యాంకు అకౌంటు ద్వారా వ్యవహారాలు జరగాలి.ఊహాజనిత పన్ను రేటు 8%, 6 శాతంమొత్తం అన్ని అమ్మకాలు/వసూళ్లు బ్యాంకు ద్వారా జరిగితే/జరిపితే.. ఆరుశాతం చొప్పున లెక్కిస్తారు. అలా కాకపోతే.. అంటే నగదు/బ్యాంకుల ద్వారా వసూళ్లు/అమ్మకాలు ఉంటే 8% చొప్పున లెక్కించాలి.ఊదాహరణగా మీ టర్నోవర్ రూ.2 కోట్లు అనుకొండి. ఈ మొత్తం అంతా బ్యాంకు ద్వారా వచ్చినట్లయితే రూ.2 కోట్ల మీద 6% అంటే రూ.12 లక్షలు. వసూళ్లు మిశ్రమం అయితే, 8% చొప్పున.. అంటే రూ.16 లక్షలు లేదా అంత కన్నా ఎక్కువ చూపించవచ్చు. 9%, 10%, 11 శాతం ఇలా మీ ఇష్టం. ఇలా లెక్కించిన మొత్తాన్ని ఆదాయం అని అంటారు. ఈ ఆదాయంలోంచి ఎటువంటి వ్యాపార ఖర్చులు, వ్యాపార సంబంధమైన, తరుగుదల మొదలైనవి తగ్గించరు. జీతాలు, భత్యాలు , కొనుగోళ్లు ఏ ఖర్చులు మినహాయించరు. కానీ ఈ ఆదాయంలోంచి మీరు పాత పద్దతిని ఎంచుకున్నట్లు అయితే సెక్షన్ 80 కేటగిరిలో తగ్గిస్తారు. మీరు 8% కన్నా ఎక్కువ శాతం కూడా డిక్లేర్ చేయొచ్చు.8% చొప్పున తీసుకుంటే.. 92% మీరు ఖర్చు చేసినట్లు పరిగణిస్తారు. ఓ వోచర్ చూపించక్కర్లేదు. ఓ బుక్ రాయాల్సిన అవసరం లేదు. మీ వ్యాపారం 8% లో (కొన్ని సందర్భాల్లో 6 శాతం) కూడా లాభం ఉండదనుకుంటే...మీరు కచ్చితంగా బుక్స్ నిర్వహించాలి. ఆ బుక్స్ను అడిట్ చేయించాలి. ఇలాంటి ఆడిట్ను, టాక్స్ ఆడిట్ అని అంటారు. ఒక్కసారి టాక్స్ ఆడిట్కి గురి అయితే అలా ఐదేళ్ల పాటు కొనసాగించాలి. ఒక సంవత్సరం 8% చొప్పున మరొక సంవత్సరం టాక్స్ ఆడిట్ కొనసాగించకూడదు. భాగస్వామ్య సంస్థలకు కొన్ని షరతులు వర్తిస్తాయి. టాక్స్ ప్లానింగ్ విషయానికొస్తే.. 8% కన్నా ఎక్కువ వచ్చే సందర్భంలో ఈ సెక్షన్ ప్రకారం 8 శాతానికి ఎంచుకోవడం ఉత్తమం. -
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
వలసదారులపై మొదటి నుంచే కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించారు. అంతే కాకుండా.. అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు, తాత్కాలికంగా తమ నిపుణులను తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ చర్య విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. సంక్లిష్ట ఉత్పత్తుల తయారీలో అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.ఓడలు, కంప్యూటర్లు, రైళ్లు, సెమీకండక్టర్లు వంటి క్లిష్టమైన ఉత్పత్తులను నిర్మించే విదేశీ కంపెనీలు.. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సొంత దేశాల నుంచి నిపుణులను తీసుకురావాలని ట్రంప్ అన్నారు. మనం ఇలా చేయకపోతే.. భారీ పెట్టుబడులను అమెరికా కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికఇతర దేశీయలను.. అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. మేము కంపెనీలను మాత్రమే కాకుండా.. వారి ఉద్యోగులను కూడా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. క్లిష్టమైన రంగాల్లో కూడా మన దేశం రాణిస్తుంది. ఇది దేశ భవిష్యత్ కూడా అని పేర్కొన్నారు. -
వారం రోజులుగా ఖాళీగా ఉంటున్న ట్రక్కు డ్రైవర్లు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ నిర్ణయం ట్రక్కు డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తున్న నేపథ్యంలో కీలక రంగాల్లోని తయారీదారులు, డీలర్లు.. ముఖ్యంగా ఆటోమొబైల్స్, వైట్ గూడ్స్ పంపిణీలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది ట్రక్కులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జీఎస్టీ అమలు తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయని నమ్ముతున్న తరుణంలో ఈమేరకు సరఫరా స్తంభించినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 22 తర్వాత తిరిగి ఈ వస్తువుల రవాణా ప్రారంభమవుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.వేచి ఉండాల్సిందే..జీఎస్టీ 2.0 అమలు దగ్గరపడుతుండడం, త్వరలో ధరలు తగ్గుతాయనే భావనతో కొత్త కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో గత వారంలో సరుకు రవాణా రేట్లు 30-35% పడిపోయాయి. సాధారణంగా చెన్నై తయారీ కేంద్రాల నుంచి భారతదేశం అంతటా కొన్ని కంపెనీల కార్ల రవాణా జరుగుతోంది. ఇది గతవారం రోజులుగా గణనీయంగా తగ్గుముఖం పట్టిందని జోగిందర్ సింగ్ అనే ట్రక్కు డ్రైవర్ తెలిపారు. ‘కంపెనీ ఉత్పత్తుల డెలివరీలు నిలిపేశారు. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే వరకు వేచి ఉండాలని రవాణా ఏజెన్సీలు చెప్పాయి’ అన్నారు.సరుకు రవాణా పెరిగే అవకాశందిల్లీకి చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ చేతక్ గ్రూప్ డైరెక్టర్ సచిన్ జేకేఎస్ హరితాష్ మాట్లాడుతూ..‘త్వరలో కొత్త జీఎస్టీ అమలు నేపథ్యంలో దాదాపు 90 శాతం ట్రక్కులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సరఫరాదారులు, రిటైలర్లు వస్తువుల ఇన్వాయిస్లను నిలిపేశారు. నవరాత్రి-దీపావళి సీజన్లో వాహన తయారీదారులు, రిటైలర్లు బ్యాక్లాగ్లను క్లియర్ చేయడానికి, వస్తువులను పంపిణీ చేయడానికి వేగంగా పని చేస్తారు. దాంతో సెప్టెంబర్ 22 నుంచి వస్తు సరఫరాలో రష్ మొదలవుతుంది. డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం, వాహనాల పరిమిత లభ్యత కారణంగా జీఎస్టీ అమలు తర్వాత సరుకు రవాణా రేట్లు 30-40 శాతం పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.డీలర్ల ఎదురుచూపుడీలర్లు సవరించిన జీఎస్టీ బిల్లింగ్ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నందున ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. బుకింగ్స్ కొనసాగుతున్నప్పటికీ ఈ వారం డెలివరీలు జరగడం లేదని ఒక ప్రధాన ఆటో డీలర్ షిప్ ప్రతినిధి ధ్రువీకరించారు. ‘ఈ రోజు బుకింగ్ చేసినప్పటికీ కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రకారం బిల్లింగ్ ప్రారంభిస్తాం. సెప్టెంబర్ 22 తర్వాత డెలివరీలు షెడ్యూల్ అవుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: సాఫ్ట్ డ్రింక్స్పై ‘హార్డ్’ నిర్ణయం.. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన -
ఐటీఆర్ గడువు పొడిగింపు?: స్పందించిన ఆదాయపు పన్ను శాఖ
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) గడువును 2025 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారని.. కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందిస్తూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.ఐటీఆర్లను దాఖలు చేయాల్సిన గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ గడువును ఈ నెల 30 వరకు పొడిగించారని వస్తున్న వార్తలలో నిజం లేదు. అదంతా అవాస్తవం. దానిని నమ్మవద్దు అని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపు, ఇతర సంబంధిత సేవల కోసం పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి, మా హెల్ప్డెస్క్ 24x7 అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు తేదీ పెంచాలని.. పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ (కటక్), పీపీ చౌదరి (పాలీ).. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు రాసి గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. కానీ మంత్రిత్వశాఖ గడువు పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్నిబట్టి చూస్తే.. గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.A fake news is in circulation stating that the due of filing ITRs (originally due on 31.07.2025, and extended to 15.09.2025) has been further extended to 30.09.2025.✅ The due date for filing ITRs remains 15.09.2025. Taxpayers are advised to rely only on official… pic.twitter.com/F7fPEOAztZ— Income Tax India (@IncomeTaxIndia) September 14, 2025ఆలస్య రుసుముతో ఐటీఆర్ ఫైలింగ్గడువు తీరని తరువాత.. డిసెంబర్ 31, 2025 వరకు రూ.5000 వరకు ఆలస్య రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి జరిమానా గరిష్టంగా రూ.1000 ఉంటుంది. ఇక్కడ ఫైన్ ఒక్కటే సమస్య కాదు. కొన్నిసార్లు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ప్రాసిక్యూషన్ కూడా ఉండవచ్చు. గత సంవత్సరం.. ఢిల్లీలోని ఒక మహిళ తన ఐటీఆర్ దాఖలు చేయనందుకు ఆమెకు జైలు శిక్ష విధించారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే.. గడువు లోపలే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం ఉత్తమం. -
సాఫ్ట్ డ్రింక్స్పై ‘హార్డ్’ నిర్ణయం.. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన
శీతల పానీయాలపై జీఎస్టీని సవరిస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటనతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ విభాగంలోని ఉత్పత్తులపై గతంలో 28 శాతం జీఎస్టీ, 12 శాతం పరిహార సెస్(ఆదాయ నష్టాలను పూడ్చేలా కేంద్రం తిరిగి చెల్లించే పన్ను)ను విధించేవారు. క్రమబద్ధీకరించిన విధానం ప్రకారం పరిహార సెస్ ఊసెత్తకుండా నేరుగా జీఎస్టీనే 40 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూటర్లకు ఆందోళన కలిగిస్తుంది. అయితే వారి వద్ద ఉన్న పాతస్టాక్పై పరిహార సెస్కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.జీఎస్టీ విధానాలు పాటించాల్సిందే..సెప్టెంబర్ 22 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో.. పాత పన్ను నిర్మాణం కింద కొనుగోలు చేసిన, అమ్ముడుపోని స్టాక్ వల్ల పంపిణీదారులకు గణనీయమైన వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. పరిహార సెస్ను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో దీనికింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ-వ్యాల్యూ యాడ్ చేసిన దానికి మాత్రమే ట్యాక్స్ చెల్లింపు) ఖర్చుగానే మిగులుతుందనే వాదనలున్నాయి. ‘ఇప్పటికే ఉన్న ఇన్వెంటరీలపై పరిహార సెస్ చెల్లించిన పంపిణీదారులు, వ్యాపారులు సెస్ తొలగించిన తర్వాత భవిష్యత్తులో జీఎస్టీ విధానాలను పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పరిహార సెస్ను ప్రభుత్వం భర్తీ చేయలేదు’ అని ఒక డిస్ట్రిబ్యూటర్ తెలిపారు.ప్రభుత్వ నిర్ణయంతో సవాళ్లుఆల్ ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF) ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో పంపిణీదారులకు గణనీయమైన వర్కింగ్ క్యాపిటల్ నష్టం జరుగుతుందని, ఈ విభాగంలోని చిన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇది సవాలుగా మారుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ? -
తగ్గిన ధరలు.. పసిడి కొనుగోలుకు మంచి తరుణం!
వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు (సెప్టెంబర్ 15) తెలుగు రాష్ట్రాల్లో సహా చెన్నై, ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ రేట్లు ఏ నగరంలో ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు తగ్గి 25,092కు చేరింది. సెన్సెక్స్(Sensex) 31 పాయింట్లు నష్టపోయి 81,869 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.63బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.38 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.45 శాతం పెరిగింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ?
అమెరికా సుంకాలు భారత వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న దృష్ట్యా కొన్ని సడలింపులు కావాలని దేశీయ ఎగుమతిదారులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరుతున్నారు. యూఎస్ సుంకాలతో దెబ్బతింటున్న ఉత్పాదకత, సరఫరా సవాళ్లకు తాత్కాలిక పరిష్కారంగా ఇప్పటికే తీసుకున్న రుణాలపై వడ్డీని తొలగించాలంటున్నారు. డిసెంబర్ 2024లో ముగిసిన వడ్డీ ఈక్వలైజేషన్ స్కీమ్ (ఐఈఎస్)ను పునరుద్ధరించాలని లేదా ఎగుమతి ప్రోత్సాహక రూపంలో డ్యూటీ క్రెడిట్ స్క్రిప్లను(దిగుమతి చేసుకునే ముడి సరుకుపై సుంకాల సడలింపు) తిరిగి ప్రవేశపెట్టాలని చెబుతున్నారు. అయితే అందుకు మంత్రిత్వశాఖ సుముఖంగా లేదని తెలుస్తుంది. ఈ అంశం ఇంకా చర్చల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.ఎగుమతిదారులు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) డిసెంబర్ 2024లో ముగిసిన ఐఈఎస్ను కొనసాగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఈ పథకం కింద ప్రభుత్వం ఎగుమతి రుణంపై వడ్డీ రేట్లను మాఫీ చేసింది. భారతీయ ఎగుమతిదారులు వారి రుణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని, దాని ద్వారా కొత్త మార్కెట్ల్లో ఎగుమతులను పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.‘ఐఈఎస్ లేదా డ్యూటీ క్రెడిట్ స్క్రిప్స్ ద్వారా నేరుగా ఎగుమతులు పెరుగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నమ్మడం లేదు. దీనిపై ఎగుమతిదారులు, వాణిజ్య విభాగం మధ్య చర్చలు జరుగుతున్నాయి’ అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. 2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో రూ.2,250 కోట్ల వార్షిక వ్యయంతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్ను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది గతంలో ఐఈఎస్ కింద చేసిన పంపిణీల కంటే చాలా తక్కువగా ఉంది.ఇదీ చదవండి: స్మాల్క్యాప్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ మంచిదా? -
ఏసీలు, ఎల్ఈడీ లైట్లకు పీఎల్ఐ పథకం
వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్ఈడీ లైట్లు) తయారీకి సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)ను కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు అందుబాటులో ఉంటుందని వాణిజ్య శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద మరిన్ని పెట్టుబడులకు పరిశ్రమ ఆసక్తి చూపిస్తుండడంతో తిరిగి ప్రారంభించినట్టు తెలిపింది.వైట్ గూడ్స్ పీఎల్ఐ పథకం కింద ఎంపికైన దరఖాస్తుదారులు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలకు అర్హులని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రూ.10,406 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో 83 దరఖాస్తులు వచి్చనట్టు తెలిపింది. ఈ పెట్టుబడులతో ఏసీలు, ఎల్ఈడీ లైట్లకు సంబంధించి విడిభాగాలు దేశీయంగా తయారవుతాయని వెల్లడించింది. ఇందులో కొన్ని విడిభాగాలు దేశీయంగా తయారవుతున్నప్పటికీ తగినంత పరిమాణంలో లేనట్టు పేర్కొంది. మొదటిసారి వైట్ గూడ్స్ రంగానికి పీఎల్ఐ పథకాన్ని కేంద్రం 2021 ఏప్రిల్ 7న ప్రకటించడం గమనార్హం. 2021–22 నుంచి 2028–29 వరకు అమలు చేయాలని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు! -
స్మాల్క్యాప్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ మంచిదా?
స్మాల్క్యాప్ ఫండ్స్లో అధిక పెట్టుబడులు ఉన్నప్పుడు తక్కువ అస్థిరతలు ఉన్న సాధనాల్లోకి ఎలా మళ్లించాలి? లేదంటే స్మాల్క్యాప్ ఫండ్స్లో ఉన్న పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవచ్చా? – హరిహరన్ అనంతనారాయణన్స్మాల్క్యాప్ పెట్టుబడుల్లో రిస్క్ అధికంగా ఉంటుంది. మీరు చెప్పిన విధంగా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు 2006 నుంచి రూ.కోటి మొత్తాన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి, ఏటా 10 శాతం చొప్పున క్రమానుగతంగా ఉపసంహరించుకుంటూ (ఎస్డబ్ల్యూపీ) వచ్చినప్పటికీ.. ఆ పెట్టుబడి రూ.6.3 కోట్లకు వృద్ధి చెంది ఉండేది. స్మాల్క్యాప్ ఫండ్స్లో రాబడులు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఇది తెలియజేస్తుంది. అయినప్పటికీ ఏటా 10 శాతం ఉపసంహరించుకోవాలని నేను సూచించను. దీనికి బదులు 2 శాతం చొప్పున ఉపసంహరించుకుంటే.. రూ.కోటి పెట్టుబడి రూ.18.7 కోట్లు అయి ఉండేది. నా సూచన ఏమిటంటే.. స్మాల్క్యాప్ ఫండ్స్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉంటే, ఏటా ఉపసంహరించుకునే రేటు 3 శాతం మించకుండా ఉండేట్టు అయితే, మీ పెట్టుబడులను అలాగే కొనసాగించుకోవచ్చు. దీనివల్ల మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండొచ్చు. వచ్చే 20–30 ఏళ్లలో ఈక్విటీ మార్కెట్లు 2008 తరహా అతిపెద్ద పతనాలను రెండు లేదా మూడు పర్యాయాలు చూసే అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో స్మాల్ క్యాప్ పెట్టుబడుల విలువ మరింత పడిపోతుంది. అందుకే మీ ఉపసంహరణను 2%కి పరిమితం చేసినట్టయితే ఈ పతనాలను మీరు తట్టుకోగలరు.మార్కెట్ల పట్ల నమ్మకం, ఈ తరహా మార్కెట్ సైకిల్స్ను గతంలో చూసిన అనుభవం అన్నవి మీ పెట్టుబడుల విధానాన్ని కొనసాగించుకునేందుకు ఎంతో అవసరం. అప్పుడు దీర్ఘకాలంలో విజయం సాధించగలరు. మరో ఉదాహరణ చూద్దాం. ఒకవేళ మీరు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్లో రూ.కోటి ఇన్వెస్ట్ చేసి.. ఏటా 4 శాతాన్ని ఉపసంహరించుకుంటే (2005లో మొదలైందని భావించినప్పుడు) అప్పుడు మీ పెట్టుబడి రూ.1.73 కోట్లుగా మారేది. అదే స్మాల్క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఏటా 4% ఉప సంహరించుకున్నప్పుడు పెట్టుబడి రూ.15.6 కోట్లు అయ్యేది. అధిక రాబడి కోరుకుంటే అస్థిరతలకు అలవాటు పడాలి. అస్థిరతలను సమర్థవంతంగా ఎదుర్కొంటే మెరుగైన రాబడులు పొందొచ్చు. ఆ తరహా అధిక అస్థిరతలను భరించలేకపోతే మరింత రక్షణాత్మక పెట్టుబడి సాధనాలను పరిశీలించొచ్చు.అధిక రేటింగ్ కలిగిన అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలన్నది నా ఆలోచన. దీర్ఘకాలం కోసం ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? – రమేశ్దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. కాకపోతే పెద్ద మొత్తంలో పెట్టుబడిని ఒకే విడత పెట్టేయడం అనకూలం కాకపోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు పడిపోతే ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతారు. ఉదాహరణకు మీరు రూ.50 లక్షలను ఈక్విటీ ఫండ్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. మార్కెట్లు పడితే పోర్ట్ఫోలియో విలువ సైతం క్షీణిస్తుంది. కాకపోతే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చి చూస్తే మార్కెట్ పతనాల్లో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఎందుకంటే అవి డెట్ సాధనాల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్న మొత్తాన్ని ఒకే విడత కాకుండా.. పలు విడతలుగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ల ఉద్దాన, పతనాల తాలూకూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కనుక పెట్టుబడిని ఒకే విడత కాకుండా, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో కొంతకాలం పాటు ఇన్వెస్ట్ చేసుకునేలా ప్రణాళిక వేసుకోండి. -
శీతాకాల సమావేశాల్లో బీమా సవరణ బిల్లు
న్యూఢిల్లీ: బీమా సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీమా రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) ప్రస్తుత నిబంధనల కింద అనుమతి ఉంది. దీన్ని నూరు శాతానికి పెంచనున్నట్టు 2025–26 బడ్జెట్ సందర్భంగా మంత్రి సీతారామన్ ప్రకటించారు. 100 శాతం ఎఫ్డీఐ అనుమతి అన్నది భారత్లో ఆర్జించిన ప్రీమియంను ఇక్కడే ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు అమలు చేయనున్నట్టు చెప్పారు. అలాగే, నిబంధనలు, షరతుల్లోనూ మార్పులు చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. బీమా రంగం ఇప్పటి వరకు రూ.82,000 కోట్ల ఎఫ్డీఐని ఆకర్షించడం గమనార్హం. కాంపోజిట్ లైసెన్స్ (జీవిత, సాధారణ బీమా సేవలకు)తోపాటు చెల్లించిన మూలధనం తగ్గింపు కూడా ప్రభుత్వ ప్రతిపాదనల్లో భాగంగా ఉన్నాయి. మొదటిసారి 2015లో బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. తిరిగి 2021లో ఈ పరిమితిని 74 శాతం చేసింది. -
ఫెడ్వైపు ఇన్వెస్టర్ల చూపు
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపించగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. దీంతో ఫైనాన్షియల్ మార్కెట్లతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సైతం ఫెడ్ నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నాయి. మరోవైపు దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక టెక్నికల్ అంశాల ప్రకారం మార్కెట్లు ఈ వారం బ్రేకవుట్ సాధించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.దేశీయంగా నేడు(15న) ఆగస్ట్ నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. 2025 జూలైలో డబ్ల్యూపీఐ మైనస్ 0.45 శాతంగా నమోదైంది. అయితే గత నెలలో 0.45 శాతం పెరిగే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా ఆహారం, ఇంధనం, ఇతర కీలక విభాగాలలో ధరల పెరుగుదల కారణంకానున్నట్లు అంచనా వేశారు. కాగా.. గత వారాంతాన విడుదలైన వివరాల ప్రకారం ఆగస్ట్ నెలలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 2.07 శాతానికి చేరింది. జూలైలో 1.61 శాతం కాగా, గత నెలలో కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, నూనెలు, కొవ్వు ఉత్పత్తుల ధరలు పెరగడం ప్రభావం చూపింది. ఇవికాకుండా యూఎస్తో వాణిజ్య వివాదాలకు చెక్ పడటంపై సానుకూల సంకేతాలు వెలువడితే దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహం లభించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. కనీసం పావు శాతం ఫెడరల్ రిజర్వ్ చైర్పర్శన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన ఈ నెల 16 నుంచి ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) రెండు రోజులపాటు పాలసీ సమావేశాలు నిర్వహించనుంది. యూఎస్ ఉపాధి మార్కెట్ నీరసించిన నేపథ్యంలో 17న ఫెడరల్ ఫండ్స్(కీలక వడ్డీ) రేటులో కోత పెట్టనున్నట్లు అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. సీపీఐ జూలైలో 0.2 శాతంకాగా.. ఆగస్ట్లో 0.4 శాతానికి ఎగసింది. దీంతో వార్షిక ద్రవ్యోల్బణం 2.9 శాతంగా నమోదైంది. దీంతో ఈసారి పాలసీ సమావేశంలో ఉద్యోగ కల్పనకు దన్ను, ధరల తగ్గింపును ఫెడ్ కీలక లక్ష్యాలుగా ఎంచుకునే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. కనీసం పావు శాతం కోతకు వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేటు 4.25–4.5% గా ఉంది. ఈ నేపథ్యంలో అటు యూఎస్, ఆసియా మార్కెట్లతోపాటు దేశీయంగానూ ఫెడ్ వడ్డీ రేట్ల కోత బలమివ్వనున్నట్లు ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర అంశాలకూ ప్రాధాన్యం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. అయితే ఫెడ్ వడ్డీ కోత పెడితే దేశీ మార్కెట్లో పెట్టుబడులు పుంజుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత నెల(ఆగస్ట్)లో దేశీ స్టాక్స్ నుంచి ఎఫ్పీఐలు రూ. 34,900 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. జూలైలోనూ రూ. 17,700 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఈ నెలలో సైతం తొలి వారంలో రూ. 12,257 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించడం గమనార్హం! కాగా.. డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టాలకు చేరుతోంది. దీంతో అటు పసిడి, ఇటు ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. రూపాయి బలహీనతతో దిగుమతుల బిల్లు పెరిగి మరింత వాణిజ్య లోటుకు దారితీస్తున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. అయితే ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలతో వినియోగం ఊపందుకోనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. గత వారమిలా.. జీఎస్టీ సంస్కరణలు, భారత్, యూఎస్ మధ్య టరిఫ్ వివాద పరిష్కారంపై ఆశలతో గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,117 పాయింట్లు(1.4%) జంప్చేసి 81,905 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 314 పాయింట్లుపైగా(1.4%) ఎగసి 25,114 వద్ద స్థిరపడింది.బ్రేకవుట్కు చాన్స్యూఎస్, భారత్ మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో కోతపై అంచనాలు, జీఎస్టీ సంస్కరణలతో పలు రంగాలలో ఊపందుకోనున్న వినియోగం వంటి సానుకూల అంశాలు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్నిచ్చాయి. తాజా సానుకూలతల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లలో బ్రేకవుట్కు వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. కొద్దిరోజులుగా బీఎస్ఈ సెన్సెక్స్ 79,750–82,250 పాయింట్ల శ్రేణిలో కదులుతోంది. 82,250ను అధిగమిస్తే.. 83,500–83,650 పాయింట్లకు బలపడే వీలుంది. ఒకవేళ దిగువకు చేరితే.. 81,450–81,200 స్థాయిలో మద్దతు లభించవచ్చు. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ పుంజుకుంటే 25,250ను అధిగమించవలసి ఉంటుంది. ఆపై 25,500 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. బలహీనపడితే 24,900 వద్ద తొలుత, ఆపై 24,700 వద్ద తదుపరి మద్దతు అందుకునే వీలుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దక్షిణాదిన తొలి ‘హంటర్హుడ్’ ఫెస్టివల్!
డుగ్గు డుగ్గు బండిపై ‘బుల్లెట్’లా దూసుకెళ్తున్న కుర్రకారు స్ట్రీట్ కల్చర్లోనూ దుమ్మురేపుతున్నారు. అందుకే, బుల్లెట్ బండి అంటే ఠక్కున గుర్తొచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఈ లోకల్ ఆర్టిస్టులకు దన్నుగా నిలుస్తోంది. అర్బన్ రైడర్ల కోసం ప్రత్యేకంగా మలిచిన ‘హంటర్ 350’ బైక్ స్ఫూర్తితో ‘హంటర్హుడ్’ వేడుకలకు తెరతీసింది. దక్షిణాదిన ఈ తొలి ఫెస్టివల్ను తాజాగా చెన్నైలో నిర్వహించింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ డీజే బెంకీ బేకు... క్రేజీ రీమిక్స్లతో ఈవెంట్ను ఆరంభించారు. స్ట్రీట్ ఆర్టిస్ట్లు వేసిన బైకింగ్ పెయింటింగ్లు అబ్బురపరిచాయి. మరోపక్క, స్కేట్బోర్డింగ్ మ్యూజిక్ కలగలిపి సాగిన ఈవెంట్ మరో హైలైట్. స్థానిక తీన్మార్ డప్పుల దరువుకు సింగర్లు పాడిన లోకల్ పాటలు వేరే లెవెల్. లోకల్ హిప్హాప్ సింగర్స్ ఇక్కీ బెర్రీ, అసల్ కోలార్, ఆరీవు తదితరుల తమిళం, ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్తో ఇక్కడి ఐలాండ్ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లింది. ఇక డ్యాన్సర్లు కూడా బీట్కు అనుగుణంగా క్రేజీ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విభిన్న ఆర్టిస్టులు ఈవెంట్ ఆసాంతం స్ట్రీట్ కల్చర్ వైబ్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఏప్రిల్లో తొలిసారి... ఈ ఏడాది ఏప్రిల్లో తొలిసారిగా రాయల్ ఎన్ఫీల్డ్ ‘హంటర్హుడ్’ ఫెస్టివల్ను ఒకేసారి ఢిల్లీ, ముంబై నగరాల్లో నిర్వహించింది. ఈ సందర్బంగా ‘హంటర్ 350’ 2025 ఎడిషన్ను రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ తదితర రంగుల వేరియంట్లలో ఆవిష్కరించింది. ఆధునిక రెట్రో లైఫ్స్టయిల్ కోరుకునే నవతరం యువతను ఆకట్టుకునేలా స్టయిల్, వినోదం, దూకుడును కలగలిపి హంటర్ 350 బైక్ను మలిచామని రాయల్డ్ ఎన్ఫీల్డ్ చెబుతోంది. మరోపక్క, హిప్హాప్, ర్యాప్, స్ట్రీట్ డ్యాన్స్, స్కేట్బోర్డింగ్లలో లోకల్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ... స్ట్రీట్ కల్చర్కు దన్నుగా నిలవడమే ‘హంటర్హుడ్’ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. క్రమంగా మరిన్ని నగరాల్లోనూ ఈ వేడుకలను నిర్వహించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది.గ్రాఫైట్ గ్రే.. సూపర్బ్ హంటర్ 350లో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రాఫైట్ గ్రే వేరియంట్ను చెన్నై హంటర్హుడ్ ఫెస్టివల్లో ఎన్ఫీల్డ్ ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇప్పటికే యూత్కు బాగా కనెక్ట్ అవుతున్న హంటర్ బైక్.. ఈ సరికొత్త షేడ్తో మరింత ఆకట్టుకుంటోంది. బైకింగ్ యాక్సెసరీలు, లైఫ్స్టయిల్ గేర్తో పాటు ట్రెండింగ్లో ఉన్న స్ట్రీట్ వేర్ ఉత్పత్తులను కూడా ఈ సందర్భంగా వివిధ బ్రాండ్లు తమ స్టాల్స్లో ప్రదర్శించాయి. కాగా, 350సీసీ లోపు బైక్లపై జీఎస్టీ రేటును ఇప్పుడున్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో (ఈ నెల 22 నుంచి అమలు) ఎన్ఫీల్డ్ హంటర్పై గరిష్టంగా రూ.22,000 తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.శివరామకృష్ణ మిర్తిపాటి (చెన్నై నుంచి సాక్షి బిజినెస్ ప్రతినిధి) -
60 తర్వాత.. ఆచితూచి..!
మనలో చాలా మంది పదవీ విరమణ ప్రణాళిక గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడో వృద్ధాప్యంలో పలకరించే రిటైర్మెంట్ గురించి యవ్వనంలో ఉన్నప్పుడు చర్చించడం వారికి నచ్చదు! మధ్య వయసు వచ్చే వరకు అభిరుచులు, ఆకాంక్షలు, కోరికల చుట్టూ సాగిపోతుంటారు. దీంతో రిటైర్మెంట్కు ప్రాధాన్యం పక్కకు వెళ్లిపోతుంది. తీరా రిటైర్మెంట్ పలకరించిన తర్వాత, అప్పటి వరకు తాము వెనకేసింది అవసరాలకు ఎంత మాత్రం సరిపోదని తెలుసుకుని ఆందోళన చెందాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఒక్కసారి ఆస్పత్రిపాలైతే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. లిక్విడిటీ తగినంత లేని సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. క్లిష్ట సమయాల్లో రోజువారీ ఖర్చులకు సైతం కటకట ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన రాబడి లేని సాధనాలను నమ్ముకోవడం వల్ల రిటైర్మెంట్ ఫండ్ దీర్ఘకాలం పాటు అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందుకే పదవీ విరమణ తర్వాత.. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వేసే ప్రతి అడుగు ఆర్థికంగా ఆచితూచి ఉండాలి. ఉద్యోగంలో మాదిరే పదవీ విరమణ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ప్రణాళిక ఉండాలి. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటి వరకు సమకూర్చుకున్న ఫండ్ (పొదుపు నిధి)ను వివిధ సాధనాల్లో పెట్టుబడి పెట్టి.. ప్రతి నెలా నిర్ణిత మొత్తాన్ని ఉపసంహరించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ‘‘పెట్టుబడి నుంచి మొదటి ఏడాది 3–4 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. రెండో ఏడాది నుంచి ద్రవ్యోల్బణం సూచీ స్థాయిలో ఉపసంహరణకు పరిమితం కావాలి’’ అని నెర్డిబర్డ్ వెల్త్ అడ్వైజరీ ప్రిన్సిపల్ ఆఫీసర్ శిల్పా భాస్కర్ గోలే సూచించారు. ఉపసంహరణలో చిన్న తేడా వచ్చినా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం పాటు కాపాడుకోలేరు. ఉదాహరణకు రూ.2 కోట్ల నిధి ఉందనుకోండి. ఏటా 8 శాతం వృద్ధి చెందుతూ, ప్రతి నెలా రూ.లక్ష ఉపసంహరించుకుంటే తమవద్దనున్న నిధి 6 శాతం ద్రవ్యల్బోణం అంచనా ఆధారంగా 21 ఏళ్ల అవసరాలకు సరిపోతుంది. అలా కాకుండా ప్రతి నెలా రూ.1.5 లక్షల చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే అదే నిధి 13 ఏళ్ల అవసరాలనే తీర్చగలదు. ఎంత ఉపసంహరించుకోవాలన్న స్పష్టత కొరవడితే, తొలినాళ్లలో అధికంగా ఖర్చు చేయొచ్చు. ఖర్చులకు అనుగుణంగా ఉపసంహరణలు కొనసాగితే, తర్వాతి సంవత్సరాలకు పెద్దగా మిగిలి ఉండదని 5నాన్స్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా హెచ్చరించారు. పేరుకే రిటైర్మెంట్. కానీ, నేడు చాలా మంది ఆ తర్వాత కూడా ఏదో ఒక పని చేస్తున్నారు. అలాంటి మార్గాలను గుర్తించాలి. దీనివల్ల రిటైర్మెంట్ ఫండ్ నుంచి తక్కువ ఉపసంహరణకు పరిమితం కావొచ్చు. ఫలితంగా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.ఈక్విటీ పెట్టుబడులపై అప్రమత్తత... పదవీ విరమణ తర్వాత ఈక్విటీ పెట్టుబడులకు పూర్తిగా దూరం కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్ సెక్యూరిటీల రాబడిపై ద్రవ్యోల్బణం క్షీణత ప్రభావాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. పదవీ విరమణ తర్వాత పెట్టుబడుల్లో వృద్ధి భాగం లేకపోతే, పొదుపు నిధి విలువ వేగంగా తగ్గిపోతుంది. కనుక 70 ఏళ్లు దాటిన వారు సైతం తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతాన్ని అధిక నాణ్యతతో కూడిన డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని దినేష్ రోహిరా సూచించారు. దీనివల్ల పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందుతుంది. అదే సమయంలో ఈక్విటీలపై ఎక్కువగా ఆధారపడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రిటైర్మెంట్ ఆరంభంలో ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే.. సరిగ్గా అప్పుడే ఈక్విటీల్లో బేర్ దశ (పతనకాలం) ఆరంభమై కొన్నేళ్ల పాటు కొనసాగితే.. అవసరాల కోసం ఈలోపు చేసే ఉపసంహరణలతో పెట్టుబడి విలువ గణనీయంగా పడిపోతుంది. కనుక 5–7 ఏళ్ల అవసరాలకు సరిపడా మొత్తాన్ని సురక్షిత డెట్ సాధనాల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల అంతకాలం పాటు ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉంటే ఆ మొత్తం మెరుగ్గా వృద్ధి చెందేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.యాన్యుటీ ప్లాన్లు యాన్యుటీ ప్లాన్లు.. హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. కానీ, రిటైర్మెంట్ నిధి మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఒక్కసారి యాన్యూటీ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత చివరి వరకు ఒకే విధమైన రాబడికి లాక్ అయినట్టే. వ్యయాలు, వైద్య అత్యవసరాలు లేదా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రాబడి పెరగదు. యాన్యుటీలకు పన్ను ప్రయోజనాలు కూడా లేవు. కనుక కొంత వరకు యాన్యుటీకి కేటాయించుకుని, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, డెట్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవాలి. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.వైద్యపరంగా సన్నద్ధత.. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు సర్వ సాధారణం. వైద్యపరమైన ద్రవ్యోల్బణం 12–14%గా ఉంటోంది. కనుక ఈ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఇది లేకపోతే పొదుపు నిధిపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్థిక కోణం నుంచి చూస్తే ఇది పెద్ద తప్పిదం అవుతుంది. రిటైర్మెంట్ ఫండ్ అన్నది జీవితాంతం అవసరాలను తీర్చడం కోసం. వైద్యం కోసం దాన్ని వాడటం మొదలు పెడితే తక్కువ కాలంలోనే ఖాళీ అయిపోతుంది. కనుక రిటైర్మెంట్ తర్వాత ప్రీమియం భారమైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ను కొనసాగించాలి. ప్రీమియం భారమనిపిస్తే రూ.5 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. ఉద్యోగ సమయంలో కంపెనీ గ్రూప్ హెల్త్ పాలసీ ఉందని, వ్యక్తిగత హెల్త్ పాలసీ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను చాలా మంది తీసుకోరు. ఉద్యోగ విరమణ తర్వాత తీసుకుంటే అప్పుడు భారీ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కనుక గ్రూప్ హెల్త్ ప్లాన్పై ఆధారపడకుండా వ్యక్తిగతంగా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి.ఎస్టేట్ ప్లానింగ్ 60 తర్వాత తప్పకుండా పట్టించుకోవాల్సిన అంశం ఎస్టేట్ ప్లానింగ్. స్థిర, చరాస్తులు, ఆర్థిక ఆస్తులను ఎలా నిర్వహించాలి? ఎలా పంపిణీ చేయాలన్నది ఇది నిర్దేశిస్తుంది. కేవలం ధనవంతుల కోసమే ఇదని భావిస్తుంటారు. కానీ, ఆస్తులున్న ప్రతి కుటుంబానికి అవసరమే. కనీసం వీలునామా రూపంలో అయినా ఎవరికి ఏ మేరకు పంపిణీ చేయాలో సూచించాలి. తద్వారా భవిష్యత్తులో వారసుల మధ్య వివాదాలు లేకుండా జాగ్రత్తపడొచ్చు. ఇక్కడ వీలునామా అన్నది తమ మరణానంతరం తమ వారసులకు ఏవేవి, ఎలా చెందాలో సూచించే పత్రం. అదే ఎస్టేట్ ప్లానింగ్ అయితే జీవించి ఉన్న సమయంలోనూ ఆయా ఆస్తుల రక్షణ, వాటిని తమ అభీష్టం మేరకు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం కారణంగా కుటుంబ యజమాని అశక్తుడిగా మారిన సందర్భంలో అప్పటికే ఎస్టేట్ ప్లానింగ్ ఉంటే, అందులో పేర్కొన్న విధంగా ఆస్తుల నిర్వహణను కుటుంబ సభ్యులు లేదా ట్రస్టీలు చూసుకుంటారు. ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా ఉన్నప్పటికీ.. పెట్టుబడులకు నామినీని నమోదు చేయడం కూడా అవసరమే. దీనివల్ల వీటి క్లెయిమ్ సులభతరం అవుతుంది. పన్ను ప్రయోజనం ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) పన్ను పరంగా మెరుగైన సాధనాలు కావు. వీటి రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. తమకు వర్తించే శ్లాబు రేటు ప్రకారమే ఎఫ్డీ రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. గతంలో మాదిరి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో స్వల్పకాల/దీర్ఘకాల పెట్టుబడుల ప్రయోజనాలు ఇప్పుడు లేవు. ఎప్పుడు విక్రయించినా ఎఫ్డీల మాదిరే ఆదాయం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సిందే. వీటికి బదులు పన్ను ఆదా కోసం అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిలో రాబడికి ఈక్విటీ పెట్టుబడులకు మాదిరే స్వల్ప, దీర్ఘకాల మూలధన పన్ను నిబంధనలు అమలవుతాయి. రిస్క్ దాదాపు ఉండదు. లిక్విడ్ ఆస్తులకు చోటు ఉండాలి కొంత మంది రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం ప్రాపర్టీని (ఇల్లు/ఫ్లాట్) సమకూర్చుకుంటుంటారు. స్థిరాస్తి రూపంలో ఉండడం వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్య ఎదురుకావొచ్చు. అవసరమైనప్పుడు ప్రాపర్టీని వెంటనే నగదుగా మార్చుకోవడం సాధ్యపడదు. ఇక నిర్వహణ వ్యయాలు, పన్నులు, న్యాయ వివాదాల రిస్్కలు ఎలానూ ఉంటాయ్. రిటైర్మెంట్ కోసమని ప్రాపర్టీలను సమకూర్చుకున్నప్పటికీ.. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయానికి ప్రణాళిక ఉండాలి. ఇందుకు ప్రాపర్టీని విక్రయించడం లేదంటే రివర్స్ మార్ట్గేజ్కు వెళ్లడం మంచి ఆప్షన్ అవుతుంది. రివర్స్ మార్ట్గేజ్లో ప్రాపర్టీని బ్యాంక్ తనఖా పెట్టుకుని, నెలవారీ కోరుకున్నంత ఆదాయాన్ని నిర్ణిత కాలం పాటు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించనక్కర్లేదు. అదే ఇంట్లో నివాసం ఉండొచ్చు. మీ తదనంతరం వారసులు అప్పటి వరకు ఉన్న బకాయిని చెల్లించి అదే ఇంటిని స్వా«దీనం చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ వేలం వేసి, బకాయి పోను మిగిలినది వారసులకు చెల్లిస్తుంది. ఇంటి కోసం రుణం తీసుకుని మనం ఎలా అయితే నిర్ణిత కాలం పాటు ఈఎంఐ చెల్లిస్తామో.. రివర్స్ మార్ట్గేజ్లో బ్యాంక్ అలా మనకు చెల్లిస్తుంది. ఏకమొత్తంలో చెల్లింపులకూ కొన్ని బ్యాంక్లు అవకాశం కల్పిస్తున్నాయి. రుణ భారం రిటైర్మెంట్ నాటికి ఎలాంటి రుణం మిగిలి ఉండకూడదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, గృహ రుణాలు ఏవైనా సరే గుడ్బై చెప్పేయాలి. లేదంటే రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన పొదుపు నిధిని రుణ చెల్లింపుల కోసం వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జియో చౌక ప్లాన్.. ఎక్కువ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందించాలని కొన్ని రోజుల క్రితం ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. దీని తర్వాత జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ తో రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది.ఇందులో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వ్యాలిడిటీని పొందుతారు. డేటాను ఉపయోగించని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది. మరొకటి 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్లు రెండూ ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించే, డేటా అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి.84 రోజుల ప్లాన్జియో కొత్త రూ.448 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో యూజర్లకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇది కాకుండా, వినియోగదారులకు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్ కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.365 రోజుల ప్లాన్జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో, వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నెట్ వర్క్ లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత నేషనల్ రోమింగ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. -
ఇండియా హోమ్ లోన్లో వాటా కొనుగోలు
ఇండియా హోమ్లోన్ లిమిటెడ్లో 24.5% వాటా(34.99 లక్షలకుపైగా షేర్లు) దక్కించుకున్నట్లు స్కైబ్రిడ్జ్ వెంచర్స్ ఎల్ఎల్పీ తెలిపింది. అయితే, ఎంతకు కొనుగోలు చేసేందనే వివరాలు వెల్లడించలేదు. శుక్రవారం బీఎస్ఈలో ఇండియన్ హోమ్ లోన్ షేరు ముగింపు (రూ.42.46)తో లెక్కిస్తే డీల్ విలువ రూ.14.85 కోట్లుగా ఉంటుందని అంచనా.‘‘ఈ వాటా కొనుగోలుతో భారత్లో అందుబాటు ధరల గృహాలు, రిటైల్ ఫైనాన్స్ రంగాల్లో దీర్ఘకాల వృద్ధి అవకాశాలు ఆశిస్తున్నాము. సేవలు విస్తరణకు ఒక బలమైన ఫ్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకున్నాము. సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది’’ అని స్కైబ్రిడ్జ్ వెంచర్స్ తెలిపింది.కాగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా హోమ్ ఫైనాన్స్ రూ.13.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.12 కోట్లతో పోలిస్తే 13.14% అధికంగా ఉంది. -
అమెరికాలో ముఖేష్ అంబానీ భారీ కొనుగోలు!
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ విదేశాల్లో భారీ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. రియల్ డీల్ నివేదిక ప్రకారం.. న్యూయార్క్లోని ట్రిబెకా ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని ఆయన 17.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.145 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్నారు.ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన ఈ భవనం ట్రిబెకాలోని 11 హ్యూబర్ట్ స్ట్రీట్ లో ఉంది. టెక్ బిలియనీర్, యుబిక్విటి చైర్మన్, సీఈవో రాబర్ట్ పెరా 2018లో 20 మిలియన్ డాలర్లకు ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. తర్వాత దీన్ని చిన్నపాటి మాన్షన్గా మార్చాలని అనుకున్నా కుదరలేదు. దీంతో ఈ భవంతి దాదాపు పదేళ్లుగా ఎటువంటి వినియోగం లేకుండా ఖాళీగా ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికన్ అనుబంధ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. రాబర్ట్ పెరా కొన్న ధర కంటే తక్కువకు దీన్ని విక్రయించడం గమనార్హం.2023 ఆగస్టులో ముఖేష్ అంబానీ మాన్హాటన్ లోని వెస్ట్ విలేజ్ లో ఉన్న తన 9 మిలియన్ డాలర్ల నివాసాన్ని విక్రయించారు. ఆ తర్వాత రెండేళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు న్యూయార్క్లో భవంతిని కొనుగోలు చేయడం విశేషం. పెరా ఈ భవనాన్ని 2021లోనే 25 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టారు. కానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ 17.4 మిలియన్ డాలర్లకే దీన్ని దక్కించుకున్నారు.ఇదీ చదవండి: ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు! -
జీఎస్టీ సంస్కరణలు దీపావళి ముందే ఎందుకంటే..
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రశంసించారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడికీ భారీ విజయమని ఆమె అభివర్ణించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలు ఎందుకన్నదానిపైనా ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి వారి సొంత పండుగలు ఉంటాయన్న నిర్మలా సీతారామన్.. దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలును ప్రారంభించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలకు ముందే నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.చెన్నై సిటిజన్స్ ఫోరం నిర్వహించిన 'ట్యాక్స్ రిఫార్మ్స్ ఫర్ రైజింగ్ భారత్' కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ, దేశ ప్రజలు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని ఉత్పత్తులపైనా జీఎస్టీ ప్రయోజనకరమైన ప్రభావం ఉంటుందని ఆమె అన్నారు.జీఎస్టీ కింద గతంలో 12 శాతం పన్ను విధించిన 99 శాతం వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటివరకు ఉన్న శ్లాబులను రెండు శ్లాబులకే జీఎస్టీ కౌన్సిల్ కుదించింది. ఇకపై 5, 28 శాతం పన్ను శ్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి. తాజా జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు -
ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయో చెప్పలేం. అయితే ఆ ఏఐ సాధనానికి శిక్షణ ఇచ్చేవాళ్ల ఉద్యోగాలే పోవడం బాధాకరం. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ఏఐ (xAI).. తన డేటా అనోటేషన్ బృందం నుండి సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది. వీరంతా సంస్థ జనరేటివ్ ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్’కు శిక్షణ ఇచ్చే సిబ్బంది కావడం గమనార్హం.ఇదీ కారణం నివేదిక ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులకు కారణం సంస్థ దృష్టి మారడం. ఎక్స్ఏఐ సాధారణ ఏఐ ట్యూటర్లను అభివృద్ధి చేయడంపై దృష్టిని తగ్గించి స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై వనరులను కేంద్రీకరిస్తుందంటూ సిబ్బందికి పంపిన ఈమెయిల్ లో కంపెనీ తెలిపింది. "మా హ్యూమన్ డేటా ప్రయత్నాలను క్షుణ్ణంగా సమీక్షించిన తరువాత, మా స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్ల విస్తరణ, ప్రాధాన్యతను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే సమయంలో సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోలపై మా దృష్టిని తగ్గించాం. "ఫోకస్ లో ఈ మార్పులో భాగంగా, మాకు ఇకపై చాలా సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోగులు అవసరం లేదు.. ఎక్స్ఏఐతో మీ ఉద్యోగం ముగుస్తుంది" అని పేర్కొంది.ఉద్యోగులకు సిస్టమ్ యాక్సెస్ రద్దు చేస్తామని చెప్పిన కంపెనీ వారి ఒప్పందాలు ముగిసే వరకు లేదా నవంబర్ 30 వరకు జీతాలు చెల్లింపు కొనసాగుతుందని వివరించింది. వీడియో గేమ్స్, వెబ్ డిజైన్, డేటా సైన్స్, మెడిసిన్, స్టెమ్ వంటి రంగాలలో స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై పెట్టుబడులను పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకుఅనుగుణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను పెంచుకోనున్నట్లు ఇటీవలే ఎక్స్ఏఐ ప్రకటించింది.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు -
ఇంటి స్థలం రెడీ.. ఇక పునాది పనులు ప్రారంభించండీ..
ఇంటి స్థలం ఎలా ఎంచుకోవాలి.. నిర్మాణానికి ముందు ప్లాటును ఎలా పరీక్షించుకోవాలన్నది ఇదివరకటి కథనాల్లో చూశాం.. ఇప్పుడు పునాదికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఇంటి నిర్మాణం అనేది కేవలం ఒక ఆస్తి నిర్మాణం మాత్రమే కాదు.. ఇది తరాల వారసత్వానికి బలమైన ఆధారం. ఈ నిర్మాణంలో అత్యంత కీలకమైన దశ ఫౌండేషన్. పునాది బలంగా లేకపోతే, ఎంత అందమైన నిర్మాణమైనా కాలక్రమంలో బీటలు పడే ప్రమాదం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో భౌగోళిక పరిస్థితులు, మట్టి స్వభావం, నీటి మట్టం వంటి అంశాలు ఫౌండేషన్ ఎంపికపై ప్రభావం చూపుతాయి. అందుకే, ప్రతి ఇంటి నిర్మాణానికి ముందు మట్టి పరీక్ష (soil test) చేయడం తప్పనిసరి. ఇది భవనం బరువును మట్టి తట్టుకోగలదా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.సాంప్రదాయ ఫౌండేషన్ పద్ధతులుఇప్పటికీ చాలా మంది ఇండివిడ్యువల్ ఫుటింగ్ లేదా స్ట్రిప్ ఫౌండేషన్ వంటి సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇవి చిన్న స్థాయి గృహాలకు అనువైనవి. ఇండివిడ్యువల్ ఫుటింగ్ పద్ధతిలో ప్రతి పిల్లర్ కింద ప్రత్యేకంగా ఫుటింగ్ వేసి, భవన బరువును సమంగా పంపిణీ చేస్తారు. స్ట్రిప్ ఫౌండేషన్ పద్ధతిలో గోడల వెంట కాంక్రీట్ స్ట్రిప్ వేసి, గోడల బరువును మట్టిలోకి పంపిస్తారు.అయితే, మట్టి బలహీనంగా ఉన్న చోట రాఫ్ట్ ఫౌండేషన్ లేదా పైల్ ఫౌండేషన్ అవసరం అవుతుంది. రాఫ్ట్ ఫౌండేషన్లో మొత్తం భవనానికి ఒకే పెద్ద ఆర్సీసీ స్లాబ్ వేసి, బరువును సమంగా పంపిస్తారు. పైల్ ఫౌండేషన్లో లోతైన కాంక్రీట్ పైల్స్ వేసి, భారం లోతుగా ఉన్న బలమైన మట్టికి చేరేలా చేస్తారు. ఇవి ఖర్చుతో కూడుకున్నవే అయినా, భద్రతకు మిన్న.కొత్త పద్ధతులుఇటీవల కాలంలో ప్రీకాస్ట్ ఫౌండేషన్ బ్లాక్స్ అనే పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫ్యాక్టరీలో తయారైన ఫౌండేషన్ బ్లాక్స్ను నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి అమర్చడం వల్ల నిర్మాణ వేగం పెరుగుతుంది. కార్మిక వ్యయం తగ్గుతుంది. మెటీరియల్స్ వేస్టేజ్ తగ్గుతుంది. మరో కొత్త పరిష్కారం జియోపాలిమర్ కాంక్రీట్ ఫౌండేషన్. ఇది సాంప్రదాయ సిమెంట్కు ప్రత్యామ్నాయంగా ఫ్లై యాష్, స్లగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాల ఆధారంగా తయారవుతుంది. ఇది తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. పర్యావరణానికి మేలు చేస్తుంది. పట్టణ ప్రాంతల్లో రెట్రోఫిట్ అవసరమైన చోట మైక్రోపైల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇది చిన్న వ్యాసం గల పైల్స్ ద్వారా భవనాన్ని రీఇన్ఫోర్స్ చేయడం ద్వారా భద్రతను పెంచుతుంది.ఖర్చుల అంచనాఒక సాధారణ 1000 చ.అ.ఇంటి నిర్మాణానికి ఫౌండేషన్ ఖర్చు రూ.3.7 లక్షల నుండి రూ.5.9 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో మెటీరియల్స్, కార్మికుల వ్యయం, సాయిల్ టెస్టింగ్, నిర్మాణ డిజైన్ ఖర్చులు ఉంటాయి. ప్రస్తుత మార్కెట్లో ఒక బ్యాగు సిమెంట్ ధరలు రూ.350–రూ.400, స్టీల్ కేజీ రూ.60–రూ.70, ఇసుక ఇక క్యూబిక్ అడుగుకు రూ.40–రూ.60 మధ్య ఉన్నాయి. ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. అందుకే, నిర్మాణానికి ముందు స్థానిక కనస్ట్రక్టర్ లేదా స్ట్రక్చరల్ ఇంజినీర్ సలహా తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: ప్లాటుకు పరీక్ష.. పాస్ అయితేనే ఇల్లు!ఇంటిని నిర్మించడం అంటే భద్రత, మన్నిక, అందం అన్నీ మిళితమైన ప్రక్రియ. పునాది పద్ధతులు కూడా ఈ మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నాయి. పర్యావరణ అనుకూలత, నిర్మాణ వేగం, ఖర్చు తగ్గింపు వంటి అంశాలు కొత్త పద్ధతుల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. భవిష్యత్తులో త్రీడీ ప్రింటెడ్ ఫౌండేషన్లు, స్మార్ట్ సెన్సర్లతో సాయిల్ మానిటరింగ్ వంటి సాంకేతికతలు కూడా అందుబాటులోకి రావొచ్చు. -
కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు
చాలా మటుకు టెక్నాలజీ నిపుణులు కొత్త అవకాశాలపై ఆసక్తిగా ఉన్నప్పటికీ .. ఉద్యోగాల ఎంపిక విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. తమ లక్ష్యాలు, కెరియర్ పురోగతి, శారీరక .. మానసిక ఆరోగ్ లాంటి అంశాలకు సదరు ఉద్యోగం ఎంత వరకు దోహదపడుతుందనేది బేరీజు వేసుకుంటున్నారు. దేశీ టెకీలపై గ్లోబల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం అంతర్జాతీయంగా అత్యంత ఆత్మవిశ్వాసంతో, ఉద్యోగాల ఎంపికలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న టెక్ నిపుణుల్లో భారతీయ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన సర్వేలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,000 మంది ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. భారతీయ ప్రొఫెషనల్స్లో 94 శాతం మంది కొత్త అవకాశాలపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. మరిన్ని విశేషాలు.. → అంతర్జాతీయంగా అవకాశాలను పరిశీలించాలనే ఆలోచనే తాము ఉద్యోగాలు మారడానికి ప్రేరణగా ఉంటుందని 39 శాతం మంది టెకీలు తెలిపారు. మెరుగైన జీతం, వృద్ధి అవకాశాలు కారణమని 31 శాతం మంది చెప్పారు. → వెసులుబాటు విషయంలో టెక్ నిపుణులు ఏమాత్రం రాజీపడటం లేదు. 26 శాతం మంది సరళతరమైన పని విధానాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఒకవేళ మాటిమాటికీ ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని 45 శాతం మంది తెలిపారు. → 23 శాతం మంది తమ ప్రస్తుత వేతనాలపై అసంతృప్తిగా ఉన్నారు. 20 శాతం మంది చురుగ్గా శిక్షణ పొందుతున్నారు. అర్థవంతమైన పని, కెరియర్లో వృద్ధి అవకాశాలకు ప్రాధాన్యతనివ్వడానికి మొగ్గు చూపుతున్నారు. → టెక్ నిపుణులు, ఉద్యోగాలను ఎంచుకోవడంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు కూడా కేవలం మెరుగైన వేతనాన్ని ఇవ్వజూపడానికే పరిమితం కాకుండా వెసులుబాటు, వృద్ధి అవకాశా ల్లాంటివి కూడా ఆఫర్ చేయాల్సి వస్తోంది. → హైబ్రిడ్ పని, ఏఐ సన్నద్ధతపై పెట్టుబడులు, నమ్మకం..పారదర్శకతకు పెద్దపీట వేసే సంస్కృతిని పెంపొందించే కంపెనీలు టాప్ ప్రతిభావంతులను ఆకర్షించడంతో పాటు పోటీ మార్కెట్లోను గట్టిగా నిలబడటానికి వీలుంటుంది. -
ఫ్లిప్కార్ట్కు నష్టం.. మింత్రాకు లాభం
గత ఆర్థిక సంవత్సరంలో ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇండియా నష్టం మరింత పెరిగి రూ. 5,189 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు రూ. 4,248 కోట్లుగా నమోదయ్యాయి. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం టోఫ్లర్ ప్రకారం.. తాజాగా ఆదాయం రూ. 70,542 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ. 82,787 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 88,121 కోట్లకు చేరాయి. మింత్రా లాభం జూమ్..ఫ్యాషన్, లైఫ్స్టయిల్ ఈ–కామర్స్ సంస్థ మింత్రా డిజైన్స్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 548 కోట్ల లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 31 కోట్లతో పోలిస్తే ఇది అనేక రెట్లు అధికం కావడం గమనార్హం. మరోవైపు, సమీక్షాకాలంలో సంస్థ ఆదాయం రూ. 5,122 కోట్ల నుంచి 18 శాతం వృద్ధి చెంది రూ. 6,043 కోట్లకు చేరింది. -
జాబ్ హగ్గింగ్: ప్రమాదంలో ఉద్యోగుల భవిష్యత్!
సాధారణంగా ఉద్యోగం నచ్చకపోతే.. మరో ఉద్యోగంలో చేరుతారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. కొంతమంది ఉద్యోగులకు తాము చేస్తున్న జాబ్ నచ్చకపోయినా.. కొత్త ఉద్యోగంలో చేరడానికి భయపడుతున్నారు. దీనిని 'జాబ్ హగ్గింగ్' అని నిపుణులు చెబుతున్నారు.ఆర్ధిక అనిశ్చితి, ఉద్యోగ భద్రత లేకుండా పోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగుల్లో ఒకింత భయం మొదలైంది. ఇటీవల కాలంలో అమెరికాలో ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఉన్న ఉద్యోగంలోనే సురక్షితంగా ఉంటే చాలనుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొత్త ఉద్యోగాల కోసం వెతికే సమయం కూడా పెరిగిపోయింది.కోవిడ్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా లేఆప్స్ ఎక్కువయ్యాయి. లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో జాబ్ హగ్గింగ్ మొదలైంది. జాబ్ హగ్గింగ్ అంటే.. ఉద్యోగులు కంపెనీ పట్ల విధేయతతో ఉన్నట్లు కాదు. అది వాళ్ల భయానికి సూచన అని నిపుణులు చెబుతున్నారు. చేస్తున్న పనిలో సంతృప్తి లేకపోయినా.. పరిస్థితులను చూసి భయపడి ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేని పరిస్థితి వాళ్లదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికసంవత్సరాల తరబడి.. ఉద్యోగులు ఉద్యోగాల్లో కొనసాగడం యజమానికి మంచిదిగా అనిపించినా.. ఉద్యోగుల్లో మార్పు, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆలోచన తగ్గిపోతుంది. ఇది సంస్థను మాత్రమే కాదు, ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. భయంతో ఉన్నవారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండరు. ఇది పని వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి వారిని కంపెనీ గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. -
గేమ్లోని సీక్రెట్ ఫ్రెండ్స్.. చప్పుడుదే విజయం!
గేమ్లో గెలవాలంటే కేవలం టాలెంట్ సరిపోదు, తోడుగా సీక్రెట్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అలా గెలుపు వెనుక ఉన్న సీక్రెట్ ఫ్రెండ్స్ వీళ్లే!స్పీడ్ డబుల్!గేమ్ ఆడుతున్నప్పుడు చివరి రౌండ్లో చేతి చెమటతో స్క్రీన్ జారిపోయి, అవుట్ అయితే వచ్చే బాధ, ఒక్క గేమింగ్ లవర్స్కి మాత్రమే తెలుసు. అలాంటి వారికి చాలా అవసరం ఈ రేజర్ గేమింగ్ వేలు కవచం. ఇది ప్రత్యేకంగా నేసిన వెండి తంతులతో తయారైంది. అందువలన టచ్ చాలా స్పష్టంగా, వేగంగా ఉంటుంది. చెమట పట్టినా వేళ్లు ఎప్పుడూ పొడిగా, చల్లగా ఉంటాయి. దీని మందం కేవలం 0.8 మిల్లీమీటర్ మాత్రమే. బరువు తేలికగా ఉన్నా, శక్తి మాత్రం యుద్ధంలో గెలిపించేంత బలంగా ఉంటుంది. ఇది చిన్న వేలు అయినా, పెద్ద వేలు అయినా సులభంగా సరిపోతుంది. కడిగి మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. పబ్జీ, ఫ్రీ ఫైర్, బీజీఎంఐ వంటి అన్ని హైస్పీడ్ మొబైల్ గేమ్స్కు ఇది అద్భుతంగా సరిపోతుంది. ధర కేవలం రూ.1200 మాత్రమే!కూల్ బేబీ కూల్!గేమ్ ఆడితే మనసు రిలాక్స్ అవుతుంది కాని, ఎక్కువసేపు ఆడితే మాత్రం కంప్యూటర్ వేడెక్కుతుంది. ఇక దాని ఫ్యాన్ శబ్దం చెవులను మోగిస్తుంది. ఆ టెన్షన్ దూరం చేయడానికి ఈ ఆర్జీబీ ఎల్ఈడీ కేస్ ఫ్యాన్ సిద్ధంగా ఉంది. 120 మిల్లీమీటర్ల సైజుతో, నిమిషానికి 1500 సార్లు తిరుగుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన దీని బ్లేడ్లు గాలి ఒత్తిడిని సమంగా పంచి పీసీని చల్లగా, సైలెంట్గా ఉంచుతాయి. ఇక ఫ్యాన్లోని ఎల్ఈడీలు కంప్యూటర్ లుక్నే మార్చేస్తాయి. రంగులు మెరిసిపోతూ గేమింగ్ మూడ్ను మరింత పెంచుతాయి. కనెక్టర్తో సులభంగా అమర్చుకోవచ్చు. బలమైన నైలాన్, నాణ్యమైన ప్లాస్టిక్తో తయారవడంతో దీర్ఘకాలం మన్నుతుంది. ధర రూ.699.చప్పుడుదే విజయం!గేమ్లో గెలవాలంటే కేవలం చూపు, చేతులు మాత్రమే కాదు, వినికిడి కూడా కీలకం. అడుగులు, గన్ ఫైర్, తుపాకీ రీలోడ్, శత్రువు దగ్గరగా వస్తున్న శబ్దం లాంటివన్నీ స్పష్టంగా వినిపించాలంటే అవసరమైంది ఈ సరౌండింగ్ గేమింగ్ హెడ్సెట్. మృదువైన ఇయర్ ప్యాడ్స్ వలన గంటల తరబడి వేసుకున్నా చెవులకు ఎలాంటి బరువూ అనిపించదు. 120 డిగ్రీల వరకు తిప్పుకునే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ వాయిస్ని స్పష్టంగా అందిస్తుంది, బయటి శబ్దాన్ని తగ్గిస్తుంది. టీమ్తో ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇబ్బంది లేకుండా గేమ్లో మరింత ఫోకస్ పెంచుతుంది. దీనిని పీసీ, ఎక్స్బాక్స్ వన్, ప్లేస్టేషన్, మొబైల్ ఇలా అన్నింటికీ సులభంగా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ధర కేవలం రూ.1,990. -
అందమైన దేశంలో శాశ్వత నివాసం: భారతీయులకు అవకాశం
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుగాంచిన 'ఫిన్లాండ్'.. భారతీయులకు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వర్క్, ఎడ్యుకేషన్ ప్రయోజనాల నుంచి ఫ్యామిలీ స్పాన్సర్షిప్ వరకు అన్ని సదుపాయాలను అందించడానికి దేశం సిద్ధంగా ఉంది.అందమైన దేశమే కాకుండా.. జీవించడానికి కూడా ప్రసిద్ధి చెందిన ఫిన్లాండ్, వరుసగా ఎనిమిది సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ర్యాంక్ సాధించింది. ఈ దేశంలో భారతీయులు శాశ్వతంగా నివాసం ఉండటానికి.. అక్కడి ప్రభుత్వం అర్హతగల అభ్యర్థులకు శాశ్వత నివాస అనుమతి (PR) కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.ప్రయోజనాలు & అర్హతలుఫిన్లాండ్లో శాశ్వత నివాసం ఉండటం వల్ల.. సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్య, పెన్షన్ పథకాల వంటి ప్రయోజనాలు పొందవచ్చు.మీ కుటుంబ సభ్యులను మీతో చేర్చుకోవడానికి మీరే స్పాన్సర్ చేయవచ్చు. కంటిన్యూస్ రెసిడెంట్ పర్మిట్ కోసం ఫిన్లాండ్లో కనీసం నాలుగు సంవత్సరాలు నివసించి ఉండాలి. ఈ వ్యవధి 2026 జనవరి నుంచి ఆరు సంవత్సరాలకు పెరుగుతుంది.●ఫిన్లాండ్లో నివసించడానికి కనీస వార్షిక ఆదాయం 40000 యూరోలు (సుమారు రూ.41.3 లక్షలు). ●2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్తో గుర్తింపు పొందిన మాస్టర్స్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా 3 సంవత్సరాల వర్క్ ●ఎక్స్పీరియన్స్తో ఉన్నత స్థాయి ఫిన్నిష్/స్వీడిష్ లాంగ్వేజ్ స్కిల్స్.●దరఖాస్తుదారులు తప్పనిసరిగా క్లీన్ క్రిమినల్ రికార్డ్ కలిగి ఉండాలి.అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్●చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ & పాస్పోర్ట్ ఫోటోలు●ఆర్థిక స్థిరత్వానికి కావాల్సిన రుజువు●మీ పాస్పోర్ట్ ఐడీ పేజీ కాపీ●విద్య, ఉపాధి లేదా భాషా నైపుణ్యాలను నిరూపించే ఏవైనా డాక్యుమెంట్స్అప్లై చేసుకోవడం ఎలా●ఎంటర్ ఫిన్లాండ్ ద్వారా దరఖాస్తు ఫారమ్ను ఆన్లైన్లో ఫిల్ చేసుకోవచ్చు. పేపర్ దరఖాస్తుకు కూడా అనుమతి ఉంది.దరఖాస్తు ఫీజు చెల్లించాలి●బయోమెట్రిక్స్ ఇవ్వడానికి ఫిన్నిష్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ లేదా వీఎఫ్ఎస్ గ్లోబల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ ●పూర్తయిన తరువాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు.●మీ అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత.. రెసిడెన్సీ కార్డును రాయబార కార్యాలయం లేదా సేవా కేంద్రం నుంచి తీసుకోవచ్చు.శాశ్వత నివాసం కోసం అప్లికేషన్ ఫీజు●ఎలక్ట్రానిక్ అప్లికేషన్: 240 యూరోలు (సుమారు రూ. 24,800)●పేపర్ అప్లికేషన్: 350 యూరోలు (సుమారు రూ. 36,100)●18 ఏళ్లలోపు దరఖాస్తుదారులు: 180 యూరోలు (సుమారు రూ. 18,600)ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక -
జోరుమీదునున్న రియల్ ఎస్టేట్: 15 ఏళ్లలో..
గత పదిహేనేళ్లలో భారత రియల్టీ రంగంలో 80 బిలియన్ డాలర్ల(రూ.7 లక్షల కోట్లకుపైగా) పెట్టుబడులు ప్రవహించినట్లు క్రెడాయ్, కొలియర్స్ ఇక్కడ విడుదల చేసిన సంయుక్త నివేదిక వెల్లడించింది. 2010 నుంచి దేశీ రియల్టీ రంగం సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేసింది. గత దశాబ్దన్నర కాలం పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్లు 57 శాతం సమకూర్చినట్లు నివేదిక పేర్కొంది.దేశీ రియల్టీ సమాఖ్య క్రెడాయ్, రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా సంయుక్తంగా నివేదికను విడుదల చేశాయి. క్రెడాయ్ నిర్వహించిన వార్షిక జాతీయ సదస్సు(నాట్కన్)లో ‘భారత రియాల్టీ: ఈక్విటీ పురోభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతం’ పేరిట నివేదికను వెలువరించాయి.కోవిడ్ మహమ్మారి తదుపరి దేశీ పెట్టుబడులు సైతం పుంజుకున్నట్లు నివేదిక పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్ గ్రూప్లు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ప్రయివేట్ ఈక్విటీ, విదేశీ పెట్టుబడులున్న ఎన్బీఎఫ్సీలు, రీట్లు, సావరిన్ వెల్త్ ఫండ్స్ ఉన్నట్లు నివేదిక వివరించింది.దేశీ రియల్టీ మార్కెట్ పరిమాణం 2047కల్లా 5-10 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. 2047కల్లా దేశీ రియల్టీ రంగాన్ని కేవలం చదరపు అడుగులు లేదా ఆస్తుల విలువ ద్వారా కాకుండా కోట్లమంది ప్రజల కోసం సృష్టించిన నాణ్యమైన జీవనం ద్వారా మదింపు చేయవలసి ఉంటుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ వ్యాఖ్యానించారు. -
ఐటీఆర్ ఫైలింగ్ ఆలస్యమైతే.. ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు సమీపించింది. ట్యాక్స్ పేయర్స్ 2025 సెప్టెంబర్ 15 లోపల ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ గడువును ఇప్పటికే 2025 జులై 31 నుంచి పొడిగించారు. ఇప్పుడు మళ్లీ పొడిగిస్తారా?, లేదా? అనేదానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. గడువు తీరిన తరువాత కూడా ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.గడువు తీరని తరువాత.. డిసెంబర్ 31, 2025 వరకు రూ. 5000 వరకు ఆలస్య రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి జరిమానా గరిష్టంగా రూ. 1000 ఉంటుంది.ఇక్కడ ఫైన్ ఒక్కటే సమస్య కాదు. కొన్నిసార్లు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ప్రాసిక్యూషన్ కూడా ఉండవచ్చు. గత సంవత్సరం.. ఢిల్లీలోని ఒక మహిళ తన ఐటీఆర్ దాఖలు చేయనందుకు ఆమెకు జైలు శిక్ష విధించారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే.. గడువు లోపలే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం ఉత్తమం.ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం & ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు➤ఐటీఆర్ ఫైల్ ఆలస్యమైతే జరిమానాలు చెల్లించడం మాత్రమే కాకుండా.. 234ఏ, 234బీ, 234సీ సెకన్ల కింద పన్ను బకాయి రకాన్ని బట్టి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకుంటే.. ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు.➤ఐటీఆర్ ఫైలింగ్లో ఆలస్యం కారణంగా.. ప్రాసెసింగ్ ఆలస్యం కావొచ్చు. దీంతోపాటు రీఫండ్ కూడా ఆలస్యంగా వస్తుంది.➤ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల.. మీ రిటర్న్స్ను ఇన్కమ్ ట్యాక్ డిపార్ట్మెంట్ మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కూడా ఉంది.➤ఆలస్యంగా అయినా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్సయితే.. ఐటీ శాఖ నేరుగా నోటీసులు పంపించే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడకపోవడానికి కారణాన్ని గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. -
నిర్మాణ సామగ్రిపై తగ్గిన జీఎస్టీ.. గృహాలకు పెరగనున్న డిమాండ్
కేంద్రం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని సవరించింది. జీఎస్టీ సంస్కరణలు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధానమైన సానుకూల మార్పు. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ 2.0 నిర్మాణ రంగానికి పెద్ద ఉపశమనమే. గృహ, కార్యాలయ, రిటైల్ విభాగాల వృద్ధికి దోహదపడటంతో పాటు సరళీకృత పన్ను విధానంతో పారదర్శకత, స్థిరాస్తి కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరుగుతోంది. అయితే నిర్మాణ సామగ్రిపై తగ్గే జీఎస్టీ భారాన్ని.. ఆమేరకు డెవలపర్లు ప్రాపర్టీ కొనుగోలుదారులకు బదలాయిస్తే గనక రానున్న దసరా, దీపావళి పండుగ సీజన్ కస్టమర్లలో రెట్టింపు జోష్ నిండుకుంటుంది.నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గింపు..నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగులు వంటి పలు నిర్మాణ సామగ్రి ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో డెవలపర్కు 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. అయితే ఈ తగ్గింపును డెవలపర్లు గృహ కొనుగోలుదారులకు బదలాయిస్తారా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.నిర్మాణ పనులు వేగవంతం..జీఎస్టీ గతంలో మాదిరిగా ఐదు పన్ను శ్లాబులతో గందరగోళంగా లేకుండా రెండు రకాల ట్యాక్స్ ఫ్రేమ్వర్క్లను కేంద్రం తీసుకొచ్చింది. దీంతో ప్రాపర్టీ కొనుగోలుదారుల్లో పన్ను చిక్కులు తొలుగుతాయి. స్థిరాస్తి రంగంలోకి మరిన్ని సంస్థాగత పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇన్పుట్ ఖర్చులు తగ్గుతుండటంతో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతమవడంతో పాటు కొత్త ప్రాజెక్ట్ల లాంచింగ్స్కు డెవలపర్లు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం దేశంలో పట్టణ మార్కెట్లలో దాదాపు కోటి బడ్జెట్ గృహాల కొరత ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య 2.5 కోట్లకు చేరుతుంది. ఇలాంటి సమయంలో కేంద్రం జీఎస్టీ తగ్గింపు చేయడం బడ్జెట్ గృహాలకు పెద్ద ఉపశమనం.ఏ విభాగంలో ఎంత ప్రయోజనమంటే? గృహ విభాగం: సిమెంట్పై జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ ఖర్చులు 3–5 శాతం మేర తగ్గుతాయి. ముఖ్యంగా రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే చౌక గృహాలను నిర్మిస్తున్న డెవలపర్లకు నగదు ప్రవాహం, మార్జిన్లు పెరుగుతాయి. దీంతో ఈ విభాగంలోని బిల్డర్లకు గణనీయమైన ఉపశమనం కలుగుతుంది. ఇప్పటి వరకు నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ భారం కారణంగా అందుబాటు గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ఆసక్తి చూపించలేదు. దీంతో మొత్తం కొత్త గృహాల సరఫరాలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా 2019లో 40 శాతంగా ఉండగా.. 2025 తొలి అర్ధభాగం నాటికి ఏకంగా 12 శాతానికి పడిపోయింది. అలాగే విక్రయాలలో ఈ విభాగం వాటా 2019లో 40 శాతంగా ఉండగా.. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది. తాజాగా కేంద్రం జీఎస్టీ సవరణతో నిర్మాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. అయితే ఈ తగ్గింపు వ్యయాలను డెవలపర్లు గృహ కొనుగోలుదారులకు బదలాయిస్తే గనక అందబాటు గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.కార్యాలయ విభాగం: ప్రస్తుతం కార్యాలయ విభాగం 12 శాతం జీఎస్టీ ఉంది. ఇన్పుట్ క్రెడిట్(ఐటీసీ) కూడా అందుకోవచ్చు. అయితే ఇటీవల పరిణామాలు పరిస్థితిని కొంచెం క్లిష్టతరం చేశాయి. వాణిజ్య ఆస్తుల లీజులపై ఐటీసీని తొలగించారు. దీంతో డెవలపర్లు ఇకపై ప్రాజెక్ట్ సంబంధిత వ్యయాలపై ఐటీసీని క్లెయిమ్ చేయలేరు. దీంతో కార్యాలయ స్థలాలు, ఇతర వాణిజ్య ఆస్తుల కార్యాచరణ ఖర్చులు, అద్దె ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే రిజిస్టర్ చేయని వాణిజ్య ఆస్తుల అద్దెలు రివర్స్ ఛార్జ్ మెకానిజం(ఆర్సీఎం) ప్రకారం అద్దెదారులు 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాణిజ్య ప్రాపర్టీలను అద్దెకు తీసుకునేవారికి ఇది అదనపు భారమే.రిటైల్ విభాగం: నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గింపు డెవలపర్లకు ఇన్పుట్ ఖర్చులను తగ్గిస్తుంది. దీంతో షాపింగ్ మాల్స్, రిటైల్ కాంప్లెక్స్ల నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి రిటైల్ ప్రాజెక్ట్ల సరఫరా పెరగడంతో పాటు రిటైల్ అద్దెలలో పోటీ పెరుగుతుంది. జీఎస్టీ సవరణ లాజిస్టిక్ ఖర్చులను కూడా తగ్గిస్తుంది. సరఫరా గొలుసులను క్రమబదీ్ధకరించడంలో సహాయపడుతుంది. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే రిటైల్ ప్రాపరీ్టల అద్దె ఆదాయంపై మాత్రం జీఎస్టీ 18 శాతం చెల్లించాల్సిందే. ఇది ఆయా అద్దెదారులకు కాసింత ఇబ్బందే..ఏ నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ ఎంతంటే? ➤సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్(ఆర్ఎంసీ): గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. 18 శాతానికి తగ్గింది. ➤టైల్స్, ఇసుక, ఇటుకలు: 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. ➤రంగులు, వార్నిష్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది. ➤మార్బుల్, గ్రానైట్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది. -
భారీగా పెరిగిన బంగారం: పెట్టుబడికి ఓ మంచి మార్గం!
బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2024 సెప్టెంబర్లో దాదాపు రూ.73,200 వద్ద ఉండేది. అదే ఇప్పుడు (2025 సెప్టెంబర్) రూ.1,11,000కు చేరింది. అంటే రేటు సుమారు 54 శాతం పెరిగిందన్నమాట. గోల్డ్ ధరలు మాత్రమే కాకుండా.. గోల్డ్ ఈటిఎఫ్లు కూడా 50% వరకు రాబడిని అందించాయి. ఇది ఈటిఎఫ్లలో పెట్టుబడులను పెంచడానికి దోహదపడింది.2025 ఆగస్టులో గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడులు రూ.2,189.5 కోట్లు అని తెలుస్తోంది. ఏఎంఎఫ్ఐ ప్రకారం.. గోల్డ్ ఈటిఎఫ్లలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ.72,495 కోట్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని స్పష్టమవుతోంది.గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఏమిటి?గోల్డ్ ఈటీఎఫ్లు అనేవి.. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే మ్యూచువల్ ఫండ్ వంటిది అన్నమాట. పెట్టుబడిదారులు షేర్ల మాదిరిగానే డీమ్యాట్ ఖాతాల ద్వారా ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు, తద్వారా వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వీటి విలువ బంగారం ధరలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.పెట్టుబడిదారులు గోల్డ్ ఈటిఎఫ్లను ఎందుకు ఇష్టపడతారు●గోల్డ్ ఈటీఎఫ్లను స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు.●సాధారణ బంగారం మాదిరిగా.. గోల్డ్ ఈటిఎఫ్లనుప్రత్యేకంగా భద్రపరచాల్సిన అవసరం లేదు.●గోల్డ్ ఈటీఎఫ్లను చిన్న మొత్తంలో.. అంటే రూ. 500 లేదా రూ. 1000 కి కూడా కొనుగోలు చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.●గోల్డ్ ఈటీఎఫ్లకు మంచి లిక్విడిటీ ఉంటుంది. వీటిని తొందరగా అమ్మవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.బంగారంపై పెట్టుబడికి మార్గాలు●గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: ప్రధానంగా గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడి●సావరిన్ గోల్డ్ బాండ్లు: వడ్డీతో పాటు, పెరిగిన ధరలను అందుకోవచ్చు●భౌతిక బంగారం: ఆభరణాలు, నాణేలు, కడ్డీలుబంగారం ధరలు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, కరెన్సీ కదలికలు, భౌగోళిక రాజకీయ సంఘటనలు వంటివన్నీ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి బంగారంపై సురక్షితమైనదని నిపుణులు చెబుతారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి విషయంలో పెట్టుబడిదారుడే నిర్ణయం తీసుకోవాలి. -
రిస్క్లో ఎస్ఎంఈ రుణాలు
ముంబై: చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్ఎంఈలు) రుణాలలో రిస్్కకు వీలున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా అంచనా వేసింది. బ్యాంకులు ఆఫర్ చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లు కనిష్టస్థాయికి చేరాయని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక రేట్లను నిలువరిస్తే ఇవి మరింత తగ్గకపోవచ్చునని తెలియజేసింది. రుణ వృద్ధి మందగిస్తే మాత్రమే రేట్ల తగ్గింపునకు వీలుంటుందని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో బ్యాంకింగ్ వ్యవస్థ రుణ వృద్ధి 10.5 శాతంగా నమోదుకానున్నట్లు తెలియజేసింది.ఎన్బీఎఫ్సీల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 15–17 శాతం వృద్ధి చూపనున్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతం బ్యాంకింగ్ దిగ్గజాలు ఏడాది కాలావధి డిపాజిట్లపై 6 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు ప్రస్తావించింది. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థకు స్థిరత్వం(నిలకడ)తో కూడిన ఔట్లుక్ను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. పెరగనున్న వినియోగం, యూఎస్ తుది టారిఫ్లు, వాటి ప్రభావం, మందగమన వృద్ధితో ఉపాధి మార్కెట్పై ప్రభావం, ఆస్తుల(రుణాల) నాణ్యతా ఆందోళనలు తదితరాలను గమనించదగ్గ కీలక అంశాలుగా పేర్కొంది. ఒత్తిళ్ల సంకేతాలు రూ. 25 లక్షలలోపు రుణాలు పొందిన ఎస్ఎంఈ పోర్ట్ఫోలియో నుంచి చెల్లింపుల్లో ఒత్తిడి ఎదురవుతున్నట్లు ఇక్రా సీనియర్ వైస్ప్రెసిడెంట్ అనిల్ గుప్తా పేర్కొన్నారు. ప్రొప్రయిటరీషిప్ కంపెనీల నుంచి రుణ చెల్లింపుల్లో ఒత్తిడి సంకేతాలు రుణదాతలకు కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్బీఎఫ్సీ రుణదాతలకు హామీతోకూడిన, హామీలేని ఎస్ఎంఈ రుణాలలో (రుణ)నష్టాలు నమోదవుతున్నట్లు వివరించారు. 2025 మార్చిలో అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 3.4 శాతం పెరిగినట్లు వెల్లడించారు. దీనికితోడు యూఎస్ టారిఫ్లు ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రభావం చూపితే అధిక ఈల్డ్తోకూడిన, తక్కువస్థాయి రుణాలపై మరింత ఒత్తిడి పెరగనున్నట్లు అభిప్రాయపడ్డారు. 20 శాతానికంటే అధిక రుణ రేట్లుగల రుణాలపై ఈ ప్రభావం అధికంగా కనిపించనున్నట్లు వివరించారు. యూఎస్ టారిఫ్లతో ఎన్బీఎఫ్సీలకంటే బ్యాంకులపైనే ప్రతికూల ప్రభావం పడనున్నట్లు సీనియర్ వైస్ప్రెసిడెంట్ ఏఎం కార్తీక్ పేర్కొన్నారు. ఎగుమతిదారులకు రుణాలందించడం ఇందుకు కారణంకానున్నట్లు తెలియజేశారు. అయితే వీటి వాటా తక్కువకావడంతో బ్యాంకులపై ఒత్తిడి నెలకొనే అవకాశంలేదని అభిప్రాయపడ్డారు. -
ఆరు కోట్లు దాటిన ఐటీ రిటర్నులు
న్యూఢిల్లీ: 2025–26 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి సెపె్టంబర్ 13 (శనివారం) నాటికి ఆరు కోట్ల పైగా రిటర్నులు దాఖలైనట్లు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. తుది గడువు (సెపె్టంబర్ 15 గడువు) దగ్గర పడుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘‘ఆరు కోట్ల మైలురాయిని చేరుకునేందుకు సహకరించిన పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులకు ధన్యవాదాలు. రిటర్నుల ఫైలింగ్లో పన్ను చెల్లింపుదారులకు సాయంగా హెల్ప్ డెస్్కలు, వారమంతా ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తాయి. కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ఎక్స్ సెషన్లు, ఎక్స్ ద్వారా హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది’’ అని తన ఎక్స్ అకౌంట్ పోస్ట్ ద్వారా తెలిపింది. రిటర్నులు ఇంకా సమర్పించని పన్ను చెల్లింపుదారులు వెంటనే దాఖలు చేయాలని సూచించింది. చివరి నిమిషం వరకు వేచిచూడొద్దని కోరింది. ఆదాయపన్ను శాఖ ఇప్పటికే జూలై 31వ తేదీ నుంచి సెపె్టంబర్ 15వ తేదీ వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. గత అసెస్మెంట్ సంవత్సరంలో 2024 జులై 31 నాటికి 7.28 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. అంతకుముందు ఏడాది 6.77 కోట్ల రిటర్నుల ఫైలింగ్తో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 7.5% పెరిగాయి. -
వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: వెండి ఆభరణాలు, వస్తువులకు హాల్మార్కింగ్ను తప్పనిసరి అమలు చేయడాన్ని ప్రభుత్వం ఆరు నెలల తర్వాత పరిశీలిస్తుందని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. సెపె్టంబర్ 1 నుంచి వెండి ఆభరణాలు, వస్తువులకు స్వచ్ఛంద హాల్మార్కింగ్ను ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం తెలిసిందే. ‘‘దీని ఫలితాలను పరిశీలించేందుకు కనీసం ఆరు నెలల సమయం అవసరం. ప్రస్తుత ప్రక్రియను ఆరు నెల పాటు పరిశీలిస్తాం. ఆ తర్వాతే తప్పనిసరి చేయాలా? లేదా? అన్నది నిర్ణయిస్తాం’’అని ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు. చిన్న వర్తకులు వెండిని కరిగించి ఆభరణాలు తయారు చేస్తుంటారని, వారిని తప్పనిసరి హాల్మార్కింగ్ సర్టిఫికేషన్ కిందకు తీసుకురావడం సవాలుగా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజాదరణ పొందాలంటే పెట్రోల్ పంపుల మాదిరి మౌలిక వసతులు ఉండాలని తివారీ అభిప్రాయపడ్డారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్కు సంబంధించి ప్రమాణాలను అభివృద్ధి చేశామని, అవి ముసాయిదా దశలో ఉన్నట్టు చెప్పారు. -
ఏఐకి మహిళా టెకీల జై..
ముంబై: మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని టెక్నాలజీ రంగంలో అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు. జాబ్స్, కెరియర్ ప్లాట్ఫాం అప్నా డాట్కో నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం మహిళా టెకీలు ఏఐ ఆధారిత కెరియర్ల కోసం సన్నద్ధమవుతున్నారు. 58 శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో భాగంగానో లేదా ఏదైనా ప్రోగ్రాంలలో చేరడం ద్వారానో లేక స్వయంగానో ఏఐ/ఎంఎల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. 24 శాతం మంది త్వరలోనే శిక్షణ పొందే యోచనలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న 11,300 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో అత్యధిక భాగం మహిళలు జెన్ జెడ్ విభాగానికి (పాతికేళ్ల లోపు వారు) చెందినవారే. వీరిలో 60 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు కాగా, మూడింట రెండొంతుల మంది సాధారణ కాలేజీల్లో చదివినవారే. ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి డిమాండ్.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు కావాలనుకుంటున్నారు. అలాగే 19 శాతం మంది డేటా సైన్స్.. మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 14 శాతం మంది ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 10 శాతం మంది రీసెర్చ్ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏఐని ఏదో ఆషామాషీ ట్రెండ్గా కాకుండా సమాన అవకాశాలను కల్పించే దోహదకారిగా మహిళా టెకీలు భావిస్తున్నట్లు తెలుస్తోందని అప్నాడాట్కో వ్యవస్థాపకుడు నిర్మిత్ పారిఖ్ తెలిపారు. మరోవైపు, ఇప్పుడు పేరొందిన కాలేజీ నుంచి పట్టా పొందడం కన్నా ఏఐలో నైపుణ్యాలే చాలా ముఖ్యమని మూడింట రెండొంతుల టెకీలు భావిస్తున్నారు. జెన్ జెడ్ అమ్మాయిల్లో (22–25 ఏళ్ల వయస్సున్న వారిలో 62 శాతం మంది), ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళల్లో (74 శాతం మంది) ఈ భావన అత్యధికంగా ఉంది.మెట్రోల్లో ఇది 66 శాతం మందిలో ఉంది. ఏఐని అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల విషయానికొస్తే.. నాణ్యమైన అవకాశాలు అందుబాటులో ఉండటం లేదని 42 శాతం మంది, బలమైన మెంటార్షిప్ లేదని 27 శాతం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆప్షన్లు అవసరమని 19 శాతం మంది తెలిపారు. -
కంపెనీల్లో జెన్ఏఐ నిపుణుల కొరత..
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ నిపుణల కొరతే పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది. పది జెన్ఏఐ ఉద్యోగాలుంటే నైపుణ్యాలున్న అభ్యర్ధులు ఒక్కరే ఉంటున్నారు. టీమ్లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిర్దిష్ట ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్ఎల్ఎం సేఫ్టీ..ట్యూనింగ్, ఏఐ ఆర్కె్రస్టేషన్, ఏజెంట్ డిజైన్, సిమ్యులేషన్ గవర్నెన్స్, ఏఐ కాంప్లయెన్స్, రిస్క్ ఆపరేషన్స్లాంటి ఏఐ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు.. జనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషిన్లెరి్నంగ్ ఆపరేషన్స్లాంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. సీనియర్లకు ఏటా రూ. 58–60 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → డిజిటల్ ఎకానమీలో ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా ఉంది. దానికి తగ్గట్లుగా నైపుణ్యాలున్న అభ్యర్ధులు లభించక, తీవ్ర కొరత నెలకొంది. దీంతో తగిన అర్హతలున్న వారికి కంపెనీలు భారీ వేతనాలిస్తున్నాయి. → జీసీసీల్లో సైబర్సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ ఉద్యోగుల వేతనాలు 2025–2027 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వార్షికంగా వరుసగా రూ. 28 లక్షల నుంచి రూ. 33.5 లక్షలకు, రూ. 23 లక్షల నుంచి రూ. 27 లక్షలకు పెరగనున్నాయి. → నాన్–టెక్ రంగాల్లోని టెక్ ఉద్యోగాలకు సంబంధించి ఐటీ సపోర్ట్, సంప్రదాయ తరహా సిస్టమ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో వేతనాలు వార్షికంగా రూ. 12 లక్షల స్థాయిలోనే స్థిరపడిపోయి ఉన్నాయి. పరిశ్రమ క్లౌడ్ నేటివ్, ఔట్సోర్స్డ్ సరీ్వస్ మోడల్స్ వైపు మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → ఏఐ మార్కెట్ ప్రస్తుతం హైపర్–గ్రోత్ దశలోకి అడుగుపెడుతోంది. ఏటా 45 శాతం వృద్ధితో 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రతి పది జెన్ఏఐ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన ఇంజినీరు ఒకే ఒక్కరు ఉంటున్నారు. → 2026 నాటికి ఏఐ టాలెంట్ అంతరాలు 53 శాతానికి పెరగనుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో డిమాండ్–సరఫరా మధ్య అంతరం 55–60 శాతానికి పెరగనుంది. → ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో పెద్ద స్థాయిలో శిక్షణను కల్పించకుంటే, కంపెనీల వృద్ధి ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. → ఏఐ వినియోగమనేది జాబ్ మార్కెట్ల రూపురేఖలను గణనీయంగా మార్చేయనుంది. గ్లోబల్ విధులు నిర్వహించే 40 శాతం వరకు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐటీ సరీ్వసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్లాంటి రంగాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలు ఏఐ–ఫస్ట్ లెర్నింగ్ మోడల్స్, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. → భారత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, నైపుణ్యాల్లో మార్పులకు ఇంజిన్లుగా వ్యవహరిస్తున్న జీసీసీలు, ఉద్యోగాల కల్పనకు సారథ్యం వహిస్తున్నాయి. 2025లో 22–25 శాతం మేర ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అత్యధికంగా కొలువులు ఉండనున్నాయి. → 2027లో అందుబాటులోకి రాబోయే 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాల్లో గణనీయ సంఖ్యలో కొలువులను (12 లక్షలు) జీసీసీలే కల్పించనున్నాయి. ప్రధానంగా జెన్ఏఐ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. → జీసీసీలు మెట్రో పరిధిని దాటి విస్తరిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,30,000–1,40,000 మంది తాజా గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనున్నాయి. వీరిలో ఎక్కువ శాతం హైరింగ్ ద్వితీయ, తృతీయ శ్రేణి ఇంజినీరింగ్ క్యాంపస్లలో ఉండొచ్చు. వైవిధ్యానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు టాప్ 20 జీసీసీల్లో 40 శాతం మంది సిబ్బంది మహిళలే ఉంటున్నారు. పరిశ్రమ సగటు కన్నా ఇది 1.5 రెట్లు అధికం. → 2027 నాటికి భారత్లో 2,100 పైగా జీసీసీలు ఉంటాయి. వీటిలో 30 లక్షల మంది పైగా ఉంటారు. -
2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు
2025 ప్రారంభమై ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయింది. ఇప్పటికే లెక్కకు మించిన కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లు లాంచ్ అయ్యాయి. కాగా ఈ ఏడాది లాంచ్ కావడానికి మరికొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. కొత్త కారు కొనాలని ఎదురుచూస్తున్న వాళ్లకు.. అవి బహుశా మంచి ఎంపిక కావొచ్చు. జీఎస్టీ సంస్కరణలు కూడా ధరలను కొంత తగ్గేలా చేస్తాయి.2025 చివరి నాటికి దేశంలో లాంచ్ అయ్యే కార్లు●మహీంద్రా థార్ ఫేస్లిఫ్ట్●మారుతి విక్టోరిస్●టాటా పంచ్ ఫేస్లిఫ్ట్●కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ●టాటా సియెర్రా ఈవీ●స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్●వోక్స్వ్యాగన్ టేరాన్మారుతి సుజుకి కొత్త విక్టోరిస్.. ఇప్పటికే షోరూమ్లకు రావడం ప్రారంభించింది. కాగా దీని ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ కారు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందుతుంది. విక్టోరిస్ మూడు పవర్ట్రెయిన్ (పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, పెట్రోల్-CNG) ఎంపికలలో లభిస్తుంది.టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ కూడా అక్టోబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో చిన్న డిజైన్ మార్పులు, అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నాయి. నవంబర్లో టాటా సియెర్రా ఈవీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హారియర్ ఈవీ మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కూడా కొత్త తరం వెన్యూ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది.ఇదీ చదవండి: డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటనమహీంద్రా థార్ కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ కానుంది. ఇది థార్ రాక్స్ మాదిరిగానే.. అదే ఇంజిన్, గేర్బాక్స్ ఎంపికలను పొందుతుంది. స్కోడా తన పెర్ఫార్మెన్స్ సెడాన్ ఆక్టేవియా ఆర్ఎస్ లాంచ్ చేయనుంది. దీనిని కంపెనీ భారతదేశానికి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీని ధర రూ. 50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వోక్స్వ్యాగన్ 2025 చివరి నాటికి టేరాన్ ప్రీమియం 7-సీటర్ లాంచ్ చేసే యోచనలో ఉంది. -
'నేను చెప్పినట్లు చేయండి.. లేకుంటే': ట్రంప్ పోస్ట్ వైరల్
డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. నాటో దేశాలు రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేసినందుకు చైనాపై 50-100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.అన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేసినప్పుడు.. నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను. నాటో సభ్యులు రష్యా చమురు కొనుగోలు చేయడం షాకింగ్గా ఉంది. యుద్ధంలో గెలవడానికి వారి నిబద్ధత 100% కంటే చాలా తక్కువగా ఉందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో వెల్లడించారు.రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశం చైనా, తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. నాటో సభ్యదేశమైన టర్కీ మూడవ స్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే 32 దేశాల కూటమిలో హంగరీ, స్లోవేకియా కూడా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.రష్యా చమురుపై నాటో నిషేధం, చైనాపై సుంకాలు ఇవన్నీ కూడా యుద్ధాన్ని ముగించడంలో గొప్ప సహాయకారిగా ఉంటాయి. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ, పట్టు ఉన్నాయి. తానూ విధిస్తున్న సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం జరగడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అని అన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజో బైడెన్ అధ్యక్షుదిగా ఉన్న సమయంలో.. నేను అధ్యక్షుడినై ఉండి ఉంటే, ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదు. ఇది బైడెన్, జెలెన్స్కీల యుద్ధం అని ట్రంప్ అన్నారు. నేను చెప్పినట్లుగా చేస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుంది, ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే.. మీరు నా సమయాన్ని, దేశ సమయాన్ని, శక్తిని, డబ్బును వృధా చేస్తున్నవారు అవుతారని ఆయన స్పష్టం చేశారు. -
చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారుతుందని ఇప్పటికే చాలామంది నిపుణులు పేర్కొన్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఆధునిక చరిత్రలో అతిపెద్ద మార్పు.. అని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఏఐ వల్ల చాలా మంది తెలివైన విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగం పెరుగుతుంది. చాలా మందికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ లోన్స్ అలాగే ఉన్నాయి. నాకు ఉద్యోగం లేదు, కాబట్టి.. ఏఐ నన్ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం లేదని అన్నారు.''కొన్నేళ్ల క్రితం.. పేద తండ్రి పాఠశాలకు వెళ్లు, మంచి గ్రేడ్లు పొందు, ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, అప్పుల నుంచి బయటపడు, డబ్బు ఆదా చేయు, మరియు స్టాక్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి విభిన్నమైన పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టు అని చెప్పే మాటలకు బదులుగా.. ధనవంతుడైన తండ్రి సలహాను అనుసరించాను. నేను ఒక వ్యవస్థాపకుడిని అయ్యాను, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాను, అప్పును ఉపయోగించాను. డబ్బును ఆదా చేయడానికి బదులుగా, నేను నిజమైన బంగారం, వెండి, నేడు బిట్కాయిన్లను ఆదా చేస్తున్నాను'' అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే.. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి అని హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా? -
ఇంటి అందాన్ని పెంచే టిప్స్
సాక్షి, సిటీబ్యూరో: దీపావళి వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లుతో పాటు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెలకువలతో ట్రెండీ లుక్ తీసుకు రావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో ఫ్రెండ్లీ దీపావళిగా మారుతుందంటున్నారు.➤సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తుల స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పల్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.300.➤ప్రముఖ ఎల్రక్టానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిని స్మార్ట్ఫోన్తో ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. వీటి ధర రూ.3 వేల నుంచి ఉన్నాయి.➤పండుగ సీజన్లో ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్ ఎంట్రెన్స్ లేదా భవనం మీద ఓం, స్వస్తిక్ వంటి చిహా్నలను పెట్టుకోవచ్చు. ఇవి ఎల్ఈడీ లైట్లతో తయారు చేసిన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.200 – 500 మధ్య ఉన్నాయి.➤రంగు రంగుల బాటిల్స్లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. వీటి ధర రూ.400 నుంచి ఉన్నాయి.➤అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్యరశి్మని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి. వీటిని హెవీ డ్యూటీ నైలాన్తో తయారు చేస్తారు. ఈ లాంతర్ సెట్లు వివిధ డిజైన్స్, రంగుల్లో దొరుకుతాయి.➤ఈ మధ్య కాలంలో నీళ్లలో తేలియాడే కొవ్వొత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. అలంకరణ ప్రాయంగా వీటిని పూల కుండీల్లో, మొక్కలున్న ప్రాంతాల్లో, స్విమ్మింగ్పూల్ వద్ద అమర్చుకోవచ్చు. ఇవి పరిమాణాలను బట్టి 8–10 గంటల వరకు కాంతినిస్తాయి. -
హోండా మోటార్సైకిల్ ప్రకటన: ఆ బైకులకు రీకాల్..
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా 2019 & 2025 మధ్య తయారైన ఆఫ్రికా ట్విన్ మోటార్సైకిళ్లకు రీకాల్ ప్రకటించింది. ఎడమవైపు ఉన్న హ్యాండిల్బార్ స్విచ్లోని వైరింగ్లో సమస్యను పరిష్కరించడానికి కంపెనీ స్వచ్ఛందంగా ఈ ప్రకటన చేసింది.ఈ సమస్య హ్యాండిల్ బార్ లోపల ఉన్న హార్నెస్ వైర్ నుంచి వస్తుంది. ఇది సాధారణ స్టీరింగ్ కదలికల కారణంగా పదే పదే వంగి ఉంటుంది. కాలక్రమేణా.. ఇది వైర్ జాయింట్ల వద్ద ఎలక్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. తద్వారా హారన్ పనిచేయకపోవచ్చని కంపెనీ గుర్తించింది. అంతే కాకుండా.. హెడ్లైట్ను లో బీమ్ నుంచి హై బీమ్కు మార్చడంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.2026 జనవరి చివరి వారం నుంచి.. భారతదేశంలోని అన్ని హోండా బిగ్వింగ్ డీలర్షిప్లు మీ బైక్ ఇప్పటికీ వారంటీలో ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా సమస్యను పరిష్కరిస్తాయి. కస్టమర్లకు కంపెనీ కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తుంది. కాగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లే డీలర్షిప్ను సందర్శించవచ్చు.భారతదేశంలో ఆఫ్రికా ట్విన్ కోసం హోండా రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2024 ప్రారంభంలో, ఫిబ్రవరి, అక్టోబర్ 2022 లలో కూడా ఈ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోసారి రీకాల్ జారీచేయడానికి సిద్ధమైంది. ఆఫ్రికా ట్విన్ 1,048 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ను కలిగి.. 100.5 bhp పవర్, 112 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా హోండా DCT ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికతో లభిస్తుంది. -
ఫోన్పేకు రూ.21 లక్షల జరిమానా: కారణం ఇదే..
నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. ఇప్పుడు ఫిన్టెక్ కంపెనీ ఫోన్పేకు భారీ జరిమానా విధించింది. 'ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్' (PPIs) కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఫోన్పే లిమిటెడ్కు 21 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను పాటించకపోవడం మాత్రమే కాకుండా.. ఈ విషయంలో సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పాటించలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఈ కారణంగానే ఫోన్పేకు నోటీస్ జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది. జరిమానా విధించినప్పటికీ.. ఇది యూజర్లపై ఎటువంటి ప్రభావం చూడదని పేర్కొంది.ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఫోన్పే వంటి అన్ని నాన్ బ్యాంకింగ్స్, ఎస్క్రో బ్యాలెన్స్లలో ఏదైనా లోటు ఉంటే వెంటనే రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ & సెటిల్మెంట్ సిస్టమ్స్ విభాగానికి (DPSS) నివేదించాలి. ఎస్క్రో ఖాతా నిల్వలు.. రోజు చివరిలో వ్యాపారులకు చెల్లించాల్సిన బకాయి ఉన్న PPIల విలువ, చెల్లింపుల కంటే తక్కువగా ఉండకూడదని నిబంధనలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటనపీపీఐ మార్గదర్శకాలను పాటించనందుకు.. రిజర్వ్ బ్యాంక్ ఫోన్పేకు 2019లో రూ. కోటి, 2020లో నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 1.39 కోట్ల జరిమానా విధించింది. ఇప్పుడు మరో సారి రూ. 21 లక్షల జరిమానా విధించింది. -
క్వాలిటీ ఉంటే చాలు.. ఇల్లు కొనేందుకు సిద్ధం!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు.. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు.. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం.. అందుబాటు ధరతో పాటు నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు నగరంలో ఇల్లు కొనేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్లను నిర్మించాలని సూచించింది.మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయి. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టారు.నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, కొంపల్లి, శామీర్పేట వంటి పలు ప్రాంతాల్లో రూ.45 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ హైదరాబాద్ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టిసారిస్తున్నారు. -
నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధించిన అదానీ పోర్ట్స్
భారతదేశం ముడి చమురు దిగుమతిని ప్రభావితం చేసేలా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) చర్యలు చేపట్టింది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్గా ఉన్న ఏపీసెజ్ యూఎస్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ ద్వారా ఆంక్షల్లో ఉండి రాకపోకలు సాగిస్తున్న నౌకలపై పూర్తి నిషేధాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశంలో అదానీ ఆపరేట్ చేస్తున్న అన్ని ఓడరేవుల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది.భారతదేశ ఇంధన పోర్ట్ఫోలియోలో కీలకంగా ఉన్న రష్యన్ ముడి చమురు ప్రవాహంపై ఈ చర్యలు ప్రభావితం చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదానీ కొత్త ఆదేశాల ప్రకారం.. పాశ్చాత్య ప్రభుత్వాల ఆంక్షలకు గురైన నౌకలకు ఏపీసెజ్ టెర్మినల్స్ ప్రవేశం, బెర్తింగ్, పోర్ట్ సర్వీసులను పూర్తిగా నిషేధించింది. అందుకు అనుగుణంగా షిప్పింగ్ ఆపరేటర్లు నామినేట్ చేసిన నౌక ఆంక్షల పరిధిలో లేదని నిర్ధారిస్తూ రాతపూర్వక హామీ సమర్పించాల్సి ఉంటుంది.అంతర్జాతీయ పరిశీలన పెరగడం, షాడో ఫ్లీట్(నిబంధనలకు విరుద్ధంగా విదేశీ చమురు సరఫరా) అధికమవుతుండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాలు, వస్తువుల ఎగుమతులు, దిగుమతులపై స్క్రూటినీ పెరుగుతున్న నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈమేరకు చర్యలు చేపట్టినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ చర్యల వల్ల రష్యా చమురుపై సరఫరా పరంగా ఒత్తిడి పెరుగుతుందనే వాదనలున్నాయి.ఏపీసెజ్ ఫ్లాగ్షిప్ టెర్మినల్స్లో ఒకటైన ముంద్రా పోర్ట్ భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 10% నిర్వహిస్తుంది. రష్యన్ చమురు సరఫరాకు కీలక కేంద్రంగా ఉంది.హెచ్పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ (హెచ్ ఈఎంఎల్) తన ముడి చమురు దిగుమతుల్లో 100 శాతం ముంద్రా ద్వారానే కొనసాగిస్తోంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కూడా బహుళ శుద్ధి కార్యకలాపాల కోసం ముంద్రాను విస్తృతంగా ఉపయోగిస్తుంది.పోర్ట్ ట్రాఫిక్ డేటా ప్రకారం, ఇటీవలి నెలల్లో ముంద్రాకు 50% రష్యన్ ముడి చమురు బ్యారెళ్లు సరఫరా అవుతున్నాయి.కాండ్లా, ముంబై, పారాదీప్ వంటి ప్రభుత్వ ఓడరేవులకు సరఫరా పెరిగే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: వంతారాపై సుప్రీంకోర్టు విచారణ.. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పణ -
డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటన
ఇప్పటి వరకు ఈ20 పెట్రోల్ గురించి చెప్పిన నితిన్ గడ్కరీ.. తాజాగా ఐసోబుటనాల్ గురించి పేర్కొన్నారు. డీజిల్లో 10 శాతం ఐసోబుటనాల్ను కలపడానికి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) కృషి చేస్తోందని కేంద్ర రవాణా శాఖమంత్రి అన్నారు.ఇండియా షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డీజిల్లో పదో వంతు ఇథనాల్ను కలపడంపై జరిగిన ట్రయల్స్ విజయవంతం కాలేదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా.. ఐసోబుటనాల్ మిశ్రమం ఉపయోగించాలని అన్నారు. ఐసోబుటనాల్ అనేది మండే లక్షణాలతో కూడిన ఆల్కహాలిక్ సమ్మేళనం. దీనిని డీజిల్తో పాటు ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు.ఈ20 పెట్రోల్పై తప్పుడు ప్రచారం..ఈ20 పెట్రోల్ వినియోగంపై వస్తున్న వదంతులు అంతా.. తప్పుడు ప్రచారమని గడ్కరీ అన్నారు. ఇథనాల్ వినియోగం పెరిగితే.. ఇంధన దిగుమతులు తగ్గుతాయి. దీనివల్ల దేశ ఆర్ధిక పరిస్థితి కూడా కొంత పెరుగుతుంది, రైతుల ఆదాయం పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు. -
వంతారాపై సుప్రీంకోర్టు విచారణ.. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పణ
గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాలో చట్టవిరుద్ధంగా జంతువులను కొనుగోలు చేశారనే ఆరోపణలపై నిజనిర్ధారణ విచారణ నిర్వహించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ రిపోర్ట్ను రికార్డ్ చేసింది.దర్యాప్తులో భాగంగా సిట్ బృందం వంతారాలో మూడు రోజులు గడిపింది. విచారణలో భాగంగా బృందానికి సహకరించడానికి అనేక రాష్ట్ర అటవీ శాఖల సీనియర్ అధికారులతో సహా అనేక ఇతర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇన్వెస్ట్గేషన్ సందర్భంగా వంతరా సీనియర్ సభ్యులను సుదీర్ఘంగా ప్రశ్నలు అడిగి ధ్రువపత్రాలు సేకరించింది.పిటిషనర్ ఆరోపణలు..సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని సిట్.. పిటిషనర్ సీఆర్ జయ సుకిన్ లేవనెత్తిన ఆరోపణలపై నిజనిర్ధారణ విచారణ జరిపింది. వన్యప్రాణుల రెస్క్యూ, పునరావాస సదుపాయాన్ని నిర్వహించే ముసుగులో ఏనుగులు, పక్షులు, అంతరించిపోతున్న జాతులతో సహా చట్టవిరుద్ధంగా జంతువులను కొనుగోలు చేసిందని పిటిషన్లో ఆరోపించారు. వన్యప్రాణుల రక్షణ చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు, జంతు సంక్షేమ ప్రమాణాలకు వ్యతిరేకంగా జంతువులను కేంద్రంలోకి తరలించారని పిటిషనర్ పేర్కొన్నారు.వంతారా స్పందనఈ వ్యవహారంపై వంతారా స్పందిస్తూ చట్టపరంగా మూగజీవులను కాపాడేందుకు పక్కాగా చర్యలు పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. ‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తున్నాం. పారదర్శకతతో చట్టాన్ని పూర్తిగా పాటించడానికి వంతారా కట్టుబడి ఉంది’ అని వంతారా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 25, 2025న సిట్ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, సెప్టెంబర్ 12 లోగా తన ఫలితాలను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సిట్ తన నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించింది.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: జీఎస్టీ కోతతో ఇళ్లకు డిమాండ్ -
జీఎస్టీ కోతతో ఇళ్లకు డిమాండ్
పలు ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఇది ఇళ్లకు డిమాండ్ను పెంచుతుందని రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య ‘క్రెడాయ్’ అంచనా వేసింది. సిమెంట్, మరికొన్ని బిల్డింగ్ మెటీరియల్స్పై జీఎస్టీని తగ్గించడం వల్ల నిర్మాణ వ్యయం దిగొస్తుందని పేర్కొంది. సింగపూర్లో నిర్వహించిన క్రెడాయ్–నాట్కాన్ వార్షిక సమావేశం సందర్భంగా దీనిపై ప్రకటన చేసింది.జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు తప్పకుండా వినియోదారులకు బదిలీ కావాలంటూ.. సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీలు రేట్లను తగ్గించాలని డిమాండ్ చేసింది. జీఎస్టీలో 12 శాతం, 28 శాతం శ్లాబులను ఎత్తివేస్తూ, ఇందులోని వస్తు, సేవలను 5 శాతం, 18 శాతం కిందకు మారుస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోగా, ఈ నెల 22 నుంచి ఇది అమల్లోకి రానుండడం తెలిసిందే.సానుకూల సెంటిమెంట్జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోదారుల్లో సానుకూల సెంటిమెంట్ నెలకొన్నట్టు క్రెడాయ్ చైర్మన్ బొమన్ ఇరానీ తెలిపారు. పండుగల సీజన్కు ముందు ఇది మంచి సంకేతంగా పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతోపాటు బడ్జెట్లో పన్ను మినహాయింపులు, రెపో రేట్ల తగ్గింపు హౌసింగ్ డిమాండ్కు ప్రేరణనిస్తాయని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు విలువ పరంగా పెరిగినప్పటికీ.. సంఖ్యా పరంగా (యూనిట్లు) తగ్గినట్టు చెప్పారు. అయితే జూన్ త్రైమాసికంలో జీడీపీ బలమైన వృద్ధిని నమోదు చేయడం, విధానపరమైన చర్యల ఫలితంగా రానున్న నెలల్లో ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుబాటు ధరల ఇళ్లకు ఉన్న రూ.45 లక్షల పరిమితిని సవరించాలన్న డిమాండ్ను మరోసారి ప్రస్తావించారు. రూ.45 లక్షల వరకు ఉన్న ఇళ్లపై జీఎస్టీ ఒక శాతం కాగా, అంతకుమించితే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పన్నుల భారం తగ్గించాలి..రియల్ ఎస్టేట్ రంగంపై కేంద్రం, రాష్ట్రాలు కలిపి 35–45 శాతం వరకు పన్నులు విధిస్తున్నాయని.. ఈ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని శేఖర్ పటేల్ పేర్కొన్నారు. పన్నులు తగ్గించడం వల్ల ప్రాపర్టీల ధరలు దిగొస్తాయన్నారు. క్రెడాయ్లో దేశవ్యాప్తంగా 13,000 మంది డెవలపర్లు సభ్యులుగా ఉన్నారు.ఇదీ చదవండి: ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు! -
స్టార్ హెల్త్కు నగదు రహిత చికిత్సలు బంద్
నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కు అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్పీఐ) హెచ్చరిక జారీ చేసింది. స్టార్ హెల్త్ నుంచి ఆస్పత్రులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ప్రస్తావించింది. ఏహెచ్పీఐలో 1,500 ప్రైవేటు ఆస్పత్రులు సభ్యులుగా ఉన్నాయి.చికిత్సల ధరలను తగ్గించాలంటూ ఒత్తిడి చేయడం, డాక్టర్ల క్లినికల్ నిర్ణయాలపై అసంబద్ధమైన ప్రశ్నలు, నగదు రహిత క్లెయిమ్లకు ఆమోదం తెలిపి, తుది బిల్లులో అడ్డమైన కోతలు విధించడం వంటి చర్యలతోపాటు.. నగదు రహిత చికిత్సలను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం చేస్తున్నట్టు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దృష్టికి ఏహెచ్పీఐ తీసుకెళ్లింది. కాగా, ఏహెచ్పీఐ నిర్ణయం ఏకపక్షం, దురదృష్టకరంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాఖ్యానించింది. పాలసీదారులు స్టార్ హెల్త్ ద్వారా సేవలు పొందడంపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. -
పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారగా పెరిగాయి. అయితే శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు!
పెరుగుతున్న జీవన వ్యయాలు, మార్కెట్ అస్థిరతలు, ఆర్థిక అనిశ్చితి వల్ల పర్సనల్ ఫైనాన్స్ అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మీరు ఓ సంస్థలో ఉద్యోగిగా ఉన్నా, ఫ్రీలాన్సర్గా చేస్తున్నా, చిన్న వ్యాపారం సాగిస్తున్నా, గృహిణిగా ఉన్నా.. ఆర్థిక స్వాతంత్ర్యం ఎంతో ముఖ్యం. ఎలాంటి వారైనా దీర్ఘకాలంలో స్థిరంగా డబ్బు సంపాదించేలా కొన్ని మార్గాలను పరిశీలిద్దాం. అయితే కింది అంశాలను పరిశీలించిన తర్వాత క్రమశిక్షణతో వీటిని పాటించడం చాలాముఖ్యమని గమనించాలి.ఆదాయం.. ఖర్చుల ట్రాకింగ్..నెలకు కొందరు పెద్దమొత్తంలో సంపాదిస్తారు. ఇంకొందరు కాస్త తక్కువగానే ఆర్జిస్తారు. ఎంత ఆదాయం సమకూరుతున్నా ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. అందుకు బడ్జెట్ పాటించాలి. బ్యాంకు ఖాతాలో నుంచి వెళ్లే, అందులోకి వచ్చే ప్రతి రూపాయిని ట్రాక్ చేయాలి. అందుకు స్ప్రెడ్ షీట్లు, బడ్జెట్ యాప్లు వంటివి ఉన్నాయి. లేదా సాధారణ నోట్ బుక్లోనూ రికార్డు చేయవచ్చు. ఇందులో మీ ఖర్చులను స్పష్టమైన కేటగిరీలుగా విభజించాలి.నిత్యావసరాలు (అద్దె, కిరాణా సామాగ్రి, యుటిలిటీలు)డిసిక్రీషనరీ స్పెండింగ్ (షాపింగ్, డైనింగ్)పొదుపు, పెట్టుబడులుప్రతి కేటగిరీలో ఖర్చు పరిమితులను కేటాయించుకోవాలి.ఉదాహరణకు..కిరాణా సామాగ్రి: రూ.8,000ఎంటర్ టైన్మెంట్: రూ.3,000పొదుపు: రూ.5,000డిస్క్రీషనరీ స్పెండింగ్ను పరిమితం చేయడం వల్ల దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడానికి మరింత అవకాశం లభిస్తుంది.ఎమర్జెన్సీ ఫండ్జీవితం అనూహ్యమైనది. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఉద్యోగ నష్టం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి ఖర్చులు.. వంటి వాటితో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.ఎంత సరిపోతుంది?కనీసం 6 నెలల విలువైన నిత్యావసర ఖర్చులు.. ఇంటి అద్దె, ఆహారం, యుటిలిటీలు, ఈఎంఐలను చెల్లించేలా కార్పస్ను క్రియేట్ చేయాలి. ఈ నిధిని అధిక వడ్డీ పొదుపు ఖాతా, స్వల్పకాలిక స్థిర డిపాజిట్ లేదా మనీ మార్కెట్ ఫండ్ వంటి లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.ఇది ఎందుకు ముఖ్యం?దీర్ఘకాలం లక్ష్యంతో చేసే పొదుపుపై ప్రభావం పడకుండా ఆపద సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ రక్షిస్తుంది. ఆర్థికంగా భారం కాకుండా, అధిక వడ్డీ రుణాలు తీసుకోకుండా భరోసా కల్పిస్తుంది.ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి?సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (ఎస్ఐపీ) నెలవారీ చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి. అవి రెండు ముఖ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాంపౌండింగ్.. మీ రాబడులపై మరింత ఆదాయాన్ని పెంచుతాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. కొత్తగా పెట్టుబడి ప్రారంభించాలనుకుంటే వైవిధ్యభరితమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్లతో మొదలు పెట్టవచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే, ఈక్విటీ విలువ తగ్గుతుంటే బంగారం హెడ్జింగ్గా పని చేస్తుంది.అప్పుల నిర్వహణఅప్పు చేయడం తప్పు. తప్పని పరిస్థితుల్లో చేసిన అప్పును వెంటనే తీర్చేయాలి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు తరచుగా 30% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. తిరిగి చెల్లించే క్రమంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు బిల్లుల్లో "కనీస చెల్లింపు" ఉచ్చులో పడకూడదు. దీంతో తర్వాతి బిల్లు సైకిల్లో అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బకాయిలను పే చేయాలి.ఇదీ చదవండి: తొమ్మిది ఎన్బీఎఫ్సీల లైసెన్స్లు సరెండర్ -
తొమ్మిది ఎన్బీఎఫ్సీల లైసెన్స్లు సరెండర్
ఫోన్పే టెక్నాలజీ సర్వీసెస్ సహా తొమ్మిది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీవోఆర్/లైసెన్స్లు)ను స్వాధీనం చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఎన్బీఎఫ్సీ వ్యాపారం నుంచి తప్పుకోవడంతో ఫోన్పే టెక్నాలజీ సర్వీసెస్ సీవోఆర్ను వెనక్కిచ్చేసింది.ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తన మాతృ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్లో విలీనం కావడంతో లైసెన్స్ను స్వాధీనం చేసింది. ఆర్బీజీ లీజింగ్ అండ్ క్రెడిట్, యషిలా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.లైసెన్స్లు సరెండర్ చేయడానికి కారణాలు..ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్బీఎఫ్సీ నిర్మాణం ఇకపై వారి వ్యాపార లక్ష్యాలతో సరపోదని కొన్ని కంపెనీలు తెలుసుకున్నాయి. ఉదాహరణకు ఫోన్ పే టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రుణాలు, ఇతర ఆర్థిక సేవల నుంచి వైదొలిగింది. నియంత్రిత విభాగాల్లో వ్యాపారం ముందుకు సాగదని నమ్మి స్పష్టమైన వైఖరితో రిజిస్ట్రేషన్ను తిరిగి ఇచ్చేసింది.ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తన మాతృ సంస్థతో విలీనం తరువాత లైసెన్స్ను సరెండర్ చేసింది. ఏకీకృత వ్యాపార సంస్థ కింద కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.కొన్ని ఎన్బీఎఫ్సీలు తమ రుణ కార్యకలాపాలను మూసివేయడానికి లేదా ప్రత్యామ్నాయ, అనియంత్రిత ఆర్థిక నమూనాలకు మారడానికి నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఈ రిజిస్ట్రేషన్ అనవసరంగా భావిస్తున్నాయి.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్పై రూ.35,000 వరకు ఆఫర్ -
రిటైల్ రుణాల పట్ల జాగ్రత్త
భవిష్యత్తు రిటైల్ రుణాల విషయంలో బ్యాంక్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ రంగానికి చెందిన వెటరన్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ సూచించారు. పోర్ట్ఫోలియో (రుణ ఆస్తులు) పరంగా అస్థిరతలు లేకుండా చూసుకోవాలని కోరారు. బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కామత్ మాట్లాడారు.కార్పొరేట్లు (కంపెనీలు) నిధుల కోసం బ్యాంకులపై ఆధారపడడం కొంత కాలానికి తగ్గుతుందంటూ.. భవిష్యత్తులో బ్యాంకులకు ప్రధాన వ్యాపారం రిటైల్ విభాగం నుంచే వస్తుందన్నారు. రిటైల్ విభాగంలో ఆస్తుల నాణ్యత వేగంగా క్షీణించే రిస్క్ ఉంటుందని హెచ్చరించారు. ఈ రిస్క్ పోర్ట్ఫోలియో పరంగా అసమానతల రూపంలో ఎదురవుతుందన్నారు. బ్యాలన్స్షీట్లలో లోపాలు చోటుచేసుకుంటే అన్సెక్యూర్డ్ రుణాల్లో అధిక భాగం వసూలు కాకుండా పోతాయంటూ, బ్యాంక్లు ఈ విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు.ఫిన్టెక్లతో బ్యాంకులు పోటీపడక తప్పదన్నారు. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు ఫిన్టెక్లు రుణ సాయం అందిస్తున్నట్టు చెప్పారు. రిటైల్ రుణ విభాగంలో పరిమితికి మించి రుణ వితరణ (ఒకే వ్యక్తికి) ఉందన్నారు. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్లో రూ.1.75 లక్షల కోట్లు నష్టపోయారన్న ఇటీవలి సెబీ డేటాను కామత్ ప్రస్తావించారు. నియంత్రణ సంస్థలు ఇప్పుడు దీన్ని కఠినతరం చేస్తున్నాయంటూ, ఈ చర్యలు ఫలితాన్నిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే రుణ ఎగవేతలు పెరగొచ్చొని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్పై రూ.35,000 వరకు ఆఫర్ -
ఎలక్ట్రిక్ బైక్పై రూ.35,000 వరకు ఆఫర్
ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ‘ఓబెన్ ఎలక్ట్రిక్’ పండుగల సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. ‘మెగా ఫెస్టివ్ ఉత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపింది. కంపెనీ ఫ్లాగ్షిప్ మోటారు సైకిళ్లు రోర్ ఈజెడ్ సిగ్మా, రోర్ ఈజెడ్ కొనగోళ్లపై క్యాష్ బ్యాక్లు ప్రకటించింది.రోర్ ఈజెడ్ సిగ్మా లేదా రోర్ ఈజెడ్లను రూ.20,000 వరకు ధర తగ్గించి విక్రయిస్తున్నట్టు, దీనికితోడు రూ.10,000 క్యాష్బ్యాక్ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే ప్రతీ కొనుగోలుపై బంగారం కాయిన్ను ఇస్తున్నట్టు తెలిపింది. అలాగే లక్కీ డ్రాలో ఐఫోన్ను సైతం గెలుచుకోవచ్చని పేర్కొంది. తమ మోటారు సైకిళ్ల పనితీరును తెలుసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తూ అసాధారణ విలువతో మెగా ఫెస్టివ్ ఉత్సవ్ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ఓబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో మధుమిత అగర్వాల్ తెలిపారు.ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం! -
ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాలి
న్యూఢిల్లీ: భౌగోళికరాజకీయ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లాంటి ముడి వస్తువులు, ఇతరత్రా టెక్నాలజీలపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాల్సి ఉంటుందని ఆటో విడిభాగాల సంస్థల సంఘం ఏసీఎంఏ ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని, మొబిలిటీ విడిభాగాలకు భారత్ను విశ్వసనీయమైన హబ్గా నిలబెట్టాలనేదే తమ ఉమ్మడి లక్ష్యమని ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె వివరించారు. ‘కీలకమైన ముడి వస్తువులు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, సెమీకండక్టర్లు మొదలైన వాటి కొరత పెద్ద సవాలుగా మారింది. దీనిపై జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అపారమైన అవకాశాల కూడలిలో మనం ఇప్పుడు ఉన్నాం. కానీ అదే స్థాయిలో సవాళ్లు కూడా ఉన్నాయి. వాణిజ్య యుద్ధాలు, భౌగోళికరాజకీయ ఒడిదుడుకులు, టారిఫ్లపరమైన ఉద్రిక్తతలు, ఎగుమతులపరంగా పరిమితుల్లాంటివన్నీ కూడా సరఫరా వ్యవస్థ స్వరూపాన్ని మార్చివేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక ముడి వస్తువులను దక్కించుకునేందుకు ప్రభుత్వంతో మరింతగా కలిసి పనిచేయాలి. అలాగే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను పటిష్టం చేసుకోవాలి. అంతర్జాతీయంగా పోటీపడే విధంగా మన పరిశ్రమ బలోపేతం కావాలి‘ అని మార్వా చెప్పారు. సరఫరా వ్యవస్థ పటిష్టం కావాలి: సియామ్ మరోవైపు, సరఫరా వ్యవస్థలనేవి కేవలం వ్యయాలను తగ్గించుకునే అంశానికే పరిమితం కాకుండా వైవిధ్యంగా, ఎలాంటి అవాంతరాలెదురైనా నిలదొక్కుకునే విధంగా పటిష్టంగా మారాలని వాహనాల తయారీ సంస్థల సంఘం సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర సూచించారు. ఇందుకోసం వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమో, అలాగే అలాంటి భాగస్వామ్యాలకు దోహదపడేలా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం కూడా ముఖ్యమేనని చంద్ర చెప్పారు. -
ఇక భారీ ఐపీవోలకు జోష్
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా భారీ కంపెనీల పబ్లిక్ ఇష్యూ నిబంధనలను సరళీకరించేందుకు నిర్ణయించింది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా విషయంలో వెసులుబాటును కల్పించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితినీ సవరించనుంది. వీటితో పాటు పలు తాజా ప్రతిపాదనలను శుక్రవారం(12న) నిర్వహించిన బోర్డు సమావేశంలో సెబీ అనుమతించింది. వివరాలు చూద్దాం..ముంబై: అతి భారీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడంలో దన్నునిస్తూ సెబీ తాజాగా పలు వెసులుబాట్లకు తెరతీస్తోంది. ప్రధానంగా పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించే అంశంలో గడువును సవరించేందుకు నిర్ణయించింది. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తదితర మెగా అన్లిస్టెడ్ కంపెనీలు లబ్ది పొందే వీలుంది. తాజా మార్గదర్శకాలు అమల్లోకి వస్తే దిగ్గజ కంపెనీలు లిస్టింగ్లోనే భారీగా వాటాను విక్రయించవలసిన అవసరం ఉండదు. పబ్లిక్కు కనీస వాటా కల్పించే విషయంలో తగినంత గడువుకు వీలు చిక్కనుంది. 10 శాతం నుంచి తగ్గింపు కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువగల కంపెనీలు ఐపీవోలో ప్రస్తుత 10 శాతానికి బదులుగా 8 శాతం వాటాను విక్రయించేందుకు అనుమతిస్తారు. వీటికి పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించడంలో ఐదేళ్ల గడువునిస్తారు. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా అమలవుతోంది. రూ. లక్ష కోట్లకుపైన మార్కెట్ విలువతో ఐపీవోకు వచ్చే కంపెనీలు ప్రస్తుత 5 శాతానికి బదులుగా 2.75 శాతం వాటాను ఆఫర్ చేయవచ్చు. రూ. 5 లక్షల కోట్లకు మించిన అతిభారీ కంపెనీలైతే ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయానికీ వీలుంటుంది. ఇలాంటి భారీ కంపెనీలు 10ఏళ్లలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన ఐదేళ్లు గడువును అనుమతిస్తోంది. వెరసి అతితక్కువ స్థాయిలో వాటా విక్రయించడం ద్వారా కంపెనీలు లిస్టయ్యేందుకు వీలు చిక్కుతుంది. తదుపరి దశలవారీగా పబ్లిక్ వాటాకు తెరతీయవచ్చు. దీంతో ఓకేసారి భారీస్థాయిలో వాటా విక్రయించవలసిన అవసరం తప్పుతుందని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా భారీ ఐపీవోలకు లిక్విడిటీ సమస్య తలెత్తకుండా నివారించవచ్చని తెలియజేశారు. రిటైల్ పరిమాణం ఓకే రూ. 5,000 కోట్లకు మించిన ఐపీవోల పరిమాణంలో రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయింపులను 35 శాతంగానే కొనసాగించనున్నట్లు పాండే తెలియజేశారు. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) వాటాను సైతం 50 శాతం నుంచి పెంచే ఆలోచనలేదని స్పష్టం చేశారు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఐపీవోలలో మరింత చోటు కల్పించేందుకు వీలుగా యాంకర్ కేటాయింపులను సవరిస్తున్నట్లు వెల్లడించారు. వీటి ప్రకారం యాంకర్ వాటా రూ. 250 కోట్లుదాటితే ఇన్వెస్టర్ల సంఖ్యను ప్రస్తుత 10 నుంచి 15కు పెంచనుంది. కనీసం 5 నుంచి గరిష్టంగా 15వరకూ అనుమతిస్తారు. ఆపై ప్రతీ రూ. 250 కోట్ల కేటాయింపులకు అదనంగా 15మంది ఇన్వెస్టర్లకు వీలుంటుంది. అంటే ఒక్కో ఇన్వెస్టర్కు కనీసం రూ. 5 కోట్ల పెట్టుబడికి వీలుంటుంది. ఇదేవిధంగా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపుల వాటా ప్రస్తుత 33 శాతం నుంచి 40 శాతానికి పెరగనుంది. దీనిలో ఎంఎఫ్లకు 33 శాతం, జీవిత బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్లకు మిగిలిన వాటాను రిజర్వ్ చేయనున్నారు. రీట్, ఇన్విట్లలో బీమా, పెన్షన్ ఫండ్స్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)లలో వ్యూహాత్మక ఇన్వెస్టర్ నిబంధనలను సెబీ సవరించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్)సహా కొన్ని కేటగిరీ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు)ను ఇందుకు అనుమతించనుంది. అంతేకాకుండా రీట్ను ఈక్విటీగా గుర్తించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు), స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రత్యేక పెట్టుబడులకు వీలుగా ఇన్విట్ను హైబ్రిడ్గా కొనసాగించనుంది. ఇన్విట్, రీట్ నిబంధనల సవరణ ద్వారా ఇన్వెస్టర్ల పరిధి మరింత విస్తరించనుంది. దీంతో రీట్, ఇన్విట్ల వ్యూహాత్మక పెట్టుబడిదారుల కేటగిరీలో విభిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడులకు వీలు చిక్కనుంది. ఇది రీట్, ఇన్విట్లకు జోష్నివ్వడంతోపాటు.. సులభ వ్యాపార నిర్వహణకు దారి ఏర్పడనున్నట్లు పాండే పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, బీమా ఫండ్స్ తదితర పలు భారీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్లకు ప్రస్తుత నిబంధనలు అడ్డుపడుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపే ఆయా సంస్థలకు రీట్, ఇన్విట్లు అత్యుత్తమ అవకాశాలని సెబీ పేర్కొంది. ఎగ్జిట్ లోడ్ కుదింపు ఆర్థిక వృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసే వ్యూహంలో భాగంగా సెబీ బోర్డు ఎంఎఫ్ పంపిణీ సంస్థలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా మరింత పారదర్శక, నిలకడైన ప్రోత్సాహకాలకు దన్నునిస్తూ గరిష్ట ఎగ్జిట్ లోడ్ను ప్రస్తుత 5 శాతం నుంచి 3 శాతానికి కోత పెట్టింది. టాప్–30 పట్టణాలను దాటి ఫండ్స్లోకి కొత్తగా మహిళా ఇన్వెస్టర్లను చేర్చుకుంటే పంపిణీదారులకు అధిక ప్రోత్సాహకాలు అందేటట్లు నిబంధనలు సవరించింది.లోరిస్క్ ఎఫ్పీఐలకు సపోర్ట్ తక్కువ రిస్్కగల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు)ను సింగిల్ విండో ద్వారా దేశీ సెక్యూరిటీల మార్కెట్లో కార్యకలాపాలు చేపట్టేందుకు అనుమతించనున్నారు. ఇందుకు వీలుగా సెబీ బోర్డు నిబంధనలను సవరించింది. తద్వారా ఎఫ్పీఐలకు దేశీయంగా సులభతర పెట్టుబడులకు వీలు చిక్కనుంది. లోరిస్క్ ఎఫ్పీఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లో సులభంగా పెట్టుబడులు చేపట్టేందుకు స్వాగత్–ఎఫ్ఐ పేరుతో తెరతీయనున్న సింగిల్ విండో దారి చూపనుంది. దీంతో యూనిఫైడ్ రిజి్రస్టేషన్ విధానం ద్వా రా విభిన్న పె ట్టుబడి మార్గాలలో ఎఫ్పీఐలు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని పాండే తెలియజేశారు. ఫలితంగా పెట్టుబడుల విష యంలో ఎఫ్పీఐలకు పదేపదే ఎదురయ్యే నిబంధనలు, భారీ డాక్యుమెంటేషన్ వంటి అవరోధాలు తొలగిపోనున్నట్లు వివరించారు. లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ సొంత ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్స్, మలీ్టలేటరల్ సంస్థలు, అత్యంత నియంత్రణలతోకూడిన పబ్లిక్ రిటైల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ చేరనున్నట్లు వెల్లడించారు. స్వాగత్–ఎఫ్ఐ మార్గదర్శకాల ను ఎఫ్ఫీఐలతోపాటు.. విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల(ఎఫ్వీసీఐలు)కు వర్తించనున్న ట్లు పేర్కొన్నారు. 2025 జూన్30కల్లా దేశీయంగా 11,913 మంది ఎఫ్పీఐలు రిజిస్టరై ఉన్నట్లు వెల్లడించింది. రూ. 80.83 లక్షల కోట్ల ఆస్తులను హోల్డ్ చేస్తున్నట్లు తెలియజేసింది. -
భవిష్యత్ భారత్దే..!
న్యూఢిల్లీ: బలమైన ఆర్థిక శక్తిగా భవిష్యత్తంతా భారత్దేనని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి తకెయూచి తెలిపారు. రాబోయే అనేక దశాబ్దాల పాటు భారత్ హవా నడుస్తుందన్నారు. దేశం ఆకాంక్షిస్తున్నట్లుగా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలంటే విధానాలపరంగా స్థిరత్వం అవసరమని చెప్పారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సంఘం ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా తకెయూచి ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో విశ్వసనీయమైన తయారీ హబ్గా తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు భారత్ ముందు చక్కని అవకాశం ఉందని చెప్పారు. ‘చరిత్రను చూస్తే ప్రతి కొన్ని దశాబ్దాలకు ఓ కొత్త దేశం ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కనిపిస్తుంది. అమెరికా, జపాన్, హాంకాంగ్ మొదలైన వాటిని చూశాం. గత మూడు దశాబ్దాల కాలం చైనాకి చెందింది. ఆ దేశం ప్రపంచానికే ఫ్యాక్టరీగా ఎదిగింది. ఇకపై వచ్చే అనేక దశాబ్దాల పాటు భారత్ హవా ఉంటుంది’ అని ఆయన తెలిపారు. ఉద్యోగం చేయగలిగే వయస్సున్న జనాభా అత్యధికంగా ఉండటం, వేగంగా వృద్ధి చెందుతున్న నాలుగు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ, క్రియాశీలకమైన ప్రభుత్వ మద్దతు, కొత్త ఆవిష్కరణలు చేయడంపై ప్రజల్లో అమితాసక్తి తదితర అంశాలు భారత్కి సానుకూలమైనవని తకెయూచి చెప్పారు. జపాన్ తరహాలోనే ఇక్కడ కూడా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు జపాన్ ఏ విధంగానైతే పరిశ్రమలకు బాసటగా నిల్చిందో భారత్లోను అదే తరహా పరిస్థితి కనిపిస్తోందని తకెయూచి చెప్పారు. ‘ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించింది, పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం), మేకిన్ ఇండియా లాంటి సాహసోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ప్రత్యక్ష పరోక్ష పన్నులను తగ్గించడంతో పాటు దేశీయంగా డిమాండ్కి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించడం లాంటి చర్యలన్నీ కూడా అంతిమంగా తయారీ రంగ వృద్ధికి దోహదపడతాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కూడా పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను సూచిస్తాయని చెప్పారు. టారిఫ్లు పెద్ద సవాలే.. భారత ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్లు విధించడమనేది ఆటో విడిభాగాల పరిశ్రమకు పెద్ద సవాలేనని తకెయూచి అభిప్రాయపడ్డారు. అయితే, దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున సానుకూల ఫలితాలు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇరు దేశాలు కొన్ని సానుకూల ప్రకటనలు చేసినట్లు తెలిపారు. భారత ఆర్థిక వృద్ధితో పాటు దేశ ఆటో పరిశ్రమ భవిష్యత్తు కూడా మరింత ఆశావహంగా కనిపిస్తోందన్నారు. 2024–25లో 523 బిలియన్ డాలర్ల మార్కును దాటిన ఆటో విడిభాగాల ఎగుమతులు 2030 నాటికి రెట్టింపు కాగలవని తకెయూచి చెప్పారు. ‘అంతర్జాతీయ తయారీ హబ్గా భారత్ ఎదుగుతున్న విషయాన్ని ప్రపంచం గమనిస్తోంది. అందుకే తమ తొలి గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనం ఈ–విటారా తయారీ కోసం సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఈ దేశాన్ని ఎంచుకుంది. ఈ వాహనం 100 దేశాలకు ఎగుమతి అవుతుంది’ అని పేర్కొన్నారు. -
స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో నమోదైన ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి నుంచి ఆగస్ట్ నెలలో కాస్తంత ఎగిసింది. జూలైలో 1.61% కాగా, ఆగస్ట్లో 2.07 శాతానికి చేరింది. కూరగాయలు, మాంసం, చేప లు, గుడ్లు, నూనెలు, ఫ్యాట్స్ ధరలు పెరగడం ఇందుకు దారితీసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) తొమ్మిది నెలల పాటు వరుస క్షీణతకు ఆగస్ట్లో బ్రేక్ పడినట్టయింది. 2024 ఆగస్ట్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.65 శాతంగా ఉంది. → ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 0.69 శాతంగా నమోదైంది. జూలైలో ఇది మైనస్ 1.76%గా ఉంది. → కూరగాయల ధరలు 15.92% పడిపోయాయి. → గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జూలైలో 1.18 శాతంగా ఉంటే, ఆగస్ట్లో 1.69 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 2.1 శాతం నుంచి 2.47 శాతానికి చేరింది. రానున్న నెలల్లో గమనించాలి.. ఆహారం, పానీయాల విభాగాల్లోని ధరల పెరుగుదల వల్లే సీక్వెన్షియల్గా (నెలవారీగా) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్లో పెరగడానికి కారణమని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి సానుకూల ధోరణులు కనిపిస్తున్నప్పటికీ.. ఆగస్ట్ చివరి నుంచి సెపె్టంబర్ ఆరంభం వరకు అధిక వర్షాలు, వరదలు ఖరీఫ్ దిగుబడులపై ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. అంతిమంగా దిగుబడి, ధరల తీరును గమనించాల్సి ఉందన్నారు. -
బంగారం @ 1,13,800
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. శుక్రవారం ఈ విలువైన లోహాలు సరికొత్త జీవిత కాల గరిష్టాలకు చేరాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.700 పెరగడంతో రూ.1,13,800 స్థాయిని నమోదు చేసింది. వెండి కిలోకి ఏకంగా రూ.4,000 పెరిగి 1,32,000ను తాకింది. అంతర్జాతీయంగా బలమైన డిమాండ్ ధరలకు మద్దతుగా నిలిచినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘‘ఇటీవలి యూస్ ఆర్థిక డేటాతో ఫెడ్ 2025లోనే ఒకటికి మించిన విడతల్లో రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలు పెరిగాయి. దీంతో బంగారంలో కొనుగోళ్లు పెరిగాయి’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పారిశ్రామిక డిమాండ్కు తోడు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి బలమైన పెట్టుబడుల ప్రవాహంతో వెండి ధరలు పెరిగినట్టు చెప్పారు. ఈ ఏడాది పెట్టుబడిదారులకు బంగారం, వెండి మంచి లాభాన్నిచ్చాయి. ఇప్పటి వరకు బంగారం ధర 10 గ్రాములకు రూ.34,850 (44 శాతం), వెండి ధర కిలోకి రూ.42,300 (47 శాతం) చొప్పున పెరగడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం స్వల్ప లాభంతో 3,683 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
ఈయూతో ఒప్పందం.. ఆ రంగానికి అవకాశాలు
ఐరోపా సమాఖ్య (ఈయూ)తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు పెద్ద ఎత్తున అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ఎగుమతులను పెంచుకోవచ్చని, 27 దేశాల కూటమికి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలతో కొత్త భాగస్వామ్యాలకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు.భారత ప్రజలకు సరైన టెక్నాలజీ, సరైన రవాణా పరిష్కారాలను తీసుకొచ్చేందుకు వీలుంటుందన్నారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయంటూ.. ఆటోమొబైల్ రంగానికి ఇది ఎంతో ముఖ్యమన్నారు. ఈయూలో మార్కెట్ అవకాశాలపై అవగాహన కుదిరిన వెంటనే చర్చలను త్వరగా ముగిస్తామని చెప్పారు.ఈయూ అధికారుల బృందం ఢిల్లీలో 13వ విడత చర్చలు నిర్వహించిన నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి సుంకాల్లో రాయితీలు ఇవ్వాలని ఈయూ బృందం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఈ ఏడాది మే 6న బ్రిటన్తో కుదిరిన ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఆ దేశ ఆటోమొబైల్ కంపెనీలకు భారత్ రాయితీలను కల్పించడం తెలిసిందే. దీంతో ఈయూ సైతం ఇదే విధమైన డిమాండ్ చేస్తోంది.బ్రిటన్తో ఒప్పందం వల్ల ఆటోమొబైల్ దిగుమతులపై టారిఫ్లు 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గుతాయని అగర్వాల్ చెప్పారు. అది కూడా 10–15 ఏళ్ల కాలంలో క్రమంగా అమలవుతుందన్నారు. సున్నిత రంగాల ప్రయోజనాలను కాపాడేందుకు యూకేతో ఒప్పందంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. భారత ఆటోమొబైల్ రంగం ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా క్రమంగా భారత్ మార్కెట్ అవకాశాలకు తలుపుల తెరిచే నిబంధనలు పెడుతున్నట్టు వివరించారు. -
రూ.2.25 లక్షల బెనిఫిట్: కొరియా బ్రాండ్ బంపరాఫర్
కియా ఇండియా.. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.2.25 లక్షల వరకు ఫ్రీ-జీఎస్టీ & పండుగ ప్రయోజనాలను కలిపి అందించే ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ 2025 సెప్టెంబర్ 22 వరకు చెల్లుతుంది.ఈ ఆఫర్లో రూ.58,000 వరకు ప్రీ-జీఎస్టీ సేవింగ్స్ & రూ.1.67 లక్షల వరకు ఫెస్టివల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఇప్పుడు సెల్టోస్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ వంటి ప్రసిద్ధ మోడళ్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఆఫర్ అనేది ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చిన్న కారుపై.. భారీ తగ్గింపు: ఏకంగా రూ.3 లక్షలుఈ సందర్భంగా, కియా ఇండియా సీఎస్ఓ జూన్సు చో మాట్లాడుతూ.. పండుగల సమయంలో మా కస్టమర్లకు మరింత ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాము. ప్రత్యేకమైన ప్రీ-జీఎస్టీ సేవింగ్స్ & పండుగ ప్రయోజనాలతో, కస్టమర్లు ఇప్పుడు తమకు ఇష్టమైన కియాను ఇంటికి తీసుకెళ్లవచ్చు. కియాను సొంతం చేసుకోవడం అంటే కేవలం కారు నడపడం మాత్రమే కాదు, రోజువారీ జీవితానికి సౌకర్యం, ఆనందాన్ని జోడించడం అని మేము విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు. -
ట్రేడ్ వార్తో భారత్కు సవాళ్లు: మారిషస్ ప్రధాని
ప్రతీకార సుంకాలు, వాణిజ్య వివాదాలతో భారత్కు భారీ సవాళ్లు ఎదురవుతున్నట్లు మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్గులామ్ పేర్కొన్నారు. రక్షణాత్మక విధానాలు పెరిగిపోవడం, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఉధృతమవుతున్న ఆందోళనలు, వాతావరణ సంబంధ విఘాతాలు పలురకాల రిస్కులకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు.విదేశీ వ్యవహారాల శాఖ, ఇతర పారిశ్రామిక సమాఖ్యలతో కలసి ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన మారిషన్ ఇండియా వ్యాపార సదస్సు(బిజినెస్ కాంక్లేవ్)లో నవీన్చంద్ర ప్రసంగించారు. సామాజిక, ఆర్థికాభివృద్ధిలో దీర్ఘకాలంగా మారిషస్కు భారత్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.అన్ని సమయాలలోనూ మారిషస్కు మద్దతివ్వడంలో ధృడంగా నిలుస్తున్నట్లు ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, విధానాలు అస్థిరంగా, అంచనాలకు అందని విధంగా మారినట్లు వ్యాఖ్యానించారు. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, అదుపుతప్పుతున్న రవాణా వ్యయాలు, వాతావరణ సంబంధ విఘాతాలు విభిన్న రిస్కులకు దారి చూపుతున్నట్లు వివరించారు. -
మొదలైన ఐఫోన్ 17 బుకింగ్స్: ఎక్కడ, ఎలా ఆర్డర్ చేయాలంటే..
ఈ వారం ప్రారంభంలో యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ లేటెస్ట్ ఫోన్స్ కోసం ప్రీ-బుకింగ్లను భారతదేశంలో శుక్రవారం (సెప్టెంబర్ 12) సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభించింది. ఆపిల్ ఆన్లైన్ స్టోర్ లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా కూడా దీనిని బుక్ చేసుకోవచ్చు. అమ్మకాలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఆ రోజు మీరు ఐఫోన్ డెలివరీ పొందవచ్చు లేదా మీ నగరంలోని ఆపిల్ స్టోర్ నుంచి కూడా తీసుకోవచ్చు.ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్స్.. ఎలా ఆర్డర్ చేయాలంటే..●యాపిల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.●హోమ్ పేజీలోని మీ ఐఫోన్ 17 మోడల్ను ఎంచుకోండి.●మీరు బుక్ చేయాలనుకుంటున్న వేరియంట్, కలర్, స్టోరేజ్ వంటి వాటిని సెలక్ట్ చేసుకొండి.●బుకింగ్స్ పూర్తి చేయడానికి కార్ట్కు జోడించి, చెక్అవుట్ మీద క్లిక్ చేయండి.●ఆ తరువాత కార్డ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. లేదా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.●ఇవన్నీ పూర్తయిన తరువాత బుకింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత కంపెనీ డెలివరీ టైమ్లైన్ను షేర్ చేస్తుంది.ఐఫోన్ 17 ధరలుఐఫోన్ 17➤ఐఫోన్ 17 - 256జీబీ: రూ. 82,900➤ఐఫోన్ 17 - 512జీబీ: రూ.1,02,900ఐఫోన్ 17 ప్రో & 17 ప్రో మాక్స్➤ఐఫోన్ 17 ప్రో 256జీబీ: రూ.1,34,900➤ఐఫోన్ 17 ప్రో 512జీబీ: రూ.1,54,900➤ఐఫోన్ 17 ప్రో 1టీబీ: రూ.1,74,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256జీబీ: రూ.1,49,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512జీబీ: రూ.1,69,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 1టీబీ: రూ.1,89,900➤ఐఫోన్ 17 ప్రో మాక్స్ 2టీబీ: రూ. 2,29,900ఐఫోన్ 17 ఎయిర్ ➤ఐఫోన్ 17 ఎయిర్ 256జీబీ: రూ.1,19,900➤ఐఫోన్ 17 ఎయిర్ 512జీబీ: రూ.1,39,900➤ఐఫోన్ 17 ఎయిర్ 1టీబీ: రూ.1,59,900ఇదీ చదవండి: ఐఫోన్ 17 ఎయిర్: స్పందించిన ఓపెన్ఏఐ సీఈఓ -
ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువు పొడిగింపుపై డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ (కటక్), పీపీ చౌదరి (పాలీ) కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు రాసి గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీఆర్ దాఖలుకు గడువు సెప్టెంబర్ 15న ముగియనుంది.పొడిగింపు కోరడానికి కారణాలుఐటీఆర్-5, ఆడిట్ సంబంధిత ఫారాలతో సహా ఐటీఆర్ ఫారాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. జూలై, ఆగస్టు నెలల్లో ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి వచ్చాయి.ఐటీఆర్ పోర్టల్లో ధ్రువీకరణ లోపాలు, అప్లోడ్ నెమ్మదించడం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్లో అసమతుల్యత వంటి సాంకేతిక లోపాలు.ఒడిశాలో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయానికి అంతరాయం కలిగించాయి. దీంతో సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం కష్టతరం చేసింది.మరోవైపు పండుగ సీజన్ పరిమితులు.గణేష్ పూజ, దుర్గా పూజ, దసరా వంటి ప్రధాన సెలవుదినాలు సిబ్బంది లభ్యతను పరిమితం చేశాయి.ఐసీఏఐ కొత్త ఫార్మాట్ల కారణంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల తయారీకి అదనపు సమయం అవసరమవుతోంది.ఏకకాలంలో ఏకకాలంలో జీఎస్టీ ఫైలింగ్స్, ఐటీఆర్ ఫైలింగ్ పన్ను నిపుణుల పనిభారాన్ని పెంచుతోంది.ప్రతిపాదిత పొడిగింపులుఐటీఆర్ (నాన్-ఆడిట్) దాఖలుకు గడువు సెప్టెంబర్ 15 వరకు ఉండగా సెప్టెంబర్ 30 వరకు పొడింగించాలని కోరుతున్నారు. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ (TAR) గడువు సెప్టెంబర్ 30 ఉండగా అక్టోబర్ 31 వరకు, టీఏఆర్ తో ఐటీఆర్ ఫైలింగ్కు అక్టోబర్ 31 చివరి తేదీ కాగా నవంబర్ 30 పొడిగించాలని విజ్ఙప్తి చేస్తున్నారు. ఇక ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు గడువును కూడా డిసెంబర్ 31 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అభ్యర్థనలు వచ్చాయి.విస్తృత మద్దతు కర్ణాటక స్టేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ (KSCAA), అడ్వకేట్స్ టాక్స్ బార్ అసోసియేషన్ (ATBA), ఐసీఏఐకి సంబంధించిన సెంట్రల్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (CIRC) వంటి పన్ను నిపుణుల సంఘాలు కూడా గడువు పొడిగింపును కోరుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తున్న నేపథ్యంలో, లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు, నిపుణులు అధికారిక నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
కొత్త రూల్: పీయూసీ లేకుంటే.. పెట్రోల్ లేదు!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'నో హెల్మెట్, నో ఫ్యూయెల్' విధానాన్ని గత నెలలో అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం 'నో పీయూసీ, నో ఫ్యూయెల్' విధానానికి శ్రీకారం చుట్టింది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే.. వాహనాలకు ఇంధనం నింపకూడదని కఠిన ఆంక్షలు పెట్టింది.భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడానికి, ప్రస్తుత తరం కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాలను బలహీనపరిచే అక్రమ పీయూసీ సర్టిఫికెట్లను ఆపాల్సిన అవసరాన్ని గురించి మహారాష్ట్ర రవాణా మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఈ కొత్త విధానం ప్రకారం.. ప్రతి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ను పెట్రోల్ పంపులలోని సీసీటీవీ కెమెరాల ద్వారా స్కాన్ చేసి, దాని పీయూసీ సర్టిఫికేట్ చెల్లుబాటును ధృవీకరిస్తారు. చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ లేకుండా దొరికిన వాహనాలకు ఇంధనం నింపరు. అంతే కాకుండా ఈ పీయూసీ సర్టిఫికేట్లను అక్కడిక్కడే జారీ చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అక్రమ సర్టిఫికెట్ జారీ చేసే ముఠాలను లక్ష్యంగా చేసుకుని రవాణా శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది.ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద డీల్!.. రూ.3472 కోట్లు వెచ్చించిన ఆర్బీఐభారతదేశంలో కొత్త కారు లేదా బైక్ యజమానులకు కొనుగోలు తేదీ నుంచి కనీసం ఒక సంవత్సరం పాటు పీయూసీ సర్టిఫికేట్ అవసరం లేదు. అంతే కాకుండా బీఎస్3 వాహనాలకు ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లభిస్తుంది. బీఎస్4, బీఎస్6 మోడళ్లకు పూర్తి సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ జారీ చేస్తారు. -
హైదరాబాద్ 4.0 దిశగా శరవేగంగా అడుగులు
నిజాం కాలంలో 1591లో పురుడు పోసుకున్న హైదరాబాద్ నగరం అభివృద్ధి ప్రస్థానం నేడు శరవేగంగా సాగుతోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 1998లో ఐటీ రాకతో హైదరాబాద్ వేగం మరింత పుంజుకుంది. అప్పటివరకు హైదరాబాద్, సికింద్రాబాద్లకే పరిమితమైన అభివృద్ధి సైబరాబాద్కు విస్తరించింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు, మెట్రోల ఏర్పాటుతో నగర రూపురేఖలే మారిపోయాయి. అంతర్జాతీయ మౌలిక వసతులు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దిగ్గజసంస్థలు నగరంలో కొలువుదీరాయి. అయితే గ్రేటర్పై ఒత్తిడి పెరగడంతో దానికి అనుబంధంగా నాలుగో నగరం అనివార్యమైపోయింది. ప్రధాన నగరంలో రద్దీని తగ్గించడంతోపాటు భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు తప్పనిసరైంది. –సాక్షి, సిటీబ్యూరోప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాల్లో ఆరు ఇండియాలోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు. ప్రధాన ఆరి్థక, ఉద్యోగ కేంద్రాలు కూడా. 146 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు.మహానగరం మనదే.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్లు అని చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కంటే ఎక్కువ వాటా నగరాలదే. ఉత్పాదకత, ఆవిష్కరణ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిని సాధించడంలో నగరాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలు 4,308 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. 1995 నుంచి 2025 మధ్య కాలంలో ఈ నగరాలు ఏకంగా 2,136 చ.కి.మీ. విస్తరించాయి. గత మూడు దశాబ్దాల్లో విస్తీర్ణాలు 98 శాతం పెరిగాయి. ఇందులో అత్యధిక విస్తీర్ణం హైదరాబాద్దే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ 7,257 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది.వృద్ధి ఎక్కడ్నుంచి ఎక్కడికి.. 1990 చివర్లో హైదరాబాద్లో ఫార్మాతోపాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ అప్గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశి్చమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నైపుణ్య కారి్మకులకు నగరం వేదికైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆరి్థక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశి్చమం వైపు నుంచి దక్షిణం దిశగా విస్తరించింది.గ్రేటరే..7,257 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో పట్టణ ప్రాంతం 519 చ.కి.మీ. 1995లో 267 చ.కి.మీ.లుగా ఉన్న నగర అర్బన్ ఏరియా 2005లో 319 చ.కి.మీ. 2015లో 407 చ.కి.మీ.లకు విస్తరించింది. గత మూడు దశాబ్దాల్లో గ్రేటర్ పట్టణ ప్రాంతం 252 చ.కి.మీ. పెరిగింది. 95 శాతం మేర వృద్ధి చెందింది. 1995లో 49 లక్షలుగా ఉన్న గ్రేటర్ జనాభా 2015 నాటికి 87 లక్షలు, ఇప్పుడు 1.13 కోట్లకు చేరింది. గత 30 ఏళ్లలో జనాభా 131 శాతం పెరిగింది. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, టూరిజం ఇదే నగరాభివృద్ధికి చోదకాలు.హెచ్ఎంఆర్ దిశగా.. దేశానికే తలమానికంగా నిలిచేలా తెలంగాణలో ఒక ప్రధాన పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్ఎంఆర్)ను ప్రతిపాదించింది. 10,472.723 చ.కి.మీ. మేర విస్తరించి ఉండే హెచ్ఎంఆర్.. రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉంటుంది. దీంతో హైదరాబాద్తోపాటు పొరుగు జిల్లాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.మాస్టర్ ప్లాన్ తప్పనిసరి ఏ నగరానికైనా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరం. మౌలిక వసతుల కల్పనతోపాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే మాస్టర్ప్లాన్ ప్రకారమే అభివృద్ధి జరగాలి. సిటికీ వలసలు పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతం విస్తరిస్తుంది. – కె.విద్యాధర్, డైరెక్టర్, హెచ్ఎండీఏఉద్యోగ అవకాశాల గని ఉద్యోగ, ఉపాధి అవకాశాల పుష్కలంగా ఉండటమే హైదరాబాద్ అభివృద్ధికి కారణం. పటిష్టమైన లా అండ్ ఆర్డర్, నైపుణ్య కార్మికుల లభ్యత, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి వాటితో నగరంలోకి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి.–కె.ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
ఎఫ్డీడీఐ-హైదరాబాద్లో కొత్త కోర్సులు
రాయదుర్గం: ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్–హైదరాబాద్ క్యాంపస్లో కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఫుట్వేర్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్, రిటైల్ అండ్ డిజిటల్ ఫ్యాషన్ వ్యాపారం, లెదర్ యాక్సెసరీస్, బ్యాగ్ల అభివృద్ధి రంగాల్లో పరిశ్రమలు, సిద్ధంగా ఉన్న విద్యార్థుల నైపుణ్యాలను బలోపేతం చేయడానికి, ఉపాధిని పెంచడానికి దోహదం చేసేలా డిప్లొమో కోర్సుల ముఖ్య లక్షణంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కోర్సులను ఆరు నెలల వ్యవధి గల రెండు మాడ్యూల్లుగా విభజించారు. అభ్యాసకులు ఒక మాడ్యూల్ను అనుసరించి సర్టిఫికెట్ పొందవచ్చు. రెండు మాడ్యూల్లను పూర్తి చేసి పూర్తి సంవత్సరం డిప్లొమో పొందడానికి అవకాశం కల్పిస్తారు. అందుబాటులోకి వచ్చే కోర్సులు ఇవే.. మొదటి విడతలో నూతనంగా డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్మెంట్, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్మెంట్ కోర్సులకు ఒక్కోదానికి ఒక్క మాడ్యూల్కు రూ.45 వేలు, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఒక్క మాడ్యూల్కు రూ.40 వేలను చెల్లించాల్సి ఉంటుంది.ఈ కోర్సుల కోసం దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. కోర్సులను అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు వెబ్సైట్ www.fddiindia.comలో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 94404 71336, 99667 55563, 99667 55536లలో సంçప్రదించాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ–హైదరాబాద్ క్యాంపస్లో సంప్రదించాలని సూచించారు. -
ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?
భారతదేశంలో రాజ్యాంగ బద్దంగా.. రాష్ట్రపతి తరువాత రెండో అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి. ఈ బాధ్యతలను సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు శుక్రవారం(సెప్టెంబర్ 12వ తేదీ) చేపట్టారు. అయితే దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎటువంటి జీతం ఉండదని బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అయితే.. జీతం తప్ప, ఇతర ప్రోత్సాహకాలు లభించే ఏకైక పదవి ఇదే అని చెప్పడంలో సందేహం లేదు.భారత ఉపరాష్ట్రపతిగా ఎటువంటి జీతం తీసుకోనప్పటికీ.. ఈ పదవిలో ఉన్న వ్యక్తి, రాజ్యసభ ఛైర్మన్గా నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతారు ((2018లో దీనిని రూ.1,25,000 నుంచి సవరించారు). ఉపరాష్ట్రపతి జీతం, భత్యాలు పార్లమెంటు అధికారుల జీత భత్యాల 1953 చట్టం ప్రకారం నిర్ణయిస్తారు. ఇందులో ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేక జీత నిబంధన లేదు.ఉపరాష్ట్రపతికి లభించే ప్రయోజనాలుభారత ఉపరాష్ట్రపతికి జీతం లేకపోయినప్పటికీ.. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉచిత వసతి, వైద్య సంరక్షణ, రైలు & విమాన ప్రయాణం, ల్యాండ్లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్ సర్వీస్, వ్యక్తిగత భద్రత, సిబ్బంది మొదలైనవి ఉన్నాయి.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐపదవీ విరమణ తరువాత కూడా అనేక సదుపాయాలు కల్పిస్తూ.. నెలకు సుమారు రూ. 2 లక్షల పెన్షన్, పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్, సెక్యూరిటీ, డాక్టర్, ఇతర సిబ్బంది సేవలను పొందుతూనే ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి మరణించిన తరువాత.. ఆయన భార్యకు కూడా కొన్ని సదుపాయలను కల్పిస్తారు. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 347.80 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 81,896.52 వద్ద, నిఫ్టీ 102.35 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 25,107.85 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, థెమిస్ మెడికేర్, లంబోధర టెక్స్టైల్, నాగరీకా ఎక్స్పోర్ట్స్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం వంటి కంపెనీలు చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, అట్లాంటా, నీలా స్పేసెస్, కాన్పూర్ ప్లాస్టిప్యాక్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పొదుపు, పెట్టుబడులకే తొలి ప్రాధాన్యం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున మినహాయింపులతో కొత్త పన్ను విధానం అమల్లోకి రాగా, అధిక వేతనం ఆర్జించే వారికి గణనీయంగా పన్ను ఆదా కానుంది. ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులకు మళ్లిస్తామని 57 శాతం మంది ఉద్యోగులు నౌకరీ నిర్వహించిన సర్వేలో తెలిపారు. విచక్షణారహిత వ్యయాలకు బదులు పెట్టుబడులకు, రుణాల తిరిగి చెల్లింపులకు ఆదా అయ్యే మొత్తాన్ని వెచ్చిస్తామని నిపుణులు చెప్పారు. రూ.12.75 లక్షల వరకు ఆర్జించే 20వేల మంది నిపుణుల అభిప్రాయాలను నౌకరీ సర్వేలో భాగంగా తెలుసుకుంది. కొత్త పన్ను విధానంలో కల్పించిన పన్ను ప్రయోజనాల గురించి తెలుసనని 64 శాతం మంది చెప్పగా, 43 శాతం మంది తమకు దీనిపై స్పష్టత లేదనో, అసలు తెలియదనో చెప్పడం గమనార్హం.పన్ను మినహాయింపుల కారణంగా మిగిలే మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లిస్తామని 57 శాతం మంది వెల్లడించారు. రుణాల చెల్లింపులకు వినియోగిస్తామని 30 శాతం మంది తెలిపారు.9 శాతం మంది మెరుగైన జీవనం కోసం ఖర్చు చేస్తామని, 4 శాతం మంది ప్రయాణాలు, విహార యాత్రల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో అత్యధికంగా 63–64 శాతం మంది నిపుణులు మిగులు ఆదాయాన్ని పక్కన పెడతామని తెలిపారు. చెన్నైలో 44 శాతం నిపుణులు రుణ చెల్లింపులకు వినియోగిస్తామని చెప్పగా, ముంబైలో 51 శాతం మంది రిటైర్మెంట్ అవసరాలకు మళ్లిస్తామని తెలిపారు.ఇదీ చదవండి: గ్లోబల్ కంపెనీలకు కేంద్రం స్వాగతం -
భారీ ధరల వేళ.. బయటి నుంచి బంగారం ఎంత తెచ్చుకోవచ్చు?
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. భారతదేశంలో అయితే చుక్కలనంటుతున్నాయి. ఈరోజు (సెప్టెంబర్ 12) 10 గ్రాముల ధర రూ.770 మేర పెరిగి రూ.1,11,430లకు చేరింది. అయితే భారత్ కంటే కొన్ని దేశాల్లో బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బయటి దేశాల్లో ఉంటున్నవారు లేదా ఏదైనా ఏ దేశానికి పర్యటనకు వెళ్లి తిరిగివస్తున్నవారు ఆయా దేశాల్లో బంగారం కొని భారత్కు ఎంత తీసుకుని రావచ్చు.. ఇక్కడ ఆ బంగారంపై ఎంత సుంకం పడుతుంది.. వంటి అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో బంగారం వ్యాపారం భౌతిక, డిజిటల్ సహా అనేక రూపాల్లో జరుగుతుంది. చాలా మంది ఆభరణాలు, నాణేలు, బార్లు , పెట్టుబడి ఆస్తుల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అదే సమయంలో, ప్రభుత్వం డ్యూటీలు/సుంకాల ద్వారా బంగారం వ్యాపారాన్ని జాగ్రత్తగా నియంత్రిస్తుంది. కస్టమ్ డ్యూటీ అనేది ఒక రకమైన పన్ను, ఇది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధిస్తారు. ఇదేవిధంగా, ఇతర దేశాల నుండి బంగారాన్ని భారత్కు తీసుకువచ్చినప్పుడు, దానిపై కూడా కస్టమ్స్ సుంకం విధిస్తారు. అయితే కొంత పరిమితి వరకు బయటి నుంచి తెచ్చిన బంగారంపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ ఉండదు. అంతకంటే ఎక్కువ బంగారాన్ని తీసుకువస్తే మాత్రం సుంకం చెల్లించాల్సి ఉంటుంది.ఎంత బంగారం తెచ్చారో చెప్పాలి..ఒక వ్యక్తి విదేశాల నుండి ఏ రకమైన బంగారు ఆభరణాలు, నాణేలు లేదా బార్లను అయినా భారతదేశానికి తీసుకురావచ్చు. కానీ, మీరు ఈ బంగారు వస్తువులను కస్టమ్ డ్యూటీ కియోస్క్ వద్ద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత, కస్టమ్స్ డ్యూటీ అధికారి బంగారం మొత్తాన్ని బట్టి వర్తించే కస్టమ్స్ సుంకాన్ని లెక్కిస్తారు. అయితే మీరు ఎంత బంగారం తెచ్చినా కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుందనేది నిజం కాదు. ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఈ రుసుము ఉండదు. ఆ పరిమితి పురుషులు, మహిళలు, పిల్లలకు వేరువేరుగా ఉంటుంది.పురుషులు ఎంత బంగారం తేవచ్చు.. కస్టమ్ డ్యూటీ ఎంత?పురుష ప్రయాణికులు విదేశాల నుంచి 20 గ్రాములు లేదా రూ.50,000 విలువైన డ్యూటీ ఫ్రీ బంగారాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంది. అయితే, బంగారం ధర సుమారు రూ .1 లక్ష కాబట్టి 20 గ్రాముల పరిమితి ఇకపై ఆచరణాత్మకం కాదు. 20 నుంచి 50 గ్రాముల బంగారం తీసుకువస్తే 3 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 50 నుంచి 100 గ్రాముల బంగారం తీసుకువస్తే 6 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం తీసుకువస్తే 10% కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది.మహిళలకు పరిమితి ఇదే..మహిళా ప్రయాణికులు కస్టమ్స్ సుంకం లేకుండా 40 గ్రాములు లేదా రూ .1 లక్ష వరకు విలువైన బంగారాన్ని తీసుకురావచ్చు. కానీ అధిక బంగారం రేటు కారణంగా, 40 గ్రాముల పరిమితి ఇక్కడ కూడా ఆచరణాత్మకంగా లేదు. 40 నుంచి 100 గ్రాముల వరకు బంగారంపై 3 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 100 నుంచి 200 గ్రాముల వరకు బంగారంపై 6 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు. 200 గ్రాములు దాటితే 10% కస్టమ్స్ సుంకం విధిస్తారు.పిల్లలకూ పరిమితి..15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా మహిళా ప్రయాణికుల మాదిరిగానే కస్టమ్స్ నియమాలకు లోబడి ఉంటారు. అయితే, వారు కొనుగోళ్లకు రుజువుగా పత్రాలను తీసుకెళ్లాలి. -
వేలానికి పోప్ లియో సంతకం చేసిన బైక్
'పోప్ లియో XIV'కి బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీకి చెందిన 'ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్' అందించారు. ఈ మోటార్సైకిల్ను మిస్సియో ఆస్ట్రియా అక్టోబర్ 2025లో సోథెబైస్ ద్వారా వేలం వేయనున్నారు. దీని నుంచి వచ్చిన డబ్బును మడగాస్కర్లోని పిల్లల సహాయ ప్రాజెక్టులకు వినియోగించనున్నారు.పోప్ లియో XIVకు ఇచ్చిన బీఎండబ్ల్యూ ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్ అనేది కస్టమైజ్డ్ బైక్. ఇది ఆయన కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ బైకును బీఎండబ్ల్యూ మోటోరాడ్ జర్మనీ అధిపతి 'మైఖేల్ సోమర్' అందించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. బైకు ఫ్యూయెల్ ట్యాంక్ మీద పోప్ సంతకం, డేట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్ 1802 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజిన్ ద్వారా 991 హార్స్ పవర్, 158 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ధర భారతదేశంలో రూ. 32.50 లక్షలు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్తో 10.25 ఇంచెస్ TFT కలర్ స్క్రీన్ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఫ్యూయెల్ లెవల్, స్పీడ్ మొదలైన వాటిని రైడర్ చూడవచ్చు. డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ హెడ్ల్యాంప్లు, కీలెస్ ఇగ్నిషన్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు.. రాక్, రోల్ అనే రైడ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. -
గ్లోబల్ కంపెనీలకు కేంద్రం స్వాగతం
భారత్లో తమ ఉత్పత్తులను పరీక్షించడానికి గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలను స్వాగతిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తద్వారా వారు స్థానికంగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారని తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) నిర్వహించిన 7వ ఆటో కాన్క్లేవ్లో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతదేశం పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) దిగుమతిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించిందని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దాంతో అంతర్జాతీయంగా చాలా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.‘కేంద్రం దేశీయ పరిశ్రమను, తయారీదారులను రక్షించేందుకు చర్యలు చేపడుతోంది. అదే సమయంలో కంపెనీల ఉత్పత్తుల మధ్య సరసమైన పోటీకి కట్టుబడి ఉన్నాం. ఈ పోటీ సామర్థ్యాన్ని పెంచుతోంది. ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే లేదా కొత్త మోడళ్లకు అవకాశాలు కల్పించడంలో సమతుల్యత ముఖ్యం. దేశీయ తయారీకి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అయితే పరిశ్రమ వృద్ధి చెందాలంటే మరిన్ని ప్రపంచ కంపెనీలు భారతదేశానికి రావాలి. స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసేందుకు లేదా సీబీయూలను పరీక్షించేందుకు ప్రపంచ కంపెనీలు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.ఇదిలాఉండగా, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్లను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు సూచించిందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ ఛైర్మన్ దేశ ఉత్పత్తి నాణ్యత బలంగా ఉందని తనకు చెప్పినట్లు గడ్కరీ ఇటీవల ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం! -
రూ.40 వేలకే ఐఫోన్.. త్వరలో సేల్ ప్రారంభం
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ లభించనుంది. సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో యాపిల్ ఐఫోన్ 14 కేవలం రూ .40,000 ధరకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో విక్రయించే అన్ని ఐఫోన్ల ధరలను వెల్లడించింది. చాలా ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి.2022 సెప్టెంబర్లో లాంచ్ అయిన ఐఫోన్ 14 ఇప్పుడు కేవలం రూ .40,000కు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్పై ఇప్పటివరకు ఇదే అత్యంత తక్కువ ధర. ఐఫోన్ 14 ధర ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ .52,990గా ఉంది. కానీ యాపిల్ స్టోర్ లో ఈ ఫోన్ అందుబాటులో లేదు. ఎంపిక చేసిన యాక్సిస్ క్రెడిట్ కార్డుల ద్వారా పొందగలిగే రూ .2,000 తగ్గింపుతో సహా వినియోగదారులు రూ .13,000 వరకు ఆదా చేయవచ్చు.ఫ్లిప్కార్ట్ సేల్లో ఇతర ఐఫోన్ మోడళ్ల ధరలు కూడా తగ్గాయి. ఐఫోన్ 16 ప్రో ప్రస్తుత ధర రూ .1.12 లక్షలతో పోలిస్తే కేవలం రూ .69,999 కు అందుబాటులో ఉంది. తద్వారా రూ .43,000 ఆదా అవుతుంది. అలాగే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రస్తుత ధర రూ .1,37,900 తో పోలిస్తే రూ .89,900 కు అందుబాటులో ఉంటుంది. దీంతో రూ.48,000 ఆదా అవుతుంది. సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ ఇప్పటికే కొత్త ఐఫోన్ 17 మోడళ్లను ప్రకటించింది. -
పంజాబ్లో వరద బాధితులకు రిలయన్స్ సాయం
పంజాబ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండగా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనంత్ అంబానీ భరోసా కల్పించారు. బాధితుల కష్టాలు తీర్చే ఉద్దేశంతో సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అందులో భాగంగా స్థానిక అధికారులు, రాష్ట్ర పరిపాలన విభాగం, పంచాయతీలు, వివిధ కమ్యూనిటీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఈమేరకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమృత్సర్, సుల్తాన్పూర్ లోధిలోని 10,000 కుటుంబాలకు సహాయం అందించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.‘ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది. తీవ్ర వర్షాభావం వల్ల చాలా కుటుంబాలు ఇళ్లు, జీవనోపాధి, భద్రతను కోల్పోయాయి. రిలయన్స్ కుటుంబం వారికి తోడుగా ఉంటుంది. ఆహారం, నీరు, ఆశ్రయం, పారిశుద్ధ్య కిట్లు.. వంటి వాటితో ప్రజలు, జంతువుల సంరక్షణకు అన్ని చర్యలు అందిస్తోంది. పంజాబ్ ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో వారితో కలిసి ఉంటాం’ అని అనంత్ అంబానీ అన్నారు.రిలయన్స్ అందిస్తోన్న సహాయక చర్యలు..న్యూట్రిషన్ సపోర్ట్వరద బాధితుల కోసం అత్యవసర పోషకాహార అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతుంది. వారికి అవసరమైన ఆహార సామాగ్రి, డ్రై రేషన్ కిట్లను 10,000 కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒంటరి మహిళలు, వృద్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 వంతున వోచర్ ఆధారిత సహాయం అందించనున్నారు. తక్షణ పోషణను నిర్దారించేందుకు కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పోర్టబుల్ వాటర్ ఫిల్టర్లను సిద్ధం చేస్తున్నారు.షెల్టర్ సపోర్ట్వరదల నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలను రక్షించడానికి రిలయన్స్ టార్పాలిన్లు, గ్రౌండ్ షీట్లు, దోమతెరలు, తాళ్లతో కూడిన అత్యవసర షెల్టర్ కిట్లను అందిస్తోంది. వరద నీటి నుంచి అత్యవసరంగా ఆశ్రయం అవసరమైన కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ప్రజారోగ్య ప్రమాద నిర్వహణలో భాగంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి రిలయన్స్ ఆరోగ్య అవగాహన ప్రచారాలను చేపడుతోంది. నీటి వనరుల్లో క్రిమిసంహారక చర్యలకు పూనుకుంది. వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రతి ప్రభావిత కుటుంబానికి అవసరమైన పారిశుద్ధ్య కిట్లను అందజేస్తున్నారు.పశువుల ఆరోగ్యానికి మద్దతుగా..వరదల వల్ల పశుసంవర్ధక రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశువుల ఆవాసాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జంతువుల మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్, పశుసంవర్ధక శాఖ సహకారంతో పశువైద్య సర్వేలు నిర్వహిస్తోంది. పశువుల సంరక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభావిత జంతువులకు మందులు, చికిత్సలు అందిస్తున్నారు. దాదాపు 5,000 పశువులకు ఆహారం ఇవ్వడానికి 3,000 కట్టల సైలేజ్ (పశుగ్రాసం) పంపిణీ చేస్తున్నారు.జంతు సంరక్షణజంతు సంరక్షణ కోసం రిలయన్స్కు చెందిన వంటారాలోని ప్రత్యేక బృందం సహాయక చర్యలను అందిస్తోంది. 50 మందికి పైగా శిక్షణ పొందిన నిపుణులతో ఈ బృందం జంతువులను రక్షించడం, వైద్య సంరక్షణను అందించడం, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి పని చేస్తోంది.కమ్యునికేషన్ పునరుద్ధరణవరద ప్రభావిత ప్రాంతాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో జియో బృందం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉండేలా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)తో కలిసి పనిచేస్తోంది. విపత్తు సహాయ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సర్వీసులు అందించేందుకు చర్యలు చేపడుతోంది.రిలయన్స్ ఫౌండేషన్ స్థానిక వాలంటీర్ల సహకారంతో క్యూరేటెడ్ డ్రై-రేషన్, పారిశుద్ధ్య కిట్లను పంపిణీ చేస్తోంది. పోషణ, పరిశుభ్రత కోసం 21 నిత్యావసర వస్తువులను కలిగి ఉన్న ఈ కిట్లను స్థానిక పంచాయతీల పరిధిలోని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. -
ఊబకాయం.. ఆర్థిక భారం!
భారత్లో ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకోసం చేసే ఆర్థిక ఖర్చులు అధికమవుతున్నట్లు యునిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025 తెలిపింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం సంక్షోభాన్ని హైలైట్ చేసిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలను కోరారు. శరీరంలో పెరుగుతున్న కొవ్వులపై ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. దాన్ని తగ్గించుకునేందుకు నెలవారీ ఖర్చులను కూడా ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు.యునిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025 ప్రకారం.. పాఠశాలకు వెళ్లే, కౌమారదశలోని పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ బరువు సమస్యను భారత్ క్రమంగా అధిగమిస్తున్నప్పటికీ, ఊబకాయం సమస్యగా పరణిమిస్తుంది. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ అంచనా ప్రకారం.. 2019లో ఊబకాయం సంబంధిత ఖర్చులు దాదాపు 29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది భారతదేశ జీడీపీలో 1 శాతం. ఒబెసిటీ సమస్యకు అత్యవసర చర్యలు తీసుకోకపోతే 2060 నాటికి ఈ సంఖ్య 839 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది జీడీపీలో 2.5 శాతంగా ఉండనుంది.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) డేటా ప్రకారం అధిక బరువు, ఊబకాయం ఉన్న ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2005-06లో ఎన్ఎఫ్హెచ్ఎస్ 3 నుంచి 2019-21లో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 మధ్య వీరి సంఖ్య 127 శాతం పెరిగింది. కౌమారదశలో ఉన్న బాలికలు, బాలురు వరుసగా 125 శాతం, 288 శాతం అధికమయ్యారు.లఖ్నవూ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పని చేస్తున్న మనోజ్ కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నడక, శారీరక వ్యాయామం లేకపోవడం ఊబకాయం పెరగడానికి కారణాలుగా పేర్కొన్నారు. ‘ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా మొదలైన వాటిని అవలంబించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు’ అని అన్నారు.ఊబకాయం పెరుగుదలకు కారణాలు.. -
రూ. లక్ష.. కోటి రూపాయలైంది..!
స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎంత ఉంటుందో లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లను దివాళా తీయిస్తే మరికొన్ని మాత్రం కోటీశ్వరులను చేస్తాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ గత దశాబ్దంలో దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లకు భారీ రాబడిని తెచ్చిపెట్టింది.ఆ కంపెనీ షేర్లు 11,419% పెరిగాయి. 2015లో రూ .14 ఉన్న షేరు ధర 2025 సెప్టెంబర్ 10 నాటికి రూ .1,612.60 కు పెరిగింది. అంటే ఎంతలా పెరిగిందంటే రూ .1 లక్ష పెట్టుబడి పెట్టారనుకుంటే ఇప్పుడది రూ .1 కోటి కంటే ఎక్కువగా పెరిగిందన్న మాట. ఆ స్టాక్ ఏదో కాదు.. ఎంఈఐఎల్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ది. 2025 జూన్ 30 నాటికి ఈ కంపెనీలో ఎంఈఐఎల్ హోల్డింగ్స్ 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని తాజా షేర్ హోల్డింగ్ డేటా తెలిజేస్తోంది.ఒలెక్ట్రా గురించి.. గతంలో గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రాటెక్ అనే పేరుతో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్ తయారుదారు. ఈ సంస్థ 2000లో స్థాపితమైంది. ఇది ఎలక్ట్రిక్ బస్సులు, ఇన్సులేటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు దేశంలోని దాదాపు అన్ని మెట్రో, టైర్2, టైర్3 నగరాల్లో తిరుతున్నాయి. దేశ ఎలక్ట్రిక్ బస్ రంగంలో 25 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే.2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల విక్రయాలు రూ.1801.90 కోట్లుగా నమోదయ్యాయి. పన్నులు పోనూ రూ.139.21 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 161 బస్సులు డెలివరీ చేసింది. ఎలక్ట్రిక్ బస్ ఆర్డర్ బుక్ 10,193 యూనిట్లుగా ఉంది. 5,000 బస్సుల ప్రారంభ సామర్థ్యంతో (10,000 వరకు స్కేలబుల్) రాబోయే తయారీ కేంద్రం 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్తో కూడుకున్నది. ఇన్వెస్టర్లు అన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది.) -
భారత్ వరికి ఎంఎస్పీ పెంచితే డబ్ల్యూటీఓలో ప్రశ్నలు!
దేశీయంలో వరి పంటలో స్వావలంబన సాధించేందుకు, ఇథనాల్ ఉత్పత్తికి, రైతులకు ఆర్థిక భరోసాకు, కొన్ని దేశాలకు బియ్యం ఎగుమతులు పెంచేందుకు భారత్ తీసుకున్న నిర్ణయానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశంలో వరి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంపు నిర్ణయానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ)లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈమేరకు భారత నిర్ణయాన్ని అమెరికా, పరాగ్వే సంయుక్తంగా డబ్ల్యూటీఓలో వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ ఆహార భద్రతకు సంబంధించిన ‘బాలీ ఒప్పందాల’ను(డబ్ల్యూటీఓ ఆహార సబ్సిడీ పరిమితులు) భారత్ భేఖాతరు చేస్తుందని వాదించాయి.ఎంఎస్పీ పెంపు విధానం భారత్ దేశీయ ఆహార పంపిణీ వ్యవస్థలో భాగం అయినప్పటికీ ఎగుమతులు, ఆహారేతర ప్రయోజనాల కోసం నిల్వలు పెంచుతోందని యూఎస్, పరాగ్వే అభిప్రాయపడుతున్నాయి. భారత్ ఎంఎస్పీ పెంచడం, భారీగా నిల్వలు ఉండడం, ఎగుమతులు సాగించడం వంటి విధానాలు ప్రపంచ బియ్యం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు చెప్పాయి. పాకిస్థాన్ను ఉదాహరిస్తూ.. అక్కడి బాస్మతియేతర బియ్యం ధరలు దాదాపు రాత్రికి రాత్రే మెట్రిక్ టన్నుకు సుమారు 200 డాలర్లు పడిపోయాయని గుర్తు చేశాయి.అయితే భారత్ వాదనలు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దేశం తన వంతుగా చిన్న, సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వడానికి, పేదలకు ఆహారం అందించడానికి, కొన్ని దేశాలకు ఆహార భద్రతను నిర్ధారించేందుకు ఈ మార్పులు చేసినట్లు చెప్పింది. భారతదేశం బియ్యంపై ఆంక్షలను ఎత్తివేసినప్పటి నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2025 నాటికి రికార్డు స్థాయిలో 22.5 మిలియన్ టన్నులకు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే డబ్ల్యూటీఓ నిబంధనలకు లోబడే నిర్ణయాలున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. ఎఫ్సీఐ గోదాముల్లోని బియ్యాన్ని ఎగుమతులకు ఉపయోగించడం లేదన్నారు. అందుకు బదులుగా ఏటా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న స్టాక్నే నిల్వ ఉంచకుండా నేరుగా ఎగుమతి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై సెప్టెంబర్ 25-26 తేదీల్లో జరిగే సమీక్షా సమావేశంలో చర్చ జరగనుంది.ఇదీ చదవండి: భారత్–అమెరికా చర్చల్లో పురోగతి -
పసిడి మళ్లీ అదే స్పీడు.. రోజుకో రికార్డు
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు (Today Gold Rate) శుక్రవారం మళ్లీ స్పీడ్ అందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 25,054కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 పాయింట్లు పుంజుకుని 81,691 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.63బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.83 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.03 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.85 శాతం పెరిగింది.నాస్డాక్ 0.72 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రుణాలపై మారటోరియం ఇవ్వండి
ఎగుమతిదారులు టారిఫ్లు, ద్రవ్యోల్బణం, డిమాండ్ అనిశ్చితిలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్థికంగా వెసులుబాటు లభించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్కి ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో విజ్ఞప్తి చేసింది. రుణాలకు సంబంధించి అసలు, వడ్డీపై ఒక ఏడాది పాటు వన్–టైమ్ మారటోరియం(రుణాలు చెల్లించేందుకు గడువు పొడిగింపు) ప్రకటించాలని కోరింది. అలాగే ప్రాధాన్యతా రంగం కింద వర్గీకరించినప్పటికీ ఎగుమతి సంస్థలకు తగు స్థాయిలో ప్రయోజనం లభించడం లేదని పేర్కొంది.ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన 40 శాతం రుణాలకు సంబంధించి ఎగుమతిదార్ల వాటా 2–2.5 శాతంగా ఉండేలా ఆదేశించాలని ప్రతిపాదించింది. గురువారం ఆర్బీఐతో సమావేశమైన సందర్భంగా ఎఫ్ఐఈవో ఈ మేరకు విజ్ఞప్తులు చేసింది. బ్యాంకులు సరళతరమైన విధంగా రుణాలు అందించాలని, పరిస్థితిని బట్టి పునర్వ్యవస్థీకరించాలని, అంతర్జాతీయంగా లావాదేవీల నిర్వహణ విషయంలో ఎగుమతిదార్లకు మద్దతుగా నిలవాలని కోరింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో అంతరాయాల కారణంగా కొనుగోళ్లు, ఉత్పత్తి, ఎగుమతి షెడ్యూల్స్లో జాప్యం జరుగుతోందని పేర్కొంది. కాబట్టి, ఎగుమతి చేయడానికి ముందు ఇచ్చే స్వల్పకాలిక రుణాల కాలవ్యవధిని పెంచితే ఎగుమతిదార్లకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎఫ్ఐఈవో తెలిపింది.తమ పరిధిలో లేని జాప్యాల వల్ల ఆర్థికంగా దెబ్బ తినకుండా నిర్వహణ మూలధనాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు, నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు, కాంట్రాక్టు నిబంధనలను పాటించేందుకు వీలవుతుందని వివరించింది. ఇలాంటి ఊరటనిచ్చే చర్యలతో ఎగుమతిదార్లు, మార్కెట్లలో నెలకొన్న కొత్త పరిస్థితులకు అనుగుణంగా తమ కార్యకలాపాలను, వ్యూహాలను మార్చుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) తరహా పథకాన్నిమళ్లీ ప్రవేశపెట్టాలని ఎఫ్ఐఈవో విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రస్తుతం ఇలాంటివి చాలా అవసరమని వివరించింది.ఇదీ చదవండి: భారత్–అమెరికా చర్చల్లో పురోగతి -
భారత్–అమెరికా చర్చల్లో పురోగతి
ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారత్–అమెరికా మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రకటించారు. చర్చల్లో పురోగతి పట్ల రెండు దేశాలు సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చలను 2025 నవంబర్ నాటికి ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశ వాణిజ్య మంత్రులకు సూచించినట్టు తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికాతో భారత్ చురుగ్గా చర్చలు నిర్వహిస్తున్నట్టు మంత్రి గోయల్ బుధవారం సైతం ప్రకటించడం గమనార్హం.రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతంగా పూర్తయ్యేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవని, తన మంచి స్నేహితుడైన ప్రధాని నరేంద్ర మోదీతో రానున్న వారాల్లో మాట్లాడేందుకు వేచి చూస్తున్నానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సాకారమవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం వెంటనే సానుకూలంగా స్పందించారు.అమెరికా, భారత్ సహజ భాగస్వాములంటూ.. వీలైనంత ముందుగా వాణిజ్య చర్చలను ముగించేందుకు రెండు దేశాలు చురుగ్గా పనిచేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్పై చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. వాస్తవానికి భారత్–అమెరికా మధ్య పలు విడతల చర్చలు జరిగినప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడం తెలిసిందే.ఇదీ చదవండి: నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు కొత్త ఫోన్ -
నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు కొత్త ఫోన్
నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు హెచ్ఎండీ సంస్థ ‘వైబ్ 5జీ’ పేరుతో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.8,999 గా ఉంది. కంపెనీ నుంచి రూ.10,000 లోపు ధరలో వస్తున్న తొలి స్మార్ట్ఫోన్ ఇది. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, 50 మెగాపిక్సల్ రియర్ కెమెరా ఉంది.5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ మొబైల్లో అమర్చారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్కు ఏడాది రిప్లేస్మెంట్ గ్యారెంటీ సదుపాయం ఉంది. అలాగే హెచ్ఎండీ 101 4జీ, 102 4జీ పేరిట రెండు 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేశారు. వీటి ధరలు వరుసగా రూ.1,899, రూ.2,199గా ఉన్నాయి.ఇదీ చదవండి: ఈక్విటీ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడుల జోరు! -
స్క్రాప్ సర్టిఫికెట్తో అదనపు డిస్కౌంట్..
న్యూఢిల్లీ: పాత వాహనానికి సంబంధించిన స్క్రాపేజీ సర్టిఫికెట్ ఇచ్చే కస్టమర్లకు, కొత్త వాహనాలపై మరిన్ని డిస్కౌంట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. అలాగే, పాత వాహనాన్ని తుక్కు కింద మార్చి (స్క్రాప్) కొత్తవి కొంటున్న వారికి, జీఎస్టీని కొంత తగ్గించడం రూపంలో కూడా ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కోరినట్లు ఆయన చెప్పారు. భారతీయ ఆటోమొబైల్స్ తయారీ సంస్థల సంఘం సియామ్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్క్రాపేజీ పాలసీ అనేది ఇటు పరిశ్రమకు అటు ప్రభుత్వానికి కూడా ప్రయోజనకరమైనదని గడ్కరీ చెప్పారు. ‘‘ఇది పరిశ్రమకే మేలు చేస్తుంది. కానీ పరిశ్రమ నా మాట ఇంకా పూర్తిగా వినడం లేదు. కొత్త వాహనాన్ని కొనేందుకు, పాతదాన్ని స్క్రాప్ చేసిన వారికి బాగా డిస్కౌంట్లు ఇస్తే, మీ టర్నోవరే భారీగా పెరుగుతుంది. ప్రభుత్వానికి కూడా జీఎస్టీ వస్తుంది. దేశంలో కాలు ష్యం తగ్గుతుంది. కాబట్టి దీనికి మీరు కూడా ఇందు కు తప్పకుండా తోడ్పడాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఇటీవల వస్తు, సేవల పన్నులను (జీ ఎస్టీ) క్రమబదీ్ధకరించడం వల్ల ఆటో రంగానికి భారీగా లబ్ధి చేకూరిందని, పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ‘‘మన ఆటో పరిశ్రమ ఇప్పుడు పరిమాణంపరంగా నంబర్ 3గా ఎదిగింది. మనం అంతా కలిసి పని చేస్తే తప్పకుండా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకోగలం’’ అని గడ్కరీ వివరించారు. తుక్కు రీసైక్లింగ్తో ఉద్యోగాలకు దన్ను.. తుక్కును రీసైక్లింగ్ చేసే ప్రక్రియ కారణంగా అదనంగా 70 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని గడ్కరీ చెప్పారు. అలాగే ఉక్కు, సీసం, అల్యుమినియం, ప్లాటినం, పల్లాడియం లాంటి లోహాల లభ్యత కూడా పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని తెలిపారు. వాహనాలన్నింటినీ స్క్రాప్ చేసి అదనంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయడం వల్ల జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి రూ. 40,000 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని గడ్కరీ చెప్పారు. స్క్రాపింగ్ తర్వాత ఏర్పడే అదనపు డిమాండ్తో ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ప్రయోజనం పొందుతుందన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా సగటున 16,830 వాహనాలను తుక్కు కింద మారుస్తుండగా, ప్రైవేట్ రంగం రూ. 2,700 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని ఆయన చెప్పారు. ఈ–20పై అవాస్తవాలు.. ఈ20 ఇంధనంతో వాహనాల మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ పాడవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలే అని గడ్కరీ కొట్టిపారేశారు. దిగుమతులను తగ్గించుకునేందుకు ఇథనాల్ ఉపయోగపడుతుందని, దీని వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన చెప్పారు. దీనితో రైతులకు రూ. 45,000 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి దేశీయంగా అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేస్తామని మంత్రి చెప్పారు.పరిశ్రమకు జీఎస్టీ బూస్ట్.. వాహనాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు దేశీ ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి మరింత దోహదపడుతుందని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. దీనితో రేట్లు తగ్గి, ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ వాహనాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తొలిసారిగా వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి, మధ్య స్థాయి ఆదాయవర్గాలకు గణనీయంగా ప్రయోజనం లభిస్తుందని చంద్ర వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లోను, అలాగే ఎగుమతులపరంగాను భారతీయ ఆటో పరిశ్రమ స్థిరమైన పనితీరు కనపర్చిందని చెప్పారు. ప్యాసింజర్ వాహనాల విభాగంలో 2 శాతం వార్షిక వృద్ధితో, అత్యధికంగా 43 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు వివరించారు. ద్విచక్ర వాహనాల విభాగం కూడా కోలుకుంటోందని 9.1 శాతం వృద్ధితో 1.96 కోట్ల విక్రయాలు నమోదయ్యాయని చంద్ర చెప్పారు. -
రిలయన్స్ భారీ ఫుడ్ పార్క్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆహారోత్పత్తులు, పానీయాల తయారీకి ఏకీకృత ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్(కాటోల్)లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్పై రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్.. మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ యూనిట్తో 500మందికిపైగా ఉపాధి కల్పించనుంది. 2026లో తయారీ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ సమీకృత ఫుడ్ పార్క్ల ఏర్పాటుకు రూ. 40,000 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, ఆధునిక టెక్నాలజీలతో ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్ పార్క్కు తెరతీయనున్నట్లు వివరించారు. రిలయన్స్ రిటైల్ నుంచి ఆవిర్భవించిన రిలయన్స్ కన్జూమర్ మూడేళ్లలోనే రూ. 11,000 కోట్ల టర్నోవర్ను సాధించినట్లు ఏజీఎంలో తెలిపారు. -
ఇన్ఫీ18,000 వేల కోట్ల రికార్డ్ బైబ్యాక్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి అంగీకరించింది. గురువారం (11న) సమావేశమైన బోర్డు షేరుకి రూ. 1,800 ధర మించకుండా 2.41 శాతం వాటా బైబ్యాక్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించనుంది. వెరసి రూ. 5 ముఖ విలువగల 10 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. గురువారం బీఎస్ఈలో ముగింపు ధర రూ. 1,510తో పోలిస్తే బైబ్యాక్కు 19 శాతం ప్రీమియంను నిర్ణయించింది. కంపెనీ 2025 జూన్ త్రైమాసికంలో 88.4 కోట్ల డాలర్ల (రూ. 7,805 కోట్లు) ఫ్రీ క్యాష్ ఫ్లోను ప్రకటించింది. కాగా.. కంపెనీ తొలిసారి 2017లో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను చేపట్టింది. ఈక్విటీలో 4.92 శాతం వాటాకు సమానమైన 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఇందుకు ఒక్కో షేరుకి రూ. 1,150 ధరలో రూ. 13,000 కోట్లు వెచ్చించింది. ఆపై రెండోసారి 2019లో రూ. 8,260 కోట్లు, మూడోసారి 2021లో 9,200 కోట్లు చొప్పున షేర్ల బైబ్యాక్కు వినియోగించింది. ఈ బాటలో 2022లోనూ రూ. 9,300 కోట్లతో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ. 1,850 ధర మించకుండా బైబ్యాక్ చేపట్టింది. ఇన్ఫోసిస్ షేరు 1.5% క్షీణించి రూ. 1,510 వద్ద ముగిసింది. -
స్టార్టప్లకు ‘గేమింగ్’ నిషేధం సెగ..
ముంబై: దేశీయంగా రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ)పై నిషేధం విధించడంతో పలు అంకురాల వాల్యుయేషన్పై ప్రభావం చూపింది. నాలుగు బడా సంస్థలు .. యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే అంకురాలు) జాబితా నుంచి చోటు కోల్పోయాయి. డ్రీమ్11 (26 కోట్ల యూజర్లు) , గేమ్స్ 24 x 7 (12 కోట్ల యూజర్లు), గేమ్స్క్రాఫ్ట్ (3 కోట్ల యూజర్లు), మొబైల్ ప్రీమియర్ లీగ్ (9 కోట్ల యూజర్లు) వీటిలో ఉన్నాయి. ఇక యూనికార్న్లు కాకపోయినప్పటికీ ‘జూపీ’, ‘విన్జో గేమ్స్’లాంటి సంస్థల వాల్యుయేషన్లు కూడా పడిపోయాయి. ‘2025 ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్, ఫ్యూచర్ యూనికార్న్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధించే బిల్లును పార్లమెంటు గత నెల ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్స్ సంబంధిత ప్రకటనలపై కూడా నిషేధం వర్తిస్తుంది. అలాంటి గేమ్స్ ఆడేందుకు నగదును బదిలీ చేసే సరీ్వసులను సైతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించకూడదు. ‘‘ఇలాంటి మార్పులన్నింటి వల్ల భారత్లో పేరొందిన పలు ఆర్ఎంజీ కంపెనీలపై ప్రభావం పడింది. దీనితో వాటి వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది’’ అని నివేదిక పేర్కొంది. అలాగే ఈ చట్టం వల్ల పరిశ్రమపై ఇన్వెస్టర్ల నమ్మకం కూడా సడలిందని వివరించింది. మరోవైపు, అంకురాలు క్రమంగా లాభదాయకత, పెట్టుబడులను సమర్ధంగా వినియోగించుకోవడం, దీర్ఘకాలంలో నిలకడగా ఉండే వ్యాపార విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ ఎండీ రాజేశ్ సలూజా తెలిపారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → 8.2 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో అత్యంత విలువైన భారతీయ స్టార్టప్గా డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ జిరోధా అగ్రస్థానంలో ఉంది. చెరి 7.5 బిలియన్ డాలర్లతో ఫిన్టెక్ సంస్థ రేజర్పే, లెన్స్కార్ట్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. → అత్యధికంగా 26 అంకురాలతో బెంగళూరు యూనికార్న్ హబ్గా నిల్చింది. వీటి మొత్తం వాల్యుయేషన్ 70 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 36.3 బిలియన్ డాలర్ల విలువ చేసే 12 స్టార్టప్లతో ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) రెండో స్థానంలో, 22.8 బిలియన్ డాలర్ల విలువ చేసే 11 సంస్థలతో ముంబై మూడో స్థానంలో నిల్చాయి. → దేశీయంగా అత్యంత పిన్న వయసు్కలైన యూనికార్న్ వ్యవస్థాపకులుగా జెప్టో ఫౌండర్లు కైవల్య ఓహ్రా, ఆదిత్ పలిచా (ఇద్దరికీ 22 ఏళ్లు) నిల్చారు. → వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్ భారతీయ స్టార్టప్స్లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసింది. టరి్టల్మింట్, వాట్ఫిక్స్, గ్రో, ప్రిజమ్ (ఓయో) సహా 68 అంకురాల్లో 200 మిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టింది. అత్యంత విలువైన స్టార్టప్లు ఏకంగా 3.74 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. యూనికార్న్లలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 2.06 లక్షలుగా ఉంది. 11 కొత్త యూనికార్న్లు .. కొన్ని ఆర్ఎంజీ కంపెనీలు లిస్టు నుంచి నిష్క్రమించినప్పటికీ ఈ ఏడాది యూనికార్న్ల జాబితాలోని స్టార్టప్ల సంఖ్య మొత్తం మీద పెరిగి, 73కి చేరింది. ఈ ఏడాది 11 అంకురాలు యూనికార్న్ హోదా దక్కించుకున్నాయి. ఏఐడాట్టెక్, నవీ టెక్నాలజీస్, వివృతి క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, ర్యాపిడో, నెట్రాడైన్, జంబోటెయిల్, డార్విన్బాక్స్, మనీవ్యూ, జస్పే, డ్రూల్స్ వీటిలో ఉన్నాయి. -
మూడేళ్లకే ముగిసిన ప్రస్థానం!.. వెబ్సైట్లో కనిపించిన బైక్ ఇదే..
సుజుకి మోటార్సైకిల్ ఇండియా తన లైనప్ నుంచి కటన బైకును నిలిపివేసింది. దీనిని కంపెనీ తన అధికారిక వెబ్సైట్ తొలగించింది. 2022 జులైలో ప్రారంభమైన ఈ బైక్ లేటెస్ట్ రెట్రో డిజైన్ రైడర్లను ఆకట్టుకుని.. మంచి అమ్మకాలను సాధించగలిగింది. అయితే కాలక్రమంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. దీంతో అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. దీంతో దేశంలో అరంగ్రేటం చేసిన మూడేళ్లలోనే మార్కెట్కు దూరమైందని తెలుస్తోంది.రూ.13.61 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో, కటనను కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) మార్గం ద్వారా భారతదేశంలోకి వచ్చిన ఈ బైకును కంపెనీ ఎందుకు తొలగించిందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఆదరణ తగ్గడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ బైక్ 999 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్తో 11,000 rpm వద్ద 150 bhp, 9,250 rpm వద్ద 106 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.సుజుకి ఇప్పుడు కటన బైకును తొలగించడంతో.. పెద్ద బైక్ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం మూడు మోడళ్లు ఉన్నాయి. అవి హయబుసా (రూ. 16.90 లక్షలు), జీఎస్ఎక్స్-8ఆర్ (రూ. 9.25 లక్షలు), వీ-స్ట్రోమ్ 800డీఈ (రూ. 10.30 లక్షలు). -
హైదరాబాద్లో DESRI కొత్త ఆఫీస్
ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ అయిన DESRI.. హైదరాబాద్లోని ఆర్ఎంజెడ్ నెక్సిటీలో తన కొత్త కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నుంచి ప్రయోజనం పొందుతూ, హైదరాబాద్ను తన ప్రపంచ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో కంపెనీ దీనిని ప్రారంభించింది.2014లో హైదరాబాద్లో మొదటిసారి కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి.. కౌంటింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, లీగల్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్తో సహా వివిధ రంగాలలో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. నేడు కంపెనీ అనేక కీలకమైన కార్యకలాపాలలో కీలక పాత్రను పోషిస్తోంది.కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా.. DESRI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ జ్విల్లింగర్ మాట్లాడుతూ, హైదరాబాద్ DESRIకి వ్యూహాత్మక కేంద్రంగా మారింది. అంతే కాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఆర్ఎంజెడ్ నెక్సిటీలో మా కొత్త కార్యాలయం ప్రారంభం, భారతదేశంలో మా ఉనికిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. -
దేశంలో అతిపెద్ద డీల్!.. రూ.3472 కోట్లు వెచ్చించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబై మెట్రో కార్పొరేషన్కు చెందిన నారిమన్ పాయింట్లోని టోనీ బిజినెస్ డిస్ట్రిక్ట్లో 4.16 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీనికోసం ఆర్బీఐ ఏకంగా రూ. 3472 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ భూమిని ఎందుకు కొనుగోలు చేసిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.ముంబైలోని నారిమన్ పాయింట్ అనేది దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం. దీనిని ప్రీమియం వ్యాపార కేంద్రంగా పరిగణిస్తారు. ఇలాంటి ప్రదేశంలో ఆర్బీఐ భూమిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద డీల్స్లో ఇది ఒకటి కావడంతో.. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఈ ఏడాది జరిగిన అతిపెద్ద భూమి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనించదగ్గ విషయం.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరి రెండు రోజులే.. జాబ్ నుంచి తీసేసారురియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయిన సీఆర్ఈ మ్యాట్రిక్స్ నుంచి సేకరించిన ఆస్తి లావాదేవీ డేటా ప్రకారం.. ఆర్బీఐ కొనుగోలు చేసిన భూమి కోసం రూ. 208 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించింది. ఈ ఒప్పందం సెప్టెంబర్ 5న రిజిస్టర్ అయింది. రిజర్వ్ బ్యాంక్ తన హెడ్క్వార్టర్స్ను విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే ఈ భూమిని కొనుగోలు చేసింది. -
ఐఫోన్ 17 ఎయిర్: స్పందించిన ఓపెన్ఏఐ సీఈఓ
యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ను నాలుగు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులోని ఎయిర్ వేరియంట్ ఓపెన్ఏఐ సీఈఓ 'సామ్ ఆల్ట్మన్'ను తెగ ఆకట్టుకుంది. దీనిపై స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.''చాలా కాలంగా నేను కోరుకుంటున్న మొదటి కొత్త ఐఫోన్ అప్గ్రేడ్ ఇది! చాలా బాగుంది'' అని యాపిల్ టెక్నాలజీని సామ్ ఆల్ట్మన్ ప్రశంసించారు. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ ఎయిర్ అత్యంత సన్నని హ్యాండ్సెట్. ఇది చాలా తేలికగా ఉండటం వల్ల మీ చేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. 5.6 మిల్లీమీటర్ల మందం కలిగిన ఫ్రేమ్, కేవలం 165 గ్రాముల బరువు కలిగిన ఇది ఇప్పటివరకు ఉన్న అత్యంత సన్నని ఐఫోన్.గతంలో చాలామంది ఐఫోన్ ప్రియులు, విశ్లేషకులు.. కొత్త ఆవిష్కరణలు లేదని ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ ఎనిమిది సంవత్సరాలలో కంపెనీ ఆవిష్కరించిన అతిపెద్ద మార్పులలో ఒకటిగా నిలిచింది.first new iphone upgrade i have really wanted in awhile! looks very cool.— Sam Altman (@sama) September 9, 2025ఐఫోన్17 ధరలుటెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17లో 6.3 ఇంచెస్ స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ డ్యుయల్ ఫ్యూజన్ కెమెరా, 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయిదు రంగుల్లో లభించే అత్యంత పల్చని ఐఫోన్ 17 ఎయిర్ని కూడా యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్ 17 ధర 799 డాలర్ల నుంచి, ప్రో ధర 1,099 డాలర్లు, ప్రో మ్యాక్స్ ధర 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. -
వేగవంతమైన బుకింగ్స్ కోసం.. ఈడెన్ హోమ్స్టే వెబ్సైట్
హైదరాబాద్లో ప్రయాణించే దేశీయ, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సులభమైన, వేగవంతమైన సౌకర్యవంతమైన బుకింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా.. ఈడెన్ హోమ్స్టే కంపెనీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ ప్రారంభించింది. ఇది మొబైల్, టాబ్లెట్, డెస్క్టాప్లలో కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పర్యాటకులు ఈ వెబ్సైట్ ద్వారా గదుల లభ్యతతో పాటు, లేటెస్ట్ ఫోటోలను బ్రౌజ్ చేస్తూ.. వివరణాత్మక సమాచారం పొందవచ్చు. అంతే కాకుండా వేగంగా బుకింగ్స్ పూర్తి చేసుకోవచ్చు.ముఖ్యమైన ఫీచర్లు..➢రియల్-టైమ్ బుకింగ్ సిస్టమ్: తక్షణ ధృవీకరణ➢మల్టీ-కరెన్సీ సపోర్ట్: విదేశీ అతిథుల కోసం➢స్పష్టమైన ధరల సమాచారం: దేశీయ & అంతర్జాతీయ అతిథుల కోసం➢రివార్డ్ పాయింట్స్ సిస్టమ్: తదుపరి బుకింగ్లో ఉపయోగించుకోడానికి➢గిఫ్ట్ కార్డ్స్: కొనుగోలు, రీడెంప్షన్ కోసం➢ఇంటిగ్రేటెడ్ గూగుల్ మ్యాప్స్: సులభ నావిగేషన్ కోసం➢ఆథెంటిక్ గెస్ట్ రివ్యూలు: సరైన నిర్ణయం తీసుకోవడానికి➢256-బిట్ ఎన్క్రిప్షన్తో సెక్యూర్ పేమెంట్స్➢మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసంప్రాపర్టీ ఓనర్లకు కొత్తఅవకాశాలుహైదరాబాద్లో పాటు భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కంపెనీ ఈ వెబ్సైట్ తీర్చిదిద్దింది. ఈ ప్లాట్ఫారమ్ ద్వారా హోస్ట్ తమ స్టేలను లిస్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా స్థానికంగా ఉపాధిఅవకాశాలు మెరుగుపడతాయి.దీని గురించి ఈడెన్ హోమ్స్టే ప్రతినిధి మాట్లాడుతూ.. స్టేలో లభించే సౌకర్యం, ఆత్మీయతలాగే బుకింగ్ అనుభవం కూడా సులభంగా, సౌకర్యవంతంగా ఉండాలని మేము కోరుకున్నాము. ఈ అప్గ్రేడ్ మా అతిథులందరికీ నాణ్యత, ఆత్మీయత, సౌలభ్యం అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం అని అన్నారు. -
ఈఎంఐలపై ఫోన్ కొన్నవారికి షాక్! ఆర్బీఐ ఓకే అంటే మాత్రం..
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణంపై మొబైల్ ఫోన్లు తీసుకుని ఆ రుణాన్ని తిరిగి చెల్లించడంలో డీఫాల్ట్ అయితే అలాంటి ఫోన్లను వినియోగించేందుకు వీలు లేకుండా ఆ బ్యాంకులు లేదా రుణ సంస్థలు రీమోట్గా లాక్ చేయబోతున్నాయి. ఎందుకంటే వాటికి ఆర్బీఐ ఆ మేరకు అనుమతి ఇవ్వబోతోందంటూ రాయిటర్స్ కథనం పేర్కొంది.వినియోగదారుల వాస్తవ ప్రయోజనాలను కాపాడుతూనే మరోవైపు నిరర్థక రుణాలను తగ్గుంచుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఫోన్లతో సహా మూడింట ఒక వంతు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో చిన్న-టికెట్ వ్యక్తిగత రుణాలపై కొనుగోలు చేస్తున్నట్లు హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ 2024 అధ్యయనం చూపించింది.గతేడాది కూడా బ్యాంకులు, రుణ సంస్థలు ఇలాగే రుణ గ్రహీతలు డీఫాల్ట్ అయితే రుణంపై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను లాక్ చేయడానికి ప్రయత్నించగా ఆ ప్రయత్నాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అడ్డుకుంది. అయితే ఇప్పుడు ఇలాంటి నిరర్థక రుణాలు పెరిగిపోతుండటంతో రికవరీ పెంచుకోవడంలో భాగంగా కస్టమర్ల ఫోన్లను లాక్ చేసేందుకు ఆర్బీఐ రుణ సంస్థలకు అనుమతి ఇచ్చే ఆస్కారం ఉందని రాయిటర్స్ వివరించింది.బ్యాంకులు, రుణసంస్థలతో సంప్రదింపులు జరిపిన తరువాత, ఫోన్-లాకింగ్ మెకానిజమ్పై మార్గదర్శకాలను ప్రవేశపెడుతూ ఆర్బీఐ తన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ను కొన్ని నెలల్లో అప్డేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఫోన్ లాకింగ్కు సంబంధించి రుణగ్రహీతల నుండి ముందస్తు సమ్మతిని తప్పనిసరి చేయడంతోపాటు లాక్ చేసిన ఫోన్లలో వ్యక్తిగత డేటాను రుణ సంస్థలు యాక్సెస్ చేయకుండా కూడా నిషేధించేలా ఈ నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు.ఈ చర్య అమలైతే, బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి ప్రధాన కన్జూమర్ ఫైనాన్స్ సంస్థలకు రికవరీలు మెరుగవుతాయని భావిస్తున్నారు. క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హైమార్క్ ప్రకారం.. రూ.1 లక్ష లోపు రుణాలే ఎక్కువగా డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లలో 85% నాన్-బ్యాంక్ రుణ సంస్థల వద్దే ఉన్నాయి. -
ఉద్యోగంలో చేరి రెండు రోజులే.. జాబ్ నుంచి తీసేసారు
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ చాలా ప్లాన్స్ ఉంటాయి. ఎక్కువ శాలరీ తెచ్చుకోవడానికి కంపెనీలను సైతం మారుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఉద్యోగమే పోతే?, వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అసాధ్యమే. ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కంపెనీలో చేరిన రెండు రోజులకే ఉద్యోగం నుంచి తొలగించిన తమ బాధాకరమైన అనుభవాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను గుర్గావ్లోని ఒక చిన్న కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్గా రెండు సంవత్సరాలు పనిచేసానని.. ఈ ఏడాది జూలైలో సాకేత్లోని ఫుడ్ బేస్డ్ కంపెనీలో చేరాను పేర్కొన్నాడు. ఉద్యోగంలో చేరిన రెండో రోజు.. ఆ కంపెనీ బాస్ మరిన్ని బాధ్యతలు చేపట్టగల మేనేజర్ చూస్తున్న కారణంగా.. నన్ను తొలగించారు. చేసేదేమీ లేక నేను ఆఫీసు నుంచి వెళ్ళిపోయాను.ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదని పేర్కొన్నారు. ఇది మానసికంగా నన్ను ఎంతగానో బాధిస్తోంది. నేను ఇప్పుడు నా మునుపటి కంపెనీకి కూడా వెళ్లలేకపోతున్నాను. ఎందుకంటే నా స్థానంలో కంపెనీ మరొకరిని నియమించుకుంది. ఇప్పుడు నాకు ఏమి చేయాలో తోచడం లేదని, నాకు ఎవరైనా సహాయం చేయగలరా అని అడిగారు.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాలంటే.. చట్టపరమైన పరిణామాలు ఉండాలి?, మిమ్మల్ని అన్యాయంగా తొలగించారు కాబట్టి.. మీరు న్యాయవాదిని సంప్రదించండి అని ఒకరు సలహా ఇచ్చారు. వేచి ఉండండి, తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుందని మరొకరు అన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ ఉండండి, ఇంటర్యూలు విఫలమైనా బాధపడకండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. -
చిన్న సంస్థలకు ఈ–కామర్స్ దన్ను
దేశీయంగా చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోవడానికి ఈ–కామర్స్ మాధ్యమం దన్నుగా నిలుస్తోంది. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధికి దోహదకారిగా ఉంటోంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, దేశవ్యాప్తంగా వినియోగదారులకు నేరుగా చేరువ కావడానికి, వ్యాపార వృద్ధికి అమెజాన్లాంటి డిజిటల్ మార్కెట్ప్లేస్ల రూపంలో చిన్న వ్యాపారాలకు కొత్తగా మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి.మరోవైపు, ఎఫ్ఎంసీజీ (వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులు) అమ్మకాలు, పట్టణ మార్కెట్లలో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ లావాదేవీల్లో 60 శాతం వాటా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలదే ఉంటోంది. దీంతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు నేరుగా చేరువ చేసే డిజిటల్ మార్కెట్ప్లేస్ల రూపంలో చిన్న సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయి. వ్యాపార వృద్ధికి దోహదకారి.. ‘భారత ఈ–కామర్స్ వ్యవస్థ, ఎంఎస్ఎంఈలకు కీలకమైన వృద్ధి చోదకంగా మారింది. డిమాండ్ భారీగా ఉండే పండుగల సీజన్లో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటోంది.అలాగే, లోకల్ షాప్లు, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు, వినూత్నమైన స్టార్టప్లను ప్రోత్సహించే ప్రోగ్రాంలతో చిన్న వ్యాపారాలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వీలవుతోంది. సీజనల్ నియామకాలు కూడా ఆర్థికంగా సానుకూల ప్రభావం చూపుతున్నాయి. లక్షల కొద్దీ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి‘ అని ఇండియా ఎస్ఎంఈ ఫోరం ప్రెసిడెంట్ వినోద్ కుమార్ తెలిపారు.డిజిటల్ మార్కెట్ప్లేస్ల ద్వారా అదే రోజు లేదా మరుసటి రోజే డెలివరీ అప్షన్లతో వినియోగదారులకు సత్వరం సేవలు అందించేందుకు వీలవుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 123.58 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 81,548.73 వద్ద, నిఫ్టీ 32.40 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,005.50 వద్ద నిలిచాయి.స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్, గ్రీన్ప్యానెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, మోహిత్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గుడ్ లక్ ఇండియా, ఆఫర్డబుల్ రోబోటిక్ & ఆటోమేషన్, రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, డైనమిక్ ప్రొడక్ట్స్(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ
టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే గూగుల్ గత నెలలో జెమిని యాప్కు 'నానో బనానా' సంబంధించిన ఏఐ ఇమేజ్ నేర్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటిందని, ఈ యాప్ అధిక ప్రజాదరణ పొందిందని గూగుల్ వీపీ జోష్ వుడ్వార్డ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ప్రస్తుతం నానో బననా ట్రెండ్ సాగుతోంది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలను సృష్టించింది. వేగం, ఖచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ఇవి చూపరులను వావ్ అనేలా చేస్తున్నాయి. ప్రస్తుతం నానో బననా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది.ప్రాంప్ట్ 1వినియోగదారులు తమ ఫోటోను అప్లోడ్ చేసి, బొమ్మల పెట్టె లోపల తమ బొమ్మను రూపొందించమని జెమినిని అడగవచ్చు. ఇది ప్యాకేజింగ్, గ్రాఫిక్స్, స్టోర్-షెల్ఫ్ లుక్తో పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాంప్ట్లలో ఇది ఒకటి. మిమ్మల్ని మీరు యాక్షన్ ఫిగర్గా మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రాంప్ట్ 2వేరే దశాబ్దంలో ఉన్నట్లు కూడా మిమ్మల్ని మీరు సృష్టించుకోవచ్చు. మీ ఫోటోను 1920ల ఫ్లాపర్, 1970ల డిస్కో డాన్సర్ లేదా 1990ల సిట్కామ్ పాత్రలో చూపించమని అడగవచ్చు. మీరు ఎంచుకున్న దశాబ్దానికి సరిపోయే విధంగా బట్టలు, హెయిర్స్టైల్స్ వంటివాటిని ఏఐ మారుస్తుంది.ప్రాంప్ట్ 3కొంతమంది తమను తాము ప్రసిద్ద టీవీ షోలలో కనిపించేలా డిజైన్ చేసుకోవాలని ఆశపడతారు. బననా ఏఐ ఇప్పుడు దీనిని సాధ్యం చేస్తుంది. మీరు కోరుకున్నట్లు ఏఐ మిమ్మల్ని మారుస్తుంది.ప్రాంప్ట్ 4జెమిని ఏఐ ఇప్పుడు మిమ్మల్ని ప్రముఖుల పక్కన ఉన్నట్లు కూడా చూపించగలదు. ఉదాహరణకు మోనాలిసా పక్కన నిలబడి ఉండటం, వాన్ గోహ్ స్టార్రి నైట్లో కనిపించడం లేదా డాలీ ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీలో కలిసిపోవడం వంటివి ఉన్నాయి. మీకు నచ్చిన ప్రముఖుల పక్కన మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది.ఇదీ చదవండి: క్షీణిస్తున్న అమెరికా టూరిజం: అసలైన కారణాలు ఇవే..ప్రాంప్ట్ 5బననా ఏఐ సాయంతో.. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా రూపొందిందించుకోవచ్చు. ఐఫెల్ టవర్ నుంచి తాజ్ మహల్, హాలీవుడ్ సైన్ వరకు మీకు నచ్చిన ప్రసిద్ధ ప్రదేశంలో మీరు ఉన్నట్లు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. ఏఐ దీనికి లైటింగ్ ఇతర షేడ్స్ కూడా అందిస్తుంది. -
ఈక్విటీ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడుల జోరు!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడుల జోరు ఆగస్ట్లో కొంత తగ్గింది. రూ.33,430 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. జూలైలో రూ.42,702 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. ఈ ఏడాది జూన్లో రూ.23,587 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 2024 ఆగస్ట్లో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.38,239 కోట్లుగా ఉన్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.7,980 కోట్లు నికరంగా బయటకు వెళ్లాయి. జూలైలో రూ.1.06 లక్షల కోట్ల నికర డెట్ పెట్టుబడులతో పోల్చి చూస్తే భిన్నమైన పరిస్థితి కనిపించింది. దీంతో ఆగస్ట్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.75.20 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఈ మొత్తం రూ.75.36 లక్షల కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.ఆగస్ట్లో ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు నీరసించడం వెనుక కొత్త పథకాల (ఎన్ఎఫ్వో) ఆవిష్కరణ తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘గత ధోరణుల ఆధారంగా ఆగస్ట్ నెలలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు అధికంగా నమోదవుతాయని ఆశించాం. కానీ, అవి ఫ్లాట్గా రూ.28,265 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నప్పటికీ, ఎఫ్పీఐలు విక్రయాలు కొనసాగిస్తున్నా కానీ, భారత ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. మార్కెట్లకు ఇంది ఎంతో అనుకూలం’’అని మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. విభాగాల వారీగా..ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లోకి అధికంగా రూ.7,679 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత మిడ్క్యాప్ ఫండ్స్ రూ.5,330 కోట్లను ఆకర్షించాయి.స్మాల్క్యాప్ పథకాల్లోకి రూ.4,993 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ.3,893 కోట్ల పెట్టుబడులతో సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ తర్వాతి స్థానంలో నిలిచాయి. మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్లోకి రూ.3,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్క్యాప్ ఫండ్స్లో రూ.2,835 కోట్లను ఆకర్షించాయి. 23 న్యూ ఫండ్ ఆఫర్లు (కొత్త పథకాలు) ఆగస్ట్లో రాగా, ఇవన్నీ కలసి రూ.2,859 కోట్లను సమీకరించాయి. డైనమిక్ అస్సెట్ అలోకేషన్/బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ రూ.2,316 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయి. హైబ్రిడ్ ఫండ్స్ (ఈక్విటీ డెట్ కలయికతో కూడిన)లోకి పెట్టుబడులు జూలైతో పోలి్చతే ఆగస్ట్లో 27 శాతం తగ్గి రూ.15,293 కోట్లుగా ఉన్నాయి. డెట్ విభాగం నుంచి నికరంగా రూ.7,890 కోట్లను ఇన్వెస్టర్లు ఉపహరించుకున్నారు. ముఖ్యంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.13,350 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఓవర్నైట్ ఫండ్స్ రూ.4,950 కోట్లను ఆకర్షించాయి. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.2,189 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి ఆగస్ట్ మాసంలో నికరంగా రూ.52,443 కోట్ల పెట్టబుడులు వచ్చాయి. జూలైలో వచి్చన రూ.1.8 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 24.89 కోట్లకు చేరాయి. జూలై చివరికి ఇవి 24.13 కోట్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం! -
రిజర్వ్ బ్యాంకు ఆఫీసర్ల జీతాలు ఎంతుంటాయో తెలుసా?
దేశంలోని బ్యాంకులన్నింటికీ బాసు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అదేనండి ఆర్బీఐ. సాధారణంగానే బ్యాంకు ఉద్యోగుల జీతాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. మరి దేశ అత్యున్నత బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంకులో ఆఫీసర్ల జీతాలు ఎంతుంటాయన్నది మరింత ఆసక్తికరం. ఎంట్రీ లెవల్ గ్రేడ్ బి ఆఫీసర్ల నుంచి ఉన్నత స్థాయి డిప్యూటీ జనరల్ మేనేజర్ల వరకు జీతాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఈ కథనంలో తెలుసుకుందామా?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే గ్రేడ్ బి ఆఫీసర్ల వేతన స్కేలును అధికారికంగా సవరించింది. 2025 నోటిఫికేషన్ ప్రకారం, ప్రారంభ ప్రాథమిక వేతనం నెలకు రూ .55,200 నుండి రూ .78,450 కు పెంచింది. స్థూల నెలవారీ వేతనం ఇప్పుడు రూ .1,50,374 కు చేరుకుంది.గ్రేడ్ బి ఆఫీసర్ సవరించిన నెలవారీ జీతం బ్రేక్డౌన్ ఇలా..బేసిక్ వేతనం: రూ.78,450స్థూల వేతనం: రూ.1,50,374 (హెచ్ఆర్ఏ మినహాయించి)ఇన్-హ్యాండ్ పే: రూ.1.2 లక్షల - రూ.1.35 లక్షలు (లొకేషన్,మినహాయింపులను బట్టి)పే స్కేల్: 16 ఏళ్లలో రూ.78,450 - రూ.1,41,600వేతనానికి మించిన ప్రోత్సాహకాలుఆర్బీఐ అధికారులు హౌసింగ్ అలవెన్సులు (మెట్రోలలో నెలకు రూ .70,000 వరకు), అభ్యాస రీయింబర్స్మెంట్లు, భోజన రాయితీలు, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్) కింద ఉదారమైన పెన్షన్ మొత్తాలను పొందుతారు.ఆఫీసర్ హోదానెల జీతంఅసిస్టెంట్ జనరల్ మేనేజర్రూ.2.44 లక్షలు – రూ.4.33 లక్షలుజనరల్ మేనేజర్రూ.2.91 లక్షలు – రూ.4.58 లక్షలుడిపార్ట్ మెంట్ మేనేజర్రూ.2.08 లక్షలు – రూ.3.33 లక్షలుడిప్యూటీ మేనేజర్రూ.1.5 లక్షలు – రూ.2.5 లక్షలుడిస్ట్రిక్ట్ మేనేజర్రూ.1.08 లక్షలు – రూ.2 లక్షలుఆఫీస్ అసిస్టెంట్రూ.43,000 – రూ.1.01 లక్షలుఆఫీస్ అటెండెంట్రూ.27,500 – రూ.66,600గమనిక: ఇక్కడ పేర్కొన్న జీతం గణాంకాలు ఆంబిషన్ బాక్స్, గ్లాస్ డోర్ వంటి థర్డ్ పార్టీ వేదికల్లో నమోదుల ఆధారంగా ఉజ్జాయింపుగా రూపొందించినవి. -
ఒక్కరోజు 40 శాతంపైగా పెరిగిన స్టాక్.. కారణం..
ఒరాకిల్ స్టాక్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో ఏకంగా 40 శాతంపైగా పెరిగి రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ 10న మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్ క్రమంగా పెరుగుతూ 345.38 డాలర్లు(మునుపటి సెషన్తో పోలిస్తే 40 శాతంపైగా) పెరిగి ముగింపు సమయానికి 328.33(35.95 శాతం) డాలర్ల వద్ద స్థిరపడింది. ఒరాకిల్ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలకు తోడు ఇతర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, సంస్థ అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.స్టాక్ పెరుగుదల ప్రధాన కారణాలుక్లౌడ్ కంప్యూటింగ్లో ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారుతోంది. కంపెనీ ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్డ్యాన్స్.. వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దాంతో ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో 77% పెరిగి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇది 2030 నాటికి 144 బిలియన్ డాలర్ల మార్కునుతాకే అవకాశం ఉందని అంచనా.ఒరాకిల్ క్లౌడ్ సేవలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ఆదాయం 455 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ ఏఐ, ఎంటర్ప్రైజ్ పరిష్కారాలతో ముడిపడి ఉన్న భవిష్యత్తు వ్యాపారాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రాటజిక్ పొజిషనింగ్లో ఒరాకిల్ సొంత సర్వీసులు వాడుతోంది. దాని డేటా సెంటర్లను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కృత్రిమ మేధ కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చేక్రమంలో ఎన్విడియా జీపీయూలకు భద్రతను అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటి క్లౌడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీల సరసన ఒరాకిల్ ప్రత్యర్థిగా ఎదుగుతోంది.ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం! -
యస్ బ్యాంక్లో మార్పులకు ఆర్బీఐ ఓకే..
బోర్డులో నామినీ డైరెక్టర్ల నియామకానికి తాజాగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్(ఏవోఏ)లో ప్రతిపాదిత సవరణలకు అనుమతించినట్లు పేర్కొంది. దీంతో సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) ఇద్దరు నామినీ డైరెక్టర్లను నామినేట్ చేసేందుకు వీలు చిక్కనుంది. మరో నామినీ డైరెక్టర్ను పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) ఎంపిక చేయనుంది.యస్ బ్యాంక్లో ఎస్బీఐసహా ఏడు ఇతర బ్యాంకులకు గల వాటాలను జపనీస్ దిగ్గజం ఎస్ఎంబీసీ సొంతం చేసుకున్నాక బోర్డులో నియామకాలకు తెరలేవనుంది. కాగా.. సెకండరీ కొనుగోళ్ల ద్వారా బ్యాంకులో 20 శాతం వాటాను ఎస్ఎంబీసీ చేజిక్కించుకోనున్నట్లు మే 9న యస్ బ్యాంక్ వెల్లడించిన విషయం విదితమే. దీనిలో భాగంగా ఎస్బీఐ నుంచి 13.19 శాతం వాటాను కొనుగోలు చేయనుండగా.. యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా బ్యాంకుల నుంచి మిగిలిన 6.81 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది.ఈ నెల మొదట్లో ప్రతిపాదిత డీల్కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆర్బీఐ సైతం ఇందుకు అనుమతిస్తూ ఎస్ఎంబీసీ ప్రమోటర్గా గుర్తింపు పొంబోదని తెలియజేసింది. ప్రస్తుతం యస్ బ్యాంక్లో ఎస్బీఐకు 24 శాతం వాటా ఉంది. తాజా డీల్ తదుపరి 10.81 శాతానికి వాటా పరిమితంకానుంది. -
22 వరకూ ఆగుదాం!
నగర వాసులకు బొనాంజా అందనుంది. దసరా, దీపావళి పండగ ఆనందాలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సవరణతో రెట్టింపు కానుంది. ఇటీవల కేంద్రం సవరించిన జీఎస్టీ శ్లాబులు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. గతంతో పోలిస్తే ఆటో మొబైల్స్, ఎల్రక్టానిక్ వంటి చాలా వరకు ఉత్పత్తుల ధరలు సుమారు 10 శాతం మేర తగ్గనున్నాయి. దీంతో వాహనాలు, టీవీలు, కార్లు, సెల్ఫోన్లు వంటి ఉత్పత్తుల కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ నెల 22 వరకూ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు ఈ– కామర్స్ సంస్థలు కూడా ఈ నెల 22 తర్వాతే ఆఫర్లను అందించేందుకూ సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లు, ఆన్లైన్ సంస్థల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. 18 నుంచి 5 శాతానికి..గతంలో జీఎస్టీలో ఐదు శ్లాబులు ఉండగా.. తాజాగా కేంద్రం వీటిని రెండింటికి కుదించింది. విలాసవంతమైన వస్తువులపై ప్రత్యేకంగా 10 శాతం జీఎస్టీ శ్లాబును విధించింది. ప్రస్తుతం అనేక ఉత్పత్తులపై జీఎస్టీ 28 శాతం వరకు ఉన్నాయి. 22వ తేదీ నుంచి ఈ స్లాబ్ 18 శాతానికి తగ్గనుంది. కొన్ని ఉత్పత్తులపై 18 శాతం నుంచి 5 శాతానికి కూడా తగ్గే అవకాశముంది. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి ఎల్రక్టానిక్ వస్తువులతో పాటు కార్లు, బైక్ వంటి ఆటోమొబైల్స్ ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు నిత్యావసర సరుకులపై కూడా కేంద్రం జీఎస్టీని తగ్గించింది. జీఎస్టీ శ్లాబుల్లో మార్పులతో ఒకవైపు కొన్ని కంపెనీలు రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో వినియోగదారులు మాత్రం రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలామంది షోరూమ్లకు వెళ్లి వస్తువులను చూస్తున్నారు. వాటి ఫీచర్లను పరిశీలిస్తున్నారు. కానీ కొనుగోలును మాత్రం ఈ నెల 22 తర్వాతే చేద్దామనే అభిప్రాయానికి వస్తున్నారని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. కొన్ని బ్రాండ్లు తాత్కాలికంగా ఆఫర్లు ప్రకటించినా అవి కస్టమర్లను ఆకట్టుకోలేకపోతున్నాయి. తగ్గనున్న వాహనాల ధరలు..సాధారణంగా దసరా, దీపావళి పండగ సీజన్లలో వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్గా భావిస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఆటో మొబైల్స్పై 28 శాతంగా జీఎస్టీ ఉండగా.. కొత్త జీఎస్టీ శ్లాబ్లో ఇది 18 శాతానికి తగ్గింది. ఏకంగా 10 శాతం మేర జీఎస్టీ తగ్గుతుంది. దీంతో మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు, బైక్పై రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య తగ్గింపు ఉండనుంది. దీంతో వాహన కొనుగోలుదారులు కొనుగోళ్లను మరో రెండు వారాల పాటు వాయిదా వేసుకుంటున్నారు. వాహన షోరూమ్లో గిరాకీ తగ్గడంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు షోరూమ్ నిర్వాహకులు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ముందస్తుగా బుకింగ్ చేసుకుని 22వ తేదీ తర్వాతే డెలివరీ చేసుకోవచ్చని భావిస్తున్నారు.ఏసీ, వాషింగ్ మెషీన్, టీవీలు సైతం.. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, డిష్వాషర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై కూడా కేంద్రం జీఎస్టీ శ్లాబ్ను తగ్గించింది. ఇప్పటివరకు వీటిపై 28 శాతం పన్ను విధించగా, ఇప్పుడవి 18 శాతం జీఎస్టీ శ్లాబ్లోకి వెళ్లాయి. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగానే తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీవీలపై రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు, మొబైల్ ఫోన్లపై రూ.2 వేల నుంచి రూ.5 వేలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉండటంతో కొనుగోళ్ల వాయిదాకే జనం మొగ్గు చూపుతున్నారు.ఈ– కామర్స్ ఆఫర్లూ అప్పుడే..ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ సంస్థలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ–కామర్స్ కొనుగోలుదారులు సైతం ఈ నెల 22 డెడ్లైన్ విధానానికే జై కొడుతుండటంతో.. కొన్ని సంస్థలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్లను సైతం నిలిపివేశాయి. దీంతో సాధారణంగా డైలీ, వీక్లీ ఆఫర్ల పేరుతో ఆన్లైన్ కస్టమర్లను ఆకర్షించే ఈ–కామర్స్ సంస్థలు.. తమ మెగా ఆఫర్లను ఈ నెల 22 తర్వాతే ప్రకటించాలని వ్యూహరచన చేస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత ‘బిగ్ బిలియన్ డేస్’, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ వంటి పేర్లతో భారీ సేల్ నిర్వహించడానికి సిద్ధమవుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలిసన్ -
ఈ దేశంలో శాశ్వతంగా ఉండిపోవచ్చు..
విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే చాలా దేశాలు విదేశీయులకు తమ దేశంలో శాశ్వతంగా ఉండిపోయేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. జర్మనీ ప్రభుత్వం ఇప్పుడు రూ.11,500 లోపు ఫీజుతో శాశ్వత నివాస అనుమతిని (Settlement Permit) అందిస్తోంది. ఇది జర్మనీలో శాశ్వతంగా నివసించేందుకు అత్యంత భద్రమైన మార్గం. ఈ అనుమతితో మీరు కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా జీవించవచ్చు, ఉద్యోగం చేయవచ్చు లేదా స్వయం ఉపాధి ద్వారా పని చేయవచ్చు.జర్మనీలో స్కిల్డ్ వర్కర్ అంటే..రెసిడెన్స్ యాక్ట్ ప్రకారం వీరు స్కిల్డ్ వర్కర్ కేటగిరీలోకి వస్తారు..- జర్మన్ లేదా గుర్తింపు పొందిన విదేశీ డిగ్రీ కలిగినవారు- జర్మనీలో సమానమైన వృత్తి శిక్షణ పొందినవారు- ఈయూ బ్లూ కార్డ్ కలిగినవారు- ఈయూ డెరెక్టివ్ 2016/801 ప్రకారం అంతర్జాతీయ పరిశోధకులుప్రధాన అర్హతలు- సెక్షన్లు 18ఎ, 18బి, 18డి, 18జి ప్రకారం 3 సంవత్సరాలుగా చెల్లుబాటు అయ్యే నివాస అనుమతి కలిగి ఉండాలి- జీవనాధారం కోసం ప్రభుత్వ సహాయంపై ఆధారపడకుండా ఉండాలి- కనీసం 36 నెలలు పింఛను బీమా (statutory pension)లో చెల్లింపులు చేయాలి- జర్మన్ బి1 సీఈఎఫ్ఆర్ స్థాయిలో భాషా నైపుణ్యం ఉండాలి- “లివింగ్ ఇన్ జర్మనీ” పరీక్ష ద్వారా జర్మన్ సమాజం, చట్టాలపై ప్రాథమిక అవగాహన చూపించాలి- కుటుంబానికి సరిపడిన నివాస స్థలం ఉండాలిత్వరిత ప్రక్రియలుఈ కింది కొన్ని సందర్భాల్లో వేగంగా శాశ్వత అనుమతి పొందవచ్చు..- ఈయూ బ్లూ కార్డ్: 27 నెలల ఉద్యోగం తర్వాత, బి1 జర్మన్ భాష ఉంటే 21 నెలలకే అర్హత-జర్మన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు: 2 సంవత్సరాల ఉద్యోగం తర్వాత అర్హత- అత్యంత నైపుణ్యవంతులు: శాస్త్రవేత్తలు, సీనియర్ టీచర్లు మొదలైనవారు వెంటనే అర్హత పొందవచ్చు- స్వయం ఉపాధి: సెక్షన్ 21 ప్రకారం 3 సంవత్సరాల వ్యాపార అనుభవం తర్వాత అర్హతజీవిత భాగస్వాములకు..- స్కిల్డ్ వర్కర్ జీవిత భాగస్వామి సెక్షన్ 18సి ప్రకారం శాశ్వత అనుమతి కలిగి ఉండాలి- 3 సంవత్సరాలుగా నివాస అనుమతి కలిగి ఉండాలి- వారానికి కనీసం 20 గంటలు ఉద్యోగం చేయాలి- బి1 స్థాయి జర్మన్ భాషా నైపుణ్యం ఉండాలిఅప్లికేషన్ ఖర్చుజర్మనీలో శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి అయ్యే ఖర్చు సాధారణంగా 113 యూరోల (రూ .11,666) నుండి 147 యూరోల (రూ .15,176) వరకు ఉంటుంది. స్కిల్డ్ వర్కర్ లేదా హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్ వంటి మీ వర్క్ ప్రొఫైల్ ఆధారంగా ఫీజులు మారుతూ ఉంటాయి. ఇక అనువాదాలు, భాషా పరీక్ష రుసుములు, ఆరోగ్య బీమా ప్రీమియంలు వంటి ఇతర ఖర్చులు అదనం.ఇదీ చదవండి: మా దేశం వచ్చేయండి.. శాశ్వతంగా ఉండిపోండి! -
ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంపు..?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అక్టోబర్ 10-11 తేదీల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు తీపికబురు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మీటింగ్కు సంబంధించిన ఎలాంటి ఎజెండా ఇంకా ఖరారు కాలేదు. కొన్ని సంస్థలు, ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఇందులో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందులోకి అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఏటీఎం ద్వారా విత్డ్రా..ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థకు బ్యాంకు లాంటి కార్యాచరణను తీసుకురావనే ప్రణాళికలున్నాయి. ఇందులో ఏటీఎంల ద్వారా పాక్షిక ఉపసంహరణలను అనుమతించడం, యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వంటివి ఉన్నాయి. 8 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పదవీ విరమణ పొదుపును ఎలా నిర్వహిస్తారనే దానిపై గణనీయమైన మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రతిపాదన డిజిటల్ చెల్లింపులు, ఈజ్-ఆఫ్-యాక్సెస్ ఫీచర్లను ఏకీకృతం చేయాలని నిర్ణయించింది. ఆధునిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఇందులో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ఆమోదం పొందితే చందాదారులకు సర్వీసులు సులభతరం అవుతాయి.ప్రావిడెంట్ ఫండ్లో కొంత భాగాన్ని ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.ఎంపిక చేసిన లావాదేవీల కోసం వారి ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా చెల్లింపులు చేయడానికి యూపీఐను ఉపయోగించవచ్చు.పెన్షన్ పెంపుప్రస్తుతం రూ.1,000గా నిర్దేశించిన కనీస నెలవారీ పెన్షన్ను రూ.1500 నుంచి రూ.2,500 వరకు పెంచే ప్రతిపాదన కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఈమేరకు నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా లారీ ఎల్లిసన్ -
బంగారం స్పీడ్కు బ్రేకులు.. పసిడి ప్రియులకు ఉపశమనం
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త శాంతించి ఎటువంటి పెరుగుదల లేకుండా స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అమెరికా టారిఫ్ల ప్రభావం ఇదిగో ఇంతే..
అమెరికా టారిఫ్ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీపై నికరంగా పడే ప్రభావం 0.2–0.3 శాతం వరకు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. అయితే జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీ డిమాండ్ను పెంచడం ద్వారా ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తాయని అభిప్రాయపడ్డారు.ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అమెరికాకు చేసిన ఎగుమతుల్లో సగం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే నమోదైనట్టు గుర్తు చేశారు.సుంకాలు స్వల్పకాలమే గానీ, దీర్ఘకాలం పాటు కొనసాగకపోవచ్చన్నారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అప్పుడు ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయంటూ.. పెట్టుబడులు, మూలధన వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్పై దీని తాలూకూ అనిశ్చితి ఉంటుందని చెప్పారు.అయితే, జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీయంగా బలమైన వినియోగ సృష్టి ద్వారా టారిఫ్ల తాలూకూ ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలను అధిగమించేందుకు సాయపడతాయన్నారు. కనుక మొత్తం మీద జీడీపీపై పడే ప్రభావం 0.3 శాతం మించి ఉండదన్నారు. 2025–26 సంవత్సరానికి 6.3–6.8% మధ్య జీడీపీ వృద్ధి నమోదు కావొచ్చన్న తమ అంచనాలను గుర్తు చేశారు.సాగులో సంస్కరణలు.. వ్యవసాయ రంగం జీడీపీకి మరో 0.5–0.70 శాతం వరకు తోడ్పాటునివ్వగలదని నాగేశ్వరన్ తెలిపారు. ఇందుకు గాను రైతులు వారు కోరుకున్న చోట విక్రయించే హక్కు అవసరమన్నారు. ప్రకృతి విపత్తులపై సాగు దిగుబడులు ఆధారపడి ఉన్నందున వారికి బీమా రూపంలోనూ దన్నుగా నిలవాలన్నారు. ప్రపంచ వాణిజ్యం విషయంలో అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్ స్థానాన్ని భర్తీ చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని సీఈఏ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు.అటువంటి చర్యలో భారత్ పాలుపంచుకోదని ఓ ప్రశ్నకు సమాధనంగా చెప్పారు. డాలర్కు మెరుగైన ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదంటూ.. ఇందుకు చాలా కాలం పట్టొచ్చన్నారు. గతేడాది జరిగిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యానికి స్థానిక కరెన్సీల్లో చెల్లింపులకు, ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటుకు అంగీకారం కుదరడం గమనార్హం. -
ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలిసన్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ఎలాన్మస్క్. కానీ ఇక నుంచి ఆ స్థానాన్ని ఒరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ భర్తీ చేస్తున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లు ఇటీవల కుదేలవ్వడంతో మస్క్కు కేటాయించిన షేర్ల విలువ భారీగా తగ్గిపోవడం ఇందుకు ఒక కారణం. కుబేరుల జాబితాలో మస్క్ తర్వాతి స్థానంలో ఉన్న ఓరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సంస్థ విలువ పెరగడం కూడా లారీని ప్రపంచంలోని కుబేరుల జాబితాలో ముందుంచింది.ఎలిసన్ నికర విలువ 393 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొన్న మంగళవారం ఒక్కరోజే అతని సంపద 101 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ఒరాకిల్లో ఎల్లిసన్కు 40 శాతం వాటా ఉంది. ఇటీవల కంపెనీ షేర్లు పుంజుకోవడంతో ఆయన సంపద సైతం భారీగా పెరిగింది. ఒరాకిల్ ఇటీవల బ్లాక్ బస్టర్ త్రైమాసిక ఆదాయాలను విడుదల చేయడం కలిసొచ్చింది. దాని ఏఐ ఆధారిత క్లౌడ్ వ్యాపారం దూసుకుపోతుండడంతో ఈమేరకు ఇన్వెస్టర్లు కంపెనీలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారు.ఒరాకిల్ ఇటీవల చేసిన ప్రకటనలు..ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్డ్యాన్స్తో ఒప్పందాలు.2025 ఆర్థిక సంవత్సరంలో 18 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 144 బిలియన్ డాలర్లకు క్లౌడ్ రెవెన్యూ వృద్ధిని అంచనా వేశారు.ఎంటర్ప్రైజ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ద్వారా మెరుగైన మార్జిన్లు ప్రకటన.ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్తో ప్రత్యక్ష పోటీలో ఉంది.పేరునెట్వర్త్ (సెప్టెంబర్ 2025)సంస్థలుఇటీవలి పరిణామాలులారీ ఎలిసన్393 బిలియన్ డాలర్లు41% ఒరాకిల్ఏఐ క్లౌడ్ ఒప్పందాలు, ఓపెన్ఏఐతో డీల్ఎలాన్మస్క్385 బిలియన్ డాలర్లుటెస్లా, స్పేసెఎక్స్ఏడాదిలో కంపెనీల విలువ 13% తగ్గుదల ఇదీ చదవండి: అనిల్ అంబానీపై కేసులు మీద కేసులు.. -
25,000 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 25,001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 113 పాయింట్లు పుంజుకుని 81,528 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అనిల్ అంబానీపై కేసుల మీద కేసులు..
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్తోపాటు మరికొందరు అధికారులపై రూ.2,929 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. గత నెలలో సీబీఐ దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఎఫ్ఐఆర్) ఆధారంగా ఈడీ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు నష్టం కలిగించాయని, దాంతో ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించామని సీబీఐ ఇప్పటికే తెలిపింది.ముంబైలో అనిల్ అంబానీ, ఆర్కామ్కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో ఈ సోదాలు నిర్వహించారు. అప్పుగా తీసుకున్న బ్యాంకు నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో, రుణాలు ఎందులోకి మళ్లించబడ్డాయో నిర్ధారించడానికి ఆధారాలను సేకరించే లక్ష్యంతో ఈ సోదాలు నిర్వహించారు. జూన్ 13న ఆర్కామ్, అంబానీలను ఫ్రాడ్ గుర్తించిన ఎస్బీఐ జూన్ 24న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదిక పంపింది.ఇటీవల అనిల్ అంబానీని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సైతం మోసపూరితం (ఫ్రాడ్)గా వర్గీకరించింది. దాదాపు దశాబ్దం క్రితం ఆర్కామ్ తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలిపిన సమాచారంలో బీవోబీ పేర్కొంది. ఆర్కామ్కు బీవోబీ రూ.1,600 కోట్ల రుణాన్ని, మరో రూ.862.5 కోట్లను లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మంజూరు చేసింది. ఈ మొత్తం రూ.2,462.5 కోట్లలో ఈ ఏడాది ఆగస్ట్ 28 నాటికి రూ.1,656.07 కోట్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలో కంపెనీతో పాటు ప్రమోటర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ బీవోబీ నుంచి సెప్టెంబర్ 2న లేఖ అందినట్లు ఆర్కామ్ వెల్లడించింది. ఈ లేఖ ప్రకారం.. 2017, జూన్ 5 నుంచి బీవోబీ ఈ ఖాతాను మొండిబకాయిగా కొనసాగిస్తోంది.ఇదీ చదవండి: భారత వృద్ధి అంచనాలు అప్!ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో అంబానీని ఈడీ ప్రశ్నించింది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో రూ.3,000 కోట్లు నిధులు మళ్లించినట్లు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బ్యాంకు ప్రమోటర్లు కూడా రుణాలు మంజూరు కావడానికి ముందు చెల్లింపులు పొందినట్లు కనుగొంది. ఇది క్విడ్ ప్రో కోకు దారితీసినట్లు సూచిస్తుంది. -
భారత వృద్ధి అంచనాలు అప్!
ఫిచ్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను పెంచింది. జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందుతుందన్న గత అంచనాను 6.9 శాతం చేసింది. జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి బలమైన పనితీరు నమోదు కావడం, దేశీ వినియోగ ఆధారిత డిమాండ్ పుంజుకోవడాన్ని అంచనాలు పెంచేందుకు కారణాలుగా పేర్కొంది. అమెరికా టారిఫ్లతో భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు లోగడ పలు అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రకటించగా.. అంచనాలను పెంచిన తొలి సంస్థ ఫిచ్ కావడం గమనార్హం.మార్చి, జూన్ త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగాన్ని పుంజుకున్నట్టు ఫిచ్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. జీడీపీ జనవరి–మార్చి త్రైమాసికంలో 7.4 శాతం వృద్ధి చెందగా, జూన్ త్రైమాసికంలో 7.8 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. వాస్తవానికి జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ఫిచ్ ఈ ఏడాది ఏప్రిల్లో తన అంచనాలను ప్రకటించగా, దీనికి మించి బలమైన వృద్ధి రేటు నమోదైంది. దీనికి తోడు జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ మంచి వృద్ధిని నమోదు చేస్తుందంటూ తాజా అంచనాలను ఫిచ్ విడుదల చేసింది.వినియోగమే బలమైన చోదకం.. ‘‘అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు ఇటీవలి నెలల్లో పెరిగాయి. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం అదనపు టారిఫ్లు విధించగా, ఇవి ఆగస్ట్ 27 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో అమెరికాలో భారత ఉత్పత్తులపై టారిఫ్లు 50 శాతానికి పెరిగాయి. చర్చల ద్వారా టారిఫ్ రేట్లు అంతిమంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. వాణిజ్య సంబంధాల విషయంలో నెలకొన్న అనిశ్చితి వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. పెట్టుబడులపై దీని ప్రభావం పడుతుంది. జీఎస్టీలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వినియోగం బలంగా పెరుగుతుంది’’అని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. వృద్ధికి దేశీ వినియోగం కీలక చోదకంగా పనిచేస్తుందని తెలిపింది. సానుకూల ఆర్థిక పరిస్థితులు పెట్టుబడులను ఇతోధికం చేస్తాయని అంచనా వేసింది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో వృద్ధి కొంత నిదానిస్తుందని ఫిచ్ అభిప్రాయపడింది. 2026–27లో 6.3 శాతం.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.3 శాతానికి, తదుపరి ఆర్థిక సంవత్సరంలో (2027–28)లో 6.2 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. సగటు కంటే అధిక వర్షపాతం, అధిక నిల్వలతో ఆహార ధరలు తక్కువ స్థాయిలోనే కొనసాగుతాయని తెలిపింది. దీంతో ద్రవ్యోల్బణం 2025 చివర్లోనే 3.2 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2026 చివరికి 4.1 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. ఆర్బీఐ ఈ ఏడాది చివరికి పావు శాతం రేటు తగ్గిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: రొయ్యల ఎగుమతులకు టారిఫ్ ఎఫెక్ట్.. -
రొయ్యల ఎగుమతులకు టారిఫ్ ఎఫెక్ట్..
రొయ్యల ఎగుమతిదార్లపై అమెరికా టారిఫ్ల ప్రభావం భారీగానే ఉండనుంది. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) పరిశ్రమ ఆదాయం 12 శాతం క్షీణించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఒక నివేదికలో తెలిపింది. భారత ఫ్రోజెన్ రొయ్యలకు అమెరికా కీలక మార్కెట్గా ఉంటోంది. ఎగుమతుల పరిమాణంలో 41 శాతం, విలువపరంగా 48 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. 50 శాతం ప్రతీకార సుంకాల (అదనంగా యాంటీ–డంపింగ్ డ్యూటీ మొదలైనవి కూడా కలిపితే 58 శాతం) వల్ల వాణిజ్యం గణనీయంగా దెబ్బతింటుందని నివేదిక పేర్కొంది. దీనితో ఈక్వెడార్, వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలతో భారత్ పోటీపడలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఫలితంగా ఎగుమతుల పరిమాణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించింది.ప్రధాన రొయ్యల కంపెనీల ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ప్రకారం 2025–26లో ఆదాయాలు 12 శాతం మేర, మార్జిన్లు సుమారు 150 బేసిస్ పాయింట్ల (దాదాపు ఒకటిన్నర శాతం) మేర తగ్గే అవకాశం ఉందని ఇండ్–రా తెలిపింది. నిర్వహణ మూలధనంపరంగా కూడా కొంత ఒత్తిడి నెలకొనవచ్చని వివరించింది. అధిక టారిఫ్లను అమెరికా కొనసాగిస్తే మధ్యకాలికంగా రొయ్యల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం తప్పదని పేర్కొంది. ఎగుమతుల పరిమాణం, మార్జిన్లపై ఒత్తిళ్ల వల్ల ఆర్థికంగా అంత పటిష్టంగా లేని మధ్య స్థాయి సంస్థల రుణపరపతి దెబ్బతినే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇతర దేశాల వైపు చూపు ..భారతీయ రొయ్యల ప్రాసెసింగ్ సంస్థలు దేశీ మార్కెట్తో పాటు అమెరికాయేతర మార్కెట్లలోకి (చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, బ్రిటన్) కూడా మరింతగా విస్తరించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ఇండ్–రా అసోసియేట్ డైరెక్టర్ ఆదర్శ్ గుత్తా తెలిపారు. అయితే, ఈ ప్రాంతాల్లో అంతగా అధిక ధర లభించదని, పైగా పరిమిత స్థాయిలోనే ఎగుమతి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యూహాత్మక డైవర్సిఫికేషన్, ఉత్పత్తులకు మరింత విలువను జోడించడంపై పెట్టుబడులు పెట్టడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంలాంటివి పోటీతత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టుకునేందుకు కీలకంగా ఉంటాయని ఆదర్శ్ చెప్పారు.ఇదీ చదవండి: లంచం కేసు సెటిల్మెంట్ చేసుకున్న సంస్థ -
లంచం కేసు సెటిల్మెంట్ చేసుకున్న సంస్థ
లంచం, ఇతరత్రా అవకతవకల ఆరోపణల కేసును సెటిల్ చేసుకున్నట్లు సౌర విద్యుదుత్పత్తి సంస్థ అజూర్ పవర్ వెల్లడించింది. ఇందుకోసం 2.3 కోట్ల డాలర్లు చెల్లించినట్లు వివరించింది. కొత్త ప్రాజెక్టులను దక్కించుకునేందుకు కీలక డేటాను తప్పుగా చూపించినట్లు, లంచాలు చెల్లించినట్లు అజూర్ పవర్తో పాటు దాని మాజీ ఎగ్జిక్యూటివ్లు రంజిత్ గుప్తా, మురళి సుబ్రమణియన్, పవన్ కుమార్ అగ్రవాల్పై ఆరోపణలు ఉన్నాయి.అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అజూర్ షేర్లు లిస్టయి ఉన్నాయి. నిబంధనలను పాటించే విషయంలో వారు తప్పుదోవ పట్టించే, తప్పుడు ప్రకటనలు చేశారని, ఫలితంగా కృత్రిమంగా పెరిగిపోయిన షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని క్లాస్ యాక్షన్ సూట్ నమోదైంది. దీంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కంపెనీ నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది.ఇదీ చదవండి: రైళ్లకు ‘అద్దె’ చెల్లిస్తున్న భారతీయ రైల్వే! -
రిలయన్స్ ఇంటెలిజెన్స్ షురూ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సేవల కంపెనీకి తెరతీసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. పూర్తి అనుబంధ కంపెనీగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి సర్టీఫికెట్ను పొందినట్లు తెలియజేసింది. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) లో కొత్తగా ఏఐ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా భారీస్థాయి ఏఐ మౌలికసదుపాయాలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్తో కొత్త భాగస్వామ్యాలను సైతం ప్రకటించారు. గిగావాట్ సామర్థ్యంతో రిలయన్స్ ఇంటెలిజెన్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ ఇప్పటికే వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ మద్దతుతో ఏఐ–రెడీ డేటా సెంటర్లతో నెలకొల్పుతున్నట్లు తెలియజేసింది. దశాబ్దంక్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్కు డిజిటల్ సరీ్వసులు గ్రోత్ ఇంజిన్గా నిలవగా.. ఇకపై ఏఐతో మరింత పురోభివృద్ధిని అందుకోనున్నట్లు ఏజీఎంలో ముకేశ్ పేర్కొన్నారు. -
మన వాహన రంగం ప్రపంచంలోనే టాప్!
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు రూ. 22 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. ప్రస్తుతం అమెరికా పరిశ్రమ రూ. 78 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో ఉండగా, రూ. 47 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. ‘భారత వాహన పరిశ్రమను ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టాలనేది మా లక్ష్యం. ఇది కాస్త కష్టమే, అయినప్పటికీ, అసాధ్యం మాత్రం కాదు’ అని గడ్కరీ చెప్పారు. భారత్లో అత్యంత నాణ్యమైన వాహనాలు చౌకగా తయారవుతున్నందున, టాప్ ఆటోమొబైల్ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. ఈ–20కి వ్యతిరేకంగా పెట్రోల్ లాబీలు .. ఈ–20 ఇంధనంపై (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ.. పెట్రోలియం రంగం దీనికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తోందని గడ్కరీ చెప్పారు. ‘ప్రతీచోట లాబీలు ఉంటాయి. ఎవరి ప్రయోజనాలు వారివి. పెట్రోల్ లాబీ చాలా సంపన్నమైనది’ అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయం రంగంలో ఉపయోగించే వాహనాల్లో ఫ్లెక్స్–ఫ్యూయల్ ఇంజిన్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వేగంగా ఎదుగుతున్న ఈవీ మార్కెట్: కుమారస్వామి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లలో ఇప్పుడు భారత్ కూడా ఒకటని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. 2024–25లో దేశీయంగా 10 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని ఆయన వివరించారు. వీటిలో ఈ–టూవీలర్ల వాటా 1 శాతంగా, త్రీ–వీలర్ల వాటా 57 శాతంగా ఉందని చెప్పారు. ఆటో రిటైల్ సదస్సుకు పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పెంచాలి.. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్ రూ. 22 లక్షల కోట్లు వెచి్చస్తోందని, ఇటువంటి ఇంధనాల వల్ల కాలుష్య సమస్య వస్తోందని గడ్కరీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ కంపెనీలు చౌకగా పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులు తయారు చేస్తున్నాయని వివరించారు. అయితే, దేశీయంగా ఏటా 1,00,000 మేర ఎలక్ట్రిక్ బస్సుల అవసరం ఉంటే తయారీ సామర్థ్యం మాత్రం 50,000–60,000 మాత్రమే ఉందని ఆయన తెలిపారు. ఎగుమతులకు కూడా భారీగా అవకాశాలు ఉన్నందున ఎలక్ట్రిక్ బస్సుల తయారీని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల ధర కూడా తగ్గుతోందని, కొన్నాళ్లకు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. పెట్రోల్, డీజిల్ వాహనాల రేట్లకు సమానం అవుతాయని మంత్రి చెప్పారు. -
భారత్లో 19 నుంచి ఐఫోన్ 17 సేల్..!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 17 స్మార్ట్ఫోన్ల శ్రేణి విక్రయాలు సెప్టెంబర్ 19 నుంచి భారత మార్కెట్లో ప్రారంభం కానున్నాయి. వీటి ధరల శ్రేణి రూ. 82,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంటుంది. ఎయిర్ పేరిట యాపిల్ అత్యంత పల్చని ఐఫోన్ను కూడా ప్రవేశపెట్టింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఈ–సిమ్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కొత్త ఐఫోన్ మోడల్స్లో 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ను కంపెనీ నిలిపివేసింది. దీంతో ఐఫోన్ 16 సిరీస్తో పోలిస్తే బేస్ మోడల్స్ ధర పెరిగింది. భారత్ సహా 63 దేశాల్లోని కస్టమర్లు సెప్టెంబర్ 12 నుంచి ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ని ప్రీ–ఆర్డర్ చేయొచ్చని యాపిల్ తెలిపింది. ఐఫోన్ 17 ఫోన్లు 256 జీబీ, 512 జీబీ స్టోరేజీతో లభిస్తాయి. ఎయిర్ సిరీస్ 256 జీబీ నుంచి 1 టీబీ స్టోరేజీతో లభిస్తుంది. ఏ19 చిప్సెట్ వల్ల ఐఫోన్ 16తో పోలిస్తే కొత్త ఐఫోన్ 20% అధికం, ఐఫోన్ 13తో పోలిస్తే రెట్టింపు వేగంతో పని చేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి ‘ప్లస్’ మోడల్స్ ఏవీ లేవు. ప్రో మ్యాక్స్లో తొలిసారిగా 2టీబీ ఆప్షన్ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, శాటిలైట్ కమ్యూనికేషన్స్కి కూడా ఉపయోగపడేలా వాచ్ 3 అల్ట్రాను కూడా యాపిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ. 89,900గా ఉంటుంది. ప్రీ–ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. -
2030 నాటికి 15.7 ట్రిలియన్ డాలర్లు.. ప్రపంచ జీడీపీకి ఏఐ శక్తి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (AI) 21వ శతాబ్దాన్ని నిర్వచించే సాంకేతికతగా ఎదుగుతోంది. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో సుమారు 15.7 ట్రిలియన్ డాలర్లను ఏఐ జోడించనుందని ఫీక్కీ-బీసీజీ విడుదల చేసిన "ది గ్లోబల్ ఏఐ రేస్" నివేదిక వెల్లడించింది.ఏఐ స్వీకరణలో అభివృద్ధి చెందిన దేశాలు ముందంజలో ఉన్నాయి. 66% దేశాలు జాతీయ ఏఐ వ్యూహాలను రూపొందించగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 30 శాతంగా ఉంది. ఇక తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కేవలం 12% మాత్రమే. ఈ అసమానత విదేశీ దిగుమతులపై ఆధారపడే ప్రమాదాన్ని పెంచుతోంది.ఏఐ స్వీకరణ రేస్లో కంప్యూట్, డేటా, మోడల్స్, టాలెంట్ అనే నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐ నిపుణులలో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. వ్యవసాయం, ప్రజా సేవలు వంటి రంగాలు ఏఐ స్వీకరణలో ఇంకా వెనుకబడ్డాయి.వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా 20% ఉత్పత్తి వృద్ధి సాధ్యమవుతుంది. అయితే, సంస్థలు పెట్టుబడులు పెట్టినా ఏఐ పైలట్లు క్షేత్రస్థాయికి వెళ్లకముందే సగం విఫలమవుతున్నాయి. రైజ్ (రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్, స్కిల్లింగ్, ఎథిక్స్) ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రభుత్వాలు ఏఐ స్వీకరణ పెంపుపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ సహకారం, మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి, నైతిక పాలన అవసరం."ఏఐ కేవలం సాంకేతిక తరంగం మాత్రమే కాదు.ఇది రాబోయే దశాబ్దాలలో ఆర్థిక, సామాజిక నాయకత్వాన్ని నిర్వచించే వ్యూహాత్మక పోటీ. ఏఐ అనేది ప్రయోజనం కోసం జరిగే పోటీ మాత్రమే కాదు. ప్రపంచానికి విలువను పెంచే పురోగతికి సమిష్టి అన్వేషణ" అని ఫీక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్ పేర్కొన్నారు.