Business
-
ఆరు నెలల గరిష్టానికి నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగం ఏప్రిల్లో స్వల్పంగా పెరిగింది. మార్చిలో ఉన్న 5.1 శాతం నుంచి 5.2 శాతానికి చేరింది. 2025 ఏప్రిల్లోనూ 5.1 శాతంగానే ఉండడం గమనార్హం. 15 ఏళ్ల వయసుకు మించి పనిచేసే జనాభాకు సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర ప్రణాళిక, కార్యక్రమాల అమలు శాఖ శుక్రవారం విడుదల చేసింది. చివరిగా 2025 అక్టోబర్లోనూ 5.2 శాతం స్థాయిలో నిరుద్యోగం నమోదైంది. ⇒ పట్టణాల్లో నిరుద్యోగం కాస్తంత దిగొచ్చింది. మార్చిలో ఉన్న 6.8 శాతం నుంచి ఏప్రిల్లో 6.6 శాతానికి తగ్గింది. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ⇒ 2025 ఏప్రిల్తో పోల్చితే మాత్రం గ్రామీణ, పట్టణ నిరుద్యోగంలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ⇒ పట్టణ పురుషుల్లో నిరుద్యోగం మార్చిలో 5 శాతంగా ఉంటే, ఏప్రిల్లో 5.1 శాతానికి చేరింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది. ⇒ దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు 5.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. గ్రామీణ మహిళల్లో 4.4 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గగా.. పట్టణ మహిళల్లోనూ 9 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గుముఖం పట్టింది. ⇒ కార్మికుల భాగస్వామ్య రేటు ఏప్రిల్లో 55 శాతానికి పరిమితం అయింది. మార్చిలో ఇది 55.4 శాతంగా ఉంది. -
ఇక యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ భవిష్య నిధిని (పీఎఫ్) వేగంగా ఉపసహరించుకునేందుకు వీలుగా యూపీఐ పేమెంట్ గేట్వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని పరీక్షించడం పూర్తయిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మెరుగైన సేవల దిశగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈపీఎఫ్వో సభ్యులు యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా ఉపసంహరించుకునే మొత్తం, వారి బ్యాంక్ ఖాతాలకు వెంటనే జమ అవుతుందని చెప్పారు. ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేసిన యూపీఐ పిన్ను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. నిబంధనల మేరకు భవిష్యనిధిలో కొంత మేర బ్యాలన్స్ను తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుంది.అది పోను మిగిలిన మొత్తాన్ని యూపీఐ సాయంతో వేగంగా ఉపసంహరించుకునే దిశగా ఈపీఎఫ్వో అడుగులు వేస్తున్నట్టు మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. నూతన సదుపాయంతో ఏడు కోట్ల మంది ఈపీఎఫ్వో సభ్యులకు నిధుల ఉపసంహరణ సులభతరం కానుంది. ప్రస్తుత విధానంలో సభ్యులు ఉపసంహరణ కోసం క్లెయిమ్ దాఖలు చేసి, నిర్ణీత సమయం పాటు నిరీక్షించాల్సి వస్తోంది.ఆటో–సెటిల్మెంట్ విధానంలో మానవ ప్రమేయం లేకుండా ఎలక్ట్రానిక్ రూపంలో క్లెయిమ్ల పరిష్కారానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈపీఎఫ్వో వాట్సాప్ సేవలను నెలలో ప్రారంభించనున్నట్టు మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సభ్యులు ఈపీఎఫ్వో వాట్సాప్ నంబర్కు హాయ్ అని టైప్ చేసి పంపించడం ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉంది? చివరి ఐదు లావాదేవీలు తదితర సమాచారాన్ని పొందొచ్చని చెప్పారు. పెండింగ్ కేసులకు పరిష్కారం నిధి ఆప్కే నికత్ కార్యక్రమం ద్వారా కన్జ్యూమర్ కోర్టుల్లో అపరిష్కృతంగా ఉండిపోయిన కేసులను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మాండవీయ తెలిపారు. దీంతో 2025 ఏప్రిల్ 1 నాటికి 31,036 కేసులు ఉండగా, 2026 ఏప్రిల్ 1 నాటికి 27,639కు తగ్గినట్టు చెప్పారు. -
క్రెడిట్ కార్డుల హవా
ముంబై: దేశంలో ఒకవైపు క్రెడిట్ కార్డు లావాదేవీలు దేశంలో శరవేగంగా పెరుగుతుంటే.. మరోవైపు డెబిట్ కార్డు లావాదేవీలు అదే స్థాయిలో తగ్గిపోతున్నాయి. 2021లో 216 కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డ్ లావాదేవీలు 2025 నాటికి 570 కోట్లకు పెరిగాయి. సుమారు 2.6 రెట్లు వృద్ధి నమోదైంది. 2021లో రూ. 8.9 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ 2025 నాటికి రూ. 23.2 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఐదేళ్ల కాలంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో 27 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదైంది. నివేదికలోని అంశాలు.. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల సంఖ్య 2021లో 408.7 కోట్లుగా ఉంటే, 2025 నాటికి 133.6 కోట్లకు పడిపోయాయి. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 7.4 లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు తగ్గింది. ముంబై: దేశంలో ఒకవైపు క్రెడిట్ కార్డు లావాదేవీలు దేశంలో శరవేగంగా పెరుగుతుంటే.. మరోవైపు డెబిట్ కార్డు లావాదేవీలు అదే స్థాయిలో తగ్గిపోతున్నాయి. 2021లో 216 కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డ్ లావాదేవీలు 2025 నాటికి 570 కోట్లకు పెరిగాయి. సుమారు 2.6 రెట్లు వృద్ధి నమోదైంది. 2021లో రూ. 8.9 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ 2025 నాటికి రూ. 23.2 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఐదేళ్ల కాలంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో 27 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదైంది. నివేదికలోని అంశాలు.. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల సంఖ్య 2021లో 408.7 కోట్లుగా ఉంటే, 2025 నాటికి 133.6 కోట్లకు పడిపోయాయి. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 7.4 లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. ⇒ ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. ⇒ ఇక క్రెడిట్కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. ⇒ విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. ⇒ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిసెంబర్ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి.డిజిటల్ చెల్లింపుల విస్తరణ ⇒ 2016తో పోలిస్తే 2025 నాటికి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సంఖ్య 33 రెట్లు పెరగ్గా, వాటి విలువ దాదాపు మూడు రెట్లు అధికమైంది. ⇒ ముఖ్యంగా గత ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు సంఖ్యా పరంగా నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. ⇒ 2025 జూన్లో 6,782 లక్షలుగా ఉన్న క్యూఆర్ కోడ్లు, డిసెంబర్ 2025 నాటికి 7,313 లక్షలకు పెరిగాయి. ⇒ డిజిటల్ చెల్లింపులను స్వీకరించే ఛానళ్లను పరిశీలిస్తే.. గతేడాది జూన్–డిసెంబర్ మధ్య యూపీఐ క్యూఆర్ కోడ్లు, క్రెడిట్ కార్డులు, వ్యాలెట్లలో ఎక్కువ వృద్ధి కనిపించగా, పీవోఎస్ టెరి్మనళన్లు, ఏటీఎంలు, మైక్రో ఏటీఎంల వినియోగం తగ్గింది.⇒ యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. ⇒ ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. ⇒ ఇక క్రెడిట్కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. ⇒ విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. ⇒ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిసెంబర్ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి.డిజిటల్ చెల్లింపుల విస్తరణ ⇒ 2016తో పోలిస్తే 2025 నాటికి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సంఖ్య 33 రెట్లు పెరగ్గా, వాటి విలువ దాదాపు మూడు రెట్లు అధికమైంది. ⇒ ముఖ్యంగా గత ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు సంఖ్యా పరంగా నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. ⇒ 2025 జూన్లో 6,782 లక్షలుగా ఉన్న క్యూఆర్ కోడ్లు, డిసెంబర్ 2025 నాటికి 7,313 లక్షలకు పెరిగాయి. ⇒ డిజిటల్ చెల్లింపులను స్వీకరించే ఛానళ్లను పరిశీలిస్తే.. గతేడాది జూన్–డిసెంబర్ మధ్య యూపీఐ క్యూఆర్ కోడ్లు, క్రెడిట్ కార్డులు, వ్యాలెట్లలో ఎక్కువ వృద్ధి కనిపించగా, పీవోఎస్ టెరి్మనళన్లు, ఏటీఎంలు, మైక్రో ఏటీఎంల వినియోగం తగ్గింది. -
భారత్లో రూ. 5,700 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫుడ్, బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో 2030 నాటికి భారత్లో రూ. 5,700 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయ నుంది. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయా రీ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ మొత్తా న్ని వెచ్చించనున్నట్లు సంస్థ ఇండియా, సౌత్ ఏషి యా సీఈవో జాగృత్ కొటేచా తెలిపారు. మధ్యప్రదేశ్లోని కాన్సెంట్రేట్స్ ప్లాంటులో, అస్సాం..తమిళనాడులోని స్నాక్స్ ప్లాంట్లపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఇటీవలే స్థలాన్ని కూడా సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆదాయాలు, వినియోగం స్థిరంగా పెరుగుతున్న భారత్ తమకు టాప్ 13 మార్కెట్లలో ఒకటని ఆయ న చెప్పారు.గతేడాది (2025)లో రూ. 9,789 కోట్ల ఆదాయంపై రూ. 905 కోట్ల లాభం ఆర్జించినట్లు జాగృత్ తెలిపారు. వరుసగా రెండో ఏడాది కూడా పటిష్టంగా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందినట్లు వివరించారు. ఫుడ్ సెగ్మెంట్లో 11 శాతం వృద్ధి సాధించినట్లు పెప్సీకో ఇండియా, సౌత్ ఏషియా సీఎఫ్వో సవిత బాలచంద్రన్ తెలిపారు. వాతావరణం కారణంగా శీతల పానీయాల విభాగానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, పోటీ కూడా పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ రెండు విభాగాలు మెరుగ్గా రాణించినట్లు పేర్కొన్నారు. -
రూపాయి మరో కొత్త కనిష్టం..
ముంబై: భగ్గుమంటున్న క్రూడాయిల్ రేట్లు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, డాలరు బలపడుతుండటం లాంటి ప్రతికూల పరిణామాలతో రూపాయి మారకం విలువ వేగంగా కరిగిపోతోంది. మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 50 పైసలు క్షీణించి సరికొత్త ఆల్టైమ్ కనిష్టం 96.70కి పతనమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 96.20తో పోలిస్తే మరింత తక్కువగా 96.38 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ .. ఇంట్రాడేలో 96.27కి పెరిగింది. కానీ అది నిలబెట్టుకోలేక చివరికి 50 పైసలు క్షీణతతో ముగిసింది. దీనితో గత ఎనిమిది సెషన్లలో 2.64 శాతం (రూ. 2.48) మేర పతనమైనట్లయింది. తద్వారా ఆసియాలోనే అత్యధికంగా పతనమైన కరెన్సీగా నిల్చింది. డాలరు బలపడటం, అమెరికా ట్రెజరీ ఈల్డ్లు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంలాంటి అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మిరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అయితే, పసిడి, వెండిపై దిగుమతులపై ఆంక్షలు, ఆర్బీఐ జోక్యంతో కనిష్ట స్థాయిల్లో రూపాయికి కొంత మద్దతు లభించవచ్చని పేర్కొన్నారు. స్పాట్ మార్కెట్లో 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు. -
వృద్ధికి చమురు సెగ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఘర్షణ లు, హార్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పెరిగిపోవడం దేశ వృద్ధికి ప్రతికూలంగా మారుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. భారత్ జీడీపీ అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థలు దిగు వకు సవరించాయి. 2026–27లో జీడీ పీ వృద్ధి 6.2 శాతానికి పరిమితం కావొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా తాజాగా ప్రకటించింది. గత అంచనా 6.5% కంటే తక్కువ కావడం గమనార్హం. మరోవైపు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) సైతం గత అంచనా 6.9 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపింది. డిమాండ్, సరఫరా నిదానించడాన్ని ఇండ్–రా ప్రస్తావించింది. ఇండ్–రా అంచనాలు.. ⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా, ద్రవ్యోల్బణం 4.4% స్థాయిలో ఉండొచ్చు. ఆర్బీఐ వృద్ధి అంచనాలు జీడీపీ 6.9%, ద్రవ్యోల్బణం 4.6 శాతంకు దగ్గరగా ఈ అంచనాలున్నాయి. ⇒ అధిక ముడి చమురు ధరలు, ఆహార ధరలకు తోడు, 2026 మధ్య నుంచి వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం కారణంగా జీడీపీ వృద్ధి రేటు 2026–27లో 6.7 శాతానికి పరిమితం అవుతుంది. ⇒ ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధం, అ ధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలువ క్షీణ త, అంచనాల కంటే కేంద్రం నుంచి త క్కువ మూలధన వ్యయాలు (ద్రవ్యలోటు తగ్గించుకునేందుకు), అంతర్జాతీయంగా బ లహీన వాణిజ్య వృద్ధి, 2025–26లో అధిక వృద్ధి రేటు బేస్గా ఉండడం, పారిశ్రామికోత్పత్తి తగ్గడం, ఎల్నినో ప్రభావాలను వృద్ధికి అవరోధాలుగా ఇండ్–రా పేర్కొంది. ⇒ 2026–27లో క్రూడ్ ధర సగటున బ్యారెల్కు 95 డాలర్ల స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వం, ఆయిల్ మార్కె టింగ్ సంస్థలు (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్), వినియోగదారులు ఈ భారాన్ని పంచుకోవాల్సి వస్తుంది. వినియోగదారులపై తక్కువే భారం వేయొచ్చు. ⇒ ముడి చమురు ధర బ్యారెల్కు ప్రతి 10 డాలర్ల పెరుగుదలతో జీడీపీ వృద్ధి రేటు 0.44% తగ్గిపోతుంది. మూలధన వ్యయాలను 10% తగ్గించినా సరే జీడీపీ వృద్ధి రేటు 6 శాతానికి పడిపోవచ్చు. ⇒ రుణ లభ్యతను సులభతరం చేయడం, క్రెడిట్ గ్యారంటీ తదితర చర్యలను ప్రభుత్వం పరిశ్రమల కోసం ప్రకటించొచ్చు. ⇒ 2026–27లో జూన్ క్వార్టర్లో (క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 6.7% మేర ఉంటుంది. ఎల్నినో ప్రభా వం ప్రధానంగా సెపె్టంబర్ త్రైమాసికంపై కనిపించొచ్చు. ⇒ డాలర్తో రూపాయి మారకం విలువ సగటున 94.28 స్థాయిలో ఉంటుంది. ఇక్రా అంచనాలు.. ⇒ గత ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని ఇక్రా అంచనా. జాతీయ గణాంక కార్యాలయం రెండో ముందస్తు అంచనా 7.6 శాతంగా ఉండడం గమనార్హం. ⇒ ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం (2025–26) క్యూ4 (2026 జనవరి– మార్చి) జీడీపీ వృద్ధి మూడు త్రైమా సికాల కనిష్ట స్థాయిలో 7 శాతంగా ఉండొచ్చు. 2025–26 క్యూ3లో వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. ⇒ తయారీ వృద్ధి నిదానించడం, ఎగుమతులు తగ్గడం, పశ్చిమాసియా ఘర్షణలతో కంపెనీల మార్జిన్లపై ఒత్తిళ్లు 2025 క్యూ4లో పారిశ్రామిక స్థూల విలువ జోడింపు (జీవీఏ)తోపాటు, వృద్ధి పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. ⇒ 2026–27 సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారెల్కు 95 డాలర్ల సగటు స్థాయిలో ఉండొచ్చు. గత అంచనా బ్యారెల్ 85 కంటే ఎక్కువ. -
వడ్డింపే తరువాయి!
సాక్షి, బిజినెస్ డెస్క్: అసలే నిత్యావసరాల ధరల మంట.. ఆపై పెట్రో పోటుతో అల్లాడుతున్న ప్రజలకు మరో గండం పొంచి ఉన్నట్టే కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం... ఆఖరికి బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారినీ వదిలేట్లు లేదు. కొండెక్కిన క్రూడాయిల్ సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటం... రూపాయి అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో త్వరలోనే రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వడ్డీ రేట్లు పెంచొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇదే జరిగితే గృహ, వాహన, పర్సనల్, కార్పొరేట్ లోన్లు భారమవుతాయి. దీంతో నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) ఎగబాకుతాయి. మరోపక్క, వడ్డీ రేట్ల పెంపుతో వినియోగం తగ్గి.. ఎకానమీ వృద్ధి మరింత మందగించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు! మోదీ పొదుపు వార్నింగ్ తర్వాత అటు బంగారం, వెండిపై సుంకాల మోత, దిగుమతి ఆంక్షలు... పెట్రో వాతతో షాకిచ్చిన సర్కారుకు ఇక ఆర్బీఐ కూడా జతయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 5న తీసుకోబోయే సెంట్రల్ బ్యాంక్ పాలసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ముడిచమురు బ్యారెల్ 100 డాలర్ల పైకి దూసుకెళ్లి, గత రెండున్నర నెలలుగా దాదాపు అదే స్థాయిలో కదలాడుతోంది. మన బంగారం, క్రూడ్ అవసరాల్లో 85 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో దిగుమతుల బిల్లు భారమై రూపాయి మరింత బక్కచిక్కింది. ప్రస్తుతం సరికొత్త ఆల్టైమ్ కనిష్టం 96.60కి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనంతో డాలర్లు ఎగిరిపోతున్నాయి. ఈ విపత్కర పరిణామాలతో మన ఫారెక్స్ నిల్వలు కరిగిపోతున్నాయి. మరోపక్క, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో (వారంలోపే దాదాపు రూ.4 చొప్పున రెండు సార్లు) ద్రవ్యోల్బణం ఎగబాకుతోంది. దీంతో ఆర్బీఐ మళ్లీ వడ్డీరేట్లు పెంచవచ్చని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత బాండ్ మార్కెట్ ట్రెండ్.. రేట్ల పెంపు సిగ్నల్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. బాండ్ రాబడులు (ఈల్డ్స్) గత రెండు నెలల్లో ఎగబాకడం (10 ఏళ్ల ప్రామాణిక ట్రెజరీ బాండ్ ఈల్డ్ 6.25 శాతం నుంచి 7.06 శాతానికి జంప్ చేసింది) చూస్తుంటే.. చమురు ధరల సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకి, రూపాయి మరింత బలహీన పడుతుందన్న ఆందోళనలకు అద్దంపడుతోందని విశ్లేషిస్తున్నారు. గతేడాది 1.25 శాతం తగ్గింపు... ధరలు అదుపులో ఉండటంతో... జీడీపీ వృద్ధికి ఊతమిచ్చేందుకు 2025 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్బీఐ నాలుగు విడతల్లో రెపో రేటును 1.25 శాతం తగ్గించింది. దీంతో ఈ కీలక పాలసీ రేటు 6.5 శాతం గరిష్ట స్థాయి నుంచి 5.25 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా దీన్ని రుణగ్రహీతలకు బదలాయించడంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు దిగొచ్చాయి. కానీ పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్ రేట్లు భగ్గుమనడం, రూపాయి భారీ పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలతో ఆర్బీఐ అప్పటి నుంచీ పాలసీ రేట్లను యథాథంగానే కొనసాగిస్తోంది. అవసరమైతే రేట్లను తగ్గించేలా తటస్థ (న్యూట్రల్) విధానాన్ని కూడా మార్చలేదు. తీరా చూస్తే, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. కాగా, చివరిసారిగా ఆర్బీఐ రెపో రేటును 2023 ఫిబ్రవరిలో పావు శాతం పెంచింది. ఈ ఏడాది పెంపు.. రెండు విడతలు రూపాయి పతనం, ధరల పెరుగుదలకు అడ్డకట్ట పడాలంటే తదుపరి పాలసీ భేటీలో వడ్డీ రేట్ల పెంపు ‘దాదాపు అనివార్యం’గా కనిపిస్తోందని బ్రోకరేజి దిగ్గజం ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తాజా నివేదికలో పేర్కొంది. ఒకవేళ క్రూడ్ రేటు 100 డాలర్ల పైనే కొనసాగితే (ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది) పాలసీ భేటీతో సంబంధం లేకుండా సడన్గా వడ్డీ రేట్ల షాక్కు కూడా అవకాశం ఉందంటోంది. అయితే, ప్రస్తుతానికి ఆర్బీఐ అప్రమత్త ధోరణితోనే వ్యవహరించవచ్చని, రానున్న పాలసీలో సమీక్షలో తక్షణం వడ్డీ రేట్ల పెంపు వంటి కఠిన చర్యలకు దిగే అవకాశం లేదని చాయిస్ వెల్త్ సీఈవో నికుంజ్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. రానున్న రెండు మూడు నెలల్లో ద్రవ్యోల్బణం గణాంకాలు, స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు. ఇందన సెగకు తోడు ఎల్నినో (వర్షాభావం) రిసు్కల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత ఎగబాకడంతో పాటు ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని హెచ్ఎస్బీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను మరీ తీవ్రంగా పెంచకపోవచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్ధంలో రెండు విడతల్లో అర శాతం రెపో రేటు పెంపునకు ఆస్కారం ఉందని పేర్కొంది. ధరాఘాతం.. ఎల్నినో ఆజ్యం! వాణిజ్య గ్యాస్ రేట్ల భారీ పెరుగుదలతో ఇప్పటికే ఆహార ధరలకు రెక్కలొచ్చాయి. మరోపక్క, అధిక క్రూడ్ ధరల కారణంగా ముడి వస్తువులు భారంగా మారడంతో ఎఫ్ఎంసీజీ, వాహన, వినియోగ వస్తువులు, ఎల్రక్టానిక్స్ సహా పలు కంపెనీలు రేట్ల పెంపునకు తెరతీశాయి. ఇక తాజాగా పెట్రో పోటు.. ఇంధన ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోస్తోంది. అన్ని రంగాల్లో రవాణా, ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, టోకు ధరల ద్రవ్యోల్బణం భగ్గుమంది. మార్చిలో 3.88 శాతం నుంచి ఏప్రిల్లో ఏకంగా 48 నెలల గరిష్ట స్థాయికి (8.3 శాతం) దూసుకెళ్లింది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే, రాబోయే వారాల్లో విడతల వారీగా మరో రూ.10 పెంపు తప్పకపోవచ్చని అంచనా వేసింది. దీనివల్ల జూన్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.4 శాతానికి ఎగబాకే రిస్కు ఉందని తెలిపింది. ఇదే జరిగితే ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం (2% అటుఇటుగా) పరిమితిని దాటేసే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే, పులిమీద పుట్రలా ఈ ఏడాది సూపర్ ఎల్నినో ఆందోళనలు వణికిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వర్షాలు గనుక సరిగ్గా కురవకపోతే ఆహార ధరలు మరింత భగ్గుమంటాయని హెచ్ఎస్బీసీ హెచ్చరించింది. గృహ రుణంపై ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే... గడిచిన ఏడాది కాలంలో గృహ రుణాలపై వడ్డీ రేటు 9.5% గరిష్ట స్థాయి నుంచి 7.5% వరకు దిగొచ్చింది. ఆర్బీఐ గనుక త్వరలో పావు శాతం రెపో రేటును పెంచి, దీన్ని బ్యాంకులు నేరుగా కస్టమర్లకు వర్తింపజేస్తే... హోమ్లోన్ వడ్డీ రేటు కూడా ఎగబాకుతుంది. వడ్డీ రేట్ల పెంపునకు ముందు ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి 7.75% వడ్డీ రేటుతో రూ.50 లక్షల రుణం తీసుకుంటే, ఈఎంఐ రూ. 41,047 పడుతుంది. పావు శాతం వడ్డీ రేట్ల పెంపు తర్వాత ఇది రూ.41,822కు పెరుగుతుంది. అంటే, ఒక్కో ఈఎంఐపై రూ.775 అదనంగా చెల్లించాల్సి వస్తుందన్న మాట! ఒకవేళ ఈఎంఐ పెరగకుండా అలాగే కొనసాగిస్తే, రుణ వ్యవధి మరో 8–10 నెలలు పెరుగుతుంది. ఆమేరకు అధిక వడ్డీ కట్టాల్సి ఉంటుంది. -
నేను అడ్వైజర్ కాదు.. పెట్టుబడులు మీ ఇష్టం
పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు.. ఆర్థికపరమైన సమాచారం వెల్లడించే రాబర్ట్ కియోసాకి తొలిసారి ఘాటుగా స్పదించారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని, ఇతరులకు పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఆర్ధిక సలహాదారుని కారు.. అయితే నా పేరును ఉపయోగించి, కొందరు వ్యక్తులు.. నేను చెప్పినట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయాలను చెబుతున్నారు. వారికి నా లాయర్ ద్వారా నోటీసులు పంపించాను. నా పేరు వాడి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాను.I AM NOT A FINANCIAl ADVISORMy attorney has sent a “Cease and Decist” notice to someone or group who is using my name to state investments I recommend.Please be aware I will always share with you what I am investing in and why.I do not recommend anyone invest in what I am…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 19, 2026నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో మాత్రమే చెబుతాను. నేను ఎవరిని ఇక్కడే పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదని కియోసాకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను బంగారం, వెండి, బిట్కాయిన్, ఏథీరియం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాను అని చెప్పారు. నాకు 401(k), లేదా IRA వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు లేవని.. స్టాక్స్ లేదా బాండ్స్లో కూడా పెట్టుబడి పెట్టడం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహానేను ఏం చేస్తున్నానో చెబుతాను. కానీ ఇతరులు వాటిని తప్పకుండా అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక నిర్ణయాలను తన ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తీసుకోవడం మంచిది. కియోసాకి మాటలను బట్టి చూస్తే.. ఎవరుపడితే వారు చెప్పినమాటలు విని పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
Vodafone Idea: రూ.లక్ష కోట్లు సమీకరణపై ఆశలు
వచ్చే మూడేళ్లలో అవసరమయ్యే రూ. 1 లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు కొత్త రుణాలు, ట్యాక్స్ రిఫండ్లు, ప్రమోటర్ల నుంచి మరిన్ని పెట్టుబడులపై టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) భారీగా ఆశలు పెట్టుకుంది. మార్కెట్లో నిలబడే దిశగా నెట్వర్క్ని మెరుగుపర్చుకునేందుకు కంపెనీ దాదాపు రూ. 45,000 కోట్లు వెచ్చించనుంది. అలాగే, వచ్చే మూడేళ్లలో స్పెక్ట్రం చార్జీల కింద సంస్థ రూ. 49,000 కోట్లు, రుణభారానికి సంబంధించిన వడ్డీల కోసం మరో రూ. 5,000-6,000 కోట్లు చెల్లించాల్సి రానుంది.అయితే.. మరింత రుణాన్ని ఈక్విటీ కింద మార్చాల్సిన అవసరం లేకుండానే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తేజస్ మెహతా తెలిపారు. తాము రూ. 25,000 కోట్ల నిధులతో పాటు మూడేళ్ల వ్యవధిలో రూ. 60,000 కోట్ల వరకు ఎబిటాను సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఇక ట్యాక్స్ రిఫండ్ కింద మరో రూ. 10,000 కోట్లు రావాల్సి ఉంటుందని వివరించారు.కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలు..పోస్ట్పెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా మరిన్ని ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలను ఆవిష్కరించినట్లు వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా తెలిపారు. ఇవి 7 రోజులు, 14 రోజులు, 21 రోజుల కాలవ్యవధితో లభిస్తాయని వివరించారు. దీనితో మొత్తం 1 రోజు నుంచి 30 రోజుల వరకు వేలిడిటీతో 17 రకాల ప్యాక్లను అందిస్తున్నట్లవుతుందన్నారు. -
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) త్వరలో, భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టబోతోందని వచ్చిన సమాచారం.. టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈసారి కంపెనీ సుమారు 10 శాతం మందిని తొలగించే అవకాశం ఉంది.మెటా కంపెనీ సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. 2025 చివరి నాటికి సంస్థలో పనిచేసేవారి సంఖ్య సుమారు 78,000గా ఉండేది. దీన్నిబట్టి చూస్తే లేఆఫ్స్ ప్రభావం సుమారు 10 శాతం ఉద్యోగులపై పడుతుందని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఖర్చులు తగ్గించడమే కాకుండా, కంపెనీని కొత్త దిశగా మలచడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అని తెలుస్తోంది.మెటా ఇప్పుడు తన సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకోవడంలో భాగంగా.. పెద్ద పెద్ద టీమ్లకు బదులుగా చిన్న, వేగంగా పనిచేసే టీమ్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఏఐ కేంద్రంగా మారుతోంది. సంస్థ భవిష్యత్ పెట్టుబడుల్లో భారీ భాగాన్ని ఏఐ డేటా సెంటర్లు, చిప్లు, మోడల్ ట్రైనింగ్ వంటి రంగాల్లో పెట్టనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాదు, 7000 మంది కొత్త ఏఐ ఆధారిత ప్రాజెక్ట్ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఉద్యోగుల్లో అసంతృప్తిని కూడా పెంచుతున్నాయి. దీంతో కంపెనీ అంతర్గత వాతావరణం కొంత ఒత్తిడిగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని AI టూల్స్ ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తాయన్న భయం కూడా ఉంది. కంపెనీ మాత్రం వాటిని కేవలం AI శిక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరణ ఇస్తోంది. -
పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!
వంటనూనెల దిగుమతులు 2025–26 నూనెల సీజన్లో (నవంబర్–ఏప్రిల్) 13 శాతం పెరిగి 7.94 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా పామాయిల్ దిగుమతులు భారీగా పెరిగినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో దిగుతులు 7.04 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.విలువ పరంగా చూస్తే రూ.73,000 కోట్ల నుంచి రూ.87,000 కోట్లకు చేరాయి. మొత్తం నూనెల దిగుమతుల్లో వంటనూనెలు 7.82 మిలియన్ టన్నులుగా ఉంటే, 1,21,000 టన్నులు నాన్ ఎడిబుల్ నూనెలు ఉన్నాయి. పామాయిల్ దిగుమతులు దాదాపు రెట్టింపై 3.97 మిలియన్ టన్నులకు చేరాయి. సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెల దిగుమతులు 3.85 మిలియన్ టన్నులకు తగ్గాయి.పామాయిల్ ధరలు 14–15 శాతం, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెల ధరలు 17–22 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా డాలర్తో రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి. మే చివరికి దేశంలో మొత్తం నూనె నిల్వలు 2.12 మిలియన్ టన్నులకు చేరాయి. -
కార్ల కొనుగోలుదారులపై డబుల్ ఇంపాక్ట్
సొంత కారు కొనానుకునే మధ్యతరగతి వినియోగదారుడిపై త్వరలోనే డబుల్ ఇంపాక్ట్ పడబోతోంది. వాహనంలో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయకపోయినా.. పేపర్పై కనిపించే మైలేజీ (లేదా రేంజ్) గణనీయంగా తగ్గిపోనుంది. అదే సమయంలో కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్పునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ప్రస్తుతం దేశంలో వాడుకలో ఉన్న ‘మాడిఫైడ్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్’(ఎంఐడీసీ) స్థానంలో మరింత కఠినమైన అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు పొందిన ‘వరల్డ్వైడ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్’ (డబ్ల్యూఎల్టీపీ) విధానాన్ని 2027 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి తోడు, ఇంధన సామర్థ్యాన్ని మరింత కఠినతరం చేసే కేఫే-3 (కార్పొరేట్ యావరేజ్ ఫ్యుయెల్ ఎకానమీ) నిబంధనలను కూడా ప్రభుత్వం అదే సమయంలో అమలు చేయనుంది. ఈ జంట నిర్ణయాల వల్ల పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల సర్టిఫైడ్ సామర్థ్యం ఏకంగా 10 నుంచి 20 శాతం వరకు పడిపోనుంది.మైలేజీ లెక్కలు ఎలా మారనున్నాయంటే?పరిశ్రమ నిపుణుల ప్రకారం.. ఈ కొత్త టెస్టింగ్ విధానం వల్ల వాహనాల నిజమైన సామర్థ్యం ఏమీ తగ్గిపోదు. ప్రస్తుత టెస్టింగ్ విధానం కంటే డబ్ల్యూఎల్టీపీ విధానం రోడ్డుపై వాహనం నడిపే నిజమైన (రియల్ వరల్డ్) పరిస్థితులకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఫలితంగా సర్టిఫైడ్ మైలేజీ గణాంకాలు మారుతాయి.పెట్రోల్ కార్లు: ప్రస్తుతం లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే పెట్రోల్ కారు కొత్త ప్రమాణాల ప్రకారం 21 నుంచి 22 కిలోమీటర్లకు పరిమితం కానుంది.ఎలక్ట్రిక్ వాహనాలు: ఒకసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీలు చెబుతున్న ఈవీల రేంజ్.. కొత్త నిబంధనల ప్రకారం 430 - 450 కిలోమీటర్లకు పడిపోనుంది. ‘వాహనం మోడల్, దాని కాన్ఫిగరేషన్ను బట్టి అధికారిక ఇంధన సామర్థ్య గణాంకాలు 10 నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది’ అని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్(ఐసీసీటీ) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ భట్ అన్నారు.ఆటోమొబైల్ సంస్థల ముందు జంట సవాళ్లుఒకేసారి కేఫే-3, డబ్ల్యూఎల్టీపీ నియమాలను తీసుకురావడం వాహన తయారీదారులకు సవాలుగా మారనుంది.కేఫే-3 నిబంధన: కంపెనీలు విక్రయించే మొత్తం వాహనాల సగటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల పరిమితిని ఇది మరింత తగ్గిస్తుంది.డబ్ల్యూఎల్టీపీ విధానం: ఉద్గారాలను లెక్కించే పద్ధతినే ఇది పూర్తిగా మార్చేస్తుంది. ల్యాబ్లలో కాకుండా.. గరిష్ట వేగం, వేగవంతమైన యాక్సిలరేషన్, నిజమైన రోడ్డు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఉద్గారాలను లెక్కిస్తారు. దీనివల్ల కేఫే-3 లక్ష్యాలను అందుకోవడం కంపెనీలకు మరింత భారంగా మారుతుంది.ఏయే కార్ల ధర ఎంత పెరగొచ్చు?కొత్త ఉద్గారాల నిబంధనలను అందుకోవడానికి కార్ల కంపెనీలు అధునాతన సాంకేతికతను జోడించాల్సి ఉంటుంది. ఫలితంగా వాహనాల తయారీ వ్యయం పెరిగి ఆ భారం వినియోగదారుడిపై పడనుంది.కార్ల విభాగంఆవశ్యక సాంకేతిక మార్పులుపెరగనున్న అంచనా ధర (రూపాయల్లో)ఎంట్రీ-లెవల్ చిన్న కార్లుఅప్గ్రేడెడ్ ఇంజిన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, కొత్త ఫ్యూయల్ ఇంజెక్టర్లు, సెన్సార్లు30,000 - 50,000ప్రీమియం హాచ్బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీగ్యాసోలిన్ పార్టిక్యులేట్ ఫిల్టర్లు, క్యాటలిటిక్ కన్వర్టర్లు, మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థలు40,000 - 1,00,000పెద్ద ఎస్యూవీ, ఎంపీవీభారీ సాంకేతిక మార్పులు, అధునాతన ఉద్గార నియంత్రణ వ్యవస్థలు1,20,000 - 2,00,000‘డబ్ల్యూఎల్టీపీ విధానం వల్ల అధికారిక మైలేజీ గణాంకాలు తగ్గి ఉద్గారాల నమోదు పెరుగుతుంది. దీనివల్ల కేఫే-3 నిబంధనలను పాటించడం కంపెనీలకు మరింత వ్యయప్రయాసలతో కూడుకున్న పనిగా మారుతుంది’ అని మొబిలిటీ, ఎనర్జీ ట్రాన్సిషన్ నిపుణుడు రణ్ధీర్ సింగ్ విశ్లేషించారు. -
అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా ముందంజలో ఉంది. అయితే.. ఇక్కడి యువతలో ఏఐ పట్ల వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితిలా కనిపించినప్పటికీ.. దీని వెనుక ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే.. కేవలం AI గురించే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న దీర్ఘకాలిక మార్పులను కూడా పరిశీలించాలి.ఏఐ మీద వ్యతిరేఖ భావన ఏర్పడటానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధ వల్ల కంపెనీలు ఉద్యోగాల కోత. చాలా సంస్థలు ఏఐ టెక్నాలజీ కోసం ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు ప్రకటనలు కూడా చేశాయి. నిజానికి కంపెనీలు కూడా ఖర్చులు, ఆర్థిక మందగమనం, మార్కెట్ ఒత్తిడులు వంటివి ఎదుర్కొంటున్నాయి.AI కారణం అందుకే..సంస్థలు AIని కారణంగా చూపడం.. వాటికి రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. ఒకటి.. ఉద్యోగాల కోతలను సమర్థించుకోవచ్చు. రెండోది.. మేము భవిష్యత్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం.. అనే ఇమేజ్ పొందవచ్చు. దీంతో సాధారణ ప్రజల్లో ఏఐ అంటే ఉద్యోగాలను తీసేసే యంత్రం అనే భయం పెరుగుతోంది.ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. 2008-09 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగింది. అప్పటి నుంచి ధనిక-పేద అంతరం, అప్పుల భారం, ఉద్యోగ భద్రతలేమి వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. టెక్నాలజీ రంగం మాత్రమే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ వృద్ధి సమాజంలోని అందరికీ సమానంగా ప్రయోజనం కలిగించలేదు.టెక్నాలజీ విప్లవంఒకప్పుడు స్మార్ట్ఫోన్ విప్లవం, ముఖ్యంగా ఐఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ రంగం ప్రపంచాన్ని మార్చేసింది. కానీ ఆ టెక్నాలజీ విప్లవం కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుకోలేకపోయింది. అదే విధంగా AI కూడా అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. AI ఉత్పాదకతను పెంచగలదు, కొత్త సేవలను సృష్టించగలదు. కానీ.. ప్రపంచ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రాజకీయ విభజనలు వంటి లోతైన సమస్యలను అది ఒక్కటే పరిష్కరించలేదు.How is it that in the US, the AI leader, a good part of the population, even a lot of college students, have come to hate AI? It does not help that companies are blaming job losses on AI, which is both convenient and as an added bonus, makes a company look visionary.The layoffs…— Sridhar Vembu (@svembu) May 19, 2026మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వ్యవస్థలనే అనుసరిస్తోంది. అమెరికా ఆధిపత్యం, గ్లోబల్ ట్రేడ్, డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటివి దశాబ్దాలుగా ప్రపంచాన్ని నడిపించాయి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. చైనా ఎదుగుదల, యుద్ధాలు, సరఫరా గొలుసు సమస్యలు, ఇంధన సంక్షోభాలు వంటివన్నీ కలిసి ప్రపంచాన్ని కొత్త దిశలోకి నెడుతున్నాయి.మార్పునకు అవకాశంచరిత్రను పరిశీలిస్తే.. ప్రతి టెక్నాలజీ విప్లవం మొదట్లో భయాలను సృష్టించింది. పరిశ్రమల విప్లవం సమయంలో కూడా యంత్రాలు ఉద్యోగాలను నాశనం చేస్తాయని భావించారు. కానీ తరువాత కొత్త రంగాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. AI విషయంలో కూడా అదే జరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశోధన రంగాల్లో AI భారీ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది అనేది వాస్తవం.ఇదీ చదవండి: భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్లో తేడా! -
హైదరాబాద్లో ఐసాల్వ్డ్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: మానవ వనరుల నిర్వహణ రంగంలో ప్రసిద్ధి చెందిన అమెరికన్ కంపెనీ ‘ఐసాల్వ్డ్’ హైదరాబాద్లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించింది. సుమారు 400 మంది ఉద్యోగులకు అవసరమైన కేంద్రాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అమెరికాలో రెండు లక్షల సంస్థలకు చెందిన సుమారు 90 లక్షల మంది ఉద్యోగుల వ్యవహారాలు చూసే ఐసాల్వ్డ్ ఇకపై హైదరాబాద్ కేంద్రంగా సరికొత్త టెక్నాలజీల ఆవిష్కరణ చేపట్టనుంది.కంపెనీ ప్రధాన సాఫ్ట్వేర్ ఉత్పత్తి ‘పీపుల్స్ క్లౌడ్’ ఆధునికీకరణ మొదలుకొని ‘బెట్టర్ బెనిఫిట్స్’, ‘మార్కెట్ప్లేస్’ల నిర్వహణ, కస్టమర్ సపోర్ట్ వ్యవహారాలను ఇండియా కేంద్రం నుంచి నిర్వహించనున్నామని కంపెనీ జనరల్ మేనేజర్ యోగేశ్ మోరె తెలిపారు. కంపెనీ ఆపరేషన్స్లో కృత్రిమ మేధ కూడా కీలకపాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. హెచ్ఆర్ వ్యవహారాలకు సంబంధించిన మెయిళ్లను చదివి ఆయా సమస్యల పరిష్కారానికి ఏఐ ఒక పద్ధతిని సూచిస్తే... వాటిని ఇంజినీర్లు పరిశీలించి ఓకే చేస్తారని, తద్వారా సంక్లిష్టమైన వ్యవహారాలను కూడా సులువుగా చక్కబెట్ట వచ్చునని ఆయన వివరించారు. ఐసాల్వ్డ్ ఏడాదికి 22 - 25 సీఏజీఆర్తో వృద్ధి చెందుతోందని తెలిపారు.అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ స్పీడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వల్లభి ‘ఐసాల్వ్డ్’ కార్యాలయాన్ని రిబ్బన్ కత్తిరించి ఆవిష్కరించారు. ఐసాల్వ్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రగ్యా గుప్తా, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అఈమ మోషేర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభి మాట్లాడుతూ ఐసాల్వ్డ్లో 65 శాతం జెండర్ డైవర్సిటీ ఉండటం తన దృష్టిని ఆకర్శించిందని తెలిపారు. కంపెనీల్లో ఈ స్థాయి జెండర్ డైవర్సిటీ ఉంటం చాలా అరుదని అన్నారు. ఐసాల్వ్డ్ సంస్థ అమెరికా తరువాత అతిపెద్ద కార్యాలయ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు.హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థల జీసీసీ కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని, ఇంజినీరింగ్తోపాటు కృత్రిమ మేధ రంగంలోనూ హైదరాబాద్ను గ్లోబల్ కేపిటల్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. తగిన మౌలిక సదుపాయాలు, పాలన అందించడం, బిజినెస్కు తగ్గ వాతావరణాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఐసాల్వ్డ్ లక్ష్యాలు కూడా నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 114.19 పాయింట్ల (0.15 శాతం నష్టం) నష్టంతో 75,200.85 వద్ద, నిఫ్టీ 31.95 పాయింట్ల నష్టంతో (0.14 శాతం నష్టం) 23,618.00 వద్ద నిలిచాయి.డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్, ఆటోలైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, రామ ఫాస్ఫేట్స్ లిమిటెడ్, యునైటెడ్ ఫుడ్బ్రాండ్స్ లిమిటెడ్, డైమైన్స్ & కెమికల్స్ లిమిటెడ్, నియోజెన్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. 15 రోజుల్లో 25వేల బుకింగ్స్!
ఓబెన్ ఎలక్ట్రిక్ ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన 'ఓబెన్ రోర్ ఈవో' కేవలం 15 రోజుల్లో 25వేల బుకింగ్స్ సొంతం చేసుకుంది. కంపెనీ మొదటి వెయ్యిమంది కస్టమర్లకు మాత్రమే రూ.99,999 వద్ద ఈ బైకును విక్రయించింది. ఈ తరువాత దీని ధరను 1,24,999 (ఎక్స్-షోరూమ్) రూపాయలకు పెంచింది. డెలివరీలు జూన్ నెలలో ప్రారంభం కానున్నాయి.రోర్ ఈవో బైక్ 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 180 కి.మీ రేంజ్ అందిస్తుంది. కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 400 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 110 కిమీ. కంపెనీ ఎనిమిదేళ్ల బ్యాటరీ వారంటీని అందిస్తుంది.ఓబెన్ రోర్ ఈవోలో 'ఫాల్ అలర్ట్ విత్ ఎమర్జెన్సీ అసిస్ట్' అనే ఫీచర్ ఉంది. ఇది వాహనం కింద పడటాన్ని గుర్తించి, ఓబెన్ యాప్ ద్వారా హెచ్చరికలను జారీ చేస్తుంది. అవసరమైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్లకు తెలియజేస్తుంది. అదనపు భద్రతా ఫీచర్లలో.. యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ (UBA), డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ (DAS), సెక్యూర్ ఛార్జ్, మరియు మెరుగైన స్థిరత్వం కోసం వెడల్పాటి వెనుక టైరు ఉన్నాయి.ఈ బైకులో 5 అంగుళాల కలర్ TFT డిస్ప్లే ఉంది. ఇది నావిగేషన్, రైడ్ డేటా, కాల్, టెక్స్ట్, మ్యూజిక్ కోసం స్మార్ట్ అలర్ట్లను అందిస్తుంది. ఈ బైక్ పొడవైన సీటును కలిగి ఉండటం వల్ల.. రైడర్, పిలియన్ ఇద్దరూ మంచి రైడింగ్ అనుభూతిని పొందుతారు. సీటు కింద, సీటు అండర్-సీట్ స్టోరేజ్, ట్యాంక్ పాడ్ స్టోరేజ్తో పాటు డ్యూయల్ USB ఛార్జింగ్ పోర్ట్లతో కలిపి మొత్తం 10 లీటర్ల స్టోరేజ్ లభిస్తుంది.25,000 bookings in just 15 days. And we’re only getting started.The Rorr EVO isn’t following the future of riding, it’s leading it.25,000 riders have already made the switch to power, precision, and pure electric performance.The movement is growing. Are you riding in?🔗… pic.twitter.com/sKWIC03eqf— Oben Electric (@ObenElectric) May 18, 2026 -
భారీగా పెరిగిన వెండి ఆభరణ ఎగుమతులు!
రత్నాభరణాల ఎగుమతుల రంగం ఏప్రిల్లో ప్రతికూలతలను చవిచూసింది. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఎగుమతులు ఢీలా పడ్డాయి. క్రితం ఏడాది ఏప్రిల్తో పోల్చి చూసినప్పుడు ఎగుమతులు 9 శాతం తగ్గి 2,226 మిలియన్ డాలర్లకు (రూ.20,825 కోట్లు సుమారు) పరిమితమయ్యాయి. ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) వెల్లడించింది. క్రితం ఏడాది ఏప్రిల్లో ఎగుమతులు 2,448 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఏప్రిల్లో కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 19.65 శాతం తగ్గి 890.91 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ల్యాబ్లో తయారు చేసిన వజ్రాల ఎగుమతులు సైతం 15 శాతానికి పైనే క్షీణించి 93.28 మిలియన్ డాలర్లకు చేరాయి.బంగారం ఆభరణాల ఎగుమతులు ఏకంగా 21.77 శాతం తగ్గి 841.54 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. సాధారణ బంగారం ఆభరణాల ఎగుమతులు 342 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఏప్రిల్తో పోల్చితే 47 శాతం తక్కువ. స్టడెడ్ (రాళ్లు పొదిగిన) బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం 16 శాతం వృద్ధి చెంది 500 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇక వెండి ఆభరణాల ఎగుమతులు ఏకంగా 444 శాతం ఎగసి 268 మిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 49 మిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. -
ఫోన్పే, గూగుల్పే తరహాలో 'వియోనా పే'
డిజిటల్ పేమెంట్స్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత విసృ్తతం చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫిన్టెక్ కంపెనీ వియోనా (VIYONA) సిద్ధమైంది. ఫోన్పే, గూగుల్ పే మాదిరిగా ఇంకో సంస్థ డిజిటల్ పేమెంట్స్ నిర్వహిస్తుందన్నమాట. వియోనా ఇందుకు తగ్గట్టుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ను సంపాదించింది. ఫలితంగా యూపీఐ పేమెంట్స్ జారీ చేసేందుకు, ఐఎంపీఎస్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ను చేసేందుకు వీలేర్పడుతుంది. అలాగే బ్యాంకుల మధ్య డిజిటల్ లావేదేవీలకూ వియోన వేదిక కానుంది.బ్యాంకింగ్, పేమెంట్స్కు సంబంధించిన విషయాల్లో వియోనా రెండేళ్లుగా విస్తరిస్తూ వస్తోంది. కలెక్షన్స్తోపాటు చెల్లింపులు, చెల్లింపుల ప్రక్రియలను వివిధ బ్యాంకుల మధ్య ఇంటిగ్రేషన్ సాధించడం దీనికి కారణం. తాజాగా ఎన్పీసీఐ సర్టిఫికేషన్ రావడంతో సంస్థ వ్యాపారులను సంపాదించుకోవడం మరింత సులువైంది.యూపీఐ పేమెంట్స్ స్వీకరణ, చెల్లింపుల సామర్థ్యం పొందిన నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలు విస్తరించనున్నాయి. ‘‘ఐఎంపీఎస్తోపాటు బ్యాంకుల మధ్య లావాదేవీలు కూడా సాధ్యమవుతూండటం వల్ల రియల్ టైమ్ ఫండ్ ట్రాన్స్ఫర్లు, మర్చెంట్ సెటిల్మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేయగలం. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు అందించగలం’’ అని సంస్థ ఛైర్మన్ యార్లగడ్డ రవీంద్రనాథ్ తెలిపారు. ‘‘వియోనా పే’’ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరిన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించగలమని చెప్పారు. వ్యాపారులకు డబ్బులు చెల్లించడం మొదలుకొని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ను స్వీకరించే మౌలిక సదుపాయాల కల్పన వరకూ ఆరు రకాల సేవలను త్వరలోనే అందించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.అంతేకాకుండా.... కనెక్టెడ్ బ్యాంకింగ్, డిజిటల్ ఆన్బోర్డింగ్ సిస్టమ్ల కోసం కూడా కొన్ని కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే వియోనా పే ప్లాట్ఫార్మ్పై వంద మంది భాగస్వాములు ఉన్నారు. అలాగే వెయ్యికిపై విద్యా సంస్థలకు ఉపయోగపడేలా వియోనా ఫిన్టెక్ ‘క్యాంపస్ ప్రో’ పేరుతో ఒక ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను రూపొందించింది. ‘‘గ్రామ్ పే’’ ద్వారా సుమారు ఐదు వేల మంది వ్యాపారులను డిజిటల్ పేమెంట్ల క్షేత్రంలోకి తీసుకురాగలిగామని సంస్థ తెలిపింది. -
బెంగళూరు కంటే హైదరాబాదే బెస్ట్!
నేటి కార్పొరేట్ ప్రపంచంలో లక్షల ప్యాకేజీలు, ఆకర్షణీయమైన కెరీర్ వృద్ధి వైపే యువత పరుగులు తీస్తోంది. కానీ, ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ సరికొత్త చర్చకు తెరలేపింది. ‘బెంగళూరులో రూ.38 లక్షల ప్యాకేజీ (ఎల్పీఏ) కావాలా? లేక హైదరాబాద్లో ప్రశాంత జీవితం కావాలా?’ అంటూ సదరు ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఆన్లైన్ వేదికగా వైరల్గా మారింది.ఆ వేతనం కంటే.. జీవన నాణ్యతే ముఖ్యం!మధన్ మోహన్ అనే ఓ ఐటీ నిపుణుడు ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తన కెరీర్ ఎంపిక గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నాడు. ప్రస్తుత సంస్థలో చేరడానికి ముందు తన వద్ద రెండు బెటర్ జాబ్ ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించాడు. ఆఫర్ 1.. రూ.38 ఎల్పీఏ ప్యాకేజీ, బెంగళూరులో లొకేషన్. ఆఫర్ 2.. రూ.30 లక్షల ప్యాకేజీ, హైదరాబాద్లో జాబ్ లొకేషన్. ‘నా చుట్టూ ఉన్న చాలా మంది.. చేతికి వచ్చే ఆ 8 లక్షల రూపాయల అదనపు ఆదాయాన్ని ఎందుకు వదులుకుంటావు? అని ప్రశ్నించారు. కానీ కొన్నిసార్లు, ఉత్తమ నిర్ణయం అంటే కేవలం అత్యధిక ప్యాకేజీని ఎంచుకోవడం మాత్రమే కాదని నేను గ్రహించాను’ అని మధన్ మోహన్ పేర్కొన్నాడు.హైదరాబాద్పైనే ఎందుకు మొగ్గు?‘బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో నిత్యావసరాలు, జీవన వ్యయం చాలా తక్కువ. ట్రాఫిక్, రోజువారీ ఉరుకుల పరుగుల ఒత్తిడి కూడా తక్కువే. దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యులు సమీపంలోనే ఉన్నారు. హైదరాబాద్ బెస్ట్ ఫుడ్, ఇక్కడి అనుకూల వాతావరణం మానసిక ప్రశాంతతను ఇస్తాయి. చాలా మంది ఉద్యోగులు కేవలం కాగితంపై కనిపించే సీటీసీని మాత్రమే లెక్కిస్తారు. కానీ జీవితంలో ఆనందం, మానసిక శ్రేయస్సు, జీవన నాణ్యతను లెక్కించడం మర్చిపోతారు. దీర్ఘకాలంలో మనశ్శాంతే అత్యంత విలువైనది. ఒత్తిడికి బదులు శాంతిని ఎంచుకోవడం కూడా ఒక తెలివైన కెరీర్ ప్లానింగే’ అని అతను నెటిజన్లతో పంచుకున్నాడు. తన నిర్ణయం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ప్రస్తుతం సంతృప్తితో ఉన్నానని తెలిపాడు.నెట్టింట స్పందనలు ఇలా..మధన్ మోహన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దాదాపు 82,000 కంటే ఎక్కువ వ్యూస్తో వైరల్గా మారింది. ‘జీతం వర్సెస్ జీవన నాణ్యత’ అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘అన్ని నగరాల కంటే హైదరాబాదే బెస్ట్’ అని కొందరు వ్యాఖ్యానించగా.. ‘నాకు కూడా హైదరాబాద్ సొంత ఇల్లాంటి అనుభూతినే ఇస్తుంది’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో ఖర్చులు చాలా తక్కువ సోదరా, నీ నిర్ణయం కరెక్ట్’ అంటూ మెజారిటీ నెటిజన్లు తన నిర్ణయాన్ని కొనియాడారు. ‘నేనైతే బెంగళూరులో ఆ రూ.38 లక్షల ఆఫర్ తీసుకునేవాడిని. అక్కడ ఏడాది పాటు పనిచేసి ఆపై 30% హైక్తో రూ.50 లక్షల ప్యాకేజీకి హైదరాబాద్లో ఉద్యోగం వెతుక్కుని వచ్చేవాడిని. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి మార్పులు ఆర్థికంగా భారీ ఊతాన్ని ఇస్తాయి. అయితే, ఇవి తరచూ చేయడం సరైందికాదు’ అని ఒకరు స్పందించారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వార్షిక వేతన పెంపుదల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి, ఆందోళనకు దారితీసింది. సగటున 5 శాతం మేర జీతాలు పెంచినట్లు కంపెనీ ప్రకటించినప్పటికీ అంతర్గత నిబంధనల్లో మార్పులు, పనితీరు కోటాలు విధించడం వల్ల చేతికి వచ్చే జీతం తగ్గిపోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు, లే-ఆఫ్స్ భయాలు ఐటీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రదర్శించిన సాలరీ హైక్ ఉద్యోగులకు ఆనందాన్ని ఇవ్వకపోగా కొత్త ఆందోళనలను తెచ్చిపెట్టింది. అప్రైజల్ సైకిల్ ముగిసిన తర్వాత కంపెనీ వార్షిక వేతన పెంపును అమలు చేసింది. అయితే, ఈ పెంపుదలపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సంక్షోభానికి దారితీసిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.వేతన పెంపు ఉన్నా చేతికొచ్చే జీతం తగ్గింది!టీసీఎస్ ఈ ఏడాది సగటున 5 శాతం వేతన పెంపును ప్రకటించింది. ప్రతిభ కనబరిచిన ‘A+’ పెర్ఫార్మెన్స్ బ్యాండ్ ఉద్యోగులకు అత్యధికంగా 9 శాతం నుంచి 13 శాతం వరకు ఇంక్రిమెంట్లు లభించాయి. అయినప్పటికీ, మెజారిటీ ఉద్యోగులు తమ చేతికి వచ్చే నికర ఆదాయం తగ్గిందని వాపోతున్నారు.స్ట్రక్చరల్ మార్పుల్లో భాగంగా కంపెనీ అంతర్గత వేతన నిర్మాణంలో మార్పులు చేశారు.పనితీరు ఆధారంగా ఇచ్చే వేరియబుల్ పే తగ్గింది.ఉద్యోగికి కంపెనీ ఆఫర్ చేసే కాస్ట్ టు కంపెనీ(సీటీసీ) నుంచి గ్రాట్యుటీ మొత్తాన్ని తొలగించి చూపుతున్నారు. అంటే.. సులభంగా అర్థం చేసుకోవడానికి దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటి.. కాగితం మీద కనిపించే మార్పు, రెండు.. భవిష్యత్తులో వచ్చే నష్టం.ఉదాహరణకు: ఒక ఉద్యోగి సీటీసీ రూ.10 లక్షలు అనుకుందాం. అందులో గ్రాట్యుటీ విలువ రూ.40,000 ఉందనుకోండి.పాత పద్ధతి: స్క్రీన్ పైన లేదా ఆఫర్ లెటర్లో మీ సీటీసీ రూ.10,00,000 గానే కనిపిస్తుంది.కొత్త పద్ధతి: ఇప్పుడు గ్రాట్యుటీ మొత్తాన్ని (రూ.40,000) ఆ డిస్ప్లే నుంచి తీసివేస్తే ఇప్పుడు మీ సీటీసీ రూ.9,60,000గా కనిపిస్తుంది.‘బ్యాండ్ -డీ’ కోటా భయాలుఈ అప్రైజల్ సీజన్లో మేనేజర్లకు అందిన అంతర్గత ఆదేశాలు ఉద్యోగులను మరింత ఉలిక్కిపడేలా చేశాయి. ప్రతి టీమ్లో కనీసం 5 శాతం మంది సిబ్బందిని అత్యంత తక్కువ పనితీరు కేటగిరీ అయిన ‘బ్యాండ్ డీ’ లో ఉంచాలని యాజమాన్యం స్పష్టమైన కోటాను విధించినట్లు సమాచారం. సాధారణంగా ఈ బ్యాండ్లోని ఉద్యోగులకు కంపెనీ వేటు వేసే అవకాశం ఉంటుంది. ఈ 5% నిబంధన కారణంగా భవిష్యత్తులో తమ ఉద్యోగాలు ఊడిపోతాయేమోననే అభద్రత ఉద్యోగుల్లో తీవ్రస్థాయికి చేరింది.ఐటీ రంగంపై ఆర్థిక ఒత్తిడిఈ వివాదం కేవలం టీసీఎస్కు మాత్రమే పరిమితమైనది కాదు; మొత్తం భారతీయ ఐటీ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం వల్ల అంతర్జాతీయ క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్లను తగ్గించుకున్నారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలను క్లయింట్లు వాయిదా వేస్తున్నారు. ఆదాయ వృద్ధి మందగించడంతో ఐటీ కంపెనీలు తమ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగుల వేతనాల్లో కోతలు, కఠినమైన పనితీరు నిబంధనలు తెరపైకి వస్తున్నాయి.ఇదీ చదవండి: బంగారం ధరలు రివర్స్.. తులం ఎంతంటే.. -
బంగారం ధరలు రివర్స్.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గడిచిన మూడు సెషన్ల్లో తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
డేటా ఆధారంగా చర్యలు
అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో.. సరఫరా పరమైన సమస్యలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయా? మానిటరీ పాలసీ పరమైన చర్య అవసరమా? అన్నది పరిశీలిస్తూ ఉంటామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2025 నుంచి ఆర్బీఐ తటస్థ విధానాన్ని అనుసరిస్తున్నట్టు గుర్తు చేస్తూ, డేటా విషయంలో తగిన విధంగా స్పందించడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు.ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. భారత్కు తరచుగా సరఫరా సమస్యలు ఎదురవుతున్నట్టు చెప్పారు. ‘‘ధరలు అదే పనిగా పెరుగుతూ, వేతన భారానికి, ఉత్పత్తి, రవాణా వ్యయాలకు దారితీస్తే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లకు కారణమవుతుంటే అప్పుడు విధానాన్ని కఠినతరం చేయాల్సి వస్తుంది’’అని మల్హోత్రా వివరించారు. ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యానికి మరో 2 శాతం వరకు వెసులుబాటు ఉన్న నేపథ్యంలో స్వల్పకాలంలో సరఫరా సమస్యలను ఆర్బీఐ సర్దుబాటు చేసుకోగలదన్నారు.అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఇంకా కొనసాగుతున్న తరుణంలో, స్థూల ఆర్థిక పరమైన ప్రభావాలు ఇంకా పూర్తి స్థాయిలో వెలుగుచూడాల్సి ఉందన్నారు. మానిటరీ పాలసీ కఠినతరం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే వాటిని తెలియజేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆర్బీఐ ఎంపీసీ తదుపరి పాలసీ సమీక్ష జూన్ 3 నుంచి 5 వరకు జరగనుంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
ఓఎంసీలకు తగ్గుతున్న చమురు నష్టం
పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు రూ. 3 చొప్పున పెంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) రోజువారీ నష్టాలు పావు శాతం మేర తగ్గాయి. రోజుకు రూ. 1,000 కోట్ల నుంచి రూ. 750 కోట్లకు దిగి వచ్చాయని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అధిక స్థాయిలోనే ఉండటం, బలహీన రూపాయి కారణంగా రిటైల్ స్థాయిలో ఆదాయ నష్టం కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే, అసలు కన్నా తక్కువ రేటుకే ఇంధనాలను విక్రయిచండం వల్ల ఆయిల్ కంపెనీలకి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు ప్రత్యేక సబ్సిడీ ప్యాకేజీ ప్రతిపాదనేదీ ఇంకా పరిశీలనలో లేదని శర్మ వివరించారు.లీటరుకు రూ.3 పెంపు వల్ల ఓఎంసీలకు పరిమిత ఊరటే లభిస్తుందే తప్ప నష్టాలు పూర్తి స్థాయిలో భర్తీ కావని, దీనివల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా కొంత పెరుగుతాయని విశ్లేషకులు తెలిపారు. రేట్లు పెరగడం వల్ల డిమాండ్ స్వల్పంగా నెమ్మదించి, దిగుమతుల భారం కొంత తగ్గుతుందని డీబీఎస్ బ్యాంక్ సీనియర్ ఎకానమిస్ట్ రాధికా రావు తెలిపారు. ద్రవ్యోల్బణం 15–25 బేసిస్ పాయింట్ల మేర పెరగొచ్చన్నారు. క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలోనే ఉంటే ఓఎంసీలను తిరిగి లాభాల వైపు మళ్లించేందుకు ఈ పెంపు సరిపోదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అనలిస్ట్ ప్రశాంత్ వశిష్ట తెలిపారు. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, రేట్లు కొంత పెరగడంతో ఓఎంసీల ఆదాయ నష్టాలు పెట్రోల్పై లీటరుకు రూ. 10, డీజిల్పై రూ. 13కి నెమ్మదిస్తాయని పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి మే ఆఖరు వరకు వ్యవధిలో నష్టాలు రూ. 1 లక్ష కోట్ల పైగా ఉండొచ్చని వివరించారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
పెట్టుబడులకు ‘ఆతిథ్యం’!
భారత హోటల్ రంగం పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో ఈ రంగంలోకి 185 మిలియన్ డాలర్ల (రూ.1,776 కోట్లు సుమారు) పెట్టుబడులు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 117 మిలియన్ డాలర్ల కంటే 58 శాతం అధికం కావడం విశేషం. భారత హోటల్ రంగం వృద్ధి అవకాశాల పట్ల ఇన్వెస్టర్లలో ఎంతో విశ్వాసం నెలకొన్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ‘భారత్లో హోటల్ రంగంలో పెట్టుబడుల ధోరణులు: 2025’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.2025లో భారత హోటల్ రంగంలోకి 567 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపింది. మొత్తం 28 లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడుల కంటే 67 శాతం పెరిగినట్టు పేర్కొంది. టైర్–1 నగరాల్లో 60 శాతం లావాదేవీలు చోటుచేసుకుంటే, మిగిలిన 40 శాతం టైర్–2, 3 నగరాల్లో జరిగాయి. గతేడాది కొత్తగా 103 బ్రాండెడ్ హోటళ్లు ప్రారంభమయ్యాయి. ఇదే ధోరణి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ కొనసాగినట్టు తెలిపింది. నిర్వహణలోని హోటళ్లు, భూముల విక్రయం, ప్లాట్ఫామ్లను సొంతం చేసుకోవడం వంటి లావాదేవీలు ఇందులో ఉన్నాయి. ఇక ముందూ జోరుగానే..మార్చి త్రైమాసికంలో ఫ్లెర్ హోటల్స్ (లెమన్ట్రీ హోటల్స్ సబ్సిడరీ)లో 41 శాతం వాటాను వార్బర్గ్ పింకస్ సొంతం చేసుకుంది. తన పోర్ట్ఫోలియోలోని హోటళ్ల వృద్ధి కోసం 107 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ పెట్టుబడుల లావాదేవీలు జోరుగా ఉండొచ్చన్నది ఈ నివేదిక అంచనా. హోటల్ కంపెనీల వద్ద తగినన్ని నిల్వలు ఉండడం, హోటల్ ఆపరేటర్లు కొందరు క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చే అవకాశాలున్నట్టు తెలిపింది. ఇనిస్టిట్యూషన్స్, ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలు సైతం హోటల్ పోర్ట్ఫోలియోల కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొంది. అలాగే, హెచ్ఎన్ఐలు, ఫ్యామిలీ ఆఫీస్లు, ప్రైవేటు హోటల్ యజమానులు, లిస్టెడ్ హోటల్ కంపెనీలు, డెవలపర్లు పెట్టుబడులకు ముందుకొస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 104 పాయింట్లు పెరిగి 23,751 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 371 పాయింట్లు పుంజుకుని 75,684 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 109.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.07 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.51 శాతం నష్టపోయింది.Today Nifty position 19-05-2026(time: 09:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జారిపోతున్న రూపాయి..
ముంబై: అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాల ప్రభావాలతో రూపాయి మారకం విలువ గణనీయంగా పతనమవుతోంది. డాలరుతో పోలిస్తే మరో 39 పైసలు క్షీణించి 96.20కి పడిపోయింది. సోమవారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 95.81తో పోలిస్తే మరింత తక్కువగా 96.19 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 96.39కి కూడా క్షీణించి చివరికి 96.20 వద్ద క్లోజయ్యింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటం, డాలరు బలోపేతం కావడం తదితర అంశాలతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. రాబోయే రోజుల్లోను ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, అయితే, బంగారం, వెండి దిగుమతులపై ఆంక్షలతో పాటు ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకోవడంలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కనిష్ట స్థాయిల్లో రూపాయికి మద్దతుగా నిలవొచ్చని మిరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. స్పాట్ మార్కెట్లో రూపాయి 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు. -
భారత్లో చాట్జీపీటీ ఇమేజ్ల సునామీ
న్యూఢిల్లీ: భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ప్రవేశపెట్టిన ‘చాట్జీపీటీ ఇమేజెస్ 2.0’ భారత్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన నెల రోజుల్లోనే భారతీయులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏకంగా 100 కోట్లకు (1 బిలియన్) పైగా చిత్రాలను సృష్టించి సరికొత్త రికార్డు సృష్టించారు. ‘‘చాట్జీపీటీ ఇమేజెస్ 2.0 భారత్లో ఇప్పటికే 100 కోట్ల మార్కును దాటేసింది. ఇది నిజంగా అద్భుతం’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న భారత్లో విడుదలైన ఈ వెర్షన్, మే 18 నాటికే ఈ ఘనతను సాధించింది. ఓపెన్ఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘సినిమాటిక్ పోర్ర్టెట్ కొలాజ్’, ‘మినీ మీ వరల్డ్’, ‘అండర్వాటర్ పోర్ర్టెట్’, ‘అనిమే’, ‘చిబి స్టికర్ ప్యాక్’, ‘మంగా కామిక్ స్ట్రిప్’, ‘ఫ్యాషన్ స్టూడియో పోర్ర్టెట్’ వంటి ప్రాంప్ట్ లతో భారతీయులు భారీగా చిత్రాలను రూపొందిస్తున్నారు. భారత్లో ఏఐ ఇమేజ్ జనరేషన్ కేవలం ఉత్పాదకతకే పరిమితం కాకుండా.. క్రియేటర్ కల్చర్, ఫ్యాషన్, ఫ్యాన్డమ్స్, డిజిటల్ ఐడెంటిటీతో మమేకమవుతోందని ఓపెన్ఏఐ పేర్కొంది. -
ఇకపై ఒకటో తేదీనే జీతం.. లేదంటే కంపెనీ క్లోజ్!
అబుదాబి: యూఏఈలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి శ్రమకు తగ్గ ఫలితం సమయానికి దక్కేలా 'మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 0340 ఆఫ్ 2026' పేరుతో కొత్త చట్టాన్ని యూఏఈ మానవ వనరులు, స్వదేశీకరణ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. ప్రైవేట్ రంగ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తేదీ నాడే జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటో తేదీ లోపు జీతం అకౌంట్లో పడకపోతే, దానిని 'ఆలస్యమైన వేతనం' గా పరిగణిస్తారు. కంపెనీ సేఫ్ జోన్లో ఉండాలంటే 1వ తేదీ నాటికి ఉద్యోగి మొత్తం జీతంలో కనీసం 85% డబ్బులు అకౌంట్లో వేయాలి. ఒకవేళ జీతం చెల్లించకపోతే రెండో రోజు నుంచి సదరు కంపెనీపై ప్రభుత్వం నిఘా పెట్టి, నోటీసులు జారీచేస్తోంది. ప్రభుత్వం ఐదు రోజుల వరకు చూస్తోంది. అప్పటికి ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమ కాకపోతే సదరు కంపెనీలకు కొత్త వర్క్ పర్మిట్లను జారీ చేయడం అధికారులు నిలిపివేస్తారు.16 రోజులు దాటితే కార్మికుల తరపున మంత్రిత్వ శాఖే స్వయంగా రంగంలోకి దిగి కేసు నమోదు చేస్తోంది. ఈ నిబంధనలు జూన్ 1, 2026 నుండి అమలుల్లోకి రానున్నాయి. ఈ కొత్త చట్టంతో యూఏఈలో పనిచేస్తున్నప్రవాస భారతీయులకు మేలు జరగనుంది.అయితే 11 ప్రత్యేక కేసులకు మాత్రం ఈ గడువు చట్టం నుండి మినహాయింపు ఇచ్చారు:కోర్టులో వేతన వివాదాల క్లెయిమ్ నడుస్తున్న కార్మికులు.కంపెనీ నుండి పారిపోయినట్లు రిపోర్ట్ నమోదైన వారు.జైలు లేదా కస్టడీలో ఉండి విధులకు హాజరుకాలేని వారు.అధికారికంగా జీతం లేని సెలవులో ఉన్న కాలంలో.ఓడలపై పనిచేసే నావికులు (సీఫేరర్స్).విదేశీ కంపెనీల బ్రాంచ్లలో పనిచేస్తూ, యూఏఈ వెలుపల జీతాలు పొందే విదేశీయులు.3 నెలల లోపు కాలపరిమితి గల 'మిషన్ వర్క్ పర్మిట్'లపై ఉన్నవారు.స్థానిక యూఏఈ పౌరుల యాజమాన్యంలోని చేపల వేట పడవలు.స్థానిక పౌరుల స్వంత యాజమాన్యంలోని పబ్లిక్ టాక్సీలు.బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.మతపరమైన ప్రార్థనా స్థలాలు. -
కఠిన పొదుపు దిశగా కదలండి
న్యూఢిల్లీ: కఠిన పొదుపు దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలు) మళ్లాలని ప్రభుత్వరంగ బ్యాంక్లు, బీమా సంస్థలను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ప్రజలు పెట్రోల్/డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ సూచన చేసింది. బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, విదేశీ పర్యటనలు మానుకోవాలని, ఇంటి నుంచే పనిచేయాలని, కార్లలో ఒంటరిగా వెళ్లకుండా ఇతరులతో కలసి ప్రయాణించాలంటూ ప్రధాని దేశ ప్రజలను కోరడం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధంతో క్రూడ్, బంగారం ధరలు భారీగా ఎగబాకి.. దిగుమతి బిల్లు భారమవుతోంది. ఫలితంగా రూపాయి నేలచూపులు చూస్తోంది. దీంతో ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రభుత్వరంగ బ్యాంక్లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లు, బీమా, ఆర్థిక సంస్థల అధికారులు, సిబ్బందిని ఈవీల్లో ప్రయాణించాలని కోరింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలను అద్దెకు తీసుకోవాలని సూచించింది. తప్పనిసరి అయితే తప్పించి అన్ని సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించుకోవాలని కూడా ఆర్థిక శాఖ కోరింది. -
బులియన్ బ్యాంక్ కావాలి
న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు, అదే సమయంలో ఆభరణాల తయారీకి అవసరమైన పసిడిని దేశీయంగానే సమకూర్చుకునేందుకు జ్యుయలరీ పరిశ్రమ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. బులియన్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని కోరింది. తద్వారా దేశంలోపలే నిరుపయోగంగా ఉన్న పసిడిని వినియోగంలోని తీసుకురావచ్చని సూచించింది. ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) ప్రతినిధులతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఇళ్లు, సంస్థలు, పెట్టుబడి వాహకాలు కలిగి ఉన్న బంగారాన్ని సమీకరించి జ్యుయలరీ రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఆభరణాల పరిశ్రమ మంత్రిని కోరింది. బులియన్ బ్యాంక్ ప్రతిపాదనపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి నుంచి హామీ లభించింది. ఈ కమిటీని కనుక ఏర్పాటు చేస్తే అందులో ప్రభుత్వం, ఆభరణాల రంగం, బులియన్ మార్కెట్, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.బ్యాంక్ మాదిరే.. ప్రతిపాదిత బులియన్ బ్యాంక్ అన్నది కేంద్రీకృత సంస్థగా పనిచేయనుంది. ఈ బ్యాంక్ దేశీయంగా ఉన్న పసిడిని సమీకరించి, అరువు కింద పరిశ్రమకు ఇస్తుంది. ఇళ్లలోని, సంస్థల నిర్వహణలోని (గోల్డ్ ఈటీఎఫ్లు) బంగారాన్ని సమీకరించి.. ఆభరణాల సంస్థలు, ఎగుమతిదారులు, రిఫైనరీలు, తయారీదారులకు సరఫరా చేయనుంది. ఇళ్లు, సంస్థల వద్ద 25,000–35,000 టన్నుల పసిడి ఉంటుందని అంచనా. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) సైతం పెద్ద మొత్తంలో భౌతిక బంగారాన్ని (పెట్టుబడులకు బ్యాకెండ్గా) ఖజానాల్లో కలిగి ఉన్నాయని ఏఐజేజీఎఫ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈటీఎఫ్ల్లోకి వచ్చే ప్రతి రూపాయి తాజా పెట్టుబడికి అనుగుణంగా పసిడి దిగుమతులకు అదనపు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొంది. కనుక బులియన్ బ్యాంక్ ద్వారా ఈటీఎఫ్లు తమ నిర్వహణలోని భౌతిక బంగారంలో 20–30 శాతాన్ని బాడుగ కింద ఇచ్చేందుకు అనుమతించాలని సూచించింది. దీనివల్ల ఆభరణాల వినియోగానికి సంబంధించి పసిడి దిగుమతుల డిమాండ్ను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది పరిశ్రమ సూచన. రూపాయి విలువను, ఫారెక్స్నిల్వలను కాపాడుకునేందుకు పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం ఇటీవలే 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. అలాగే, ఆభరణాల ఎగుమతిదారులకు అడ్వాన్స్డ్ అథరైజేషన్ స్కీమ్ కింద పసిడి దిగుమతులను కఠినతరం చేయడంతో పరిశ్రమ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఎన్ఎస్ఈలో ఈజీఆర్ల ట్రేడింగ్ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్లు)లో లైవ్ ట్రేడింగ్ ప్రారంభించినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. నియంత్రిత స్పాట్ గోల్డ్ మార్కెట్ను అభివృద్ధి చేసేందుకు ఇది సాయపడుతుందని పేర్కొంది. అహ్మదాబాద్, ముంబైలో సేకరణ, ఖజానా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు.. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరులోనూ కొత్త కేంద్రాలను సోమవారం నుంచి యాక్టివేట్ చేసినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 120 కేంద్రాలకు నెట్వర్క్ను విస్తరించనున్నట్టు తెలిపింది. సెబీ నమోదిత ఖజానాల్లో భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, ఆ రిసీట్స్పై స్టాక్ ఎక్సే్ఛంజ్లో ట్రేడింగ్కు వీలుగా అందుబాటులోకి వచ్చిందే ఈజీఆర్. -
ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలిచ్చి మరీ..
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పాత ఉద్యోగాలను వేగంగా మార్చేస్తోంది. గ్లోబల్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) దిగ్గజం సేల్స్ఫోర్స్ ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐ కార్యకలాపాల నేపథ్యంలో అంతర్గత పునర్నిర్మాణం, బడ్జెట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా సాంప్రదాయక విధుల్లో ఉన్న సుమారు 3,000 మంది ఉద్యోగులను కొత్త నైపుణ్యాలతో సేల్స్ విభాగంలోకి మళ్లించినట్లు కంపెనీ చీఫ్ డిజిటల్ ఎవాంజెలిస్ట్ వాలా అఫ్షర్ వెల్లడించారు. మే 18న తన తొలి అధికారిక భారత పర్యటనలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్గతంలో మానవ వనరులు అవసరమైన కొన్ని తక్కువ ప్రభావం చూపే పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని వాలా అఫ్షర్ పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీలో మిగిలిన ప్రతిభావంతులైన ఉద్యోగులను తొలగించకుండా వారికి తగిన శిక్షణ ఇచ్చి సేల్స్ ఫంక్షన్కు అనుగుణంగా మార్చినట్లు తెలిపారు.‘ఏఐ ఏజెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ఇప్పటివరకు ఆయా పనులు నిర్వహించిన ఉద్యోగులకు రీ-స్కిలింగ్ అందించాం. బయటి నుంచి ఎవరినీ కొత్తగా నియమించుకోకుండానే అంతర్గత వ్యాపార విభాగాల నుంచే ఈ 3,000 మందిని సేల్స్ పాత్రల్లోకి డిప్లాయ్ చేశాం. ఈ ప్రక్రియ బడ్జెట్ వ్యయాలపై కూడా ప్రభావం చూపుతుంది. బడ్జెట్లు మారుతాయి. కొన్నిసార్లు నాయకత్వ శైలి మారుతుంది. దీనివల్ల మధ్యస్థాయి మేనేజ్మెంట్ తగ్గి కంపెనీ మరింత సమర్థంగా మారుతుంది. అందుకు అనుగుణంగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను కూడా పునసమీక్షించుకోవాల్సి ఉంటుంది’ అని వాలా అఫ్షర్ చెప్పారు.2024లోనే కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ బెనియోఫ్ కోడింగ్, ఉత్పాదకత పెంపునకు ఏఐ సాధనాలే సరిపోతాయని, భవిష్యత్తులో ఎక్కువ మంది ఇంజినీర్లను నియమించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. తాజా వ్యూహం దానికి అద్దం పడుతోంది. 2026 నాటికి ఆంత్రోపిక్ టోకెన్ల కోడింగ్ అవసరాల కోసమే కంపెనీ దాదాపు 300 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని బెనియోఫ్ అంచనా వేశారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
ఎస్బీఐ, ఎల్ఐసీకి ప్రభుత్వం ఆదేశాలు
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, పెరుగుతున్న దిగుమతి బిల్లులను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. వ్యయాల హేతుబద్ధీకరణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలు తక్షణమే కాఠిన్య చర్యలను అమలు చేయాలని స్పష్టం చేసింది.ఆంక్షల పరిధిలోకి వచ్చే సంస్థలు ఇవే..ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు విస్తృత స్థాయిలో ప్రభుత్వ ఆర్థిక రంగాన్ని కదిలించనున్నాయి. ముఖ్యంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలు, ఆర్థిక సేవల విభాగం పరిపాలనా నియంత్రణలో పనిచేసే అన్ని ఇతర ఆర్థిక సంస్థలు వీటి పరిధిలోకి రానున్నాయి.విదేశీ పర్యటనలకు కోత..కఠిన చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల అధిపతులకు డీఎఫ్ఎస్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విదేశీ ప్రయాణాలను నిర్ణీత పరిమితుల కంటే చాలా తక్కువగా ఉంచాలని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప అంతర్జాతీయ పర్యటనలకు అనుమతించవద్దని, సాధ్యమైన ప్రతిచోటా భౌతిక పర్యటనల స్థానంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే సమీక్షలు, చర్చలు జరపాలని స్పష్టం చేసింది. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవ్వడమే కాకుండా సమయం కూడా కలిసివస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈవీ వైపు వేగంగా అడుగులువ్యాపార విస్తరణతో పాటు పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఈ సంస్థలు ఇకపై కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న పెట్రోల్, డీజిల్తో నడిచే అద్దె వాహనాలను క్రమంగా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. వాటి స్థానంలో కాలక్రమేణా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించేలా వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఎస్ ఆదేశించింది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
వర్క్ ఫ్రమ్ హోమ్ విస్తరణపై జోహో కామెంట్స్
భారతీయ ఐటీ దిగ్గజం జోహో తమ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని విస్తరించబోమని నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్వేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి బృందాల మధ్య ముఖాముఖి చర్చలు, ప్రత్యక్ష సహకారం ఉన్నప్పుడే ఆశించిన ఉత్పాదకత, వేగవంతమైన పరిష్కారాలు లభిస్తాయని అంతర్గత సమీక్షలో తేలడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని జోహో వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించారు.ప్రత్యక్ష సహకారంతోనే మెరుగైన పరిష్కారాలుకంపెనీ అంతర్గత చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా సొంత డెవలప్మెంట్ టీమ్లో నేనే స్వయంగా ఈ వ్యత్యాసాన్ని గమనించాను. సమస్య పరిష్కారంలో భాగస్వాములైన వ్యక్తులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోనప్పుడు వాటి పరిష్కారానికి చాలా ఎక్కువ సమయం పడుతోంది. అదే ముఖాముఖిగా కూర్చున్నప్పుడు ఆలోచనల మార్పిడి మరింత సులువుగా సాగుతుంది. దీనివల్ల అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన సాఫ్ట్వేర్ పరిష్కారాలు లభిస్తున్నాయి. అందుకే ఆర్ అండ్ డీ విభాగంలో ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోమ్ను విస్తరించకూడదని నిర్ణయించాం’ అని చెప్పారు.జోహో పునసమీక్షపశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమయంలో అలవాటైన వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి పద్ధతులను మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.ప్రధాని పిలుపునకు స్పందించిన శ్రీధర్ వెంబు.. మే 11న ఒక పోస్ట్లో ‘గత కొన్ని నెలలుగా మా సంస్థలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తున్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని పిలుపును గౌరవిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ పునసమీక్షిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే, సంస్థ ప్రయోజనాలు, సాంకేతిక ఉత్పాదకతను బేరీజు వేసుకున్న తర్వాత ఈ విస్తరణ సాధ్యం కాదని జోహో తేల్చిచెప్పింది.ఇంధన పొదుపునకు ప్రత్యామ్నాయ వ్యూహాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనంత మాత్రాన పర్యావరణ స్పృహను విస్మరించబోమని వెంబు స్పష్టం చేశారు. ఇంధన వినియోగాన్ని, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి జోహో ఇతర మార్గాలను అన్వేషిస్తోందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడం, కంపెనీ క్యాంటీన్లలో డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వంట సామగ్రిని ప్రవేశపెట్టడం వంటివి అమలు చేయబోతున్నట్లు చెప్పింది. ఇప్పటికే జోహో సంస్థ సోలార్ (సౌరశక్తి) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. క్యాంపస్ల్లో ఇప్పటికే ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
శ్రమకే అగ్రతాంబూలం!
నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో లక్షల రూపాయల ప్యాకేజీలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజినీర్ల జీతాలే అందరికీ హాట్ టాపిక్. కానీ, రోజువారీ శ్రమను నమ్ముకున్న ఒక సాధారణ ఇంటి పనిమనిషి నెలవారీ సంపాదన వివరాలు ఇప్పుడు సాఫ్ట్వేర్ నిపుణులను, విద్యావంతులను ఆలోచనలో పడేసాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన ఇంటి పనిమనిషితో జరిపిన చిన్న సంభాషణ నెట్టింట వైరల్గా మారింది.బెంగళూరుకు చెందిన ఆదిత్య అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల తన ఇంటి పనిమనిషి పదేపదే ఆలస్యంగా రావడంపై ఆమెను ప్రశ్నించాడు. సాధారణంగా మొదలైన ఈ ప్రశ్న ఆమె ఇచ్చిన సమాధానంతో ఆదిత్య అవాకయ్యేలా చేసింది. ఆమె కేవలం ఒకరి ఇంట్లోనే కాకుండా ఒక పక్కా ప్రణాళికతో బహుళ ఆదాయ వనరులను సృష్టించుకుందని తెలిసి అతను షాక్కు గురయ్యాడు. ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న వివరాల ప్రకారం.. ఆమె తన దినచర్యలో భాగంగా..వేర్వేరు అపార్ట్మెంట్ల్లో నివసించే నలుగురు బ్యాచిలర్స్కు రోజువారీ భోజనం వండి పెడుతోంది. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.6,000 చొప్పున తీసుకుంటోంది. దాంతో ఆమెకు రూ.24,000 లభిస్తోంది. దీనికి అదనంగా, మరో రెండు కుటుంబాలకు పూర్తిస్థాయి ఇంటి పనిమనిషిగా ఉంటూ నెలకు రూ.20,000 సంపాదిస్తోంది. మొత్తంగా ఆమె నెలవారీ ఆదాయం అక్షరాలా రూ.44,000. అంటే సంవత్సరానికి ఆమె సంపాదన రూ.5.28 లక్షలు. దేశంలో సగటు కార్పొరేట్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగి జీతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆదిత్య ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ‘ఇక్కడ వేలాది మంది చదువుకున్న యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కానీ సరైన నైపుణ్యం ఉంటే ఆదాయానికి కొరత లేదు’ అని పేర్కొన్నాడు. ఈ వ్యవహారం ద్వారా తాను ఒక గొప్ప విషయాన్ని గ్రహించానని ఆదిత్య రాసుకొచ్చాడు. ‘ఈ రోజు ఒక విషయం స్పష్టమైంది. ఏ పనీ చిన్నది కాదు. నైపుణ్యం, స్థిరత్వం, కష్టపడే తత్వం ఎప్పుడూ సరైన ఫలితాన్ని ఇస్తాయి’ అని అతను స్పష్టం చేశాడు.కెరీర్ వృద్ధి వర్సెస్ శారీరక శ్రమఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దీనిపై నెటిజన్లు భిన్నమైన విశ్లేషణలు చేస్తున్నారు. ‘డిగ్రీలు లేకపోయినా ప్రాక్టికల్ నైపుణ్యాలతో స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని నిరూపితమైంది’ అని కొందరంటున్నారు. ‘దేశంలో పట్టభద్రులైన యువత ఉద్యోగాల కోసం అల్లాడుతున్న వేళ ఇదొక ప్రత్యామ్నాయం’ అని కొందరు చెబుతున్నారు. డిగ్రీలు పూర్తి చేసినా అర్థవంతమైన ఉపాధి దొరకని దేశీయ ఉద్యోగ సంక్షోభాన్ని ఈ ఉదంతం ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.విజయానికి కొలమానం ఏది?ఈ వైరల్ కథనం మారుతున్న భారతదేశ శ్రామిక శక్తి వాస్తవ రూపానికి అద్దం పడుతోంది. విజయాన్ని కేవలం నెలవారీ జీతం అంకెలతోనే కొలవాలా? లేక భవిష్యత్తు వృద్ధి, ఉద్యోగ భద్రత, జీవన నాణ్యత ఆధారంగా అంచనా వేయాలా? అనే పెద్ద ప్రశ్నను ఇది సమాజం ముందుంచింది. ఏదేమైనా, విద్యావంతుల్లో పెరుగుతున్న నిరుద్యోగానికి, నైపుణ్య ఆధారిత పనులకు ఉన్న డిమాండ్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్
ఫ్యాషన్ ప్రపంచంలో అంబానీ వారసురాలు, వ్యాపారవేత్త ఇషా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ స్టైల్ను చాటుకున్నారు. ఆధునిక హంగులతో వింటేజ్ గ్లామర్ను ప్రదర్శిస్తూ, కార్ల్ లాగర్ఫెల్డ్ 1996 కలెక్షన్కు చెందిన అరుదైన ఆర్కైవల్ షానెల్ హాట్ కౌచర్ దుస్తులలో అద్భుతమైన లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు.వ్యాపార ప్రపంచం నుండి అంతర్జాతీయ కార్యక్రమాలలో రెడ్ కార్పెట్ దాకా, ఇషా అంబానీ శైలి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె తన విలక్షణమైన ఫ్యాషన్ అభిరుచికి మాత్రమే కాకుండా, తన రాజసం ఉట్టిపడే శైలికి కూడా ప్రసిద్ధి చెందారు. ఇటీవల, ఇషా అంబానీ ధరించిన ఒక దుస్తులు చూసి అందరూ 'వావ్' అన్నారు. తాజాగా 90వ దశకపు హాలీవుడ్ గ్లామర్ను గుర్తుచేసే ఒక అందమైన బంగారు రంగు వింటేజ్ దుస్తులను ధరించి మోడ్రన్ మహారాణిలా మెరిసారు.2026లో ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సరికొత్త మార్పు కనిపిస్తోంది. పాత తరం నాటి క్లాసిక్ డిజైన్లు (Vintage Couture) మళ్లీ రెడ్ కార్పెట్స్ పైకి వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఇషా అంబానీ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్ రూపొందించిన 'చానెల్ (Chanel) ఆటమ్/వింటర్ 1996 హాట్ కోట్యూర్' కలెక్షన్ నుండి గోల్డ్ కలర్ వింటేజ్ దుస్తులను ధరించారు.ఆమె హిప్స్ వరకు సాగే పూర్తి చేతుల బంగారు రంగు (Gold) 'బంధ్గలా' సూట్ను ధరించారు. నడుము భాగంలో రత్నాలతో పొదిగిన బెల్ట్తో దీనిని స్టైల్ చేశారు. బంగారు రంగు లేస్ క్విల్టెడ్ ప్యాంట్సూట్. దీనికి ఆమె టాబ్వింటేజ్ వారి సిగ్నేచర్ గ్రిపాయిక్స్ బెల్ట్ను జతచేసింది. ఈ బెల్ట్ ధర సుమారు రూ.31,56,800 ఉంటుంది ఈ లుక్లో దాని అద్భుతమైన ఎంబ్రాయిడరీ మరియు ఆకర్షణీయమైన డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ దుస్తులకు బంగారు రంగు డీటైలింగ్తో పాటు, రంగురంగుల రాళ్లను అమర్చారు. ఈ లుక్ కోసం ఆమె చానెల్ క్రూయిజ్ 2025/26 కలెక్షన్కు చెందిన స్వెడ్ మినీ పౌచ్, మనోలో బ్లాహ్నిక్ శాండల్స్, సెయింట్ లారెంట్ సన్గ్లాసెస్ను ధరించారు. మేకప్ విషయానికి వస్తే బేక్డ్ న్యూడ్-టోన్డ్ మేకప్, వింగ్డ్ ఐస్, లూజ్ హెయిర్తో సింపుల్గా కనిపించారు. 2011లో లేడీ గాగా 1996 నాటి అరుదైన షానెల్ గోల్డ్ ప్యాంట్సూట్ను ధరించారు. అంతేనా సెయింట్ లారెంట్ వారి SL M161 సన్గ్లాసెస్ మరో ప్రత్యేకత. వీటి ఖరీదు సుమారు దాదాపు రూ. 32,000 ఉంటుందని అంచనా. షానెల్ బ్రాండ్కు చెందిన క్రూజ్ 2025/26 కలెక్షన్లోని ఒక స్టైలిష్ స్వెడ్ మినీ పౌచ్ను ధరించారు. తన లుక్ను పూర్తి చేయడానికి, ఆమె లగ్జరీ బ్రాండ్ మనోలో బ్లానిక్కు చెందిన కల్లాస్లీ 90 లెదర్ స్లింగ్బ్యాక్ శాండల్స్ను ధరించారు. సుమారు రూ. 1,29,156 ఖరీదు చేసే ఈ స్టైలిష్ హీల్స్, ఆమె మొత్తం లుక్కు మరింత రాజసం ఉట్టిపడేలా చేశాయి.రాజసం ఉట్టిపడే, ఆకర్షణీయమైన లుక్ను చాలా హుందాగా తీర్చిదిద్దుకోవడంతోపాటు, తన మొత్తం లుక్కు మరింత క్లాసీ లుక్ను జోడించారు. ఇషా తన గ్లామరస్ దుస్తులకు తగ్గట్టుగాఎంచుకున్న తేలికపాటి మేకప్ ఆమె లుక్కు చక్కగా సరిపోయింది. ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset) -
వైట్-కాలర్ ఉద్యోగాలకు ఏఐ ఎసరు
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు కేవలం శారీరక శ్రమతో కూడిన పనులకే పరిమితమవుతుందని భావించిన ఆటోమేషన్ ఇప్పుడు ఏకంగా మేధోసంపత్తితో కూడిన వైట్-కాలర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. రాబోయే 12 నుంచి 18 నెలల్లోనే కార్పొరేట్ ప్రపంచంలో అకౌంటెంట్లు, న్యాయవాదులు, మార్కెటింగ్ నిపుణుల ఉద్యోగాలు కనుమరుగయ్యే లేదా పూర్తిగా ఆటోమేట్ అయ్యే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ డివిజన్ హెడ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరిక చేశారు.మానవ మేధస్సుకు సవాల్గతంలో ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడీ వంటి టెక్ దిగ్గజాలు ఊహించిన పరిణామాలనే సులేమాన్ తాజా వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. ప్రస్తుతం మానవులు మాత్రమే చేయగలరని భావిస్తున్న అత్యంత సంక్లిష్టమైన వైట్-కాలర్ విధులను 2027 సంవత్సరానికి ముందే ఏఐ చేజిక్కించుకోనుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభావితమయ్యే రంగాలు..అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగంలో లెక్కల విశ్లేషణ, ఆడిటింగ్ ప్రక్రియలు పూర్తిగా ఆటోమేట్ అవుతాయి.లీగల్ వర్క్ (న్యాయ విభాగం)లో కేసుల డాక్యుమెంటేషన్, లీగల్ రీసెర్చ్లను ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తుంది.మార్కెటింగ్, కంటెంట్పరంగా వినియోగదారుల ట్రెండ్స్ గుర్తించడం ఏఐ చేతుల్లోకి వెళ్తుంది.ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో వర్క్ఫ్లోల సమన్వయం, ప్రణాళికల అమలు మానవ ప్రమేయం లేకుండానే సాగుతుంది.ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తమ రోజువారీ కోడింగ్ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఏఐ అసిస్టెంట్లను విస్తృతంగా వాడుతున్నారని, త్వరలోనే కంప్యూటింగ్ సామర్థ్యం పెరిగి మెజారిటీ మానవ ప్రోగ్రామర్ల కంటే ఏఐ మోడల్స్ అత్యుత్తమ కోడింగ్ చేయగలవని ఆయన విశ్లేషించారు.సహాయకారి నుంచి ప్రత్యామ్నాయంగా!ప్రస్తుత తరుణంలో ఏఐ కేవలం మనుషుల పనిభారాన్ని తగ్గించే ఒక ఉత్పాదకత సాధనంలాగా మాత్రమే కనిపిస్తోంది. కానీ, ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. కేవలం సహాయం చేసే స్థాయి నుంచి మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేసే దిశగా సాంకేతికత పరిణామం చెందుతోందని సులేమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.పరిష్కారం ఏంటి?మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ఇచ్చిన ఈ హెచ్చరిక కేవలం ఊహాజనితం కాదు, ఇది పరిశ్రమ వర్గాలకు ఒక మేల్కొలుపు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన నైపుణ్యాలను నిరంతరం అప్గ్రేడ్ చేసుకోకపోతే వైట్-కాలర్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
ఆరంభంలో నష్టాలు.. ముగింపులో లాభాలు!
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మే 18) ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో కుప్పకూలిన సూచీలు ద్వితీయార్థంలో దేశీయ కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,043 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైనప్పటికీ ముగింపు సమయానికి నష్టాలన్నింటినీ పూడ్చుకుని స్వల్ప లాభాల్లోకి చేరుకున్నాయి. చివరకు నిఫ్టీ 50 సూచీ 6 పాయింట్లు పుంజుకొని 23,649 వద్ద, సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 75,315 వద్ద స్థిరపడ్డాయి.ఆరంభ పతనానికి కారణాలుఅమెరికా-ఇరాన్ మధ్య సరికొత్తగా రేగిన ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్లో డ్రోన్ దాడుల వార్తలు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. ఇది గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్ను దెబ్బతీసింది.అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్కు 111 డాలర్ల మార్కును దాటింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున క్రూడాయిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను, కరెంట్ అకౌంట్ లోటు ఆందోళనలను పెంచింది.అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 4.60% దాటడంతో భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో 96.2 మార్కుకు బలహీనపడింది. ఇది విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా నష్టపోగా నేడు ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ, హ్యాంగ్ సెంగ్ సైతం నష్టాల్లో ట్రేడ్ అవ్వడం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.ముగింపులో రికవరీకి కారణాలురూపాయి బలహీనపడటం ఐటీ, ఎగుమతి ఆధారిత రంగానికి లాభసాటిగా మారడంతో ఇన్వెస్టర్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్ల వైపు మొగ్గు చూపారు.టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షేరు నేడు సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను దాటేసి రూ.11.80 లక్షల కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ క్యాప్ గల కంపెనీగా నిలిచింది. ఈ స్టాక్ ర్యాలీలో కీలక పాత్ర పోషించింది.దేశీయంగా మార్చి త్రైమాసికం (2026 క్యూ4) ఆర్థిక ఫలితాల సీజన్ నడుస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో 10% వృద్ధి నమోదు చేయడం, టాటా స్టీల్ నికర లాభం రెండింతలు పెరగడం వంటి అంశాలు మార్కెట్కు స్థిరత్వాన్ని ఇచ్చాయి.నిఫ్టీ 23,300 స్థాయికి పడిపోయిన తరుణంలో విలువ ఆధారిత కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దిగువ స్థాయిల వద్ద దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయడంతోపాటు ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో షార్ట్ కవరింగ్ జరగడం వల్ల సూచీలు రికవరీ అయ్యాయి.ప్రస్తుతానికి దేశీయ ఆర్థిక మూలాధారాలు బలంగా ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల గమనం రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
తాజాగా నెదర్లాండ్స్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక స్థితిగతులపై తీవ్ర చర్చకు దారితీశాయి. ‘సామూహిక పేదరికం తిరిగి రావడం’, ‘విపత్తుల దశాబ్దం’ (డికేడ్ ఆఫ్ డిజాస్టర్స్) అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముందే దేశీయంగా చమురు, బంగారం దిగుమతులను తగ్గించుకోవాలని, విదేశీ వస్తువులపై ఆధారపడటం మానుకోవాలని ఆయన భారతీయులకు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిపై కొంతమంది నిపుణుల మనోగతం కింది విధంగా ఉంది.ఈ వ్యాఖ్యలు వినగానే మనకు పాత రోజులు గుర్తొస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఒక రకమైన సంక్షోభంలోకి ప్రవేశించినప్పుడల్లా.. ప్రధానులు దేశభక్తిని మేల్కొలిపి విదేశీయుల నుంచి కొనుగోళ్లు తగ్గించుకోమని కోరడం పరిపాటిగా మారింది.70 ఏళ్లలో 9 సార్లు!మన ఆర్థిక చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. 1955, 1965, 1974, 1980, 1991, 1998, 2012, 2020.. ఇప్పుడు 2026. గడిచిన 70 ఏళ్లలో ఏకంగా తొమ్మిది సార్లు దేశం ఇదే తరహా డాలర్ల కొరతను, చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశీయంగా ఉన్న సప్లై గ్యాప్ (సరఫరా లోటు)ను భర్తీ చేయడానికి అవసరమైన డాలర్లు మన వద్ద లేకపోవడమే వీటికి మూలకారణం.1972 వరకు ప్రధాన లోటు ఆహార ధాన్యాల్లో ఉండేది. క్రమంలో దాన్ని అధిగమించే స్థాయికి చేరుకోగలిగాం. 1980 తర్వాత ఈ లోటు ఇంధనం (చమురు, గ్యాస్) రూపంలోకి మారింది. మన పొరుగు దేశమైన చైనాకు కూడా ఈ రెండు లోటూ ఉన్నాయి. కానీ, వారు ఈ డాలర్ల సంక్షోభాన్ని మనకంటే మెరుగ్గా నిర్వహించగలిగారు. ఈ పరిస్థితిలో.. మన దేశంలో ఈ సరఫరా లోటు దశాబ్దాలుగా ఎందుకు కొనసాగుతోంది? మనం ఈ డాలర్ల కొరతను ఎందుకు అధిగమించలేకపోతున్నాం? అనే కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.హరిత విప్లవం విజయం.. పారిశ్రామిక రంగంలో ఎందుకు సాధ్యం కాలేదు?వ్యవసాయ రంగంలో ఉన్న లోటును మనం హరిత విప్లవం ద్వారా విజయవంతంగా అధిగమించాం. స్వయంసమృద్ధిని సాధించాం కాబట్టే, 1979లో వచ్చిన తీవ్ర కరువు ప్రభావం 1980 నాటికి దేశంపై పడకుండా నిలిచింది. కానీ, ఇంధన లోటును మాత్రం గత 45 ఏళ్లుగా మనం పరిష్కరించలేకపోయాం. చమురు కొనడానికి డాలర్లు కావాలి, ఆ డాలర్లు రావాలంటే ఎగుమతులు పెరగాలి. కానీ మన ఎగుమతులు ఎప్పుడూ అంతంత మాత్రమే.ఇంధన విధానంలో లోపంమన దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ పర్యావరణ కారణాల వల్ల దాన్ని పక్కనబెట్టి చమురు, గ్యాస్ వంటి ఇతర హైడ్రోకార్బన్లపై ఆధారపడ్డాం. ఇది మన ఇంధన సంక్షోభాన్ని మరింత పెంచింది. దీనికంటే ముఖ్యమైన మరో కారణం.. గత 60 ఏళ్లుగా మన పాలకులు అనుసరించిన అస్తవ్యస్త పారిశ్రామిక విధానాలు. పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాల్సింది పోయి, వాటిని భారీగా దిగుమతి చేసుకునే స్థితికి చేరుకున్నాం. ఫలితంగా డాలర్ల సంపాదన తగ్గిపోయింది.సంక్షోభం రావడం.. మళ్లీ మర్చిపోవడం!ప్రతిసారీ సంక్షోభం తీవ్రమైనప్పుడు ప్రభుత్వం డాలర్లను పొదుపు చేయమని చెప్తుంది. ఆ సమయానికి ఆ నిర్ణయం సరైనదే అనిపించినా దీర్ఘకాలికంగా చూస్తే ఇది అత్యంత హాస్యాస్పదమైన వ్యూహం. సంక్షోభం తొలిగిపోగానే మనం ఆ సమస్యను పూర్తిగా మర్చిపోయి విజయం సాధించామంటూ వీధుల్లో వేడుకలు చేసుకుంటాం. మళ్లీ కొన్నాళ్లకు అదే తప్పు చేస్తాం. ఈ దుస్థితి చూసి చాలా మంది ఆర్థికవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.ఈ సమస్య పరిష్కారానికి గతంలో డజనుకు పైగా ఉన్నత స్థాయి కమిటీలు వేయడంతో చాలా సిఫార్సులు వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో సాధించింది శూన్యం. దీనికి ఎవరిని నిందించాలి? రాజకీయ నాయకులనా, బ్యూరోక్రాట్లనా, పారిశ్రామికవేత్తలనా, గత వ్యూహకర్తలనా? సమాధానం ఒక్కటే.. వ్యవస్థలో అందరూ భాగస్వాములే అయినప్పుడు ఎవరి ఒక్కరినో బాధ్యులను చేయలేం.ప్రజాస్వామ్యం వర్సెస్ ఆర్థిక వృద్ధిఆర్థికవేత్త వాల్టర్ రోస్టో 1960లో తన ‘స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్’ పుస్తకంలో రాజకీయ వ్యవస్థల గురించి ప్రస్తావించలేదు. కానీ, రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు ఆర్థిక ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. చరిత్రను పరిశీలిస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. దశాబ్దాల తరబడి అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును మూటగట్టుకున్న దేశాల్లో ప్రజాస్వామ్య పద్ధతులు ఉండవు. అవి ప్రజాస్వామ్య దేశాలుగా మారిన మరుక్షణమే వాటి వృద్ధి రేటు మందగిస్తుంది.ఆర్థిక నమూనాప్రధాన లక్షణంవృద్ధి రేటుహక్కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థప్రజల హక్కులు, ఉచితాలు, రాయితీలకు ప్రాధాన్యతతక్కువ, అస్థిరమైన వృద్ధిబాధ్యతల ఆధారిత ఆర్థిక వ్యవస్థజాతీయ ప్రయోజనాలు, ఉత్పత్తి, క్రమశిక్షణకు ప్రాధాన్యతస్థిరమైన, అత్యధిక వృద్ధిభారతదేశం ఎప్పటికీ ‘హక్కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ’ గానే కొనసాగుతుంది. అలాంటప్పుడు గత 70 ఏళ్ల తప్పులను పునరావృతం చేయకుండా ఎలా ఉండాలన్నదే మన ముందున్న ప్రశ్న.ఆలోచన విధానం మారకపోతే..ఈ గందరగోళాన్ని ఎలా చక్కదిద్దాలో అందరికీ తెలుసు. గత నాలుగు దశాబ్దాలుగా పరిష్కారాలు మన కళ్లముందే ఉన్నాయి. కానీ వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేసి, మెజారిటీ సూచనలను పక్కనబెట్టాం. ఒకేసారి డజన్ల కొద్దీ భిన్నమైన లక్ష్యాలను పెట్టుకుని అన్నింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. కుక్క తన తోకను తాను పట్టుకోవడానికి తిరిగినట్లు ఉంది. శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ.ప్రస్తుత దశాబ్దం విపత్తులతోనే సాగుతోంది, మున్ముందు మరిన్ని సవాళ్లు రావచ్చు. కానీ, మన పాలకుల ఆలోచనా విధానం, ఆర్థిక విధానాలు సరైన దిశలో ఉండి ఉంటే.. ఈ విపత్తులు దేశాన్ని సామూహిక పేదరికం వైపు నెట్టేంత ప్రమాదకరంగా మారేవి కావు. ఇప్పటికైనా తాత్కాలిక ఉపశమన చర్యలు పక్కనపెట్టి ఎగుమతులను పెంచే దీర్ఘకాలిక పారిశ్రామిక, ఇంధన సంస్కరణలపై దృష్టి పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో డాలర్ మన ఆర్థిక వ్యవస్థకు ఒక శాపంగానే మిగిలిపోతుంది.ఇదీ చదవండి: రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి! -
మే చివరినాటికి ‘కేఫే-3’ నిబంధనలు
దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని మలుపు తిప్పే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేపే) ఫేజ్-3 నిబంధనల నోటిఫికేషన్కు సర్వం సిద్ధమైంది. ఇథనాల్ రోడ్మ్యాప్కు అనుగుణంగా చివరి నిమిషంలో కొన్ని సాంకేతిక మార్పులు (E25 రీకాలిబ్రేషన్) జరిగినప్పటికీ ఈ నెల చివరి నాటికే తుది నిబంధనలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) తుది ఫార్ములాను సిద్ధం చేస్తోంది.ప్రధాని కార్యాలయం పర్యవేక్షణ..భారతదేశ ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించడం, పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నేరుగా పర్యవేక్షిస్తుండటం దీని ప్రాధాన్యతను తెలియజేస్తోంది.కేఫే నిబంధనల ఉద్దేశంవాహనాల ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. సరళంగా చెప్పాలంటే ఒక వాహన తయారీ సంస్థ (ఉదాహరణకు మారుతి సుజుకి లేదా టాటా మోటార్స్) ఒక ఆర్థిక సంవత్సరంలో విక్రయించే అన్ని కార్ల సగటు ఇంధన వినియోగం, ఉద్గారాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి.E20 నుంచి E25/E27 వైపు..ఇథనాల్ బ్లెండింగ్ను E20 (20% ఇథనాల్) నుంచి E25/E27 (25%-27% ఇథనాల్) స్థాయికి వేగంగా తీసుకెళ్లాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఫార్ములాను మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మార్పుల కేఫే-3 లక్ష్యాల్లో ఎటువంటి మార్పు ఉండదని కేవలం ఇంధన రసాయన లక్షణాల ఆధారంగా లెక్కించే పద్ధతిని మాత్రమే సవరించినట్లు నిపుణులు స్పష్టం చేశారు. దీనివల్ల ఇథనాల్ వాడకం వల్ల వాహన సామర్థ్య అంచనాలో ఆటోమొబైల్ కంపెనీలకు నష్టం జరగదు. ‘చర్చలన్నీ పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకల్లా తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వాహన తయారీదారులు తమ భవిష్యత్తు ఇంజిన్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది’ అని ఈ చర్చల్లో పాల్గొన్న ఒక సీనియర్ ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.ఆటోమొబైల్ కంపెనీలకు 11 నెలల గడువుఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి అమలులోకి రానున్నాయి. మే చివరినాటికి నోటిఫికేషన్ వస్తే వాహన తయారీ కంపెనీలకు సన్నద్ధమవడానికి కేవలం 11 నెలల సమయం మాత్రమే మిగులుతుంది. ఈ నిబంధనల ఆధారంగానే ఈవీలు, హైబ్రిడ్, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఇచ్చే కంప్లయన్స్ క్రెడిట్లను లెక్కిస్తారు. ఏ సాంకేతికత కలిగిన వాహనాల తయారీ చౌకగా మారుతుందో, ఏవి ఖరీదవుతాయో ఈ నిబంధనలే డిసైడ్ చేయనున్నాయి.స్పష్టత వస్తేనే పెట్టుబడులువాహన తయారీదారులు ఇప్పటికే ఆర్థిక సంవత్సరం 2028కి సంబంధించిన ప్రొడక్ట్ ప్లానింగ్లో ఉన్నారు. నిబంధనలపై స్పష్టత వస్తేనే సప్లయర్లతో ఒప్పందాలు, ప్లాట్ఫామ్ల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడం కంపెనీలకు సాధ్యమవుతుంది. రాబోయే దశాబ్ద కాలంలో భారత ఆటోమొబైల్ రంగం ఏ దిశగా సాగాలో నిర్దేశించే ఈ రూల్బుక్ కోసం పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి! -
భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్లో తేడా!
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ మహిళ శారికా యాదవ్.. షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె భారతదేశం vs అమెరికా కార్పొరేట్ పని సంస్కృతుల మధ్య ఉన్న తేడాలను వివరించింది.అమెరికాలో పనిచేసే ఉద్యోగులు తమ పిల్లలను స్కూల్కు తీసుకెళ్లడం, తీసుకురావడం, డాక్టర్ అపాయింట్మెంట్లు వంటి వ్యక్తిగత పనుల కోసం.. ముందుగానే తమ ఆఫీస్ క్యాలెండర్లో సమయం బ్లాక్ చేసుకుంటారు. ఆ సమయంలో ఇతరులు మీటింగ్స్ పెట్టకుండా గౌరవిస్తారు. ఒకవేళ మీటింగ్ అవసరం వచ్చినా, ముందుగా ఉద్యోగిని అడిగి సమయం ఖరారు చేస్తారు. అక్కడ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం కంపెనీల పని సంస్కృతిలో భాగంగా మారిందని శారికా యాదవ్ పేర్కొన్నారు.భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక్కడ సెలవు తీసుకోవాలంటే.. ఉద్యోగులు మేనేజర్లకు పూర్తి వివరణ ఇవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. అనేక కంపెనీల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, వ్యక్తిగత అవసరాలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చాలా మంది తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. కొందరు అమెరికా వర్క్ కల్చర్లో వర్క్-లైఫ్ బ్యాలెన్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అంగీకరించగా, మరికొందరు ప్రతి దేశానికి ప్రత్యేకమైన పని విధానం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇంకొందరు భారతదేశంలో ఉద్యోగులపై ఉండే ఒత్తిడి కారణంగా చాలామంది స్వంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Sarika Yadav | Indian Blogger in America (@sarika_in_america) -
యువత కోసం.. సరికొత్త బీమా పాలసీ
నేటి తరం యువత మారుతున్న జీవనశైలి, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్టివ్ యువ’ పేరుతో సరికొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశపెట్టింది. కేవలం ఆసుపత్రి ఖర్చులకే పరిమితం కాకుండా, పాలసీదారులు నిత్యం ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ ప్లాన్ ప్రత్యేకత.ప్రతిరోజూ కనీసం 10 వేల అడుగులు నడవడం లేదా ఒకే వ్యాయామ సెషన్లో 300 కేలరీలు ఖర్చు చేయడం ద్వారా వినియోగదారులు రివార్డులు పొందవచ్చు. మెరుగైన ‘హెల్తీ హార్ట్ స్కోర్’ కొనసాగించిన వారు తమ వార్షిక ప్రీమియంలో 100 శాతం వరకు తిరిగి పొందే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. బీమాను కేవలం అత్యవసర వైద్య సాయంలా కాకుండా, రోజువారీ జీవితంలో ఒక భాగంగా మార్చేలా ‘యాక్టివ్ యువ’ను రూపొందించినట్లు కంపెనీ సీఈవో మయాంక్ బత్వాల్ తెలిపారు. -
ఐటీఆర్ ఫైలింగ్.. జూలై 31 లాస్ట్ డేట్!
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మీరు వేయవలసిన ఆదాయపు రిటర్నులలో రెండు ఫారాలు ఉంటాయి. ఒకటి నంబర్ 1, రెండోది నంబర్ 4. వీటిని దాఖలు చేయడానికి డిపార్టుమెంటు వారి తరఫున ప్లాట్ఫాం రెడీ అయ్యింది. ఇందుకు అవసరమైన యుటిలిటీలను, సాధనాలను వారు సన్నద్ధం చేశారు. ఈ వారం ఐటీఆర్1 గురించి తెలుసుకుందాం. దీన్నే సహజ్ అని కూడా అంటారు. మీరు ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా వేయొచ్చు.ఎవరు దాఖలు చేయొచ్చు..కేవలం రెసిడెంట్ వ్యక్తులైన వారు మాత్రమే ఈ ఫారం ఐటీఆర్–1 లేదా సహజ్ వేయగలరు. ఇతరులెవ్వరూ ఈ ఫారంను వేయడానికి లేదు. ఎంత ఆదాయం వచ్చే వారు వేయొచ్చు.. ఈ కింది మార్గాల్లో ఆదాయాలు వచ్చే వారు ఈ ఫారం వాడాలి. పెన్షన్జీతాలుఒకటి/రెండు ఇళ్ల మీద ఇంటద్దె వచ్చే వాళ్లుఇతర ఆదాయంవ్యవసాయ ఆదాయం రూ. 5000 లోపు ఉన్న వారుఇతర షరతులు..మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటిన వారు ఈ ఫారం కింద ఆదాయం డిక్లేర్ చేయకూడదు. భార్య ఆదాయం, పిల్లల ఆదాయం, భర్త కేసులో కలిపే సందర్భం ఏర్పడితే, రూ. 50,00,000 దాటనంత వరకు ఈ ఫారం వాడొచ్చు. రూ. 1,25,000 లోపల లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే, అటువంటి వారు ఫారం 1 వాడొచ్చు.ఏయే కాగితాలు ఉండాలి..పాత చట్టం ప్రకారం 16, 16ఎ, ప్రీమియం మొదలైన వాటి రశీదులు, అద్దె రశీదులు, మొదలైనవి మీ ఫైల్లో ఉండాలి. రిటర్నుతో పాటు జతపరచనవసరం లేదు కానీ రెడీగా ఉంచుకోండి.ఎవరు ఫారం 1 దాఖలు చేయకూడదు..మీ మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితే.వ్యవసాయం మీద నికర ఆదాయం రూ. 5,000 దాటితే.లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,25,000 దాటితే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎలాగు రూ. 1,25,000 వరకు మినహాయింపు ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,250,000 వరకు పన్ను భారం ఉండదు. వృత్తి మీద ఆదాయం ఉన్నవారు.వ్యాపారం మీద ఆదాయం ఉన్నవారు.ఒకటి, రెండు దాటి .. అంటే మూడో ఇంటి మీద ఆదాయం వచ్చే వాళ్లు వేయకూడదు.ఏదైనా కంపెనీలో డైరెక్టర్ అయితేఅన్లిస్టెడ్ ఈక్విటీ షేర్ల మీద ఆదాయం ఉంటేవిదేశాల్లో ఆస్తులున్నా, వాటి మీద హక్కులున్నామీరు నాన్ రెసిడెంటు అయినావిదేశాల నుంచి ఆదాయం ఉన్నా194ఎన్ (పాత చట్టం) ప్రకారం టీడీఎస్ రికవరీ అయితే, అతి పెద్ద నగదు విత్డ్రాయల్స్ మీదఉద్యోగస్తుల స్టాక్ / షేర్ల మీద ఎటువంటి చెల్లింపులు, రికవరీలు ఉన్నాగత సంవత్సరపు సర్దుబాటు నష్టాలున్నాఏ ఆదాయం నుంచైనా సర్దుబాటు చేయాల్సిన నష్టాలున్నాచివరగా..ఫైలింగ్ చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. ఆన్లైన్లో వేయొచ్చు లేదా ఎక్సెల్లాంటి యుటిలిటీ ద్వారా డౌన్లోడ్ చేసి దాఖలు చేసుకోవచ్చు. ఎన్నెన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయి. మీరే స్వయంగా వేయొచ్చు లేదా వృత్తి నిపుణులు ఉన్నారు. సమాచారం సరైనది. సమగ్రమైనది. సంపూర్ణమైనది. రెడీగా ఉంటే సరైనదే, సమగ్రంగా, సంపూర్ణంగా, రెడీగా ఉంటే సులభతరంగా వేయొచ్చు. ఫారంలు చాలా స్నేహపూర్వకంగానే ఉంటాయి. -
తగ్గిన బంగారం, పెరిగిన వెండి: కొత్త రేట్లు ఇవే!
బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు పతనమైంది. అయితే వెండి రేటు మాత్రం రూ.10 వేలు పెరగడంతో.. కేజీ సిల్వర్ రేటు రూ. మూడు లక్షలకు చేరుకుంది. ఇక్కడ లేటెస్ట్ పసిడి ధరలు ఎక్కడ, ఎలా.. ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం. -
ద్రవ్యోల్బణం తప్పదా.. EMIలు పెరుగుతాయా?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా దెబ్బతినడంతో.. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులు కేవలం విదేశీ మార్కెట్లకే పరిమితం కాకుండా, భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈఎంఐలు కట్టేవారిపై భారం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇరాన్ సంక్షోభం కారణంగా.. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. డిమాండ్ పెరగడం.. సరఫరా తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగం దిగుమతులపై ఆధారపడటంతో.. ఈ ధరల పెరుగుదల నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI)పై ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. ఇలాంటి సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచే అవకాశం ఉంది.నెలవారీ బడ్జెట్పై ప్రభావం!ఆర్బీఐ రేపో రేటును పెంచితే.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారి ఈఎంలు పెరుగుతాయి. ఇది వారి నెలవారీ బడ్జెట్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ఒక వైపు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుండగా, మరోవైపు దేశీయ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే పరిస్థితిని తీసుకొస్తోంది. ఇంధన సరఫరా త్వరగా స్థిరపడకపోతే.. రాబోయే దీపావళి నాటికి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? -
నష్టాల బాటలో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 802.74 పాయింట్లు లేదా 1.07 శాతం నష్టంతో 74,435.25 వద్ద, నిఫ్టీ 242.45 పాయింట్లు లేదా 1.03 శాతం నష్టంతో 23,401.05 వద్ద కొనసాగుతున్నాయి.రీజెన్సీ సిరామిక్స్ లిమిటెడ్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, బీఎన్ ఆగ్రోకెమ్ లిమిటెడ్, సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ (ఇండియా) లిమిటెడ్, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హింద్ రెక్టిఫయర్స్ లిమిటెడ్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్, బైడ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఏథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
భారత్ వృద్ధి.. పెట్టుబడి విధానాల్లో మార్పు!
ఆర్థిక సంస్కరణల అనంతరం దేశీయంగా చాలా కాలం పాటు ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్ మార్కెట్లు వృద్ధి చెందినప్పటికీ, అవి ఒకదానితో మరొకటి అనుసంధానమై ముందుకు సాగలేదు. ఆర్థిక విస్తరణపై ప్రభుత్వ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ రంగానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. క్యాపిటల్ మార్కెట్లు అప్పుడప్పుడు మాత్రమే తమ ఉనికిని చాటుకునేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది.ఆర్థిక ప్రగతి, క్యాపిటల్ మార్కెట్లు వేర్వేరుగా కాకుండా ఒకదానికొకటి దన్నుగా ఉండే ఏకీకృత వ్యవస్థగా భారత్ ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఈ మార్పు తాత్కాలికమైనది కాదు..నిర్మాణాత్మకమైనది. భారత్ వృద్ధి గాథలో పాలుపంచుకోవాలనుకునే మదుపర్లకు ఇది ఎంతో కీలకంగా ఉండనుంది.పెట్టుబడి విధానాల్లో నిర్మాణాత్మక మార్పుభారతీయులు పొదుపు చేయడంలో ముందుంటారు. అయితే, చారిత్రకంగా మన దేశంలోని గృహ పొదుపు మొత్తాలు ఎక్కువగా రియల్ ఎస్టేట్, బంగారం లేదా బ్యాంక్ డిపాజిట్ల వంటి భౌతిక ఆస్తులలోకే వెళ్లేవి. ఇవి వ్యక్తిగతంగా భద్రతను ఇచ్చినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలకు అందవలసిన దీర్ఘకాలిక మూలధన లభ్యత పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడది మారుతోంది.గృహాల పొదుపు మొత్తాలు క్రమంగా ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్ల వంటి మార్కెట్ ఆధారిత సాధనాల వైపు మళ్లుతున్నాయి. మార్చి 2026 నాటికి, దేశీయంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) పరిమాణం రూ. 79.5 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఈ రంగం రెండంకెల వార్షిక వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది ఆషామాషీ మార్పు కాదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల ప్రజల భాగస్వామ్యం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి.డిజిటలైజేషన్ దన్నుడిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దన్నుతోనే క్యాపిటల్ మార్కెట్లు అందరికీ అందుబాటులోకి రావడం సాధ్యమవుతోంది. 2026 మార్చి ఆఖరు నాటికి 144 కోట్లకు పైగా ఆధార్ ఐడీలు, 57.7 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు, 125 కోట్ల మంది మొబైల్ యూజర్లు, రోజువారీ రూ. 95,000 కోట్లకు పైగా విలువ చేసే లావాదేవీల పరిమాణంతో యూపీఐ వ్యవస్థలాంటివి భారత డిజిటల్ విప్లవానికి పునాది వేశాయి.ఆధార్ ఆధారిత ఈకేవైసీ, యూపీఐ చెల్లింపులు, కాగితరహిత పద్ధతుల వల్ల పెట్టుబడి పెట్టడానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయాయి. సామాన్యుల భాగస్వామ్యం పెరగడమే కాకుండా, మధ్యవర్తులపరమైన ఖర్చులు తగ్గి మార్కెట్లు మరింత అందుబాటులోకి వచ్చాయి.క్యాపిటల్ మార్కెట్ సంస్థల ప్రాముఖ్యతఈ మార్పులో క్యాపిటల్ మార్కెట్ వ్యవస్థ, అంటే, స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, రిజిస్ట్రార్లు, బ్రోకర్లు, వెల్త్ ప్లాట్ఫామ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంస్థలు కేవలం మార్కెట్ను అందుబాటులోకి తేవడమే కాకుండా, పారదర్శకతను పెంపొందించడానికి, నిరంతర వృద్ధికి కూడా దోహదపడుతున్నాయి. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లలో కనిపిస్తున్న వృద్ధికి, రిటైల్ మదుపర్ల భాగస్వామ్యానికి ఇవే ప్రధాన ఆధారం. ఇలాంటి సంస్థల షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మదుపర్లు ప్రయోజనం పొందవచ్చు.క్యాపిటల్ మార్కెట్లలో భాగస్వామ్యం ఉండే సంస్థలతో రూపొందిన ఇండెక్స్లలో ఇన్వెస్ట్ చేయడం ఇందుకు ఉపయోగపడే ఒకానొక మార్గం. ట్రేడింగ్ పరిమాణం పెరగడం వల్ల లాభపడే ఎక్సేంజీలు, కొత్త డీమ్యాట్ ఖాతాల వల్ల లబ్ధి పొందే డిపాజిటరీలు, నిర్వహణలోని ఆస్తుల పెరుగుదలతో ఆదాయం పొందే అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు, వ్యవస్థకు అడ్మినిస్ట్రేషన్పరంగా కీలక వెన్నెముకగా వ్యవహరించే సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థలు ఈ ఇండెక్స్లలో ఉంటాయి. మార్కెట్ భాగస్వామ్యం పెరిగే కొద్దీ ఈ వ్యాపారాలు కూడా సహజంగానే వృద్ధి చెందుతాయి.మదుపర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలు..ఆదాయాలు పెరుగుతూ, పొదుపు, పెట్టుబడులు పెరిగే కొద్దీ దేశీ క్యాపిటల్ మార్కెట్లు, ఎకానమీతో పాటే మరింతగా వృద్ధి చెందుతాయి. ప్రైవేట్ రంగానికి, మౌలిక సదుపాయాలకు, ఆవిష్కరణలకు ఇవి నిధులు సమకూరుస్తాయి. క్యాపిటల్ మార్కెట్ ఆధారిత రంగాల్లో పెట్టుబడి పెట్టడం అంటే భారత భవిష్యత్తు వృద్ధిలో భాగస్వాములు కావడమే. దీర్ఘకాలికంగా ఈ రంగం ఇచ్చే ఫలితాలను అందుకోవడానికి ’ప్యాసివ్ స్ట్రాటజీ’ వంటి విధానాలను మదుపర్లు పరిశీలించవచ్చు. -
చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
భారతదేశం ఎదుగుదలకు తయారీ రంగం చాలా కీలకమని కేంద్రమంత్రులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ తయారీ రంగ వృద్ధి గురించి బిల్డింగ్ ఎనర్జీ సూపర్-ఇంటెలిజెన్స్ 'శుభమ్ మిశ్రా' ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.భారతదేశలో తయారీ రంగ అభివృద్ధిని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధి పెద్ద కంపెనీల రూపంలో కాకుండా.. చిన్న భాగాల తయారీ సంస్థల్లో, సరఫరా వ్యవస్థల్లో జరుగుతోంది. ఉదాహరణకు.. 2014లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు మాత్రమే. కానీ ఇప్పుడు దీని విలువ 115 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఇది భారత పరిశ్రమల వేగవంతమైన ఎదుగుదలకు నిదర్శనం అని శుభమ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.ఐఫోన్ తయారీలో భారత్యాపిల్ కంపెనీ సరఫరా వ్యవస్థలో.. భారతదేశం కీలక పాత్ర పోషించడం కూడా ఒక పెద్ద మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ఐఫోన్ తయారీలో భారతదేశం పాత్ర చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో గణనీయమైన శాతం భారత్లోనే తయారవుతోంది. ఇది భారతీయ పరిశ్రమల నైపుణ్యం పెరుగుతోందనడానికి ఒక ఉదాహరణ.మిశ్రా చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అసలు అభివృద్ధి చిన్న పరిశ్రమల పనితీరులో ఉంది. హోసూర్ వంటి ప్రాంతాల్లో చిన్న సంస్థలు అతి సూక్ష్మ ప్రమాణాలతో భాగాలను తయారు చేయడం నేర్చుకుంటున్నాయి. ఇలాంటి నైపుణ్యాలే ఒక దేశాన్ని పరిశ్రమల శక్తిగా మార్చుతాయి.చైనాలా భారత్భారతదేశాన్ని మిశ్రా ప్రారంభ దశలో ఉన్న చైనాతో పోల్చారు. చైనా ఒక్కసారిగా ప్రపంచ తయారీ కేంద్రంగా మారలేదు. 2003 నుంచి 2018 మధ్య నెమ్మదిగా, క్రమంగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో కూడా ప్రపంచం ''వాళ్లు కేవలం అసెంబ్లీ పని చేస్తున్నారు'' అని భావించింది. కానీ అదే చిన్న చిన్న పురోగతులు తరువాత చైనాను ప్రపంచ తయారీ శక్తిగా నిలబెట్టాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి దశలో ఉందని ఆయన సూచించారు.Very well said, Shubham. The real strength of manufacturing is never glamorous.It grows quietly in workshops, factory floors and industrial sheds, long before the world notices it in economic rankings or headlines.India’s manufacturing future won’t be built only by giant… https://t.co/2BblFgxVy6— anand mahindra (@anandmahindra) May 15, 2026దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. దేశ ఆర్థికాభివృద్ధి పెరగాలంటే, కేవలం కొన్ని పెద్ద కంపెనీల వల్ల మాత్రమే సాధ్యం కాదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs), ఫ్యాక్టరీలు, వర్క్షాప్లు, సరఫరా సంస్థల కలిస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.నిజమైన అభివృద్ధి..అనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం.. తయారీ రంగం బయటకు కనిపించేంత గొప్పగా ఉండదు. కానీ నిజమైన అభివృద్ధి అనేది ఫ్యాక్టరీలలో, యంత్రాల మధ్య, పరిశ్రమల షెడ్లలో జరుగుతుంది. చిన్న పరిశ్రమలు తమ పనిలో నాణ్యతను పెంచుకుంటూ.. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంటున్నాయి. ఇవే భవిష్యత్తులో భారతదేశాన్ని బలమైన దేశంగా నిలబెడతాయి.దేశం ఎదగాలంటే..దేశం ఎదగాలంటే.. ముఖ్యంగా MSMEsకు ప్రభుత్వ మద్దతు అవసరమని చెప్పారు. మంచి రహదారులు, ఇండస్ట్రియల్ పార్కులు, త్వరితగతిన అనుమతులు, తక్కువ నియంత్రణ సమస్యలు ఉంటే పరిశ్రమలు వేగంగా ఎదుగుతాయి. పెద్ద కంపెనీలకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వడం సరిపోదు. మధ్య తరహా సంస్థలకు సులభమైన వ్యాపార వాతావరణం కల్పించడం కూడా చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. -
పశ్చిమాసియా, క్రూడ్పై కన్ను!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే భారీగా ఎగబాకిన క్రూడ్ ధరలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మన సూచీలకు కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘తుపాను ముందు ప్రశాంతత’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్తో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు మొదలయ్యాయి. హార్మూజ్ జలసంధిలో అడ్డంకుల కారణంగా క్రూడాయిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 109 డాలర్లకు ఎగబాకింది. ఈ రెండు అంశాలపైనే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారిస్తారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు సెగ కారణంగా రోజుకో సరికొత్త కనిష్టాలకు పడిపోతున్న రూపాయి, మరోపక్క, ద్రవ్యల్బణం భారీగా పెరిగిపోవడం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ‘అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, క్రూడ్ ధరలపై దాని ప్రభావం, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా రిస్క్ సెంటిమెంట్ను మార్కెట్ వర్గాలు నిశింతంగా గమనిస్తాయి. సమీప కాలంలో మార్కెట్లకు ఇంధన ధరలు, రూపాయి కదలికలే కీలకం’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. భారీ ఒడిదుడుకులు... ‘ఇరాన్–అమెరికా ఉద్రిక్తలపైనే అందరి కళ్లూ ఉన్నాయి. దీనిపైనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆధారపడి ఉంది. ఈ నేథ్యంలో చర్చల పురోగతి, క్రూడ్ రేట్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చు’ అని ఎన్రిచ్ మనీ సీఈఓ ఆర్. పోన్ముడి పేర్కొన్నారు. రూపాయిపై ఫోకస్... యుద్ధ భయాలకు తోడు, పెట్రో ధరల పెంపు, ప్రధాని పొదుపు చర్యల ప్రభావంతో గతవారం రూపాయి మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. డాలరు మారకంలో ఏకంగా 96 స్థాయిని కూడా దాటేసి, కొత్త ఆల్టైమ్ కనిష్టానికి జారిపోయింది. క్రూడ్ ధరలు మరింత ఎగబాకితే రూపాయి క్షీణత కొనసాగవచ్చని, ఇది మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపుందని పోన్ముడి తెలిపారు. గణాంకాలు, ఫలితాలపైనా దృష్టి... అమెరికా, చైనా, భారత్లలో విడుదలయ్యే కీలక స్థూల ఆర్థిక గణంకాలు, అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశ వివరాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. క్యూ4 ఫలితాల సీజన్ చివరి దశ నేపథ్యంలో రంగాల వారీగా స్టాక్స్లో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. ఈ వారం ఐఓసీ, బీపీసీఎల్, గెయిల్, ఎన్టీపీసీ తదితర ఫలితాలు ఉన్నాయి.గతవారమిలా... ప్రధాని పొదుపు పిలుపు ఎఫెక్ట్తో పాటు క్రూడ్ ధరల జోరు, రూపాయి పతనం వంటి ప్రతికూలతలతో గత వారం మార్కె ట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2,090 పాయింట్లు (2.7%) పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 533 పాయింట్లు (2.2%) క్షీణించింది.తిరోగమనంలోనే విదేశీ ఇన్వెస్టర్లు... భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడ్ సెగలు, రూపాయి పతన ప్రభావంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) మన మార్కెట్లో అమ్మకాల జోరు మరింత పెంచారు. వరుసగా మూడో నెలలోనూ రివర్స్గేర్లోనే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.27,048 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది మొత్తం రూ.2,2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ను నికరంగా విక్రయించినట్లు ఎన్ఎస్డీఎల్ డేటా వెల్లడించింది. 2025 మొత్తం ఏడాదిలో నికర విక్రయాలు రూ.1.66 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాదిæ దీనికి రెట్టింపు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయనేది మార్కెట్ వర్గాలు అంచనా.సాంకేతికంగా చూస్తే... ఈ వారం కూడా దేశీ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో నిఫ్టీ పడితే, 23,500 వద్ద తొలి మద్దతు, 23100 స్థాయిలో రెండో మద్దతు ఉండొచ్చు. పెరిగితే 23,800 వద్ద తక్షణ నిరోధం ఉంటుంది. దానిపైన నిలదొక్కుకుంటే 24,000–24,100 వరకు పెరగవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎఫ్ఐఐ వర్సెస్ డీఐఐ రిటైలర్లు చూడని కథేంటి?
రమణమూర్తి మంథా ‘‘ఈ రోజు ఎఫ్ఐఐలు రూ.5,000 కోట్ల విలువైన షేర్లు అమ్మారు. డీఐఐలు రూ.5,267 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.’’ క్రికెట్ స్కోరులా కొన్నాళ్లుగా ఇన్వెస్టర్లు రోజూ ఇదే వార్త చూస్తున్నారు. అంకెలు మారొచ్చు కానీ... అమ్ముతున్నది ఎఫ్ఐఐలే. కొంటున్నది దేశీ ఫండ్లే. ఎందుకిలా? విదేశీ ఇన్వెస్టర్లకు మన మార్కెట్లపై విశ్వాసం తగ్గుతోందా? లేదా మన దేశీ మ్యూచువల్ ఫండ్లు బలోపేతమయ్యాయా? నిజమేంటి? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిందొక్కటే. ఇదేదో స్మార్ట్ మనీకి, నడమంత్రపు సిరికి జరుగుతున్న యుద్ధమేమీ కాదు. రెండు భిన్నమైన పవర్ సెంటర్ల మధ్య పోరాటం. కాకపోతే ఎఫ్ఐఐల దగ్గరున్న ఆయుధాలు పెద్దవి. ఆ ఆయుధాల్ని ఎలా వాడతారో వివరించేదే ఈ వెల్త్ స్టోరీ...దేశీ ఫండ్లు ప్రధానంగా భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించే ఆలోచిస్తుంటాయి. కానీ విదేశీ ఫండ్లు అమెరికా వడ్డీ రేట్లను, డాలర్ కదలికల్ని, ముడిచమురు– బంగారం ధరల్ని, బాండ్ ఈల్డ్స్ని, కమోడిటీ సైకిల్స్ని, గ్లోబల్ లిక్విడిటీని గమనిస్తుంటాయి. ఇదే పెద్ద తేడా. మన దేశీ ఫండ్లు ఒక బోర్డ్పై చెస్ ఆడుతుంటే... విదేశీ ఫండ్లు ఒకేసారి పది బోర్డులపై ఆడుతుంటాయి. అలాగని ఎఫ్ఐఐలే ఎప్పుడూ గెలుస్తారని కాదు. రిస్క్ లను వాళ్లు ముందే గమనిస్తారన్నది మాత్రం వాస్తవం.ఎఫ్ఐఐలు ఎందుకు చేస్తారంటే...ఉదాహరణకు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిందనుకోండి. తక్షణం అమెరికన్ బాండ్లు ఆకర్షణీయంగా మారతాయి. డాలర్ బలపడి... ఎమర్జింగ్ మార్కెట్ల కరెన్సీలు వీక్గా మారతాయి. భారత్ వంటి మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కెళ్లటం జరిగిపోతాయి. అంతేతప్ప ఇన్ఫోసిస్ ఒక్కరోజులో మారిపోవటమో, హెచ్డీఎఫ్సీ నష్టాల్లోకి జారిపోవటమో, ఎయిర్టెల్ సబ్ర్స్కయిబర్లను కోల్పోవటమో జరగలేదని గుర్తుంచుకోవాలి. ఎఫ్ఐఐలు విక్రయించారంటే దానర్థం... వారికి ఎక్కువ లాభాలు వచ్చే మార్కెట్లోకి డబ్బును మళ్లిస్తున్నారని. అందుకే కొన్నిసార్లు కంపెనీల ఫలితాలు అదరగొట్టినా మార్కెట్లు మాత్రం పడిపోతూ ఉంటాయి. కరెన్సీయే ప్రధాన సమస్య!ఇన్వెస్టర్లు పొరపడేది ఇక్కడే. ఎందుకంటే మన ఇన్వెస్టర్లు రూపాయిల్లో ఆలోచిస్తే విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లలో ఆలోచిస్తారు. ఒకవేళ మన మార్కెట్లలో 10 శాతం లాభం వచ్చినా... రూపాయి గనక 8 శాతం పడిపోతే నికరంగా విదేశీ ఇన్వెస్టరుకు దక్కేది 2శాతం లాభమే. అందుకే ఎఫ్ఐఐలు రూపాయి కదలికల్ని, దిగుమతి బిల్లు పెంచే చమురు, బంగారం, వెండి ధరల్ని, ద్రవ్యలోటును, ఆర్బీఐ పాలసీని నిశితంగా గమనిస్తుంటారు. వీటిలో దేన్నీ దేశీ ఇన్వెస్టర్లు నియంత్రించే పరిస్థితి లేదు. దేశంలోని అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్లు కూడా పెరుగుతున్న డాలర్తో పోరాడే పరిస్థితి లేదు. మాటే... బంగారం మార్కెట్ల పరిస్థితిని ముందు చెప్పేది బంగారమే. ఎందుకంటే అనిశ్చితి పెరుగుతున్న కొద్దీ బంగారం ధరలు పెరిగి.. డాలర్ బలోపేతమవుతుంది. ఎమర్జింగ్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు జాగ్రత్తపడతారు. బంగారమంటే కేవలం నగలు కాదు. అంతర్జాతీయంగా ఇదో థర్మామీటర్. ఇటీవల ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులన్నీ దూకుడుగా బంగారం కొన్నాయి. ఎందుకని? భౌగోళిక అనిశ్చితి పెరిగి కరెన్సీ ఊగిసలాడుతుందని, వృద్ధి మందగిస్తుందని అవి ఊహించడం వల్లే. ఈ సంకేతాల్ని మొదట అందుకునేది విదేశీ ఇన్వెస్టర్లే. రిటైలర్లు చేయాల్సిందేంటి?రిటైలర్లు గమనించాల్సిందొకటే. ఎవరు అమ్ముతున్నారు... ఎవరు కొంటున్నారని కాదు. దేన్ని అమ్ముతున్నారు... దేన్ని కొంటున్నారనేది. ఎఫ్ఐఐలు భయపడి అమ్మేస్తున్నపుడు కొంటే దీర్ఘకాలంలో సంపద సృష్టి సాధ్యమేనని నిరూపించిన కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, ఐటీసీ వంటివి ఉన్నాయి. బలమైన క్యాష్ ఫ్లో, మార్కెట్ లీడర్షిప్, దీర్ఘకాల చరిత్ర వీటి సొంతం. ఎఫ్ఐఐలు విక్రయించేసినంత మాత్రాన వీటి వృద్ధి దెబ్బతినదు. కానీ రిటైలర్లు ఇవన్నీ పట్టించుకోకుండా రాకెట్లలా పెరుగుతున్న షేర్ల వెంట పరుగులు తీస్తేనే సమస్య వస్తుంది. డిఫెన్స్, పీఎస్యూ, రెన్యూవబుల్ ఎనర్జీ, కొత్త తరం టెక్ కంపెనీలంటూ స్టోరీలు ప్రత్యక్షమై... ఆ స్టోరీల వెంబడి కొన్ని షేర్లు హద్దూ అదుపూ లేకుండా పెరగటం... వాటి వెనక పడటమే అసలైన ప్రమాదకరం. ఎందుకంటే కంపెనీల ఆదాయాలు గనక వాటి షేర్ల ధరను ప్రతిఫలించకపోతే విదేశీ ఇన్వెస్టర్లు పట్టించుకోరు. అందుకే వారు లాభాలతో బయటపడతారు.గెలిచేదెవరంటే...? ఎఫ్ఐఐలు విక్రయిస్తున్నంత మాత్రాన రిటైలర్లు భయపడాల్సిన పని లేదు. ఎందకంటే ఎఫ్ఐఐలు– డీఐఐల లక్ష్యాలు వేరు. ఎఫ్ఐఐలు గ్లోబల్ అలొకేషన్, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తే... డీఐఐలు సిప్ పెట్టుబడులు, రిటైర్మెంట్ నిధి, బీమా నిధులు, దేశ దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారు. దీనివల్ల ఆసక్తికర పరిస్థితులు తలెత్తుతాయి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఎఫ్ఐఐలు విక్రయిస్తే... దేశ దీర్ఘకాలిక వృద్ధిలో భాగమయ్యే షేర్లను డీఐఐలు కొంటుంటారు. అంటే... ఇద్దరూ గెలిచినట్టే. భారత్ది నిర్మాణాత్మక బలం.. స్టోరీలను పక్కనబెడితే దేశీయంగా బలమైన ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థ ఉంది. నెలవారీ సిప్ ప్రవాహాలు చాలా బలంగా ఉంటున్నాయి. మార్కెట్లలోకి బీమా, పింఛన్ నిధుల రాక పెరిగింది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరుగుతోంది. ఇదో నిర్మాణాత్మక మార్పు. ఓ పదేళ్ల కిందట చూస్తే... ఈ స్థాయిలో ఎఫ్ఐఐలు గనక షేర్లను విక్రయిస్తే మార్కెట్లు కుప్పకూలేవి. కానీ ఇపుడు డీఐఐలు ఆదుకోగలుగుతున్నాయి. కాకపోతే ఈ మద్దతును ఆధిపత్యంగా చూడలేం. ఎందుకంటే లిక్విడిటీని, విలువను, కరెన్సీని, ఆఖరికి మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయగలిగేది విదేశీ ఇన్వెస్టర్లే. దీన్ని విస్మరించలేం. మార్కెట్ని మార్కెట్గానే చూడాలి... విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించినంత మాత్రాన అదేదో చెత్త కంపెనీ అని... డీఐఐలు కొన్నంత మాత్రాన మంచి కంపెనీ అని అనుకోవటానికి లేదు. ఆదాయం, క్యాష్ ఫ్లో, గవర్నెన్స్ బాగున్న కంపెనీలనే మార్కెట్ ఆదరిస్తుంది. ఓపిగ్గా వేచిచూడటంతో పాటు, విలువల పరంగా క్రమశిక్షణ చూపించే ఇన్వెస్టర్లకే లాభాలొస్తాయి. -
గోల్డ్ కొనాలా.. వద్దా..
‘కొంతకాలం బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ పిలుపుతో కొనుగోళ్లు ఆపాలని కొందరు , ఏడాది పాటు వాయిదా వేయాలని మరికొందరు చర్చలకు దిగారు ఇప్పటికే కొనేశాంగా మరి అమ్మేయాలా అని అనేకమంది సందిగ్ధంలో పడ్డారు. సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో ఈటీఎఫ్లుగా కొంటున్నవారు ఏంచేయాలో తోచక అయోమయంలో పడ్డారు. అయితే ప్రధాని పిలుపు ఒక రకమైన కొనుగోలుదారులకు పూర్తిగా వర్తిస్తుంది. మరొక వర్గం కొనుగోలుదారులకు అంతగా సంబంధం ఉండకపోవచ్చు. కానీ చాలా మందికి తాము ఏ రకమైన బయ్యర్లో తెలీదు. అది తెలిస్తే మీరు బంగారం కొనాలో, అమ్మాలో, కొనసాగించాలో నిజంగా ఏంచేయాలో స్పష్టమవుతుంది. క్రూడ్, చమురు దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యంపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని మోదీ గత వారం చేసిన బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలన్న పిలుపును బాధ్యత గల పౌరులుగా సీరియస్గా తీసుకోవాల్సిందే. పతనమవుతున్న రూపాయి , పశ్చిమ ఆసియాలో అస్థిర పరిస్థితి, పెరుగుతున్న దిగుమతి బిల్లు వంటి కారణాలను ప్రధాని ప్రస్తావించారు. అయితే ఈ పిలుపునకు అందరూ ఒకేరకంగా స్పందించాల్సిన అవసరంలేదు. సరదాగా, ఆడంబరం కోసం, ఫ్యాషన్గా ప్రదర్శించుకునేందుకు మీరు నగలు కొనేవారైతే ఈ పిలుపు మీకు పూర్తిగా వర్తిస్తుంది. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలి అనుకుంటే ఆపడానికి ఆలోచించాల్సిందే. అదెలాగో తెలుసుకుందాం...ప్రధాని పిలుపు అసలు అర్థం ఏమిటి?భారతదేశం వినియోగించే బంగారంలో 99 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే వస్తుంది. దేశంలో గణనీయమైన స్థాయిలో బంగారం తవ్వకం జరగదు. నగలు, నాణేలు, బార్లు ఏ రూపంలో అయినా బంగారం కొనడానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి డాలర్ల రూపంలో దిగుమతులకే వెళ్తుంది. డాలరు మారకంలో రూపాయి విలువ 96 స్థాయికి పతనమై ఒకవైపు దిగుమతి బిల్లు పెరుగుతున్న సమయంలో బంగారం డిమాండ్ పెరగడం ఆర్థిక పరిస్థితిని మరింత కఠినతరం చేస్తోంది. ఎందుకంటే బంగారం దిగుమతులకు ప్రభుత్వం డాలర్లలోనే చెల్లిస్తుంది. డిమాండ్ పెరిగితే డాలర్లు భారీగా బయటకు వెళ్తాయి. దాంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే కీలకమైన దిగుమతులైన చమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు అన్నీ ఖరీదవుతాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అది చివరికి సాధారణ కుటుంబాలపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రధాని పిలుపులో భావోద్వేగం కన్నా గణాంకాలకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి.ఎవరి కోసం...ఈ పిలుపు అత్యంత ప్రభావం చూపేది జ్యువెలరీ కొనుగోలుదారులపైనే. ఎందుకంటే నగలలో బంగారం విలువతో పాటు 10 నుంచి 15 శాతం వరకు మేకింగ్ చార్జీలు, జీఎస్టీ కూడా ఉంటాయి. ఇవి తిరిగి రికవర్ కాని ఖర్చులు. అంటే నగలను పెట్టుబడిగా భావించే వారు , కొనుగోలు చేసిన క్షణం నుంచే తమ సంపదను అంతకన్నా ఎక్కువ శాతంగా అంచనా వేస్తారు. నగలు అనేవి వినియోగం కోసమే. పెట్టుబడి కోసం కాదు. అందుకే ప్రధాని పిలుపు వీరిని ఉద్దేశించి చేసిందిగా గమనించాలి.బంగారం పని సంపద పెంచడం కాదు ...రక్షణ ఇవ్వడంప్రధాని పిలుపును పాటించాలా వద్దా అనుకునే ముందు, మీ పోర్ట్ఫోలియోలో బంగారం అసలు ఏ పని చేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి. బంగారంపై పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు ఉండటం సరైనదిగా పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు భావిస్తారు. అది సంపదను వేగంగా పెంచడానికి కాదు. ఒక రకమైన ఇన్సూరెన్స్లా పనిచేయడానికి. ఈక్విటీలు దీర్ఘకాలంలో సంపదను పెంచుతాయి. డెట్ ఇన్స్ట్రుమెంట్లు మూలధనాన్ని కాపాడి వడ్డీ ఇస్తాయి. బంగారం పని మాత్రం వేరు. రూపాయి బలహీనపడినప్పుడు లేదా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు, బంగారం సాధారణంగా తన విలువను నిలబెట్టుకుంటుంది. ఆసమయంలో ఇతర పెట్టుబడులను కాపాడేది బంగారం. ఆ పరిస్థితులకు హెడ్జింగ్గా బంగారాన్ని అలొకేషన్లో ఉంచుతారు.నగలు, ఈటీఎఫ్లు ఎస్జీబీలు పూర్తిగా భిన్నందిగుమతుల స్థాయిలో చూస్తే బంగారం అంటే బంగారమే. దేశంలో జ్యువెలరీ తయారీ దారులు గోల్డ్ బార్లు దిగుమతి చేసుకుని నగలుగా మారుస్తారు. గోల్డ్ ఈటీఎఫ్లు , గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా తమ యూనిట్లకు బ్యాకింగ్గా ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి దిగుమతి భారంలో పెద్ద తేడా ఉండదు. ఇక్కడ అసలు తేడా దిగుమతుల్లో కాదు. దానికి చేసే వ్యయంలో ఉంది.గోల్డ్ఈటీఎఫ్లు – మ్యూచువల్ ఫండ్లు గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా ఫిజికల్ గోల్డ్ దిగుమతులపైనే ఆధారపడతాయి. వీటి విషయంలో మేకింగ్ చార్జీలు ఉండవు. గోల్డ్ విలువపై జీఎస్టీ ఉండదు. తిరిగి అమ్ముకోవడం కూడా తేలిక.ఎస్జీబీలే నిజమైన మినహాయింపుసావరిన్ గోల్డ్ బాంండ్ల (ఎస్జీబీ)కు మాత్రమే నిజమైన ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. బాండ్ల విషయంలో ప్రభుత్వం బంగారం ధరలకు అనుసంధానమైన ఒక పేపర్ ఇన్స్ట్రుమెంట్ను జారీ చేస్తుంది. ఇందులో ఫిజికల్ గోల్డ్ కొనుగోలు లేదా దిగుమతి అవసరం ఉండదు. ఇష్యూ సమయంలో కొనుగోలు చేసిన వారు ఎనిమిదేళ్లు హోల్డ్ చేస్తే, 2.5 శాతం వార్షిక వడ్డీతో పాటు మెచ్యూరిటీ సమయంలో ట్యాక్స్ ఫ్రీ లాభాన్ని పొందేవారు. అయితే ఇప్పుడు కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూలు ఆగిపోయాయి. చివరిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సంవత్సరాల క్రితం కొత్త ట్రాంచ్ను విడుదల చేసింది.ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?మీ గోల్డ్ ఈటీఎఫ్లు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లను కలిపి లెక్కించండి. నగలను లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే అవి వినియోగానికి ఉద్దేశించినవి. మొత్తం పెట్టుబడుల్లో బంగారం శాతం ఎంత ఉందో చూడండి. అది 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 శాతం కంటే తక్కువైతే పోర్ట్ఫోలియో సమతుల్యత కోసం కొంత కొని పెంచుకోవచ్చు.10 శాతం దాటితే కొంత తగ్గించి ఆవచ్చే డబ్బును ఈక్విటీ, డెట్ లేదా క్యాష్ వైపు మార్చడం మంచిది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మార్కెట్ టైమింగ్ వల్ల ఈ పనిచేయడంలేదు. రీబ్యాలెన్సింగ్ మాత్రమే చేస్తున్నాం. బంగారాన్ని ఇన్సూరెన్స్లా చూడండి. ఇన్సూరెన్స్ను ఎవరైనా అవసరం వచ్చినప్పుడు కాదు, ముందుగానే కొనుగోలు చేస్తారు. బంగారంపై పెట్టుబడి కూడా అంతే.. పెరుగుతున్నపుడు కొనడం సరైన పెట్టుబడి విధానం కాదు. ప్రధాని పిలుపు బంగారం వినియోగం కోసం కొనేవారి విషయంలో సరైనదే. ముఖ్యంగా నగలు కొనేవారు దానిని సీరియస్గానే తీసుకోవాలి. ఇప్పటికే 5 నుంచి 10 శాతం సరైన గోల్డ్ అలొకేషన్ కలిగిన పెట్టుబడిదారు తన పోర్ట్ఫోలియోను కదిలించాల్సిన పనిలేదు. మొదటి నుంచి పెట్టుబడి ప్రణాళిక సరైనదైతే ఇప్పుడు చేయాల్సింది దానికి కట్టుబడి ఉండటమే.చరిత్ర ఏం చెబుతోంది?2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తమ బాండ్ కొనుగోళ్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. దాంతో రూపాయి సహా అనేక ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలు బలహీనపడ్డాయి. 2020 కరోనా సంక్షోభం, 2022 ఎనర్జీ క్రైసిస్ సమయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి సందర్భంలో రూపాయి బలహీనపడగా, ఈక్విటీలు నష్టపోగా, గోల్డ్ ధరలు మాత్రం పెరిగాయి. ఆ సమయంలో కొంత బంగారం కలిగి ఉన్న పోర్ట్ఫోలియోలు మాత్రమే సంక్షోభాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఇక్కడ గమనించాల్సింది ఒకటే బంగారం మిమ్మల్ని ధనవంతులను చేయడానికి కాదు, మీ సంపద పెంచడానికి కాదు మార్కెట్ కష్టకాలంలో మీ ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని.– సాక్షి, వెల్త్ డెస్క్ -
తక్కువ బడ్జెట్లో సొంతిల్లు.. ఖర్చు తగ్గించే బెస్ట్ మార్గాలు!
సొంత ఇల్లు నిర్మించుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ప్రస్తుతం.. సిమెంట్, ఇనుము, ఇసుక, కార్మిక చార్జీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడంతో ఇల్లు కట్టుకోవడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. అయినప్పటికీ.. సరైన ప్రణాళిక, ఖర్చుపై నియంత్రణ, తెలివైన నిర్ణయాలతో తక్కువ బడ్జెట్లో కూడా మంచి ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పుడు తక్కువ డబ్బుతో ఇల్లు ఎలా కట్టుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం.సరైన బడ్జెట్ ప్లాన్ఇల్లు నిర్మాణంలో మొదటి అడుగు బడ్జెట్ నిర్ణయించడం. మీ ఆదాయం, సేవింగ్స్, బ్యాంక్ లోన్ సామర్థ్యాన్ని బట్టి ఎంత వరకు ఖర్చు చేయగలమో ముందే నిర్ణయించుకోవాలి. చాలా మంది ప్లాన్ లేకుండా పనులు ప్రారంభించి మధ్యలో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ముందుగానే.. నిర్మాణానికి సంబంధించిన పూర్తి అంచనా తయారు చేసుకోవాలి.చిన్న ప్లాన్తో ప్రారంభించడం మంచిదితక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టాలంటే.. మొదట చిన్న ఇంటి డిజైన్ ఎంచుకోవడం ఉత్తమం. అవసరానికి మించి పెద్ద హాల్లు, ఎక్కువ బెడ్రూమ్లు, ఖరీదైన ఎలివేషన్లు పెట్టుకుంటే ఖర్చు భారీగా పెరుగుతుంది. భవిష్యత్తులో అవసరం పెరిగితే పై అంతస్తు లేదా అదనపు గదులు నిర్మించుకోవచ్చు.సింపుల్ డిజైన్ఇంటి డిజైన్ ఎంత క్లిష్టంగా ఉంటే.. నిర్మాణ వ్యయం అంత పెరుగుతుంది. కాబట్టి సాదాసీదా డిజైన్, సింపుల్ ఎలివేషన్, తక్కువ మలుపులు ఉన్న నిర్మాణం ఎంచుకోవడం మంచిది. దీని వల్ల సిమెంట్, ఇనుము, కార్మిక ఖర్చులు తగ్గుతాయి.నిర్మాణ సామగ్రి కొనుగోలులో జాగ్రత్తసిమెంట్, ఇనుము, ఇటుకలు వంటి మెటీరియల్స్ను ఒక్కోసారి కొనే బదులు, హోల్సేల్గా కొనుగోలు చేస్తే తక్కువ ధరలో లభిస్తాయి. అలాగే.. స్థానికంగా లభించే నాణ్యమైన మెటీరియల్స్ వాడితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ చవక కోసం నాసిరకం వస్తువులు కొనడం మాత్రం మంచిది కాదు.కార్మిక ఖర్చులను నియంత్రించడంనిర్మాణంలో లేబర్ ఖర్చు కూడా పెద్ద భాగం. కాంట్రాక్టర్కు పూర్తిగా అప్పగించకుండా, మెటీరియల్స్ మీరు కొనుగోలు చేసి కూలీలకు రోజువారీ చెల్లింపులతో పని చేయిస్తే కొంత వరకు ఖర్చు తగ్గుతుంది. అయితే పనిపై పర్యవేక్షణ తప్పనిసరి.అవసరమైన చోట మాత్రమే లగ్జరీఇంటి నిర్మాణంలో.. మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, ఖరీదైన వుడ్వర్క్, డిజైనర్ టైల్స్ వంటి వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రారంభ దశలో అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. తరువాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఇంటిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు.ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలిప్రభుత్వం అందించే గృహ పథకాలు, సబ్సిడీ హోమ్ లోన్స్, PMAY వంటి పథకాల గురించి తెలుసుకోవాలి. అర్హత ఉంటే వీటి ద్వారా వడ్డీ భారం కొంత తగ్గుతుంది.ఎలక్ట్రిక్, వాటర్ ప్లానింగ్ఇల్లు నిర్మాణ సమయంలోనే విద్యుత్ వైరింగ్, నీటి పైపులు, డ్రైనేజ్ వ్యవస్థలను సరిగ్గా ప్లాన్ చేస్తే భవిష్యత్తులో మరమ్మతుల ఖర్చు తగ్గుతుంది.మొత్తం మీద.. తక్కువ డబ్బుతో ఇల్లు కట్టుకోవడం అసాధ్యమైన పని కాదు. అయితే సరైన ప్రణాళిక, ఖర్చుపై నియంత్రణ, అవసరాలకు తగ్గ డిజైన్, నాణ్యమైన మెటీరియల్స్ వినియోగం ద్వారా తక్కువ బడ్జెట్లో కూడా అందమైన, బలమైన ఇల్లు నిర్మించుకోవచ్చు. తొందరపడకుండా ప్రతి దశను ఆలోచించి ముందుకు వెళితే సొంతింటి కల సాకారం అవుతుంది. -
వేసవి హీట్కు స్మార్ట్ ట్రీట్.. సమ్మర్ స్పెషల్ గాడ్జెట్స్!
వేసవిలో వేడి ఎంత పెరిగినా, మిమ్మల్ని కూల్గా, కంఫర్ట్గా ఉంచే, బెస్ట్ హెల్పర్స్.. ఈ సమ్మర్ స్పెషల్ గాడ్జెట్స్!అరచేత్తో ఐస్ గోలా!వేసవిలో చల్లచల్లగా ఐస్ గోలా తినాలని అనిపిస్తుందా? కానీ హైజీన్ గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతున్నారా? అయితే ఇక టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే, మీ కళ్ల ముందే స్వచ్ఛమైన ‘గోలా’ను తయారుచేసి ఇస్తుంది ఈ ఐస్ గోలా మేకర్! పైగా దీనికి కరెంట్తో పనిలేదు. ఎందుకంటే ఇది చేత్తో తిప్పే మాన్యువల్ మ్యాజిక్ మెషిన్. ఇందులో ఉన్న తుప్పుపట్టని షార్ప్ బ్లేడ్లు క్షణాల్లో గట్టి ఐస్ గడ్డలను ‘మంచు పొడి’గా మార్చేస్తాయి. దీనితో పాటు 3 బౌల్స్, 6 రీయూజబుల్ స్టిక్స్, ఒక గ్లాస్ కూడా వస్తాయి. ఇంట్లో ఉన్న ఐస్ ముక్కలు వేయడం, హ్యాండిల్ తిప్పడం, మీ ఫేవరెట్ ఫ్లేవర్ వేసుకోవడం.. అంతే, హోమ్ మేడ్ ఐస్ గోలా రెడీ! ధర రూ. 460 మాత్రమే.పోర్టబుల్ వాటర్ కంటైనర్పిక్నిక్లో ‘నీళ్లు ఎక్కడ?’ అన్న ప్రశ్నకు స్టయిల్గా సమాధానం చెప్పండి. బ్యాగ్లో నుంచి ఈ పోర్టబుల్ డ్రింక్ స్టోరేజ్ను తెరిచి, ఒకేసారి క్షణంలో పదిమందికి పైగా నీళ్లను అందించండి. ఎందుకంటే, ఇది మామూలు కంటైనర్ కాదు, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లి, వెంటనే వాడుకునే స్మార్ట్ డ్రింక్ స్టోరేజ్! వాడనప్పుడు సైలెంట్గా మడుచుకుని బ్యాగ్లో కూర్చుంటుంది. కానీ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా 5.5 లీటర్ల ‘డ్రింక్ స్టేషన్’ గా మారిపోతుంది! జ్యూస్, నీళ్లు లేదా కూల్ డ్రింక్స్ నింపి ట్యాప్ ద్వారా సులభంగా సర్వ్ చేసుకోవచ్చు. లైట్వెయిట్ కాబట్టి మోసుకెళ్లడం ఈజీ. ధర రూ. 599 మాత్రమే!చల్లగా.. వేడిగా.. ఒక్క బౌల్లోనే!పార్టీలు, గెట్ టుగెదర్స్ లేదా ఇంట్లో స్పెషల్ సర్వింగ్ కోసం మీ ఫుడ్ ఎక్కువసేపు అదే టెంపరేచర్లో ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఈ డిప్ చిల్లర్ బౌల్ మీకు పర్ఫెక్ట్ చాయిస్! ఇది మామూలు గిన్నె కాదు, మీ ఫుడ్ను చల్లగా లేదా వేడిగా ఎక్కువసేపు అలాగే ఉంచే స్మార్ట్ సర్వింగ్ సొల్యూషన్.దీనిలో డబుల్ వాల్ ఇన్సులేషన్ ఉంటుంది. చల్లని వంటకాలకు బౌల్లో నీళ్లు నింపి ఫ్రీజ్ చేస్తే, సాల్సా, ఐస్క్రీమ్, డ్రింక్స్ లాంటి వాటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. అలాగే వేడి నీళ్లు పోస్తే, నూడుల్స్, సూప్, పాస్తా లాంటి వేడి వంటకాలు కూడా ఎక్కువసేపు వేడిగా ఉంటాయి. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన ఈ బౌల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ధర రూ. 1,200 మాత్రమే! -
UIDAI సూపర్ అప్డేట్.. ఇక mAadhaar బంద్!
mAadhaar యాప్ త్వరలో నిలిచిపోతుందని.. యూజర్లు కొత్తగా ప్రారంభమైన ఆధార్ యాప్ వైపు మారాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొత్తగా అందుబాటులోకి రానున్న.. ఆధార్ యాప్ క్యూఆర్ బేస్డ్ ఆధార్ షేరింగ్, ఫేస్ ఆథెంటికేషన్, ఆఫ్లైన్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ లాక్ కంట్రోల్, మెరుగైన ప్రైవసీ ఎంపికలను కలిగి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు దీనిని ఉపయోగించుకోవాలని యూఐడీఏఐ సూచించింది.యాప్ డౌన్లోడ్ - సెట్అప్ విధానం➤యూజర్లు కొత్త ఆధార్ యాప్ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యూఐడీఏఐ తన అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడా డౌన్లోడ్ లింక్ అందజేస్తోంది.➤యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, యూజర్ తమ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరును ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. కొన్ని సందర్భాల్లో ఫేస్ ఆథెంటికేషన్ కూడా అవసరం అవుతుంది.➤లాగిన్ పూర్తయిన తరువాత.. యూజర్ సెక్యూరిటీ పిన్ క్రియేట్ చేయాలి, లేదా ఫింగర్ప్రింట్/ఫేస్ అన్లాక్ ద్వారా యాప్ను సురక్షితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. తరువాత, ఆధార్ ప్రొఫైల్ను మాన్యువల్గా యాప్లో ఎంటర్ చేసి మరో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.➤ఒకే మొబైల్ నెంబర్తో కుటుంబ సభ్యులు కూడా వేర్వేరు ఆధార్ ప్రొఫైల్స్.. యాప్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకే డివైస్లో అనేక ప్రొఫైల్స్ సపోర్ట్ అవుతాయని యూఐడీఏఐ వెల్లడించింది. ఇది కుటుంబాలకు ఆధార్ సేవలను సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.➤ప్రతి ఆధార్ వివరాలు సరిగ్గా పనిచేస్తున్నాయని ధృవీకరించిన తర్వాత, యూజర్లు పాత mAadhaar యాప్ తొలగించవచ్చు.యాప్లో ముఖ్యమైన మార్పులుకొత్త ఆధార్ యాప్ ముఖ్యంగా ప్రైవసీ అండ్ డిజిటల్ వెరిఫికేషన్ మీద దృష్టి పెట్టింది. ఆధార్ కార్డు ఫోటోకాపీలు పంచుకునే అవసరం లేకుండా, యూజర్లు క్యూఆర్ ఆధారిత సురక్షిత పద్ధతిలో గుర్తింపును ధృవీకరించవచ్చు.ప్రయోజనాలుఆధార్ కార్డు ఫోటోకాపీలు ఇవ్వకుండా గుర్తింపు ధృవీకరణ.ఆధార్ సమాచారం యాక్సెస్, షేరింగ్ పై యూజర్కు పూర్తి నియంత్రణ.యాప్ ద్వారా నేరుగా ఆధార్ సేవలను నిర్వహించవచ్చు.అదనపు గుర్తింపు ధృవీకరణకు ఫేస్ ఆథెంటికేషన్ సపోర్ట్.ఆధార్ ఆథెంటికేషన్ను స్మార్ట్ఫోన్ నుండి నేరుగా సురక్షితంగా నియంత్రించుకోవడం.The #mAadhaar App is retiring soon. Now experience a smarter, faster, and more secure digital journey with the new #AadhaarApp. From secure QR-based #Aadhaar sharing to enhanced privacy controls and seamless access to Aadhaar services — the new app is designed to make your… pic.twitter.com/snfeUx4Rgr— Aadhaar (@UIDAI) May 15, 2026 -
బంగారం ధరలు - ఊహకందని మార్పులు!
బంగారం ధరలు భారీగా పెరుగుతూ.. తగ్గుతూ ఊహకందని మార్పులకు లోనవుతున్నాయి. వారం మధ్యలో పెరిగిన గోల్డ్ రేటు, వారాంతంలో ఒక్కసారిగా పడిపోయాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో జరిగిన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.మే 10న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,52,350 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర, మే 16 నాటికి 1,56,930 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,650 వద్ద నుంచి 1,43,850 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతగా మార్పు చెందాయో స్పష్టంగా అర్థమవుతోంది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఏడురోజుల్లో 1,54,370 రూపాయల నుంచి 1,60,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,500 వద్ద నుంచి రూ.1,47,500 వద్దకు చేరింది. ఈ మార్పు కేవలం వారం రోజులలో జరిగింది.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరలు, వారం రోజుల్లో భారీ పెరుగుదలను నమోదు చేసాయి. మే 10న 1,52,500 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం రేటు మే 16నాటికి 1,57,080 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,39,800 నుంచి 1,44,000 రూపాయల వద్దకు చేరింది.ధరలు పెరుగుదలకు కారణాలుబంగారం ధరలు పెరగడానికి సాధారణంగా అనేక ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు ఉంటాయి. బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు లేదా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు షేర్లు, బాండ్లు వంటి రిస్కీ ఆస్తుల నుంచి డబ్బును తీసి బంగారంలో పెట్టడం పెరుగుతుంది. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఎగుస్తాయి.అలాగే అమెరికా డాలర్ విలువ కూడా కీలకం. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కూడా బంగారం ధరలు పెరుగుతాయి. కరెన్సీ విలువ తగ్గిపోతున్నప్పుడు ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం వైపు మొగ్గుతారు.ఇంకో కారణం వడ్డీ రేట్లు. బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బంగారం ఆకర్షణ పెరుగుతుంది, ఎందుకంటే ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే లాభం తగ్గిపోతుంది. అదే విధంగా.. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఆభరణాల డిమాండ్ (వివాహ సీజన్లు, పండుగలు), అలాగే మార్కెట్ స్పెక్యులేషన్ కూడా ధరల పెరుగుదలకు కారణమవుతాయి.ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే! -
సమస్యగా మారిన వర్క్ ఫ్రమ్ హోమ్!
ఇటీవలి కాలంలో వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానం చాలామంది ఉద్యోగులకు సౌకర్యంగా మారింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తూ సమయం, ప్రయాణ ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. అయితే.. ఈ విధానం కొంతమందికి ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తోంది. తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పంచుకోవడం పెద్ద చర్చకు దారితీసింది.ఆ ఇంజనీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది తనకు మొదటి వర్క్ ఫ్రం హోమ్ అనుభవం. తాను సహజంగా చాలా యాక్టివ్ పర్సన్, అయితే.. ఇంట్లో ఒంటరిగా పని చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా అలసటకు గురవుతున్నట్లు చెప్పారు. గత రెండు నెలలుగా ప్రతిరోజూ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయినా ఉదయం లేవగానే బద్ధకంగా, అలసటగా అనిపిస్తోందని తెలిపారు. దీని కారణంగా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నానని, ఉత్సాహం తగ్గిపోయిందని వివరించారు.అతను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి పనిచేసే గది. ఆ గదిలో కిటికీలు లేవని, పొరుగింటి గోడ ఉండటం వల్ల సహజ కాంతి అసలు లోపలికి రాదని పేర్కొన్నారు. రోజంతా సూర్యకాంతి లేకుండా గదిలో ఉండటం వల్ల తన ఆరోగ్యం దెబ్బతింటోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. సూర్యకాంతి లేకపోవడం వల్ల విటమిన్ డీ లోపం, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చని చాలామంది వైద్యులు చెబుతుంటారు.అంతేకాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ తన లైఫ్ స్టైల్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని అన్నారు. పని స్టార్ట్ చేయడానికి ముందు మాత్రమే నిద్ర లేవడం, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఎక్కువగా AI టూల్స్ ఉపయోగించి కోడింగ్ చేయడం వల్ల శారీరక కదలికలు తగ్గిపోయాయని చెప్పారు. ముందులా తీవ్రంగా ఆలోచిస్తూ.. కోడింగ్ చేసే అనుభూతి కూడా లేకపోవడంతో పని పట్ల ఆసక్తి తగ్గుతోందని తెలిపారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ముందుగా విటమిన్ డీ, ఐరన్ లెవెల్స్ టెస్ట్ చేసుకోమని సూచించారు. మరికొందరు గదిలో సూర్యకాంతి, తాజా గాలి లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. వ్యాయామం చేయడం, జిమ్కు వెళ్లడం, సరైన ఆహారం తీసుకోవడం, అలాగే కిటికీలు ఉన్న గదిలో పని చేయడం మంచిదని సలహా ఇచ్చారు.కొంతమంది నెటిజన్లు “వర్క్ ఫ్రం హోమ్ నిజానికి శక్తిని ఆదా చేస్తుంది. ప్రయాణం చేయాల్సిన అవసరం లేకపోవడం ఒక పెద్ద ప్రయోజనం. కానీ సరైన జీవనశైలి లేకపోతే అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది” అని పేర్కొన్నారు. మరికొందరు తీవ్రమైన అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే! -
ఆరేళ్లలో తొలిసారిగా లాభాల్లోకి!
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా దాదాపు ఆరేళ్లలో తొలిసారిగా లాభాల్లోకి మళ్లింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 51,970 లాభం ప్రకటించింది. చెల్లించాల్సిన ఏజీఆర్ బాకీలకు సంబంధించి కేంద్రం నుంచి వెసులుబాటు లభించడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది.గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో వొడాఫోన్ ఐడియా రూ. 7,167 కోట్ల నష్టం నమోదు చేసింది. క్యూ4లో ఆదాయం 3 శాతం పెరిగి రూ. 11,229 కోట్ల నుంచి రూ. 11,332 కోట్లకు చేరింది. ఏజీఆర్పరమైన ఊరటని పరిగణనలోకి తీసుకోకుంటే.. నష్టం నాలుగో త్రైమాసికంలో రూ. 5,515 కోట్లుగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 24,059 కోట్లుగా ఉంది.మార్చి త్రైమాసికం ఆఖరు నాటికి యూజర్ల సంఖ్య 19.28 కోట్లుగా ఉంది. మిగతా అన్ని టెల్కోలతో పోలిస్తే ప్రతి యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) అతి తక్కువగా రూ. 190గా ఉన్నప్పటికీ, వృద్ధి మాత్రం అత్యధికంగా 8.3 శాతంగా నమోదైంది. మరోవైపు, ప్రమోటర్ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన సూర్యజ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రూ. 4,730 కోట్లు సేకరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందుకోసం 430 కోట్ల వరకు వారంట్లను జారీ చేయనుంది. -
కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే!
వ్యాపారంలో విజయం సాధించాలంటే.. కేవలం డబ్బు, తెలివి, కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు. ఒక నిజమైన వ్యాపారవేత్తకు అత్యంత ముఖ్యమైన ఆస్తులు రెండు. అవి అతని మెదడు, జీవితాంతం నేర్చుకునే తపన. వీటితో పాటు అతని సలహాదారుల బృందం ఉండాలి అంటారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత కియోసాకి.ప్రతి వ్యాపారవేత్త తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. ప్రపంచం ప్రతిరోజూ మారుతోంది. కొత్త ఆలోచనలు, సాంకేతికతలు, మార్కెట్ మార్పులు వస్తూనే ఉంటాయి. నేను అన్నీ తెలుసుకున్నాను అని భావించే వ్యక్తి ఎప్పటికీ ఎదగలేదు. కాబట్టి వ్యాపారవేత్త ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి.ఒక వ్యక్తి ఎంత తెలివైనవాడైనా.. ఒంటరిగా ఉంటే ఏమీ సాధించలేడు. ఒక మంచి బృందం ఉన్నప్పుడు మాత్రమే పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ప్రతి మనిషికి ఇతరుల సహాయం అవసరం. వ్యాపారంలో కూడా ఇదే నిజం. మంచి సలహాదారులు ఉంటే వ్యాపారం బలంగా నిలబడుతుంది.వ్యాపారవేత్తకు అవసరమైన సలహాదారులుబుక్ కీపర్: వ్యాపారంలో వచ్చే ప్రతి రూపాయి లెక్కను కచ్చితంగా నమోదు చేస్తాడు. సరైన లెక్కలు లేకపోతే వ్యాపారం గందరగోళంలో పడుతుంది.అకౌంటెంట్: పన్నులు, ఆర్థిక ప్రణాళికలు, ఖర్చులకు సంబంధించిన సలహాలు ఇస్తాడు.అటార్నీ: చట్టపరమైన సమస్యల నుంచి వ్యాపారాన్ని రక్షిస్తాడు.మార్కెటింగ్ మేనేజర్: ఉత్పత్తిని ప్రజలకు చేరవేస్తాడు. మంచి మార్కెటింగ్ లేకపోతే మంచి ఉత్పత్తి కూడా గుర్తింపు పొందదు.ప్రొడక్ట్ డెవలపర్: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను రూపొందిస్తాడు.బ్యాంకర్: ఆర్థిక సహాయం, పెట్టుబడులపై మార్గనిర్దేశం చేస్తాడు.బంగారం, వెండి బ్రోకర్: విలువైన లోహాలలో పెట్టుబడులపై సలహా ఇస్తాడు.స్టాక్ అండ్ బాండ్ బ్రోకర్: షేర్లు, బాండ్లు వంటి పెట్టుబడులపై అవగాహన కల్పిస్తాడు.Entrepreneurs most important assets:1: Their brain and dedication to life long learning.2: Their team of advisors.Who is on your team of advisors?Do you have?1: Book keeper for accurate numbers2: Accountant3: Attorney4: Marketing manager5: Product…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 16, 2026 ఈ టీమ్ కలిసి పనిచేస్తే, వ్యాపారవేత్తకు సరైన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. ఒంటరిగా పని చేసే మేధావి కంటే, మంచి సలహాదారులతో కూడిన బృందం మంచి విజయాన్ని సాధిస్తుంది.పాఠశాలలో చదుకునేటప్పుడు తప్పులు చేసే టీచర్ శిక్షిస్తారు. అందుకే చాలామంది ఉపాధ్యాయులు వ్యాపార ప్రపంచంలో పెద్దగా ఎదగలేరని కియోసాకి అన్నారు. నిజ జీవితంలో తప్పులు చేయడం సహజం. వాటి నుంచి నేర్చుకోవడం ద్వారానే విజయం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. దేశాన్ని కాపాడిన బంగారం! -
ఇటలీ స్పేస్ సదస్సులో ఇన్–స్పేస్
ఇటలీలో నిర్వహించిన స్పేస్ మీటింగ్స్ వెనిటోలో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) సారథ్యంలో భారత్ నుంచి తొమ్మిది స్పేస్ టెక్ కంపెనీలు పాల్గొన్నాయి. ధృవ స్పేస్, ఆస్ట్రోగేట్ ల్యాబ్స్, వ్యోమ్ఐసీ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా కెప్లర్ ఏరోస్పేస్, ఆస్ట్రోబేస్ మొదలైనవి అక్కడి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే అంతరిక్ష రంగానికి సంబంధించి సాంకేతిక, వాణిజ్య భాగస్వామ్య అవకాశాలపై ఇరు దేశాల సంస్థలు చర్చించాయి. -
ఈ–క్లచ్ టెక్నాలజీతో హోండా
గురుగ్రామ్: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన పాపులర్ అడ్వెంచర్ టూరర్ మోడల్ ‘ఎన్ఎక్స్500’ను సరికొత్త ఈ–క్లచ్ టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేసింది. క్లచ్తో పనిలేకుండా గేర్లు మార్చుకునే వెసులుబాటు కల్పించే ఈ టెక్నాలజీ బైక్ రైడింగ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆటోమేషన్ సాంకేతికతను భారత రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. దీని ధరను కంపెనీ రూ. 7,43,900 (ఎక్స్–షోరూమ్ వద్ద) గా నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్వింగ్ డీలర్షిప్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో 471 సీసీ, లిక్విడ్–కూల్డ్, ప్యారలల్–ట్విన్ ఇంజిన్ను 6–స్పీడ్ ట్రాన్స్మిషన్తో అమర్చారు. ఇది సిటీ రైడింగ్ హైవే టూరింగ్ రెండింటికీ అనువైన బలమైన టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే... 5.0 అంగుళాల పూర్తి రంగుల టీఎఫ్టీ (టీఎఫ్టీ) డిస్ప్లే ఉంది. ఇందులో నావిగేషన్, కాల్, మ్యూజిక్ ఫంక్షన్ల కోసం హోండా రోడ్సింక్ కనెక్టివిటీ లభిస్తుంది. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, పూర్తి ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ మ్యాట్ గన్పౌడర్ బ్లాక్ మెటాలిక్, పెర్ల్ హోరిజోన్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ సుత్సుము ఒటాని మాట్లాడుతూ, ఈ–క్లచ్ సాంకేతికత పట్టణ, పర్యటన వాతావరణాలలో రైడర్ అలసటను తగ్గించి, సౌకర్యం, కంట్రోల్ను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
వెండి దిగుమతులపై ఆంక్షలు
సాక్షి, బిజినెస్ డెస్క్: పశ్చిమాసియా సంక్షోభం వేళ విదేశీ మారక (డాలర్ల) నిల్వలను కాపాడుకునే క్రమంలో దిగుమతులను కట్టడి చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పసిడి, వెండి, ప్లాటినంలపై సుంకాలను పెంచిన ప్రభుత్వం వెండికి సంబంధించి మరిన్ని నియంత్రణలను ప్రకటించింది. ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే (ఫ్రీ ఇంపోర్ట్) కేటగిరీలో ఉన్న వెండిని ఆంక్షలు వర్తించే ‘రిస్ట్రిక్టెడ్’ కేటగిరీలోకి మార్చింది. దీనితో ఈ విభాగంలోని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్సు అవసరం ఉంటుంది. తాజా పరిణామంతో ఇకపై 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలు, సెమీప్రాసెస్డ్ సిల్వర్, సిల్వర్ పౌడర్, సాదా వెండి ఆభరణాల్లాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలన్నా డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) నుంచి ప్రత్యేక అనుమతులు అవసరమవుతాయి.అయితే, 100 శాతం ఎగుమతి ఆధారిత యూనిట్లు (ఈవోయూ), ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)లోని యూనిట్లకు ఈ ఆంక్షలు వర్తించవు. కాకపోతే, అవి దిగుమతి చేసుకున్న వాటిని భారత మార్కెట్లో విక్రయించకుండా, పూర్తిగా ఎగుమతి మాత్రమే చేయాల్సి ఉంటుంది. పైపెచ్చు ముందస్తు అనుమతి తీసుకున్నా సరే... ఒకసారి 100 కిలోలకన్నా ఎక్కువ పరిమాణంలో దిగుమతి చేసుకోవటానికి అనుమతించరు. ఇక ఎగుమతి ఆధారిత యూనిట్లు తొలుత దిగుమతి చేసుకున్న వెండిని వినియోగించి... అందులో కనీసం 50 శాతాన్ని ఎగుమతి చేసినట్లు నిరూపిస్తేనే మరోసారి దిగుమతికి అనుమతిస్తారు. విలువైన లోహాల దిగుమతి కోసం విదేశీ మారక నిల్వలను భారీగా వెచ్చించాల్సి వస్తుండటంతో పసిడితో పాటు వెండి దిగుమతులపై కేంద్రం సుంకాలను ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.12 బిలియన్ డాలర్ల దిగుమతులుభారత దిగుమతుల్లో వెండి వాటా ఏడాదికి దాదాపు 7 వేల నుంచి 9 వేల టన్నుల వరకు ఉంటోంది. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2025– 26లో వెండి దిగుమతులు పరిమాణం పరంగా 42 శాతం పెరిగి 7,335 టన్నులకు చేరాయి. విలువపరంగా 150 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడమే ఇందుకు కారణం. దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానంగా సిల్వర్ పౌడర్, బులియన్ కడ్డీలు, ముడి రూపంలోని వెండి ఉంటున్నాయి. కొత్త నిబంధనలతో వెండి దిగుమతుల్లో సింహభాగానికి డీజీఎఫ్టీ అనుమతి తప్పనిసరి కానుంది. ఎందుకీ నిర్ణయాలుకేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు లక్ష్యాలతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత విలువైన ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడం అందులో ఒకటి. అలాగే వివిధ దేశాలతో పెరిగిపోతున్న వాణిజ్య లోటును నియంత్రించడం మరో లక్ష్యం. థాయ్లాండ్, యూఏఈలాంటి దేశాలతో భారత్కి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్నాయి. దీనితో సుంకాల భారం భారీగా ఉండకుండా, ఆయా దేశాల మార్గం గుండా దిగుమతి చేసుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. కనుక, ఎఫ్టీఏల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాధారణ ప్రజలపై ప్రభావం ఏంటంటే..ఆభరణాలు ప్రియం..: అంతర్జాతీయంగా వెండి ధరలు భారీ స్థాయిలోనే కదలాడుతున్నాయి. ఇటీవలి సుంకాల విధింపుతో సిల్వర్ ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దీనికి తోడు ఇక సంక్లిష్టమైన లైసెన్సు ప్రక్రియ కూడా తోడైతే దిగుమతుల్లో జాప్యానికి దారి తీయొచ్చు. ఫలితంగా దేశీయంగా డిమాండ్, అలాగే ధరలు కూడా భారీగా ఎగిసే అవకాశం ఉంది. మన దగ్గర శుభకార్యాలు, ఇతరత్రా గిఫ్ట్ ఐటెమ్స్లో వెండి వినియోగం ఎక్కువే ఉంటోంది. అయితే, చిన్న వ్యాపారులు, ఆభరణాల తయారీదార్లకు ముడి వస్తువు వ్యయాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు వాటి రేట్లు కూడా పెరిగిపోతాయి. స్మగ్లింగ్ ముప్పు..: దిగుమతి సుంకాలను పెంచినప్పుడే స్మగ్లింగ్ ముప్పులపై ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు మరిన్ని నియంత్రణల వల్ల ఈ రిస్కులు ఇంకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. పరిశ్రమలకు షాక్..: కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా ఇతరత్రా పారిశ్రామిక అవసరాలకు కూడా వెండి వినియోగం గణనీయంగా పెరిగింది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు .. ఇలా ఒకటేమిటి, అనేక అవసరాల కోసం సిల్వర్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. తాజా నియంత్రణల వల్ల ఆయా పరిశ్రమలకు ముడి వస్తువు ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా అవి తయారు చేసే ఉత్పత్తుల ధరలూ పెరుగుతాయి. పెట్టుబడులకు కొనసాగనున్న ఆసక్తి..పసిడితో పాటు ఇన్వెస్టర్లు ఇప్పుడు వెండిని కూడా ఓ కీలకమైన పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. బంగారంతో పోలిస్తే అందుబాటు స్థాయిలో ఉండటంతో రేట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నా సిల్వర్వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ల కోణంలో దీనికి డిమాండ్ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. -
జీసీసీ హబ్గా హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ హబ్గా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకి (జీసీసీ) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోందని ఏఐ ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజీల్ వెల్లడించింది. నగరంలో 400కు పైగా జీసీసీల్లో 3,00,000 మంది పైచిలుకు ప్రొఫెషనల్స్ ఉన్నారని వివరించింది. వీరితో పాటు దాదాపు పది లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ ప్రొఫెషనల్స్ ఉన్నట్లు ఎవరెస్ట్ గ్రూప్తో కలిసి రూపొందించిన శ్వేతపత్రంలో తెలిపింది. 2024లో 64.6 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీసీసీ పరిశ్రమ 2030 నాటికి 105 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని వివరించింది. 58 శాతం సెంటర్లు ఇప్పటికే ఏజెంటిక్ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. క్వాలిజీల్కి స్వయంగా హైదరాబాద్లో 3 జీసీసీలు ఉండగా, వీటిలో 850 మందికి పైగా ఇంజినీర్లు పని చేస్తున్నారు. 2028 నాటికి 100 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. -
ఎయిర్టెల్ స్టైలే వేరు..
ముంబై: గత దశాబ్దకాలంగా పలు దేశీ ఐటీ కంపెనీలు తమ దగ్గరున్న నిధులను ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో పంచేందుకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయని టెలికం దిగ్గజం ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ విమర్శించారు. తమ రంగాల్లోని కొత్త తరం వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో అవి విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. అయితే, ఎయిర్టెల్ ఆ బాటలో వెళ్లదని మిట్టల్ స్పష్టం చేశారు. టెలికం కంపెనీలు వృద్ధి అవకాశాలు అందించే అసెట్స్లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాల్సిందనేనని, లేకపోతే వెనుకబడిపోయే రిస్క్ లు ఉంటాయన్నారు. కాబట్టి తాము ఇటు బైబ్యాక్లు, డివిడెండ్లు ఇస్తూనే అంతర్జాతీయంగా టెలికం రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటామని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన సందర్భంగా తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ) విప్లవాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఐటీ కంపెనీలు కొత్త ఉత్పత్తులు, వ్యాపార విస్తరణపై ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో తమ దగ్గరున్న నిధులను మరీ ఎక్కువగా వెచ్చిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 16 దిగ్గజ ఐటీ కంపెనీలు, షేర్హోల్డర్లకు రికార్డు స్థాయిలో రూ. 1.3 లక్షల కోట్ల మొత్తాన్ని బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ. 95,400 కోట్లతో పోలిస్తే 36 శాతం అధికం. పదేళ్లలో వారసులకు వ్యాపార పగ్గాలు .. వచ్చే దశాబ్దకాలంలో వ్యాపార పగ్గాలను తన వారసులకు అప్పగించనున్నట్లు మిట్టల్ చెప్పారు. అలాగే, భారతి ఎయిర్టెల్లో ప్రమోటర్ సంస్థ భారతి టెలికం తిరిగి 50 శాతం పైగా వాటాను దక్కించుకునేలా చూడాలనేది తన ఆకాంక్ష అని ఆయన వివరించారు. ప్రస్తుతం భారతి టెలికంకి ఎయిర్టెల్లో 40.47 శాతం వాటాలు ఉన్నాయి. 10 శాతం మేర వాటాలు పెంచుకోవాలంటే ప్రస్తుత షేర్ ధర, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం కనీసం రూ. 1 లక్ష కోట్లు అవసరమవుతాయని మిట్టల్ పేర్కొన్నారు. -
వచ్చే 6 నెలలు ఎలా ఉంటుందంటే.. భయంకర ఆందోళన
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రాబోయే నెలల్లో వ్యాపార రంగాలు ఎదుర్కోబోయే గడ్డు పరిస్థితులపై సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో ఒక ప్రముఖ టెక్స్టైల్ ఫౌండర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ముడి పదార్థాల ధరల పెరుగుదల, కంపెనీలలో సామూహిక లేఆఫ్లపై ఆయన చేసిన హెచ్చరికలు నెట్టింట వైరల్గా మారాయి.‘రాబోయే ఆరు నెలలు అత్యంత కీలకం’టెక్స్టైల్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అక్షయ్ జైన్ తన 'ఎక్స్' పోస్ట్లో వ్యాపారాల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ముడి పదార్థాల సరఫరా దెబ్బతిని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. "ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వల్ల రాబోయే ఆరు నెలలు కంపెనీలకు అత్యంత బాధాకరంగా మారబోతున్నాయి. ఖర్చులు గనుక ఇదే వేగంతో పెరిగితే, పలు రంగాలలో సామూహిక ఉద్యోగాల తొలగింపులతో పాటు వ్యాపారాలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది," అని జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా తక్కువ మార్జిన్లతో నడిచే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ముడి పదార్థాల ధరల పెరుగుదల "అస్సలు భరించలేనిది" గా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మందగమనం రెండేళ్లు ఉండొచ్చుఅక్షయ్ జైన్ పోస్ట్పై స్పందిస్తూ పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఆర్థిక మందగమనం కేవలం ఆరు నెలలతో ముగిసేది కాదని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) మళ్లీ కోలుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ఒక వినియోగదారుడు అంచనా వేశారు. పెరుగుతున్న నిర్వహణ వ్యయం, కార్మికుల కొరత, మార్కెట్లో వినియోగదారుల డిమాండ్ తగ్గడం వంటి అంశాలు యువ పారిశ్రామికవేత్తలకు మునుపెన్నడూ లేని సవాలును విసురుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రభావం కేవలం టెక్స్టైల్ రంగానికే పరిమితం కాదని.. వ్యవసాయం, ఉత్పాదక రంగం, ఐటీ, ముడిసరుకు ఆధారిత పరిశ్రమలన్నింటిపై పడుతుందని మరో నిపుణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇంకా దిగజారితే, ఆ ప్రభావాన్ని తట్టుకోవడం భారతదేశానికి కూడా పెద్ద సవాలుగా మారుతుందని హెచ్చరించారు.ధరలు పెంచలేక.. నష్టాలు భరించలేక..ఉత్పత్తి వ్యయం పెరిగినప్పటికీ, కస్టమర్ల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల వ్యాపారాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు 20% కంటే ఎక్కువ పెరిగినప్పటికీ, మార్కెట్లో డిమాండ్ పడిపోతుందనే భయంతో ఉత్పత్తుల ధరలను పెంచలేకపోతున్నామని ఒక పారిశ్రామికవేత్త ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాతావరణంలో వ్యాపారాన్ని విస్తరించడం అసాధ్యంగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితి!ట్రావెల్ ఎసెన్షియల్స్ రంగానికి చెందిన ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు తన అనుభవాన్ని పంచుకుంటూ.. ప్రయాణాలు తగ్గడం వల్ల తమ అమ్మకాలు అప్పుడే పడిపోయాయని తెలిపారు. "కోవిడ్-19 మహమ్మారి సమయంలో మాస్కుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చి మా కంపెనీని గట్టెక్కించాం. కానీ ప్రస్తుత పరిస్థితి అంతకంటే భిన్నంగా, మరింత సవాలుగా ఉంది. ఇప్పుడు మాకు పెద్ద ఫ్యాక్టరీ సెటప్, వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఇలాంటి అనిశ్చిత సమయంలో ఏ వస్తువులను తయారు చేయాలో, వేటిని విక్రయించాలో అర్థం కావడం లేదు" అని ఆయన పేర్కొన్నారు.మొత్తానికి, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నేరుగా సామాన్య వ్యాపారాలపై చూపిస్తున్న ప్రభావంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులు త్వరగా చక్కబడకపోతే ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం తప్పదని ఈ చర్చల ద్వారా స్పష్టమవుతోంది.The next 6 months are going to be very painful for businesses due to rising costs. We might be looking at mass layoffs and companies closing down in many sectors. Current rates of raw materials due to war are absolutely unsustainable.— Akshay G Jain (@Ajain112) May 16, 2026 -
ప్రపంచ ఏఐ దిగ్గజంగా టీసీఎస్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత టెక్నాలజీ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యమని ఆ కంపెనీ సీఈవో, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు. 2025–26 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగానికి 2025–26 ఆర్థిక సంవత్సరం ఒక ‘కీలక మలుపు’ గా నిలిచిందన్నారు. క్లయింట్లు ఏఐని ప్రయోగాత్మక దశ నుంచి పూర్తిస్థాయి అమలువైపు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. టాప్ క్లయింట్ల ఫస్ట్ ఛాయిస్ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యం. ఏటా 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం అందించే 139 మంది కీలక క్లయింట్లలో ఇప్పటికే 130 మంది ఏఐ ప్రాజెక్టుల కోసం టీసీఎస్ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం మా వ్యూహానికి దక్కిన విజయానికి నిదర్శనం’ అని కృతివాసన్ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి ఇంటెలిజెన్స్ వరకు పూర్తి స్థాయి (ఫుల్–స్టాక్) ఏఐ సేవలను అందించే సంస్థగా టీసీఎస్ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. 2.7 లక్షల మందికి ఏఐ శిక్షణ భారీ సాంకేతిక మార్పులకు అనుగుణంగా టీసీఎస్ ఉద్యోగులకు పెద్దఎత్తున శిక్షణ ఇస్తోందని కృతివాసన్ తెలిపారు. ప్రస్తుతం 2.7 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఏఐలో అత్యాధునిక నైపుణ్యాలు సాధించారని, గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నారు. డిజిటల్ సేవల్లో చెరగని ముద్ర భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంలో టీసీఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ ఈ–మార్కెట్ప్లేస్ (జీఈఎం)ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఈ–కామర్స్ వేదికగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ వేదిక ద్వారా జరిగిన కొనుగోళ్ల విలువ రూ.5 లక్షల కోట్లను దాటిందన్నారు. ఎస్బీఐ ‘యోనో 2.0’ను పది భాషల్లో 20 కోట్ల మందికి సేవలు అందించేలా అప్గ్రేడ్ చేశామన్నారు. కోటికి పైగా ఈ–పాస్పోర్టుల జారీ, ఆర్బీఐ కోసం 250 టీబీ డేటాను విశ్లేషించగల మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు వంటి మైలురాళ్లను ఆయన వివరించారు. వ్యూహాత్మక కొనుగోళ్లు, లక్ష్యాలు ఏఐ ఎకోసిస్టమ్లో ‘బిల్డ్–పార్ట్నర్–అక్వైర్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా అమెరికాకు చెందిన లిస్ట్ఎంగేజ్, కోస్టల్ క్లౌడ్ సంస్థలను కొనుగోలు చేశామని తెలిపారు. దీంతో గ్లోబల్ సేల్స్ఫోర్స్ కన్సల్టెంట్లలో టీసీఎస్ టాప్–5లో నిలిచిందన్నారు. అలాగే టీపీజీ భాగస్వామ్యంతో ‘హైపర్వాల్ట్’ ఏఐ మౌలిక సదుపాయాల వ్యాపారాన్ని ప్రారంభించామని, భారత్లో 1 గిగావాట్ (జీడబ్ల్యూ) సామర్థ్యం గల డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. మేధోపరమైన మౌలిక సదుపాయంగా కృత్రిమ మేధ కృత్రిమ మేధ (ఏఐ) ఇకపై కేవలం సాంకేతిక పరిజ్ఞానంలో ఒక భాగం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల నిర్వహణకు ‘మేధోపరమైన మౌలిక సదుపాయం’ గా మారుతోందని టీసీఎస్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హ్యూమన్ ప్లస్ ఏఐ’ ఆపరేటింగ్ మోడల్ అమలును టీసీఎస్ మరింత విస్తరించిందన్నారు. ఏఐ సేవల ద్వారా వార్షిక ప్రాతిపదికన 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,320 కోట్లు), క్లౌడ్, డేటా, సైబర్ భద్రత వంటి న్యూ–ఏజ్ సేవల ద్వారా 11.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.96,600 కోట్లు) ఆదాయం ఆర్జించినట్లు పేర్కొన్నారు. భారత్లో తొలి ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్: సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై భవిష్యత్ వ్యూహాన్ని కేంద్రీకరిస్తున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్లో మొట్టమొదటి ‘ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్’ ను నిర్మించేందుకు టీసీఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇది 160 కిలోవాట్ల (కేడబ్ల్యూ) కంటే ఎక్కువ ర్యాక్ డెన్సిటీతో అత్యంత శక్తివంతంగా ఉంటుందన్నారు. అలాగే వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ‘ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసి, ‘ఏజెంటిక్ ఏఐ’ సొల్యూషన్స్ అమలును వేగవంతం చేయడం కంపెనీ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. జోరుగా లాభాలు.. నిలకడగా నియామకాలు: గత ఆర్థిక సంవత్సరపు(2025–26) ఫలితాలను విశ్లేíÙస్తూ కంపెనీ వృద్ధి బాటలో పయనిస్తోందని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి త్రైమాసికంలో టీసీఎస్ నికరలాభం 12.22 శాతం వృద్ధితో రూ.13,718 కోట్లకు చేరుకోగా, 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం లాభం రూ.49,210 కోట్లుగా నమోదైంది. గత రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కొత్తగా 2,356 మందిని నియమించుకున్నామని తెలిపారు. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519 కి చేరింది. కొత్త డీల్స్: గడిచిన మూడు నెలల్లోనే టీసీఎస్ 12 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో ఉత్తర అమెరికా, బ్యాంకింగ్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలు కీలక పాత్ర పోషించాయి. భవిష్యత్తు వ్యూహాలపై ఫోకస్ భవిష్యత్తులో నాలుగు ప్రధాన వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏఐ వ్యవస్థల నిర్మాణంతో పాటు, భారత్లో తొలి ‘హై–డెన్సిటీ ఏఐ డేటా సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 3,600 భాగస్వామ్యాల సహకారంతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇంటెలిజెన్స్’ సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయ డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. -
ల్యాప్టాప్, ఏఐ.. వ్యాపారంలో విజయం: కియోసాకి
పెట్టుబడుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించే రాబర్ట్ కియోసాకి.. తాజాగా పెద్ద కంపెనీలు మాత్రమే విజయం సాధిస్తాయనే విషయంపై స్పందించారు. AI సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని ఎవరైనా నిర్మించగలరు అని పేర్కొన్నారు.ఈ కాలంలో పెద్ద కంపెనీలకు మాత్రమే విజయావకాశాలు ఉన్నాయనే భావన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి కూడా తన ఇంటి వంటగదిలో కూర్చొని, కేవలం ల్యాప్టాప్, ఏఐ సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని నిర్మించగలడని కియోసాకి పేర్కొన్నారు.ఒకప్పుడు పెద్ద వ్యాపారం ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి, ఉద్యోగులు, ఆఫీస్, మార్కెటింగ్ టీమ్, మౌలిక సదుపాయాలు అవసరమయ్యేవి. కాబట్టి వ్యాపారం అనేది ధనికులకు మాత్రమే లేదా పెద్ద సంస్థలకు మాత్రమే సాధ్యమని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏఐ సాయంతో ఒక వ్యక్తి ఒంటరిగా.. చాలామంది చేసే పనులు చేసేస్తున్నాడు. పెద్ద పెద్ద ఆఫీసులు లేకపోయినా, ఇంట్లో నుంచే వ్యాపార నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధించవచ్చు. AI సహాయంతో ఒక వ్యక్తి పెద్ద కంపెనీల మార్కెటింగ్ విభాగం కంటే ఎక్కువ కంటెంట్ను తయారు చేయగలడు. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోగలడు. కస్టమర్లకు త్వరగా స్పందించగలడు. మార్కెట్లో వచ్చే మార్పులకు పెద్ద కంపెనీల కంటే వేగంగా.. అనుగుణంగా మారగలడని కియోసాకి అన్నారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహాపెద్ద కంపెనీలకు డబ్బు, వనరులు ఎక్కువగా ఉంటాయి. కానీ చిన్న వ్యాపారులకు వేగం గొప్ప ఆయుధం ఉంది. ఈ రోజుల్లో వేగంగా ఆలోచించి, వేగంగా అమలు చేసే వారే గెలుస్తున్నారు. పెద్ద సంస్థలు ఒక నిర్ణయం తీసుకునేలోపు.. చిన్న వ్యాపారులు కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇది కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఏ రంగంలో అయినా.. తెలివిగా ఆలోచిస్తే తప్పకుండా విజయం సొంతం అవుతుందని కియోసాకి చెబుతున్నారు. -
వెండి దిగుమతులు నిషేధం!
దేశ ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేయడం, వాణిజ్య లోటును తగ్గించడం, రూపాయి విలువను కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది.భారతదేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రజలు పెట్టుబడుల కోసం, ఆభరణాల తయారీ కోసం ఎక్కువగా ఈ లోహాలను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే విదేశాల నుంచి ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తే దేశం నుంచి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా బయటకు వెళ్తుంది. దీని వల్ల వాణిజ్య లోటు పెరుగుతుంది. ఇది రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం మే 13న బంగారం, వెండి దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5 శాతం ఏఐడీసీ ఉంటుంది. ఇది మే 13 నుంచే అమల్లోకి వచ్చింది.The Government of India has tightened the policy regarding the import of silver bars, changing their status from 'Free' to 'Restricted' with immediate effect. pic.twitter.com/k4Zyq4W2rO— ANI (@ANI) May 16, 2026తాజాగా ప్రభుత్వం వెండి దిగుమతులపై కఠిన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా 99.9 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన వెండి బార్ల దిగుమతిని ఫ్రీ నుంచి పరిమిత వర్గంలోకి మార్చింది. ఫ్రీ అంటే.. ఎటువంటి ప్రత్యేక అనుమతులు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. పరిమిత వర్గంలో అయితే.. ప్రభుత్వ అనుమతి అవసరం అవుతుంది. దీని వల్ల వెండి దిగుమతులు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.విదేశీ వాణిజ్యం (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1992 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో ఈ మార్పులు అమలు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశ్యం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం. -
ఇల్లు కొనేందుకు ఇది మంచి ఛాన్స్!
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్ పడ్డప్పుడు కొంటేనే తక్కువ ధరకు వస్తుంది.. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు వర్తించే ఈ సూత్రం రియల్టీకి వర్కవుట్ అవుతుంది. మార్కెట్ బాగలేనప్పుడు గృహ కొనుగోలుదారులకు మంచి సమయం. బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. వారు అందించే ఆఫర్లు అందుకునే అవకాశం ఉంటుంది.హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో రెండు రకాల కస్టమర్లు ఉన్నారు. ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), పెట్టుబడిదారులైన మొదటి రకంలో వీళ్లంతా పెద్దస్థాయిలో భూములు, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోళ్లు చేస్తుంటారు. ఇక, రెండో రకం రిటైల్ కస్టమర్లు. వీళ్లు సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేస్తుంటారు.మొదటి రకం కొనుగోలుదారులేమో మార్కెట్ బాగాలేనప్పుడు కొనుగోలు చేసి, బాగున్నప్పుడు ఎక్కువ ధరకు విక్రయించేసుకుంటారు. రెండో రకమేమో ధరలు మరింత తగ్గుతాయేమోనని వేచి చూస్తారు. ధరలు పెరిగిన తర్వాత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి స్థిరాస్తి మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే మొదటి రకాన్ని ఫాలో అవడమే కరెక్ట్. అందుకే ప్రస్తుత సందిగ్ధ వాతావరణంలో గృహాలను కొనుగోలు చేయడమే మంచి నిర్ణయం. ఇలాంటి ప్రతికూల మార్కెట్లోనే ధర, వసతుల విషయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశాలుంటాయి.ప్రభుత్వం ప్రోత్సహించాలిఏ పట్టణ ప్రాంతం అభివృద్ధికైనా కావాల్సింది విద్యా, వైద్యం, వినోదం, ఉద్యోగ అవకాశాలు. నగరవాసుల నాణ్యమైన జీవనాన్ని నిర్ణయించేవి ఈ నాలుగే. వీటిల్లో భాగ్యనగరం కేంద్ర బిందువనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెడికల్ టూరిజం, ఎడ్యుకేషనల్ హబ్, ఎంటర్టైన్మెంట్ జోన్లకు పెట్టింది పేరైన హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి.ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరానికి ఉన్న మరో అద్భుతమైన అవకాశం మెరుగైన మౌలిక వసతులున్న అపారమైన భూముల లభ్యత, ఔటర్, మెట్రోలతో కనెక్టివిటీ. దీంతో నగర రియల్టీ మార్కెట్కు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి.పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.కొత్త ప్రాజెక్ట్లపై పునరాలోచనప్రతీ ఆరేడేళ్లకు రియల్టీకి విరామ దశ సాధారణమే. తెలంగాణ ఉద్యమం, సత్యం స్కామ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లెమాన్ బ్రదర్స్ కుప్పకూలడం వంటి వాటితో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో 2007లో మొదలైన హైదరాబాద్ స్థిరాస్తి రంగం పతనం.. 2014 వరకూ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం వరకూ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది.కొత్త రాష్ట్రం, ప్రభుత్వ విధానాలు, కార్యచరణలపై అస్పష్టత వంటి కారణాలు అనేకం. ఆ తర్వాత 2015 ప్రారంభంలో మొదలైన రియల్ బూమ్ 2022 వరకూ కొనసాగింది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. 2023లో ఎన్నికలతో స్థిరాస్తి రంగంలో మొదలైన సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్లు, అపరిమిత సరఫరా, ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేకపోవడం, అధిక ధరలు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ ప్రతికూల విధానాల వంటి కారణంగా వచ్చే మూడేళ్ల వరకూ విరామ దశలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రియల్టీ రంగంలో ఈ విరామం మంచిదే అంటున్నారు. బిల్డర్లతో రాయితీలు, ఆఫర్లు వంటి బేరసారాలకు అవకాశం ఉంటుందంటున్నారు.మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీవిక్రయాలు అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో కొత్త ప్రాజెక్ట్లు చేపట్టేందుకు బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొని పెట్టుకోవడం, నిర్మాణ అనుమతులు తీసుకోవడం చేస్తున్నారే తప్ప ప్రాజెక్ట్ లాంచింగ్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఊహాజనిత మార్కెట్లో భూముల ధరలు పెరుగుతాయే తప్ప అపార్ట్మెంట్ల చదరపు అడుగు రేట్లు పెరగవు.ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీ ఉంది. నిర్మాణంలో ఉన్న, రెడీగా ఉన్న ఇన్వెంటరీ పోతేగానీ కొత్త యూనిట్లకు అవకాశం ఉండదు. అలాగే ప్రీలాంచ్ ప్రాజెక్ట్లు, డెవలపర్లు కూడా భూముల రేట్లు పెరగడానికి కారణమే. ఎప్పుడైనా సరే స్థిరాస్తి ధరలు స్థిరంగా పెరగాలే తప్ప అమాంతం పెరగకూడదు. రాత్రికి రాత్రే పెరిగే ధరలు గాలిబుడగ వంటివే. ఎప్పటికైనా పడిపోవాల్సిందే.. లేకపోతే తుది కొనుగోలుదారుల మీద అదనపు భారం తప్పదు. -
టీసీఎస్ బాస్.. వేతనం రూ.28 కోట్లు!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ 2025-26లో మొత్తం రూ. 28 కోట్ల వేతనం అందుకున్నారని. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం అధికమని కంపెనీ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది.అయితే.. టాటా గ్రూప్ అండ్ టీసీఎస్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ దిగ్గజం నుంచి ఎలాంటి కమీషన్ తీసుకోకుండా, మొత్తం ఆర్థిక సంవత్సరానికి సిట్టింగ్ ఫీజుగా కేవలం రూ. 4.2 లక్షలు మాత్రమే తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా సంస్థ తన వార్షిక నివేదిక తెలిపింది.కృతివాసన్ ప్యాకేజీలో ప్రాథమిక వేతనం రూ. 1.67 కోట్లు కాగా.. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు, ప్రయోజనాలు రూ.1.43 కోట్లు. పర్ఫామెన్స్ బేస్డ్ కమీషన్ కింద రూ.25 కోట్లు ఉన్నాయి. సంస్థ వార్షిక నివేదిక ప్రకారం, సీఈఓ వేతనం టీసీఎస్ ఉద్యోగుల మధ్యస్థ పారితోషికం కంటే 332.8 రెట్లు ఎక్కువ. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల మధ్యస్థ వేతనం 5.1 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది.భారతదేశంలో జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులకు సగటు వార్షిక జీతాల పెరుగుదల 4.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉండగా, అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల పెంపులు లభించాయి. టీసీఎస్ తన మార్చి త్రైమాసిక నికర లాభంలో 12.22 శాతం వృద్ధిని నమోదు చేసి, రూ. 13,718 కోట్లను ఆర్జించింది.ఇదీ చదవండి: 600 మీటర్ల దూరం.. అందుకే జాబ్ రిజెక్ట్! -
600 మీటర్ల దూరం.. అందుకే జాబ్ రిజెక్ట్!
ఈ మధ్యకాలంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక ఉద్యోగ అభ్యర్థికి వచ్చిన రిజెక్షన్ మెయిల్ అందరి దృష్టిని ఆకర్షించింది.సాధారణంగా కంపెనీలు అభ్యర్థిని తిరస్కరించేటప్పుడు.. క్వాలిఫికేషన్, స్కిల్స్ వంటివి చూస్తాయి. తమకు అవసరమైన స్కిల్ ఉన్నవారిని ఎంపిక చేసుకుంటాయి. లేకుంటే రిజెక్ట్ చేస్తాయి. కానీ.. అభ్యర్థి పనిచేసిన పాత ఆఫీస్ 600 మీటర్ల దూరంలో ఉండటం వల్ల రిజెక్ట్ చేస్తున్నట్లు కంపెనీ మెయిల్ ద్వారా వెల్లడించింది.కంపెనీకి సంబంధించిన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కారణం చదివిన తరువాత చాలా మంది ఆశ్చర్యపోయారు. సాధారణంగా కంపెనీలలో గోప్యత అనేది ఉద్యోగి బాధ్యత. కాబట్టి దీనికి కొన్ని సెక్యూరిటీ పాలసీలు ఉంటాయి. కానీ.. కేవలం భౌగోళిక దూరం ఆధారంగా ఉద్యోగిని తిరస్కరించడం అనేది చాలా మందికి అర్థం కాని విషయం అయ్యింది.సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయిన తరువాత, చాలామంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఇది పాతకాలపు ఆలోచన అని విమర్శించారు. నేటి డిజిటల్ ప్రపంచంలో సమాచారం ఎప్పుడైనా, ఎక్కడైనా చేరవచ్చు. కాబట్టి, కేవలం ఆఫీసుల మధ్య దూరం ఆధారంగా గోప్యత భంగం కలుగుతుందని భావించడం సరైనది కాదని అన్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ బాస్.. వేతనం రూ.28 కోట్లు! -
వెండి రూ. 30వేలు డౌన్!
అంతర్జాతీయంగా డాలరు బలోపేతం అవుతుండటం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయంగా వెండి, పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కేజీ ధర మూడు రోజుల్లో రూ.30వేలు తగ్గింది. దీంతో కేజీ వెండి రూ.2.80 లక్షల వద్దకు చేరింది.బంగారం ధరలు కూడా వరుస తగ్గుదలను నమోదు చేశాయి. పెరిగిన ఇంధన ధరలు.. ద్రవ్యోల్బణాన్ని ఎగదోయచ్చని, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేయొచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. -
ఆ రాష్ట్రంలో క్యాబ్, బైక్ ట్యాక్సీలపై నిషేధం!
నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటివి బుక్ చేసుకుని వెళ్లిపోతుంటారు. అయితే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ క్యాబ్, రైడ్ సేవలను నిలిపివేయాలని.. యాపిల్, గూగుల్ తమ యాప్ స్టోర్స్ నుంచి సంబంధిత యాప్స్ తొలగించాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమంగా బైక్, ట్యాక్సీ సేవలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ విభాగానికి రాసిన లేఖలో వెల్లడించారు. ఆ కంపెనీల యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాపిడోకు అగ్రిగేటర్ లైసెన్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో, 2022 చివరిలో బైక్ ట్యాక్సీలతో కొనసాగుతున్న వివాదం ప్రారంభమైంది. రాపిడో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, జనవరి 2023 నాటికి అన్ని బైక్ ట్యాక్సీ సేవలు నిలిపివేశారు. చివరికి బైక్ ట్యాక్సీల కోసం ఒక అగ్రిగేటర్ విధానాన్ని రూపొందించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
నమ్మలేని నిజం.. దేశాన్ని కాపాడిన బంగారం!
బంగారం అనేది భారతదేశంలో కేవలం విలువైన లోహం మాత్రమే కాదు,.. అది కుటుంబ గౌరవానికి ప్రతీక, భద్రతకు సంకేతం, కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆస్తిగా పరిగణిస్తారు. అలాంటి బంగారాన్ని.. ప్రభుత్వం రహస్యంగా దేశం దాటించింది అంటే?.. ఎవరైనా నమ్ముతారా?, కానీ 1991లో ఇదే జరిగింది. ఇంతకీ మన దేశం బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చింది?, ఎంత బంగారం పంపింది? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1991లో దేశం దివాలా తీసే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారాన్ని బ్రిటన్కు తరలించింది. సుమారు 46,910 కేజీల బంగారాన్ని రహస్యంగా తరలించి.. బదులుగా 405 మిలియన్ డాలర్ల అత్యవసర రుణం సమీకరించింది. భారత ఆర్థిక చరిత్రలో అత్యంత కీలక మలుపుగా నిలిచిన ఈ సంఘటన, తరువాత దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం చేసింది.రుణాలు ఇవ్వడానికి నిరాకరించిన విదేశీ బ్యాంకులు!1980ల చివరి దశ నుంచి 1990ల ప్రారంభం వరకు భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు కూడా గణనీయంగా తగ్గిపోయింది.ఫలితంగా భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా క్షీణించి, 1991 మే నాటికి కేవలం ఒక వారం రోజుల దిగుమతులకు సరిపడే డాలర్లు మాత్రమే మిగిలాయి. ఈ పరిస్థితిని గమనించిన అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత క్రెడిట్ రేటింగ్ను తగ్గించేశాయి. దీంతో విదేశీ బ్యాంకులు భారత్కు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభ అంచుకు చేరుకుంది.సాహసోపేతమైన నిర్ణయం!దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కున్న సమయంలో.. అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం, ఆర్బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ నాయకత్వంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రతిష్ట కంటే ముందు ఆర్థికంగా దివాలా తీయకుండా ఉండటం అవసరమని భావించిన ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారు నిల్వలను తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను రెండు దశల్లో అమలు చేశారు.మొదటి దశలో.. 1991 మే నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల స్వాధీనం చేసిన బంగారాన్ని స్విట్జర్లాండ్లోని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారు 215 మిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని సమీకరించారు. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో.. రెండో దశలో 1991 జూలైలో ఆర్బీఐ తన సొంత నిల్వల నుంచి 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు రహస్యంగా తరలించి అత్యవసర రుణాన్ని పొందింది.రహస్యంగా తరలింపు!1991 జూలై 4న బంగారం రవాణా విమానం ముంబైలోని శాంతాక్రూజ్ విమానాశ్రయం నుంచి రహస్యంగా బయలుదేరింది. ఆర్బీఐ భద్రగారాల నుంచి ప్రత్యేక భద్రత మధ్య భారీ ట్రక్కులలో బంగారాన్ని విమానాశ్రయానికి తరలించారు. ఈ ఆపరేషన్ను అత్యంత గోప్యంగా నిర్వహించేందుకు కస్టమ్స్ నిబంధనల్లో కూడా ప్రత్యేక మినహాయింపులు పొందారు.సాయుధ భద్రతా బలగాల పర్యవేక్షణలో బంగారాన్ని కార్గో విమానాల్లో ఎక్కించి విదేశాలకు పంపించారు. అయితే ఈ రహస్య ఆపరేషన్ ఎక్కువకాలం దాచిపెట్టలేకపోయారు. 1991 జూలై 8న ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ ఈ వార్తను ప్రధాన శీర్షికగా ప్రచురించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. భారతదేశం తన బంగారాన్ని విదేశాలకు పంపాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆ నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ!ఆ సమయంలో దేశాన్ని ఆర్థిక పతనం నుంచి కాపాడిన ఈ కఠిన నిర్ణయం, తరువాత భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు పునాది వేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేస్తూ చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను అమలు చేసింది. విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడం, మార్కెట్ ఆధారిత విధానాలను ప్రవేశపెట్టడం వంటి చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ లభించింది.బంగారాన్ని విదేశాలకు పంపాల్సి రావడం అప్పట్లో చాలామందికి అవమానంగా అనిపించినప్పటికీ, ఆ నిర్ణయం తీసుకోకపోతే భారత్ అంతర్జాతీయ అప్పులు చెల్లించలేని పరిస్థితికి చేరుకునేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ రోజున చేపట్టిన ఆ రహస్య గోల్డ్ ఆపరేషన్నే.. నేటి భారత ఆర్థిక పురోగతికి కీలక మలుపు అని చెబుతున్నారు.మోదీ పిలుపు1991లో గల్ఫ్ యుద్ధం కారణంగా భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లే, ప్రస్తుతం 2026లో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ చమురు ధరలను పెంచుతూ భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం విదేశీ మారకద్రవ్యంపై మరింత భారం మోపుతోంది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలను ఉద్దేశించి అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని, ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. కాబట్టి దేశ పౌరులు కూడా.. 1991 నాటి సంఘటన గుర్తు చేసుకుంటూ, నేటి తరం ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
ప్రపంచ ఏఐ దిగ్గజంగా టీసీఎస్
భారతీయ ఐటీ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా అవతరించడమే తమ అంతిమ లక్ష్యమని దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. కంపెనీ వార్షిక నివేదిక (2025-26)లో భాగంగా వాటాదారులకు రాసిన లేఖలో టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కె.కృతివాసన్ ఈ కీలక విషయాలను వెల్లడించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో ఏఐ సాంకేతికతకు ఒక కీలక మలుపు అన్నారు. క్లయింట్లు కేవలం ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా తమ వ్యాపార సామ్రాజ్యాల్లో పెద్ద ఎత్తున ఏఐని విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు.టాప్ క్లయింట్ల మొదటి ఛాయిస్..టీసీఎస్ గ్లోబల్ మార్కెట్లో తన పట్టును ఎంత బలంగా నిలుపుకుందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఏడాదికి 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే కంపెనీ అగ్రశ్రేణి 139 క్లయింట్లలో.. ఏకంగా 130 మంది తమ ఏఐ సేవల భాగస్వామిగా టీసీఎస్ను ఎంచుకున్నారని కృతివాసన్ ప్రకటించారు.‘ఏఐ సృష్టిస్తున్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ-నేతృత్వంలోని టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా మారాలనే సాహసోపేతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మౌలిక సదుపాయాలు నుంచి ఇంటెలిజెన్స్ వరకు ఫుల్ స్టాక్ ఏఐ సేవలను అందించడమే మా వ్యూహం’ అని కృతివాసన్ చెప్పారు.మూడు రెట్లు పెరిగిన ఏఐ శ్రామిక శక్తిఈ భారీ సాంకేతిక మార్పును తట్టుకునేందుకు వీలుగా టీసీఎస్ తన శ్రామిక శక్తిని దూకుడుగా సన్నద్ధం చేస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 2,70,000 మందికి పైగా ఉద్యోగులు అధునాతన ఏఐ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం.డిజిటల్ ప్రాజెక్టులు..గ్లోబల్ మార్కెటతోపాటు భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో టీసీఎస్ అత్యంత కీలక పాత్ర పోషించిందని సీఈఓ హైలైట్ చేశారు.గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్: రూ. 5 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వ కొనుగోళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఇ-కామర్స్ మార్కెట్ప్లేస్గా దీనిని విస్తరించింది.ఎస్బీఐ యోనో 2.0: 10 భాషల్లో ఏకంగా 20 కోట్ల మంది వినియోగదారులకు అత్యంత వేగవంతమైన సేవలు అందించేలా దీనిని అప్గ్రేడ్ చేసింది.ఈ-పాస్పోర్ట్: కోటికి పైగా ఈ-పాస్పోర్ట్ల జారీతో పౌర సేవలను ఆధునీకరించింది.ఆర్బీఐ డేటా మేనేజ్మెంట్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక విశ్లేషణల కోసం 250 టీబీ డేటాను నిర్వహించగల అత్యాధునిక డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ను నిర్మించింది.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి!
ప్రముఖ కంటెంట్ క్రియేటర్, ఫిన్ఫ్లూయెన్సర్ అంకుర్ వారికూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో విజయవంతంగా నడుస్తూ దాదాపు రూ.100 కోట్ల బిజినెస్ సామ్రాజ్యంగా ఎదిగిన తన ఆన్లైన్ లెర్నింగ్ (అప్స్కిల్లింగ్ కోర్సులు) వేదికను మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో అటు వ్యాపార వర్గాలు, ఇటు నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గత ఆరేళ్లుగా అద్భుతమైన ఆర్థిక వృద్ధిని కనబరుస్తున్నప్పటికీ ఈ వ్యాపారాన్ని ఇకపై ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి అర్థం లేదు అని వారికూ స్పష్టం చేయడం గమనార్హం.రూ.100 కోట్ల విక్రయాలు.. రూ.25 కోట్ల లాభాలు!తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ అంకుర్ వారికూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ‘రూ.100 కోట్ల విలువైన నా కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నాను. 2020లో మేము ఈ వెంచర్ను ప్రారంభించినప్పుడు ఇది ఇంతటి భారీ విజయాన్ని అందుకుంటుందని నేను ఊహించలేదు. ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు మా కోర్సుల్లో చేరారు. రూ.100 కోట్ల అమ్మకాలు జరిగాయి, అలాగే రూ.25 కోట్ల నికర లాభాలను కూడా ఆర్జించాం. వ్యాపారపరంగా ఇంత పెద్ద సక్సెస్ ఉన్నప్పటికీ.. దీనిని ఇలాగే కొనసాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు’ అని వారికూ పేర్కొన్నారు. అయితే, ఈ హఠాత్తు నిర్ణయానికి గల పూర్తి కారణాలను, తన తదుపరి కార్యాచరణను త్వరలో ఒక ప్రత్యేక వీడియో ద్వారా పంచుకోనున్నట్లు ఆయన తెలిపారు.డిజిటల్ ప్లాట్ఫామ్లపై తిరుగులేని సామ్రాజ్యం2020లో కోర్సుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన అంకుర్ వారికూ, చాలా తక్కువ సమయంలోనే దేశంలోనే టాప్ కంటెంట్ క్రియేటర్లలో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా యువతకు కెరీర్ గైడెన్స్, పర్సనల్ ఫైనాన్స్, టైమ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై కోర్సులను అందిస్తూ భారీ డిజిటల్ ఉనికిని చాటుకున్నారు. ప్రస్తుతం ఆయనకు.. యూట్యూబ్లో 7 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు, ఇన్స్టాగ్రామ్లో దాదాపు 4 మిలియన్ల ఫాలోవర్లు, ఎక్స్లో 7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలువారికూ చేసిన ఈ ప్రకటన డిజిటల్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఆన్లైన్ కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నారా? అని ఒక యూజర్ ప్రశ్నించగా.. వారికూ సమాధానమిస్తూ.. ‘అవును, అది కూడా ఒక కారణంగా ఉంది’ అని బదులివ్వడం ఐటీ, ఎడ్టెక్ రంగాల్లో హాట్ టాపిక్గా మారింది. మరికొందరు నెటిజన్లు దీన్ని విమర్శిస్తున్నారు. ఇదంతా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా హైప్ క్రియేట్ చేయడానికి చేస్తున్న గిమ్మిక్ (పబ్లిసిటీ స్టంట్) అని కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
టెక్ దిగ్గజాల మధ్య చైనా ‘కున్ఫీ’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా దేశ అధ్యక్షుడు జిన్పింగ్ గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విందులో ఒక ఆసక్తికరమైన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలై యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ల మధ్య కూర్చున్న ఒక చైనా మహిళ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. దాంతో తనకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.ఆమె.. చైనాలోనే అత్యంత ప్రతిభావంతురాలైన స్వయంకృషి గల మహిళా పారిశ్రామికవేత్త, ‘లెన్స్ టెక్నాలజీ’ వ్యవస్థాపకురాలు జౌ కున్ఫీ. తన కంపెనీకి అత్యంత కీలకమైన ఇద్దరు గ్లోబల్ కస్టమర్ల మధ్య ఆమె కూర్చోవడం టెక్ ప్రపంచంలో ప్రాధాన్యత సంతరించుకుంది.అట్టడుగు స్థాయి నుంచి బిలియనీర్ వరకు..టెక్ దిగ్గజాల మధ్య సముచిత స్థానం సంపాదించుకున్న జౌ కున్ఫీ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఆమె ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలు..1970లో హునాన్ ప్రావిన్స్లోని ఒక పేద గ్రామంలో జన్మించిన జౌ, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కేవలం 15 ఏళ్ల వయసులోనే చదువు మానేశారు. బతుకుదెరువు కోసం షెన్జెన్ నగరానికి వలస వెళ్లి అక్కడి ఫ్యాక్టరీల్లో కార్మికురాలిగా పనిచేశారు.1993లో, 23 ఏళ్ల వయసులో తన బంధువుల సహాయంతో కొంత మూలధనాన్ని సమకూర్చుకుని బావోన్ జిల్లాలోని ఒక నివాస భవనంలో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. రిస్ట్ వాచ్ గ్లాస్లపై స్క్రీన్ ప్రింటింగ్ చేయడంతో ఆమె వ్యాపార ప్రస్థానం మొదలైంది.ఆ తర్వాత దశాబ్ద కాలానికి, ఆమె కష్టార్జితంతో ‘లెన్స్ టెక్నాలజీ’ సంస్థ రూపుదిద్దుకుంది.యాపిల్తో భాగస్వామ్యం2007లో స్మార్ట్ఫోన్ రంగాన్నే విప్లవాత్మకంగా మార్చేసిన ఐఫోన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరుణంలో లెన్స్ టెక్నాలజీకి అదృష్టం వరించింది. ఐఫోన్ స్క్రీన్ కవర్ గ్లాస్ సరఫరాదారుగా యాపిల్ సప్లై చైన్లో లెన్స్ టెక్నాలజీ చోటు దక్కించుకుంది. ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు విక్రయాలు సాధించడంతో యాపిల్ సంస్థ లెన్స్కు అతిపెద్ద కస్టమర్గా మారింది. 2010ల ప్రారంభం నాటికి లెన్స్ టెక్నాలజీ వార్షిక ఆదాయంలో సగానికి పైగా వాటా యాపిల్ నుంచే రావడం విశేషం.ఈ విజయంతో మార్చి 2015లో షెన్జెన్లోని ‘చినెక్స్ట్ ఇండెక్స్’లో లెన్స్ నమోదైంది. తద్వారా జౌ కున్ఫీ చైనాలోనే అత్యంత ధనవంతురాలైన సెల్ఫ్-మేడ్ మహిళగా అవతరించారు. అనంతరం 2025లో ఈ సంస్థ హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పబ్లిక్ లిస్టింగ్ సాధించింది.మస్క్ కంపెనీలతో బంధం2016 నుంచి టెస్లా సంస్థతో ప్రారంభమైన అనుబంధం లెన్స్ టెక్నాలజీని మరో స్థాయికి తీసుకెళ్లింది. స్మార్ట్-కాక్పిట్, బాహ్య నిర్మాణ విడిభాగాల తయారీలో గ్లాస్, మెటల్, టచ్ మాడ్యూల్స్ విభాగాల్లో లెన్స్ తన నైపుణ్యాన్ని చాటుకుంది. గత డిసెంబర్లో ఇన్వెస్టర్ల వేదికగా లెన్స్ టెక్నాలజీ ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ఒక ప్రధాన ఉత్తర అమెరికా కస్టమర్తో తాము దశాబ్ద కాలంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఆ కస్టమర్ ప్రధాన వ్యాపారాలైన స్మార్ట్ కాక్పిట్లు, హ్యూమనాయిడ్ రోబోట్లు (ఆప్టిమస్), కమర్షియల్ ఏరోస్పేస్ (స్పేస్ఎక్స్)ల్లో తాము భాగస్వాములుగా ఉన్నట్లు పేర్కొంది. శాటిలైట్ గ్రౌండ్ రిసీవర్ల కోసం బాహ్య నిర్మాణాత్మక మాడ్యూల్స్, అంతరిక్ష ప్రయోగాల కోసం అల్ట్రా-థిన్ ఫోటోవోల్టాయిక్ గ్లాస్ మాడ్యూల్స్ను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కంపెనీ పేరు అధికారికంగా వెల్లడించనప్పటికీ అది ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థలేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.గ్లోబల్ టెక్ మహారథులైన టిమ్ కుక్, ఎలాన్ మస్క్ల నమ్మకాన్ని గెలుచుకున్న జౌ కున్ఫీ రాబోయే రోజుల్లో ఏఐ హార్డ్వేర్ తయారీ వ్యూహాలతో ముందుకెళ్లనున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
భూమిని తాకే సూర్యరశ్మి తగ్గుతోంది!
మానవాళి సాంకేతిక ప్రగతికి సూచికలుగా భావిస్తున్న ఉపగ్రహాలు, రాకెట్ ప్రయోగాలు.. ఇప్పుడు భూమి చుట్టూ ఉన్న పర్యావరణానికి కొత్త శాపంగా మారుతున్నాయి. నిరంతరాయంగా సాగుతున్న అంతరిక్ష ప్రయోగాలు ఎగువ వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయని, దీనివల్ల భూమికి చేరే సూర్యరశ్మి పరిమాణం క్రమంగా తగ్గుతోందని బ్రిటన్కు చెందిన ‘యూనివర్సిటీ కాలేజ్ లండన్’(యూసీఎల్) పరిశోధకుల అధ్యయనంలో విల్లడైంది.ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్ ‘ఎర్త్ ఫ్యూచర్’లో మే 14న ప్రచురితమైన ‘రేడియేటివ్ ఫోర్సింగ్ అండ్ ఓజోన్ డిప్లిషన్ ఆఫ్ ఎ డికేడ్ ఆఫ్ శాటిలైట్ మెగాకాన్స్టెలేషన్ మిషన్స్’ అనే పరిశోధనా పత్రం ఈ ఆందోళనకర అంశాలను తెరపైకి తెచ్చింది.నియంత్రణ లేని జియో ఇంజినీరింగ్ ప్రయోగం!యూనివర్సిటీ కాలేజ్ లండన్కు చెందిన శాస్త్రవేత్తలు కానర్ ఆర్.బార్కర్, ప్రొఫెసర్ ఎలోయిస్ ఎ.మరైస్, ఎరిక్ వై నేతృత్వంలోని బృందం 2020 నుంచి 2022 మధ్య కాలంలో జరిగిన రాకెట్ ప్రయోగాలు, అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల అవశేషాలపై సమగ్ర పరిశోధన చేసింది. ‘రాకెట్ ప్రయోగాలు వాతావరణ కాలుష్యానికి ఒక ప్రత్యేకమైన మూలంగా మారాయి. ఇవి హానికరమైన రసాయనాలను నేరుగా ఎగువ వాతావరణ పొరల్లోకి విడుదల చేస్తున్నాయి. తద్వారా భూమిపై ఇప్పటివరకు అత్యంత స్వచ్ఛంగా భావించిన సహజ వాతావరణం కలుషితమవుతోంది’ అని యూసీఎల్ ప్రధాన పరిశోధకుడు కానర్ బార్కర్ తెలిపారు.గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి శాస్త్రవేత్తలు ప్రతిపాదించే కృత్రిమ ‘జియో ఇంజినీరింగ్’ పద్ధతుల తరహాలోనే.. ఈ ఉపగ్రహ ప్రయోగాల వల్ల విడుదలవుతున్న కాలుష్యం భూమిని తాకే సూర్యరశ్మిని అడ్డుకుంటోందని పరిశోధకులు తేల్చారు. ఇది భూమిపై స్వల్ప శీతలీకరణ ప్రభావాన్ని చూపినప్పటికీ పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఇది చాలా తక్కువని, అయితే దీనివల్ల భవిష్యత్తులో ఊహించని తీవ్ర పర్యావరణ పరిణామాలు ఎదురవుతాయని ప్రాజెక్ట్ లీడ్ ప్రొఫెసర్ ఎలోయిస్ మరైస్ హెచ్చరించారు. పరిస్థితి చేతులు దాటిపోకముందే దేశాధినేతలు చర్యలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.ఐదేళ్లలోనే మూడింతలైన ప్రయోగాలురాకెట్ ప్రయోగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఈ నివేదిక గణాంకాలతో సహా విశ్లేషించింది.సంవత్సరంవార్షిక రాకెట్ ప్రయోగాల సంఖ్య20201142025329ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నిర్వహిస్తున్న స్టార్లింక్ మెగాకాన్స్టెలేషన్ ప్రాజెక్టేనని నివేదిక స్పష్టం చేసింది. ఇంటర్నెట్ సేవల కోసం స్పేస్ ఎక్స్ ఇప్పటివరకు కక్ష్యలోకి సుమారు 12,000 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ దశాబ్దం ముగిసేనాటికి అంతరిక్షంలోకి మరో 65,000 ఉపగ్రహాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుత వేగాన్ని చూస్తుంటే ఆ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండేలా కనిపిస్తోంది.ఎగువ వాతావరణంలో తిష్ఠ వేస్తున్న మసిస్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 వంటి రాకెట్లు కిరోసిన్ ఆధారిత ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. ఇవి మండటం వల్ల భారీ ఎత్తున ‘నల్ల కార్బన్’ లేదా ‘మసి’ కణాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. భూమిపై అయితే వర్షాల వల్ల ఈ మసి కడిగివేయబడుతుంది, కానీ ఎగువ వాతావరణంలో గాలి ప్రసరణ చాలా నెమ్మదిగా ఉండటం వల్ల ఈ హానికరమైన మసి కణాలు అక్కడే దశాబ్దాల పాటు తిష్ఠ వేస్తున్నాయి.ప్రమాద ఘంటికలు2029 నాటికి అంతరిక్ష పరిశ్రమ ద్వారా ఏటా దాదాపు 870 టన్నుల మసి వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రయోగాల వల్ల క్లోరిన్ వంటి రసాయనాలు కూడా విడుదలవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కిరోసిన్ ఇంధన రాకెట్ల వల్ల విడుదలయ్యే క్లోరిన్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ఓజోన్ పొరపై దీని ప్రభావం స్వల్పంగానే ఉంది. కానీ, భవిష్యత్తులో ప్రయోగాలు పెరిగితే ముప్పు తప్పదు.మున్ముందు మరింత పోటీ!ప్రస్తుతం అంతరిక్ష రంగంలో వాణిజ్య పోటీ విపరీతంగా పెరుగుతోంది. కేవలం స్పేస్ ఎక్సే కాకుండా అమెజాన్ సైతం తన సొంత ఇంటర్నెట్ ఉపగ్రహ నెట్వర్క్ ‘లియో’ను అభివృద్ధి చేసే పనిలో పడింది. అటు చైనా కూడా ‘గువాంగ్’ పేరుతో భారీ ఉపగ్రహ సమూహాన్ని నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వేలాది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి మరిన్ని వందల రాకెట్ ప్రయోగాలు అవసరమవుతాయి. అంతరిక్ష సాంకేతికత వైపు ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్న తరుణంలో.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేలా కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గూగుల్ ఉచిత స్టోరేజ్పై నియంత్రణ
టెక్ దిగ్గజం గూగుల్ తన వినియోగదారులకు షాకిచ్చేలా ఉచిత క్లౌడ్ స్టోరేజ్ విధానంలో కీలక మార్పులను చేపట్టింది. ఇప్పటివరకు కొత్తగా జీమెయిల్ ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికీ లభించే 15 జీబీ ఉచిత స్టోరేజ్ పరిమితిని కేవలం 5 జీబీకి తగ్గించేలా ఒక కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.కొత్తగా గూగుల్ ఖాతా సృష్టించుకునే వారు తమ ఫోన్ నంబర్ను అనుసంధానం చేసి వెరిఫై చేయకపోతే కేవలం 5 జీబీ స్టోరేజ్ మాత్రమే లభిస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ టెక్ వేదిక ‘ఆండ్రాయిడ్ అథారిటీ’ ఆధ్వర్యంలో గూగుల్ అధికారికంగా ధ్రువీకరించింది. మొదట ఈ మార్పును ఒక రెడ్డిట్ వినియోగదారుడు గుర్తించి వెలుగులోకి తెచ్చారు.గూగుల్ వివరణ ఏమిటి?ఉచిత స్టోరేజ్ పరిమితి తగ్గింపుపై వస్తున్న వార్తలపై గూగుల్ స్పందించింది. ‘అత్యుత్తమ నాణ్యత కలిగిన క్లౌడ్ స్టోరేజ్ సేవలను నిరంతరాయంగా అందించడమే మా లక్ష్యం. అందులో భాగంగానే నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ కొత్త స్టోరేజ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాం. దీనివల్ల భద్రత పెరగడమే కాకుండా, డేటా రికవరీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది’ అని గూగుల్ పేర్కొంది.అయితే, ఈ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తింపజేస్తారా లేదా అనే అంశంపై కంపెనీ ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి ఈ నిబంధన కేవలం కొత్తగా క్రియేట్ చేసే ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.కొత్త స్టోరేజీ పాలసీ ఎలా పనిచేస్తుంది?సాధారణంగా గూగుల్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్ వంటి సేవలన్నింటికీ కలిపి ఉమ్మడిగా 15 జీబీ ఉచిత స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ ఎకోసిస్టమ్ను వాడటానికి వినియోగదారులను ఆకర్షించే అతిపెద్ద ఫీచర్ ఇదే.ప్రస్తుత పరీక్షల ప్రకారం..డిఫాల్ట్ లిమిట్ - 5 జీబీ: కొత్త టెస్ట్ అకౌంట్ సిస్టమ్ కింద సైన్ అప్ అయ్యే వారికి ప్రాథమికంగా 5 జీబీ మాత్రమే ఉచితంగా ఇస్తున్నారు.పూర్తి 15 జీబీ పొందాలంటే: కొత్త వినియోగదారులు తప్పనిసరిగా తమ ఫోన్ నంబర్ను అందించి ఓటీపీ ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మిగిలిన 10 జీబీ అన్లాక్ అయి మొత్తం 15 జీబీ స్టోరేజ్ అందుబాటులోకి వస్తుంది.ఫోన్ నంబర్ వెరిఫికేషన్ ఎందుకు?ఒక్కరే వందలాది నకిలీ (ఫేక్) ఖాతాలను సృష్టించి ఉచితంగా లభించే 15 జీబీ స్టోరేజ్ ఆఫర్లను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడమే గూగుల్ ప్రధాన ఉద్దేశం. ఫోన్ నంబర్ లింక్ చేయడం ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఉచిత స్టోరేజ్ ప్రయోజనం చేకూరుతుందని గూగుల్ భావిస్తోంది. అంతేకాకుండా వినియోగదారులు ఎప్పుడైనా తమ పాస్వర్డ్ మర్చిపోయినా లేదా ఖాతా హ్యాకింగ్కు గురైనా.. ఫోన్ నంబర్ ద్వారా సులభంగా రికవర్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.ప్రస్తుతం ఆఫ్రికా వంటి కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రాంతాల్లో ఈ మార్పును వినియోగదారులు గమనించారు. భారతదేశంలోనూ కొత్త ఖాతా తెరిచే సమయంలో తప్పనిసరిగా ఫోన్ నంబర్ అడుగుతున్నట్లు కొందరు యూజర్లు సోషల్ మీడియా ద్వారా నివేదిస్తున్నారు.స్టోరేజీని గూగుల్ నిజంగానే తగ్గిస్తోందా?ప్రస్తుతానికి గూగుల్ ఈ విధానాన్ని ఒక ప్రయోగంగా మాత్రమే చెబుతోంది తప్ప, ఉచిత స్టోరేజీని శాశ్వతంగా తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల నిర్వహణ ఖర్చులు, వాటికి పెరుగుతున్న డిమాండ్ వల్లే టెక్ కంపెనీలు ఉచిత సేవలను పరిమితం చేస్తున్నాయనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. గూగుల్ దీనిని ధ్రువీకరించలేదు.ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు! -
కోయిల గూటి కొమ్మలు.. విశ్వాన్ని శాసించిన శక్తులు!
వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించే వ్యూహాత్మక చతురత, సరికొత్త ఆవిష్కరణల వైపు నడిపించే అద్భుత దార్శనికత, ఎంతటి సంక్షోభంలోనైనా వెనకడుగు వేయని ఉక్కు సంకల్పం.. ప్రపంచ శ్రేణి బిలియనీర్లలో మనం సాధారణంగా చూసే లక్షణాలివి. అయితే, గ్లోబల్ టెక్ ఐకాన్స్ అయిన స్టీవ్ జాబ్స్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్.. ప్రముఖ వ్యాపారవేత్త డేవ్ థామస్ల జీవితాల్లో ప్రపంచానికి పెద్దగా తెలియని, అత్యంత ప్రభావవంతమైన ఒక కామన్ పాయింట్ ఉంది. వారంతా ‘దత్తత’ సంతానమే!అననుకూల పరిస్థితుల నడుమ అస్థిరతలను అధిగమించి దత్తత తీసుకున్న కుటుంబాల ఆదరణతో వారు ఎలా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారో వివరించే ప్రత్యేక విశ్లేషణ ఇది.స్టీవ్ జాబ్స్..యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పుట్టుక ఒక సంక్లిష్ట పరిస్థితిలో జరిగింది. పీహెచ్డీ చేస్తున్న సిరియన్ విద్యార్థి అబ్దుల్ ఫత్తా జందాలీ, స్విస్-జర్మన్ సంతతికి చెందిన జోవాన్ స్కీబుల్ దంపతులకు ఆయన జన్మించారు. అయితే, జోవాన్ తల్లిదండ్రులు వీరి సంబంధాన్ని నిరాకరించడంతో ఆమె ‘క్లోజ్డ్ అడాప్షన్’ ప్రక్రియను ఎంచుకోవాల్సి వచ్చింది.మొదట ఒక ధనిక జంట జాబ్స్ను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చినా మగపిల్లాడు అని తెలియగానే వెనక్కి తగ్గారు. ఆ తర్వాత శ్రామిక వర్గానికి చెందిన పాల్, క్లారా జాబ్స్ దంపతులు స్టీవ్ను దత్తత తీసుకున్నారు. తమ ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అతడిని ఉన్నత చదువులు చదివిస్తామని వారు జాబ్స్ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మాటిచ్చారు.తనను పెంచిన తల్లిదండ్రుల పట్ల జాబ్స్ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉండేవారు. వారే నా నిజమైన తల్లిదండ్రులు అని ఆయన గర్వంగా చెప్పుకునేవారు. తనను కన్న తల్లిదండ్రులను కేవలం ఒక స్పెర్మ్, ఎగ్ బ్యాంక్గా మాత్రమే ఆయన అభివర్ణించడం గమనార్హం. పాల్, క్లారాల పెంపకంలో లభించిన స్వేచ్ఛ, ఉత్సుకతలే ఆ తర్వాత కాలంలో యాపిల్, పిక్సర్ వంటి విప్లవాత్మక సంస్థల స్థాపనకు పునాది వేసాయి.జెఫ్ బెజోస్ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అసలు పేరు ‘జెఫ్రీ ప్రెస్టన్ జోర్గెన్సెన్’. ఆయన జన్మించిన 17 నెలలకే తల్లి జాక్లిన్ తండ్రి నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒంటరి తల్లిగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. జెఫ్కు నాలుగేళ్ల వయసున్నప్పుడు క్యూబా వలసదారుడైన మిగ్యుల్ మైక్ బెజోస్ను జాక్లిన్ వివాహం చేసుకున్నారు.మైక్ బెజోస్ జెఫ్ను చట్టబద్ధంగా దత్తత తీసుకుని తన ఇంటిపేరును ఇచ్చారు. మైక్ అందించిన స్థిరమైన కుటుంబ వాతావరణం, క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధత జెఫ్ బెజోస్ జీవితాన్ని మలుపు తిప్పాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో జెఫ్ ప్రయోగాలకు మైక్ పూర్తి మద్దతునందించారు. దత్తత ద్వారా లభించిన ఈ అవకాశం తనలో వ్యూహాత్మక ఆలోచనలను, అపజయాలను తట్టుకునే శక్తిని పెంచిందని బెజోస్ పలుమార్లు గుర్తుచేసుకున్నారు.లారీ ఎల్లిసన్సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ బాల్యం మరింత సంఘర్షణలతో కూడుకున్నది. న్యూయార్క్ నగరంలో 19 ఏళ్ల ఒంటరి తల్లికి జన్మించిన లారీ, చిన్నప్పుడే తీవ్రమైన న్యూమోనియా బారిన పడ్డారు. అనారోగ్యం, పేదరికం కారణంగా ఆమె లారీని దత్తత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. చికాగోలో నివసించే ఆమె అత్తామామలు లిలియన్, లూయిస్ ఎల్లిసన్ లారీని చేరదీశారు.తల్లిగా మారిన అత్త లిలియన్ లారీకి ఎనలేని ప్రేమను పంచగా మామ లూయిస్ కఠినంగా, దూరంగా ఉండేవారు. చికాగో సౌత్ సైడ్లోని నిరాడంబర వాతావరణం, ఈ సంక్లిష్ట కుటుంబ పరిస్థితులు లారీలో తీవ్రమైన ఆశయాన్ని పెంచాయి. తన 12వ ఏట దత్తత వాస్తవాన్ని గ్రహించిన లారీ 48 ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు తనను కన్న తల్లిని కలవలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణమే ఆయనను ఒక పట్టుదల కలిగిన విజేతగా మార్చింది.డేవ్ థామస్ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ ‘వెండీస్’ వ్యవస్థాపకుడు డేవ్ థామస్ జీవితం కూడా దత్తతతో ముడిపడి ఉన్నదే. రెక్స్ డేవిడ్ థామస్గా జన్మించిన ఆయనను న్యూజెర్సీకి చెందిన రెక్స్, ఔలేవా థామస్ దంపతులు శిశువుగా ఉన్నప్పుడే దత్తత తీసుకున్నారు. అయితే, ఐదేళ్ల వయసులోనే దత్తత తల్లిని కోల్పోవడం, ఆ తర్వాత వరుస కుటుంబ నష్టాలు ఆయనను కుదిపేశాయి. దత్తత ప్రాధాన్యతను గుర్తించిన ఆయన అనాథ పిల్లలకు శాశ్వత గృహాలను కల్పించేందుకు ‘డేవ్ థామస్ ఫౌండేషన్ ఫర్ అడాప్షన్’ను స్థాపించి సమాజానికి సేవ చేస్తున్నారు.ఈ నలుగురు బిలియనీర్ల కథలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పుట్టుక లేదా తొలినాళ్లలో అస్థిరతలు మనిషి భవిష్యత్తును నిర్ణయించలేవు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు అందించిన ప్రేమ, మార్గదర్శకత్వం, స్థిరత్వమే ఈ ముగ్గురిని గ్లోబల్ టెక్ దిగ్గజాలను, ఒక వ్యాపార సామ్రాజ్యాధినేతను ప్రపంచానికి బహుమతిగా ఇచ్చాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకున్న వీరి జీవితాలు నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకం.ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు! -
పసిడి దిగుమతులు భారం
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు ఏప్రిల్లో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 81.69 శాతం పెరిగి 5.62 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.53,390 కోట్లు) చేరాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వెండి దిగుమతులు సైతం 157 శాతం పెరిగి 411 మిలియన్ డాలర్లకు (రూ.3,904 కోట్లు) చేరాయి. అయితే, మే 13 నుంచి పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన నేపథ్యంలో రానున్న నెలల్లో ఇవి తగ్గుముఖం పడతాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. వెండిని పారిశ్రామిక అవసరాలకు సైతం వినియోగిస్తున్నందున సుంకం పెంపు ప్రభావం దిగుమతులపై తక్కువే ఉండొచ్చన్నారు. కాకపోతే వినియోగ ఆధారిత అవసరాలు దిగొస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద యూఏఈ నుంచి పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గినట్టు చెప్పారు. యూఈఏతో మన దేశానికి వాణిజ్య ఒప్పందం ఉండడంతో అక్కడి నుంచి వచ్చే పసిడిపై సుంకాల్లో 1% రాయితీ ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) బంగారం దిగుమతులు విలువ పరంగా అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 24%పెరిగి 71.98 బిలి యన్ డాలర్లకు చేరడం గమనార్హం. పరిణామం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులుగా ఉన్నా యి. వెండి దిగుమతులు కూడా విలువ పరంగా 150% ఎగసి 12 బిలియన్ డాలర్లకు, పరిమాణంపరంగా 42%పెరిగి 7,335 టన్నులకు చేరాయి. పుంజుకున్న వస్తు ఎగుమతులు అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అనిశి్చతుల మధ్య దేశ ఎగుమతుల రంగం ఏప్రిల్లో బలమైన పనితీరు చూపించింది. వస్తు ఎగుమతులు 43.56 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది నాలుగేళ్లలోనే నెలవారీ గరిష్ట రికార్డు. → వస్తు దిగుమతులు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 10 శాతం ఎగసి 71.94 బిలియన్ డాలర్లకు చేరాయి. → వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం) 28.38 బిలియన్ డాలర్లకు విస్తరించింది. → ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు 40 శాతం (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) పెరిగి 5.17 బిలియన్ డాలర్లకు చేరాయి. → పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు సైతం 34.66 శాతం ఎగసి 9.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → ఇంజనీరింగ్ ఎగుమతులు 8.76 శాతం, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు 7.12 శాతం చొప్పున పెరిగాయి. → యూఎస్–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి ద్వారా రవాణాకు ఆటంకాలు ఏర్పడడంతో.. పశ్చిమాసియా ప్రాంతానికి ఎగుమతులు ప్రభావితమయ్యాయి. 28 శాతం తగ్గి 4.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఆ ప్రాంతం నుంచి మన దేశానికి దిగుమతులు సైతం 31.64% తగ్గి 10.47 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → ముడి చమురు దిగుమతులు ఏప్రిల్లో 10 శాతం క్షీణించి 18.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → సేవల ఎగుమతులు 37.24 బిలియన్ డాలర్లకు చేరాయి. 2025 ఏప్రిల్లో ఉన్న 32.85 బిలియన్ డాలర్లతో పోల్చితే 14 శాతం వరకు పెరిగాయి. సేవల దిగుమతులు 16.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
త్వరలో ట్రావెల్ ట్యాక్స్.. విదేశాలకెళ్తే వాయింపే!
అంతర్జాతీయ పరిణామాలతో వేగంగా కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలను (డాలర్లు) కాపాడుకోవడం కోసం ‘బంగారం కొనడాన్ని తగ్గించుకోండి. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ ప్రయాణాలను తగ్గించుకోండి అంటూ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకు అనుగుణంగానే ఇందులో మొదటి రెండింటినీ కట్టడి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పసిడి కొనుగోళ్లకు కాస్త అడ్డుకట్ట వేసేందుకు బంగారంపై సుంకాలను పెంచింది. అలాగే పెట్రోల్ ధరలను తాజాగా పెంచింది. ఇక, ఇప్పుడు విదేశీ ప్రయాణాల వంతు వచ్చింది. అనవసర విదేశీ విహారయాత్రలు, పర్యటనలను తగ్గించే దిశగా ఫారిన్ ట్రావెల్ని మరింత ఖరీదైన వ్యవహారంగా మార్చబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలపై ట్యాక్స్లు/సెస్సులు/సర్చార్జీలు వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైతే ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, రేపో మాపో వడ్డించడమైతే ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలికంగా ఏడాది పాటు వర్తించేలా ట్యాక్స్ విధించవచ్చని భావిస్తున్నారు. విదేశీ పర్యటనలపై విధించే ట్యాక్సులు, సెస్సులు, సర్చార్జీల ద్వారా వచ్చే నిధులు మొత్తం కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ఖాతాలోకి కాకుండా నేరుగా కేంద్రం ఖాతాలోకే వెళ్లొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇలా వచ్చిన నిధులతో, క్రూడాయిల్ దిగుమతుల వ్యయాల భారాన్ని కాస్త భర్తీ చేసుకోవచ్చనే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నాయి. దీనిపై అత్యున్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 232 బిలియన్ డాలర్ల టూరిజం పరిశ్రమ.. దాదాపు 231.6 బిలియన్ డాలర్ల విలువతో భారత్ టూరిజం రంగం ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో నాలుగో స్థానానికి ఎగబాకుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రంగం దేశీయంగా 10 శాతం మేర ఉద్యోగాలను కల్పిస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, వీసాల లభ్యత సులభతరం కావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం, డెస్టినేషన్ వెడ్డింగ్ల్లాంటి అంశాలతో విదేశీ ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఫారిన్ ట్రావెల్ సెగ్మెంట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2024లో విదేశీ పర్యటనల వ్యయాలు సుమారు 18.82 బిలియన్ డాలర్లుగా ఉండగా 2034 నాటికి 55.39 బిలియన్ డాలర్లకు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. 2025లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 6 శాతం పెరిగి 3.27 కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ ప్రయాణాల విషయంలో 2019లో 10వ స్థానంలో ఉన్న భారత్ 2027 నాటికి అయిదో స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇది సంతోషించాల్సిన విషయమే అయినప్పటికీ ప్రస్తుతం డాలర్ నిల్వలను కాపాడుకోవాల్సి వస్తుండటంతో అనవసర విదేశీ పర్యటనలకు కళ్లెం వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశీ ట్రావెల్కి దన్ను.. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపుతో దేశీయంగా పర్యాటకానికి ఊతం లభించవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమం ద్వారా విదేశీ టూరిస్టులను కూడా ఆకర్షించగలిగితే ఆ విధంగా ఫారెక్స్ని సమకూర్చుకునేందుకు వీలవుతుందని ట్రావెల్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ ఫ్లైట్స్ రేట్లకు రెక్కలు.. ఇంధన వ్యయాలు, గగనతలాలపై ఆంక్షలు, నిర్వహణపరమైన అనిశి్చతులతో ఇప్పటికే పలు అంతర్జాతీయ రూట్లలో ఫ్లయిట్ చార్జీల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎయిరిండియాలాంటి దేశీ విమానయాన సంస్థలు భారాన్ని భరించలేక కొన్ని రూట్లలో ఫ్లయిట్స్ని రద్దు కూడా చేస్తున్నాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో వారానికి దాదాపు వంద ఇంటర్నేషనల ఫ్లయిట్ సరీ్వసులను తగ్గించుకుంటున్నట్లు ఎయిరిండియా తెలిపింది. అలాగే ఏడు రూట్లలో సరీ్వసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో మొత్తం మీద విదేశీ రూట్లలో సీట్లు సుమారు 27 శాతం తగ్గుతాయని పేర్కొంది. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగినంత వరకు ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్పై ప్రభావం తప్పదని ట్రావెల్ బుకింగ్ అగ్రిగేటర్ సంస్థ ఇక్సిగో వర్గాలు పేర్కొన్నాయి. (సాక్షి బిజినెస్ డెస్క్) -
18 సార్లు లాటరీ విన్.. లక్కీ మ్యాన్ ‘జాక్పాట్’ సీక్రెట్ ఇదే..
కొందరి జీవితాల్లోకి అదృష్టం ఎప్పుడో ఒకసారి అతిథిలా వస్తుంది. కానీ అమెరికాకు చెందిన రాబర్ట్ బెవాన్ విషయంలో మాత్రం అదృష్టం ఆయన ఇంటి సొంత మనిషిలా మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 18 సార్లు లాటరీ గెలుచుకుని ఆయన సృష్టించిన రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, గెలిచిన ఈ లాటరీ డబ్బు కంటే కూడా, తన అసలైన అదృష్టం ఏదో ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.18వ సారి మెరిసిన అదృష్టంఇడాహో లాటరీ నిర్వహించిన "1,000,000 డాలర్ల కింగ్ స్క్రాచ్ గేమ్"లో రాబర్ట్ బెవాన్ తన 18వ విజయాన్ని నమోదు చేశారు. ఒకే వ్యక్తి ఇన్నిసార్లు లాటరీ గెలవడంపై ఇడాహో లాటరీ సంస్థ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. "ఒక్కరే 18 సార్లు మెరవడం సాధ్యమా? రాబర్ట్ బెవాన్ విషయంలో అది నిజమైంది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లాటరీ అధికారులు పాత రికార్డులను పరిశీలించగా ఈయన ‘శాశ్వత విజేత’ అనే విషయం వెలుగులోకి వచ్చింది.1997లోనే మొదలైన ప్రయాణంరాబర్ట్ అదృష్ట ప్రయాణం నిన్న ఈరోజు మొదలైంది కాదు. 1997లోనే ఇడాహో లాటరీ వారి "బ్లేజర్ బక్స్" ప్రమోషన్ ద్వారా ఆయన మొదటిసారి ఒక లగ్జరీ ‘చేవ్రొలెట్ బ్లేజర్’ కారును గెలుచుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు రకరకాల లాటరీల్లో 1,000 నుండి 2,00,000 డాలర్ల వరకు అనేక బహుమతులను సొంతం చేసుకున్నారు.‘నా అసలైన జాక్పాట్ నా భార్యే!’ఇటీవల లాటరీ కార్యాలయానికి బహుమతి డబ్బు తీసుకోవడానికి వచ్చిన రాబర్ట్ను అధికారులు ఒక ప్రశ్న అడిగారు. "మీ వరుస విజయాల రహస్యం ఏమిటి?" అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం అందరి కళ్లు తెరిపించింది. "నా నిజమైన అదృష్టం ఈ లాటరీ డబ్బు కాదు. గత 40 ఏళ్లుగా ప్రతి కష్టంలో, సుఖంలో నాకు తోడుగా నిలిచిన నా ప్రియమైన భార్యే నా అసలైన జాక్పాట్. చాలా ఏళ్లుగా సరదా కోసం ఇద్దరం కలిసి లాటరీ టికెట్లు కొనడం మా జీవితంలో ఒక అలవాటుగా మారింది" అని రాబర్ట్ ఎంతో భావోద్వేగంగా చెప్పారు.వ్యసనం కాదు.. కేవలం ఒక వ్యాపకంలాటరీ అనేది చాలామందికి ఒక వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తుంటే, రాబర్ట్ దంపతులు మాత్రం దీన్ని కేవలం ఒక చిన్న కాలక్షేపంగా, వినోదంగా మాత్రమే చూశారు. గెలిచిన డబ్బు జీవితంలో ఆనందాన్ని ఇస్తుందేమో కానీ, అదే జీవిత పరమార్థం కాదని ఆయన స్పష్టం చేశారు.మరో విశేషమేమిటంటే, తాము కొనే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాల అభివృద్ధికి ఉపయోగపడుతుందనే సంతృప్తి కూడా ఈ దంపతుల్లో ఉంది.నెటిజన్ల ప్రశంసలుడబ్బు కంటే కుటుంబ బంధాలే మిన్న అని చాటిచెప్పిన రాబర్ట్ వైఖరిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. "డబ్బు ఉన్నవాడు కాదు, ఇంత మంచి మనసున్న ఈయనే నిజమైన మిలియనీర్" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లక్కీ మ్యాన్ రాబర్ట్ బెవాన్ కథ మనకు ఒకే ఒక్క విషయాన్ని గుర్తుచేస్తోంది. ప్రేమించే జీవిత భాగస్వామి తోడుగా ఉండటాన్ని మించిన అదృష్టం ప్రపంచంలో మరొకటి లేదు! View this post on Instagram A post shared by 🅘🅓🅐🅗🅞 🅛🅞🅣🅣🅔🅡🅨 (@idaholottery) -
ట్రంప్ది మామూలు ట్రేడింగ్ కాదు!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక పెట్టుబడుల వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తాజాగా బయటకు వచ్చిన ఆయన ఆర్థిక వెల్లడి (Financial Disclosure) నివేదిక, 2026 మొదటి త్రైమాసికంలో ఆయన ఖాతాల ద్వారా జరిగిన భారీ స్టాక్ ట్రేడింగ్ను బహిర్గతం చేసింది. అమెరికా ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్కు సమర్పించిన ఈ నివేదిక ప్రకారం.. జనవరి నుండి మార్చి మధ్య కేవలం 3 నెలల కాలంలోనే ట్రంప్ ఖాతాల ద్వారా ఏకంగా 3,600కు పైగా ఆర్థిక లావాదేవీలు జరగడం విశేషం.రూ. వేల కోట్ల ట్రేడింగ్ వాల్యూమ్!ఈ మూడు నెలల కాలంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువ సుమారు 220 మిలియన్ నుండి 750 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో వేల కోట్ల రూపాయలు) మధ్య ఉంటుందని అంచనా. ప్రముఖ వినోద, మీడియా సంస్థల్లో కూడా ట్రంప్ భారీగానే పెట్టుబడులు పెట్టారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీలో కనీసం 30,000 డాలర్లు పెట్టుబడి పెట్టగా.. డిస్నీకి సంబంధించిన ట్రేడింగ్ విలువ ఏకంగా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.టెక్ దిగ్గజాలపైనే గురి..ప్రపంచ మార్కెట్ను శాసిస్తున్న ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల్లో ట్రంప్ ఖాతాల ద్వారా భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ (Microsoft), బ్రాడ్కామ్, అమెజాన్ (Amazon), యాపిల్ (Apple) స్టాక్స్లో 1 మిలియన్ నుండి 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఏఎండీ, ఇంటెల్, ఆల్ఫాబెట్ (Google), గోల్డ్మన్ శాక్స్, ఎయిర్బీఎన్బీ, డోర్డాష్, మైక్రాన్, బ్లూమ్ ఎనర్జీ స్టాక్స్లో 5,00,000 నుండి 1 మిలియన్ డాలర్ల కొనుగోళ్లు జరిగాయి."మాకు సంబంధం లేదు"ఈ ట్రేడింగ్ హడావుడిపై 'ది హఫ్ పోస్ట్' ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆర్గనైజేషన్ స్పందించింది. ఈ లావాదేవీలతో ట్రంప్కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. "ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టుబడులన్నీ పూర్తిగా విచక్షణాధికార ఖాతాల (Discretionary Accounts) ద్వారానే సాగుతాయి. థర్డ్-పార్టీ ఆర్థిక సంస్థలు నిర్వహించే ఆటోమేటెడ్ పెట్టుబడి ప్రక్రియలు, సిస్టమ్స్ ద్వారానే ఈ పోర్ట్ఫోలియోలు రీబ్యాలెన్స్ అవుతుంటాయి, ట్రేడ్లు జరుగుతుంటాయి. ఏ స్టాక్ కొనాలి, ఏది అమ్మాలి అనే నిర్ణయాల్లో ప్రెసిడెంట్ ట్రంప్కు కానీ, ఆయన కుటుంబానికి కానీ, ట్రంప్ ఆర్గనైజేషన్కు కానీ ఎలాంటి పాత్ర లేదు. ఏ ట్రేడింగ్ జరుగుతుందనే ముందస్తు సమాచారం కూడా వారికి ఉండదు." అని ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రతినిధి వివరించారు. -
సామాన్యుడికి చమురు చిచ్చు
సాక్షి, బిజినెస్ డెస్క్: పెట్రో ధరల భారం ఎప్పుడూ పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే ఆగదు. ప్రతి వంటగదిలోకి, ప్రతి పొలంలోకి, ప్రతి కుటుంబ బడ్జెట్లోకి చొరబడుతుంది. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి ప్రజలు వంటగ్యాస్కు ఎక్కువ చెల్లిస్తున్నారు. రైతులు డీజిల్ ధరను ఎక్కువ భరిస్తున్నారు. కారి్మకులు రవాణాకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలతో అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదల అదనపు భారాన్ని మోపుతుంది. అండర్ రికవరీల పేరుతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలపై ఆరి్ధక భారాన్ని మోపుతున్నాయని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.గత సంవత్సరాల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు ఆ లాభాలను చమురు సంస్థలు వినియోగదారులకు ఎప్పుడూ అందించలేదని, కానీ పెట్రోలియం ఉత్పత్తులపై భారీ పన్నుల భారం మాత్రం ప్రజలు సంవత్సరాలుగా భరించాల్సి వస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవనం అతలాకుతలమవుతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా సీఎన్జీ, డీజిల్ ధరల పెంపుతో ఆటో డ్రైవర్లు, రవాణా కారి్మకులు, ప్రజా రవాణాపై ఆధారపడే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే అవకాశముంది. ఇరాన్ యుద్ధం ప్రభావం ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తుండగా భారత్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆగి ఆగి ఎట్టకేలకు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచాయి. రెండు నెలలకు పైగా భారీ నష్టాలు భరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. అదే సమయంలో సీఎన్జీ ధరలను కూడా కిలోకు రూ.2 పెంచడంతో రవాణా రంగంపై అదనపు ఒత్తిడి పడింది. ప్రజా రవాణా వ్యవస్థలో డీజిల్ కీలక పాత్ర పోషిస్తుంది. డీజిల్పై ఆధారపడే ట్రక్కులు, బస్సులు, వ్యవసాయ యంత్రాలు, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు, మార్కెట్ సరఫరా గొలుసులన్నింటిపై ఇప్పుడు అదనపు భారం పడనుంది.రవాణా సంస్థలు ఇప్పటికే చార్జీలు కనీసం 3% పెరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. టాక్సీ, బస్సు రవాణా, డెలివరీ చార్జీలు కూడా వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు, పాలు, ధాన్యాలు, మందులు, నిత్యావసర వస్తువుల నుంచి ఆన్లైన్ డెలివరీల వరకు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్ ధరల పెంపుతో సాగు ఖర్చులూ పెరగనున్నాయి. రైతులు పంటలను మార్కెట్లకు తరలించే ఖర్చు కూడా పెరగడంతో ఆహార ధరలు మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం మళ్లీ వేగం? ఏప్రిల్లోనే రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, హోల్సేల్ ద్రవ్యోల్బణం 8.3 శాతానికి ఎగిసింది. ఇప్పుడు ఇంధన ధరల పెంపు కారణంగా వచ్చే మూడు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5% దాటే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెంపుతో రిజర్వ్ బ్యాంక్కు ద్రవ్యోల్బణ నియంత్రణ మరింత క్లిష్టం కానుంది. ఇప్పటికే వడ్డీ రేట్ల కోతలపై ఆశలు తగ్గిపోగా, ఇప్పుడు మరింత కఠిన ఆర్థిక విధానాలు కొనసాగించే పరిస్థితి ఏర్పడే అవకాశముంది. దీనివల్ల ధరలు మరింత పెరుగుతాయి. ఇంకా పెరిగే చాన్స్ ఉందా? ప్రస్తుతం చేసిన రూ.3 పెంపు ఆయిల్ కంపెనీల నష్టాలను పూర్తిగా భర్తీ చేయదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఈ ధరల పెంపు పూర్తి ఉపశమనం కాదని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 105–110 డాలర్ల వద్ద కొనసాగితే, ఇప్పటికీ రోజుకు వందల కోట్ల నష్టాలు తప్పవని అంచనా. పరిస్థితి మరింత దిగజారితే మరోసారి ఇంధన ధరల పెంపు కూడా తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.పెట్రోల్ ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్డీజిల్, ఏటీఎఫ్పై సుంకం తగ్గింపున్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ పెట్రోల్ ఎగుమతులను కట్టడి చేసి దేశీయంగా లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 3 చొప్పున ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) పేరిట విండ్ఫాల్ ట్యాక్స్ విధించింది. డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ. 23 నుంచి రూ. 16.5కి, విమాన ఇంధనంపై (ఏటీఎఫ్) రూ. 33 నుంచి రూ. 16కి తగ్గించింది. ఇవి మే 16 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై రోడ్, ఇన్ఫ్రా సెస్సు ఉండబోదని పేర్కొంది. నిర్దిష్ట పరిస్థితుల్లో ఇంధన సంస్థలకు వచ్చే అసాధారణ లాభాలపై తాత్కాలికంగా విధించే సుంకాలను విండ్ఫాల్ ట్యాక్స్గా వ్యవహరిస్తారు. -
2026 చివరి నాటికి.. టాటా కొత్త తరహా కార్లు!
టాటా మోటార్స్ భారత మార్కెట్లో కొత్త తరహా వాహనాలను ప్రవేశపెట్టేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో ముఖ్యమైనది ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వెహికల్ లాంచ్ చేయడం. దీనిని కంపెనీ 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో దేశీయ విఫణిలోకి ప్రవేశపెట్టనుంది.భారత ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే E20 (20% ఇథనాల్ మిశ్రమం) అమలులో ఉండగా, భవిష్యత్తులో E85, చివరికి E100 వరకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులకు అనుగుణంగా వాహన తయారీ సంస్థలు కూడా తమ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి.టాటా మోటార్స్ 2023 నుంచే తమ వాహనాలను E20 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తోంది. అంతే కాకుండా.. సంస్థ ఎలక్ట్రిక్, సీఎన్జీ, హైడ్రోజన్ వంటి పర్యావరణహిత సాంకేతికతలపై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను ప్రదర్శించింది. ఇందులో ముఖ్యంగా టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ ఆకర్షణీయంగా నిలిచింది.టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ కారు 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్నే ఉపయోగించినప్పటికీ, ECU, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎగ్జాస్ట్ వ్యవస్థలో మార్పులు చేసి ఇథనాల్ మిశ్రమాలను తట్టుకునేలా రూపొందించారు. ఇది పెట్రోల్తో పాటు అధిక శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడా సమర్థంగా పనిచేయగలదు.ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనం అంటే పెట్రోల్, ఇథనాల్ లేదా ఈ రెండింటి మిశ్రమంతో నడిచే వాహనం. ఎథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారయ్యే పర్యావరణహిత బయోఫ్యూయల్. ఇది సాధారణ పెట్రోల్తో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. -
రూ.4400 తగ్గిన గోల్డ్ రేటు.. కొత్త ధరలు ఇలా!
గురువారం ఉదయం రూ.2240 తగ్గిన పసిడి ధర, సాయంత్రానికి రూ.4420 తగ్గింది. దీంతో బంగారం రేటు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (మే 15) ఉదయం 2050 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర, సాయంత్రానికి 4050 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల ధర ఉదయం 2240 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో రూ.2180 (మొత్తం రూ.4420 తగ్గింది) తగ్గింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధర భారీ పతనం చవిచూసిందని స్పష్టంగా అర్థమవుతోంది.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.4,050 తగ్గి రూ.1,44,900 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.4200 తగ్గి 1,58,060 రూపాయల వద్ద నిలిచింది.చెన్నైలో కూడా బంగారం ధరల్లో మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,650 (2850 రూపాయలు తగ్గింది). 24 క్యారెట్ల ధర రూ.3100 తగ్గి 1,61,080 రూపాయల వద్దకు చేరింది. అయితే వెండి ధరల్లో సాయంత్రానికి చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. కాబట్టి సిల్వర్ రేటు ఉదయం ఎలా ఉందో.. అలాగే ఉంది.మొత్తం మీద.. వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటుకు బ్రేకులు పడినట్లు అనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా భారీ ధరల తగ్గుదల నమోదైంది. అయితే.. రానున్న రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
మేక్మైట్రిప్ కొత్త అప్డేట్.. వాయిస్తోనే బుకింగ్!
భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ తన ఏఐ బేస్డ్ ట్రావెల్ అసిస్టెంట్ ‘మైరా’లో కొత్త అప్గ్రేడ్ను ప్రవేశపెట్టింది. ఈ అప్డేట్ ముఖ్య ఉద్దేశ్యం.. వినియోగదారుల బుకింగ్ ప్రక్రియను పూర్తిగా సులభతరం చేసి, సెర్చింగ్ నుంచి చెల్లింపు వరకు మొత్తం ఒకే ఇంటర్ఫేస్లో పూర్తి చేయగలిగేలా చేయడం. అవసరమైతే వాయిస్ ఆధారిత విధానంలో కూడా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.'మైరా 2.0' ఇప్పుడు సాధారణ సెర్చ్లను మాత్రమే కాకుండా, చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది. క్లిష్టమైన ప్రయాణ అభ్యర్థనలను కూడా అర్థం చేసుకుని పరిష్కారం చూపుతుంది. ఉదాహరణకు.. కుటుంబ ప్రయాణాల కోసం ప్రత్యేక అవసరాలు ఉన్న హోటల్స్, వృద్ధుల కోసం సౌకర్యాలు లేదా వీసా సంబంధిత సమాచారం వంటి అంశాలను ఒకే చోట అందిస్తుంది. దీంతో వినియోగదారులు అనేక వెబ్సైట్లను పరిశీలించాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికపై పూర్తి సమాచారం పొందగలుగుతారు.ఈ కొత్త వెర్షన్లో.. వాయిస్ సపోర్ట్ కూడా ఉంది. తెలుగు సహా ఎనిమిది భాషల్లో.. వాయిస్ ద్వారా సెర్చ్, ఎంపికలు, బుకింగ్ వంటివి పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాయిస్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల, ఈ ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా.. వినియోగదారులు తమ పాస్పోర్ట్ లేదా ఇతర డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే, వాటి వివరాలను ఆటోమేటిక్గా గుర్తించి బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.మరో ముఖ్యమైన డెవలప్మెంట్ ఏమిటంటే.. చెల్లింపు ప్రక్రియను కూడా సంభాషణలోనే పూర్తి చేయగలగడం. వినియోగదారులు సెర్చ్ చేయడం, ఎంపిక చేయడం, కన్ఫర్మ్ చేయడం,పేమెంట్ చేయడం వరకు అన్ని దశలను ఒకే ఇంటర్ఫేస్లో పూర్తి చేయవచ్చు. అదేవిధంగా, బుకింగ్ మధ్యలో కూడా వినియోగదారులు ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు, దీంతో ప్రక్రియ మధ్యలో ఆగిపోకుండా కొనసాగుతుంది. -
పెరిగిన ఇంధన ధరలు: ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మూడు రూపాయలు పెరిగింది. అమెరికా - ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఇంధన ధరల పెంపును ప్రకటించారు. అయితే.. కొత్త కార్లు కొనేవారికి ఇంధన ధరల పెంపు భారమే అయినప్పటికీ.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఒకింత ఉపశమనం కలిగిస్తాయి. ఈ కథనంలో అలాంటి కార్లను గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి విక్టోరిస్మారుతి సుజుకి విక్టోరిస్ అనేది.. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నుంచి వచ్చిన రెండవ మిడ్సైజ్ ఎస్యూవీ. ఇది పెట్రోల్-హైబ్రిడ్ పవర్ట్రెయిన్తో పనిచేస్తుంది. కాబట్టి ఈ కారు లీటరుకు 28.65 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 16.38 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారు దేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్లలో ఒకటి. ఇది పెట్రోల్-హైబ్రిడ్ సెటప్తో 27.97 కి.మీ/లీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర దేశీయ విఫణిలో రూ. 16.72 లక్షల నుంచి రూ. 20.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది.హోండా సిటీ eHEVరెండు దశాబ్దాలకు పైగా మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా సిటీ eHEV ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్లలో ఒకటి. ఇది 27.26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ.20 లక్షలు (ఎక్స్ షోరూమ్).మారుతి సుజుకి సెలెరియోఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో మారుతి సుజుకి సెలెరియో కూడా ఒకటి. ఈ హ్యాచ్బ్యాక్ లీటరుకు 26 కిలోమీటర్ల వరకు మైలేజీని కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ. 5.61 లక్షల నుంచి రూ. 6.73 లక్షల మధ్య ఉంటుంది. ఇది మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న మోడల్ కూడా.మారుతి సుజుకి స్విఫ్ట్2005లో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మారుతి సుజుకి స్విఫ్ట్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్బ్యాక్లలో ఒకటి. ఇది లీటరుకు 25.75 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ మైలేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ మాత్రమే అందిస్తుంది. దీని ధర రూ.రూ.7.04 లక్షల నుంచి రూ. 8.65 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. టోల్ ప్లాజాలు మాయం! -
వాహనదారుల్లో ఆందోళన.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
‘రాబోయే ఆదివారం నుంచి పెట్రోల్ బంకులు పనిచేయవు...’ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఒక వైరల్ పోస్ట్ సారాంశం ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, హరియాణా, పుదుచ్చేరి వంటి ప్రముఖ రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ పంపులు పూర్తిగా మూసివేస్తారనేది ఆ సందేశం సారాంశం. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులా కనిపించేలా సృష్టించిన ఈ నకిలీ పోస్ట్ వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో వేలాది సార్లు షేర్ కావడంతో వాహనదారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. ఇంధన ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ సున్నితమైన అంశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు చెప్పింది.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ఈ వైరల్ సందేశం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ పీఐబీ ఫ్యాక్ట్-చెక్ బృందం రంగంలోకి దిగింది. ఈ వాదనపై సమగ్ర దర్యాప్తు జరిపిన సంస్థ ఇదొక తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది.‘దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదా కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఆదివారాల్లో పెట్రోల్ పంపులను మూసివేయాలని ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమే. పౌరులెవరూ ఇలాంటి ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మవద్దు. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దు’ అని పీఐబీ విజ్ఞప్తి చేసింది.అకస్మాత్తుగా ఎందుకిలా?ప్రస్తుతం పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరుడుగట్టిన ఇంధన లభ్యత కొరత ఏర్పడింది. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో సింహభాగం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తగా ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో కీలకం. ప్రధాని పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం సంసిద్ధత మాత్రమే కానీ, భయాందోళనలు సృష్టించడం కాదు.ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు! -
డాలర్తో పోలిస్తే 96 మార్కు.. కారణాలివే..
భారత కరెన్సీ రూపాయి విలువ పతనం ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దిగువ స్థాయికి పడిపోయింది.ఈ రోజు (మే 15, 2026) ట్రేడింగ్ సెషన్లో రూపాయి విలువ 96 మార్కును దాటి రికార్డు స్థాయిలో 96.07 కనిష్ఠ స్థాయికి పతనమైంది. గడిచిన సెషన్లో 95.95 వద్ద ముగిసిన రూపాయి, నేడు ఉదయం డాలర్తో పోలిస్తే 95.74 స్థాయిల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ముడి చమురు ధరల పెరుగుదల, ఇరాన్-యూఎస్ ఉద్రిక్తతల కారణంగా మరింత క్షీణించి 0.3% నష్టంతో 96.05 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 7% మేర క్షీణించడం గమనార్హం.రూపాయి పతనానికి గల కారణాలు..బ్యారెల్ 110 డాలర్లకు చేరిన ముడి చమురుపశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు రవాణా సాగే కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేయడంతో గత 11 వారాలుగా చమురు ధరలు గరిష్ట స్థాయిల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 109 డాలర్ల వద్ద కదులుతుండగా యూఎస్ బెంచ్మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూఐటీ) బ్యారెల్కు 105 డాలర్ల స్థాయికి చేరుకుంది. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు వ్యాపారం అంతా డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, ధరలు పెరిగినప్పుడల్లా భారత్కు డాలర్ల అవసరం పెరిగి రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.ఆగని ఎఫ్పీఐల విక్రయాలు..దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ/ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇది గత ఏడాది (రూ.1.54 లక్షల కోట్లు) అవుట్ఫ్లో రికార్డును సైతం అధిగమించింది.మే 14 ఎన్ఎస్ఈ డేటా ప్రకారం: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికరంగా రూ.146 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు విదేశీ పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. తైవాన్, దక్షిణ కొరియా వంటి టెక్నాలజీ హబ్లుగా ఉన్న మార్కెట్లలోకి ఈ నిధులు మళ్లుతుండటంతో భారత రూపాయి విలువ మరింత బలహీనపడుతోంది.ఫలితాన్ని ఇవ్వని ట్రంప్, జిన్పింగ్ సమావేశంహార్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందని, తద్వారా అమెరికా-ఇరాన్ సంక్షోభం సద్దుమణుగుతుందని మార్కెట్లు ఆశగా ఎదురుచూశాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన రెండు గంటల సుదీర్ఘ శిఖరాగ్ర సమావేశం ఎటువంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. చర్చలు నమ్మశక్యం కాని విధంగా సాగాయని ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ యుద్ధ ప్రతిష్టంభనపై స్పష్టత రాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు నిరాశ అలుముకుంది. అమెరికా విధాన నిర్ణేతల (యూఎస్ ఫెడ్) వ్యాఖ్యలు, అక్కడ వెలువడిన ఆర్థిక గణాంకాలు డాలర్ను మరింత బలోపేతం చేశాయి.భారత్పై పడే ప్రభావం ఏమిటి?రూపాయి విలువ ఇలాగే 96 దిగువన కొనసాగితే దేశీయంగా ‘ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్’ (దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం) ముప్పు పొంచి ఉంది. ఇంధన ధరలతో పాటు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారం కానున్నాయి. విదేశీ విద్య, ప్రయాణాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. అయితే, రూపాయి విలువ విపరీతంగా పడిపోకుండా అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన విదేశీ నిల్వల (ఫారెక్స్ రిజర్వ్స్) ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు తిరిగి రావడంపైనే రూపాయి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు! -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 160.73 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 75,237.99 వద్ద, నిఫ్టీ 46.10 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 23,643.50 వద్ద నిలిచాయి.వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్, సాకర్ హెల్త్కేర్ లిమిటెడ్, అట్లాంటా లిమిటెడ్, షాడోఫాక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మోల్డ్-టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్, నవ లిమిటెడ్, ఎంఐఆర్సీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ లిమిటెడ్, బీటా డ్రగ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లీటర్ రూ.47 నుంచి రూ.110.. ఎందుకిలా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. అయితే, ఈ అభివృద్ధికి ఊతమిచ్చేది మాత్రం ముడి చమురే. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో వచ్చే ప్రతి చిన్న మార్పు సామాన్యుడి జేబుపైనే కాకుండా దేశ బడ్జెట్పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మే 15, 2026 నాటి తాజా పరిణామాల నేపథ్యంలో గత రెండు దశాబ్దాల (2006-2026) చమురు విపణిని, దేశీయ ధరల ఒడిదొడుకులను విశ్లేషిద్దాం.2006 నాటి ఇంధన ముఖచిత్రంసరిగ్గా రెండు దశాబ్దాల క్రితం అంటే 2006లో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు సగటున 60 నుంచి 65 డాలర్ల మధ్య ఊగిసలాడేవి. ఆ సమయంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నేటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేవి.2006లో ధరలు (న్యూఢిల్లీలో)..పెట్రోల్ లీటర్: సుమారు రూ.47.51డీజిల్ లీటర్: సుమారు రూ.32.472006వ సంవత్సరంలో ఒక అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ సగటున రూ.45.30గా ఉండేది. అప్పట్లో చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) ధరల నిర్ణయాధికారం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరిగినప్పటికీ ప్రభుత్వం రాయితీలు ఇస్తూ దేశీయంగా ధరలను అదుపులో ఉంచేది.నేటి పరిస్థితిపశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధ వాతావరణం, వ్యూహాత్మక చమురు రవాణా మార్గమైన హార్మూజ్ జలసంధిలో నెలకొన్న అడ్డంకుల కారణంగా అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా భగ్గుమంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 106 నుంచి 107 డాలర్ల వద్ద కొనసాగుతోంది.గత 11 వారాలుగా నష్టాలను భరిస్తూ ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆర్థికంగా భారం ఎక్కువ కావడంతో నేడు (మే 15, 2026) లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.నాటికీ నేటికీ తేడా ఏమిటి?2006తో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ధర దాదాపు 70% పెరిగితే దేశీయంగా రిటైల్ ధరలు మాత్రం 100% పైగా పెరిగాయి. ఈ తీవ్రమైన వ్యత్యాసానికి వెనుక బలమైన ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి.డాలర్తో రూపాయి విలువ క్షీణత2006లో ఒక అమెరికన్ డాలర్ విలువ సుమారు రూ.45గా ఉండేది. కానీ నేడు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా తగ్గింది. ముడి చమురును డాలర్లలోనే కొనుగోలు చేయాల్సి రావడం వల్ల క్రూడ్ ధరతో సంబంధం లేకుండా భారత్ చెల్లించే మొత్తం విపరీతంగా పెరిగింది.నియంత్రణ లేకపోవడం2010లో పెట్రోల్, 2014లో డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తొలగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలే స్వయంగా ధరలను సవరించే పద్ధతి అమల్లోకి వచ్చింది.పన్నుల నిర్మాణంప్రస్తుతం కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్ పన్నులు ఇంధన ధరల్లో సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. చమురు కంపెనీల నివేదికల ప్రకారం.. తాజా పెంపునకు ముందు కూడా కంపెనీలు పెట్రోల్పై లీటరుకు రూ.14, డీజిల్పై లీటరుకు రూ.16 వరకు నష్టపోవాల్సి వచ్చింది.వృద్ధి పథంలో భారత్భారతదేశం ప్రస్తుతం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉంది. పారిశ్రామికీకరణ, రవాణా రంగాలు ఊపందుకున్నాయి. అయితే మన అవసరాలకు కావాల్సిన ముడి చమురులో దాదాపు 85 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారత అంతర్గత ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏప్రిల్ 2026లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఇంధన ధరల కారణంగా 42 నెలల గరిష్టానికి (8.3 శాతం) చేరింది.చమురు సంక్షోభంఈ అంతర్జాతీయ చమురు సంక్షోభం భారత్కు ఒక హెచ్చరిక లాంటిది. ఇంధన ఒడిదొడుకుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే కేవలం దిగుమతులపైనే ఆధారపడితే సరిపోదు. రాబోయే రోజుల్లో వ్యూహాత్మక చమురు నిల్వలను మరింత పెంచుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ బ్లెండింగ్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు భారత్ మరింత వేగంగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా భారత వృద్ధి సాగిపోతుంది.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
జాబ్ వదిలి బిజినెస్ చేస్తే.. జీవితం ఇంత కష్టమా?
ఉద్యోగం చేసే చాలామంది.. జాబ్ వదిలేసి సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని అనుకుంటారు. ఇలాంటి సలహాలే చాలామంది చెబుతుంటారు కూడా. కానీ అదంతా తప్పు, అనుకున్నంత సులభమేమీ కాదంటున్నారు.. యువ వ్యాపారవేత్త మెహుల్ అగర్వాల్. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ క్రియేటర్.. యువ వ్యాపారవేత్త మెహుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో సర్వత్రా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇందులో ఉద్యోగాన్ని వదిలి సొంత వ్యాపారం ప్రారంభించడం ఎంత కష్టమైన ప్రయాణమో ఆయన నిజాయితీగా వివరించారు.సాధారణంగా చాలామంది 'జాబ్ వదిలేస్తే స్వేచ్ఛ వస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది' అని భావిస్తారు. కానీ జాబ్ వదిలేశాక తెలుస్తుంది ఎన్ని బాధ్యతలు పెరుగుతాయో. ఈ విషయాలను ఆయన తన అనుభవం ద్వారా వెల్లడించారు.మెహుల్ ప్రకారం.. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిన మొదటి రోజు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఉదయం త్వరగా లేచి తన కంపెనీ భవిష్యత్తు కోసం వచ్చే మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేశాడు. కొత్త ప్రయాణం ప్రారంభమవుతోందనే ఆనందం అతనిలో కనిపించింది. రెండో రోజు ఆ ప్రణాళికను మళ్లీ మార్చి మరింత మెరుగుపరచడానికి ప్రయత్నించాడు. అయితే.. మూడో రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన నిర్ణయం సరైందా కాదా అనే అనుమానాలు మొదలయ్యాయని మెహుల్ తెలిపాడు.భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక భయం, ఆందోళన కలిగాయని చెప్పాడు మెహుల్ వీడియోలో వెల్లడించారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు బాస్ పని మాత్రమే అప్పగించేవాడు, కానీ ఇప్పుడు అన్ని పనులు తానే చూసుకోవాల్సి వచ్చిందని వివరించారు. దీన్నిబట్టి చూస్తే ఒక వ్యాపారవేత్త ఎదుర్కొనే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది.అయితే.. తాను తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదని మెహుల్ పేర్కొన్నాడు. ఎందుకంటే నచ్చని, ఒత్తిడి కలిగించే ఉద్యోగాన్ని వదిలి, నచ్చిన పనిచేస్తూ ముందుకు వెళ్తున్నా అని వివరించాడు. వ్యాపారాన్ని నిర్మించే ప్రతి క్షణాన్ని తాను ఆస్వాదిస్తున్నానని కూడా తెలిపాడు. ఇది జీవితంలో మనసుకు నచ్చిన పనిని చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహాచేసేపనిలో కేవలం విజయం మాత్రమే కాదు.. అపజయం, కష్టాలు వస్తాయని.. ఆత్మవిశ్వాసం తగ్గినా రోజులు కూడా ఉన్నాయని మెహుల్ వీడియోలో వెల్లడించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇలాంటి భావోద్వేగాలను తాము కూడా ఎదుర్కొన్నామని కొందరు వెల్లడించారు. మరికొందరు వ్యాపార జీవితంలోని ఒత్తిడి, అనిశ్చితి గురించి నిజాయితీగా మాట్లాడినందుకు ఆయనను ప్రశంసించారు. -
అదానీపై యూఎస్ ఆరోపణల ఉపసంహరణ
భారతీయ పారిశ్రామిక దిగ్గజం, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీపై మోపిన క్రిమినల్ మోసం, లంచం ఆరోపణలను కొట్టివేయడానికి అమెరికా న్యాయ శాఖ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చర్యలు ప్రారంభించారు. గత ఏడాది కాలంగా అదానీ గ్రూప్ను వెంటాడుతున్న ఈ చట్టపరమైన అంశం ఒక్కసారిగా తొలగిపోవడం అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో చర్చకు దారితీసింది.ఫెడరల్ ప్రాసిక్యూషన్లో నాటకీయ మార్పుభారతదేశంలో లాభదాయకమైన సౌర శక్తి ఒప్పందాలను దక్కించుకోవడానికి దాదాపు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించారనేది అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో పాటు ఇతర అధికారులపై ఉన్న ప్రధాన ఆరోపణ. అమెరికా పెట్టుబడిదారుల నుంచి బిలియన్ల డాలర్ల మూలధనాన్ని సేకరించే క్రమంలో ఈ విషయాన్ని దాచిపెట్టి వారిని తప్పుదోవ పట్టించారని 2024 చివరలో న్యూయార్క్లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అప్పటి అమెరికా అధికారులు కేసు నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ నేరారోపణలను విరమించుకోవాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. సాక్ష్యాధారాల సమగ్రంగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.తెరపైకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. యూఎస్ ప్రాసిక్యూటర్లు ఈ ఆరోపణలను ఉపసంహరించుకుంటే ప్రతివాది తరఫున అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏకంగా 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధంగా ఉందనే ప్రతిపాదన ఈ నిర్ణయం వెనుక కీలక పాత్ర పోషించినట్లు సదరు కథనం పేర్కొంది. అమెరికా ఫస్ట్ విధానాన్ని నమ్మే ట్రంప్ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే ఈ ఆర్థిక దౌత్యం నడిచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.రాజకీయ సమీకరణాలుఈ కేసు ఉపసంహరణ అంతర్జాతీయ రాజకీయాలు, అమెరికా న్యాయ వ్యవస్థల కలయికపై తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత, వ్యూహాత్మక సంబంధాలు ఈ పరిణామానికి ముఖ్యమైన నేపథ్యంగా కనిపిస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. ఉన్నత స్థాయి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలపై ఆరోపణలను పక్కన పెట్టడం వెనుక అమెరికాకు ఉన్న అంతర్గత వ్యాపార, భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం పూర్తిగా కేసు యోగ్యతలపై(మెరిట్స్) మాత్రమే ఆధారపడి తీసుకుందని యూఎస్ న్యాయ శాఖ స్పష్టం చేసింది.‘ఇది అదానీ గ్రూప్నకు లభించిన భారీ విజయం. తమపై వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని వారు మొదటి నుంచి చెప్తున్న వాదనకు ఈ నిర్ణయంతో బలం చేకూరింది’ అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ విశ్లేషించింది. మరోవైపు, పారదర్శకతను కోరుకునే అంతర్జాతీయ చట్టపరమైన కార్యకర్తలు ఈ చర్యను విమర్శిస్తున్నారు. ఇంతటి భారీ అంతర్జాతీయ అవినీతి కేసును ఇలా అర్ధాంతరంగా కొట్టివేయడం వల్ల భవిష్యత్తులో కార్పొరేట్ అవినీతిపై జరిగే పోరాటాలు బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
బెంగళూరు టెక్కీ ఐడియాపై నెటిజన్ల డిబేట్!
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు నగరంలో జీవన వ్యయం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, నిత్యావసరాలు.. ఇలా చాలా వాటికి అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా రిమోట్ ఉద్యోగాలు చేసే వారి కోసం ఓ బెంగళూరు యువకుడు కొత్త ఆలోచన ప్రతిపాదించాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా.. ఉచిత వైఫై, ఫుల్ ఏసీ, మొబైల్/ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్లతో మాల్స్లోనే రోజంతా ప్రశాంతంగా ఆఫీస్ పని చేసుకోవచ్చంటూ అతడు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది.సీక్రెట్ స్పాట్స్ఇన్స్టాగ్రామ్లో అమోల్ నారంగ్ అనే కంటెంట్ క్రియేటర్ ‘బెంగళూరులో ఉచితంగా ల్యాప్టాప్పై కూర్చుని పని చేయండి - పార్ట్ 1’ అనే శీర్షికతో ఒక వీడియోను పంచుకున్నాడు. వైట్ఫీల్డ్ ప్రాంతంలోని ప్రముఖ మాల్ను ఎంచుకున్న అతడు, అక్కడ చట్టబద్ధంగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా పని చేయవచ్చో ఐదు లొకేషన్లతో సహా వివరించాడు. ‘వైట్ఫీల్డ్లో ఉచిత వైఫై, ఏసీ ఎలాంటి ఛార్జీ లేకుండా రోజంతా పని చేయవచ్చు’ అంటూ ఆ యువకుడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఐటీ కారిడార్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Amol Narang (@amol_narang)నెటిజన్ల స్పందనఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ ఐడియా భలే ఉందే అని మెచ్చుకుంటుంటే, మెజారిటీ ఐటీ నిపుణులు, నెటిజన్లు మాత్రం ఇందులోని ఇబ్బందులను, భద్రతా లోపాలను ఎత్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
సామాన్యుడి నెత్తిన వరుస పిడుగులు!
దాదాపు నాలుగేళ్ల తర్వాత మన దేశంలో.. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. అమెరికా-ఇరాన్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభం కారణంగా కచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని అటు కేంద్రం ఇటు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ పెరుగుదల కేవలం పెట్రోల్ బంకుల వద్దే ఆగిపోతుందనుకుంటే మన పొరపాటే!. పెట్రో వడ్డనతో సామాన్యుడి నెత్తి మీద వరుస పిడుగులు పడే అవకాశం ఉంది. రవాణా మొదలు వంటింటి దాకా.. అన్నింటిపైనా ప్రభావం చూపించే స్పష్టంగా అవకాశం కనిపిస్తోంది. తద్వారా ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సవాలు విసరనుంది. ఈ ప్రభావంతో ఏయే రేట్లు పెరుగుతాయంటే.. టికెట్ రేట్లు?పెట్రోలు ధరలు పెరగడం వల్ల కార్లు, బైకులు వాడే ప్రజలకు రోజువారీ ప్రయాణం ఖరీదు అయ్యింది. డీజిల్ ధరలు పెరగడం వల్ల బస్సులు, లారీలు, సరుకు రవాణా ఖర్చులు పెరిగే చాన్స్ ఉంది. ఫలితంగా ఆటో, క్యాబ్, మోటర్ ట్యాక్సీల ఛార్జీలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. రవాణా ఖర్చులు అన్ని రంగాలపై ప్రభావం చూపుతాయి. కుటుంబాలు వినోదం, అదనపు ఖర్చులను తగ్గించుకోవాల్సి రావొచ్చు!.గెట్ రెడీ..బంగారం, వెండి బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. కూరగాయలు, నిత్యావరాల రేట్లు పెరుగుతూ పోతున్నాయి. పాలు, పెరుగు ధరలనూ పెంచేశారు. ఇక రేపోమాపో వంటింటి గ్యాస్ ధర.. ఆ వెంటనే సబ్బులు, షాంపుల రేట్లు కూడా పెరిగే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు అన్నీ రోడ్డు రవాణా ద్వారా సరఫరా అవుతాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈ వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, ఆ భారం వినియోగదారులపై పడనుంది.సో.. వాటి రేట్లు పెరగడం దాదాపు ఖరారైనట్లే!.ఈ-కామర్స్ ద్వారా.. లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో ఫుడ్ డెలివరీ యాప్లు, ఈ-కామర్స్ కంపెనీలు డెలివరీ ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. డిస్కౌంట్లను వీలైనంతగా తగ్గించడం.. కనీస ఆర్డర్ విలువ పెరగడం వంటి మార్పులు జరగవచ్చు. ఇది ఇంతటితోనే ఆగిపోలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు డీజిల్ ఆధారిత ట్రాక్టర్లు, పంపులు వాడాల్సిన పరిస్థితి రావొచ్చు. దీంతో వ్యవసాయ ఖర్చులు పెరిగి, ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల తయారీ, వ్యవసాయం, రిటైల్, సేవలన్నింటిలో ఖర్చులు పెరుగుతాయి. అంతిమంగా.. దీర్ఘకాలంలో ఇంధన ధరలు స్థిరపడకపోతే.. ద్రవ్యోల్బణం మరింత పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. -
10 ఏళ్లలో తదుపరి తరానికి పగ్గాలు..
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ భవిష్యత్తు ప్రణాళికలపై ఆ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లలో కంపెనీ బాధ్యతలను తదుపరి తరానికి అప్పగించడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇదే క్రమంలో భారతీ టెలికాం వాటాను తిరిగి 50 శాతానికి పైగా పెంచుకోవాలన్న తన వ్యక్తిగత ఆకాంక్షను ఆయన పంచుకున్నారు.వారసత్వానికి రోడ్ మ్యాప్..ప్రస్తుతం సెప్టెంబర్ 30, 2031 వరకు ఐదేళ్ల కాలానికి బోర్డు ఛైర్మన్గా తిరిగి నియమితులైన మిట్టల్, తన పదవీకాలం ముగిసే సమయానికి సంస్థను పటిష్టమైన స్థితిలో వారసులకు అందించాలని భావిస్తున్నారు. గతంలో భారతీ టెలికాం 51% వాటాను కలిగి ఉండేది. ప్రస్తుతం ఇది కొంత తగ్గినప్పటికీ తాను తప్పుకునే సమయానికి తిరిగి 51% లేదా కనీసం 50% పైగా వాటాను ప్రమోటర్ల చేతుల్లోకి తీసుకురావాలని మిట్టల్ ఆశిస్తున్నారు.సంస్థాగత నిర్మాణంకంపెనీ నిర్వహణ మొత్తం ఒకే గొడుగు కింద ఉండాలని, ప్రమోటర్లు నియంత్రణ వాటాదారులుగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ‘ఇంతటి భారీ పరిమాణం ఉన్న సంస్థలో 10% వాటాను పెంచడం అంటే చిన్న విషయం కాదు, కానీ అది నా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
25 ఏళ్ల అనుభవం.. టెక్కీ ఆవేదన!
సాఫ్ట్వేర్ రంగం అంటే ఒకప్పుడు రాయల్ లైఫ్, భారీ ప్యాకేజీలు, నిరంతర అవకాశాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అపారమైన అనుభవం, అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ ఉద్యోగ వేటలో ఎదురవుతున్న సమస్యలు టెక్కీలను కుంగదీస్తున్నాయి. తాజాగా అమెరికాలోని విస్కాన్సిన్కు చెందిన ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.25 ఏళ్ల అనుభవం..ఆండ్రూ అనే టెక్కీకి సాఫ్ట్వేర్ రంగంలో పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఒక దశాబ్ద కాలం పాటు విజయవంతంగా వ్యాపారాలను నడిపిన ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ, గత కొంతకాలంగా ఆయన పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఏకంగా 2,000 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కనీసం ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాకపోవడం గమనార్హం.‘నేను అసలు ఉద్యోగానికి పనికిరానా అని నాకే సందేహం కలుగుతోంది. నా 25 ఏళ్ల అనుభవాన్ని అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ (ఏటీఎస్) ఫిల్టర్ చేసేస్తున్నాయా? లేదా నా రెజ్యూమె ఫార్మాట్లో లోపం ఉందా? ఏమీ అర్థం కావడం లేదు’ అంటూ ఆండ్రూ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు.తిరస్కరిస్తున్న ఏఐ వ్యవస్థలు?నేటి కార్పొరేట్ ప్రపంచంలో నియామక ప్రక్రియ అంతా ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల (ఏటీఎస్) చేతుల్లో ఉంది. వందలాది ఈమెయిల్స్ పంపినా సుమారు 100 మంది హైరింగ్ మేనేజర్లను నేరుగా సంప్రదించినా ఆండ్రూకు ఒక్క స్పందన కూడా రాలేదు. అనుభవం ఎక్కువగా ఉండటం వల్ల జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న భయం కంపెనీల్లో ఉండవచ్చని లేదా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారా అనే చర్చ దీనితో మొదలైంది. ‘ఇది కేవలం నా కెరీర్ సమస్య మాత్రమే కాదు. నా జీవన ప్రమాణాలను, నన్ను నమ్ముకున్న వారిని ప్రభావితం చేస్తోంది. ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందేమో’ అని ఆండ్రూ వాపోయారు.సోషల్ మీడియాలో సలహాలుఆండ్రూ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పలువురు నిపుణులు భిన్న సలహాలు ఇస్తున్నారు. ‘సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ నుంచి కన్సల్టింగ్, రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ బ్రోకరేజ్ వంటి రంగాలకు మారండి’ అంటు కొందరు సూచిస్తున్నారు. ‘మీ అనుభవంతో మరొకరికి ఉద్యోగం చేయడం కంటే మీరే యజమానిగా మారి స్టార్టప్ ప్రారంభించండి’ అని మరికొందరు సలహా ఇచ్చారు.I have a hard time believing that I am just unhireable. But I have an even harder time believing that my 25 years of experience is somehow negated by the format of my resume.But, after over 2,000 applications, I am not sure what else to think. And, out of the dozens of emails…— andrewthecoder (@_andrewthecoder) May 11, 2026ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా భారీగా లే-ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఎంట్రీ లెవల్, మిడ్ లెవల్ ఉద్యోగాల్లో పెను మార్పులు వస్తున్నాయి. ఆండ్రూ ఉదంతం కేవలం ఒక్క వ్యక్తి సమస్య మాత్రమే కాదు. గ్లోబల్ టెక్ మార్కెట్లో సీనియర్ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న అనిశ్చితికి అద్దం పడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మానవ వనరుల విలువను కేవలం సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్తో అంచనా వేయడం వల్ల ఇలాంటి ప్రతిభావంతులు నిరాశకు గురవుతున్నారు. కంపెనీలు తమ నియామక ప్రక్రియను మరింత మానవీయ కోణంలో పునసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సామ్ ఆల్ట్మాన్ ఓ నమ్మకద్రోహి! -
సామ్ ఆల్ట్మాన్ ఓ నమ్మకద్రోహి!
ప్రపంచ టెక్ రంగంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఎలాన్ మస్క్ వర్సెస్ ఓపెన్ ఏఐ న్యాయ పోరాటం కీలక దశకు చేరుకుంది. కృత్రిమ మేధ భవిష్యత్తును శాసించే ఈ కేసులో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో గురువారం ముగింపు వాదనలు జరిగాయి. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఒక అబద్ధాల కోరు అని, లాభాపేక్ష లేని సంస్థను తన సొంత లాభాల కోసం వాడుకున్నారని మస్క్ తరఫు న్యాయవాదులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు, మస్క్ తీరును ‘సెలెక్టివ్ ఆమ్నేసియా’గా ఓపెన్ ఏఐ అభివర్ణించింది.ముగింపు వాదనల్లోని ముఖ్యాంశాలుమస్క్ తరఫు న్యాయవాది స్టీవెన్ మోలో వాదనలు వినిపిస్తూ, సామ్ ఆల్ట్మాన్ కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. మాజీ బోర్డు సభ్యులు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుట్స్కెవర్ సహా ఐదుగురు సాక్షులు ఆల్ట్మాన్ తీరును తప్పుబట్టారని గుర్తు చేశారు. ‘ఈ కేసులో సామ్ ఆల్ట్మాన్ విశ్వసనీయతే అసలు ప్రశ్న. మీరు అతడిని నమ్మకపోతే ఈ కేసులో ప్రతివాదులు గెలవలేరు’ అని మోలో జ్యూరీకి విన్నవించారు.150 బిలియన్ డాలర్ల నష్టపరిహారంఓపెన్ ఏఐ సంస్థను మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలకు తాకట్టు పెట్టి సంస్థ అసలు ఆశయమైన మానవాళి సంక్షేమాన్ని విస్మరించారని మస్క్ ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన నష్టానికి గాను సుమారు 150 బిలియన్ డాలర్లు (రూ.12 లక్షల కోట్లకు పైగా) నష్టపరిహారాన్ని మస్క్ కోరుతున్నారు. ఈ మొత్తాన్ని లాభాపేక్ష లేని సంస్థకే చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్లను పదవుల నుంచి తొలగించాలని కోరారు.ఓపెన్ ఏఐ ఎదురుదాడిఓపెన్ ఏఐ న్యాయవాది విలియం సావిట్ మస్క్ వాదనలను కొట్టిపారేశారు. ‘మస్క్కు కొన్ని రంగాల్లో అపారమైన ప్రతిభ ఉండొచ్చు కానీ, ఏఐ విషయంలో మాత్రం కాదు. ఇక్కడ గెలవాలంటే ఆయన చేయగలిగింది కేవలం కోర్టుకు రావడమే’ అని ఎద్దేవా చేశారు. ఏఐ రంగంలో మస్క్ వెనకబడిపోయారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సారా ఎడ్డీ వాదించారు.‘సెలెక్టివ్ ఆమ్నేసియా’.. మస్క్పై విమర్శలు2018లోనే సంస్థకు నిధుల అవసరం ఉందని మస్క్కు తెలుసని, అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు లాభాలు చూశాక కోర్టుకు రావడం వెనుక దురుద్దేశం ఉందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ముఖ్యంగా కొన్ని కీలక పత్రాలను తాను చదవలేదని మస్క్ చెప్పడంపై న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యాపారవేత్తకు ‘సెలెక్టివ్ ఆమ్నేసియా’ (కావాల్సినవి మాత్రమే గుర్తుంచుకోవడం) ఉందని విమర్శించారు.మైక్రోసాఫ్ట్ పాత్రపై వివాదంఓపెన్ ఏఐ చేస్తున్న ప్రతి తప్పులోనూ మైక్రోసాఫ్ట్ భాగస్వామిగా ఉందని మస్క్ న్యాయవాదులు ఆరోపించారు. అయితే, తాము కేవలం బాధ్యతాయుతమైన పెట్టుబడిదారులమని, సంస్థ అంతర్గత నిర్ణయాల్లో జోక్యం లేదని మైక్రోసాఫ్ట్ న్యాయవాది రస్సెల్ కోహెన్ స్పష్టం చేశారు.తదుపరి ఏం జరగబోతోంది?ఈ కేసును విచారిస్తున్న తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ సోమవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది.మస్క్ గెలిస్తే: ఓపెన్ ఏఐ బోర్డులో భారీ మార్పులు, భారీ జరిమానా, సంస్థను తిరిగి లాభాపేక్ష లేనిదిగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.మస్క్ ఓడిపోతే: ఓపెన్ ఏఐ తన 1 ట్రిలియన్ డాలర్ ఐపీఓ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది.ఇదీ చదవండి: ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఒరాకిల్ షాక్ -
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు పెరిగి 23,761 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 214 పాయింట్లు పుంజుకుని 75,622 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.07బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.93 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.77 శాతం పెరిగింది.నాస్డాక్ 0.88 శాతం పుంజుకుంది.Today Nifty position 15-05-2026(time: 09:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఒరాకిల్ షాక్
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఐటీ దిగ్గజం ఒరాకిల్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. వ్యాపార పునర్నిర్మాణం, నియామక అవసరాల్లో మార్పులను సాకుగా చూపుతూ ఇప్పటికే ఎంపికైన విద్యార్థులకు ఇచ్చిన క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్లను, ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లను (పీపీఓ) సామూహికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో వందలాది మంది మేధావుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.ఒకే రోజులో 50కి పైగా ఆఫర్లు రద్దుసోషల్ మీడియా ప్లాట్ఫారమ్ రెడ్డిట్ వేదికగా బాధితులు తమ ఆవేదనను పంచుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐఐటీ హైదరాబాద్, కాన్పూర్, ఖరగ్పూర్ సహా ఎన్ఐటీలు, బిట్స్ పిలానీ క్యాంపస్ల నుంచి విద్యార్థులను ఒరాకిల్ ఎంపిక చేసుకుంది. డే-1 ప్లేస్మెంట్లోనే ఏడాదికి రూ.35 లక్షల కంటే ఎక్కువ ప్యాకేజీలతో ఈ ఆఫర్లు లభించాయి. అయితే కంపెనీ ఈ నియామకానలు రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో ఇప్పడు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినట్లయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కేవలం ఒకే రోజులో వివిధ క్యాంపస్ల నుంచి 50కి పైగా ఆఫర్లను కంపెనీ రద్దు చేసింది.వన్ స్టూడెంట్ - వన్ ఆఫర్ఐఐటీలు, ఎన్ఐటీలలో కఠినమైన ప్లేస్మెంట్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఒక విద్యార్థికి ఒక కంపెనీలో ఉద్యోగం వస్తే ఆ విద్యార్థి తదుపరి వచ్చే ఏ ఇతర కంపెనీ ఇంటర్వ్యూలకు హాజరుకాకూడదు. ‘మేము ఎంతో కష్టపడి డే-1 కంపెనీలో ఆఫర్ సాధించాం. కానీ ఇప్పుడు ఒరాకిల్ ఆఫర్ వెనక్కి తీసుకోవడంతో అటు పాత ఉద్యోగం లేదు.. ఇటు ఇతర కంపెనీలకు దరఖాస్తు చేసే అవకాశం పోయింది. ప్లేస్మెంట్ సీజన్ ముగింపు దశకు రావడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాం’ అని ఒక విద్యార్థి వాపోయారు.వరంగల్ ఎన్ఐటీ విద్యార్థుల ఆవేదననేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), వరంగల్ విద్యార్థులు సైతం ఈ ప్రభావానికి బలయ్యారు. అంతర్గత పునర్నిర్మాణం, హెడ్ కౌంట్ మార్పుల వల్ల తన పీపీఓ రద్దు చేసినట్లు ఒక విద్యార్థి లింక్డ్ఇన్లో వెల్లడించారు. దీనిపై స్పందించిన ఎన్ఐటీ వరంగల్ ‘సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్’ విద్యార్థుల తప్పిదం లేకపోయినా కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొంది. ఇప్పుడు ఈ విద్యార్థులు స్వతంత్రంగా(ఆఫ్ క్యాంపస్) ఉద్యోగాలు సాధించాల్సి ఉందని చెప్పింది.ఏఐ విప్లవం.. ఉద్యోగాల కోత!ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 2026 ఏప్రిల్ నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. అందులో భారతదేశం నుంచి సుమారు 12,000 మంది (40%) ఈ కోతలకు గురయ్యారు. క్లౌడ్, కమ్యూనికేషన్స్, మార్కెటింగ్, ఇంజినీరింగ్, నెట్ సూట్ ఇండియా డెవలప్మెంట్ వంటి కీలక విభాగాల్లో ఈ మార్పులు జరిగాయి.ఇదీ చదవండి: ఉగాండా గతి మార్చిన భారత్ -
ఇరాన్ యుద్ధంతో భగ్గుమంటున్న ముడిచమురు
(రమణమూర్తి మంథా): ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ఆగినా.. హార్మూజ్ జలసంధిలో మొదలైన చమురు సరఫరా సంక్షోభం ఇంకా మండుతూనే ఉంది. ఫలితం... అంతర్జాతీయంగా ముడి చమురు ధర బీభత్సంగా పెరుగుతోంది. బ్యారెల్ ధర 100 డాలర్లు దాటేసింది. ఈ ప్రభావం పెట్రోలు బంకులతో ఆగిపోదు. ప్రతి ఇంట్లోకీ చొరబడుతుంది. వాహనాలు లేనివారిక్కూడా కష్టాలు తప్పవు. ఎందుకంటే మనకు అవసరమైన ముడి చమురులో 85–90 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నదే. ధర పెరగటం వల్ల దిగుమతుల బిల్లు పెరిగి.. మన డాలర్ల నిల్వలు తరిగిపోతున్నాయి.దీంతో డాలర్ విలువ మరింత పెరుగుతూ రూపాయి పతనమవుతోంది. ఇదో వలయం. దీనిలో చిక్కి విలవిల్లాడుతున్న దేశాన్ని కాస్త గాడిన పెట్టడానికి బంగారం కొన్నాళ్లు కొనవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్క్ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. తనవంతుగా బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచేశారు. పెట్రో ధరలూ పెరగవచ్చన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ముడిచమురు సామాన్యుల జీవితంలో ఎలాంటి మార్పులు తేబోతున్నదో వివరించేదే ఈ ప్రత్యేక కథనం..అన్నింటిపై ప్రభాaవం..సామాన్యుడికి మొదట కనిపించేది పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటమే!. నిజానికి సంక్షోభం మొదలయ్యాక ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ భారాన్ని తామే మోస్తున్నాయి తప్ప జనంపై మోపలేదు. చమురు కంపెనీలు రోజుకు సుమారు రూ.1,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పూరీ చెప్పకనే చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అదే జరిగితే..అన్నిరకాల ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి..⇒ బైక్పై, కార్లపై ఆఫీసుకెళ్లేవారికి నెల ఖర్చు పెరుగుతుంది⇒ ఆటో, క్యాబ్ చార్జీలు పెరుగుతాయి⇒ బస్సు చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంటుందికూరగాయలు, నిత్యావసరాలు కూడా...డీజిల్ ధర పెరిగితే రైతు ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే.. ట్రాక్టర్లు డీజిల్పైనే నడుస్తాయి. బోర్లు, నీటి పంపులు ఇంధనంపై ఆధారపడతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. దీంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. పాల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. రవాణా ఖర్చు పెరగటమనేది ప్రతి వస్తువు ధరనూ ప్రభావితం చేస్తుంది. ఎల్పీజీ, హోటల్ బిల్లులు కూడా పెరుగుతాయిదేశానికి అవసరమైన ఎల్పీజీలో అత్యధిక భాగం దిగుమతుల ద్వారా వస్తున్నదే. సరఫరా ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్రం ఏకంగా 30 శాతానికి పైగా పెంచేసింది. ఇళ్లలో వాడే సాధారణ సిలిండర్లు ఇప్పటికీ ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా కావటం లేదు. ఈ గ్యాస్ ఇబ్బందులతో.. ఇప్పటికే చాలా టిఫిన్ సెంటర్లతో సహా రెస్టారెంట్లు, హోటళ్లు ధరలను పెంచేశాయి. ఇళ్లలో వండి సరఫరా చేసే హోమ్ కిచెన్లు కూడా మెనూను తగ్గించేయడంతో పాటు ధరలను స్వల్పంగా పెంచి ఈ ఇబ్బందిని తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విమాన టికెట్ల ధరలూ నింగిలోకి..విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కూడా క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది. కాబట్టి విమాన కంపెనీలు తమపై పడ్డ భారాన్ని అంతిమంగా ప్రయాణికుడిపైనే వేస్తాయి. ఫలితంగా ట్రావెల్ ప్యాకేజీలు ఖరీదవుతాయి. టూరిజం రంగంపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం వల్ల హోటల్ పరిశ్రమ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. కొన్ని ఎయిర్లైన్స్ ఇప్పటికే తాము విమానాలు నడిపే రూట్లను తగ్గించేశాయి. ధరలనూ పెంచవచ్చన్న సంకేతాలిస్తున్నాయి. రూపాయి విలువ పడిపోతుందికేంద్ర ప్రభుత్వం చమురును డాలర్లలో కొంటుంది. క్రూడ్ ధర పెరిగితే ఎక్కువ డాలర్లు అవసరం అవుతాయి. అప్పుడు ఉన్న డాలర్లను (ఫారెక్స్ నిల్వలు) వెచ్చించటంతో పాటు కొత్త డాలర్లు కొనాల్సి ఉంటుంది. డాలర్ను కొంటూ ఉంటే దాని విలువ పెరిగిపోతూ.. మనం వెచ్చించే రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు రూపాయి కనిష్ట స్థాయిలకు చేరటానికి ఇదే కారణం.ఈఎంఐలు పెరగొచ్చు!ముడిచమురు వల్ల అన్ని ధరలూ పెరిగితే... ద్రవ్యోల్బణం పెరిగినట్లే. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు దాన్ని నియంత్రించడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించకుండా జాగ్రత్తపడుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే తదనుగుణంగా హోమ్ లోన్ ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటుంది. పైపెచ్చు వ్యాపార రుణాలు ఖరీదవుతాయి. వినియోగం మందగిస్తుంది. ఇది మళ్లీ ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది. స్టాక్ మార్కెట్ షేక్చమురు ధరల కారణంగా సామాన్యులకు మాదిరిగానే కంపెనీలకూ ఖర్చులు పెరుగుతాయి. దీంతో లాభాలు తగ్గుతాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ సరిగ్గా లాభాలుండవేమోనన్న భయాలతో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. దీంతో షేర్లు పతనమవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే. నోట్: పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం, వాహనాల రద్దీ వంటి కారణాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు లేదా డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంది. బిహార్ దేశంలోనే అత్యంత తక్కువగా పెట్రోలు (3 లీటర్లు), డీజిల్(6 లీటర్లు) వినియోగిస్తోంది. కంపెనీలకు తిప్పలు చమురు ధరలు పెరిగితే ఎక్కువగా పెయింట్స్, సిమెంట్, కెమికల్స్, ఎయిర్లైన్స్, లాజిస్టిక్స్ రంగాలు దెబ్బతింటాయి. అయితే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీలు, కొన్ని ఎగుమతి సంస్థలు లాభపడే అవకాశం ఉంది. కాకపోతే ఇలా లాభపడే సంస్థలతో పోలిస్తే ఇబ్బందిపడే సంస్థలే ఎక్కువ. ప్రభుత్వానికి ఇబ్బందులు..చమురు ధరలు పెరిగితే ప్రభుత్వానికి ఆప్షన్లు చాలా తక్కువ ఉంటాయి. అయితే ధరలు పెంచాలి..లేదంటే పన్నులు తగ్గించాలి. ఈ రెండూ కాదంటే చమురు కంపెనీల నష్టాల్ని తానే భరించాలి. ఈ మూడింట్లో ఏది చేసినా కష్టమే. ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చు. పన్నులు తగ్గించినా, కంపెనీల నష్టాలను తాను భరించినా తన ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు.ఉపశమనం కలిగిస్తున్న అంశాలివే...⇒ ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇది కొంత ఉపశమనం ఇస్తోంది.⇒ మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనింగ్ దేశాల్లో ఒకటి. అందుకే సరఫరా నిర్వహణలో కొంత వెసులుబాటు ఉంది.⇒ ప్రస్తుతానికి మన దేశానికున్న ఫారెక్స్ నిల్వలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి.సామాన్యులు చేయాల్సిందేంటి?⇒ అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి⇒ కుటుంబ బడ్జెట్ను ముందే ప్లాన్ చేసుకోవాలి⇒ ఈఎంఐల విషయంలో జాగ్రత్తగా ఉండాలి⇒ సిప్లు, బంగారం, డిఫెన్సివ్ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి⇒ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించుకోవాలి -
టాటా మోటార్స్ పీవీ డీలా
ముంబై: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్(టీఎంపీవీ) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 5,878 కోట్లకు పరిమితమైంది. 2024–25 ఇదే కాలంలో రూ. 8,586 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం బలపడి రూ. 1.05 లక్షల కోట్లను తాకింది. జేఎల్ఆర్ తీరిలా: క్యూ4లో జేఎల్ఆర్ ఆదాయం 11 శాతం క్షీణించి 6.9 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది. నికర లాభం 64 కోట్ల పౌండ్ల నుంచి 36.5 కోట్ల పౌండ్లకు భారీగా వెనకడుగు వేసింది. కొత్త జాగ్వార్ విడుదల నేపథ్యంలో జేఎల్ఆల్ఆర్ మోడళ్లను తగ్గించడం, చైనాలో ఆటోమోటివ్ పరిశ్రమలో పోటీ వాతావరణం ప్రభావం చూపాయి. దీంతో జేఎల్ఆర్ అమ్మకాలు 15 శాతం క్షీణించి 95,300 యూనిట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది క్యూ4లో 1,11,400 యూనిట్లు విక్రయించింది. కాగా.. టాటా పీవీ ఆదాయం 49 శాతం జంప్చేసి రూ. 18,700 కోట్లను తాకింది. ఈవీలుసహా మొత్తం వాహన విక్రయాలు 37 శాతం ఎగసి తొలిసారి 2,01,800 యూనిట్లకు చేరాయి. -
భగ్గుమన్న టోకు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఏప్రిల్లో భగ్గుమంది. ముడి చమురు, ఇంధన ధరలు పెరగడంతో 8.3 శాతానికి ఎగబాకినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది 42 నెలల గరిష్ట స్థాయి. మార్చిలో ఉన్న 3.88 శాతంతో పోల్చితే ఒక్క నెల వ్యవధిలోనే భారీగా పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పశి్చమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరిగిపోవడం, మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్ ధరలు ఎగసిపడడం ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరేందుకు దారితీసింది. 2025 ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 0.85 శాతంగా ఉండడం గమనార్హం. రంగాల వారీగా ద్రవ్యోల్బణం తీరిది.. ∙అన్ని ప్రధాన రంగాల్లోనూ టోకు ధరలు పెరిగాయి. ప్రధానంగా ఇంధనం, విద్యుత్ రంగంలో ద్రవ్యోల్బణం అత్యధికంగా 24.71 శాతంగా నమోదైంది. మార్చిలో కేవలం 1.05 శాతమే ఉండటం గమనార్హం. -
పెట్రో మంట తప్పదా..?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఇక తప్పదా అనే చర్చ మళ్లీ వేడెక్కుతోంది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన కారణంగా ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే కోట్లకు పైగా అండర్ రికవరీ వస్తోందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా పెంచకుండా కొనసాగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు భారీగా పెరగడం, రూపాయి బలహీనపడటం వల్ల కంపెనీలపై భారం మరింత పెరిగింది. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా ఆయిల్ కంపెనీలు భారీ నష్టాలు భరించలేని స్థితికి వచ్చాయని సంకేతాలు ఇచ్చారు. పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే ధరల సవరణ తప్పనిసరికావచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా హెచ్చరించారు. అయితే ద్రవ్యోల్బణ భయం కారణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల తక్షణ పెంపు నిర్ణయంపై ఇంకా ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ యుద్ధ ఉద్రిక్తతల దెబ్బతో ప్రపంచ మార్కెట్లో పెరిగిపోతున్న ఇంధన రేట్లకు తగ్గట్లు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచకపోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నాయి. పెట్రోల్పై లీటరుకు రూ. 14, డీజిల్పై రూ. 42 మేర నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం నెలకు రూ. 55,416 కోట్ల మేర అండర్ రికవరీలు ఉంటున్నాయని అంచనా. ఈ నష్టాలను తగ్గించుకుని, తిరిగి గతేడాది స్థాయికి చేరుకోవాలంటే పెట్రోల్, డీజిల్ రేట్లను 20 శాతం మేర పెంచాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కనీసం రూ. 10 పెంచితే రూ. 17,000 కోట్ల మేర నష్టం భర్తీ అవుతుందని చెబుతున్నాయి. రేట్లు కొంత పెంచినా ఊరటే.. దేశీయంగా గత రెండు నెలలుగా, ప్రతి నెలా 37 లక్షల టన్నుల పెట్రోల్, 85 లక్షల టన్నుల డీజిల్ వినియోగం ఉంటోంది. దీంతో ఓఎంసీలపై భారం భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ కంపెనీలకు నెలకు రూ. 55,416 కోట్ల మేర నష్టాలు వస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో లీటరుకు రూ. 2 చొప్పున పెంచితే నెలవారీ అండర్ రికవరీలు రూ. 52,105 కోట్లకు, రూ. 4 పెంచితే రూ. 48.794 కోట్లకు తగ్గుతాయని భావిస్తున్నారు. రూ. 10 పెంచితే ఓఎంసీలకు రూ. 17,000 కోట్ల భారం తగ్గుతుందని, ఆదాయ నష్టం సుమారు రూ. 38,863 కోట్లకు దిగి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
బయటి నుంచి బంగారం.. ఇక 100 కేజీలే..!
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచిన మరుసటి రోజే.. పసిడి దిగుమతులపైనా పరిమితులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద ఆభరణాల ఎగుమతిదారులకు సున్నా సుంకంపై పసిడి దిగుమతిని 100కిలోలకు పరిమితం చేస్తున్నట్టు వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ప్రకటించింది.ఈ పథకం కింద 100 కిలోలకు మించి తదుపరి పసిడి దిగుమతుల కోసం అనుమతి కావాలంటే.. అప్పటికే కనీసం 50 శాతం ఎగుమతులను పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంతకుముందు వరకు ఈ పథకం కింద ఆభరణాల ఎగుమతిదారులు సున్నా సుంకంపై అపరిమితంగా పసిడి దిగుమతులకు అనుమతి ఉంది. ఆభరణాల ఎగుమతులకు ప్రోత్సాహకంగా దీన్ని తీసుకొచ్చారు. ఆభరణాల ఎగుమతులకు వినియోగించే ప్యాకేజింగ్ మెటీరియల్, ఇంధనం, ఆయిల్ తదితర వాటికీ సున్నా సుంకం ప్రయోజనాలున్నాయి.తాజా చర్యతో ఆభరణాల ఎగుమతులకు సంబంధించిన బంగారం దిగుమతులను సైతం క్రమబద్దీకరించేందుకు కేంద్రం నడుం బిగించినట్టు తెలుస్తోంది. అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ పథకం కింద మొదటిసారి దిగుమతులకు దరఖాస్తు చేసుకుంటే, తయారీ ప్లాంట్, సామర్థ్యాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వనున్నట్టు డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. దిగుమతి చేసుకున్న పసిడిని నిబంధనలకు అనుగుణంగా కచి్చతంగా ఆభరణాల ఎగుమతులకు వినియోగించేలా చూడడం, దుర్వినియోగాన్ని కట్టడి చేయడమే తాజా చర్యల ఉద్దేశంగా కనిపిస్తోంది. -
చిలుకూరు ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా హెచ్-1బీ వీసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించిన అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్ చిలుకూరు బాలాజీ టెంపుల్ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.మిస్సౌరీకి చెందిన సెనేటర్ ఎరిక్ ష్మిత్, ఎక్స్ (X) వేదికగా వరుస పోస్టులు చేస్తూ అమెరికా ఉపాధి ఆధారిత వీసా విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. హెచ్-1బీ, ఎల్-1, ఎఫ్-1, అలాగే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) వంటి వీసా కార్యక్రమాలు అమెరికన్ మధ్యతరగతి ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థ స్థానిక వేతనాలను తగ్గిస్తూ, అమెరికన్ ఉద్యోగులను పక్కన పెట్టే “గ్లోబల్ వీసా కార్టెల్”గా మారిందని పేర్కొన్నారు.“అమెరికన్ పన్ను చెల్లింపుదారుల సబ్సిడీలతో బిలియన్ల డాలర్లు ఇప్పుడు భారతదేశానికి ప్రవహిస్తున్నాయి. అవి అమెరికన్లకు కాకుండా విదేశీ కార్మికుల శిక్షణకు ఉపయోగపడుతున్నాయి” అని ఆయన తన పోస్టులో వ్యాఖ్యానించారు. తన వాదనకు ఉదాహరణగా చిలుకూర్ బాలాజీ ఆలయ చిత్రాన్ని షేర్ చేసిన ష్మిత్, దీనిని “వీసా టెంపుల్”గా అభివర్ణించారు. అమెరికా వర్క్ వీసాల కోసం వేలాది మంది భారతీయులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ, పాస్పోర్ట్లకు ఆశీర్వాదాలు పొందుతారని ఆయన పేర్కొన్నారు.“హైదరాబాద్లో ‘వీసా కార్టెల్’కు సొంతంగా ఒక వీసా దేవాలయం కూడా ఉంది. అక్కడ యూఎస్ వర్క్ వీసాల కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. అమెరికన్ కార్మికులు ఇలాంటి వ్యవస్థతో పోటీ పడాల్సిన అవసరం లేదు” అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు.ఇక విదేశీ విద్యార్థుల్లో దాదాపు సగం మంది భారతీయులేనని, వారికి పన్ను చెల్లింపుదారుల సబ్సిడీతో వర్క్ పర్మిట్లు లభిస్తున్నాయని ష్మిత్ ఆరోపించారు. “వారు తర్వాత హెచ్-1బీ, గ్రీన్ కార్డుల వైపు వెళ్తుంటే, భారీ విద్యారుణాలతో ఉన్న అమెరికన్ గ్రాడ్యుయేట్లు చౌకైన కార్మికులతో పోటీ పడాల్సి వస్తోంది” అని వ్యాఖ్యానించారు.అంతేకాకుండా, భారతీయ వీసా హోల్డర్లు వీసా ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలను పరస్పరం పంచుకుంటారని, పెద్ద టెక్ కంపెనీలు ఈ వీసా వ్యవస్థల ద్వారా అమెరికన్ ఉద్యోగాలను మళ్లిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. “మెరిట్ స్థానంలో ఇప్పుడు జాతి ఆధారిత ప్రాధాన్యత చోటు చేసుకుంది” అని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, హైదరాబాద్లోని చిలుకూర్ బాలాజీ ఆలయం ఎన్నో ఏళ్లుగా “వీసా దేవాలయం”గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు వీసా ఇంటర్వ్యూలకు ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.కాగా, అమెరికా హెచ్-1బీ వీసా ఆమోదాల్లో భారతీయుల ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం హెచ్-1బీ వీసాల్లో 70 నుంచి 80 శాతం వరకు భారతీయులకే లభిస్తుండగా, చైనా వాటా సుమారు 12 శాతంగా ఉంది.The "Visa Cartel" has its own “Visa Temple” in Hyderabad, which sees thousands of Indians circling altars and getting passports blessed for U.S. work visas.American workers shouldn’t have to compete against a system this gamed. pic.twitter.com/k7wSlECTJ6— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026 -
మోదీ పిలుపుతో.. హర్ష్ గోయెంకా కీలక సూచనలు!
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో.. పొదుపు, ఖర్చుల విషయంపై నరేంద్ర మోదీ కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు.ఖర్చులను, ప్రయాణాలను తగ్గించుకోవాలని, వర్క్-ఫ్రమ్-హోమ్ను ప్రోత్సహించాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరివర్తనను వేగవంతం చేయాలని హర్ష్ గోయెంకా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక నోట్ ద్వారా వెల్లడించారు.విదేశీ ప్రయాణాలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలని, దేశీయ విమాన ప్రయాణాలను కూడా తగ్గించాలని సూచించారు. అంతే కాకుండా.. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లి సమావేశాలు నిర్వహించదానికి బదులు, ఆన్లైన్ సమావేశాలను నిర్వహించాలని కోరారు. దీంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని అన్నారు.We in RPG have responded to our PM’s call with austerity and responsible resource allocations. I hope other corporates will follow suit. pic.twitter.com/Bhv0RVUFjq— Harsh Goenka (@hvgoenka) May 14, 2026ఉద్యోగుల పని విధానంలో కూడా మార్పులు సూచించారు. ఇంటి నుంచే పని చేయగల ఉద్యోగులను ''వర్క్ ఫ్రమ్ హోమ్'' విధానంలో పనిచేయాలని ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఈ విధానం విజయవంతంగా అమలైనందున, ఇప్పుడు కూడా అది ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ.. సంస్థకు సంబంధించిన భవిష్యత్ వాహనాలన్నీ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించారు. దీని ద్వారా ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. అలాగే ఉద్యోగులు కార్పూలింగ్ లేదా ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
అయోధ్యలో భూమి కొన్న రణబీర్ కపూర్: ధర ఎంతంటే?
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అయోధ్యలోని హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) వారి ప్రీమియం ప్లాటెడ్ డెవలప్మెంట్లో ఒక భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆ రియల్ ఎస్టేట్ సంస్థ వెల్లడించింది.సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో.. కంపెనీ అభివృద్ధి చేస్తున్న ''ది సరయూ'' అనే ప్రీమియం ప్రాజెక్ట్లో రణబీర్ కపూర్ భూమిని కొనుగోలు చేశారు. సుమారు 2,134 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ స్థలం విలువ దాదాపు రూ.3.31 కోట్లు. ఇందులో క్లబ్ హౌస్, విలాసవంతమైన సౌకర్యాలతో పాటు.. ది లీల నిర్వహించే లగ్జరీ హోటల్ కూడా ఉంది.భూమిని కొనుగోలు చేసిన సందర్భంగా.. ''అయోధ్య నన్ను పిలిచినట్టుగా అనిపించింది, నేను ఆ పిలుపుకు స్పందించాను'' అని రణబీర్ కపూర్ పేర్కొన్నారు. కాగా.. ఈయన త్వరలో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ చిత్రం రామాయణంలో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. అందువల్లనే అయోధ్యతో తనకు ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు.భారతదేశ చరిత్రలో.. సంస్కృతిలో అయోధ్యకు ఉన్న ప్రత్యేక స్థానం కారణంగా, ఈ భూమిని తన కుటుంబ వారసత్వంలో భాగంగా ఉంచాలని భావించినట్లు రణబీర్ కపూర్ చెప్పారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
జియో ప్లాట్ఫామ్స్ ఎండీగా ఆకాష్ అంబానీ
డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్ఫామ్స్ తన ఐపీఓకు ముందు.. ఆకాష్ అంబానీని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 9, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా 5 సంవత్సరాల కాలానికి ఎండీగా నియమించినట్లు మే 7నాటి ఫైలింగ్లో పేర్కొంది.ఆకాష్ అంబానీ అక్టోబర్ 2014 నుంచి జియో ప్లాట్ఫామ్స్ టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (RJIL) బోర్డులో ఉన్నారు. జూన్ 2022లో ఛైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హయాంలో 2016లో ప్రారంభమైన ఆరు నెలల లోపే జియో 100 మిలియన్ల చందాదారుల మార్కును సాధించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 30,000 కోట్లకు పైగా లాభాన్ని.. రూ. 1.46 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. -
ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు: పీయూష్ గోయల్ పిలుపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల ఎగుమతులు ట్రిలియన్ డాలర్ల మార్కునకు చేర్చాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన దీనిపై మాట్లాడారు.ప్రపంచవ్యాప్తంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా సుంకాల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రికార్డు స్థాయిలో 863.11 బిలియన్ డాలర్లకు (4.6 శాతం వృద్ధి) పెరిగినట్టు మంత్రి చెప్పారు. ఇందులో వస్తు ఎగుమతులు 0.93 శాతం పెరిగి 441.78 బిలియన్ల డాలర్లుగా ఉంటే, సేవల ఎగుమతులు 8.71 శాతం పెరిగి 421.32 బిలియన్ డాలర్లకు చేరినట్టు వెల్లడించారు. మరో 137 బిలియన్ డాలర్లు పెంచుకోవడం ద్వారా ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాలని కోరారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల మద్దతు..పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు) కుదుర్చుకోవడం ద్వారా ఆయా మార్కెట్లలో భారత ఉత్పత్తులకు ద్వారాలు తెరుస్తున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు.భారత వస్తువులకు అంతర్జాతీయ విపణిలో ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 2021 నుంచి ఇప్పటివరకు తొమ్మిది కీలక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు గుర్తు చేశారు. ఇందులో నాలుగు అమల్లోకి రాగా, మిగిలిన ఐదు వచ్చే 12 నెలల్లో ఆచరణలోకి రానున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి చిలీ, మాల్దీవులతో ఒప్పందాలు పూర్తవుతాయని.. కెనడా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, రష్యాతోనూ చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. -
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ: రెండేళ్లలో రూ. 84 వేలకోట్లు!
గత రెండేళ్లలో రూ.84,000 కోట్లకు పైగా పెట్టుబడుల మద్దతుతో, తెలంగాణ జీవ శాస్త్రాల పర్యావరణ వ్యవస్థ సుమారు 145 బిలియన్ డాలర్ల విలువను చేరుకోవడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత వేగవంతమైన విస్తరణగా నిలిచింది.పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ (టిఎల్ఎస్ఎఫ్) 7వ బోర్డు సమావేశంలో ఈ పరివర్తనాత్మక పురోగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. టిఎల్ఎస్ఎఫ్ సీఈఓ శక్తి ఎం. నాగప్పన్, తన దశాబ్ద కాల పదవీకాలంలో ఈ రంగం సాధించిన వృద్ధిపై సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి మరియు గౌరవనీయ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబుల శక్తివంతమైన నాయకత్వంలో గడిచిన రెండేళ్లు ఒక కీలక మలుపు అని ఆయన నొక్కి చెప్పారు.తెలంగాణాలో 2016 నుంచి జీవశాస్త్ర రంగం దాదాపు మూడు రెట్లు అభివృద్ధి చెందింది. దీనితో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ అండ్ హెల్త్ టెక్ ఆవిష్కరణలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది.ఒక విశేషమైన ఘనత ఏమిటంటే, ప్రపంచంలోని అగ్రగామి పది లైఫ్ సైన్సెస్ కంపెనీలలో తొమ్మిదింటికి చెందిన సాంకేతిక, ఆవిష్కరణ కేంద్రాలకు ఇప్పుడు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఘనత సాధించిన, యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం ఇదే. పటిష్టమైన విధాన కార్యాచరణ విధానాలు, వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాలు మరియు లక్షిత సంస్థాగత నిర్మాణం వంటివి దీనికి కీలక చోదకాలుగా ఉన్నాయి. ఇవి తెలంగాణను సమగ్రమైన ప్రపంచ పర్యావరణ వ్యవస్థగా సుస్థిరం చేస్తున్నాయి.ఈ పరివర్తన దశలో అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్ది, విస్తరించడంలో చూపిన నాయకత్వానికి బోర్డు ఏకగ్రీవంగా సీఈఓ శక్తి ఎం. నాగప్పన్ను ప్రశంసించింది. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభినందనలను నమోదు చేసింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనను 'సలహాదారు (లైఫ్సైన్సెస్)'గా నియమించిందని, అలాగే ఆయన తెలంగాణ లైఫ్సైన్సెస్ ఫౌండేషన్ బోర్డులో కొనసాగుతారని బోర్డు పేర్కొంది. -
కీలక నిర్ణయం దిశగా ఆర్బీఐ బోర్డు!
ఆర్బీఐ నుంచి ఈ ఏడాదీ కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ వర్షం కురవనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో ఎన్నో సవాళ్లు ఎరువుతుండడం తెలిసిందే. కరెంట్, ద్రవ్యలోటు పెరిగిపోనున్న నేపథ్యంలో ఆర్బీఐ నుంచి పెద్ద మొత్తంలో డివిడెండ్ రావొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో జరిగే బోర్డు సమావేశంలో డివిడెండ్పై ఆర్బీఐ నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పాయి.గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రూ.2.69 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కింద పంపిణీ చేసింది. 2024–25లో రూ.2.11 లక్షల కోట్లతో పోల్చితే 27 శాతం పెరిగింది. ఆర్బీఐ, ప్రభుత్వరంగ బ్యాంక్లు, సంస్థల నుంచి డివిడెండ్ల రూపంలో రూ.3.16 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని 2026–27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 3.75 శాతం అధికం. ఇందులో రూ.75,000 కోట్లు ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్లు, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో వస్తుందని అంచనా వేసింది. -
బెంగళూరులో టెస్లా: తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్
టెస్లా తన ఉనికిని భారతదేశంలో విస్తరించడంలో నిమగ్నమైంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీలలో ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన సంస్థ, ఇప్పుడు బెంగళూరులో కూడా అడుగుపెట్టింది. ఇక్కడ కూడా టెస్లా తన కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది.బెంగళూరులోని వైట్ఫీల్డ్లో ప్రారంభమైన టెస్లా కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్లో.. ఆరు సీట్ల ఎస్యూవీ టెస్లా మోడల్ YLతో పాటు, మోడల్ Yని కూడా చూడవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల పట్ల దేశంలోని పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా సంస్థ వీటిని తీసుకొచ్చింది. ఇక్కడ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా లభిస్తుంది.టెస్లా మోడల్ వైఎల్ఇండియన్ మార్కెట్లో టెస్లా మోడల్ వైఎల్ లాంగ్ వీల్ బేస్ వేరియంట్ ధర రూ.61.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). మోడల్ Y శ్రేణి ఇప్పుడు మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధరలు రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమై రూ. 67.89 లక్షల వరకు ఉన్నాయి.ఈ కారులోని 88 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 681 కిలోమీటర్లు (WLTP సర్టిఫైడ్) రేంజ్ అందిస్తుంది. స్పీడ్ విషయానికి వస్తే.. కేఇది వలం 5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మోడల్ వైఎల్ క్యాబిన్లో 16 అంగుళాల భారీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు, హీటెడ్ వెంటిలేటెడ్ సీట్లు మొదలైనవి ఉన్నాయి. -
మోటోరోలా తొలి ఫోల్డబుల్ ఫోన్: ధర ఎంతంటే?
మోటరోలా భారత్లో తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ‘మోటరోలా రేజర్ ఫోల్డ్’ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన కెమెరా సెటప్, ఏఐ (మోటో ఏఐ) ఫీచర్లు, ఫోల్డబుల్స్లోనే అతిపెద్ద బ్యాటరీతో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఫోల్డబుల్ ఫోన్లలోనే అత్యంత శక్తివంతమైన 6,000ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 80డబ్ల్యూ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది.డిస్ప్లే, పెర్ఫార్మెన్స్: ఇందులో 6.6 అంగుళాల ఎక్స్టర్నల్ అమోలెడ్ డిస్ప్లే ఉండగా, అన్ఫోల్డ్ చేసినప్పుడు 8.1 అంగుళాల భారీ 2కే మెయిన్ డిస్ప్లేగా మారుతుంది. ఇది 6,200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 16 వెర్షన్తో వస్తుంది. దీనికి ఏకంగా 7 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్, సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.కెమెరా విశేషాలు: ఫోటోగ్రఫీ కోసం ఇందులో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ 50 మెగాఫిక్సెల్(ఎంపీ) ఎంపీ ప్రో–గ్రేడ్ ఫోల్డబుల్ కెమెరా సిస్టమ్ను అందించారు. 50ఎంపీ ప్రధాన కెమెరా (సోనీ లైటియా 828) 8కే డాల్బీ విజన్ రికార్డింగ్కు సపోర్ట్ ఇస్తుంది. వీటితో పాటు 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 100ఎక్స్ సూపర్ జూమ్ ప్రో), 122 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి.ఫిఫా వరల్డ్కప్ 26 స్పెషల్ ఎడిషన్: ఫుట్బాల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫిఫా వరల్డ్కప్ 26 ఎడిషన్ను మోటరోలా పరిచయం చేసింది. ఈ వేరియంట్ వెనుక భాగంలో 24 క్యారెట్ల బంగారు పూతతో కూడిన అధికారిక ఫిఫా లోగో ఉంటుంది. ఇది ప్రత్యేకమైన ఫిఫా థీమ్స్, వాల్పేపర్లతో వస్తుంది.ధర, డిస్కౌంట్లు: 12జీబీ + 256జీబీ వేరియంట్ రూ. 1,49,999గా, 16 జీబీ + 512 జీబీ ధర రూ.1,59,999గా ఉన్నాయి. ఫిపా వరల్డ్కప్ 26 ఎడిషన్ రూ. 1,69,999 గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్ల కింద యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 18 నెలల వరకు నో–కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పించారు. జూన్ 20లోపు కొనుగోలు చేసిన వారికి ఒకసారి ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ (ఒక ఏడాది వరకు చెల్లుబాటు) లభిస్తుంది ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, మోటోరోలాడాట్ సైట్లలో, ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. మే 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.మోటో బడ్స్2 ప్లస్: వినియోగదారులకు మెరుగైన ఆడియో అనుభవం కోసం ‘మోటో బడ్స్ 2 ప్లస్’ను కూడా విడుదల చేసింది. ఇవి ‘సౌండ్ బై బోస్’ టెక్నాలజీతో రూపొందాయి. 11ఎంఎం డైనమిక్ డ్రైవర్లు, సెగ్మెంట్లోనే ఉత్తమమైన 55డీబీ డైనమిక్ ఏఎన్సీ (నాయిస్ క్యాన్సిలేషన్), బ్లూటూత్ 6.0 సపోర్ట్ ఉన్నాయి. ఇవి కేస్తో కలిపి 40 గంటల వరకు ప్లేటైమ్ ఇస్తాయి. దీని ధర రూ. 5,999 కాగా, రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్తో రూ. 4,999 కే లభిస్తాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 789.74 పాయింట్లు లేదా 1.06 శాతం లాభంతో 75,478.15 వద్ద, నిఫ్టీ 277.00 పాయింట్లు లేదా 1.18 శాతం లాభంతో 23,689.60 వద్ద నిలిచాయి.బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బాలాజీ అమైన్స్ లిమిటెడ్, మోడీ నాచురల్స్ లిమిటెడ్, అమైన్స్ & ప్లాస్టిసైజర్స్ లిమిటెడ్, PNB గిల్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్, శారదా క్రాప్కెమ్ లిమిటెడ్, ఇంటర్ఆర్చ్ బిల్డింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా
పశ్చిమాసియా యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలపైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డబ్బు విలువ తగ్గితే.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.మొదటిది, ఇరాన్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు పెరగడం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, ఉత్పత్తి ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు అన్నీ పెరుగుతాయి. ఫలితంగా ప్రతి వస్తువు ఖరీదవుతుంది. ఈ పరిస్థితినే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగితే నగదు విలువ తగ్గిపోతుంది.ఇక రెండో కారణం.. దేశాలపై పెరుగుతున్న జాతీయ అప్పులు. ప్రభుత్వాలు భారీ అప్పులు తీసుకున్నప్పుడు వాటిని తీర్చడానికి మరింత కరెన్సీ ముద్రించాల్సి వస్తుంది. ఎక్కువ డబ్బు మార్కెట్లోకి వస్తే కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే.. కియోసాకి ప్రభుత్వం ముద్రించే డబ్బును ఫేక్ మనీ అంటారు.TAKE ACTION: 2 reasons why inflation will steal your money1: As long as the war in Iran rising oil prices will cause inflation and your fist money to decline in purchasing power.2: Nation Debt will cause governments to print more fake money.Please protect your self,…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 13, 2026డబ్బును కాపాడుకోవాలంటే.. ప్రతివ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కాబట్టి బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథేరియం వంటివాటితో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇవి కష్టకాలంలో మిమ్మల్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయగలవు. బంగారం, వెండి వంటి విలువ కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరిం త పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?గోల్డ్, సిల్వర్ వంటివి కొనుగోలు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, అని చాలామంది అనుకుంటారు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించినవాళ్లు మాత్రం.. బంగారం ఎలా కొనాలి?, అని ఆలోచిస్తారు. ఈ ఆలోచన మనిషిలో కొత్త అవకాశాలను వెతకడానికి ప్రేరణ ఇస్తుంది. ధనవంతుల ఆలోచన సమస్యలపై కాకుండా పరిష్కారాలపై ఉంటుందని కియోసాకి స్పష్టం చేశారు. -
ఉగాండా గతి మార్చిన భారత్
అది 1972... గడియారపు ముళ్లు వేగంగా తిరుగుతున్నాయి. చేతిలో కేవలం తొంభై రోజుల గడువు. కళ్ల ముందే తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాలు కుప్పకూలుతుంటే కట్టుబట్టలతో, కన్నీటి మూటలతో ఒక జాతి పరాయి దేశాల వైపు అడుగులు వేసింది. ఆనాడు ఉగాండా నేల విడిచి వెళ్లిన చాలా మందిలో తీరని వేదన. కానీ, కాలం పగ తీర్చుకోలేదు.. ఆ గాయాన్ని మాన్పేసింది.అర్ధ శతాబ్దం గడిచింది. నాడు బహిష్కరించిన అదే మనుషులు, నేడు ఎర్ర తివాచీ పరిచారు. అప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారే, ఇప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారారు. చక్కెర మిల్లులు, స్టీలు పరిశ్రమలు, బ్యాంకింగ్ వ్యవస్థ... ఇలా అన్ని రంగాల్లో భారతీయులు వ్యాపారం సాగిస్తూ దేశ వృద్ధికి తోడ్పడుతున్నారు.90 రోజుల గడువు.. తరాల కష్టం బుగ్గిపాలు1972 ఆగస్టులో ఉగాండా సైనిక పాలకుడు ఇడి అమీన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. స్థానికులను దోపిడీ చేస్తున్నారనే సాకుతో దాదాపు 80,000 మంది భారత సంతతి ప్రజలను కేవలం 90 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యాపారాలు, చక్కెర మిల్లులు, బ్యాంకులు, ఆస్తులను వదిలి వారంతా బ్రిటన్, కెనడా, భారత్లకు శరణార్థులుగా వెళ్లారు. ఫలితంగా ఉగాండాలో 90 శాతం వ్యాపారాలు మూతపడ్డాయి. సరఫరా గొలుసు కుప్పకూలి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది.గణాంకాలు ఇలా..1972-75 మధ్య ఉగాండా జీడీపీ 5% మేర పడిపోయింది.1972లో 740 మిలియన్ షిల్లింగ్లుగా ఉన్న ఉత్పత్తి 1979 నాటికి 254 మిలియన్లకు దిగజారింది.ముసెవెని పిలుపుతో మారిన దశ1986లో యోవేరి ముసెవెని అధికారం చేపట్టాక పరిస్థితి తలకిందులైంది. అమీన్ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించిన ఆయన, భారతీయులను తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆస్తులను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ‘మనం పోగొట్టుకున్నది కేవలం వ్యక్తులను కాదు, దేశ ఆర్థిక పునాదులను. భారతీయులు ఉగాండా రక్తంలో భాగం’ అని యోవేరి ముసెవెని (అధ్యక్షుడు) అన్నారు.ఆర్థిక సామ్రాజ్యాల పునరుద్ధరణతిరిగి వచ్చిన భారతీయులు వ్యాపారాలు చేయడంతోపాటు దేశ భవిష్యత్తును మార్చేశారు. ప్రస్తుతం ఉగాండా జనాభాలో కేవలం 1 శాతం కంటే తక్కువగా ఉన్న భారతీయులు దేశ ఆదాయపు పన్నులో 65 శాతం వాటాను అందిస్తున్నారంటే వారి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.సుధీర్ రుపారేలియాబహిష్కరణ సమయంలో లండన్కు పారిపోయి చిన్న ఉద్యోగాలు చేసిన సుధీర్ కేవలం 25,000 డాలర్లతో తిరిగి వచ్చి నేడు ఉగాండాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. బ్యాంకింగ్, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయనది తిరుగులేని ముద్ర.మధ్వానీ గ్రూప్గుజరాత్ నుంచి వలస వచ్చిన ముల్జీభాయ్ మాధ్వానీ స్థాపించిన ఈ సంస్థ నేడు తూర్పు ఆఫ్రికాలోనే అతిపెద్ద వ్యవసాయ-పారిశ్రామిక సంస్థగా ఎదిగింది. ‘కకీరా షుగర్ వర్క్స్’ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ 70,000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఈ గ్రూప్ జీవనాధారంగా ఉంది.మెహతా, ముక్వానో గ్రూప్స్మెహతా గ్రూప్ అధినేత మహేంద్ర మెహతాకు భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే ముక్వానో గ్రూప్ సబ్బులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తిలో ఎంతో ఎదిగింది.భారత్ - ఉగాండా సంబంధాలుప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.2 బిలియన్ డాలర్లను దాటింది. ఫార్మా, మౌలిక సదుపాయాలు, ఉక్కు, విద్య వంటి రంగాల్లో భారతీయ సంస్థల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. చైనా పెట్టుబడులతో పోలిస్తే భారతీయ వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలతో మమేకమై పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తూ అక్కడ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.అయితే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారతీయుల ఆర్థిక ఆధిపత్యంపై కొన్ని వర్గాల్లో అసహనం ఉన్నప్పటికీ, ఇండియన్స్ లేని ఉగాండా ఆర్థిక వ్యవస్థను ఊహించడం అసాధ్యమని మెజారిటీ ప్రజల నమ్మకం. ఒకప్పుడు బహిష్కరణకు గురైన ఒక జాతి, అదే దేశానికి ఆర్థిక రక్షకులుగా మారడం అనేది ప్రపంచ చరిత్రలోనే అరుదైన దృశ్యం.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య -
ఈజీగా ఈపీఎఫ్ ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత భవిష్యనిధి (ఈపీఎఫ్)ని మరింత సులభంగా ఉపసంహరించుకునే విధానం త్వరలో అమల్లోకి రానుంది. ఉపసంహరణ క్లెయిమ్లను ఆటోమేట్ చేయనున్నట్టు సెంట్రల్ ప్రావిడెండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి తెలిపారు. అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోని 7 కోట్ల మందికి ప్రయోజనం కలగునుంది.ప్రస్తుతం ఈపీఎఫ్వో సభ్యులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ముందస్తు ఉపసంహరణ క్లెయిమ్లు ఆటోమేటిగ్గా ప్రాసెస్ చేస్తుండడం తెలిసిందే. క్లెయిమ్ దాఖలు చేసిన తర్వాత మూడు పనిదినాల్లో ప్రాసెస్ చేయాలన్నది గడువు. ఉద్యోగి సంస్థను మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతా బదిలీ సైతం ఆటోమేటిగ్గా జరిగే విధానాన్ని తీసుకురానున్నట్టు, దీంతో సభ్యులు బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. నాలుగో ఏటా లాభాలే: ప్రభుత్వ బ్యాంకులపై ఆర్థిక శాఖ ప్రకటనన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) వరుసగా నాలుగో ఏడాది లాభాలు ఆర్జించినట్లు ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ పేర్కొంది. గతేడాది(2025–26)లో నికర లాభాలు 11 శాతం ఎగసి రూ. 1.98 లక్షల కోట్లను తాకినట్లు వెల్లడించింది. ఇది పీఎస్బీల చరిత్రలోనే అత్యధికంకాగా.. రుణ నాణ్యత మెరుగుపడటం, రుణాల వృద్ధి, అధిక ఆదాయం ఇందుకు తోడ్పడినట్లు తెలియజేసింది.పీఎస్బీల మొత్తం నిర్వహణ లాభం 3.21 లక్షల కోట్లకు చేరగా.. బిజినెస్ 13 శాతం పుంజుకుని రూ. 283.3 లక్షల కోట్లను తాకినట్లు తెలియజేసింది. ఈ వివరాల ప్రకారం వీటి డిపాజిట్లు 10.6 శాతం వృద్ధితో రూ. 156.3 లక్షల కోట్లకు చేరాయి. స్థూల అడ్వాన్సులు 16 శాతం జంప్చేసి రూ. 127 లక్షల కోట్లను తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.93 శాతానికి, నికర ఎన్పీఏలు 0.39 శాతానికి దిగివచ్చాయి. చదవండి: రష్యా నుంచి తగ్గిన చమురు దిగుమతులు -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు కేవలం ముడి చమురు ధరలే కాదు అంతకుమించిన పెను సంక్షోభం ముంచుకొస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని హార్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన రంగంతోపాటు ప్రపంచ ఆహార భద్రతను, పారిశ్రామిక ఉత్పత్తిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎరువులు, సల్ఫర్, పారిశ్రామిక లోహాల సరఫరా గొలుసు విచ్ఛిన్నం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.1,150 శాతం పెరిగిన ధరలుప్రపంచ పారిశ్రామిక రంగానికి లైఫ్ లైన్ వంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆర్గస్ ప్రైసింగ్, యూఎస్ జియోలాజికల్ సర్వే గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లతో పోలిస్తే చైనా సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఏకంగా 1,150 శాతం పెరిగాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సల్ఫర్ ధరల్లో 750 శాతం పెరుగుదల నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారు అయిన చిలీలో ధరలు 230 శాతం పెరిగాయి.సల్ఫ్యూరిక్ యాసిడ్ లేకుండా ఎరువుల ఉత్పత్తి, రాగి ప్రాసెసింగ్, బ్యాటరీల తయారీ, సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్ అసాధ్యం. ప్రపంచ సల్ఫర్ ఎగుమతుల్లో సగానికి పైగా పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుండటంతో హార్మూజ్ జలసంధి మూసివేత ఈ సరఫరాను పూర్తిగా స్తంభింపజేసింది.చమురు సంక్షోభంసౌదీ ఆరామ్కో సీఈఓ అమిన్ నాసర్ ఈ పరిస్థితిని ‘ప్రపంచం ఇప్పటివరకు చూడని అతిపెద్ద ఇంధన సరఫరా షాక్’గా అభివర్ణించారు. గతంలో రోజుకు 70 నౌకలు ప్రయాణించే హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పుడు కేవలం 2 నుంచి 5 నౌకలు మాత్రమే వెళ్తున్నాయి. సుమారు 240 నౌకలు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి.ప్రతి వారం ప్రపంచ మార్కెట్లు 100 మిలియన్ బ్యారెళ్ల చమురును కోల్పోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 1 బిలియన్ బ్యారెళ్ల సరఫరాకు అంతరాయం కలిగింది. అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వలు 1982 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ హెచ్చరించింది.ఎరువుల కొరతతో ఆహార సంక్షోభంచమురు కంటే ఎరువుల సంక్షోభమే అత్యంత భయంకరంగా ఉండబోతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో మూడింట ఒక వంతు హార్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఖతార్ ఫెర్టిలైజర్ కంపెనీ ఇప్పటికే ‘ఫోర్స్ మేజర్’(నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితుల వల్ల పనిని పూర్తి చేయలేకపోవడం) ప్రకటించగా, నెలకు 3-4 మిలియన్ టన్నుల ఎరువుల సరఫరా నిలిచిపోయింది.భారత్ ఇప్పటికే మూడు యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించగా బంగ్లాదేశ్ ఐదు ప్లాంట్లలో నాలుగింటిని మూసివేసింది. బ్రెజిల్లో యూరియా దిగుమతులు 33 శాతం పడిపోయాయి. ఈ సరఫరా అంతరాయం కొనసాగితే వచ్చే కొద్ది నెలల్లోనే 4.5 కోట్ల మంది తీవ్ర ఆకలి బారిన పడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ఆందోళన వ్యక్తం చేసింది.పారిశ్రామిక రంగంపై ప్రభావంకేవలం వ్యవసాయమే కాదు, హైటెక్ పరిశ్రమలు కూడా చిక్కుల్లో పడ్డాయి. సెమీకండక్టర్లకు అవసరమైన హీలియం సరఫరా నిలిచిపోయింది. సల్ఫర్ కొరత కారణంగా ఇండోనేషియాలో నికెల్ ప్రాసెసింగ్ నిలిచిపోయింది. ఇది నేరుగా ఈవీ బ్యాటరీల తయారీపై దెబ్బకొడుతోంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలుఒకవైపు ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంటే, మరోవైపు అగ్రరాజ్యాల మధ్య దౌత్యపరమైన వేడి పెరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనలను తోసిపుచ్చడం, అమెరికా అణు జలాంతర్గామి జిబ్రాల్టర్ చేరుకోవడం వంటి పరిణామాలు యుద్ధ మేఘాలను సూచిస్తున్నాయి. మే 14-15 తేదీల్లో ట్రంప్ బీజింగ్ పర్యటనపైనే ఇప్పుడు ప్రపంచం ఆశలు పెట్టుకుంది.మార్కెట్లు కేవలం చమురు ధరల పెరుగుదలను మాత్రమే అంచనా వేస్తున్నాయి. కానీ తెరవెనుక ఎరువులు, సల్ఫర్ కొరత సృష్టిస్తున్న విధ్వంసం ఇంకా అంచనాలకు అందడం లేదు. ఒకవేళ జూన్ మధ్య నాటికి హార్మూజ్ జలసంధిలో పరిస్థితులు చక్కబడకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2027 వరకు కోలుకోవడం కష్టమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన -
బంగారమా.. ఈరోజు కొంటామా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు పెరిగి 23,571 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 427 పాయింట్లు పుంజుకుని 75,062 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.49బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.58 శాతం పెరిగింది.నాస్డాక్ 1.2 శాతం పుంజుకుంది.Today Nifty position 14-05-2026(time: 09:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫాక్స్కాన్పై సైబర్ దాడి
అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో సరఫరా గొలుసు భద్రతపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. యాపిల్ సంస్థకు ప్రధాన తయారీ భాగస్వామి అయిన ఫాక్స్కాన్పై భారీ సైబర్ దాడి జరిగినట్లు ఆ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. ఉత్తర అమెరికాలోని పలు ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ రాన్సమ్వేర్ దాడిలో యాపిల్తో పాటు గూగుల్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థల రహస్య ప్రాజెక్ట్ ఫైళ్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.8టీబీ డేటా మాయం..ప్రముఖ రాన్సమ్వేర్ ముఠా ‘నైట్రోజన్’ ఈ దాడికి బాధ్యత వహిస్తూ సంచలన ప్రకటన చేసింది. ఫాక్స్కాన్ సర్వర్ల నుంచి సుమారు 1.1 కోట్ల ఫైళ్లు, అంటే దాదాపు 8 టెరాబైట్ల డేటాను తాము దొంగిలించినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. ఇందులో కేవలం ఫాక్స్కాన్ అంతర్గత సమాచారమే కాకుండా కొన్ని సంస్థల కీలక పత్రాలు ఉన్నాయని హ్యాకర్లు చెబుతున్నారు. అందులో..యాపిల్: భవిష్యత్తులో విడుదల కాబోయే పరికరాల సాంకేతిక డ్రాయింగ్లు.ఇంటెల్, ఎన్విడియా: సెమీకండక్టర్ డిజైన్లు, చిప్సెట్ మాన్యుస్క్రిప్ట్లు.గూగుల్, డెల్: అంతర్గత ప్రాజెక్ట్ పత్రాలు, రహస్య ఆదేశాలు.అప్రమత్తమైన టీమ్సైబర్ దాడిని గుర్తించిన వెంటనే ఫాక్స్కాన్ సెక్యూరిటీ టీమ్ అప్రమత్తమైంది. అత్యవసర సహాయక చర్యలు చేపట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ దాడుల వల్ల ఉత్పత్తి, డెలివరీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రభావితమైన ప్లాంట్లు దశలవారీగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి’ అని చెప్పింది. అయితే, వినియోగదారుల వ్యక్తిగత డేటా ఏదైనా లీక్ అయిందా అనే అంశంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.ఏమిటీ నైట్రోజన్ గ్యాంగ్..సైబర్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ నైట్రోజన్ రాన్సమ్వేర్ రష్యా మద్దతున్న ‘కాంటి’ గ్రూప్ కోడ్ నుంచి ఉద్భవించింది. 2023లో వెలుగులోకి వచ్చిన ఈ ముఠా ప్రధానంగా వీఎమ్వేర్ ఈఎస్క్సీ వంటి వర్చువలైజేషన్ సిస్టమ్స్ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ సాఫ్ట్వేర్లో ఉన్న సాంకేతిక లోపాల వల్ల బాధితులు హ్యాకర్లకు డబ్బు చెల్లించినా డేటా తిరిగి వస్తుందనే గ్యారెంటీ లేదని భద్రతా సంస్థ కోవైర్ హెచ్చరించింది.ఫాక్స్కాన్కు గతంలో..ఫాక్స్కాన్పై సైబర్ దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఈ సంస్థ హ్యాకర్ల బారిన పడింది. 2022 మెక్సికోలోని ఫాక్స్కాన్ అనుబంధ సంస్థపై లాక్బిట్ దాడి జరిగింది. 2024 ప్రారంభంలో ఫాక్స్కాన్ గ్రూప్లోని సెమీకండక్టర్ విభాగం ‘ఫాక్స్సెమికాన్’లో డేటా లీక్ అయింది.యాపిల్ మౌనం..యాపిల్ తన తయారీ భాగస్వాములకు ఇచ్చే సమాచారం విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. ఏయే భాగాలను ఎలా అసెంబ్లీ చేయాలో మాత్రమే అందించి సాంకేతిక సమాచారాన్ని పరిమితంగా పంచుకుంటుంది. అయినప్పటికీ, డ్రాయింగ్లు, డిజైన్ పత్రాలు లీక్ అవ్వడం అనేది యాపిల్ భవిష్యత్ ఉత్పత్తుల గోప్యతకు పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై యాపిల్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన -
ఏఐ కోసం 30 శాతం సిబ్బందిపై వేటు..
అంతర్జాతీయ టెక్ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. ప్రముఖ అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ ‘గిట్ల్యాబ్’ తన మొత్తం శ్రామిక శక్తిలో ఏకంగా 30 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే, ఒకవైపు గ్లోబల్ స్థాయిలో తొలగింపులు జరుగుతున్నా భారత్లో మాత్రం కొత్త నియామకాలకు కంపెనీ మొగ్గు చూపుతుండటం గమనార్హం.ఏఐ కోసం పునర్నిర్మాణంజనవరి 2026 నాటికి గిట్ల్యాబ్లో మొత్తం 2,580 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన 30 శాతం కోత ప్రకారం వందలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కంపెనీ సీఈఓ బిల్ స్టేపుల్స్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఈ మార్పులను ధ్రువీకరించారు. ‘ఏజెంటిక్ ఏఐ యుగంలో మాకున్న ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వ్యయ నియంత్రణ ద్వారా వచ్చే పొదుపును తిరిగి ఏఐ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.ఈ పునర్నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇందులో భాగంగా వాలంటరీ సెవరెన్స్ విండో (స్వచ్ఛంద విరమణ) అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 1, 2026 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.భారత్పై గిట్ల్యాబ్ ఆసక్తిప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నప్పటికీ భారత్లో మాత్రం గిట్ల్యాబ్ విస్తరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫారమ్లలో భారతదేశానికి సంబంధించి 20కి పైగా ఉద్యోగ ప్రకటనలను కంపెనీ పోస్ట్ చేసింది. అందులో ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, కస్టమర్ సక్సెస్ ఇంజినీర్ వంటి పాత్రలున్నాయి. ఈ ఉద్యోగాలన్నీ రిమోట్ (ఇంటి నుంచే పని) పద్ధతిలో ఉండటం విశేషం. గిట్ల్యాబ్ తన కార్యకలాపాలు సాగించే దేశాల సంఖ్యను తగ్గించుకుని భారత్, అమెరికా వంటి కీలక మార్కెట్లపై దృష్టి సారించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.నిజమైన పెట్టుబడా? తొలగింపులకు సాకా?గిట్ల్యాబ్ నిర్ణయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఏఐ ఏజెంట్ల గురించి వ్యాసాలు రాస్తూ, మరోవైపు సిబ్బందిని తొలగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ అన్నట్లుగా.. కొన్ని కంపెనీలు తమ అసమర్థతను దాచుకోవడానికి లేదా ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని ఒక సాకుగా వాడుతున్నాయా? అనే సందేహాలను నిపుణులు లేవనెత్తుతున్నారు. ‘ఇది వాస్తవంగా ఏఐ కోసం చేస్తున్న మార్పా? లేక 2026లో ఏఐ పేరు చెప్పి చేస్తున్న సాధారణ తొలగింపా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.మెటా, అమెజాన్ వంటి దిగ్గజాల బాటలోనే గిట్ల్యాబ్ పయనిస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగా భారత్ వంటి దేశాల్లో నియామకాలు చేపట్టడం సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు స్వల్ప ఊరటనిచ్చే అంశం. ఏది ఏమైనా టెక్ ప్రపంచంలో మనుషుల స్థానాన్ని యంత్రాలు (ఏఐ) భర్తీ చేస్తున్నాయా అనే చర్చకు గిట్ల్యాబ్ తాజా నిర్ణయం మరింత ఆజ్యం పోసింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన -
రష్యా నుంచి తగ్గిన చమురు దిగుమతులు
రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఏప్రిల్లో 15 శాతం తగ్గినట్లు ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’ (సెరా) వెల్లడించింది. మార్చిలో €5.3 బిలియన్ యూరోల విలువైన ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోగా, ఏప్రిల్లో €4.5 బిలియన్ల యూరోలకు తగ్గాయి. నయారా ఎనర్జీకి చెందిన వాదినార్ రిఫైనరీలో ఉత్పత్తిని నిర్వహణ పనుల వల్ల నిలిపివేయడం ఇందుకు ప్రధాన కారణమని సెరా తెలిపింది. ఏప్రిల్లో రష్యా చమురు విషయంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది.మొత్తం మీద ఏప్రిల్లో రష్యా నుంచి హైడ్రోకార్బన్ల కొనుగోలు (ముడి చమురు, గ్యాస్) 5 బిలియన్ యూరోలుగా ఉంది. ఇరాన్తో అమెరికా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడమే కాకుండా హర్మూజ్ జలసంధి మూసివేతతో సరఫరాలు తగ్గిపోవడం తెలిసిందే. దీంతో ధరలను తగ్గించేందుకు గాను రష్యా చమురు నౌకలపై అమెరికా ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వ రంగ రిఫైనరీలు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించాయి.రష్యా యూరల్స్ ముడి చమురు ధర ఏప్రిల్లో బ్యారెల్కు 112.3 డాలర్లకు చేరింది. ఐరోపా నిర్దేశించిన గరిష్ట ధర 44.1 డాలర్లు కంటే రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం. భారత్, టర్కీ వంటి దేశాల్లో శుద్ధి చేసిన రష్యా చమురు ఉత్పత్తులు తిరిగి ఐరోపా దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకే ఎగుమతి అవుతున్నట్టు సెరా తెలిపింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన -
జెన్ జెడ్ పారిశ్రామికవేత్తలు చాలా స్మార్ట్
యువ పారిశ్రామికవేత్తలు ఎంతో స్మార్ట్గా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక్క విభాగానికి పరిమితం కాకుండా ఒకటికి మించిన ఆదాయ మార్గాలతో విజయాల మోత మోగిస్తున్నారు. దాదాపు 75 శాతం మంది జెన్ జెడ్ పారిశ్రామికవేత్తలు (1997–2012 మధ్య జన్మించిన వారు) ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉన్నట్టు లింక్డ్ఇన్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. పాత తరంతో పోలిస్తే నేటి యువత మరింత సరళతర పని నమూనాల వైపు అడుగులు వేస్తున్నారు. జెన్ జెడ్లో ప్రతీ నలుగురిలో ముగ్గురు (75 శాతం) తమకు ఒకటికి మించి ఆదాయ వనరులున్నట్టు చెప్పారు. జెన్ ఎక్స్ (1965–1980 కాలంలో జన్మించిన వారు)లో కేవలం 62 శాతం మందికి మాత్రమే ఒకటికి మించిన ఆదాయ వనరులు ఉన్నాయి. వృత్తిపై పూర్తి నియంత్రణ సాధించడంతో పాటు, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ తరం తమ కెరీర్ను మలుచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వ్యాపార ధోరణులకు భారత్ నిదర్శనంగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో భారత్లో తమ ప్రొఫైల్లో ‘వ్యవస్థాపకుడు’ అని జోడించుకున్న వారి సంఖ్య 104 శాతం పెరిగింది. ఏ ఇతర దేశంతో పోల్చినా భారత్లోనే ఇది అధికమని ఈ నివేదిక తెలిపింది. 500 మంది చిన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధిలోని వారిని ప్రశ్నించి లింక్డ్ఇన్ ఈ వివరాలు రూపొందించింది. వ్యయాలు, అనుభవం లేకపోవడం వంటి సంప్రదాయ అవరోధాలను ఏఐ, డిజిటల్ టూల్స్ తగ్గిస్తున్నాయి. దీని వల్ల వ్యాపారం ప్రారంభించడం కొత్త తరానికి సులభతరంగా మారింది. 85 శాతం మంది యువ వ్యవస్థాపకులు తమ వ్యాపార వృద్ధికి ఏఐ ఎంతో కీలకమని భావిస్తున్నారు. తమ నేపథ్యంతో సంబంధం లేకుండా పారిశ్రామికేవేత్తలుగా అవతరించే అవకాశాలు ప్రస్తుం ఉన్నట్టు 80 శాతం మంది చెప్పారు. గతంతో పోలి్చతే నేడు మరింత సులభతరం అయినట్టు 81 శాతం మంది తెలిపారు. భారత్లో జెన్జెడ్ విజయం అంటే కేవలం డబ్బు అనుకోవడం లేదు. 64 శాతం మంది స్వేచ్ఛ, సౌలభ్యం, 56 శాతం వ్యక్తిగత అభివృద్ధి, 55 శాతం మంది ఆర్థిక సంపదను నిజమైన విజయంగా భావిస్తున్నారు. వీటిని సాధించేందుకు రిస్క్ తీసుకునేందుకూ వెనుకాడడం లేదు. ఏఐతో అందరికీ అవకాశాలు..‘‘ఒకప్పుడు అసాధ్యం అనుకున్న వ్యాపార కలలను నేడు ఏఐ నిజం చేస్తోంది. ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా, రకరకాల ఆదాయ మార్గాలను సృష్టించుకునేందుకు, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది’’ అని లింక్డ్ఇన్ భారత మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన -
కేంద్రం తీపి కబురు, అయినా.. ఆందోళనే!
భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార ఎగుమతులపై సెప్టెంబర్ దాకా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ధరలు పెరగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా, ఈయూలకు మాత్రం ఈ బ్యాన్ వర్తించబోదని స్పష్టం చేసింది. అయితే కేంద్రం తాజా ప్రకటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారులలో ఒకటి. ఇటీవల వర్షాభావం, పంట ఉత్పత్తి తగ్గుదల, నిల్వలపై ఒత్తిడి కారణంగా దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. పండుగల సీజన్లో వినియోగం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా ఎగుమతులను నిలిపివేసింది.ముడి, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై సెప్టెంబర్ 30వ తేదీ వరకు కేంద్రం నిషేధం విధిస్తూ సంచలన ప్రకటన చేసింది. సెప్టెంబర్ తర్వాత పరిస్థితిని సమీక్షించి, ఎగుమతులపై కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వర్షాకాలం తర్వాత పంట ఉత్పత్తి స్థాయిలు, నిల్వలు, ధరలపై ఆధారపడి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని సమాచారం. అయితే.. ఈ చర్య దేశీయ మార్కెట్లో ధరలను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్లో చక్కెర కొరతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉంది. వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు. అయితే అంతర్జాతీయంగా భారతదేశం చక్కెర ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో.. ఎగుమతులు నిలిపివేయడం వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా తగ్గి ధరలు పెరగవచ్చు. అలాగే వ్యాపారాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎగుమతులపై ఆధారపడిన వ్యాపారులు, ట్రేడర్లు నష్టపోవచ్చు. కేంద్రం తాజా నిర్ణయంపై ఆర్థిక విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే.. ఈ నిర్ణయం తాత్కాలికంగా దేశీయ మార్కెట్కు మేలు చేస్తుంది. కానీ ప్రపంచ మార్కెట్లో అస్థిరతను పెంచుతుంది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలు భారత చక్కెరపై ఆధారపడుతున్నందున, అక్కడ ధరలు పెరగడం ఖాయం. -
సౌండ్ తగ్గిన ఎయిర్టెల్
మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 34 శాతం క్షీణించి రూ. 7,325 కోట్లకు పరిమితమైంది. ఇందుకు ప్రధానంగా చట్టబద్ధ పన్ను లయబిలిటీలకు చేపట్టిన వన్టైమ్ కేటాయింపులు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ.11,022 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 24 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.మొత్తం ఆదాయం మాత్రం 16 శాతం ఎగసి రూ. 55,383 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 47,876 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆదాయంలో దేశీ విభాగం నుంచి 8 శాతం వృద్ధితో రూ. 39,566 కోట్లు లభించింది. మొబైల్ సరీ్వసుల విభాగం నుంచి దీనిలో రూ. 28,831 కోట్లు లభించింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 245 నుంచి రూ. 257కు మెరుగుపడింది. ఇది 5 శాతం వృద్ధికాగా.. పెట్టుబడి వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 16,066 కోట్లుగా నమోదయ్యాయి. పోస్ట్పెయిడ్ విభాగంలో 8 లక్షల కస్టమర్లు జత కలవడంతో ఈ సంఖ్య 2.9 కోట్లకు చేరింది.పూర్తి ఏడాదికి..మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎయిర్టెల్ నికర లాభం 20 శాతం నీరసించి రూ. 26,995 కోట్లకు చేరింది. 2024–25లో రూ. 33,556 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 22 శాతం జంప్చేసి రూ. 2,10,973 కోట్లను తాకింది. వెరసి తొలిసారి ఆదాయం రూ. 2 లక్షల కోట్లను దాటడంతోపాటు.. 66.5 కోట్ల కస్టమర్ల మార్క్ను అధిగమించిన దేశీ కంపెనీగా నిలిచినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. పూర్తిఏడాదికి కంపెనీ పెట్టుబడి వ్యయాలు స్వల్పంగా తగ్గి రూ. 47,522 కోట్లకు చేరాయి. నికర రుణ భారం రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 1.65 లక్షల కోట్లకు తగ్గింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన -
త్వరలో పెట్రోల్ మోత!
న్యూఢిల్లీ: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగితే దశలవారీగా ధరలు పెరగొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే త్వరలోనే సామాన్య ప్రజల ఖర్చులపై అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాల్సి రావొచ్చని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా వ్యాఖ్యానించారు. ముడిచమురు, ఎరువుల కోసం భారత్ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉన్న నేపథ్యంలో కొంత భారాన్ని బదలాయించడం తప్పకపోవచ్చని ఆయన తెలిపారు. సరఫరాపరమైన అవాంతరాలు ఇప్పుడిప్పుడే భారత్పై ప్రభావం చూపించడం మొదలవుతోందని స్విట్జర్లాండ్లో ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మల్హోత్రా చెప్పారు. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్– ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఎగిసినప్పటికీ దేశీయంగా మాత్రం ప్రభుత్వం రిటైల్ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచకుండా యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, క్రూడాయిల్ రేట్లు పెరుగుతూ, రూపాయి విలువ పడిపోతూ, చమురు దిగుమతుల భారం తడిసి మోపెడవుతుండటంతో ధరల పెంపు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ఇప్పటివరకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెరిగిన చమురు ధరల భారాన్ని భరిస్తున్నాయి, కానీ అవి ఇంకెంతకాలం నష్టాలను భరించగలవో ఆందోళన కలిగిస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా వ్యాఖ్యానించడం.. త్వరలో పెట్రోల్ ధరలు పెరగక తప్పదనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కూడా పెరిగిన ముడి చమురు ధరలను వినియోగదారులపై కొంతవరకు మోపాల్సిందేనని అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని భారత్కు తట్టుకునే సామర్థ్యం ఉందని పేర్కొంది. -
పసిడిపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న బంగారం దిగుమతులు, విదేశీ మారకద్రవ్యంపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు వాయిదా వేసుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన రెండు రోజులకే ఈ దిశగా కఠిన చర్యలకు దిగింది. తగ్గిపోతున్న రూపాయి విలువను కాపాడేందుకు, అవసరం లేని దిగుమతులను కట్టడి చేసేందుకు పసిడి, వెండిపై దిగుమతుల సుంకాన్ని కేంద్రం గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 6 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం చేసింది. ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. బుధవారం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. ఆభరణాలు, వాటి విడిభాగాలు, కాయిన్లు, కడ్డీలు సహా భౌతిక రూపంలోని దిగుమతులు అన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత ఎగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకీ చర్యలు..? ⇒ కస్టమ్స్ డ్యూటీ పెంచడానికి అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ప్రతికూల పరిస్థితులను ప్రభుత్వం కార ణంగా పేర్కొంది. అంతర్జాతీయ సంక్షోభాల్లో అవసరంలేని దిగుమతులను నియంత్రించడం స్థూల ఆర్థిక స్థిరత్వానికి సాయం చేస్తుందని అధికారుల వాదన. ⇒ డాలర్తో రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్టమైన 95.75 స్థాయికి పడిపోయింది. 2025 డిసెంబర్లో 90 స్థాయిలో ఉంటే, ఐదు నెలల్లోనే 6% పతనమైంది. దీంతో దిగుమతులకు మరిన్ని రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాది క్రితం రూపాయి విలువ 84.2 స్థాయిలో ఉండడం గమనార్హం. ⇒ పశ్చిమాసియాలో ఘర్షణలతో సరఫరా సమస్యలు ఏర్పడి, అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. భారత్కు ప్రధాన సరఫరా మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరా తగ్గిపోయింది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 108 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఈ ధర 70 డాలర్లలోపే ఉండడం గమనార్హం. దీంతో ఎరువుల ధరలూ భారీగా ఎగిశాయి. ⇒ భారీ ధరలపై ముడి చమురు, ఎరువులు, బంగారం దిగుమతుల కోసం డాలర్ల అవసరం అనూహ్యంగా పెరిగింది. దీంతో రూపాయి విలువ బక్కచిక్కిపోతోంది. ఫలితంగా విలువైన విదేశీ మారకం నిల్వలు తరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 27 నాటికి 728.49 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారకం నిల్వలు మే 1 నాటికి 690 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కరెంట్ ఖాతా లోటు విస్తరించే రిస్క్ ఏర్పడింది. ⇒ ఆయిల్ అండ్ గ్యాస్ తర్వాత దిగుమతి చేసుకుంటున్న రెండో అత్యంత విలువైన కమోడిటీ పసిడే. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అయిన ముడి చము రు, ఎరువులు, వంట నూనెలు, పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులకే ప్రాధాన్యం ఇస్తూ, అంత అవసరం లేని బంగారం, వెండి ఇతర విలువైన లోహాల డిమాండ్ను తగ్గించాలన్నది కేంద్ర సర్కారు యోచన. ⇒ ప్రపంచంలో చైనా తర్వాత భారతే పసిడిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. ఇది ఏటా 700–800 టన్నుల మధ్య ఉంటోంది. 2025–26లో విలువైన లోహాల దిగుమతుల విలువ అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024–25)తో పోల్చి చూస్తే 26.7% పెరిగి 102.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో పసిడి దిగుమతులే 71.98 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. పరిమాణం పరంగా మాత్రం 4.75% తగ్గి 721.03 టన్నులుగా ఉంది. ధరలు పెరిగినప్పటికీ ప్రజల కొనుగోళ్ల విలువ తగ్గలేదని ఈ డేటాతో స్పష్టమవుతోంది. ⇒ తాజా సుంకాల పెంపుతో దిగుమతులు (పరిణామం పరంగా) 10–15% తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా యి. గతంలో సుంకాలు పెంచిన సందర్భాల్లోనే దిగుమతులు తగ్గడం గమనార్హం. ⇒ అధిక సుంకాలతో పసిడి అక్రమ రవాణా పెరిగే ప్రమాదమూ ఉంటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ హెచ్చరించింది. ⇒ పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఆర్బీఐ సహా అన్ని సెంట్రల్ బ్యాంక్లు విదేశీ మారకం ఆస్తుల్లో బంగారానికి వెయిటేజీని పెంచడం విశేషం. ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇక గృహాల్లో అయితే 30,000 టన్నులు (5 ట్రిలియన్ డాలర్ల విలువ) ఉండొచ్చని అంచనా.సుంకాలు ఇలా.. బంగారం, వెండిపై 5 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి చేరింది. ఒక శాతంగా ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ)ను 5 శాతానికి పెంచారు. మొత్తం కలసి 15 శాతానికి చేరింది. ఇక విక్రయాలపై 3 శాతం జీఎస్టీ కూడా కలుపుకుంటే పసిడి, వెండిపై స్థూల పన్ను భారం ఇంతకుముందున్న 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెరిగింది. ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి కస్టమ్స్ సుంకం పెరగ్గా, దీనికి 3 శాతం జీఎస్టీ జోడిస్తే మొత్తం పన్ను 18.86 శాతానికి చేరినట్టయింది. ధరలు పెరిగిపోవడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడనుంది. అసలు పూర్తి ప్రభావం జూన్ నెల డేటాలో కనిపించనుంది. ఇప్పటికే ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం పెరుగుదలలో బంగారం, వెండి ధరల పాత్ర ఉండడం గమనించొచ్చు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే స్పందిస్తూ.. 10 గ్రాముల బంగారంపై పన్నుల భారం రూ.27,000కు చేరుకున్నట్టు (జీఎస్టీ కూడా కలసి) చెప్పారు. భారం ఎంతంటే..⇒ దిగుమతి పసిడి/వెండి విలువ (ఇన్వాయిస్ ధర, బీమా, రవాణా చార్జీ) రూ.1,00,000 ⇒ దీనిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10%= రూ.10,000 ⇒ సర్చార్జీ/ఏఐడీసీ బేసిక్ డ్యూటీ 5% = రూ.5,000 ⇒ మొత్తం = 1,15,000 ⇒ దీనిపై 3 శాతం జీఎస్టీ = రూ.3,450 ⇒ పన్ను అనంతరం మొత్తం విలువ రూ.1,18,450 -
బంగారానికి ఇక దుబాయే దిక్కు!
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా దుబాయ్ నుంచి పసిడి, వెండి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ సంస్థ (జీటీఆర్ఐ) తెలిపింది. 2022లో 120 టన్నులతో మొదలైన కోటా 2027లో 200 టన్నులకు పెరగనుంది. ఇది భారత్ పసిడి దిగుమతుల్లో నాలుగో వంతుకు సమానం. కొత్త ఎంఎఫ్ఎన్ టారిఫ్ 15 శాతంగా ఉండగా, దుబాయ్ నుంచి దిగుమతులకి 14 శాతానికి పరిమితమవుతుందని జీటీఆర్ఐ పేర్కొంది. ఒక్క శాతం వ్యత్యాసం ప్రయోజనం పొందేందుకు దుబాయ్ మార్గం ద్వారా వ్యాపారులు పసిడిని మరింతగా దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వివరించింది. సుంకాలు ఇలా .. 2012కి ముందు విలువతో సంబంధం లేకుండా 10 గ్రాములకు రూ. 300 చొప్పున సుంకం ఉండేది. 2012 జనవరిలో బంగారం విలువలో 2 శాతం కస్టమ్స్ సుంకం విధించారు. అదే ఏడాది మార్చిలో బడ్జెట్లో 4 శాతానికి పెంచారు. 2013లో రుపాయి మారకం, విదేశీ మారకం నిల్వలు పడిపోయిన కారణాలతో పసిడిపై దిగుమతి సుంకాలు మూడు సార్లు పెరిగాయి. మొదట 4 నుంచి 6 శాతానికి, తర్వాత 8 శాతానికి, ఆ పైన 10 శాతానికి పెరిగాయి. 2014–18 మధ్యకాలంలో 10 శాతమే అమల్లో ఉండగా, 2019లో దాన్ని 12.5 శాతానికి పెంచారు. 2021 బడ్జెట్లో 10.75 శాతానికి తగ్గించి, మళ్లీ 2022లో 15 శాతానికి పెంచారు. 2024లో దేశీయంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 6 శాతానికి తగ్గించారు. ప్రత్యామ్నాయాల్లేవా..?2014లో మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ సర్కారు కొలువైన తర్వాత భౌతిక రూపంలో పసిడి దిగుమతులు తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది అవేంటంటే..ప్రభుత్వ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఇళ్లలో ఉన్న నిరుపయోగ బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నది ఈ పథకం లక్ష్యం. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, ఆ విలువపై 2.25–2.5 శాతం రాబడిని ఆఫర్ చేశారు. భౌతిక బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ వల్ల ఆశించిన స్పందన రాలేదు. దీంతో 2025లో ఈ పథకాన్ని నిలిపివేశారు. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2015లో సార్వభౌమ బంగారం బాండ్లకు శ్రీకారం చుట్టింది. 8 ఏళ్ల కాలవ్యవధి. బాండ్ కొనుగోలు ధరపై ఏటా 2.5 శాతం వడ్డీ ఎనిమిదేళ్ల పాటు రాబడిగా అందుతుంది. దీంతో ఈ పథకం విజయవంతమైంది. 8 ఏళ్ల కాలవ్యవధి తర్వాత నుంచి బాండ్లు క్రమంగా మెచ్యూరిటీకి రావడం.. ఈ కాలంలో పసిడి ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రభుత్వంపై చెల్లింపుల భారం భారీగా పెగిపోయింది. పెట్టుబడిపై 150–200 శాతం అధికంగా చెల్లించాల్సి వచి్చంది. దీంతో 2025 నుంచి అనధికారికంగా ఈ పథకానికీ ప్రభుత్వం గుడ్బై చెప్పింది. ఈటీఎఫ్లు బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు), డిజిటల్ గోల్డ్ తదితర డిజిటల్ సాధనాల్లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, కొనుగోలు విలువకు సరిపడా భౌతిక లోహాలను ఫండ్స్ సంస్థలు సమకూర్చుకుని ఖజానాల్లో భద్రపరచాల్సి ఉంటుంది. కనుక ఒక రకంగా భౌతికంగా ఆ మేరకు కొనుగోలు చేయాల్సిందే. కానీ, ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు దేశీయంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న బంగారాన్ని బ్యాకెండ్గా వినియోగించుకుంటే విదేశాల నుంచి అదనంగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బంగారం, వెండి డిజిటల్ రూపంలో ఉంటే కావాల్సినప్పడు విక్రయించి, కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. దీంతో చలామణి పెరుగుతుంది. పసిడిపై సుంకాల విధింపు దేశీయంగా గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లకి సానుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
విమానమెక్కి ఆఫీసుకి.. నెలకు రూ. 2.8 లక్షల ఖర్చు!
సాధారణంగా ఉద్యోగులు ఆఫీసుకి వెళ్లాలంటే బైకో, కారో లేదా మెట్రో రైలో ఎక్కుతారు. కాస్త ట్రాఫిక్ ఎక్కువైతేనే విసిగిపోతుంటారు. కానీ, ఈ గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ఏకంగా ఒక నగరం నుండి మరో నగరానికి విమానంలో ప్రయాణిస్తూ ‘సూపర్ కమ్యూటర్’గా వార్తల్లో నిలిచారు. గూగుల్ సంస్థలో ‘ఫ్లో-AI’ (ఇమేజ్ అండ్ వీడియో జనరేషన్) విభాగంలో పనిచేస్తున్న హాంగ్ (జాసన్) వై, తన వినూత్న జీవనశైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ప్రేమ కోసం సాహసోపేత నిర్ణయంఈ కఠినమైన ప్రయాణాల వెనుక ఒక బలమైన కారణం ఉంది. వై బే ఏరియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో చేరాలని ఆశపడ్డారు. అయితే, ఆయన జీవిత భాగస్వామి సీటెల్లోని అమెజాన్ కార్యాలయంలో మంచి కెరీర్ వృద్ధిలో ఉన్నారు. "ఆమె కెరీర్ను దెబ్బతీయకుండా, నా వృద్ధిని కొనసాగిస్తూనే మా బంధాన్ని కాపాడుకోవడానికి నేను తీసుకున్న నిర్ణయమే ఈ ‘ఫ్లైట్ కమ్యూటింగ్’" అని వై పేర్కొన్నారు.షెడ్యూల్, ఖర్చుల లెక్కలు ఇలా..ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం ఏడాదికి సంపాదించే మొత్తాన్ని ఈయన తన ప్రయాణాల కోసం నెలకే ఖర్చు చేస్తున్నారు. ప్రతి సోమవారం లేదా మంగళవారం సీటెల్ నుండి శాన్ జోస్ (కాలిఫోర్నియా)కు విమాన ప్రయాణం. తిరిగి గురువారం లేదా శుక్రవారం మళ్లీ సీటెల్ పయనం. ఇదీ వై షెడ్యూల్.రెండు నగరాల్లో ఇంటి అద్దెలు, విమాన టిక్కెట్లు, ఉబర్ ఛార్జీలు, కాలిఫోర్నియా పన్నులు కలిపి నెలకు సుమారు 3,000 డాలర్లు (సుమారు రూ.2.8 లక్షలు) ఖర్చు అవుతోంది. "సౌకర్యం కంటే ఎదుగుదలను ఎంచుకోవాలి" అనే సిద్ధాంతాన్ని వై నమ్ముతారు. 16 ఏళ్ల వయసులో దక్షిణ కొరియా నుండి అమెరికాకు వలస వచ్చిన ఆయనకు సవాళ్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు.బిజీ లైఫ్.. అయినా సైడ్ హజిల్!ఇంతటి కఠినమైన షెడ్యూల్ ఉన్నప్పటికీ, వై తన సృజనాత్మకతను వదులుకోలేదు. గూగుల్లో AI ప్రాజెక్టులతో పాటు, ఖాళీ సమయంలో సుమారు 500 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఒక పర్సనల్ న్యూస్లెటర్ కూడా నడుపుతున్నారు. "కాగితం మీద చూస్తే ఇది అర్థం లేని నిర్ణయంలా అనిపించవచ్చు. కానీ, ఈ ప్రయాణం వల్ల నేను పొందుతున్న వృద్ధి, అనుభవం.. నేను పెట్టే ఖర్చు కంటే చాలా విలువైనవి" అని వై ధీమాగా చెబుతున్నారు. నేటి తరం యువత కెరీర్, రిలేషన్ షిప్ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందనడానికి జాసన్ వై ఒక నిదర్శనం. -
గోల్డ్ స్మగ్లింగ్ ఇంకా పెరుగుతుందేమో!!
సాక్షి, బిజినెస్ డెస్క్: పసిడి, వెండిపై సుంకాల మోతతో ఆభరణాల మార్కెట్ గందరగోళంలో పడింది. దిగుమతులు తగ్గి విదేశీ మారకం నిల్వలను నిలబెట్టుకునేందుకు, తద్వారా రూపాయి విలువ పడిపోకుండా చూసుకునేందుకు ఇది దోహదపడనుంది. అలాగే, కొత్త కొనుగోళ్ల కోసం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పాత వాటిని కొత్త వాటికి మార్చుకునేలా ప్రోత్సహించడం ద్వారా రీసైక్లింగ్కి ఊతమివ్వనుంది.అయితే, అదే సమయంలో స్మగ్లింగ్ రిస్కులు పెరుగుతాయని, ఆభరణాల వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పసిడి, వెండి దిగుమతులపై సుంకాల మోత పలు సమస్యలకు దారి తీస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనితో వజ్రాభరణాల పరిశ్రమ మరింత గడ్డుకాలం ఎదుర్కొనాల్సి వస్తుందని ఎగుమతిదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ రిస్కులు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.పరిశ్రమకు వెన్నెముకలాంటి లఘు, చిన్న, మధ్యతరహా తయారీదార్లు ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటూ ఉండగా, తాజా పరిణామం అశనిపాతంలా మారుతుందన్నారు. దిగుమతి సుంకాలను పెంచడం వల్ల సాధారణంగానే ధరలు పెరుగుతాయని, కాకపోతే కొనుగోళ్లను తగ్గించడానికి ఉపయోగపడకపోవచ్చని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పసిడి రేట్లు రెట్టింపైనప్పటికీ దిగుమతులు అదే నిష్పత్తిలో తగ్గకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ నేపథ్యంలో సుంకాల పెంపులాంటి చర్యల వల్ల స్మగ్లింగ్కి ఊతం లభిస్తుందని, ఎగుమతి వ్యయాలు పెరిగిపోతాయని ఎగుమతిదార్లు తెలిపారు.‘పొదుపు చర్యలు, బులియన్ దిగుమతులపై సుంకాల పెంపు వల్ల వ్యాపారం మరింత కష్టతరం అవుతుంది. గ్రే మార్కెట్, స్మగ్లింగ్ పెరిగి, ఎకానమీలో సమాంతర వ్యవస్థ ఏర్పాటుకు దారి తీసే ముప్పు ఉందని పరిశ్రమ ఆందోళన చెందుతోంది’ అని అఖిల భారత రత్నాభరణాల మండలి (జీజేసీ) చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. కస్టమ్స్ సుంకం, జీఎస్టీ, వ్యవసాయ సెస్సులన్నీ కలగలిసిన దిగుమతి సుంకాల పెంపుతో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 27,000 మేర భారం అవుతుందని చెప్పారు. సుంకాలను పెంచడం వల్ల బంగారం రేట్లు మరింత పెరగడం తప్ప దిగుమతులకు అడ్డుకట్ట పడటం చాలా అరుదని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కిరీట్ భన్సాలీ వ్యాఖ్యానించారు. రీసైక్లింగ్కి దన్ను.. పసిడి దిగుమతి సుంకాల పెంపుతో స్వల్పకాలికంగా ఆభరణాల విక్రయ పరిమాణం తగ్గుతుందని జ్యుయలర్లు తెలిపారు. అయితే, డిమాండ్ స్థిరంగానే ఉండొచ్చని వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, భారీ క్రూడాయిల్ ధరలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే వరకు పెంచిన సుంకాలు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈవో సువంకర్ సేన్ చెప్పారు. పరిమాణంపరంగా 10–15% ప్రభావం పడినప్పటికీ, విలువపరంగా లావాదేవీలు అధిక స్థాయిలోనే ఉంటాయన్నారు.వినియోగదారులు తేలికపాటి ఆభరణాలను కొనేందుకు మొగ్గు చూపొచ్చన్నారు. మరో వైపు, సంస్కృతి, పెట్టుబడులపరంగా బంగారానికి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు, పండుగల సందర్భంగా కొత్తగా కొనుగోలు చేసే వారి కారణంగా పసిడికి డిమాండ్ కొనసాగుతుందని తెలిపారు. సుంకాల పెంపు వల్ల గోల్డ్ రీసైక్లింగ్ పెరుగుతుందన్నారు. ప్రధాని పిలుపుతో ‘నేషన్ ఫస్ట్ గోల్డ్4 ఇండియా’ కార్యక్రమాన్నిఆవిష్క రించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఎండీ కల్యాణరామన్ తెలిపారు. -
క్లచ్తో పనిలేకుండా గేర్లు మార్చుకునే బైక్
గురుగ్రామ్: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన పాపులర్ అడ్వెంచర్ టూరర్ మోడల్ ‘ఎన్ఎక్స్500’ను సరికొత్త ఈ–క్లచ్ టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేసింది. క్లచ్తో పనిలేకుండా గేర్లు మార్చుకునే వెసులుబాటు కల్పించే ఈ టెక్నాలజీ బైక్ రైడింగ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆటోమేషన్ సాంకేతికతను భారత రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. దీని ధరను కంపెనీ రూ. 7,43,900 (ఎక్స్–షోరూమ్ వద్ద)గా నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్వింగ్ డీలర్షిప్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఇందులో 471 సీసీ, లిక్విడ్–కూల్డ్, ప్యారలల్–ట్విన్ ఇంజిన్ను 6–స్పీడ్ ట్రాన్స్మిషన్తో అమర్చారు. ఇది సిటీ రైడింగ్ హైవే టూరింగ్ రెండింటికీ అనువైన బలమైన టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే... 5.0 అంగుళాల పూర్తి రంగుల టీఎఫ్టీ (టీఎఫ్టీ) డిస్ప్లే ఉంది. ఇందులో నావిగేషన్, కాల్, మ్యూజిక్ ఫంక్షన్ల కోసం హోండా రోడ్సింక్ కనెక్టివిటీ లభిస్తుంది. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, పూర్తి ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ మ్యాట్ గన్పౌడర్ బ్లాక్ మెటాలిక్, పెర్ల్ హోరిజోన్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ సుత్సుము ఒటాని మాట్లాడుతూ, ఈ–క్లచ్ సాంకేతికత పట్టణ, పర్యటన వాతావరణాలలో రైడర్ అలసటను తగ్గించి, సౌకర్యం, కంట్రోల్ను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఏడాది పాటు పసిడి కొనొద్దు.. పరిష్కారం ఇదిగో! -
హర్మూజ్ దాటే నౌకలకు సర్వీస్ ఛార్జీ
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై "సేవా రుసుము" (Service Fee) వసూలు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిదాబాది ధ్రువీకరించినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. నౌకల రాకపోకల పర్యవేక్షణ (Navigation), సహాయక చర్యల (Rescue Operations) వంటి సేవలకు ప్రతిఫలంగా ఈ రుసుములను వసూలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఎంపిక చేసిన నౌకలకే అనుమతిహర్మూజ్ జలసంధి గుండా అన్ని నౌకలను కాకుండా, ఎంపిక చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తామని ఘరిదాబాది పేర్కొన్నారు. నౌకలపై విధించే ఛార్జీల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను, పారదర్శకతను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత దేశ సహకారాన్ని ఇరాన్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.భారత్కు ప్రాధాన్యత"భారతదేశం మాకు అత్యంత స్నేహపూర్వక దేశం. ఇప్పటికే భారత్కు చెందిన 11 నౌకలకు అనుమతి ఇచ్చాము. మిగిలిన నౌకల అనుమతి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాము" అని ఆయన ఎన్డీటీవీతో చెప్పారు.ప్రాంతీయ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఇరాన్ కాల్పుల విరమణను కోరలేదని, అమెరికాయే ఆ ప్రతిపాదన తెచ్చిందని గరిదాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితి 'శాంతి లేదు - యుద్ధం లేదు' అన్నట్లుగా ఉంది. అందుకే ప్రారంభంలో మేము కాల్పుల విరమణను వ్యతిరేకించాం. అయితే దౌత్యపరమైన పరిష్కారం కోసం చివరికి చర్చలకు అంగీకరించాం," అని ఆయన వివరించారు. -
మోదీ కామెంట్స్ వేళ బంగారం వ్యాపారులు ఏం చేస్తున్నారంటే?
పాత బంగారం మార్పిడి పథకాలపై నగల వ్యాపారులు దృష్టి సారించారు. భారత్లో విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవడానికి బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి విషయం తెలిసిందే. దీంతో ఆభరణాల రంగం బంగారం రీసైక్లింగ్, మార్పిడి పథకాల వైపు అడుగులు వేస్తోంది. డిమాండ్ను పూర్తిగా తగ్గించే బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.“దిగుమతి సుంకం సవరణ అనేది అతిపెద్ద విధాన మార్పు. ఇది సరఫరా వ్యవస్థ మొత్తం ఖర్చులను పెంచుతుంది. కానీ వినియోగదారులు బంగారాన్ని ఎలా వినియోగించాలో మళ్లీ ఆలోచించే అవకాశాన్ని కూడా ఇది ఇస్తోంది. పాత బంగారం తీసుకొచ్చి కొత్త నగలతో మార్చుకోవాలని మా వినియోగదారులను బలంగా ప్రోత్సహిస్తున్నాం’’అని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించుకుంటూ కొత్త డిజైన్లు పొందేందుకు ఇది ఉత్తమ మార్గాల్లో ఒకటని అంటున్నారు.పాత బంగారం మార్పిడిలో ఆఫర్లు తనిష్క్ సంస్థ తన పాత బంగారం మార్పిడి కార్యక్రమాన్ని #ఓల్డ్గోల్డ్న్యూఇండియా ప్రచారంతో పెంచుకుంది. కల్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇటీవల ‘నేషన్ ఫస్ట్ - గోల్డ్4ఇండియా ఇనిషియేటివ్’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. పాత బంగారం మార్పిడి, తక్కువ బరువు ఉన్న 18 క్యారెట్ నగల వినియోగం, గోల్డ్ మానిటైజేషన్ పథకాలు, బంగారం పునర్వినియోగ కార్యక్రమాలపై సంస్థ దృష్టి పెట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థకు చెందిన 342 దుకాణాల్లో వినియోగదారులు వాడని, పాడైన, పాత నమూనాల నగలను మార్చుకునేలా ప్రోత్సహిస్తారు. దీంతో కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన బంగారం అవసరం తగ్గుతుంది.ఇటీవల ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం దిగుమతి ఖర్చులు, ప్రస్తుత ఖాతా లోటు, బంగారం ధరల పెరుగుదలపై ఆందోళనలు మరింత పెంచింది. ప్రస్తుత ఖాతా లోటు అంటే.. విదేశాలకు చెల్లింపులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయం మధ్య తేడా వల్ల ఏర్పడే లోటు. భారత్ దిగుమతి బంగారంపై ఎక్కువగా ఆధారపడటంతో, కొత్తగా కొనుగోలు చేయడానికి బదులు ఇళ్లలో వాడని బంగారాన్ని కొత్త నగలుగా మార్చుకోవాలని వ్యాపారులు వినియోగదారులకు సూచిస్తున్నారు.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక సుంకం తాత్కాలికంగా బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపొచ్చు. కానీ, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వొచ్చు. “భారత్లో బంగారం దిగుమతి సుంకం పెంపు స్థానిక ధరలను పెంచి, కొంతకాలం కొనుగోళ్లు తగ్గించే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచ అనిశ్చితి, దేశీయ కరెన్సీ ఒత్తిళ్ల సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుంది” అని నిపుణులు తెలిపారు.గతంలో దిగుమతి సుంకం 15 శాతం ఉన్నప్పుడు కనిపించినట్లే.. అక్రమ రవాణా మళ్లీ పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో దిగుమతి బిల్లు తగ్గి విదేశీ మారక నిల్వలకు తాత్కాలిక మద్దతు లభించొచ్చని చెబుతున్నారు.భారత్ మొత్తం దిగుమతి బిల్లులో బంగారం వాటా దాదాపు 9-10 శాతం ఉండటంతో, కొత్త దిగుమతుల బదులు దేశంలో ఇప్పటికే ఉన్న బంగారాన్ని పునర్వినియోగం చేయడం, మానిటైజేషన్పై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలకు ఆభరణాల రంగం అనుగుణంగా ముందుకు సాగుతోంది.“భారత్లో ఇళ్లలో దాదాపు 25,000 టన్నుల వాడని బంగారం ఉందని అంచనా. అందులో కొంత భాగాన్నైనా నమ్మకమైన మానిటైజేషన్ వ్యవస్థ ద్వారా వినియోగంలోకి తీసుకొస్తే దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది” అని నిపుణులు తెలిపారు. -
దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకోవాలి
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దీర్ఘకాలంలో రిసు్కలను ఎదుర్కొనేలా దేశీయంగా ఆర్థిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ తెలిపారు. నిధులు, అధికారం కోసం మరొకరిపై ఆధారపడకపోవడమే సిసలైన స్వావలంబన అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత్ అనేక సంవత్సరాలపాటు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులపైనే (ఎఫ్పీఐ) ఆధారపడిందని, కరోనా మహమ్మారి తర్వాతే దేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లలో కీలక పాత్ర పోషించే ధోరణి పెరిగిందని కోటక్ చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా దేశీయంగా ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీలు త్రైమాసిక ఫలితాలు, షేర్ల ధరల్లాంటి స్వల్పకాలిక అంశాలపై కాకుండా దీర్ఘకాలికంగా సంస్థను తీర్చిదిద్దుకునే వ్యూహాలపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు.కంపెనీలు తమకొచ్చే లాభాలను తిరిగి వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రస్తుతమిస్తున్న ట్యాక్స్ ఇన్సెంటివ్స్కే పరిమితం కాకుండా అదనంగా మరిన్ని ప్రోత్సాహకాలిస్తే కొత్తగా పెట్టుబడులకు ఊతం లభించగలదని కోటక్ చెప్పారు. దేశీయంగా ఉత్పత్తిని, ఎగుమతులను పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం ద్వారా భారత్ తన బ్యాలెన్స్ షీట్ను పటిష్టం చేసుకోవచ్చన్నారు. పరిశ్రమలకు మేల్కొలుపు: మంత్రి పీయుష్ గోయల్ ప్రస్తుత పరిస్థితులు దేశీ పరిశ్రమలకు మేల్కొలుపులాంటిదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా దిగుమతులను తగ్గించుకునేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సద్వినియోగం చేసుకునేందుకు దీన్నొక అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం పడిందని ఆయన చెప్పారు. అయితే, ఈ సంక్షోభ పరిస్థితుల్లో మిగతా దేశాలకన్నా మెరుగ్గా రాణించేందుకు భారత్ ముందు చక్కని అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు విదేశీ విహార యాత్రలపరమైన వినియోగాన్నే మాత్రమే తగ్గించుకోమని ప్రధాని చెప్పారే తప్ప వ్యాపార పర్యటనలను నిలిపివేసుకోవాలనలేదని గోయల్ తెలిపారు. ‘వ్యాపారాన్ని విస్తరించేందుకు పరిశ్రమ వర్గాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటించాలి. మరింతగా విదేశీ మారకం వచ్చేలా మరిన్ని ఎగుమతి ఆర్డర్లను దక్కించుకోవాలి. కొంత ఖర్చు చేసి మరింతగా ఆదాయాన్ని పెంచుకోవాలి. మనం 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి‘ అని పేర్కొన్నారు. -
మరింత పెరిగిన పాల ధరలు.. ఎంతంటే?
అమూల్, మదర్ డెయిరీ సంస్థలు పాల ధరలను పెంచాయి. కొత్త ధరలు మే 14 నుంచి అమల్లోకి రానున్నాయని తాజాగా ఆయా సంస్థలు విడుదల చేసిన సర్క్యులర్ ద్వారా వెల్లడైంది. పెంచిన ధరలు ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, కౌ మిల్క్, బఫెలో మిల్క్, ప్రీమియం రకాల పాలపై కూడా వర్తిస్తాయి. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విక్రయించే అమూల్ పాలు లీటర్కు రూ.1-2 వరకు పెరిగాయి. అమూల్ గోల్డ్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.68 నుంచి రూ.70కి చేరింది. అమూల్ లీటర్ పాలు రూ.55 నుంచి రూ.57కు చేరింది.బఫెలో మిల్క్, కౌ మిల్క్, స్లిమ్ అండ్ ట్రిమ్, టీ స్పెషల్ రకాల ధరలను కూడా అమూల్ పెంచింది. అమూల్ బఫెలో మిల్క్ 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.38 నుంచి రూ.39కి చేరింది. కౌ మిల్క్ 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.30కి చేరింది.మదర్ డెయిరీ ధరలు ఇలా.. మదర్ డెయిరీ కూడా పలు స్టాక్ కీపింగ్ యూనిట్ల ధరలు పెంచింది. మే 13న డిస్ట్రిబ్యూటర్లు, రవాణాదారులకు పంపిన సర్క్యులర్లో ఈ విషయం తెలిపింది. కొత్త ధరల ప్రకారం మదర్ డెయిరీ బఫెలో మిల్క్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.75 నుంచి రూ.80కి పెరిగింది. 500 మిల్లీ లీటర్ల బఫెలో మిల్క్ ప్యాక్ ధర కూడా రూ.76 నుంచి రూ.80కి మారిందని సర్క్యులర్లో పేర్కొన్నారు.మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.69 నుంచి రూ.72కి చేరింది. 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.70 నుంచి రూ.72కి పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్, కౌ మిల్క్, ప్రో మిల్క్ రకాల ధరలు కూడా సంస్థ సవరించింది.మే 13 రాత్రి నుంచి సరఫరా అయ్యే పాలపై ఈ కొత్త ధరలు వర్తిస్తాయని, మే 14 ఉదయం నుంచి మార్కెట్లో విక్రయాలు ఈ ధరల ప్రకారమే జరుగుతాయని సర్క్యులర్లో వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా పాల సేకరణ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు సంస్థలు పలుమార్లు పాల ధరలు సవరించాయి. ఈ ధరల పెంపు వినియోగదారులపై మరింత భారం మోపనుంది.పశువుల మేత, రవాణా, ప్యాకేజింగ్, పాల సేకరణ ఖర్చులు పెరగడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని పాల సంస్థలు గతంలో వెల్లడించాయి. 2022 నుంచి సహకార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు రాష్ట్రాల వారీగా విడతల వారీగా ధరలు సవరించాయి. అమూల్, మదర్ డెయిరీ, నందిని వంటి సంస్థలు ప్రాంతాల వారీగా పాల సేకరణ పరిస్థితులు, ముడి ఖర్చుల ఆధారంగా వేర్వేరు సమయాల్లో ధరలు మార్చాయి.భారత్ ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశం. పట్టణ కుటుంబాల వినియోగంలో ప్యాకెట్ పాలు కీలక భాగంగా ఉన్నాయి. పాల సహకార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు తీసుకునే ధరల నిర్ణయాలు పాల సేకరణ ఖర్చులు, సీజనల్ సరఫరా పరిస్థితులు, పంపిణీ వ్యయాలపై ఆధారపడి ఉంటాయి. -
హైదరాబాద్లో 4 రెట్లు పెరిగిన అమెజాన్ బజార్ కస్టమర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అందుబాటు ధరల్లో ఉత్పత్తులన్నీ ఒకే చోట లభించేలా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్లో అంతర్భాగంగా ఉన్న అమెజాన్ బజార్కి (Amazon Bazaar) సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన ఆర్డర్లు నాలుగు రెట్లు పెరిగినట్లు అమెజాన్ బజార్ హెడ్ సమీర్ లాల్వానీ తెలిపారు. హైదరాబాద్లో కొత్త కస్టమర్ల చేరిక నాలుగు రెట్లు పెరగ్గా, విజయవాడ, గుంటూరు, వరంగల్ తదితర నగరాలు కూడా ముందు వరుసలో ఉన్నట్లు వివరించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 1,200 మంది పైచిలుకు విక్రేతలు ఉన్నట్లు తెలిపారు. బజార్లో రూ. 99 నుంచి రూ. 600 ధర శ్రేణిలో మూడు కోట్లకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా 30,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళల ఫ్యాషన్, గృహోపకరణలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ మొదలైన కేటగిరీల్లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం, ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల్లోకి మరింత విస్తరణపై దృష్టి పెడుతున్నట్లు లాల్వానీ చెప్పారు. డెలివరీ అసోసియేట్స్కి హెల్త్ కవరేజీ మరోవైపు, దేశవ్యాప్తంగా 90,000 మంది డెలివరీ అసోసియేట్స్కి హెల్త్ కవరేజీని విస్తరిస్తున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ (ఆపరేషన్స్) సలీమ్ మెమన్ తెలిపారు. రూ. 1.5 లక్షల వరకు మెడిక్లెయిమ్, రూ. 10,000 వరకు ఓపీడీ ప్రయోజనాలు, రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీ మొదలైనవి వీటిలో ఉన్నట్లు వివరించారు. డెలివరీ అసోసియేట్స్ కోసం ఉచిత హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించినట్లు తెలిపారు. అసోసియేట్స్ సంక్షేమంపై రూ. 2,800 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో భాగంగా వీటిని చేపట్టినట్లు మెమన్ చెప్పారు. -
2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు ఏఐ జోష్
భారతదేశం మరో పారిశ్రామిక విప్లవానికి వేదిక కాబోతోంది. 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 500 బిలియన్ డాలర్లకు పైగా అదనపు విలువను జోడించనుందని తాజా నివేదిక వెల్లడించింది. ఐబీఎం ఇన్స్టిట్యూట్ ఫర్ బిజినెస్ వాల్యూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియాఏఐ’ సంయుక్తంగా రూపొందించిన ‘ప్రామిస్ టు పవర్: హౌ ఏఐ ఈజ్ రిడిఫైనింగ్ ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్’ అనే నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆశయం గొప్పదే.. కానీ..భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. సర్వేలో పాల్గొన్న 73% మంది వ్యాపార దిగ్గజాలు 2030 నాటికి భారత్ ప్రపంచ ఏఐ లీడర్గా అవతరిస్తుందని నమ్ముతున్నారు. ఐదుగురు వ్యాపారవేత్తలలో నలుగురు ఏఐ పెట్టుబడులు నేరుగా దేశ జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.అయితే, వాస్తవ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. సర్వే చేసిన సంస్థల్లో 72% సంస్థలు అంతర్జాతీయ పోటీతో పోలిస్తే తాము ఏఐ అమలులో వెనుకబడి ఉన్నామని అంగీకరించాయి. ఆశయానికి, ఆచరణకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని తగ్గించడమే ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సవాలు.35 కోట్ల మంది నిపుణులు అవసరంఈ నివేదిక ప్రధానంగా నైపుణ్యాల కొరతను ఎత్తిచూపింది. ‘ప్రస్తుతం కేవలం 30% మంది ఉద్యోగులకు మాత్రమే ఏఐ పరిజ్ఞానం ఉంది. 2030 నాటికి ఈ అవసరాలు తీరాలంటే దేశవ్యాప్తంగా 350 మిలియన్ల (35 కోట్లు) ఏఐ నిపుణులు అవసరమవుతారు’ అని అంచనా వేసింది. కేవలం సాంకేతికత ఉండటం ముఖ్యం కాదు. ఆ సాంకేతికతను నడిపించే నైపుణ్యం గల మానవ వనరులు ఉండటమే అసలైన విజయమని నివేదిక పేర్కొంది.డేటా సార్వభౌమాధికారండేటా భద్రత, నియంత్రణ విషయంలో భారతీయ కంపెనీలు కఠినంగా ఉన్నాయి. 74% మంది ఎగ్జిక్యూటివ్లు డేటాపై పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నారు. ఖర్చును తగ్గించుకుంటూనే పనితీరును మెరుగుపరచుకోవడానికి 10 మందిలో ఏడుగురు హైబ్రిడ్ క్లౌడ్ నమూనా వైపు మొగ్గు చూపుతున్నారు. స్వదేశీ క్లౌడ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం (77%), డేటా నాణ్యత సరిగ్గా లేకపోవడం (57%) ఏఐ విస్తరణకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.భారతదేశం కేవలం ఏఐ వినియోగదారుగా మాత్రమే కాకుండా సృష్టికర్తగా ఎదగాలంటే ‘ఇండియాఏఐ ఫ్యూచర్ స్కిల్స్’ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఏఐ ల్యాబ్ల ఏర్పాటు ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను ఒడిసిపట్టాలి. అప్పుడే 500 బిలియన్ డాలర్ల కల సాకారమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేసి విప్లవాత్మక మార్పులు తెస్తేనే ఈ ఏఐ స్వప్నం సాకారం అవుతుందంటున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
మంటెత్తనున్న ఇంధన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెరుగుతున్న చమురు భారంతో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సవాళ్లను ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు.వినియోగదారులపై ధరల భారం తప్పదా?ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 107 డాలర్ల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఇప్పటివరకు ఆ భారాన్ని వినియోగదారులపై పడకుండా రక్షిస్తూ వస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు.అయితే, ఈ ఉపశమనం శాశ్వతం కాకపోవచ్చని ఆయన పరోక్షంగా సూచించారు. ‘ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ధరల పెంపును ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చమురు కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉంది’ అని మల్హోత్రా వ్యాఖ్యానించారు.సరఫరా గొలుసులో అంతరాయాలుప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, సంఘర్షణల వల్ల సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు ఇప్పటికే భారతదేశాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయని గవర్నర్ అంగీకరించారు. ఇలాంటి భారీ సరఫరా షాక్ ఎదురైనప్పుడు కేవలం ద్రవ్యోల్బణ లక్ష్యాల ఫ్రేమ్వర్క్ మాత్రమే సరిపోదని, ప్రభుత్వ ఆర్థిక విధానాలతో సమన్వయం చేసుకోవడం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలుగతంలోనే ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాలు తగ్గించినందున ప్రస్తుత ధరల పెరుగుదలను చమురు కంపెనీలే భరిస్తున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.9 శాతంగా, ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది.ఆర్బీఐ ప్రస్తుతం ప్రతి నెలా వచ్చే గణంకాలను నిశితంగా పరిశీలిస్తోంది. తాత్కాలిక ఒడిదుడుకులను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్థిరపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.జూన్ 5న వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం?ఏప్రిల్లో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 5న జరగనున్న తదుపరి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే ఉంటే సామాన్యుడిపై అటు ఇంధన ధరలు, ఇటు బ్యాంక్ ఈఎంఐల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
జుకర్బర్గ్ రికార్డు బద్దలు..
సాధారణంగా 22 ఏళ్ల వయసు అంటే కెరీర్ను ఇప్పుడిప్పుడే మలుచుకునే దశ. కానీ, భారత సంతతికి చెందిన సూర్య మిధా ఆలోచనలు మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాను సవాల్ చేస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) విప్లవాన్ని అందిపుచ్చుకున్న ఈ యువ పారిశ్రామికవేత్త కేవలం 22 ఏళ్లకే సుమారు 2.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.18,000 కోట్లు) నికర విలువతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ‘సెల్ఫ్ మేడ్ బిలియనీర్’గా అవతరించారు. ఈ క్రమంలో ఫేస్బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్బర్గ్ నెలకొల్పిన రికార్డును సైతం ఆయన అధిగమించడం విశేషం.జుకర్బర్గ్ కంటే వేగంగా..గతంలో మార్క్ జుకర్బర్గ్ తన 23వ ఏట బిలియనీర్ క్లబ్లో చేరగా సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందుగానే (22 ఏళ్లకే) ఈ మైలురాయిని చేరుకున్నారు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కులైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్లలో ఒకరిగా ఆయన చరిత్ర సృష్టించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో కాకుండా కేవలం తన వినూత్న ఏఐ స్టార్టప్ ద్వారా ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.విజయానికి బాటలుసూర్య మిధా తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్లతో కలిసి స్థాపించిన ‘మెర్కోర్’ సంస్థ ఈ అద్భుత విజయానికి కీలకంగా నిలిచింది. ఇది సాధారణ నియామక సంస్థ కాదు. పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ప్లాట్ఫారమ్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వగల, పరిశోధన చేయగల నిపుణులను గుర్తించి పెద్ద కంపెనీలకు అనుసంధానిస్తుంది. అభ్యర్థుల నైపుణ్యాలను అంచనా వేయడం నుంచి ఇంటర్వ్యూల నిర్వహణ వరకు ప్రతి దశలోనూ ఏఐని ఉపయోగిస్తుంది. ఈ ఆటోమేషన్ ప్రక్రియ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది.మెరుపు వేగంతో వాల్యుయేషన్పెట్టుబడిదారుల నమ్మకమే మెర్కోర్ విజయ రహస్యం. బెంచ్మార్క్, ఫెలిసిస్, జనరల్ క్యాటలిస్ట్ వంటి దిగ్గజ సంస్థల మద్దతుతో ఈ స్టార్టప్ విలువ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు చేరింది. మార్చి 2025లో 100 మిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ వార్షిక ఆదాయం, సెప్టెంబర్ నాటికే 500 మిలియన్ డాలర్లకు పెరగడం ఏఐ రంగంలోనే ఒక రికార్డు.సిలికాన్ వ్యాలీలో కొత్త ఒరవడిసూర్య మిధా ప్రస్థానం విలక్షణమైనది. చర్చా వేదికల్లో పరిచయమైన ముగ్గురు మిత్రులు తమ స్టార్టప్ కల కోసం కళాశాల చదువును మధ్యలోనే ఆపేసి సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టారు. నేడు ఏఐ రంగం కేవలం చాట్బాట్లకే పరిమితం కాకుండా.. రిక్రూట్మెంట్, హెల్త్కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఎలా విప్లవం తీసుకురాగలదో మెర్కోర్ నిరూపించింది. భవిష్యత్తు అంతా ఏఐదే అని ఐటీ నిపుణులు చెబుతున్న మాటలను సూర్య మిధా నిజం చేసి చూపించారు. భారత సంతతికి చెందిన ఈ యువకుడి విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
విజయ్ మాల్యాకు ఉద్యోగిని ట్వీట్..
భారతీయ స్టార్టప్ రంగం అంటేనే సాహసోపేతమైన ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలు. తాజాగా ఒక స్టార్టప్ ఉద్యోగి చేసిన పని, దానికి తన బాస్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పరారీలో ఉన్న వ్యాపారి విజయ్ మాల్యాకు చెందిన ప్రసిద్ధ కింగ్ ఫిషర్ విల్లాను తమ కంపెనీ ఈవెంట్ కోసం అద్దెకు ఇవ్వాలని కోరుతూ ఒక ఉద్యోగి ఏకంగా మాల్యాకే ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.అసలేం జరిగింది?భారతదేశంలో ‘క్రియేటర్ ఎకానమీ’ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ‘లూప్’ అనే కొత్త ప్రోడక్ట్ను మే 21న లాంచ్ చేసేందుకు ఒక టీమ్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ టీమ్ సభ్యురాలు అనుష్క సింగ్ అనే యువతి, తమ లాంచ్ నైట్ కోసం గోవాలోని ఐకానిక్ కింగ్ ఫిషర్ విల్లా అయితే బాగుంటుందని భావించింది. ఏమాత్రం తటపటాయించకుండా నేరుగా విజయ్ మాల్యాను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది.‘హాయ్ విజయ్ మాల్యా, నా పేరు అనుష్క సింగ్. మే 21న మేము ‘లూప్’ను లాంచ్ చేస్తున్నాము. ఇందుకోసం 1000 మందికి పైగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో ఒక భారీ ఈవెంట్ నిర్వహించాలనుకుంటున్నాం. ఒక రాత్రి కోసం మీ కింగ్ ఫిషర్ విల్లాను మాకు అద్దెకు ఇవ్వగలరా? మీరు ఎంత అడిగినా చెల్లించడానికి సిద్ధం. ఒకవేళ అది ఇప్పుడు మీ ఆధ్వర్యంలో లేకపోతే ప్రస్తుతం అది ఎవరి ఆధీనంలో ఉందో వారికైనా నన్ను రిఫర్ చేయండి’ అని ఆమె తన పోస్ట్లో పేర్కొంది.అనుమతి లేకుండానే..తన అనుమతి లేకుండా ఉద్యోగి చేసిన ఈ పోస్ట్ను చూసి సదరు కంపెనీ వ్యవస్థాపకుడు, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి దినేష్ సింగ్ ఆశ్చర్యపోయారు. అయితే, ఆమెను మందలించడానికి బదులు ఆమెలోని ధైర్యాన్ని అభినందిస్తూ ఇంటర్నెట్ వేదికగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. ‘నిజాయితీగా చెప్పాలంటే, నేను పని చేయాలనుకుంటున్న టీమ్ ఇలాగే ఉండాలి’ అని పేర్కొంటూ ఆయన రెండు ఆఫర్లను ప్రకటించారు.1. అనుష్క చేసిన పోస్ట్కు లింక్డ్ఇన్, ఎక్స్ (ట్విట్టర్)లో 1,000 రీపోస్టులు వస్తే ఎలాగైనా ఆ విల్లాను బుక్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.2. ఒకవేళ రీపోస్టుల సంఖ్య 5,000 దాటితే మొత్తం గ్రోత్ టీమ్ను వారి ఇష్టం వచ్చిన దేశానికి అంతర్జాతీయ పర్యటనకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.విజయ్ మాల్యాను ఉద్దేశించి రాస్తూ, ‘మీరు ఇది చదువుతుంటే ఇకపై నిర్ణయం మీదే. ఆమె వయసు కేవలం 22 ఏళ్లు. మా లాంచ్ ఈవెంట్ను ఆమే నడిపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం మీ విల్లానే కావాలని ఆమె నిర్ణయించుకుంది’ అని దినేష్ సింగ్ పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనఈ ఉదంతంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ ‘ఇది జెన్-జెడ్ నేతృత్వంలోని స్టార్టప్ మార్కెటింగ్ సరికొత్త దశలోకి ప్రవేశించిందని నిరూపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరొకరు, ‘ఆ విల్లా ప్రస్తుతం మాల్యా ఆధీనంలో లేకపోయినా ఈ ప్రయత్నం ద్వారా ఆ టీమ్కు లభిస్తున్న పబ్లిసిటీ అమోఘం’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
నేటి మార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు..
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 13, 2026) తీవ్ర ఒడిదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న భారీ అమ్మకాల పర్వానికి స్వల్ప విరామం లభించినట్లు కనిపిస్తోంది. ప్రధాన సూచీలు రోజంతా అనిశ్చితికి లోనైనప్పటికీ ముగింపు సమయానికి సానుకూల ధోరణిని ప్రదర్శించాయి.నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 33 పాయింట్ల స్వల్ప లాభంతో 23,412 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 49 పాయింట్లు పుంజుకుని 74,608 స్థాయిని చేరింది.మార్కెట్ గమనానికి కారణాలుగత సెషన్లలో మార్కెట్ భారీగా పతనం కావడంతో (ముఖ్యంగా మే 12న సెన్సెక్స్ 1,456 పాయింట్లు పడిపోయింది), కొన్ని కీలక షేర్లు ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మెటల్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ రంగాల్లో ఇన్వెస్టర్లు వాల్యూ బయింగ్కు మొగ్గు చూపడం మార్కెట్కు ఊతమిచ్చింది.అమెరికాలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఏప్రిల్లో 3.8%కి పెరగడం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపింది. పశ్చిమాసియాలో (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు) నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు పెరగడం, తద్వారా ద్రవ్యోల్బణం వేగవంతం కావడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 106 డాలర్ల పైనే కొనసాగుతోంది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల భారత ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయాలు నెలకొన్నాయి. ‘మూడీస్’ సంస్థ ఇప్పటికే 2026కి భారత వృద్ధి అంచనాను 6%కి తగ్గించడం గమనార్హం.ఓపెన్ ఏఐ వంటి సంస్థలు ఎంటర్ప్రైజ్ ఏఐ రంగంలోకి ప్రవేశిస్తుండటంతో భారత ఐటీ కంపెనీల సాంప్రదాయ వ్యాపార నమూనా దెబ్బతింటుందనే భయంతో ఐటీ షేర్లలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. అయితే నేడు ఇతర రంగాలు రాణించడంతో నిఫ్టీ పతనాన్ని అడ్డుకోగలిగింది.నిపుణుల విశ్లేషణప్రస్తుత మార్కెట్ పరిస్థితిని చూస్తుంటే ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిఫ్టీకి 23,200 నుంచి 23,400 మధ్య బలమైన మద్దతు (సపోర్ట్) కనిపిస్తోంది. ఒకవేళ అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణిగితే తప్ప మార్కెట్ మళ్లీ పూర్తి స్థాయి సానుకూల వృద్ధిలోకి రావడం కష్టమే. ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి క్వాలిటీ స్టాక్స్కు మాత్రమే పరిమితం కావడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
మీ ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్?
న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు కేంద్రం శుభవార్త. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కేంద్రం కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు. భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా. గోల్డ్ పాలసీలో కీలక మార్పులకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. -
జనరల్ మోటార్స్ సాఫ్ట్వేర్ ప్రక్షాళన
ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ తన ఐటీ విభాగంలో భారీ మార్పులు చేపట్టింది. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధ(ఏఐ) చుట్టూనే తిరగనుందని భావిస్తున్న కంపెనీ అందుకు అనుగుణంగా తన శ్రామిక శక్తిని పునర్నిర్మించే పనిలో పడింది. ఈ క్రమంలో తన ఐటీ విభాగం నుంచి సుమారు 600 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్స్ విధించింది.నైపుణ్యాల మార్పిడి వ్యూహంఈ తొలగింపులు కేవలం ఖర్చు తగ్గించుకోవడానికో లేదా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికో చేసినవి కావని, ఇది ఒక స్పష్టమైన నైపుణ్యాల మార్పిడి వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ ఐటీ విభాగంలోని మొత్తం సిబ్బందిలో ఇది 10 శాతం కంటే ఎక్కువ. సాంప్రదాయ ఐటీ పాత్రల కంటే, ఏఐ-కేంద్రీకృత సాంకేతికతలలో ప్రవేశం ఉన్న నిపుణుల కోసం కంపెనీ వెతుకుతోంది. ‘భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జీఎం భారీ మార్పులు చేస్తోంది’ అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.ఏఐ వైపు వేగంగా..ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ జీఎం కొత్త నియామకాలను ఆపలేదు. అయితే, ఇప్పుడు కంపెనీ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. కంపెనీ ప్రస్తుతం కీలక రంగాల్లో నిపుణుల కోసం వేట సాగిస్తోంది. అందులో.. ఏఐ-నేటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్లు, డేటా ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిపుణులు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ తయారీ నిపుణులపై ఫోకస్ పెట్టింది.కొత్త దిశగా అడుగులుగత 18 నెలలుగా జీఎం తన టెక్నాలజీ విభాగంలో ప్రక్షాళన చేస్తూనే ఉంది. 2024 ఆగస్టులో కూడా సుమారు 1,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను తొలగించింది. 2025లో స్టెర్లింగ్ ఆండర్సన్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా చేరిన తర్వాత ఈ పరివర్తన మరింత వేగవంతమైంది. సాఫ్ట్వేర్, టెక్నాలజీ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రక్రియను ఆయన ముమ్మరం చేశారు. ఇటీవలే యాపిల్ మాజీ ఉద్యోగి బెహ్రాద్ తోఘిని ఏఐ లీడ్గా, మాజీ క్రూయిజ్ ఎగ్జిక్యూటివ్ రషీద్ హక్ను అటానమస్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్గా నియమించుకోవడం ద్వారా తన ఉద్దేశాన్ని కంపెనీ చాటిచెప్పింది.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
సిలికాన్ వ్యాలీలో ‘దేశీ’ నెట్వర్క్
సిలికాన్ వ్యాలీలో భారతీయ నిపుణుల ఆధిపత్యంపై మరోసారి చర్చ మొదలైంది. గూగుల్లో పనిచేసిన ఒక మాజీ కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతీయులు ఒక రహస్య నెట్వర్క్ను నడుపుతున్నారని, అనైతిక మార్గాల్లో తమ వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు అటు అమెరికన్లలో, ఇటు భారతీయ టెక్కీలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఏమిటా ఆరోపణలు?జీబీ న్యూస్ రూపొందించిన ‘హెచ్-1బీ డాక్యుమెంటరీ’ కోసం స్టీఫెన్ వివియన్ అనే మాజీ గూగుల్ కాంట్రాక్టర్ మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్లో పనిచేసే భారతీయ ఉద్యోగులు తమ స్నేహితులకు లేదా పరిచయస్తులకు ఇంటర్వ్యూలో అడిగే రహస్య ప్రశ్నలను ముందుగానే లీక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారతీయులు కేవలం ఇండియన్స్నే నియమించుకోవడానికి ఇష్టపడుతున్నారని, దీనివల్ల అర్హత ఉన్న ఇతరులకు అన్యాయం జరుగుతోందని వివియన్ పేర్కొన్నారు. ‘నేను ఒక భారతీయ వ్యక్తితో స్నేహం చేశాను. ఆ క్రమంలోనే నాకు ఈ రహస్యాలు తెలిశాయి. ఇంటర్వ్యూలు పూర్తిగా గోప్యంగా ఉండాలి. కానీ వారు ఆ ప్రశ్నలను పంచుకుంటున్నారు. నిజాయితీ లేని అంశం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.నెట్టింట ముదిరిన యుద్ధంవివియన్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మెజారిటీ నిపుణులు ఆయన మాటలను కొట్టిపారేస్తూ, భారతీయ టెక్కీల ప్రతిభను తక్కువ చేయడమేనని మండిపడుతున్నారు. ‘భారతీయులు ప్రపంచస్థాయి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారంటే అది వారి సామర్థ్యం. ఒక కఠినమైన జాబ్ మార్కెట్లో పోటీ పడలేక మొత్తం జాతీయతపై నిందలు వేయడం మీ పక్షపాతాన్ని చూపిస్తుంది’ అని ఒక నెటిజన్ స్పందించారు.ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త రిచర్డ్ హనానియా స్పందిస్తూ, ‘ఈ వ్యక్తి ఒక డెలివరీ మేనేజర్ మాత్రమే, గూగుల్లో కీలక నిర్ణయాధికారి కాదు. ఒక కాంట్రాక్టర్ మాటలను పట్టుకుని భారతీయ నిపుణులందరినీ స్కామర్లుగా ముద్ర వేస్తారా?’ అని ప్రశ్నించారు. అయితే, వివియన్కు మద్దతు ఇచ్చే వారు కూడా లేకపోలేదు. ఐటీ రంగంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వారు తమ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన
కొవిడ్ పరిణామాల తర్వాత ఐటీ ఉద్యోగులు తిరిగి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బాట పట్టిన తరుణంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చేసిన తాజా వ్యాఖ్యలు కార్పొరేట్ ప్రపంచంలో చర్చకు తెరలేపాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును గౌరవిస్తూ తమ సంస్థలో తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ప్రధాని పిలుపుదేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, పౌరులు, సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు, నేషన్ ఫస్ట్ అనే గ్రాఫిక్ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో మోదీ తెలిపిన వివరాల ప్రకారం.. అనవసర ప్రయాణాలను తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేయడాన్ని ప్రోత్సహించాలి. విదేశీ ప్రయాణాలు, వంట నూనె వినియోగం, బంగారం కొనుగోళ్లపై నియంత్రణ అనే అంశాలున్నాయి.‘ఒక సంస్థగా మేము ఇటీవలి కాలంలో పూర్తిస్థాయిలో కార్యాలయం నుంచి పనిచేసే విధానానికి మారాం. అయితే, ప్రధాని విజ్ఞప్తి నేపథ్యంలో మేము మా నిర్ణయాన్ని పునసమీక్షించుకోబోతున్నాం’ అని వెంబు స్పష్టం చేశారు.ఆచరణలో జోహోశ్రీధర్ వెంబు తన పోస్ట్లో జోహో ఇప్పటికే అంతర్గతంగా తీసుకుంటున్న మార్పులను కూడా వివరించారు. ‘సంస్థకు చెందిన పొలాల్లో సహజ సిద్ధమైన సాగు పద్ధతులను అవలంబిస్తున్నాం. డీజిల్ వినియోగాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని చెప్పారు. ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయింది.శ్రీధర్ వెంబు ప్రతిపాదన కేవలం ఒక కంపెనీ నిర్ణయంగా చూడలేమని, అది దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన భారాన్ని తగ్గించే ఒక వ్యూహాత్మక అడుగు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మరిన్ని ఐటీ దిగ్గజాలు ఇదే బాటలో నడిస్తే భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే, దీనివల్ల ప్రభావితమయ్యే అసంఘటిత రంగ కార్మికులకు సరైన పరిష్కారం అందించాలి.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతోపాటు తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో బంగారం ఒకేరోజు భారీగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.


