ప్రధాన వార్తలు

వైఎస్ జగన్కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

మన్నవ సర్పంచ్పై హత్యాయత్నం
సాక్షి టాస్క్ఫోర్స్/సాక్షి, అమరావతి: మంత్రి లోకేశ్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు ప్రత్యర్థుల రక్తం కళ్ల చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపు ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశ్నించే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పాశవిక దాడే నిదర్శనం. వివరాలివీ.. మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీస్టాల్కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో సర్పంచ్ కిందపడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లోగ్యాంగ్ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్టాల్లోని సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కీ నిర్వహించినట్లు దానిద్వారా తెలుస్తోంది. ఇక ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఒకేసారి దాడిచేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సహాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపారు. టీడీపీ అక్రమాలను అడ్డుకుంటున్నందుకే.. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశి్నంచే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది. శాంతిభద్రతలు క్షీణించాయి: అంబటి ఈ ఘటనపై మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్బుక్ రాజ్యాంగం.. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకూ, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణలేకుండా పోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు(ఇన్సెట్) నాగమల్లేశ్వరరావు(ఫైల్)

సారీ.. వచ్చేసారి.. మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఖర్గే
సాక్షి, హైదరాబాద్: అర్హులైన నేతలు మంత్రి పదవులు ఆశించడంలో తప్పులేదని అయితే పార్టీ అంతర్గత పరిస్థితులు రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సముచిత న్యాయం చేసేందుకు పార్టీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారి వారి అనుభవం, అర్హతలకు అనుగుణంగా పదవులు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం జరగనున్న పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, పార్టీ నేత హర్కర వేణుగోపాలరావు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేరుగా తాను బస చేసే తాజ్ కృష్ణా హోటల్కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. మేం అర్హులం.. మాకు అవకాశం ఇవ్వాల్సిందే ఏఐసీసీ చీఫ్తో భేటీ అయ్యేందుకు రావాలని గురువారం మధ్యాహ్నం కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు సుదర్శన్రెడ్డి, ప్రేంసాగర్ రావు, బాలునాయక్, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి సాయంత్రం హోటల్కు చేరుకుని ఖర్గేతో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్కు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ నియోజకవర్గాల్లో ముందే నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వారు రాలేకపోయారు. కాగా ఈ భేటీలో ఎమ్మెల్యేలు.. తమకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలో, తాము ఎలా అర్హులమో వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, పార్టీ పట్ల విధేయతో ఉంటున్నామని, తమకు ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిందేనని కోరారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, ఆ రెండు జిల్లాలకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కష్టపడండి ..గెలిచి రండి అందరి వాదనలను సావధానంగా విన్న ఖర్గే..ఎమ్మెల్యేల వినతులను పార్టీ తప్పకుండా పరిశీలిస్తుందని, భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అర్హులైన వారికి కూడా కొన్ని పదవులు ఇవ్వలేకపోయామని భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీలును బట్టి పార్టీలో ప్రాధాన్యమిస్తామని, సీనియారిటీని తప్పకుండా గౌరవిస్తామని, సామాజిక న్యాయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందని అప్పుడు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని, మెజార్టీ స్థానాల్లో గెలవాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నిటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో ఖర్గే సమావేశం కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోటల్లోనే ఉన్నారు. సాయంత్రం 6:30 గంటలకు అక్కడికి వచ్చిన ఆయన.. 9 గంటల తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. ఖర్గేతో భేటీ అయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత సీఎంను కూడా కలిశారు. తమకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలో, ఖర్గేకి ఏం చెప్పామో వివరించారు. 9 దాటిన తర్వాత హోటల్ నుంచి రేవంత్ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్ కూడా హోటల్లో కొంతసేపు ఉండి ఆ తర్వాత శుక్రవారం నాటి సమావేశాలు, సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు వెళ్లారు. కాగా సీఎంను కలిసేందుకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హోటల్కు రాగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. చీఫ్ విప్ ఆఫర్ చేసినా.. తాను పార్టీ కోసం చేసిన కృషిని, పార్టీ పట్ల విధేయతను వివరించినప్పటికీ మంత్రి పదవిపై సరైన భరోసా లభించకపోవడంతో అలిగిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు హోటల్ నుంచి విసురుగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆయనకు చీఫ్ విప్ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా ప్రేంసాగర్ రావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన ప్రేంసాగర్ రావు.. తాను అలిగాననడంలో ఎలాంటి వాస్తవం లేదని, పార్టీ అధ్యక్షుడికి తన మనసులో మాట చెప్పి వెళ్లిపోయానని చెప్పారు. కొండా మురళి దంపతుల వివరణ వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా ఖర్గేను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విభేదాలపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని, సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఖర్గే చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళిలు కూడా ఖర్గేతో కాసేపు సమావేశం అయ్యారు. ఖర్గేతో భేటీ అనంతరం ఎవరేమన్నారంటే.. ఉమ్మడి జిల్లాలన్నింటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరినట్లు మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ‘పార్టీలో సీనియర్లం ఉన్నాం..మంత్రి పదవి ఇవ్వాలని కోరా..’ అని సుదర్శన్రెడ్డి చెప్పారు. లంబాడా సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారని బాలునాయర్ తెలిపారు. తాను మంత్రి పదవికి ఎలా అర్హుడనో ఖర్గేకి వివరించానని రామ్మోహన్రెడ్డి తెలిపారు. తనది నాలుగు తరాల విధేయత అని చెప్పానన్నారు. నేడు వరస సమావేశాలు మల్లికార్జున ఖర్గే శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి.

నీళ్లు నమిలిన క్వాడ్!
అమెరికాలో బుధవారం జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుకున్న విధంగానే కశ్మీర్లోని పెహల్గామ్లో మొన్న ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన బెట్టుకున్న ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటంలో సహకరించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి ప్రకటన తెలియజేసింది. ‘ఇందుకు కారకులైనవారినీ, దాడిలో పాల్గొన్నవారినీ, వారికి ఆర్థికంగా సహకరించినవారినీ ఎలాంటి జాప్యం లేకుండా శిక్షించటానికి ఐక్యరాజ్యసమితి దేశాలన్నీ తోడ్పడాల’ని సూచించింది. క్వాడ్ వంటి కూటములు ఏర్పడటం వెనకుండే ధ్యేయం సంక్షోభ సమయాల్లో సమష్టిగా అడుగు మందుకేయటం కోసమే. కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నా ఆ దేశాన్ని వేలెత్తి చూపటానికీ, అటువంటి కార్యకలాపాలు మానుకోవాలని హెచ్చరించటానికీ కూటమిలోని మిగతా మూడు దేశాలూ సిద్ధంగా లేవంటే క్వాడ్ ఆవిర్భావానికి గల ప్రాతిపదికే ప్రశ్నార్థకంగా మిగిలినట్టు లెక్క. పెహల్గామ్ ఘటన అనంతరం మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై క్షిపణులతో, డ్రోన్లతో దాడికి దిగాక మన దళాలు వాటిని తిప్పికొట్టడంతోపాటు అక్కడి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరు దేశాల మధ్యా ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే సూచనలు కనబడ్డాయి. కారణాలేమైతేనేం...నాలుగు రోజుల అనంతరం కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను ఎంతో ఆందోళనతో గమనించాయి. కానీ ఉమ్మడి ప్రకటన పాక్ పేరెత్తి ఖండించకుండా మర్యాదపూర్వకంగా, లౌక్యంగా మాట్లాడితే ఒరిగేదేమిటి? క్వాడ్ ఈనాటిది కాదు. పద్దెనిమిదేళ్ల క్రితం జపాన్ ద్వారా మన దేశాన్ని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటుకు నాంది పలికింది అమెరికాయే. 2007లో కూటమి ఏర్పాటుపై చర్చించటానికి నాలుగు దేశాలూ సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పడుతున్నదంటూ నిష్టూరానికి పోయింది. ఏడాది గడవకముందే జపాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 2008లో ప్రభుత్వం మారి ఆస్ట్రేలియా సైతం నిష్క్రమిస్తున్నట్టు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2017లో తిరిగి క్వాడ్కు జీవం పోసింది అప్పటి ట్రంప్ ప్రభుత్వమే. అప్పటికల్లా దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ‘అన్నీ నేనే... అంతా నాదే’ అంటూ పగడాల దిబ్బలు, ఇసుక మేటలు చైనా తన ఖాతాలో వేసుకుంది. అంతటితో ఊరుకోక స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం ప్రారంభించింది. ఇది జపాన్తో పాటు ఆస్ట్రేలియానూ... ఆ రెండు దేశాలకూ అన్ని విధాలా అండగా ఉంటున్న అమెరికానూ చికాకు పెట్టిన పర్యవసానంగానే క్వాడ్ మళ్లీ పురుడు పోసుకుంది. సారాంశంలో ఇది అమెరికా, చైనాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో భాగంగా వచ్చింది. అందులో మనల్ని భాగస్వాముల్ని చేసి తన వివాదాన్ని మనకు కూడా అంటించిన అమెరికా మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం మనవైపుండదని పెహల్గామ్ రుజువు చేసింది. మరి ఇలాంటి కూటములు పెట్టి ప్రయోజనమేమిటి? విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ అన్నట్టు పాకిస్తాన్తో మిగిలిన మూడు సభ్య దేశాలకూ, ముఖ్యంగా అమెరికాకూ స్నేహ సంబంధాలుండటం వల్ల ఉమ్మడి ప్రకటనలో నేరుగా దాన్ని ప్రస్తావించటానికి మొహమాటపడి ఉండొచ్చు. మరి అదే పరిస్థితి మనకు ఉండదా? మనకూ, పాకిస్తాన్కూ వున్న వైషమ్యాలపై క్వాడ్ పెట్టేనాటికే మిగిలిన మూడు దేశాలకూ అవగాహన ఉండాలి. మరి ఎందుకు కలుపుకొన్నట్టు? ఇలాంటి పరిస్థితి తలెత్తగలదని ఆనాడు తెలియదా?భూగోళంలో ఏమూల ఉగ్రవాదం ఉన్నా దాన్ని నిర్మూలించేదాకా వదలబోమని, దానిపట్ల దయాదాక్షిణ్యాలుండబోవని 2001లో తాను చేసిన శపథం అమెరికాకు గుర్తుందా? క్వాడ్ కూటమి సమావేశానికి ముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. పెహల్గామ్, తదనంతర పరిణామాలపై వారితో చర్చించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును వివరించారు. బహుశా దాని పర్యవసానంగా కనీసం పెహల్గామ్ను ప్రకటనలో ప్రస్తావించి చర్య తీసుకోవాలన్న డిమాండైనా చేశారు. లేకుంటే దానికి కూడా దిక్కు లేకపోయేదేమో! పాకిస్తాన్ ఎన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నా అమెరికాకు ఆ దేశమంటే మోజు. ‘రెండు దేశాలనూ బెదిరించి యుద్ధం ఆపాన’ని గొప్పలు పోయిన ట్రంప్, ఆ తర్వాత వారం గడవకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్తో భేటీ అయి పొగడ్తలతో ముంచెత్తారు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలున్న సంగతి నిజమే. ఆ విషయంలో మన దేశం రాజీ పడకుండా చర్చలు సాగిస్తోంది. దురాక్రమణకు ప్రయత్నించినప్పుడల్లా ఎదుర్కొంటున్నది. క్వాడ్ ఉనికిలోకి రాకముందునుంచీ అది కొనసాగుతోంది. పరస్పరం సహకరించుకోవటానికీ, ఎదగటానికీ కూటములు అవసరం. అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలకమైన ఖనిజాల, ఇతర వనరుల సరఫరాపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఎదిగేందుకు, సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా చూసేందుకూ సమష్టిగా కృషి చేయాలని క్వాడ్ తీర్మానించటం హర్షించదగ్గదే. ఈ ఏడాది చివరిలో క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మన దేశంలో జరుగుతున్న నేపథ్యంలో కూటమి భాగస్వాముల్లో మరింత సదవగాహన, సమన్వయం అవసరమని... కీలక సమయాల్లో నిర్మొహమాటంగా ఉండటం ముఖ్యమని తెలుసుకుంటే మంచిది.

‘అణు వివక్ష’ అంతమయ్యేనా?
భారత అణు కేంద్రాలు ఏపాటి సురక్షితమైనవి? చెర్నోబిల్ అణు కేంద్ర ప్రమాదం (1986) తర్వాత భారత్ అణుశక్తి సంస్థ అధిపతికి ఈ ప్రశ్న ఎదురైంది. ‘‘మన అణు కేంద్రాలు ఎంత సురక్షితమైనవంటే వాటిని ఒక క్షిపణి తాకినా, విమానం వాటిపై కూలినా అవి చెక్కుచెదరవు’’ అని ఆయన జవాబిచ్చారు. అణు విద్యుత్ కేంద్రాన్ని లేదా తత్సంబంధిత సదుపాయాలను నెలకొల్పేటప్పుడు యుద్ధంతో సహా ఎటువంటి విపత్తు సంభవించినా తట్టుకుని నిలబడేటట్లు అణు ఇంజనీర్లు ప్లాన్ చేస్తారు. ఏ అణు సదుపాయాన్ని ఏర్పాటు చేసేటప్పుడైనా దాని భద్రతకు ప్రధానంగా పూచీ వహేంచే అంశం ఏదైనా ఉందీ అంటే అది దానిని ఎక్కడ నెలకొల్పుతున్నారో ఆ భౌగోళిక ప్రాంతమే. భౌగోళిక సుస్థిరతతోపాటు జనావాసాలకు దూరంగా ఉండటం ముఖ్యం. సాధారణంగా అటువంటి సదుపాయాలు వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా అంతర్జాతీయ సరిహద్దులకు దూరంగా ఉంటాయి. అణుదాడులు బాధ్యతారాహిత్యంఇరాన్లోని ఫర్దో, నతాంజ్, ఇస్ఫహాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఫర్దో యురేనియం శుద్ధి సదుపాయాన్ని ఇరాన్ కేంద్ర ప్రాంతంలో పర్వతాల లోపల లోతున నిర్మించారు. యరేనియం శుద్ధి కేంద్రాలు, ఇంధన కడ్డీల తయారీ యూనిట్లు, విద్యుదుత్పాదన కేంద్రాలు, వ్యర్థాలను భద్రపరచే ప్రదేశాలు వంటి అణు సదుపాయాల భద్రత... అంతర్జాతీయ సమాజానికి ఎప్పుడూ ఆందోళనకర అంశంగానే ఉంటూ వస్తోంది. యాదృచ్ఛికంగానైనా లేదా ఉద్దేశపూర్వకంగానైనా ఎలాంటి ప్రమాదం సంభవించినా అది అణు ధార్మికత విడుదలకు కారణమై అటు మానవాళికి, ఇటు పర్యావరణానికి హానికరంగా పరిణమించవచ్చు. ఇటీవలి ఘర్షణలో ఆ మూడు చోట్ల వైమానిక దాడుల్లో అణు రియాక్టర్లను లక్ష్యంగా చేసుకోలేదని చెబుతున్నారు. ఫలితంగా, వాటి చుట్టూ ఉన్న ఇతర సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంలో ఈమధ్య ఉక్రెయిన్లోని జపొరియిష వంటి అణు సదుపాయాలు దాడులకు లోనుకావచ్చని వాటి భద్రతపై ఆందోళన నెలకొంది. అలాగే, ఉత్తర కొరియా కూడా అణు బూచికి చిరునామాగా మారింది. పైగా, అది అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం లేదు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) ఇలాంటి విషయాల్లో ప్రపంచ పెద్దమనిషిగా వ్యవహరించవలసి ఉంది. అణు విచ్ఛిత్తి పదార్థాల రవాణాతోపాటు, అణు ధార్మికతకు దారితీయగల ప్రమాదాలపై అది ఒక కన్ను వేసి ఉంచుతుంది (తాజాగా ఐఏఈఏకు సహకారాన్ని నిలిపివేయాలని ఇరాన్ నిర్ణయించింది). ఒక రియాక్టర్ పై దాడి జరిగి, అది ధ్వంసమైతే దాని నుంచి విడుదలయ్యే అణు ధార్మికత సుదూర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చెర్నోబిల్, ఫుకుషిమా దుర్ఘటనల్లో అదే జరిగింది. రెండు దేశాల మధ్య ఘర్షణలు సాగుతున్నప్పుడు ఏ పక్షమైనా సరే రెండవ పక్షానికి చెందిన అణు రియాక్టర్పై దాడికి దిగినా, ధ్వంసం చేసినా అది సదరు దేశం పక్షాన పూర్తి బాధ్యతారాహిత్యం అవుతుంది. అసమానతే అంతస్సూత్రమా?రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో సైన్స్లో ప్రపంచ వ్యాప్తంగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని భావించడం జరిగింది. ఐఏఈఏ 1957లో ఏర్పడడానికి ప్రేరణ ఇచ్చిన అంశాల్లో అది కూడా ఒకటి. ప్రభుత్వాలనన్నింటినీ ఒకచోట చేర్చడం, టెక్నాలజీ అంశాలపై వాటికి దారి చూపడం, అణు శక్తి శాంతియుత ప్రయోజనాలపై సమాచారాన్ని క్రోఢీకరించడం అనే భావనతో అది ఏర్పడింది. ఐఏఈఏ ఏర్పాటుకు దారితీసిన చర్చల్లో భారత్ కూడా పాల్గొంది. అందులో భారత్ వ్యవస్థాపక సభ్యురాలు. కొన్ని దశాబ్దాలుగా, ఆ సంస్థ గవర్నర్ల బోర్డులో సభ్యురాలిగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తోంది. అణు శక్తిని ద్వంద్వ ఉపయోగ టెక్నాలజీగా వినియోగిస్తున్నారు. దాంతో, ఆ కార్యకలాపాలు గోప్యంగా సాగుతూ, సమాచార వినిమయం క్లిష్టంగా మారింది. అణు పదార్థాలను సురక్షితంగా వ్యవహరించేటట్లు చూడటంతోపాటు, అణ్వాయుధాల తయారీకి వాటిని బదలాయించకుండా నివారించడం కూడా ఐఏఈఏ ప్రధాన కర్తవ్యం. కానీ, ఆది నుంచి కూడా ఈ నిఘా సంస్థ విధి నిర్వహణలో ఒక రకమైన అసమానత అంతర్లీనంగా ఉంటూ వస్తోంది. ఐఏఈఏ వైజ్ఞా్ఞనిక సలహా మండలికి మన హోమి జహంగీర్ భాభా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ మండలి, 1960లలో ప్రతిపాదించిన సురక్షితా ప్రమాణాల స్వరూప స్వభావాలపై కఠిన వైఖరిని అవలంబించింది. ఎటువంటి తనిఖీలకు అంగీకరించేది లేదని తెగేసి చెప్పిన కొన్ని దేశాలకు ఒక తరహా నిబంధనలు, ఐరోపా దేశాలకు మరో రకమైన నిబంధనలు విధించడాన్ని ప్రశ్నించింది. మిగిలిన దేశాలను మాత్రం కఠినమైన నిరోధాలు, తనిఖీలకు లోనుచేశారు. అణు శక్తి రంగంలో ఐరోపా దేశాలు ఎంతో ప్రగతిని సాధించినందువల్ల వాటి భద్రతను అవి చూసుకోగలవనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. అయితే, ఈ వ్యవస్థతో ఏకీభవించనివారు దిగ్భంధనాలను ఎదుర్కోవలసి వస్తోంది. అణు విస్ఫోటనాలను సైనికేతర ప్రయోజనాలకు వినియోగించినా వివాదం నెలకొంటోంది. భారీ స్థాయి ఇంజినీరింగ్, గనుల తవ్వకం, ఇతర తవ్వకాలు లేదా భూగర్భ జలాశయాలను నిర్మించడం వంటివి ఆ కోవలోకి వస్తాయి. ప్రాజెక్ట్ రూలిసన్ వంటి శాంతియుత విస్ఫోటనాలను అమెరికా నిర్వహించినప్పుడు, వాటిని వైజ్ఞానిక విజయాలుగా జేజేలు కొట్టారు. మన దేశం 1974లో శాంతియుత విస్ఫోటనాన్ని నిర్వహించినపుడు మనపై ఆంక్షలు విధించారు. ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించగల సామర్థ్యాన్ని సంతరించుకోగల స్థితిలో ఉందనే అభిప్రాయమే ఇరాన్ అణు సదుపాయాలపై ఇటీవల అమెరికా దాడులకు కారణం. అందరికీ ఒకే న్యాయంఅణు శక్తి దాని తొలినాటి శాస్త్రీయ సహకార పరిధిని ఏనాడో అతిక్రమించింది. భారీ పారిశ్రామిక కార్యకలాపాలతో అది ఇపుడు ముడిపడి ఉంది. అణు కార్యకలాపాలు అపారమైన ఆర్థిక పెట్టుబడులు, భౌగోళిక రాజకీయాలతో సన్నిహిత సంబంధం కలిగినవిగా రూపాంతరం చెందాయి. భారత్తో సహా, అనేక దేశాలలో అణు శక్తి రంగంలోకి ప్రైవేటు సంస్థలు అడుగిడబోతున్నాయనే మాటలు వినవస్తున్నాయి. ప్రైవేటు అణు విద్యుదుత్పాదన కేంద్రాలు ఐఏఈఏ పర్యవేక్షణలోకి పరోక్షంగా వస్తాయి. అవి దానికి విధేయత చూపేటట్లు చూడవలసిన బాధ్యత ఆ యా ప్రభుత్వాల పైనే ఉంటుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కింద తనకు లభించిన సంప్రదాయ సిద్ధమైన నిఘా పాత్రతోపాటు, అలాంటి సవాళ్లకు కూడా ఐఏఈఏ తనను తాను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. దేశాలు అణు పదార్థాలను ఆయుధాల తయారీకి తరలించకుండా చూడటం ఆ ఒప్పందం ప్రకారం ఐఏఈఏకి అప్పగించిన ప్రాథమిక కర్తవ్యం. అంతర్జాతీయ సుస్థిరతకు, న్యూక్లియర్ టెర్రరిజం బెడదను తగ్గించడానికి పరిస్థితులను సరిచూసే, తనిఖీ వ్యవస్థ కీలకం. కానీ, దాని పనితీరు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. అణ్వస్త్రాల వ్యాప్తిని నిరోధించడంలో ఐఏఈఏ పాత్రను చాలా దేశాలు బలపరుస్తున్నాయి. కానీ, జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, అణు సాంకేతికతను వినియోగించుకోవడంలో అందరికీ సమాన సౌలభ్యం ఉండాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)

ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్ల మధ్య అసలేం జరుగుతోంది?
అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో డిన్నర్ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్సింధూర్ తర్వాత పాక్ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్ కొట్టిన దెబ్బతో పాక్ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్(ఫైల్ఫోటో)చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?పాక్కు భారత్ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ ఆర్మీనే పదే పదే యూఎస్కు ట్రంప్ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్ ప్రధానిని పక్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలుఇటీవల సమకూరిన నిధులతో పాక్లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్ కొనుగోలుకు ఇప్పటికే పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్కు అమెరికా ఎంత సపోర్ట్గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?ఇక చైనా కూడా పాక్కు అండగానే ఉంటుంది. ఇటీవల భారత్తో జరిగిన యుద్ధంలో కూడా పాక్కే సపోర్ట్ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్ మ్యాన్కు అర్థం అవుతున్న విషయం. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్లో పాక్ ఆర్మీ అధికారుల దర్శనం ఏమిటి?, అమెరికా-పాక్ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది.

57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య
ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్మెంట్లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు. ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,సదరు నటి పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్ అయ్యారు.

Siddaramaiah: ‘సీఎం సిద్ధరామయ్య నా మీదే చెయ్యెత్తుతారా?’
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ధార్వాడ జిల్లా ఏఎస్పీ నారాయణ భరమణి (ASP Narayan Venkappa Baramani) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు బహిరంగ సభలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య (cm siddaramaiah).. తనని కొడుతానంటూ చెయ్యెత్తడం తనని మానసికంగా కలచివేసిందంటూ ఏఎస్పీ నారాయణ భరమణిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేసిన తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ప్రకటించారు.ఈ మేరకు కర్ణాటక పోలీస్ శాఖకు ఏఎస్పీ నారాయణ భరమణి లేఖ రాశారు. వీఆర్ఎస్ లేఖలో..‘ అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగింది. ఆ సంఘటన నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కుటుంబం బాధపడింది. నా భార్య, పిల్లలు కన్నీళ్లతో నిశ్శబ్దంగా గడిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. పలువురు నన్ను అవమానిస్తూ కామెంట్లు పెట్టారు. 31 ఏళ్లుగా పోలీస్ శాఖలో అంకిత భావంతో పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. ఏఎస్పీ నారాయణ భరమణి వీఆర్ఎస్ ప్రకటించడంపై కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర .. ఏఎస్పీ నారాయణ భరమణిని సంప్రదించి బెళగావి డీసీపీ (Belagavi)గా కొత్త పోస్టింగ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను భరమణి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. The Police, who was insulted on stage by Congress leader & CM Siddaramaiah has resigned.The cop served for 31 years, joined force as his dream wish, worked hard.In his resignation, ASP Narayan Baramani has said he felt humiliated & traumatizedpic.twitter.com/ZxBCvSSF9h— Karthik Reddy (@bykarthikreddy) July 3, 2025పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో (2025 Pahalgam attack) ‘పాకిస్తాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’అంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. పలువురు సిద్ధరామయ్య పాకిస్తాన్ వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్ తర్వాత ఏప్రిల్ 28న బెలగావిలో కాంగ్రెస్ సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.సహనం కోల్పోయిన సిద్ధరామయ్యఅయితే, ఆసభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుతగిలారు. గో టూ పాకిస్తాన్ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్ చేయడంలేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.ఆ ఘటనపై రాజకీయ వివాదం జరిగింది. ప్రతిపక్షాలు ఆయన తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్ పరిపాలనతో పోల్చాయి. ఆ ఘటనపై ఏఎస్పీ నారాయణ్ భరమణి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వీఆర్ఎస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చాంశనీయంగా మారింది.

ENG VS IND 2nd Test: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు ఈ స్థాయి స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఇవాళ డబుల్ సెంచరీ సాధించాడు.భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు.

రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్కేసు బాంబులను ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు.
లడ్డూ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్
మన్నవ సర్పంచ్పై హత్యాయత్నం
పైరసీ.. సినిమా చూపిస్తోంది!
రోప్ పార్టీకి దిక్కులేదు.. జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నారంట!
ఆ ఇద్దరూ కరుడుగట్టిన ఉగ్రవాదులు
ఇవిగో సాక్ష్యాలు..!
తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జీలు
బలమైన భారత్తో స్థిరమైన ప్రపంచం
పార్టీ ఎజెండా ముఖ్యం.. అధికారమే లక్ష్యం
అంతరిక్షంలో అతిథి
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్బై..!
వరుసగా మూడో మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత
‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
వైఎస్ జగన్కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
వాళ్లు ‘జగనన్న గోరుముద్ద’ పెట్టారు.. మనం ‘బాబు బొద్దింక భోజనం’ అని పెట్టేద్దాం మేడమ్!!
ఈ మధ్య అలానే కూర్చుంటున్నారు!
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
ఎల్లుండే మెగా సునామీ?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
ఒంటరిగా ఉండలేను.. ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా : అభిషేక్
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా
వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎలాన్ మస్క్
బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం
ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు
శ్రీశైలం జలాశయానికి జలకళ
మీ అడుగులకు మడుగులొత్తలేం.. సైడైపోతున్న జనసేన, బీజేపీ
ప్రియాంక బర్త్డే.. కాలి చెప్పుపై కేక్.. 'తిండితో ఆటలా?'
ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా? ఇవిగో టాప్ సీక్రెట్స్!
లడ్డూ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్
మన్నవ సర్పంచ్పై హత్యాయత్నం
పైరసీ.. సినిమా చూపిస్తోంది!
రోప్ పార్టీకి దిక్కులేదు.. జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నారంట!
ఆ ఇద్దరూ కరుడుగట్టిన ఉగ్రవాదులు
ఇవిగో సాక్ష్యాలు..!
తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జీలు
బలమైన భారత్తో స్థిరమైన ప్రపంచం
పార్టీ ఎజెండా ముఖ్యం.. అధికారమే లక్ష్యం
అంతరిక్షంలో అతిథి
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్బై..!
వరుసగా మూడో మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత
‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
వైఎస్ జగన్కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
వాళ్లు ‘జగనన్న గోరుముద్ద’ పెట్టారు.. మనం ‘బాబు బొద్దింక భోజనం’ అని పెట్టేద్దాం మేడమ్!!
ఈ మధ్య అలానే కూర్చుంటున్నారు!
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
ఎల్లుండే మెగా సునామీ?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
ఒంటరిగా ఉండలేను.. ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా : అభిషేక్
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా
వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎలాన్ మస్క్
బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం
ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు
శ్రీశైలం జలాశయానికి జలకళ
మీ అడుగులకు మడుగులొత్తలేం.. సైడైపోతున్న జనసేన, బీజేపీ
ప్రియాంక బర్త్డే.. కాలి చెప్పుపై కేక్.. 'తిండితో ఆటలా?'
ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా? ఇవిగో టాప్ సీక్రెట్స్!
సినిమా

సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి
సినిమా అవకాశాల కోసం వెళ్తే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో! అయితే సినిమాలే కాదని ఓటీటీలో ఛాన్సులు కావాలంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెప్తున్నారు నటి హెల్లీ షా (Helly Shah). తనకు ఓ వెబ్ సిరీస్లో ఆఫర్ వచ్చిందట.. కానీ వాళ్లు చెప్పిన కండీషన్కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట! ఈ విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఓ మెసేజ్ వచ్చింది. కండీషన్కు ఒప్పుకుంటే..అది చూడగానే.. నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాం అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ అంతలోనే.. ఓ కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను.ఆన్లైన్లో అయినా ఓకేఅప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్లోనే నేను చెప్పింది చేయండి. ఆన్లైన్లో అయినా నాకేం పర్లేదని బదులిచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్లిస్ట్లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు.సీరియల్స్- సినిమాహెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇకపోతే హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిష్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్లలోనూ మెరిశారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే?

వైరల్ ఎలా అవ్వాలంటోన్న శ్రీలీల.. అసలు విషయం ఏంటంటే?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఏడాది నితిన్ సరసన రాబిన్హుడ్లో మెప్పించిన భామ.. ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈనెల 4న వైరల్ వయ్యారి అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీల, దేవీశ్రీ ప్రసాద్ చేసిన ప్రమోషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీకి కాల్ చేసిన శ్రీలీల.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మీ రీల్సే కనిపిస్తున్నాయి.. మీలా వైరల్ ఎలా అవ్వాలో నేర్పిస్తారా అని అడిగింది. ఏంటీ వైరల్ ఎలా అవ్వాలో మీకు నేర్పాలా?కామెడీ వద్దమ్మా? మీరే నాకు నేర్పాలని దేవీశ్రీ అన్నారు. నిజమే కదా.. మీరు వయ్యారంగా ఓ మాస్ స్టెప్ వేస్తే అదే వైరలైపోద్ది అని చెప్పాడు. అదేదో మీరే ఇవ్వండి సార్ అని శ్రీలీల ముద్దుగా అడగడంతో.. వైరల్ వయ్యారి అంటే ఎలా ఉంది సాంగ్ అంటూ దేవీశ్రీ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఇదంతా వైరల్ వయ్యారి పాట కోసమే వీరిలా వైరైటీ ప్రమోషన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.#Junior second single #ViralVayyari out on July 4thIn cinemas July 18th. @sreeleela14 @ThisIsDSP pic.twitter.com/TDAbv8w5Rz— ScreenTimeGuru (@ScreenTimeGuru) July 1, 2025

కలర్ ఫుల్ శారీలో అనసూయ.. బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ విష్ణుప్రియ గ్లామరస్ లుక్స్!
కుమారుడితో హీరోయిన్ అమలాపాల్ పోజులు..కలర్ఫుల్ శారీలో అనసూయ అదిరిపోయే లుక్స్..మొబైల్తో బిజీ బిజీగా సురేఖవాణి కూతురు సుప్రీత..బ్లాక్ బ్యూటీలా బిగ్బాస్ ముద్దుగుమ్మ విష్ణు ప్రియ.. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul)

రెండో భర్తతోనూ విడాకులు.. అందుకేనన్న బాలీవుడ్ నటి!
పలు సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించిన బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా. తన అందం, అద్భుతమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్లో ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలతో పాటు బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్లో చాహత్ నటించింది. అయితే 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడిన ముద్దుగుమ్మ.. నాలుగు నెలలకే విడాకులిచ్చింది. ఆ తర్వాత 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతనితో కూడా తెగదెంపులు చేసుకుంది. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది చాహత్ ఖన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె రెండోసారి విడాకులు తీసుకోవడంపై మాట్లాడింది. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది.రెండోసారి విడాకుల గురించి చాహత్ మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ నాకు సరైనది అనిపించిన దాన్నే చేశా. దానికే కట్టుబడి ఉంటా. ఏదైనా తప్పని అనిపిస్తే అలాంటి పని చేయను. ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా చెప్పే ధైర్యం నాకు ఉంది. ప్రపంచం ఏమి చెప్పినా నేను ఎప్పుడూ తప్పును సమర్ధించను. మీకు ఆ రకమైన నమ్మకం, ధైర్యం, ఆత్మగౌరవం ఉండాలి. కేవలం ఒక మహిళగా మాత్రమే కాదు, ఒక మనిషిగా.. ఏదైనా కరెక్ట్ కాదనిపిస్తే అందులో భాగం కాలేను. అలాంటి వాటికి నేను దూరంగా వెళ్తాను. అలాగే మనం పిల్లల కోసం ఆలోచిస్తూ మనకు సరిగాలేని వివాహ బంధంలో ఉండిపోకూడదు. ఎందుకంటే పిల్లలు మనకంటే ఎక్కువగా ప్రభావితమవుతారు. అది కలిగించే నష్టం మీకు కూడా తెలియదు. వారు పెద్దయ్యాక వారి స్నేహితుల నుంచి విన్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. అందుకే నా కుమార్తెల కోసం నేను దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా' అని తెలిపింది.
న్యూస్ పాడ్కాస్ట్

ఘటన జరిగిన రెండేళ్లకు కేసు నమోదు చేయడం ఏమిటి?... వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య... బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనం

ప్రజలకు అండగా నిలబడాలి, నిత్యం వారికి అందుబాటులో ఉండాలి... వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం

ఏపీలో ధాన్యం బకాయిలు వేయి కోట్లు. రెండు నెలలు దాటినా రైతులకు చెల్లింపు లేదు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం

ఏపీలో ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలొచ్చి 45 రోజులైనా ప్రారంభించకపోవడం ఏమిటి?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

ఆంధ్రప్రదేశ్లో బాలికల విద్యను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘హైస్కూల్ ప్లస్’లు వ్యూహాత్మకంగా నిర్వీర్యం

ప్రమాదానికి ప్రయాణికులు బాధ్యులవుతారా? సింగయ్య మృతి ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు... నల్లపాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం

హైకోర్టులో విచారణ జరుగుతున్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులా?... టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఇంటింటికీ వంచన. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీపై గ్రామగ్రామాన.. ఇంటింటా ప్రచారం. పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు

ఆగిన దాడులు!. యుద్ధం ముగిసిందంటూ తొలుత ట్రంప్ ప్రకటన. అయినా కొనసాగిన దాడులు, విమర్శలు. ట్రంప్ ఆగ్రహంతో తగ్గిన ఇజ్రాయెల్, ఇరాన్

అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలు.. ఖతార్లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు... కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని యూఎస్ ఎయిర్ బేస్లపైనా దాడి జరిపినట్లు వార్తలు
క్రీడలు

IND vs ENG: గంభీర్ ఏం చేస్తున్నాడు?.. కుమార్ సంగక్కర ఫైర్
ఇంగ్లండ్తో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా తీసుకున్న నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగర్కర విమర్శించాడు. సిరీస్ గెలవడం కంటే కూడా.. లార్డ్స్ టెస్టే ముఖ్యమా అంటూ భారత జట్టు నాయకత్వ తీరును ప్రశ్నించాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ (Leeds Test)లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది. ఇందులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా సిరీస్లో 0-1తో వెనుకబడింది. ఇక టెస్టు జట్టు కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన శుబ్మన్ గిల్కూ పరాజయం రూపంలో చేదు అనుభవమే మిగిలింది.విశ్రాంతి పేరిటకాగా భారత్ -ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం (జూలై 2) రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్కు.. విశ్రాంతి పేరిట భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం అతడిని ఇంగ్లండ్లో కేవలం మూడు టెస్టులే ఆడిస్తామన్న మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇక టాస్ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కెప్టెన్ శుబ్మన్ గిల్.. లార్డ్స్లో జరిగే మూడో టెస్టులో బుమ్రాను ఆడిస్తామని చెప్పాడు. అక్కడి పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి బుమ్రా తప్పక ఆడతాడని చెప్పాడు.విమర్శల వర్షంనిజానికి.. తొలి టెస్టుకు.. రెండో టెస్టుకు మధ్య వారం రోజుల విరామ సమయం దొరికింది. అయినప్పటికీ కీలక మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ తదితరులు తప్పుబట్టారు. ఇక సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అయితే.. టీమిండియా మేనేజ్మెంట్ తీరును తనదైన శైలిలో విమర్శించాడు.రొనాల్డో లేని పోర్చుగల్ మాదిరి‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్ అయిన రొనాల్డో లేకుండా పోర్చుగల్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందో.. బుమ్రా లేని టీమిండియాకు కూడా అదే పరిస్థితి. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అంటూ స్టెయిన్ చురకలు అంటించాడు. ఇక ఈ జాబితాలో తాజాగా.. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర కూడా చేరిపోయాడు.ఈ నిర్ణయం ఎవరిది?.. కోచ్ ఏం చేస్తున్నాడు?‘‘అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఆటగాళ్లను, ఫిజియోలను సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? సిరీస్ గెలవడం కంటే లార్డ్స్ టెస్టే ముఖ్యమని మీరు భావిస్తున్నారా?బుమ్రాను మూడు టెస్టులే ఆడించాలని భావిస్తే.. 1-3-5 మాత్రమే ఎందుకు కావాలి? కావాల్సినంత విరామం దొరికింది.. విజయం కోసం జట్టు పరితపిస్తోంది. మరి అలాంటపుడు కోచ్ బుమ్రా దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పవచ్చు కదా!’’ అని కుమార్ సంగక్కర స్కై స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు.కాగా ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాలను ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లతో భర్తీ చేసింది.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు

భారత్కు రానున్న పాకిస్తాన్ జట్టు..!
ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్) తర్వాత భారత్, పాక్ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్, జూనియర్ వరల్డ్కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్లు భారత్కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.వచ్చే నెల (అగస్ట్) 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్లోని రాజ్గిర్లో ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీ కోసం 31 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టుకు భారత్కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్స్స్టార్కు చెప్పాడు. జూనియర్ హాకీ వరల్డ్కప్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్, పాకిస్తాన్ త్వరలో క్రికెట్ ఆసియా కప్లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది క్రికెట్ ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

డబుల్ సెంచరీతో చెలరేగిన శుబ్మన్ గిల్
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా గిల్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. గిల్ కంటే ముందు.. విరాట్ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఒక్కో డబుల్ సెంచరీ బాదారు.విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్ సౌండ్లో 200 పరుగులు సాధించాడు.👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్ కంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు.🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..🏏శుబ్మన్ గిల్- 2025లో ఎడ్జ్బాస్టన్ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..🏏సచిన్ టెండుల్కర్- 1999లో అహ్మదాబాద్ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..🏏విరాట్ కోహ్లి- 2016లో నార్త్ సౌండ్ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...500 పరుగుల మార్కు దాటిన టీమిండియాఎడ్జ్బాస్టన్ వేదికగా ఓవైపు శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్ 24, గిల్ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్ కాగా.. తొలిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు

భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్ వైరల్
లివర్పూల్ ఫుట్బాల్ స్టార్ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్ ఫుట్బాలర్కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది. మర్చిపోలేని రోజుఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్ లైఫ్లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం. View this post on Instagram A post shared by Diogo Jota (@diogoj_18) రొనాల్డో భావోద్వేగంపోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. డియోగో జోటా ఫొటో షేర్ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్తో వైరల్గా మారింది.లివర్పూల్ తరఫున ఐదు టైటిళ్లులివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ తరఫున డియోగో జోటా ప్రీమియర్ లీగ్తో పాటు రెండు నేషన్స్ లీగ్ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్ఎల్ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్ ప్లేయర్ మృతి పట్ల లివర్పూల్ ఎఫ్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano)
బిజినెస్

రూ.84 లక్షల బెంజ్ కారు.. రూ.2.5 లక్షలకే..
ఢిల్లీలో కొత్తగా అమల్లోకి వచ్చిన కఠినమైన ఇంధన నిషేధం ఖరీదైన కార్ల యజమానులకు శాపంగా మారింది. చాలా మంది తమ ఖరీదైన పాత ప్రీమియం కార్లను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయకూడదు. రాజధానిలో నెలకొన్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు నిషేధాన్ని అమలు చేస్తున్నారు.మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. వరుణ్ విజ్ అనే వ్యక్తి తన లగ్జరీ ఎస్యూవీ 2015 మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ 350ని తప్పని పరిస్థతిలో చాలా చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. పదేళ్ల కిందట ఈ వాహనాన్ని ఆయన రూ.84 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాత వాహనాలకు ఇంధన నిషేధం కారణంగా కేవలం రూ.2.5 లక్షలకే అమ్ముడుపోయింది.దశాబ్ద కాలంగా తమ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా ఉన్న కారును ఇప్పుడు వదిలించుకోవాల్సి రావడం వల్ల కలిగే భావోద్వేగాన్ని విజ్ వివరించారు. తన కుమారుడిని హాస్టల్ నుండి తీసుకురావడానికి వారానికి కేవలం 7-8 గంటల ప్రయాణానికి మాత్రమే ఈ కారును వినియోగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తంగా 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు రొటీన్ సర్వీసింగ్, టైర్ రీప్లేస్మెంట్లకు మించి మరే ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇంత చౌకగా అమ్ముడుపోయిందని విజ్ ఆవేదన వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.62 లక్షలతో ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లు విజ్ తెలిపారు. ప్రభుత్వం ఇలా మరోసారి విధానం మార్చుకోకపోతే 20 ఏళ్ల పాటు దీన్ని వాడుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.రితేష్ గండోత్రా అనే వ్యక్తి కూడా తాను రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును చౌకగా అమ్మాల్సి వస్తోందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్సీఆర్లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాల కారణంగా నా కారును విక్రయించవలసి వస్తోంది. అది కూడా ఎన్సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు.

బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదు
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి అనేలా బ్యాంకులు పట్టుబట్టకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ వాడకం ప్రజల స్వచ్ఛంద నిర్ణయంగా ఉండాలని తెలిపింది. బ్యాంకింగ్ వంటి సేవలకు ఆధార్ను తప్పనిసరి చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఉటంకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఆధార్ వివరాలు లేవనే కారణంతో ఖాతా తెరవడంలో జాప్యం చేసిన బ్యాంకుకు, ఓ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ తీర్పు వెలువడింది. కంపెనీ ప్రత్యామ్నాయంగా నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాలను అందించినప్పటికీ బ్యాంకు ఆధార్ కోసం పట్టుబట్టింది. ఫలితంగా కొంతకాలం బ్యాంకు ఖాతా తెరవడం ఆలస్యం అయింది. ఇది కంపెనీ నిర్వహణ అంతరాయాలకు, ఆర్థిక నష్టానికి దారితీసిందని సంస్థ పేర్కొంది.బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధం..బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్ను స్వచ్ఛందంగా ఇవ్వగలిగినప్పటికీ, దాన్ని తప్పనిసరి చేయకూడదని నొక్కి చెప్పింది. పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఆధార్ వినియోగం నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకే పరిమితమని మరోసారి స్పష్టం చేసింది. చట్టసభల మద్దతు లేకుండా ప్రైవేటు సేవలకు దీన్ని తప్పనిసరి చేయకూడదని పేర్కొంది.The Bombay High Court has held that a bank could not have insisted on Aadhaar as a mandatory requirement for opening a bank account after the Supreme Court's verdict in Justice K.S. Puttaswamy v. Union of India (2018), and awarded ₹50,000 in compensation to a company whose… pic.twitter.com/aHDMMKuat3— Live Law (@LiveLawIndia) July 2, 2025ఇదీ చదవండి: భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలునష్టపరిహారం చెల్లింపుఖాతా తెరిచేందుకు జాప్యం జరిగిన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడినట్లు సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని గుర్తించిన బాంబే హైకోర్టు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కేవైసీ నిబంధనలు చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని ఈ తీర్పు ఆర్థిక సంస్థలకు గుర్తు చేస్తోంది. ప్రత్యేకించి ప్రత్యామ్నాయ, చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన డాక్యుమెంటేషన్ అందించినప్పుడు కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తెలుపుతుంది.

భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలు
భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్ గ్లోబల్ హబ్గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.గత రెండు నెలల్లో భారత్లో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్కాన్ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్ ఎగుమతులకు చెక్ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.అసలేం జరిగిందంటే..యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్ ఐఫోన్ 17ను లాంచ్ చేయనుంది. ఈమేరకు భారత్లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్కాన్పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్ సైట్ల్లో ఉంచుతుంది.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్ కేసు
ముంబయిలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రిమినల్ కేసులో బలమైన ఆధారాలేవీ లేవని, పెండింగ్ చెల్లింపులపై ఒత్తిడి తప్పా మరేమీ కాదని జగదీషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.జగదీషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆసుపత్రి ట్రస్టీలు నమోదు చేయించిన ఎఫ్ఐఆర్కు బలమైన ఆధారాలు లేవని, ఆసుపత్రి నుంచి డబ్బు రికవరీ చేయడానికి బ్యాంకు ప్రయత్నిస్తున్నందునే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని వాదించారు. ఈ కేసును బాంబే హైకోర్టులోని మూడు వేర్వేరు బెంచ్లు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ విచారించలేకపోయాయని ఆయన అన్నారు.కొద్దిసేపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ కేసును శుక్రవారంకు వాయిదా వేశారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ చీఫ్పై ఇలా ఎఫ్ఐఆర్ నమోదు కావడానికిగల కచ్చితమైన కారణాలను ఇరువర్గాలు పంచుకోలేదు. అయితే కొన్ని సంస్థలు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ట్రస్ట్ ఆరోపణలు..ట్రస్ట్ పాలనపై అనవసర నియంత్రణ కోసం జగదీషన్ మాజీ ట్రస్టీ చేతన్ మెహతా నుంచి అనధికారికంగా రూ.2.05 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా ఆయన స్వచ్ఛంద సంస్థ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ట్రస్ట్ పేర్కొంది. లీలావతి ఆస్పత్రిలో జగదీషన్, తన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించారని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ట్రస్ట్ డిపాజిట్ల కింద రూ.48 కోట్లు ఉన్నాయని చెప్పింది.
ఫ్యామిలీ

కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోంది
రిలేషన్షిప్ ఎన్ని కొత్తపోకడలు పోయినా పెళ్లితోనే ఆ బంధానికి భద్రత అనుకునేవాళ్లే ఎక్కువ!అందుకే పెళ్లికి జాతకాలు,శాలరీ ప్యాకేజ్లు, ఆస్తులు, అంతస్తులు చూసుకున్నా...హక్కులు–బాధ్యతలు, ప్రణాళికలు, శక్తిసామర్థ్యాలు, పరస్పర గౌరవం, నమ్మకాలు, అండర్స్టాండింగ్, కంపాటబులిటీలకూ ప్రాధాన్యం ఇవ్వాలి! కాపురానికి కమ్యూనికేషన్ అత్యంత అవసరమని గ్రహించాలి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్, మానసిక, న్యాయ నిపుణులు.. ఈ తరం కూడా! ఆ అభిప్రాయాలతోనే ఈ క్యాంపెయిన్ను నేటితో ముగిస్తున్నాం! ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరుపెళ్లికి సంబంధించి మన దగ్గర రెండు విధానాలున్నాయి. ఒకటి రాజ్యాంగపరంగా జీవించడం, రెండు.. ఆచార వ్యవహారాలకనుగుణంగా ఉండటం. ఈ రెండోరకంలో పెద్దల నిర్ణయాలు, సమాజ కట్టుబాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిరకంలో రాజ్యాంగం వ్యక్తులకు ఏ హక్కులనైతే ఇచ్చిందో అవన్నీ కూడా జీవితభాగస్వాములకు అమలవుతాయి. రాజ్యాంగ పరంగా భార్యభర్తలు ఇద్దరూ సమానమే! కానీ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువల పరంగా ఆలుమగలిద్దరూ సమానం కాదు. అయినా అమ్మాయి చదుకోవాలి, ఉద్యోగం ఉండాలి, కట్నకానుకలు ఇవ్వాలి అనే అంచనాలూ ఉంటాయి. కానీ అమ్మాయి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరు. రాజ్యాంగబద్ధమైన వాటిల్లో కూడా భర్త సం΄ాదన మీద హక్కు కోరుకుంటున్న భార్య .. ఆయన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతల విషయంలో మాత్రం మిన్నకుంటోంది. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది ఏ పెళ్లిలో అయినా! అందుకే ఏ విధానంలోనైనా జీవితభాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. హక్కుల విషయంలో పరస్పర గౌరవంతో ఉండాలి. ఏరకమైన బాధ్యతలనైనా సమానంగా పంచుకోవాలి.– బీఎన్ నాగరత్న, ప్రెసిడెంట్ దలీప్ ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?గ్యాప్ పెరిగిపోతోంది పెళ్లికి కమ్యూనికేషన్ అండ్ టైమ్ చాలా ముఖ్యం. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈతరం కాపురాల్లో అవి రెండూ మిస్ అవుతున్నాయి. పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి మా దగ్గరకు వచ్చే జంటల్లో మేము నోటీస్ చేస్తున్న ప్రధాన సమస్య అదే. భార్య, భర్తలిద్దరిలో ఒకరికి డే షిఫ్ట్ ఉంటే, ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటోంది. వీకెండ్లో మాత్రమే ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అదీ ఎవరి ఫోన్లలో వాళ్లు! దీనివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగి΄ోతోంది. అండర్స్టాండింగ్ కొరవడుతోంది. మనం అనే భావన లేకుండా నాది అనే ఈగోనే వాళ్ల మ్యారిటల్ లైఫ్ని డామినేట్ చేస్తోంది. దీనివల్ల పిల్లల సంగతి అటుంచి వాళ్లు కలిసి కాపురం చేసే పరిస్థితే కనబడట్లేదు. అందుకే పెళ్లిని నిలుపుకోవాలంటే ఈకాలం జంటలకు కావాల్సింది కమ్యూనికేషన్ అండ్ ఇద్దరూ కలిసి స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్. దీని కోసం ఇద్దరూ కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. – డాక్టర్ ప్రశాంతి ఉప్పునూతలపేరెంట్స్కూ కౌన్సెలింగ్ అవసరంపెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. ఇరు కుటుంబాల మధ్య స్నేహం, బంధం, సాన్నిహిత్యం వంటివి పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తుల అంగీకారంపై ఆధారపడి ఉండలే తప్ప కుటుంబాల కలయిక కోసం పెళ్లిళ్లు జరగకూడదు. పెళ్లివ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించడంలో మనం విఫలమయ్యామని చెప్పుకోవాలి. పెళ్లి బంధంలో ఉండాల్సిన పరస్పర గౌరవం లాంటి ఎన్నో విషయాలు చాలామందికి అర్థం కావడం లేదు. దాంతో పెళ్లి తర్వాత గృహహింస లాంటి ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. విడాకుల వరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవలసిన పరిస్థితులను తరచుగా చూస్తున్నాం. పెళ్లికి ముందే అందరికీ సరైన రీతిలో లీగల్ – సైకలాజికల్ అవగాహన కల్పించినట్లయితే వివాహ వ్యవస్థ నిలబడడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. మన దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ కూడా సరిగా లేదు. అందులో భాగంగా ‘అంగీకారం’ అంటే ఛిౌnట్ఛn్ట – వ్యక్తిగత స్వేచ్ఛ, సేఫ్టీ వంటి అంశాలను బోధించాలి. లేకపోతే వైవాహిక జీవితమంతా వైధింపుల మయమవుతుంది. పెళ్లి చేసుకునే వారికే కాదు, వారి తల్లిదండ్రులకూ పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం. చాలామటుకు పెళ్లిళ్లలో తల్లిదండ్రుల జోక్యం వల్ల సులభంగా పరిష్కారమయ్యే సమస్యలు కూడా తెగేదాకా వెళ్తున్నాయి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది ఈ ఎడ్యుకేషన్ తప్పనిసరి అమ్మాయిలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నా.. డొమెస్టిక్ వ్యవహారంలో మాత్రం జెండర్ రోల్స్లో పెద్దగా మార్పు లేదు. ఇంటి పనులు, పేరెంటింగ్లో అబ్బాయిలకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు. భర్తతో సమానంగా సం΄ాదిస్తున్నా ఇల్లు, పిల్లల బాధ్యత ఆమెదే అన్న సంప్రదాయ భావనలోనే ఉన్నాం ఇంకా. దీనివల్ల ఆడపిల్లల మీద అదనపు భారం పడుతోంది. అందుకే చాలామంది అమ్మాయిలు పెళ్లి పట్ల విముఖత చూపిస్తున్నారు. అసలు మనదగ్గర వైవాహిక జీవితానికి సంబంధించి ఎడ్యుకేషనే లేదు. పెళ్లికి కులగోత్రాలు, జీతం, ఆస్తి, అంతస్తే ముఖ్యం అనుకుంటారు. ఇంటి బాధ్యత దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా అమ్మాయి, అబ్బాయి అంచనాలు, ప్రణాళికలు, పరస్పర గౌరవ నమ్మకాలు, ఎమోషనల్, ఫిజికల్ కంపాటబులిటీ లాంటివాటి మీద చర్చే ఉండదు. అసలు అలాంటి వాతావరణం తల్లిదండ్రుల మధ్యే కనబడదు కాబట్టి ఆ సంభాషణలు ఇంట్లో వినపడవు. కానీ ఈ తరం అమ్మాయి, అబ్బాయిలూ మాత్రం ఆ దిశగా ఆలోచించాలి. పెళ్లికి ముందు పెళ్లి తంతు, హనీమూన్కి ప్లాన్ చేసుకోవడం కన్నా పెళ్లి తర్వాత గడపబోయే సహజీవనం మీద శ్రద్ధ పెట్టాలి. జీతం, ఆస్తిపాస్తుల గురించి పెద్దలు ఎలాగూ చూస్తారు కాబట్టి.. పెళ్లి మీద ఇద్దరి అవగాహన, ఇంటి పనుల నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా ఇద్దరి ప్లాన్స్, సామర్థ్యాలు, కంపాటబులిటీల గురించి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సెలర్స్ సాయం తీసుకోవాలి. పెళ్లికి ముందే అన్నీ తెలుసుకునే వీలు లేక΄ోతే ముఖ్యమైన వాటి గురించైన ప్రాథమిక సమాచారం తీసుకుని పెళ్లి తర్వాత హనీమూన్ కన్నా ముందు కౌన్సెలింగ్కు ప్లాన్ చేసుకోవాలి. కాపురం సజావుగా సాగేందుకు ఇద్దరికీ అనుకూలమైన ఓ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – వర్ష వేముల, సైకోథెరపిస్ట్ పైపై బంధంగానే ఉంటుంది పెళ్లికి కేవలం జాతకాలు, శాలరీలతోనే చూస్తున్నవాళ్లు వాళ్ల ప్రధాన క్రైటీరియా అయిన కం΄ాటబులిటీని మాత్రం మ్యాచ్ చేయట్లేదు. కంఫర్టబుల్ లైఫ్ అండ్ డీసెంట్ లైఫ్ ఉండాలి.. కాదనట్లేదు. కానీ వైవాహిక జీవితానికి కావల్సిన చిన్న చిన్న విషయాలను కూడా మాట్లాడుకోవట్లేదు. ప్రేమ గురించిన వెంపర్లాట కనపడుతోంది తప్ప గౌరవం గురించి కాదు. రెస్పెక్ట్ ఉంటేనే కదా ప్రేమ ఉండేది! ఇలాంటివి అంటే మ్యాచ్ కాక΄ోతే, పరస్పర గౌరవం, కం΄ాటబులిటీ లేక΄ోతే పెళ్లి సఫకేటింగ్ చాంబర్లా మారుతుంది.. ముఖ్యంగా మహిళలకు. ఒక్కమాటలో చె΄్పాలంటే పెళ్లి అనేది రెండు కుటుంబా ప్రాపర్టీని రెట్టింపు చేసేదిగా, కుల అహంకారాన్ని ప్రిజర్వ్ చేసేదిగా, క్లాస్ని మెయింటేన్ చేసేదిగానే ఉంది. ఒక ప్రిస్టేజ్ సింబల్. ΄ాతికేళ్లు వచ్చాయా పెళ్లి చేసుకున్నామా .. ముప్పై ఏళ్లొచ్చాయా పిల్లల్ని కన్నామా.. సెటిల్ అయ్యామా అనే చూస్తున్నారు కానీ సంతోషంగా ఉన్నామా అని చూడట్లేదు. హారోస్కోప్ లో పద్దెనిమిదో ముప్పై ఆరో గుణాలు (ఛత్తీస్గుణ్) కలుస్తున్నాయా అని చూస్తున్నారు తప్ప పెళ్లిచేసుకోయే జంట కాబోయే తల్లిదండ్రులు కూడా కదా! వాళ్లు పిల్లల్ని కనాలనుకుంటున్నారా లేదా.. పేరెంటింగ్ బాధ్యతలను ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు లాంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చించట్లేదు. ఇవేవీ లేని పెళ్లి పైపై బంధంగానే ఉంటుంది. దానికన్నా అన్మ్యారీడ్గా ఉండటమే బెటర్. – హిమబిందు, సోషల్ యాక్టివిస్ట్పరిణతే ప్రామాణికం పెళ్లిని సమాజమెప్పుడూ వయసుకి సంబంధించిన అంశంగా చూస్తోంది. త్వరగా పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు పుడితే వృద్ధ్యాపంలో తోడుగా ఉంటారనే ఆధారపడే మనస్తత్వం అందులో కనిపిస్తుంది. అంతేకానీ పరిణతి, ΄ోషించే శక్తిసామర్థ్యాలను ్ర΄ామాణికంగా చూడట్లేదు. మారుతున్న కాలంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన అభి రుచులూ వేగంగా మారుతున్నాయి. భాగస్వామి వాటన్నిటినీ తీర్చలేక΄ోయినా కనీసం అర్థం చేసుకొని, గౌరవించే స్థాయిలో అయినా ఉండాలి. ఇటీవల జరిగిన అస్సాం, గద్వాల్ సంఘటనలను బూచిగా చూపించి పెళ్లికి ఆడవారి మనస్తత్వమే అడ్డు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ నేరాల్లో నిందితులకు సహకరించింది మగవారే అన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. పెళ్లి బంధంలోకి అడుగు పెట్టే ముందు మన మీద మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఎదుటివారినీ అర్థం చేసుకునే ఓర్పు కావాలి. – కెన్సారో వీవా, ఆంట్రప్రెన్యూర్

జంతు ప్రేమికులూ.. జర జాగ్రత్త..!
వర్షాలు ముసురుకుంటున్న సమయంలో కుక్కలకు ర్యాబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కుక్కలతో పాటు మనుషులకూ ఈ వ్యాధి వ్యాప్తిచెందొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో పేద, మధ్యతరగతి, ఉన్నత శ్రేణి అనే తేడా లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వివిధ జాతుల కుక్కలను, ఇతర జంతువులను పెంచుకుంటున్నారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆ పెట్స్ కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మూగజీవాలకు కొంత సమయం కేటాయిస్తూ వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒత్తిడిని జయించడానికి కొంత సమయం వాటితో ఆడుకోవడం అలవాటుగా మారుతోంది. ఈ సమయంలో ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధి సోకితే పెట్స్తో సహా మనుషులకూ ముప్పు పొంచి ఉంది. వీధి కుక్కలతో జర జాగ్రత్త.. వీధి కుక్కలు చిన్ననాటి నుంచి పుట్టి పెరిగిన, సంచరించే ప్రాంతానికి సరిహద్దులు (టెరిటరీ) నిర్ణయించుకుంటాయి. వాటి పరిధిలోకి వేరే కుక్కలను రానీయవు. ఇవి వాటి పరిధి దాటి వెళితే ఆందోళనకు గురవుతాయి. దీంతో కొత్త వ్యక్తులను చూసినప్పుడు భయంతో దాడి చేయడానికి ప్రయతి్నస్తాయి. అటువంటి వాటని ఐ కాంటాక్ట్ (కళ్లలోకి కళ్లుపెట్టి చూడటం) చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. పిల్లలు సహజంగానే కుక్కలు కనిపించినపుడు వాటి తోక, చెవులు పట్టుకుని లాగుతుంటారు. ఒక రకమైన ఇరిటేషన్లో ఉన్న కుక్కలను ఇలా చేస్తే అవి వెంటనే కరిచే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల నియంత్రణ వీధుల్లో వాటిని పట్టుకుని చికిత్సలు చేస్తున్నారు. అనంతరం ఎక్కడ నుంచి తెచ్చినవి అక్కడ విడిచిపెట్టకుండా ఏదో ఒక చోటు వదిలేస్తున్నారు. ఇది కూడా కుక్క కాట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. మెదడును ప్రభావితం చేస్తుంది.. పెట్స్కు ర్యాబిస్ సోకినప్పుడు వైరస్ అనేది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో కుక్క ఏం చేస్తుందనేది దానికి తెలియకుండానే నియంత్రణ కోల్పోతుంది. కోపం, దూకుడుగా, పచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంది. మనుషులకు వచ్చినట్లే కుక్కలకు సైతం విషజ్వరాలు వస్తాయి. లక్షణాలు గుర్తించినపుడు వైద్యులను సంప్రదించడం మేలు. రేబిస్ వ్యాధి అనేది కుక్కల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందుకు ముందుగానే జాగ్రత్త పడాలి. సొంగ కార్చే సమయంలో దాన్ని మనం చేతితో ముట్టుకోకుండా జాగ్రత్తపడాలి. కుక్క పిల్లలు ఆరు వారాల నుంచి 8 వారాల వయసులో పారో వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికీ ముందస్తుగా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రివెంటివ్ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. – డా.డీ.అశోక్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్.ఈ సీజన్లో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. వైరస్ వ్యాప్తికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంటో పెంచుకునే పెట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కళ్లు ఎర్రబడటం, జ్వరం రావడం, గొంతు కండరాలు బిగుసుకుపోయి నీళ్లు తాగడానికి ఇబ్బంది పడటం, నాలుగైదు రోజుల పాటు సొంగ కార్చడం, నురగలు కక్కడం వంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ర్యాబిస్ వైరస్కు సంబంధించిన లక్షణాలుగా పరిగణించాలి. ప్రాథమికంగా గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించినట్లైతే పెట్స్ను రక్షించుకోవచ్చు.నివారణ చర్యలు.. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. తద్వారా ర్యాబిస్ వ్యాప్తిని అరికట్టవచ్చు..దీంతో పాటు పెంపుడు జంతువులను నియంత్రణలో ఉంచాలి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి ఇళ్లలో పెంచుకునే వాటికి టీకాలు వేయించాలి. ఏదైనా జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలి. పెంపుడు జంతువులు లేదా బయటి జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినా.. అవి కాటు వేసినా.. గాయాన్ని సబ్బు నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. ర్యాబిస్ సోకిన జంతువు నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వైద్యుని సలహా మేరకు తగిన చికిత్స తీసుకోవాలి. ర్యాబిస్ వైరస్ సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులు, లేదా తరచూ జంతువులతో నివాసం ఉండాల్సిన పరిస్థితులు ఉన్న వ్యక్తులు ముందస్తుగా ర్యాబిస్ టీకా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో గబ్బిలాల నివాసం లేకుండా చూసుకోవాలి. ర్యాబిస్ సోకిన తర్వాత, లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స తీసుకోవడం చాలా కష్టం.. కాబట్టి నివారణా చర్యలు పాటించడం ఉత్తమం.. ఆరోగ్యకరం. (చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!)

ఇక్కడ త్రిమూర్తులకూ ఆలయాలు, ఎక్కడో తెలుసా?
కాకతీయ కాలం నాటి ఆధ్యాత్మిక శోభకు, శిల్పకళా వైభవానికి తార్కాణం 800 ఏళ్లనాటి ‘పిల్లల మర్రి’ (Pillalamarri )దేవాలయాలు. తెలుగు వారిని ఒకే తాటిమీదికి తీసుకువచ్చి సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయ రాజుల ఏలుబడిలో ఒక ఆధ్యాత్మిక, కళాక్షేత్రంగా వెలసిన కమనీయ సీమ సూర్యాపేట దగ్గర గల పిల్లలమర్రి.ముక్కంటికి మూడు ఆలయాలు..పిల్లలమర్రిలో మూడు ప్రసిద్ధ శైవక్షేత్రాలున్నాయి. 13వ శతాబ్దంలో వీటిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దం ఆరంభంలో కట్టిన గుడులు దాదాపు 150 సంవత్సరాలు వైభవోపేతంగా వెలిగాయి. ఆ తర్వాత పరదేశీ పాలనలో దోపిడీలకు గుర యినా, మధ్య మధ్య పునః ప్రతిష్టలు పొందాయి. బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ క్రీ.శ. 1208లో ఎరుకేశ్వర ఆలయాన్ని కట్టించారు. కాకతీయ శిల్పకళావైభవాన్ని చాటిచెప్పేలా చాలా ఎత్తుగా ఆలయం నిర్మించారు. దీని ముఖమండప స్తంభాలు నల్లరాయితో చెక్కారు. స్తంభాలు చాలా నునుపుగా అద్దం మాదిరిగా కనిస్తాయి. ముఖమండపంలోని స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినపడతాయి. ఆలయంలో కొలువైన స్వామివారిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని ప్రతీతి. బేతిరెడ్డి సోదరుడైన నామిరెడ్డి పిల్లలమర్రిలో రెండు శివాలయాలు కట్టించారు. తన పేరిట నామేశ్వర ఆలయం నిర్మించగా తన తల్లిదండ్రుల పేరిట త్రికూటాలయం నిర్మించారు నామేశ్వరాలయంలో నల్లరాతిపై చెక్కబడిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ద్వారాలు, ముఖమండపాలపై లతలు, పుష్పాలు, వివిధ భంగిమలలో నృత్యాలు కళాకారులు, గాయకులు, వాద్యకారులు, దేవతావిగ్రహాలు తదితర శిల్పాలు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవు. కొన్నిచోట్ల స్తంభాలపై సూక్ష్మాతిసూక్ష్మంగా అందమైన నగిషీలతో శిల్పాలను మలిచారు. కఠినమైన నల్లరాయి శిల్పుల చేతిలో మైనం లాæకరిగి΄ోయిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్తస్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తాయి. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతిదూలాలపై భారత రామాయణ గా«థలు, సముద్ర మథనం వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. నామేశ్వర ఆలయం పక్కనే త్రికూటేశ్వర ఆలయం ఉంది. ఒకేమండపంలో శివునికి మూడు వేర్వేరు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మూడు ఆలయాలకు కలిపి ఒకే నంది ఉండటం ఇక్కడ విశేషం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోకళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సేవలో వీరంగాలు వేయటం, అగ్నిగుండాలు కాల్చటం మొదలైన వేడుకలు నిర్వహిస్తున్నారు. చెన్నకేశ్వర... బ్రహ్మదేవాలయాలు... పిల్లలమర్రి శైవం, వైష్ణవం కలిసి పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. శివకేశవులకు భేదాలు లేవని చాటిచెప్పేలా మూడు ప్రసిద్ధ శివాలయాలు ఉన్న పిల్లలమర్రి గ్రామంలోనే ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయం ఉంది. 13వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. గర్భాలయంలో మకర తోరణం లో చెన్నకేశవస్వామివారి రూపలావణ్యం నయన మనోహరం. గర్భాలయం వెలుపల పన్నిద్దరు ఆళ్వారులు కొలువై ఉన్నారు. క్రీ.శ.1260లో చెన్నకేశ్వర ఆలయం ధ్వంసం అయ్యింది. 1899 ప్రాంతంలో గ్రామానికి చెందిన వుమ్మెత్తల చక్రయ్య గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని తిరిగి నిర్మించినట్లు చెబుతారు. చెన్నకేశ్వర ఆలయంతో΄ాటు నామేశ్వర ఆలయం ఎడమవైపు బ్రహ్మదేవుని ఆలయం ఉంది. బ్రహ్మ హంసవాహనారూఢుడై సరస్వతీమాతతో కలిసి దర్శనమిస్తారు. మహాదేవుని సేవ కోసం బ్రహ్మాసరస్వతులు హంసవాహనంపై ఇక్కడికి వస్తుంటారని స్థలపురాణం చెబుతోంది.ఎలా చేరుకోవాలంటే?ప్రసిద్ధ పురాతన ఆలయాలకు నెలవైన పిల్లల మర్రికి చేరుకోవడం చాలా సులువు. సూర్యాపేట జిల్లాలోని పిల్లల మర్రి గ్రామం హైదరాబాద్ నుంచి 134 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ నుంచి విరివిగా సూర్యాపేటకు బస్సులు ఉంటాయి. సూర్యాపేటలో దిగితే ఆక్కడినుంచి వాహనాల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామానికి చేరుకోవచ్చు.ఆ గ్రామం మూడు సుప్రసిద్ధ శైవ ఆలయాలకు నెలవు... ఒక్క ముక్కంటికే కాదు బ్రహ్మ, విష్ణువులకు సైతం ఆలయాలు ఉండటం మరో ప్రత్యేకత. త్రిమూర్తులలోని లయకారకుడైన శివుడు ఎరుకేశ్వరుడు, నామేశ్వరునిగా అవతరించగా స్థితికారకుడైన విష్ణువు చెన్నకేశ్వరునిగా వెలిశారు. ధరిత్రిపై పూజలు ఉండని శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడికి సైతం ఇక్కడ ఆలయం ఉండటం విశేషం. సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి హంస వాహనారూఢుడై దర్శనమిస్తాడిక్కడ.

ఉమెన్ 'ఇన్నోవేటర్స్'..! ఆవిష్కర్తల కోసం..
పరిశ్రమలు, పారిశ్రామిక రంగంలో మహిళకు వ్యవస్థాపకులుగా, ఆవిష్కర్తలుగా సాధికారత కల్పిస్తూ వారందరినీ అనుసంధానం చేసే వినూత్న వేదికగా డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఉమెన్ ఇన్నోవేటర్స్ (డీఇడబ్ల్యూఐ) ప్రారంభమైంది. అంకుర సంస్థల ఔత్సాహిక మహిళల సమిష్టి ఉన్నతికి సహకారం, ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా నగరంలో డీఇడబ్ల్యూఐ ఆవిష్కృతమైంది. నగరంలోని హైటెక్స్ నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ డాక్టర్ నీలిమా వేములతో పాటు చైర్పర్సన్ డాక్టర్ కళ్యాణి గుడుగుంట్ల, వైస్ చైర్పర్సన్ – సహ వ్యవస్థాపకురాలు సత్యవతి ప్రసన్న మడిపడిగే, సహ వ్యవస్థాపకురాలు – బ్రాండ్ కస్టోడియన్ పల్లవి నాగళ్లతో పాటు ముఖ్య సలహాదారు రాజు మడిపడిగే డీఇడబ్ల్యూఐను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మహిళా దార్శనికులు, స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహిళా ఆవిష్కర్తలను ఒక చోటికి చేర్చారు. మహిళా శక్తికి లాంచ్ప్యాడ్.. ఈ సందర్భంగా డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఉమెన్ ఇన్నోవేటర్స్ వ్యవస్థాపకురాలు డా.నీలిమా వేముల మాట్లాడుతూ.. డీఇడబ్ల్యూఐ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఇదొక ఒక ఉద్యమం. ప్రధానంగా ఇండస్ట్రీ, ఇన్నోవేషన్లో బాధ్యతను కోరుకునే, ఒకరికొకరు ప్రోత్సాహం అందించుకునే ఔత్సాహిక మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు మహిళా శక్తిని, విజయాన్ని పునర్ నిర్వచించడానికి సిద్ధంగా ఉన్న మహిళలను అనుసంధానం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. డీఇడబ్ల్యూఐ అనేది మహిళల వ్యవస్థాపకతను పెంపొందించేందుకు కమ్యూనిటీ సహకారంతో పాటు మూలధనంపై దృష్టి సారించి, ఆశావహులైన–స్థిరపడిన మహిళా వ్యవస్థాపకులకు ఒక లాంచ్ప్యాడ్గా సేవలందించనుందని, ఇలాంటి వారి అభివృద్ధికి అవకాశాలు కల్పించే సమాంతర వ్యవస్థగా రూపొందించనున్నామని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో మహిళా నేతృత్వంలోని వెంచర్లను స్కేలింగ్ చేయాలనే సంస్థ లక్ష్యానికి భవిష్యత్తు పెట్టుబడిదారులు, నిధుల సేకరణదారులుగా విశిష్ట జ్యువెలరీ డైరెక్టర్ సింధుజా పలబట్ల, సురక్ష ఫార్మా డైరెక్టర్ పద్మజా మానేపల్లిని డీఇడబ్ల్యూఐ కుబేరులుగా ఎంపిక చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అలేఖ్య పుంజాల, ప్రముఖ ఫిట్నెస్ నిపుణురాలు దినాజ్ వెర్వత్వాలా, సినీ నటుడు అలీ జీవిత భాగస్వామి జుబేదా అలీ, వైద్య నిపుణురాలు, మహిళా ఆరోగ్య న్యాయవాది డాక్టర్ సునీత రెడ్డి (వైఎస్), వకుళ సిల్స్ వ్యవస్థాపకురాలు మాధురి దువ్వాడ, టీజీ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్కి సై)
ఫొటోలు


చినుకుల్లో డార్జిలింగ్ అందాలు.. రా రమ్మని ఆహ్వానించే పచ్చటి కొండ కోనలు!


వైఎస్ జగన్ను కలిసిన వల్లభనేని వంశీ (ఫొటోలు)


'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)


నేచురల్ బ్యూటీ 'వర్ష బొల్లమ్మ' స్పెషల్ ఫోటోలు చూశారా..? (ఫొటోలు)


మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)


నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)


కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం (ఫొటోలు)


చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్ బీచ్లు ఇవే...


తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుతమైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)


తమ్ముడుతో టాలీవుడ్లో ఎంట్రీ.. అప్పుడే లైన్లో పెట్టేసిందిగా! (ఫోటోలు)
అంతర్జాతీయం

గాల్లో ప్రాణాలు.. ఫోన్లలో వీలునామాలు
టోక్యో: తరుణ్, జెనీలియా జంటగా గతంలో వచ్చిన ‘శశిరేఖా పరిణయం’సినిమాలో గాయాలపాలైన హీరోయిన్ చనిపోతానన్న భయంతో అప్పటికప్పుడు తన ప్రేమను హీరోకు చెప్తుంది. అచ్చం అలాగే తాము చనిపోవడం ఖాయమని భావించిన విమాన ప్రయాణికులు అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్ఫోన్లలో వీలునామాలు, పాస్వర్డ్లు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఈ ఘటన జపాన్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జూన్ 30న చైనాలోని షాంఘై పుడోంగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరిన విమానం మార్గమధ్యంలో ఇలా సాంకేతిక లోపంతో హఠాత్తుగా కిందకు దిగొచ్చి ప్రయాణికులకు గాల్లోనే చుక్కలు చూపించింది. చివరకు పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎలాగోలా విమానాన్ని సమీప ఒసాకా నగరంలోని కన్సాయ్ విమానాశ్రయంలో రాత్రి 8.50 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బందిసహా విమానంలోని మొత్తం 191 మంది ఊపిరి పీల్చుకున్నారు. A Spring Airlines flight from Shanghai to Tokyo was forced to make an emergency landing at Kansai Airport after a sudden loss of cabin pressure triggered a rapid descent from 36,000 feet to just under 10,500 feet in ten minutes.Flight JL8696 was cruising over Japan when a… pic.twitter.com/2n8rDGfqu5— FL360aero (@fl360aero) July 1, 2025జపాన్లోని టోక్యో నరీటా ఎయిర్పోర్ట్కు బయల్దేరిన ఈ బోయింగ్ 737 విమానం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 6.53 నిమిషాలకు ఈ అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. విమానంలో తలెత్తిన ఈ సాంకేతిక సమస్యపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. రాత్రివేళ హాయిగా నిద్రపోతున్న వేళ విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనై కిందకు దూసుకురావడం, ప్రయాణికులు ఉన్నట్లుండి తమ సీట్లలోంచి ఎగిరి పైకప్పునకు ఢీకొనడం, ఆక్సీజన్లు మాసు్కలు పెట్టుకోండని సహాయక సిబ్బంది ఏడుస్తూ చెప్పిన దృశ్యాలను కొందరు ప్రయాణికులు రికార్డ్చేశారు.Passengers on a Japan Airlines flight had to wear oxygen masks after the plane fell nearly 26,000 feet pic.twitter.com/5nseotGv3n— daredevil (@daredevil_1010) July 2, 2025ఇక, తాము ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై చనిపోతామని భావించిన ప్రయాణీకులు.. అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్ఫోన్లలో వీలునామాలు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఇంకొందరేమో తమ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ల పిన్ నంబర్లు, లాగిన్ పాస్వర్డ్లు పంపించారు. మరి కొందరు బీమా మొత్తాలు, ఇన్సూరెన్స్ కంపెనీల వివరాలను మెసేజ్లుగా పంపించారు. 36,000 అడుగుల ఎత్తు నుంచి విమానం 10,500 అడుగుల దిగువకు స్వేచ్ఛగా పడిపోతుండటంతో తాము చనిపోవడం ఖాయమని భావించిన చాలా మంది ప్రయాణికులు ఇలా తమ చివరి కోరికలు, వీలునామాలను స్మార్ట్ఫోన్లో తమ కుటుంబసభ్యులకు చేరవేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

థాయిలాండ్లో ఒకేఒక్కడు !
బ్యాంకాక్: 1999వ సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించిన హీరో అర్జున్ సినిమా ‘ఒకే ఒక్కడు’ గుర్తుండే ఉంటుంది. ముఖ్యమంత్రి పాత్రధారి రఘువరన్ దమ్ముంటే ఒక్కరోజు సీఎంగా పరిపాలించి చూడు ఆ కష్టమేంటో తెలుస్తుంది అంటూ కథానాయకుడికి సవాల్ విసరడం, సవాల్ను అంతేవేగంగా స్వీకరించి అర్జున్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని మెరుపువేగంతో పరిపాలనను చక్కదిద్దడం సినిమాలో చూశాం. సినిమాలో మాత్రమే సాధ్యమయ్యే ఈ అనూహ్య ఘటనకు ఇప్పుడు థాయిలాండ్ రాజకీయం వేదికైంది. కాంబోడియా ప్రధాని హున్సేన్తో ఫోన్ సంభాషణలో అతివినయం ప్రదర్శిస్తూ సొంత దేశ సైన్యాన్నే కించపరిచారంటూ ఆరోపణలు రావడంతో థాయిలాండ్ యువ మహిళా ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రను మంగళవారం దేశ రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్చేసింది. దీంతో ప్రధాని పీఠం ఖాళీ అయింది. రాజకీయ సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ వెంటనే రవాణా మంత్రి సూర్య జుగ్రూంగ్రియాంగ్కిట్ను ప్రధానిగా ప్రకటించింది. అయితే ఆయన కేవలం 24 గంటలపాటు మాత్రమే ప్రధానమంత్రి హోదా లో కొనసాగుతారని స్పష్టంచేసింది. దీంతో ఒక్క రోజు ప్రధాని అంశం మంగళవారం యావత్ థాయిలాండ్లో చర్చనీయాంశమైంది. ఒక్కరోజు లో కొత్త ప్రధాని ఏమేం బాధ్యతలు నెరవేర్చుతారు?. ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ మొదలైంది. ఈ విస్తృత చర్చల నడుమే సూర్య బుధవారం ఉదయం ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పటికే ఉపప్రధాని బాధ్యతలు నిర్వహిస్తున్న సూర్యకు ఇప్పుడీ ప్రధాని బాధ్యతలు అదనం. బుధవారం బ్యాంకాక్ నగరంలో ప్రధాని కార్యాలయ 93వ వార్షికోత్సవంలో సూర్య పాల్గొని తొలి అధికార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనీసం 93 గంటలుకూడా ప్రధాని కార్యాలయంలో గడిపే అవకాశంలేని నేత ఏకంగా ప్రధాని కార్యాలయ 93వ వార్షికోత్సవాన్ని ప్రారంభించారని విపక్ష పార్టీలు ఎద్దేవాచేశాయి. 24 గంటల్లో వ్యవస్థలోని అవినీతినంతా ఈయన ప్రక్షాళన చేస్తాడా అంటూ విమర్శలు గుప్పించారు.

ఎల్లుండే మెగా సునామీ?
పెను ఉత్పాతానికి మరో రెండు రోజులేనా? శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దాంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్’ ఇప్పుడు ఆన్లైన్లో యమా ట్రండింగ్లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు. తత్సుకీ ఏం చెప్పారు? కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘‘జపాన్, ఫిలిప్పీన్స్ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరŠామ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’’ అంటూ వరి్ణంచారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరీ తత్సుకీ? తత్సుకీ జపాన్కు చెందిన మాంగా ఆరి్టస్టు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

ఘనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ఆక్రా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాకు చేరుకున్నారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామా ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. కొటోకా ఇంటర్నేషన్ ఎయిర్పోర్టులో మోదీకి ఘన స్వాగతం లభించింది. సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఘనా ప్రభుత్వాధి నేతలతో మోదీ సమావేశ మవుతారు. భారత్–ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు. ప్రధాని మోదీ ఘనాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. అలాగే గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధాని ఘనాలో అడుగుపెట్టడం కూడా ఇదే తొలిసారి. ఇండియా నుంచి బయలుదేరే ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గ్లోబల్ సౌత్లో భారత్కు ఘనా అత్యంత విలువైన భాగస్వామి అని పేర్కొన్నారు. ఘనా పర్యటన అనంతరం ఆయన ఈ నెల 3, 4వ తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టోబాగోలో, 4, 5వ తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు. తర్వాత బ్రెజిల్లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. చివరగా నమీబియాలో పర్యటించి, స్వదేశానికి చేరుకుంటారు.
జాతీయం

భర్త వద్దు.. మామే కావాలి.. పెళ్లైన 45 రోజులకే..
పాట్నా: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో భర్త.. పెళ్లి అయిన 45 రోజులకు హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, తన మామతో జీవించేందుకే.. అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించింది. ఈ విషాదకర ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దీంతో, పెళ్లి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు (25), గుంజాదేవి (20)లకు రెండు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య 45 రోజుల క్రితమే వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గుంజాదేవికి తన మామ అంటే(భర్త తండ్రి కాదు) ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు నుంచే గుంజాదేవీ, ఆమె మామ జీవన్సింగ్ (55)లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా కూడా కలిసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన మామనే పెళ్లిచేసుకుంటానని.. గుంజాదేవీ తన పేరెంట్స్కు చెప్పింది. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.అనంతరం, ప్రియాంశుతో దేవీకి బలవంతంగా వివాహం చేశారు. తర్వాత.. తన మామను మరిచిపోలేక గుంజాదేవీ.. భర్తను దూరం పెడుతూ వస్తోంది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని తన మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో, తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో గుంజాదేవీ గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా.. జీవన్సింగ్తో తరచూ టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి అయిన నెలన్నరకే తమ కొడుకు ఇలా చనిపోయవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

170 కేజీల బరువు.. జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
బరువు తగ్గడానికి జిమ్కు వెళ్తున్నారా?.. అయితే ఈ వార్త తప్పకుండా చదవాల్సిందే. ఓ వ్యక్తి ఇలాగే జిమ్కు వెళ్లి వర్కవుట్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణం పొగొట్టుకున్నాడు. గత నాలుగు నెలలుగా కచ్చితమైన డైట్ పాటిస్తూ.. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తూ.. స్టెరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లకూ దూరంగా ఉంటున్నాడట. హర్యానా ఫరీదాబాద్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోట చేసుకుంది. నహర్ సింగ్ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్ శర్మకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. రెండున్నరేళ్ల పాప కూడా ఉంది. తండ్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడతను. అయితే అతని బరువు 170 కేజీలకు చేరింది. దీంతో బరువు తగ్గించుకునేందుకు జిమ్ను ఆశ్రయించాడు. గత నాలుగు నెలలుగా ఫరీదాబాద్ సెక్టార్ 9లో ఉన్న జిమ్కు క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. జులై 1వ తేదీన స్నేహితుడు రోహిత్తో కలసి జిమ్కు వెళ్లాడు. బ్లాక్ కాఫీ తాగిన తర్వాత.. షోల్డర్ పుల్-అప్స్ చేయడం ప్రారంభించారు. మూడో పుల్-అప్ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆ శబ్దానికి జిమ్లో వాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కాస్త స్పృహతో ఉన్న అతనికి నీటిని అందించడంతో.. వాంతులు చేసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో రెండుసార్లు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలోని ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించగా.. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా ఛానెల్స్కు చేరింది. అధిక బరువు ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలున్నవారు జిమ్ ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఎక్సర్సైజులు చేసేప్పుడు ఈ కింది విషయాలు గుర్తుంచుకోండిశరీర సామర్థ్యానికి మించి వ్యాయామాలు ప్రమాదకరంస్టెరాయిడ్స్, సప్లిమెంట్స్లాంటి వాటిని వీలైనంత దూరంగా ఉండాలి హార్ట్బీట్, బీపీలను నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలివ్యాయామాలకు ఉదయం సరైన సమయంజిమ్ చేసే టైంలో.. గుండె వేగంగా కొట్టుకున్నట్లు(గుండె దడ) అనిపిస్తే వెంటనే ఆపేయాలిఅలసిపోయినప్పుడు, జ్వరం లేదంటే బలహీనంగా అనిపించినా జిమ్కు వెళ్లకూడదుజిమ్ను కొత్తగా ప్రారంభించేవాళ్లు.. నిపుణుల సమక్షంలోనే మొదలుపెట్టడం ఉత్తమంభారీ బరువులు ఎత్తే ముందుకు సరైన శిక్షణ తీసుకుని ఉండాలి.. లేకుంటే ఎత్తకూడదుట్రెడ్మిల్ పరిగెత్తడానికి పరిమితి ఉండాలి.. అదే పనిగా చేయకూడదుఎక్సర్సైజుల మధ్యలో కొంచెం కొంచెంగా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్ హర్ మహదేవ్’ నినాదాలు
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని పవిత్ర అమర్నాథ్ గుహాలయంలో గురువారం ఉదయం మొదటి హారతి అందించడంతో వార్షిక అమర్నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం 5,892 మంది యాత్రికుల మొదటి బ్యాచ్ ప్రయాణాన్ని జమ్ములోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందం కశ్మీర్ లోయకు చేరుకోగానే అక్కడి అధికారులు, స్థానికులు వారికి స్వాగతం పలికారు. The first batch of Shri #AmarnathYatra2025 pilgrims was flagged off by Srinagar Police and the CRPF from the Pantha chowk base camp and directed to the Baltal base camp.#spiritualjourney #amarnathcave #yatra2023 #jammukashmir #DivineJourney #religioustourism #mountainpilgrimage pic.twitter.com/KHI1zN9Z4t— crpf_fan (@CrprepostFan) July 2, 2025బాల్తాల్, నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంపుల మీదుగా యాత్రికుల మొదటి బృందం తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారంతా ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ పెద్ద ఎత్తున శివనామస్మరణలు చేశారు. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర పహల్గామ్, బాల్తాల్ మార్గాల ద్వారా ముందుకు సాగనుంది. ఆగస్టు 9న రక్షాబంధన్తో ఈ యాత్ర ముగియనుంది. గత ఏడాది ఐదు లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ సందర్శించుకున్నారు. ఈ సంవత్సరం యాత్రా వ్యవధి తక్కువగా ఉన్నప్పటికీ యాత్రికులు అధికంగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 3.5 లక్షలకు పైగా భక్తులు యాత్ర కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆన్-ది-స్పాట్ రిజిస్ట్రేషన్ను సులభతరం చేసేందుకు జమ్ములో సరస్వతి ధామ్, వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ సభలలో అధికారులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజూ సుమారు రెండు వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. యాత్రామార్గంలో అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం

పాకిస్తాన్ సెలబ్రిటీలకు బిగ్ షాకిచ్చిన భారత్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్కు చెందిన సెలబ్రిటీలకు భారత ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. పాక్ సెలబ్రిటీలు, క్రికెటర్లు సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం మళ్లీ నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్కు చెందిన పలు ఛానళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, బుధవారం వారి అకౌంట్లు ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, అప్రమత్తమైన కేంద్రం.. వారి ఖాతాలపై మళ్లీ నిషేధం విధించినట్లు సమాచారం.ఇక, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు, పాకిస్తానీ క్రికెటర్ల ట్విట్టర్ అకౌంట్స్ అన్నింటినీ భారత్లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పాక్కు చెందిన పలు న్యూస్ ఛానెల్స్ను కూడా భారత్ బ్యాన్ చేసింది. అయితే బుధవారం నాడు ఈ ఛానెల్స్ అన్నీ భారత్లో ఆన్లైన్లో దర్శనం ఇచ్చాయి.An Indian soldier takes a bullet on the border.A Pakistani influencer takes creator payouts from Indian views.The government banned their content… then quietly unbanned it.This isn't soft diplomacy.This is soft headed.#BanPakContent pic.twitter.com/HlOZNvE2AX— SambhavāmiYugeYuge (Ministry of Aesthetics) (@Windsofchange72) July 2, 2025హనియా అమీర్, మహీరా ఖాన్, క్రికెటర్ షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్, సాబా కమర్, అహద్ రజా మిర్ వంటి పాక్ సెలెబ్రిటీల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాలు భారత్లో అన్బ్లాక్ అయ్యాయి. పలు పాక్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్లో దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ చూసిన భారత నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. భారత్లో పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీలపై బ్యాన్ తొలగించారా? అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నెటిజన్ల విమర్శల నేపథ్యంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా మరోసారి నిషేధం విధించినట్టు తెలుస్తోంది.
ఎన్ఆర్ఐ

NRI డాలస్లో యోగాడే సెలబ్రేషన్స్
డాలస్, టెక్సాస్: అమెరికాలో ఇర్వింగ్ (డాలస్) నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద జూన్ 21 న మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిమంది ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటన్నరకు పైగా సాగిన యోగా, ధ్యాన కార్యక్రమానికి ‘హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ సారధ్యం వహించింది. ఈ కార్యక్రమంలో ఇషా ఫౌండషన్, ది ఐ వై ఇసి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, వన్ ఎర్త్ వన్ చాన్స్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, డి ఎఫ్ డబ్లు హిందూ టెంపుల్ మొదలైన సంస్థలనుండి వందలాదిమంది పాల్గొన్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల అతిథులందరికీ స్వాగతం పలికి, యోగా చెయ్యడం కోసం సుప్రభాత సమయంలో తరలివచ్చిన వారందరికీ ధన్యవాదములు అని సభను ప్రారంభించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కో ఛైర్మన్ రాజీవ్ కామత్ శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “యోగా, ధ్యానం కేవలం జూన్ 21 న మాత్రమేగాక మన దైనందిన జీవితంలో దినచర్యలో ఒక భాగంగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకం అన్నారు.” మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండిముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాపర్ మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అన్ని వయస్సులవారు వందలాదిమంది ఈ రోజు యోగాలో పాల్గొనడం సంతోషం అని, ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిభావంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గసభ్యుల విజ్ఞప్తి ననుసరించి, అతిత్వరలో 5 మిలియన్ డాలర్లకు పైగా ధనాన్నివెచ్చించి ఈ 18 ఎకరాల సుందరమైన పార్క్ లో వాకింగ్ ట్రాక్స్, ఎల్ యి డి విద్యుత్ దీపాలను మెరుగుపరుస్తామని ప్రకటించడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు.ప్రత్యేకఅతిథులుగా హాజరైన కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజు మాథ్యూ, రమేష్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ ట్రస్టీ బోర్డ్ సభ్యుడు సురేష్ మండువ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కల్గించింది అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర సహచర కార్యవర్గ సభ్యులు రాజీవ్ కామత్, రావు కల్వాల, బి.ఎన్ రావు, తయాబ్కుండావాల, రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, మహేంద్ర రావు, జె పి పాండ్య, రన్నా జానీ, అనంత్ మల్లవరపులతో కలసి అతిథులందర్నీ సత్కరించారు.యోగా అనంతరం నిర్వాహాకులు చక్కటి ఉపాహారాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు బి.ఎన్ రావు తన ముగింపు సందేశంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నవారికి, అతిథులకు, వివిధ ప్రసార మాధ్యమాలకు, హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ నిర్వాహాకులు సురేఖా కోయ, ఉర్మిల్ షా మరియు వారి బృంద సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ స్మారక సిరికోన నవలారచన పోటీ తుది ఫలితాలు
తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రో త్సహించడానికి సిరికోన సాహితీ అకాడెమీ ( వాట్సప్) తరపున, స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ నవలా రచన పోటీ 2024కు సంబంధించిన తుది ఫలితాలను సంస్థ ప్రకటించింది. గత నాలుగు సంవత్సరాల నుంచి, ప్రతి ఏడాదీ ఉత్తమ నవలారచన పోటీల్లో భాగంగా ఉత్తమ రచనకు ముప్ఫై వేల నగదు బహుమతితో కూడిన పురస్కారాన్ని అందిస్తుంది., ఇతర రచయితలకు ప్రోత్సాహకంగా ఒకటి రెండు ప్రత్యేక బహుమతులను కూడా ప్రకటిస్తుంది. 2024 వ సంవత్సరానికి అనూహ్యమైన స్పందన లభించింది.. ఎక్కువమంది ప్రేమను కేంద్రవస్తువుగా తీసుకుని రాసినా, గణనీయ సంఖ్యలో ఆధునిక జీవన వైవిధ్యాన్ని చిత్రించే నవలలు రచించి పోటీకి సమర్పించారు.. ప్రాథమిక వడబోత పిమ్మట 26 నవలలు పోటీకి నిలిచాయి. తర్వాత వాటిని మరొక నిర్ణేత పరిశీలించి ఎంపిక చేసిన 7 నవలలను ముగ్గురు న్యాయనిర్ణేతలకు పంపడం జరిగింది. a. కథావవస్తువు, b. ఇతివృత్త నిర్మాణం- వాస్తవికత/ తార్కికతలు, c. శైలి- శిల్పం, d. సామాజిక ప్రయోజనం అంశాల ఆధారంగా గుణ పరిశీలన జరిగిందని సంస్థ ప్రతినిధి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఉత్తమ నవల: 'కిలారి': డా.బి.నాగశేషుప్రత్యేక బహుమతులు: 1. “కావేరికి అటూ ఇటూ”: రెంటాల కల్పన 2. “ లింగాల కంఠంలో” : రంజిత్ గన్నోజుఅసాధారణ నిర్మాణచాతురితో, అద్భుత మాండలిక భాషా కథనంతో, సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తున్న నవల 'కిలారి, మూడుతరాల నారీచేతనకు అద్దం పడుతున్న రచన 'కావేరికి అటూ ఇటూ..', నల్లమల అడవుల్లోని చెంచుల జీవితాన్ని అత్యంత సన్నిహితంగా పరిచయం చేస్తున్న రచన 'లింగాలకంఠంలో నవలలు నిస్సందేహంగా సిరికోనకు గర్వకారణంగా నిలిచే రచనలని పేర్కొంది. విజేతలకు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు
తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విశాఖలో దివ్యాంగుల కోసం నాట్స్ ఉచిత బస్సును ఏర్పాటు చేసింది. నాట్స్ స్థానిక స్వచ్చంద సంస్థ గ్లోతో కలిసి విశాఖలోని దివ్యాంగుల పాఠశాల సన్ ప్లవర్ స్కూల్ కోసం ఈ బస్సు కోనుగోలుకు కావాల్సిన ఆర్ధిక సహాకారాన్ని అందించింది. విశాఖ ఎంపీ భరత్ ఈ బస్సును లాంఛనంగా ప్రారంభించారు. నాట్స్ తెలుగు వారి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎంపీ ప్రశంసించారు. నాట్స్ సంబరాల్లో భాగంగా సంబరంలో సేవ.. సంబరంతో సేవ అనే కార్యక్రమం కింద సంబరాల్లో వచ్చిన మొత్తంలో 10శాతం ఇలా సేవ కార్యక్రమాలకు వెచ్చిస్తోంది. దానిలో భాగంగానే న్యూజెర్సీలో జరిగిన సంబరాల్లో ఇచ్చిన మాట ప్రకారం విశాఖలో దివ్యాంగుల పాఠశాల సన్ ప్లవర్ స్కూల్కి తన చేయూత అందిస్తోంది. నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్, ఎవల్యూజ్ సంస్థ అధినేత శ్రీనివాస్ అరసాడ కూడా ఈ దివ్యాంగ పాఠశాలకు కావాల్సిన ఆర్థిక చేయూత అందించారు.

షాకిచ్చిన ట్రంప్.. సోషల్ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!
వాషింగ్టన్: వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. వీసా అప్లయి దారులు వారి సోషల్ మీడియా అకౌంట్ల వివరాల్ని బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు అభ్యర్థుల వీసా క్యాన్సిల్ చేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తద్వారా సోషల్ మీడియా అకౌంట్లలో వీసా అప్లయి దారులు ఏ మాత్రం నెగిటీవ్ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెటట్టడం అసాధ్యం అవుతుంది.ఉదాహారణకు నార్వేకు చెందిన 21ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ అమెరికాలో పర్యాటించాలని అనుకున్నాడు. కానీ మాడ్స్ ఫోన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఫొటో ఉంది. అంతే ఆ ఫొటొ దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడు. మాడ్స్ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగుపెట్టేందుకు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోనున్నారు. అందుకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకి ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా?.అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల మంజూరుపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. వీసాల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ వీసా అభ్యర్థుల గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.Visa applicants are required to list all social media usernames or handles of every platform they have used from the last 5 years on the DS-160 visa application form. Applicants certify that the information in their visa application is true and correct before they sign and… pic.twitter.com/ZiSewKYNbt— U.S. Embassy India (@USAndIndia) June 26, 2025 సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త.. లేదంటే నో వీసాఅమెరికా వెళ్లేందుకు వీసా అప్లయి చేసుకునే అభ్యర్థులు వారి ఐదేళ్లకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్ల (సోషల్ మీడియా వెట్టింగ్) వివరాల్ని డీఎస్-160ఫారమ్లో బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారమ్లో వీసా కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ వివరాల్ని ఎవరైతే మీరు పొందే కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని వీసా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఫారమ్లో అభ్యర్థులు వారి సోషల్ మీడియా వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ సోషల్ మీడియా అకౌంట్స్ను చెక్ చేస్తారు. అందులో ఏ మాత్రం తేడా అనిపించినా వీసా ఇవ్వరు.అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేలాఇక తాజా చర్య ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థుల్ని నియంత్రించే ప్రయత్నాల్లో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతేడాది అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్లలో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం వీసా ప్రక్రియ సమయంలో సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం జాతీయ భద్రతా చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.భారత్లో అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన అందుకు అనుగుణంగా గత సోమవారం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 2019 నుండి, యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తుదారులు వలసదారుల, వలసేతర వీసా దరఖాస్తు ఫారమ్లపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను అందించాలని కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా, యునైటెడ్ స్టేట్స్కు అనుమతించబడని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి మేము మా వీసా స్క్రీనింగ్, వెట్టింగ్లో అందుబాటులో సమాచారాన్ని ఉపయోగిస్తాము’ అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
క్రైమ్

విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో కదిలిన డొంక
సాక్షి, విశాఖపట్నం: మరో బెట్టింగ్ యాప్ ముఠాను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో డొంక కదిలింది. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విశాఖ పోలీసులు.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. బెంగళూరులో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేసి బెట్టింగ్కు పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన నిందితుడు కీలక పాత్ర వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ ముఠా సభ్యులు వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ టాప్లు, 132 ఏటిఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఒక కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు.

హైదరాబాద్లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. టాలీవుడ్లోని సినిమాలను పైరసీ చేసిన తూర్పుగోదావరికి చెందిన జన కిరణ్కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వనస్థలిపురంలో ఏసీ టెక్నిషియన్గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు 65 సినిమాలకు రికార్డు చేసినట్లు కిరణ్ పేర్కొన్నాడు. హెచ్డీ ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.నిందితుడిపై 66(c), 66(e) ఐటీ యాక్ట్, 318(4),r/w 3(5), 338 BNS, 63, 65 కాపీ రైట్, 6-AA,6AB,7(1A) సినిమాటోగ్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కామ్ కార్డ్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్కుమార్.. 1TAMILBLASTERS, 5MOVIEZRULZ, 1TAMILMV వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఒక థియేటర్ వేదికగా ఈ పైరసీకి పాల్పడినట్లు తేలింది. పైరసీ కారణంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు 3.7కోట్ల నష్టం ఏర్పడింది. టెలిగ్రామ్లో సైతం కొత్త పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారుగా ఏడాదిన్నర నుంచి హైదరాబాద్లోని పలు థియేటర్స్లో 40 సినిమాలు రికార్డింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.సినిమా థియేటర్లోనే పైరసీ చేసి మాఫియాకి అమ్ముతున్న కిరణ్.. ఒక్కొక్క సినిమాకి 400 క్రిప్టో కరెన్సీని తీసుకుంటున్నాడు. క్రిప్టోతో పాటు బిట్ కాయిన్స్ రూపంలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ ఛేంజర్, సినిమాల ఫైల్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడు కిరణ్ నుంచి రెండు మొబైల్స్ను సీజ్ చేశారు.

మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025

భర్త వద్దు.. మామే కావాలి.. పెళ్లైన 45 రోజులకే..
పాట్నా: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో భర్త.. పెళ్లి అయిన 45 రోజులకు హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, తన మామతో జీవించేందుకే.. అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించింది. ఈ విషాదకర ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దీంతో, పెళ్లి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు (25), గుంజాదేవి (20)లకు రెండు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య 45 రోజుల క్రితమే వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గుంజాదేవికి తన మామ అంటే(భర్త తండ్రి కాదు) ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు నుంచే గుంజాదేవీ, ఆమె మామ జీవన్సింగ్ (55)లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా కూడా కలిసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన మామనే పెళ్లిచేసుకుంటానని.. గుంజాదేవీ తన పేరెంట్స్కు చెప్పింది. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.అనంతరం, ప్రియాంశుతో దేవీకి బలవంతంగా వివాహం చేశారు. తర్వాత.. తన మామను మరిచిపోలేక గుంజాదేవీ.. భర్తను దూరం పెడుతూ వస్తోంది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని తన మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో, తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో గుంజాదేవీ గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా.. జీవన్సింగ్తో తరచూ టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి అయిన నెలన్నరకే తమ కొడుకు ఇలా చనిపోయవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
వీడియోలు


హైదరాబాద్ లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు


చంద్రబాబుకు బనకచర్ల పూర్తిచేసే ఉద్దేశం లేదు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


శ్రీవాణి టికెట్ల కేంద్రం దగ్గర కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా లేదని ఫైర్


ఏపీ రాజధాని కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణకు యత్నం


అనకాపల్లి జిల్లా పూడిమడకలో విషాదం


Medical Graduates: ఇంత చదవడవం కంటే అడుక్కోవడం బెటర్


తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 17న రైల్ రోకో నిర్వహిస్తున్నాం: కవిత


Sailajanath: లోకేష్... దమ్ముంటే సింగయ్య భార్య ప్రశ్నలకు సమాధానం చెప్పు


తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్కు చేదు అనుభవం


Palakollu roads: అంతన్నారు.. ఇంతన్నారు చివరికి గోతులు పడితే మాత్రం!?