Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి! | Registration for Amarnath Yatra 2025 begins check full deets inside | Sakshi
Sakshi News home page

Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!

Apr 14 2025 6:52 PM | Updated on Apr 14 2025 6:52 PM

Registration for Amarnath Yatra 2025 begins check full deets inside

Amarnath Yatra  2025  భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ ఆధ్మాత్మిక యాత్ర అమర్‌నాథ్‌యాత్ర షెడ్యూల్‌  వచ్చేసింది.  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్‌నాథ్‌ యాత్ర షెడ్యూల్‌ వచ్చేసింది. ప్రతి ఏడాది  నిర్వహించే ఈ యాత్ర  ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూలై 25 నుండి ప్రారంభం కానుంది.   మొత్తం 38 రోజులపాటు  అంటే ఆగస్టు 19 వరకు ఇది సాగనుంది. ఈ యాత్రకు సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్‌  ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌  ఎపుడు, ఎలా చేసుకోవాలి? నిబంధనలేంటి , ఇతర వివరాల గురించి  తెలుసుకుందాం.

2025 ఏడాదికి సంబంధించిన అమర్‌నాథ్‌ ప్రయాణానికి రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ 14నుంచి మొదలైనట్టు బోర్డు ప్రకటించింది. శివుడి ప్రతిరూపమైన మంచు లింగాన్ని చూడటానికి ప్రతిరోజూ 15,000 మంది యాత్రికులు  ఇక్కడికి తరలివస్తారు

చదవండి: అమర్‌నాథ్ యాత్రకు ప్లాన్‌ చేస్తున్నారా? వీటిని అస్సలు తీసుకెళ్లకూడదు!

అమర్‌నాథ్ యాత్ర బుకింగ్ ఫీజు , అవసరమైన పత్రాలు ?
ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ అధికారికంగా ఏప్రిల్ 14న ప్రారంభమైంది మరియు శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) అధికారిక వెబ్‌సైట్ మరియు గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.


ముందుగా శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా https://jksasb.nic.in/  కి వెళ్లాలి.
హోమ్‌పేజీలో, ఎగువన ఉన్న 'ఆన్‌లైన్ సేవలు' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
ఎంపికల జాబితా నుండి 'యాత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్' ఎంచుకోండి.
సూచనలు, నియమాలు , ముఖ్యమైన మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవండి. వాటిని చదివిన తర్వాత, 'నేను అంగీకరిస్తున్నాను' పై క్లిక్ చేయండి.
తర్వాత 'రిజిస్టర్' బటన్‌ను ఎంచుకోవాలి..
మీరు పేరు, ఇష్టపడే యాత్ర తేదీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ మొదలైన మీ వివరాలను నమోదు చేయాలి.
అలాగే, మీ తప్పనిసరి ఆరోగ్య ధృవీకరణ పత్రం (CHC) స్కాన్ చేసిన కాపీతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేయండి.

తరువాత,   ఒక ఓటీపీ వస్తుంది. ఈ OTPని నమోదు చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను ధృవీకరించాలి.
దాదాపు రెండు గంటల్లోపు, చెల్లింపు చేయడానికి మీకు లింక్ అందుతుంది. చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత, మీ యాత్ర పర్మిట్‌ను నేరుగా పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

బాబా అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ మునుపటిలాగే ఆధార్ కార్డ్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతి ద్వారా జరుగుతుంది. భక్తులు బుకింగ్ కోసం రూ. 150 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ : ఆధార్ కార్డుతో పాటు ఆరోగ్య ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాలి. అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు బ్యాంకుల శాఖలు, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆసుపత్రులు , వైద్య కేంద్రాల వైద్యుల బృందాల గురించి సమాచారాన్ని అందుబాటులో ఉంటుంది.  ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎటువంటి సమస్య లేకుండా వారి ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని పొందడం ద్వారా ముందస్తు బుకింగ్ కోసం దరఖాస్తు చేసు కోవచ్చు.

గ్రూపులుగా భక్తులు ఎలా నమోదు చేసుకోవాలి? రుసుము ఎంత?
అమర్‌నాథ్ యాత్రకు కొంతమందితో కలిసి గ్రూపుగా  వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు సమూహ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది.. ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తుల కోసం, దరఖాస్తు ఫారమ్‌ను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు పంపడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గ్రూప్ రిజిస్ట్రేషన్ కోసం ఫారమ్ పొందడానికి చివరి తేదీ మే 20.  ఒక రోజులో గరిష్టంగా గ్రూప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 30కి మాత్రమే అనుమతి. గ్రూప్ సభ్యులకు రిజిస్ట్రేషన్  ఒక్కొక్కరికి రూ. 250 రుసుము బుకింగ్‌కు చివరి తేదీ మే 31.

ఎన్‌ఆర్‌ఐ భక్తులు
NRI యాత్రికులకు ఒక్కొక్కరికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1550.  దీన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. దరఖాస్తుకు అవసరమైన పత్రాలలో ఆరోగ్య ధృవీకరణ పత్రం, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ , స్కాన్ చేసిన ఫోటోలు సమర్పించాలి. విదేశీ యాత్రికులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ కోసం తమ పత్రాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐటీ విభాగం సీనియర్ మేనేజర్‌కు పంపవచ్చు. భక్తులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌  ద్వారా మరింత సమాచారాన్ని పొందవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement