షాకిచ్చిన ట్రంప్‌.. సోషల్‌ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు! | US Embassy in India Mandates Disclosure of Social Media Handles for Visa Applicants | Sakshi
Sakshi News home page

షాకిచ్చిన ట్రంప్‌.. సోషల్‌ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!

Jun 26 2025 5:43 PM | Updated on Jun 26 2025 6:22 PM

US Embassy in India Mandates Disclosure of Social Media Handles for Visa Applicants

వాషింగ్టన్‌: వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ షాకిచ్చారు. వీసా అప్లయి దారులు వారి సోషల్‌ మీడియా అకౌంట్ల వివరాల్ని బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు అభ్యర్థుల వీసా క్యాన్సిల్‌ చేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తద్వారా సోషల్‌ మీడియా అకౌంట్లలో వీసా అప్లయి దారులు ఏ మాత్రం నెగిటీవ్‌ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెటట్టడం అసాధ్యం అవుతుంది.

ఉదాహారణకు నార్వేకు చెందిన 21ఏళ్ల మాడ్స్‌ మికెల్సెన్‌ అమెరికాలో పర్యాటించాలని అనుకున్నాడు. కానీ మాడ్స్‌ ఫోన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బట్టతలతో ఉన్న మీమ్‌ ఫొటో ఉంది. అంతే ఆ ఫొటొ దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడు.  మాడ్స్‌ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగుపెట్టేందుకు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోనున్నారు. అందుకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకి ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా?.

అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం వీసాల మంజూరుపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. వీసాల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ వీసా అభ్యర్థుల గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.

 

సోషల్‌ మీడియాతో తస్మాత్‌ జాగ్రత్త.. లేదంటే నో వీసా
అమెరికా వెళ్లేందుకు వీసా అప్లయి చేసుకునే అభ్యర్థులు వారి ఐదేళ్లకు సంబంధించిన అన్నీ సోషల్‌ మీడియా అకౌంట్ల (సోషల్‌ మీడియా వెట్టింగ్‌) వివరాల్ని డీఎస్‌-160ఫారమ్‌లో బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారమ్‌లో వీసా కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్‌ మీడియా అకౌంట్స్‌ వివరాల్ని ఎవరైతే మీరు పొందే కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని వీసా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఫారమ్‌లో అభ్యర్థులు వారి సోషల్‌ మీడియా వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మీ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను చెక్‌ చేస్తారు. అందులో ఏ మాత్రం తేడా అనిపించినా వీసా ఇవ్వరు.

అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేలా
ఇక తాజా చర్య ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థుల్ని నియంత్రించే ప్రయత్నాల్లో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతేడాది అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్‌లలో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం వీసా ప్రక్రియ సమయంలో సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం జాతీయ భద్రతా చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.

భారత్‌లో అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన 
అందుకు అనుగుణంగా గత సోమవారం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 2019 నుండి, యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తుదారులు వలసదారుల, వలసేతర వీసా దరఖాస్తు ఫారమ్‌లపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్‌లను అందించాలని కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా, యునైటెడ్ స్టేట్స్‌కు అనుమతించబడని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి మేము మా వీసా స్క్రీనింగ్, వెట్టింగ్‌లో అందుబాటులో సమాచారాన్ని ఉపయోగిస్తాము’ అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement