
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2గా నిహారిక కొణిదెల మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

గతంలో నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, వశిష్ట ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ముహుర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు.










