'కన్నప్ప'కు ఇలా జరగడం బాధేస్తుంది: మంచు విష్ణు | Manchu Vishnu Comments On Kannappa Movie | Sakshi
Sakshi News home page

'కన్నప్ప' విషయంలో ఇలా జరగడం బాధేస్తుంది: మంచు విష్ణు

Jun 30 2025 12:11 PM | Updated on Jun 30 2025 12:32 PM

Manchu Vishnu Comments On Kannappa Movie

మంచు విష్ణు  (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్‌లో 80 శాతం సీట్లు ఫిల్‌ అవుతున్నాయి. ఆపై తమిళనాడులో కూడా మంచి టాక్‌తో రన్‌ అవుతుంది. తెలుగులో కూడా మ్యాట్నీ, సాయంత్రం షోలు హౌస్‌ఫుల్‌ అయిపోతున్నాయి. అయితే, తాజాగా మంచు విష్ణు తాజాగా సోషల్‌మీడియాలో విజ్ఞప్తి చేస్తూ పోస్ట్‌ పెట్టారు. కన్నప్ప చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు ఆవేదన చెందారు.  ఎంతో కష్టపడి సినిమాను నిర్మించామని, ఎవరూ పైరసీని ప్రొత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

కన్నప్ప సినిమా పైరసీకి గురైందని నటుడు మంచు విష్ణు తన ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే సుమారు 30వేలకు పైగానే అనధికారిక పైరసీ లింక్‌లను తమ టీమ్‌ తొలగించిందని  ఆయన పేర్కొన్నారు. పైరసీ అంటే మరొకరి శ్రమను దోచుకోవడమే..  ఇలాంటి చర్య దొంగతనంతో సమానం అవుతుందన్నారు. ఈ విషయంలో చాలా బాధగా ఉందని విష్ణు ఆవేదన చెందారు. ' మన ఇంట్లో పిల్లలకు మనం దొంగతనం చేయమని మనం నేర్పించం. ఇలా ఒక సినిమాను పైరసీలో చూడడం కూడా దొంగతనంతో సమానమే అవుతుంది. దయచేసి ఇలాంటి వాటిని అరికట్టండి. మా ‘కన్నప్ప’ సినిమాను ఆదరించండి.' అంటూ విష్ణు కోరారు.

కన్నప్ప సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 58 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ షో డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఈ మూవీలో ప్రభాస్‌ పాత్రతో పాటు మంచు విష్ణు నటన అద్భుతంగా ఉందంటూ టాక్‌ బయటకు రావడంతో టికెట్లు బాగానే తెగుతున్నాయి.  బుక్‌మైషోలో ప్రతిరోజు సుమారు ఒక లక్షకు పైగానే టికెట్లు సేల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement