
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని పవిత్ర అమర్నాథ్ గుహాలయంలో గురువారం ఉదయం మొదటి హారతి అందించడంతో వార్షిక అమర్నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం 5,892 మంది యాత్రికుల మొదటి బ్యాచ్ ప్రయాణాన్ని జమ్ములోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందం కశ్మీర్ లోయకు చేరుకోగానే అక్కడి అధికారులు, స్థానికులు వారికి స్వాగతం పలికారు.
The first batch of Shri #AmarnathYatra2025 pilgrims was flagged off by Srinagar Police and the CRPF from the Pantha chowk base camp and directed to the Baltal base camp.#spiritualjourney #amarnathcave #yatra2023 #jammukashmir #DivineJourney #religioustourism #mountainpilgrimage pic.twitter.com/KHI1zN9Z4t
— crpf_fan (@CrprepostFan) July 2, 2025
బాల్తాల్, నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంపుల మీదుగా యాత్రికుల మొదటి బృందం తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారంతా ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ పెద్ద ఎత్తున శివనామస్మరణలు చేశారు. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర పహల్గామ్, బాల్తాల్ మార్గాల ద్వారా ముందుకు సాగనుంది. ఆగస్టు 9న రక్షాబంధన్తో ఈ యాత్ర ముగియనుంది. గత ఏడాది ఐదు లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ సందర్శించుకున్నారు. ఈ సంవత్సరం యాత్రా వ్యవధి తక్కువగా ఉన్నప్పటికీ యాత్రికులు అధికంగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 3.5 లక్షలకు పైగా భక్తులు యాత్ర కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆన్-ది-స్పాట్ రిజిస్ట్రేషన్ను సులభతరం చేసేందుకు జమ్ములో సరస్వతి ధామ్, వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ సభలలో అధికారులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజూ సుమారు రెండు వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. యాత్రామార్గంలో అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం