ఇండోనేసియాలో పడవ మునక | Two Dead 43 Missing Ferry Sinks Off Bali Coast | Sakshi
Sakshi News home page

ఇండోనేసియాలో పడవ మునక

Jul 3 2025 9:35 AM | Updated on Jul 4 2025 1:01 AM

Two Dead 43 Missing Ferry Sinks Off Bali Coast

ఆరుగురు మృతి, 29 మంది గల్లంతు 

బాలి: ఇండోనేసియాలోని బాలిలో పడవ మునిగిన ఘటనలో ఆరుగురు చనిపోయారు. కనీసం 29 మంది గల్లంతయ్యారు. 31 మందిని రక్షించామని అధికారులు తెలిపారు. కేఎంపీ తును ప్రతమ జయ అనే పడవ బుధవారం సాయంత్రం తూర్పు జావాలోని కేతాపాంగ్‌ ఓడరేవు నుంచి బాలిలోని గిలిమనుక్‌కు బయలుదేరిన అరగంటకే అలల తాకిడికి గురైంది.

 ప్రమాద సమయంలో ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 22 వాహనాలు, ట్రక్కులు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు 31 మందిని కాపాడారు. వీరిలో సుమారు 20 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని అధికారులు తెలిపారు. టగ్‌ బోట్లు, నౌకలతో సహా తొమ్మిది బోట్లతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అలలు రెండు మీటర్ల ఎత్తులో ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. పూర్తిగా మునిగిపోయిన పడవలో చిక్కుకుని ఎవరూ ఉండే అవకాశాల్లేవని చెప్పారు. 

కాగా, అధికారులు చెబుతున్న దానికంటే పడవలో ఎక్కుమంది ప్రయాణికులు ఉండే అవకాశాలున్నాయని ప్రత్యక్ష సాకు‡్ష్యలు అంటున్నారు. ఇలా ఉండగా, ఇండోనేసియాలోని దీవుల మధ్య రోజూ ప్రయాణించే లక్షలాది మందికి పడవలే ఆధారం. అయితే, కాలం చెల్లిన ఓడలు, తగినంత భద్రతా తనిఖీలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బాలి సమీపంలో ఒక పర్యాటక పడవ బోల్తా పడటంతో ఆ్రస్టేలియాకు చెందిన ఓ మహిళ మరణించింది. 2018లో టోబా సరస్సులో పడవ మునిగిన ఘటనలో 150 మందికి పైగా జల సమాధి అయ్యారు.  


ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement