manchu Vishnu
-
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
మంచు విష్ణు హీరోగా నటిస్తూ, భారీ బడ్జెట్తో తీసిన సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రలు చేశారు. మోహన్ బాబు, కాజల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ఈవెంట్ తాజాగా కొచ్చిలో నిర్వహించారు. అక్కడే మోహన్ లాల్ చేతుల మీదుగా ఇప్పుడు ట్రైలర్ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ప్రభాస్ స్క్రీన్ పెజెన్స్ కూడా అభిమానులకు నచ్చేలా ఉంది. గతంలో వచ్చిన కంటెంట్పై వచ్చింది. ట్రైలర్ని మాత్రం ట్రోలింగ్కి స్కోప్ లేకుండా బాగానే కట్ చేశారు. అలానే స్టోరీ ఏంటనేది కూడా చూచాయిగా చెప్పేశారు కూడా. సినిమా ఎలా ఉండబోతుందనేది కూడా ట్రైలర్తో శాంపిల్ చూపించేశారు.ఓ గూడెంలో నివసించే తిన్నడు (మంచు విష్ణు).. చిన్నప్పటి నుంచి దేవుడిని పెద్దగా నమ్మడు. పెద్దయిన తర్వాత కొన్ని సంఘటనల వల్ల గూడెం నుంచి ఇతడిని వెలివేస్తారు. అదే టైంలో నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. తర్వాత శివుడు(అక్షయ్ కుమార్), రుద్ర(ప్రభాస్)ని భూమ్మీదకు పంపిస్తాడు. రుద్ర వల్ల తిన్నడు.. అతిపెద్ద శివభక్తుడు ఎలా అయ్యాడు? ఈ మొత్తం కథలో వాయు లింగం సంగతేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?) -
నా గుండె పగిలింది.. మంచు విష్ణు కీలక నిర్ణయం
గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్ హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఇండోర్లో ఈవెంట్.. మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు(జూన్ 13) ఇండోర్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దానికి సంబంధించిన పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ ఈవెంట్లోనే ట్రైలర్ని కూడా విడుదల చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు.నా గుండె పగిలింది.. విమాన ప్రమాదంపై మంచు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ప్రమాదం గురించి తెలియగానే నా గుండె పగిలిపోయింది. చాలా బాధగా ఉంది. కన్నప్ప ట్రైలర్ రిలీజ్ని ఒకరోజు వాయిదా వేస్తున్నాం. అలాగే ఇండోర్లో రేపు జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. -
'కన్నప్ప' ట్రైలర్ అప్డేట్.. కాస్త త్వరగానే
రీసెంట్ టైంలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ తెగ హడావుడి పడుతున్నాయి. ఒక డేట్ చెబుతున్నారు. తీరా చూస్తే ఆ తేదీ దగ్గరకొచ్చేసరికి వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్, సీన్స్ రీ షూట్ అని చెప్పి వాయిదా వేస్తున్నారు. ఈ విషయంలో 'కన్నప్ప' కూడా మినహాయింపు ఏం కాదు. కాకపోతే మిగతా చిత్రాలతో పోలిస్తే ప్రమోషన్ విషయంలో కాస్త దూకుడు చూపిస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చేశారు.'కన్నప్ప' సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది? ఎంత బడ్జెట్ పెట్టారు? ఇలాంటి విషయాలేం పెద్దగా తెలీవు. కానీ మొదట టీజర్ వచ్చినప్పుడు చాలా ట్రోలింగ్ నడిచింది. తర్వాత మరో టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కాస్త తగ్గింది. ప్రస్తుతం గత కొన్నాళ్ల నుంచి విష్ణు ఒక్కడే ప్రమోషన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అక్కడా ఇక్కడా తిరుగుతూ సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)ఇప్పుడు మరో రెండు రోజుల్లో అంటే జూన్ 13న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా సినిమా రిలీజ్కి రెండు వారాల ముందు ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ బట్టి జనాలకు సినిమాపై అంచనా ఏర్పడుతుంది. మూవీ చూడాలా వద్దా అనేది వాళ్లు డిసైడ్ అవుతారు. ప్రమోషన్లలో విష్ణు మాటతీరు చూస్తుంటే.. చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి?మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు. టెక్నీషియన్స్ కూడా బాలీవుడ్కి చెందిన వాళ్లు పనిచేశారు. ఎప్పటినుంచో ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెబుతూ వస్తున్న విష్ణు.. ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
కన్నప్పలో ఆ పేర్లపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు!
కన్నప్ప మూవీ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించారు. ఎవరిని కించపరిచేలా కన్నప్ప సినిమాను తీయలేదని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మా సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ఆ పరమశివుడిని భక్తితో చూపించామని విష్ణు వెల్లడించారు. కాగా.. ఈ మూవీలోని పాత్రల పేర్లపై ఇటీవల బ్రాహ్మణ సంఘాల ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు స్పందించారు.అసలేంటి వివాదం..?ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది కన్నప్ప టీమ్. ఈ క్రమంలోనే ఇటీవల మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే గుంటూరు కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.'మంచు మోహన్బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటామని శ్రీధర్ హెచ్చరించారు. ఈ వివాదంపై బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.కాగా.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ లాంటి అగ్రతారలు నటించారు. -
అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ
మంచు అనే పేరు చెప్పగానే ప్రస్తుతానికి 'కన్నప్ప' సినిమా లేదంటే వాళ్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు గుర్తొస్తాయి. ఇప్పటికైతే ఏం జరగట్లేదు. మంచు విష్ణు.. తను హీరోగా నటించి భారీ బడ్జెట్తో నిర్మించిన 'కన్నప్ప'ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. మరోవైపు మనోజ్ కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. ఈ గొడవల్లో ఎక్కడా కనిపించని మంచు లక్ష్మీ.. తాజాగా ఓ ప్రెస్ మీట్లో ప్రత్యక్షమైంది. తాను కన్నప్ప చిత్రంలో నటించకపోవడానికి గల కారణాన్ని బయటపెట్టింది.'నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి. నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరు కనిపించరు(సరదాగా). ఇందులో నేను చేయగలిగే పాత్ర లేకపోవడంతోనే విష్ణు నాకు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ నేను చేయగలిగే పాత్ర ఉంటే ఇచ్చి ఉండేవాడేమో. మేమంతా కలిసి అన్ని చిత్రాల్లో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది' అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)మీ సోదరులకి.. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. సినిమాల్లో అవకాశం ఇవ్వకపోవటానికి, సపోర్ట్ చేయకపోవడానికి సంబంధం లేదు. నా మద్దతు వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది అని సమాధానమిచ్చింది. గత కొన్ని నెలల నుంచి మంచు కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పెద్దగా మాట్లాడని మంచు లక్ష్మీ.. మంచు మనోజ్కి మాత్రం అండగా ఉంది.కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన మంచు లక్ష్మీ.. ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. బాలీవుడ్ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 'ద ట్రైటర్స్' అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు సిద్ధమైంది. తాజాగా హైదరాబాద్లో కనిపించిన ఈమె.. మీడియాతో మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకుంది. ఈ ఈవెంట్లోనే స్పందిస్తూ 'కన్నప్ప'లో నటించకపోవడానికి కారణం కూడా బయటపెట్టింది.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!) -
నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు
ప్రస్తుతం తెలుగు సినిమా వ్యవహారాలు దాదాపు ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మూవీని ఏ తేదీన థియేటర్లలో విడుదల చేయాలనేది వారే నిర్ణయిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్కి పర్లేదు గానీ చాలామంది చిన్న, మీడియం బడ్జెట్ పెట్టే నిర్మాతలు.. తమ చిత్రాల్ని పూర్తి చేసినా సరే రిలీజ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు 'కన్నప్ప' ఓటీటీ గురించి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటి గురించి అడగ్గా.. విష్ణు తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు.'కన్నప్ప' ఓటీటీ డీల్ కుదిరిందా? అని అడగ్గా.. 'వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు అది నాకు నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. డబ్బులు రెడీ చేస్కోండి. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాపై చాలా నమ్మకంతోనే ఉన్నాడనిపిస్తుంది. చూడాలి మరి ఫలితం ఎలా వస్తుందో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. గత చిత్రాలు సరిగా ఆడకపోవడంతో చాన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. భారీ బడ్జెట్ పెట్టి స్వయంగా నిర్మించాడు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్.. ఇలా చాలామంది స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మార్కెట్ పరంగా చూసుకుంటే దక్షిణాది స్టార్స్ చాలామంది ఉన్నారు. సినిమా హిట్ అయితే ఓటీటీల నుంచి డిమాండ్ ఉండొచ్చు. ఒకవేళ తేడా కొడితే మాత్రం అంతే సంగతులు.జూన్ 27న 'కన్నప్ప' సినిమా థియేటర్లలోకి రానుంది. చాన్నాళ్ల క్రితం తొలుత ఓ టీజర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకుని మరో టీజర్ రిలీజ్ చేయగా, నెగిటివిటీ కాస్త తగ్గింది. ప్రస్తుతం ప్రమోషన్ల బాధ్యత విష్ణునే తీసుకున్నాడు. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయబోతున్నాడు. దీనికి ప్రభాస్ కూడా హాజరవుతాడని టాక్.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!) -
గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
'కన్నప్ప' వేడుకలో ప్రభాస్పై మోహన్బాబు వ్యాఖ్యలు
విష్ణు మంచు నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’(kannappa) ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. శివ నామస్మరణతో చాలా విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్బాబు, ఆర్.శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ గురించి నటుడు మోహన్బాబు పలు వ్యాఖ్యలు చేశారు. 'ప్రభాస్, నేనూ 'బావ.. బావ..' అనుకుంటాం. ఇప్పటికీ నేను తనకు ఫోన్ చేస్తే బావ అంటూనే మాట్లాడుతాను. తనూ అంతే.. అలా చాలా సరదాగా మా ఇద్దరి మధ్య పలకరింపులు ఉంటాయి. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. ఈ సినిమాలో నటించాలని నేను అడగ్గానే బావ.. దీని గురించి మీరు నా దగ్గరకు రావాలా..? మీరు వదిలేయండి. ఏదైనా ఉంటే నేనూ విష్ణు మాట్లాడుకుంటాం..' అని అన్నాడు. దటీజ్ ప్రభాస్. పెద్దల పట్ల తను చూపించే మర్యాద ఇలా ఉంటుంది.' అని ఆయన అన్నారు. కన్నప్ప సినిమాను థియేటర్స్లో చూసి తన బిడ్డ విష్ణును ఆశీర్వదించాలని ఆయన కోరారు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను స్వయం కృషితోనే పైకొచ్చానని పేర్కొన్నారు. జీవితంలో భయం అనేది ఉండకూడదని ఆయన సూచించారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది..? అదే విద్యాలయాల్లో పిల్లలకు నేర్పిస్తున్నానని అన్నారు. మోహన్బాబు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లు ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండమని చెబుతున్నానని తెలిపారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప' సినిమా తీయాలనేది నా కల. ఈ సినిమా కోసం నాకు చాలామంది సహకరించారు. మా నాన్న నాకు దేవుడు. ఆయన లేకపోతే నేను లేను. ఈ సినిమాలో ఎవరెవరు నటించాలనేది కూడా అంతా శివాజ్ఞ ప్రకారమే జరిగింది. ఈ సినిమాలో నా మిత్రుడు ప్రభాస్కు (Prabhas) నటించాడు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మేము అడిగిన వెంటనే నాన్నగారి మీద ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో ప్రభాస్ వెంటనే ఒప్పుకొన్నాడు. ఈ కాలంలో స్నేహానికి విలువ ఉందంటే ప్రభాస్ ఒక ఉదాహరణ అని చెబుతున్నాను. వ్యక్తిగా ఆయన్ను అందరూ ప్రేమించండి.'అని చెప్పుకొచ్చారు. -
'కన్నప్ప'కు బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిక
మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం 'కన్నప్ప'కు అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన హర్డ్డిస్క్ మాయం కావడంతో మూవీ టీమ్ తీవ్ర ఆందోళన చెందింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా 'కన్నప్ప' మీద బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. తమ వర్గాన్ని కించపరిచేలా ఈ చిత్రంలో రెండు పాత్రలు ఉన్నాయిని వారు ఆరోపిస్తున్నారు.కన్నప్ప సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, గుంటూరులో నేడు (శనివారం) జరగనున్న కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ వివాదం గురించి బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'మంచు మోహన్బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటాం.' అని శ్రీధర్ హెచ్చరించారు.ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్బాబు, ఆర్.శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మించారు. -
పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటించి, భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనానికి గురవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అది దొరికిందా లేదా అనేది పక్కనబెడితే విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలోనే తెలుగులో రౌండ్ టేబుల్ పేరుతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కన్నప్ప బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)కన్నప్ప సినిమాకు బడ్జెట్ ఎంతయిందని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. కచ్చితంగా మూడంకెల ఖర్చు అయిందని విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే రూ.100 కోట్లు అయిందా? రూ.200 కోట్లు అయిందా? అని మరోసారి అడగ్గా.. ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన చిత్రాల కంటే తమ 'కన్నప్ప' ఎక్కువని పేర్కొన్నడు. అలానే ఈ ఏడాదిలోనే విడుదలయ్యే పవన్ కల్యాణ్ 'ఓజీ' కంటే తమ మూవీ బడ్జెట్ ఎక్కువని క్లారిటీ ఇచ్చాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు.. తన ఆఫీస్కి వస్తారు? ఎందుకు ఈ గొడవ? అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన మంచు విష్ణు.. గత కొన్నేళ్లుగా ఈ మూవీపైనే ఉన్నాడు. ఇందులో మంచు విష్ణు హీరో కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ తదితర స్టార్స్ ఇందులో నటించారు. దీంతో మూవీపై కాస్తంత బజ్ ఉంది. కానీ చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజైనప్పుడు మాత్రం కాస్త గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది. కానీ తర్వాత మరో టీజర్ విడుదల చేసినప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందని చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానున్న 'కన్నప్ప'.. విష్ణు కెరీర్ని ఎలా మారుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
నేను పెద్ద అందగాడినేం కాదు.. దేవుడిని ఒక్కటే కోరుకున్నా: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీనిలో పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మంచు విష్ణు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు చిన్నప్పటి నుంచి నటుడి కావాలనేది ఆశయమని తెలిపారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'నేను పుట్టినప్పటి నుంచి యాక్టర్ కావాలనేది నా ఆశయం. కానీ నా చిన్నప్పుడు నేనేం పెద్ద అందగాన్ని కాదు. ఇప్పుడు కూడా అందగాడినేమి కాదు. దేవుడిని ఒకటే అడిగేవాన్ని. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. దాన్ని నిలబెట్టుకుంటాను చెప్పేవాడిని. దేవుడు నాకు వరమిచ్చాడు.. ఈ జన్మ ఎత్తింతి నేను నటుడిగానే ఉండాలి. మిగతావన్నీ నాన్న ఇచ్చిన బాధ్యతలు. యూనివర్సిటీ నాకు రెస్పాన్సిబిలిటీ. నటనలో ఎలాగైతే ఉంటానో.. యూనివర్సిటీ, స్కూల్ నడపడం నాకు చాలా సులభం. నా తర్వాత కూడా మన యూనివర్సిటీ పేరు నిలిచిపోవాలి. రిలయన్స్, టాటా కంపెనీకి ఎలా బ్రాండ్ ఉందో మనందరికీ తెలుసు. రతన్ టాటా లేకపోయినా ఆ బ్రాండ్కు ఎప్పుడు వాల్యూ ఉంటుంది. అలా ప్రొఫెషనల్గా ఉండాలి' అని అన్నారు.కాగా.. కన్నప్ప చిత్రంలో ప్రభాస్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోహన్ లా్, అక్షయ్ కుమార్, మెహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నంచి శ్రీకాళహస్తి సాంగ్ను విడుదల చేయగా అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ పాటలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా నటించారు. నేను అందగాడ్ని కాదు.. కానీ నటించడానికే ఈ జన్మ ఎత్తా - #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/v49DQe5esw— Telugu FilmNagar (@telugufilmnagar) June 4, 2025 -
మరోసారి బాక్సాఫీస్ని ‘ఢీ’ కొట్టబోతున్న మంచు విష్ణు!
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ల హవా నడుస్తోంది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలు మళ్లీ థియేటర్స్లో సందడి చేస్తున్నాయి. గతవారం మహేశ్ బాబు ‘ఖలేజా’ మూవీ రీరిలీజైంది. ఇక ఈ వారం మంచు విష్ణు ‘ఢీ’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్గా నటించింది.2007లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర, బ్రహ్మానందం కామెడీ, సునీల్ ట్రాక్ ఆడియెన్స్ను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో విష్ణు కామెడీ టైమింగ్కు కాసుల వర్షం కురిసింది. విష్ణు మంచు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ‘ఢీ’ మూవీనీ జూన్ 6వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. దీని కంటే ముందే ‘ఢీ’తో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. మరి ఈ రీరిలీజ్ ‘కన్నప్ప’కు కలిసొస్తుందో లేదో చూడాలి. Join the party on 6th! pic.twitter.com/MEpa36lVAZ— Vishnu Manchu (@iVishnuManchu) June 2, 2025 -
కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మరోసారి స్పందించిన విష్ణు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీనిలో పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో హార్డ్ డిస్క్ మాయంపై మంచు విష్ణు మరోసారి స్పందించారు. ఆ హార్డ్ డిస్క్ ఇంకా తనవద్దకు రాలేదని చెప్పారు.విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప కోసం ముంబయిలో దాదాపు 8 కంపెనీలు వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఆన్లైన్లో కొంత భాగం పంపించారు. అది క్లారిటీగా రాలేదు. దీంతో రెండోసారి అప్లోడ్ చేశారు. ముందు జాగ్రత్త కోసమే వాళ్లు ఓ హార్డ్డిస్క్ కూడా పంపారు. మా ముగ్గురికి సంబంధించి ఏ పార్సిల్ వచ్చినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు ఎవరిది వాళ్లకు అందజేస్తారు. మా కంపెనీ జీఎస్టీ రిజిస్టర్ అడ్రస్ కూడా నాన్న ఇంటిదే ఉంటుంది. అక్కడికి పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే మహిళను తీసుకోమని చెప్పారట. ఆమెనే తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే.. వాళ్లిద్దరు మనోజ్ దగ్గర పని చేస్తారో.. లేదో మాకు తెలియదు. అతని వద్దే ఉంటారని మాత్రం తెలిసింది. హార్డ్డిస్క్ కూడా అక్కడే ఉందని తెలిసింది. ఇప్పటివరకైతే హార్డ్డిస్క్ నా చేతికి రాలేదు' అని అన్నారు. -
అందుకే కన్నప్ప సినిమాలో నటించలేదు : శివరాజ్ కుమార్
మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్కు రెడీ అవుతోంది. జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కన్నప్ప(Kannappa) టీమ్ బెంగళూరు వెళ్లింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shiva Rajkumar )తో కలిసి మంచు మోహన్ బాబు, విష్ణు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ సినిమా శివుడి పాత్రను పోషించమని తొలుత నన్నే అడిగారు. కానీ నా డేట్స్ కుదరకపోవడంతో నటించలేకపోయాను. ఈ సారి విష్ణు ఏం అడిగినా చేస్తాను. రెమ్యునరేషన్ నాకు సమస్యే కాదు’ అని చెప్పారు. కన్నప్ప చిత్రం గుఇరంచి మాట్లాడుతూ.. నాన్నగారు(రాజ్ కుమార్) నటించిన ‘శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ చిత్రంలో కన్నప్ప పాత్ర చేశాను. ఆయనతో కలిసి ‘కన్నప్ప’ పాత్ర చేయాలంటే మొదట భయం వేసింది. ఆ తర్వాత ఆ పాత్రపై నాకు ఇష్టం ఏర్పడింది. ముఖ్యంగా ‘నేనిల్ల నేనిల్ల’ పాట చేస్తున్నప్పుడు మరింత ఆసక్తి ఏర్పడింది. 37ఏళ్ల తర్వాత అదే కథతో విష్ణు సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అన్నారు.ఇక మోహన్ బాబు మాట్లాడుతూ.. ఏదైనా కన్నడ సినిమాలో నటిస్తే బాగుండేదని అని అనిపిస్తూ ఉండేది. అప్పట్లో అంబరీష్ను అడిగితే, నవ్వి ఊరుకునేవాడు. రాజ్కుమార్గారిని అడగాలంటే ధైర్యం సరిపోలేదు. ఆయన తనయుడు శివరాజ్ కుమార్ని ఒక కోరిక కోరుతున్నాను. ఆయన నటించే చిత్రంలో విలన్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఇదే విషయంపై రాజ్ కుమార్ స్పందిస్తూ..‘మోహన్ బాబు గొప్ప నటుడు. ఆయన నా చిత్రంలో విలన్గా నటిస్తానని అడిగారు కానీ.. నేను ఆ పాత్ర ఇవ్వను. ఒక అందమైన అన్నయ్య పాత్ర ఇస్తా. హై క్వాలిటీ రోల్ అది. నేను ఆయనతో ఫైట్ చేయాలనుకోవడం లేదు’అని నవ్వుతూ అన్నారు. -
కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మనోజ్ టార్గెట్గా విష్ణు కామెంట్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈ విషయం బయటికి రావడంతో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు కూడా నమోదు చేశారు. హార్డ్ డిస్క్ ఎవరూ మాయం చేశారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హార్డ్ డిస్క్ మాయంపై హీరో మంచు విష్ణు స్పందించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు.మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని మంచు విష్ణు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే వాళ్లుగా తీసుకున్నారా? ఇంకెవరైనా వారితో చేయించారా? అన్నది త్వరలోనే తెలుస్తుందని అన్నారు. హార్డ్ డిస్క్ బయటకు వెళ్లిన విషయమై పోలీసుల ద్వారా రిపోర్టర్కు తెలియడం వల్లే బయటకొచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెప్పడం తనకు ఇష్టం లేదని మంచు విష్ణు వెల్లడించారు. కలర్ గ్రేడింగ్కు సంబంధించి ముంబయిలో రెడీ అయితే.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు. మొదటిసారి పంపిన కాపీ సరిగా రాకపోవడంతో ఆ కంపెనీ హార్డ్ డ్రైవ్లో ఆ సీన్స్ను పెట్టి కొరియర్ చేసిందని విష్ణు అన్నారు.మంచు విష్ణు మాట్లాడుతూ..' మేం రెండు అడ్రస్లు మెయింటెన్ చేస్తాం. అందులో ఆఫీస్ అడ్రస్ ఒకటి.. మరొకటి జీఎస్టీ రిజిస్ట్రార్ పేరిట ఉంటుంది. ఇది ఫిల్మ్ నగర్లోని నాన్న ఇంటి అడ్రస్. మా ముగ్గురికి సంబంధించిన ఏదైనా ఇక్కడికే వస్తుంది. అక్కడ ఉండే మా మేనేజర్లు ఎవరిది వాళ్లకు అందజేస్తారు. దాదాపు 15 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. కానీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ వచ్చిన సమయంలో రఘు అనే అతను అక్కడికి వచ్చాడు. ఆ ప్యాకెట్ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. ఇది జరిగి దాదాపు నెల రోజులైంది. నాకు తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించలేదు. కొరియర్ తీసుకున్న వాళ్లు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నారో? లేదో నాకు తెలియదు. ఎవరైనా చెప్తే వచ్చి తీసుకెళ్లారా? వాళ్లే స్వయంగా తీసుకున్నారో తెలియాల్సి ఉంది' అని అన్నారు. కాగా.. కన్నప్ప మూవీ జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. Actor Vishnu Manchu about the #Kannappa harddisk Missing:“The accused mentioned in FIR , Raghu & Chaithra was working under My younger brother Manoj Manchu . There is no request from production team for the harddisk to send to the VFX team; but we don't know why they sent .… pic.twitter.com/T5Kyt4aWZ8— Christopher Kanagaraj (@Chrissuccess) May 30, 2025 -
విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!
మంచు ఫ్యామిలీలో చాన్నాళ్లుగా గొడవలు సాగుతున్నాయి. వీటి గురించి మళ్లీ చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నిరోజులుగా మాత్రం విష్ణు, మనోజ్ సైలెంట్గానే ఉన్నారు. మనోజ్ కీలక పాత్రలో నటించిన 'భైరవం' సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ మనోజ్.. 'శివయ్య' అంటూ కామెంట్ చేశాడు. తర్వాత సారీ చెప్పాడు. ఇప్పుడు మరోసారి అన్న విష్ణుని రెచ్చగొట్టేలా ఓ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది.(ఇదీ చదవండి: అపస్మారక స్థితిలో 'హరిహర వీరమల్లు' నిర్మాత.. నిజమేంటి?)'భైరవం' రిలీజ్ వేళ తండ్రితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మనోజ్.. 'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' అని మోహన్ బాబుతో కలిసున్న ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో కేవలం మోహన్ బాబు-మనోజ్ మాత్రమే ఉండటంతో ఇదేదో విష్ణుని రెచ్చగొట్టేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.చాలా ఏళ్లుగా సినిమాలు చేయడం మానేసిన మంచు మనోజ్.. 'భైరవం' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇందులోబెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ హిట్ మూవీ 'గరుడన్'కి రీమేక్ ఇది. అలానే తేజ సజ్జా హీరోగా నటించిన 'మిరాయ్' అనే పాన్ ఇండియా మూవీలో మనోజ్ విలన్గా నటించాడు. ఇది సెప్టెంబరులో రిలీజ్ కానుంది. మరోవైపు మంచు విష్ణు కూడా 'కన్నప్ప' మూవీతో చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూన్ 27న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు) View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
భైరవం మూవీ రివ్యూ
టైటిల్: భైరవంనటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అతిధి శంకర్, ఆనంది , దివ్య తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్నిర్మాత: కేకే రాధామోహన్దర్శకత్వం: విజయ్ కనకమేడలసంగీతం: శ్రీచరణ్ పాకాలసినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతంఎడిటర్: చోటా కె ప్రసాద్విడుదల తేది: మే 30, 2025బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోల ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఈ మధ్యకాలంలో వీరి నుంచి సినిమాలే రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్ బస్టర్ 'గరుడన్’ తెలుగు రీమేకే ఈ భైరవం. టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కించామని మేకర్స్ చెప్పారు. మరి ఆ మార్పులలో తెలుగు ఆడియన్స్ని మెప్పించారా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. (Bhairavam Review)భైరవం కథేంటంటే..?తూర్పు గోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి(మనోజ్), వరద(నారా రోహిత్),శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ(జయసుధ) మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. (Bhairavam Review)మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ(ఆనంది) ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శీను ఎలా రక్షించాడు. గజపతి గురించి శీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి. అమ్మవారి పూనకం వచ్చే శీను.. న్యాయం కోసం చివరకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిన తర్వాత రీమేక్ చిత్రాలు రావడం తగ్గిపోయాయి. ఓ మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే ఓటీటీల పుణ్యమా అని అన్ని ప్రాంతాల ప్రేక్షకులు చూసేస్తున్నారు. అలాంటి సమయంలో తమిళ బ్లాక్ బస్టర్ గరుడన్ని తెలుగులో రీమేక్ చేశాడు దర్శకుడు విజయ్ కనకమేడల. ఇది ఓ రకంగా పెద్ద సాహసమే. కానీ దానికి తగిన న్యాయం చేయలేకపోయాడు దర్శకుడు. ఒరిజినల్ సినిమాలోని ఎమోషన్ని ఇందులో క్యారీ చేయలేకపోయాడు. కథలో ఆయన చేసిన చిన్న చిన్న మార్పులే దీనికి కారణం. ముగ్గురు హీరోలను మేనేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు కానీ సెంటిమెంట్స్ని పండించే విషయంలో తడబడ్డాడు.ఒరిజినల్లో బెల్లంకొండ పాత్రను సూరి పోషించాడు. ఆయనకున్న ఇమేజ్కి ఆ పాత్ర కొత్తగా అనిపించింది. కానీ బెల్లంకొండకు ఇక్కడ ఉన్న ఇమేజ్ వేరు. దీంతో ఆ పాత్రలో ఆయన ఒదిగినట్లుగా కాకుండా నటించినట్లుగానే అనిపిస్తుంది. అలాగే మనోజ్ పాత్ర కూడా. ముగ్గురు హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. అమ్మవారి ట్రాక్ని కూడా సరిగా వాడుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. గుడి నేపథ్యంతో పాటు ముగ్గురు హీరోల పరిచయం తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. శీను-వెన్నెల(అతిధి శంకర్) లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక సెకండాఫ్లో కథనం సాగదీసినట్లుగా ఉంటుంది. గరుడన్ చూసిన వారికి ట్విస్టులు కూడా తెలుస్తాయి కనుక.. అవి కూడా ఆకట్టుకోలేవు. ఇక గరుడన్ చూడని ప్రేక్షకులకు మాత్రం కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్..ముగ్గురూ టాలెంటెడ్ నటులే. మంచి పాత్రలు పడాలేకానీ రెచ్చిపోయి నటిస్తారు. భైరవంలోనూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్కి ఈ సినిమా ప్లస్ అవుతుందని చెప్పాలి. శీను పాత్రలో ఆయన జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే పూనకాల సీన్లో అదరగొట్టేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న గజపతి వర్మగా మనోజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో బాగా నటించాడు. ఇక నారా రోహిత్ తన పాత్రకి న్యాయం చేశాడు. హీరోయిన్లు అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. వెన్నెల కిశోర్ , జయసుధతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
కన్నప్ప హార్డ్ డిస్క్ చోరీ.. కీలక విషయాలు వెల్లడించిన నిర్మాత!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్కు ముందు కష్టాలు తప్పేలా లేవు. ఈ మూవీకి సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ చోరీకి గురి కావడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సైతం ఓ లేఖను విడుదల చేసింది. మూడు నెలల క్రితమే హార్డ్ డ్రైవ్ పోయినట్లు నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.తమ సినిమా హార్డ్ డ్రైవ్ కోసం ముంబయి కంపెనీని నిర్మాత సంప్రదించారు. అయితే తాము మార్చి మొదటి వారంలోనే హైదరాబాద్కు డ్రైవ్ పంపించామని కంపెనీ ప్రతినిధులు ఆయనతో అన్నారు. కొరియర్ ద్వారా హార్డ్ డ్రైవ్ పంపిస్తే రఘు డెలివరీ తీసుకున్నారని సదరు కంపెనీ తెలిపింది. అయితే తానేలాంటి డ్రైవ్ తీసుకోలేదని రఘు నిర్మాతతో అన్నారు. దీంతో వెంటనే హార్డ్ డిస్క్ మిస్సింగ్ కావడంపై నిర్మాత పోలీసులను ఆశ్రయించారు. అందులో అత్యంత కీలకమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ మొత్తం ఉన్నాయని తెలిపారు. ఆ డ్రైవ్ మిస్సయితే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అన్నారు. సినిమా విడుదల కంటే ముందు ఏదైనా బయటికి వస్తే పెద్ద నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతతో పాటు పలువురి దగ్గర నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. -
మంచు విష్ణు కన్నప్ప.. శ్రీకాళహస్తి ఫుల్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన భక్తి సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీ నుంచి శ్రీకాళహస్తి అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. A song filled with devotion and power! 🔥 Sri-Kala-Hasti lyrical from #Kannappa🏹 is OUT NOW! 🎶✨ Feel the rhythm, embrace the energy! Watch & enjoy!Har Har Mahadev 🔱Har Ghar Mahadev 🔥#SriKalaHastiLyricalSong #Kannappa #Stalapurana #OmNamahShivaya🔗Telugu:… pic.twitter.com/e4ebn1Ypoh— Kannappa The Movie (@kannappamovie) May 28, 2025 -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు మంచు విష్ణు
-
'కన్నప్ప మూవీపై పెద్ద కుట్ర'.. నిర్మాణ సంస్థ సంచలన లేఖ!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడంపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ మూవీకి సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్ను ఆన్లైన్లో లీక్ చేసే కుట్ర జరుగుతోందని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (24 Frames Factory) నిర్మాణ సంస్థ ఆరోపించింది. కన్నప్ప హార్డ్డిస్క్ చోరీకి గురవడంపై వచ్చిన రూమర్స్పై కూడా సంస్థ స్పందించింది.నిర్మాణ సంస్థ తన నోట్లో రాస్తూ..' కన్నప్పలోని ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్తో పాటు, కీలకమైన వీఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ ట్రాన్సిట్ సమయంలో చోరీకి గురైంది. ఈ హార్డ్ డిస్క్ ముంబయిలోని హైవ్ స్టూడియోస్ నుంచి మా నిర్మాణ కార్యాలయానికి డెలివరీ చేస్తుండగా చోరీ చేశారు. హార్డ్డిస్క్ చోరీపై నాలుగు వారాల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కన్నప్ప సినిమా ఫుటేజ్ ఆన్లైన్లో లీక్ కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ఈ చోరీకి పాల్పడిన వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కాదు. దీని వెనుక ఎవరున్నారో తమకు తెలుసని ప్రొడక్షన్ హౌస్ తన లేఖలో పేర్కొంది. కాగా.. అంతకుముందు ఈ ఘటనపై ఆ సినిమా హీరో మంచు విష్ణు స్పందింటారు. జటాజూటధారీ.. నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ హరహరమహదేవ్ అంటూ ట్వీట్ చేశారు.OFFICIAL STATEMENT FROM 24 FRAMES FACTORYREGARDING THE THEFT OF CRUCIAL KANNAPPA FOOTAGEIn response to circulating rumours and speculation, 24 Frames Factory is issuing this official statement to bring clarity to the situation.A hard drive containing a pivotal action…— 24 Frames Factory (@24FramesFactory) May 27, 2025 -
నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా తీయడం మాటేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల కారణంగా ఈ సినిమా కాస్త సైడ్ అయింది. కానీ మరో నెలలో రిలీజ్ పెట్టుకుని, ఇప్పుడు హార్ట్ డిస్క్ దొంగతనం జరగడంతో సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.దొంగతనానికి గురైన హార్డ్ డిస్క్లో ప్రభాస్ సీన్లు ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరోవైపు సీజీ వర్క్స్కి సంబంధించిన దాదాపు 90 నిమిషాల కంటెంట్ ఇందులో ఉందని అంటున్నారు. అసలు ఇంత ముఖ్యమైన హార్డ్ డిస్క్ని ముంబై నుంచి కొరియర్ లో పంపడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మాయం కావడం, దీంతో మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఇప్పుడు ఈ విషయాలపై స్వయంగా మంచు విష్ణు స్పందించాడు. మొత్తంగా కాకుండా సింపుల్గా ఒక్క ఫొటో పోస్ట్ చేశాడు. అందులో..'జటాజూఠదారీ నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?' అని ట్వీట్ చేశాడు. అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటనేది ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇవన్నీ చూస్తుంటే సినిమా వాయిదా పడటం గ్యారంటీ అనిపిస్తుంది.ఈ సంగతి అలా ఉంచితే 'కన్నప్ప' ఓటీటీ డీల్ కూడా ఇంకా సెట్ కాలేదని, అంతా చూస్తుంటే జూన్ 27న చెప్పిన తేదీకి థియేటర్ విడుదల కావడం కష్టమేమో అనిపిస్తుంది. మూవీ టీమ్ మాత్రం చెప్పిన డేట్కి రావడం పక్కా అని అంటున్నారు. మరి నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి ఇక?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్)#HarHarMahadevॐ #kannappa pic.twitter.com/jKNfIOTrQH— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025 -
మంచు విష్ణు కన్నప్ప.. ఆయన కుమార్తెల సాంగ్ ప్రోమో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: కన్నప్పలో ప్రభాస్.. రెబల్ స్టార్ పాత్రపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్)ఈ మూవీ శ్రీకాళ హస్తి అనే లిరికల్ సాంగ్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 28న ఈ పాటను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తాజాగా ఈ సాంగ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. My little munchkins! They are blessed by Lord Shiva to be singing the Stalapurana of SriKalaHasti temple. Cannot wait for all of you to hear the song. #HarHarMahadev https://t.co/dDPjlxixO1#kannappa— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025 -
Kannappa: హార్డ్డ్రైవ్లో ప్రభాస్ యాక్షన్ సీన్స్.. లీకైతే భారీ నష్టమే!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa)కు వరుస కష్టాలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది కానీ.. పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ మిస్ అయింది. దీనిపై చిత్రబృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.హార్డ్ డిస్క్లో 1.30 గంటల సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంటెంట్ను లీక్ చేస్తే మాత్రం సినిమాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇందులో సినిమాకు కీలకమైన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా ప్రభాస్కు సంబంధించిన యాక్షన్ సీన్లన్ని ఈ హార్డ్ డిస్క్లోనే ఉన్నాయట. సినిమా బృందం ముందు నుంచి ప్రభాస్ పాత్ర, లుక్ విషయంలో గోప్యత వహించాయి. ఆయన లుక్ని మాత్రమే రిలీజ్ చేసి..సినిమాలో ఆయన పాత్రలో ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్తో భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇద్దామనే ప్లాన్తో ప్రమోషన్స్లో కూడా ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కానీ ఇప్పుడు హార్డ్డ్రైవ్ మిస్ అవ్వడంతో మేకర్స్ భయానికి గురవుతున్నారు. ఒకవేళ ఆ వీడియోని ఆన్లైన్లో లీక్ చేస్తే.. ప్రభాస్ యాక్షన్స్ సీన్స్ అన్నీ వైరల్ అయిపోతాయి. దీంతో సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు సినిమాలో సగ భాగం వరకు ఈ హార్డ్ డ్రైవ్లోనే ఉందట. బ్యాకప్ ఉంటుంది కాబట్టి దొంగిలించిన వాళ్లు అది ఇవ్వకపోయినా నష్టమేమి ఉండదు. కానీ ఆన్లైన్లో లీక్ చేస్తే మాత్రం ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మరి పోలీసుల చొరవతో ఈ హార్డ్డ్రైవ్ మళ్లీ మేకర్స్ చేతికి అందుతుందో లేదో చూడాలి. -
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన వీఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు (హైవ్ స్టూడియోస్) కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ను డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిలింనగర్లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు. డీటీడీసీ డెలివరీ రికార్డుల ప్రకారం పార్శిల్ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకుంది. పార్శిల్ అందుకున్న ఆఫీస్బాయ్ రఘు దానిని చరిత అనే యువతికి అప్పగించాడు. కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్డ్రైవ్ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్పాడు. అయితే చరిత హార్డ్డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోంది. కొందరు వ్యక్తుల మార్గదర్శకత్వంలో పని చేస్తున్న చరిత సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోయిందంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రెడ్డి విజయ్కుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా తమ సినిమా ప్రాజెక్టుకు తీవ్ర అంతరాయం కలిగించిందన్నారు. సదరు హార్డ్డ్రైవ్లో కన్నప్ప చిత్రానికి సంబంధించి విడుదల చేయని, గోప్యమైన, అత్యంత సున్నితమైన డేటా ఉందన్నారు. ఈ కంటెంట్ను లీక్ చేయడం లేదా, డిలీట్ చేయడం ద్వారా తమ సంస్థ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే హార్డ్డ్రైవ్ను రికవరీ చేసి తమకు అప్పగించాలని కోరారు. -
కన్నప్పలో ప్రభాస్.. రెబల్ స్టార్ పాత్రపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రీ ప్రొడక్షన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మంచు విష్ణు.. ప్రభాస్ రోల్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్ 30 నిమిషాల పాటు అతిథి పాత్రలో కనిపిస్తారని మంచు విష్ణు తెలిపారు. కన్నప్ప 3 గంటల 10 నిమిషాల రన్టైమ్ను కలిగి ఉందని అన్నారు. కన్నప్ప పరివర్తనలో కీలక పాత్ర పోషించే దైవిక వ్యక్తిగా ప్రభాస్ నటించారని వెల్లడించారు. ఈ సినిమాను ఆధ్యాత్మిక మార్గంలో బయలుదేరే ఒక నాస్తికుడి గురించిన పౌరాణిక కథగా తెరకెక్కించినట్లు తెలిపారు. ప్రభాస్కు మోహన్ బాబుతో ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయని వివరించారు. మోహన్ లాల్ పాత్ర 15 నిమిషాలకే పరిమితం అయినప్పటికీ.. బలమైన భావోద్వేగాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు, మోహన్లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రలలో కనిపించనున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి శ్రీ-కాళహస్తి అనే పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్ మే 28న విడుదల కానుంది. ఈ భక్తి గీతంలో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
‘కన్నప్ప’ టీమ్కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్
‘కన్నప్ప’చిత్ర బృందానికి మంచు మనోజ్(Manchu Manoj) క్షమాపణలు చెప్పారు. భైరవం సినిమా ఈవెంట్లో ‘శివయ్యా..’ అనే డైలాగును వేరేలా వాడడం తప్పని ఒప్పుకున్నాడు. ఒకడు చేసిన తప్పుకు సినిమా మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని..ఏదో ఎమోషనల్గా అలా అన్నానని చెబుతూ కన్నప్ప టీమ్కు సారీ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిదంటే..శివయ్యా... అని పిలిస్తే రాడుమంచు మనోజ్ ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఏపీలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఇబ్బందులు ఉన్న సమయంలో ఆ పరమ శివుడే డైరెక్టర్ విజయ్ రూపంలో వచ్చి భైరవం సినిమా ఆఫర్ ఇచ్చాడని చెబుతూ.. ‘ శివుడిని శివయ్యా.. అని పిలిస్తే రాడు.. ఆయన్ని మనసారా తలచుకుంటే మా దర్శకుడి రూపంలోనో.. మీ అందరి రూపంలో వస్తాడు’ అంటూ పరోక్షంగా కన్నప్ప సినిమాలో మంచు మనోజ్ చెప్పిన శివయ్యా డైలాగ్పై కౌంటర్ వేశాడు. అదికాస్త నెట్టింట బాగా వైరల్ అయింది.సినిమా ఒకడిది కాదు.. తాజాగా శివయ్య కామెంట్స్పై మంచు మనోజ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శివయ్యా అనే డైలాగ్పై సెటైర్లు వేయడం తప్పని ఒప్పుకున్నాడు. ‘సినిమా అంటే ఒక్కడికాదు.. అందులో ఎంతో మంది పని చేస్తారు.. ఆ డైరెక్టర్,మ్యూజిక్ డైరెక్టర్..ఇలా ఎంతో మంది కష్టపడతారు. మోహన్ లాల్.. ప్రభాస్.. ఇలా అందరూ కష్టపడి సినిమా చేశారు.. ఒక్కరికి కోసం సినిమాను విమర్శించడం తప్పే. ఒక సినిమా వాడిగా నేను అలా అనకూడదు. ఎప్పుడైనా ఏదైనా అని ఉంటే.. కన్నప్ప టీంకి క్షమాపణలు కోరుతున్నాను. అవి ఎమోషనల్గా చేసిన కామెంట్సే తప్ప..మరో ఉద్దేశం నాకు లేదు. కన్నప్ప సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని మనోజ్ అన్నారు.భైరవం విషయానికొస్తే.. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. -
Kannappa: కిరాతగా మోహన్ లాల్.. స్పెషల్ గ్లింప్స్ అదిరింది!
మోహన్లాల్(Mohanlal ) పుట్టినరోజు (మే 21) సందర్భంగా ‘కన్నప్ప’(Kannappa) చిత్ర బృందం ఒక అద్భుతమైన స్పెషల్ గ్లింప్స్ను విడుదల చేసింది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్లో మోహన్లాల్ కిరాత అనే దైవిక శక్తితో ముడిపడిన పాత్రలో నటిస్తున్నారు. గ్లింప్స్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.ఇక కన్నప్ప విషయానికొస్తే.. విష్ణు మంచు హీరోగా నటించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్బాబు, ఆర్.శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు పోషించారు.ఆవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. -
సాహసం శ్వాసగా సాగిపో...
లక్ష్య సాధన కోసం అడవికి వెళ్తున్నారు హీరోలు. ఒకరిది నిధి అన్వేషణ అయితే, మరొకరిదిపోరాటం. ఇంకొకరిది ఆధిపత్యం... ఇలా తెలుగు హీరోలు తమ తమ లక్ష్య సాధన కోసం అడవి బాట పట్టారు. సాహసమే శ్వాసగా ముందుకు సాగుతున్నారు. ఇలా అడవి మాదే... శత్రువుల వేట మాదే అంటున్న కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేద్దాం.ఫారెస్ట్లో అడ్వెంచర్ ఫారెస్ట్లో మహేశ్బాబు ఏదో నిధి కోసం అన్వేషించనున్నారట. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రకథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. సో... ఈ సినిమాలోని మేజర్ కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాలు ఫారెస్ట్ నేపథ్యంతోనే ముడిపడి ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.అలాగే ఇటీవల ఈ సినిమాకు చెందిన ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో పూర్తయింది. ఓ భారీ సెట్లో ఈ షెడ్యూల్ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో అడవి బ్యాక్డ్రాప్లో ఉండే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఇంకా ఈ సినిమా షూటింగ్కు ముందు రాజమౌళి కెన్యా వెళ్లి, అక్కడ కొన్ని లొకేషన్స్ను చూసి వచ్చారు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ విదేశీ అడవుల్లోనూ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్బాబు, రాజమౌళి వేసవి బ్రేక్లో ఉన్నారు. ఈ బ్రేక్ పూర్తవగానే మళ్లీ ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారు. జూన్ రెండో వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కావొచ్చు.నెక్ట్స్ షెడ్యూల్ కోసం వారణాసిని తలపించేలా హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ను తీర్చిదిద్దుతున్నారని, ఈ సెట్లోనే ఈ సినిమా షూటింగ్ ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్, దేవ కట్టా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇంగ్లిష్ డైలాగ్స్ కోసం ఓ హాలీవుడ్ రైటర్ను నియమించుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుందని సమాచారం.వీరమల్లు అన్వేషణ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చారిత్రాత్మక చిత్రంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేయగా, పంచమి అనేపాత్రలో హీరోయిన్గా నిధీ అగర్వాల్ నటించారు. కాగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు అడవి నేపథ్యంతో ఉంటాయని తెలిసింది. ఓ నిధి అన్వేషణ కోసం వీరమల్లు తన బృందంతో కలిసి అడవికి వెళ్తాడని, ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని ఫిల్మ్నగర్ భోగట్టా. ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం జూన్ 12న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఏమ్ రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అడవిలో డ్రాగన్ ఫారెస్ట్లో అదిరిపోయే చేజింగ్ ఫైట్ చేస్తున్నారు హీరో ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇటీవల కర్ణాటక లొకేషన్స్లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణలో ఓ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ యాక్షన్ సీన్ తీశారని తెలిసింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఈ ఫారెస్ట్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్గా ఉంటుందని, హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఈ యాక్షన్ సీక్వెన్ని డిజైన్ చేశారని తెలిసింది. కాగా లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్కి హాజరయ్యారు ఎన్టీఆర్, అలాగే ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. సో... ఈ రెండు కారణాల వల్ల ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు.బర్త్ డే సెలబ్రేషన్స్ పూర్తి కాగానే ఎన్టీఆర్ తిరిగి ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లోపాల్గొంటారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, రష్మికా మందన్నా ఓ కీలకపాత్ర చేయనున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ విలన్గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాలో కొన్ని ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ సన్నివేశాలు ఉన్నట్లుగా చూశాం. ఇటీవల ‘దేవర 2’ సినిమాను ఓ సందర్భంగా కన్ఫార్మ్ చేశారు ఎన్టీఆర్. ఇలా వచ్చే ఏడాది ‘దేవర 2’ సినిమా కూడా సెట్స్పైకి వెళుతుందని ఊహింవచ్చు. సో... ‘దేవర 2’లోనూ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని ఊహించవచ్చు.అడవిలో జాతర రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘మాస్ జాతర’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణ్ భేరి అనే పవర్ఫుల్పోలీస్ ఆఫీసర్పాత్రలో రవితేజ కనిపిస్తారు. కాగా ఈ సినిమాలో కూడా అడవి నేపథ్యంతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. అరకు,పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల లొకేషన్స్లో ‘మాస్ జాతర’ సినిమా చిత్రీకరణ జరిగిందని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా టాకీపార్ట్ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్స్ని కూడా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘మాస్ జాతర’ సినిమా జూలై చివర్లో లేదా ఆగస్టులో రిలీజ్ కావొచ్చు.భక్త కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ సినిమాలో తిన్నడుపాత్రలో కనిపిస్తారు విష్ణు మంచు. దైవత్వాన్ని నమ్మని తిన్నడు శివుడికి ఎలా వీరభక్తుడు అయ్యాడు? భక్త కన్నప్పగా ఎలా ప్రఖ్యాతి చెందాడు? అనే అంశాల ఆధారంగా ‘కన్నప్ప’ సినిమా ఉంటుందని తెలుస్తోంది. కథ రీత్యా ఈ సినిమా మేజర్పార్ట్ అంతా అడవి నేపథ్యంతోనే ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్పోస్టర్స్.. వంటి ప్రమోషనల్ కంటెంట్... ‘కన్నప్ప’ సినిమా ఫారెస్ట్ నేపథ్యంతోనే సాగుతుందన్న విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తున్నాయి. ప్రీతీ ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. మోహన్బాబు, మోహన్లాల్, ఆర్. శరత్కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మాజీ, రఘుబాబు తదితరులు ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మోహన్బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.నిధి వేట నిధి వేటలో ఉన్నారట అర్జున్. నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వృషకర్మ’తోపాటు మరో రెండు టైటిల్స్ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంలో నిధిని అన్వేషించే అర్జున్పాత్రలో నాగచైతన్య, పురావస్తు శాస్త్రవేత్తగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ఇలా నిధి అన్వేషణలో భాగంగా అర్జున్ ఫారెస్ట్కి వెళతాడట. అక్కడ ఫారెస్ట్లో కొన్ని సాహసాలు చేస్తాడట. ఈ సినిమా కోసం ఓ గుహ సెట్ను రెడీ చేశారు మేకర్స్. ఈ గుహ సెట్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని, ఈ సీక్వెన్స్ దాదాపు ఇరవై నిమిషాలు ఉంటుందని తెలిసింది. బాపినీడు సమర్పణలో సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే లేదా జూన్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అరణ్యంలో భోగి హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘భోగి’. 1960 నేపథ్యంలో సాగే ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ హయతి మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ప్రత్యేకమైన విలేజ్ సెట్ను ఏర్పాటు చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు, కొంత భాగం అడవి నేపథ్యంలోనే ఉంటాయని తెలిసింది. ఈ మూవీ కోసం శర్వానంద్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితియార్ధంలో రిలీజ్ కావొచ్చు.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కిష్కింధపురిలో ఏం జరిగింది? ‘కిష్కింధపురికి’ ప్రేక్షకులను తీసుకు వెళ్లనున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మిస్టరీ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధపురి’. ఇటీవల ‘కిష్కింధపురి’ సినిమా గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ రాత్రివేళ అడవిలోకి వెళ్లడం, అక్కడ వీరిద్దరూ ఎందుకోసమో వెతుకాలడంట వంటి విజువల్స్ కనిపించాయి. చూస్తుంటే... ‘కిష్కింధపురి’ మేజర్ సీన్స్లు అడవి నేపథ్యంలో ఉంటాయని, అది కూడా రాత్రివేళ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనీ తెలుస్తోంది.అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘హైందవ’ అనే మూవీ రూపొందుతోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ సినిమాలోనూ ఫారెస్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయని తెలిసింది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది.కింగ్డమ్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరుగుతుందని, ఫ్లాష్ బ్యాక్ టైమ్లైన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అడవి నేపథ్యంతోనే ఉంటాయని ఫిల్మ్ నగర్ సమాచారం. పైగా ‘కింగ్డమ్’ సినిమా టీజర్లోనూ అడవిని తలపించే కొన్ని షాట్స్ కనిపించాయి. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 4న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇలా అడవి నేపథ్యం, అడవి సన్నివేశాలు కీలకంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం
మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్ తో తీసిన సినిమా 'కన్నప్ప'. జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లు మొదలుపెట్టిన విష్ణు.. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ తన కుటుంబం విషయాలు, ప్రభాస్ తో బాండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇవి హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)ప్రభాస్ గురించి మాట్లాడిన విష్ణు.. 'నేను, ప్రభాస్ బాగా క్లోజ్. అతడు ఎంత గొప్ప నటుడో అతడికి కూడా తెలియదు. ప్రభాస్ లా చాలా తక్కువమంది ఉంటారు. ఇంత పెద్ద స్టార్ అయ్యాక కూడా సింపుల్ గా ఉండటం అతడి గొప్పతనం. మేం ఎప్పటికీ సోదరులమే''రక్తం పంచుకుని పుట్టినవాళ్లే ఈ రోజు నా పతనాన్ని కోరేటప్పుడు.. ప్రభాస్-నేను రక్తం పంచుకుని పుట్టలే కానీ నా మంచి కోరి, నా సక్సెస్ కోరుతున్నాడు. ఎన్ని జన్మలకైనా నేను అతడికి రుణపడి ఉంటాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు.తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. 'మా నాన్న ఆనందమే నాకు ముఖ్యం. దాని కోసం ఏదైనా చేస్తాను. ఆయన సంతోషంగా లేకపోతే నాకు ఏది అక్కర్లేదు. ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చినరోజు నేను బతికున్నా చచ్చినట్లే. ఆ రోజు ఎప్పటికీ తీసుకురాను. ఆయన పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తాను. కానీ చెడగొట్టేలా ఎప్పుడు చేయను' అని విష్ణు తన కుటుంబ సమస్యల గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్) -
‘కన్నప్ప’ కామిక్ మూడో ఎపిసోడ్ రిలీజ్!
మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటించగా, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటలు పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి. యూఎస్లో విష్ణు మంచు స్టార్ట్ చేసిన కన్నప్ప ప్రమోషనల్ టూర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కన్నప్ప కథను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కామిక్ బుక్స్ రూపంలోకి విష్ణు మంచు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.కామిక్ సిరీస్లోని మొదటి రెండు ఎపిసోడ్లకు అఖండ స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడో అధ్యాయాన్ని విడుదల చేశారు. ఈ చివరి ఎపిసోడ్ తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తుంది. అతను ఒకప్పుడు దైవత్వం ఆలోచనను తిరస్కరిస్తాడు.. కానీ చివరికి శివుని భక్తుడిగా మారుతాడు. కన్నప్పగా మారడానికి అతని అద్భుతమైన ప్రయాణాన్ని ఈ మూడో అధ్యాయం వివరిస్తుంది. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుంది.ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ విజువల్స్, వీడియో అందరినీ అబ్బుర పరిచేలా ఉంది. ఇంతకు మించి అనేలా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీం చెబుతోంది. విజువల్ ఎఫెక్ట్స్లో జాప్యం వల్లే ఈ మూవీని జూన్ 27కి వ్యూహాత్మకంగా మార్చారు. -
మధుసూదన్రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు విష్ణు
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్రావు కుటుంబ సభ్యులను మా అధ్యక్షులు, సినీ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలోని వారి ఇంటికి చేరుకున్న విష్ణు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం.. దాడి జరిగిన తీరును మధుసూధన్ సతీమణి కామాక్షి, పిల్లలను అడిగి విష్ణు తెలుసుకున్నారు. కావలి తమ అమ్మగారి ఊరు కావడంతో ఆ ప్రాంతంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.తాను మాట్లాడాలనుకున్నది వారితో మాట్లాడానని విష్ణు అన్నారు. మధుసూదన్రావు కుటుంబ సభ్యులకు ఎలాంటి భరోసా ఇచ్చాను అనేది తమ పర్సనల్ అని అన్నారు. ప్రస్తుతం తాను మీడియాతో పెద్దగా మాట్లాడలేనని చెప్పి.. ఈ విషయంలో తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దంటూ అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. వారిలో కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా ఉన్నారు. -
'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు
శ్రీ విష్ణు (Sree Vishnu).. వరుస హిట్స్తో ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు సింగిల్ సినిమా (Single Movie)తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకునే ప్లాన్లో ఉన్నాడు. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే బ్యూటీ ఇవానా హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.హర్టయిన మంచు విష్ణు!ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ను రీక్రియేట్ చేశారు. నందమూరి బాలకృష్ణ.. హనీరోజ్తో మలయాళం మాట్లాడేందుకు ప్రయత్నించినదాన్ని సినిమాలో వాడేశారు. అలాగే మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్ను కూడా సింగిల్ మూవీలో రిపీట్ చేశారు. ఇది చూసిన కన్నప్ప టీమ్ హర్టరయ్యారని తెలిసి శ్రీ విష్ణు.. వారికి సారీ చెప్పాడు.మీమ్స్ వాడాం..శ్రీ విష్ణు మాట్లాడుతూ.. సింగిల్ సినిమా ట్రైలర్లోని కొన్ని డైలాగులకు కన్నప్ప టీమ్ (Kannappa Movie) హర్టయిందని తెలిసింది. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. మేం కావాలని చేయలేదు. కానీ, అది తప్పుగా జనాల్లోకి వెళ్లడం వల్ల ఆ డైలాగ్స్ను డిలీట్ చేశాం. సినిమాలో కూడా ఆ డైలాగ్స్ ఉండవు. ఎవరినీ హర్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఈ జనరేషన్లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్, సినిమా క్లిప్పింగ్స్ కానీ, బయట ఎక్కువ వైరల్ అయ్యేవాటిని తీసుకుని దాన్ని రీక్రియేట్ చేశాం.క్షమించండి: శ్రీ విష్ణుఆ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా అందరి డైలాగ్స్ వాడాం. ఎవరికైనా మా వల్ల ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించండి. ఇకపై మా టీమ్ నుంచి అలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం. ఇండస్ట్రీలో ఉన్న అందరం కూడా ఒక కుటుంబంలాగా ఉంటాం. ఒకరినొకరు కించపరుచుకోవాలన్న దురుద్దేశమైతే మాకు లేదు. హర్టయినవారికి క్షమాపణలు చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నా అన్నాడు శ్రీవిష్ణు. ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రంలో శివయ్యా అనే డైలాగ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నారు.చదవండి: HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ -
క్యాలెండర్ మార్క్ చేస్కోండి.. దొంగప్ప వచ్చేస్తున్నాడు: మంచు మనోజ్ ట్వీట్
మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కొద్ది నెలలు సైలెంట్గా ఉన్న మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. తన కూతురి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు జైపూర్ వెళ్లగా.. తన కారుతో పాటు తమ వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద నిరసన చేపట్టారు.మరోవైపు మంచు విష్ణు మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిసి కన్నప్ప మూవీ గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే మంచు మనోజ్ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కన్నప్ప మూవీని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. తన సినిమాకు భయపడే కన్నప్ప సినిమాను వాయిదా వేసుకున్నారని ఇప్పటికే మంచు మనోజ్ ఆరోపించారు. ఇవాళ ఏకంగా కన్నప్ప మూవీని దొంగప్ప అంటూ జూన్ 27న బిగ్ స్క్రీన్పైకి రాబోతోందని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఇంతకీ రిలీజ్ తేదీ జూలై 17న.. లేదా జూన్ 27నా అంటూ ఎగతాళి చేశారు. వందకోట్లకు పైగా బడ్జెట్ మూవీ కదా.. మీ పీఆర్ ప్లానింగ్ కేక అంటూ మంచు మనోజ్ తన ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం సరదా కామెంట్స్ చేస్తున్నారు.Mark your calendars! 📅 The legend of #Dongappa hits the big screen on 27th June! 🎥Inthaki release jul 17th aa, Ledha June 27th . 100 crore plus (80% #ViSmith commission) budget movie pr planning keka. pic.twitter.com/Oi7qaNmsj6— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 10, 2025 -
అమ్మతోడు.. ఆస్తికోసం కాదు
హైదరాబాద్: జల్పల్లిలోని సినీ నటుడు మోహన్బాబుకు సంబంధించిన మంచు టౌన్షిప్ వద్ద మరోసారి వివాదం నెలకొంది. తాను లేని సమయంలో నార్సింగిలోని తన నివాసం వద్ద ఉన్న కార్లను విష్ణు దొంగలించాడని పేర్కొంటూ ఈ నెల 8న మంచు మనోజ్ నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఉదయం 8.30 గంటలకు జల్పల్లి శివారులోని మంచు టౌన్షిప్ గేట్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మీడియాను లోనికి రానివ్వకుండా టౌన్షిప్ చుట్టూ కిలోమీటర్ సరిహద్దులో ఆంక్షలు విధించారు. పోలీసుల సూచనతో 11.45 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోతూ మనోజ్ మీడియా ఎదుట తన ఆవేదన వెలిబుచ్చారు. అమ్మపై ప్రమాణం గతేడాది డిసెంబర్ 8వ తేదీ నుంచి మంచుటౌన్షిప్లో ఆరంభమైన గొడవ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. జల్పల్లిలో మొదలైన ఈ గొడవ కాలక్రమేణా తిరుపతిలోని మోహన్బాబు వర్సిటీ వరకు తాకింది. జల్పల్లిలో తాజాగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 27న తాను, తన భార్య ఇంట్లో ఉన్న సమయంలో బయటి వ్యక్తులు గుమిగూడుతున్న విషయమై పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డికి ఫోన్తో పాటు, 100 డయల్కు కాల్ చేసి రక్షణ కల్పించాలని కోరామన్నారు. అయినప్పటికీ తననే ఇంటి నుంచి బయటికి రావాలని పోలీసులు తెలిపారన్నారు. ఏప్రిల్ 2న తన కుమార్తె మొదటి పుట్టిన రోజు ఇక్కడే పరిమితంగా చేసుకుందామనుకున్నప్పటికీ, స్థానిక పరిస్థితుల దృష్ట్యా రాజస్థాన్లోని జైపూర్ వెళ్లామన్నారు. అంతకుముందే నేను అక్కడ లేను, విష్ణును అక్కడ ఏమైనా చేసుకోమని మా అ మ్మకు కూడా తెలిపానన్నారు. అమ్మపై ప్రమాణం.. ఇది ఆస్తి కోసం కాదు అన్నారు. తిరుపతిలోని యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి తంతును ప్రశ్నించినందుకే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. డిసెంబర్ 8 నుంచి ఇప్పటి వరకు పహాడీషరీఫ్ పోలీసులు ఒక్క ఛార్జిïÙట్ కూడా దాఖలు చేయలేదని, టౌన్షిప్లో తనకు సంబంధించి మూడు పెట్ డాగ్లు, పిల్లలకు సంబంధించి వస్తువులున్నాయని తెలిపారు. అవి తీసుకొని వెళ్తానని చెప్పినా లోనికి వెళ్లనీయడం లేదన్నారు. పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యహరించారని ఆరోపించారు. తాను రాజస్థాన్కు వెళ్లిన వెంటనే విష్ణు తన కార్లను చోరీ చేశారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇంట్లో ఉన్న తన పాత జ్ఞాపకాలను సైతం తొలగించారన్నారు. రౌడీషిటర్ల ఆగడాలపై సీఐకి చెబితే‘అవునా పాపం’ కదా అంటున్నారు తప్పా చర్యలు శూన్యమన్నారు. కోర్టులను తప్పదోవ పట్టిస్తున్న ఘటనలపై తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు ఆదేశాలున్నా ఇంట్లోకి రానివ్వడం లేదన్నారు. బైండోవర్ విషయం తనకు వర్తించినప్పుడు, విష్ణుకు ఎందుకు వర్తించవని ఆయన మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం కోసం సినిమాలో స్త్రీ వేషధారణలోనూ నటించానని ఆవేదన వ్యక్తం చేశారు. మనోజ్ సంబంధించిన ఎలాంటి విషయాలైనా కావాలంటే.. ఇస్తా బిడ్డ అని నాన్న విష్ణుకు హామీ ఇచ్చారని తెలిపారు. పోలీసులు తన ఫిర్యాదులపై ఎక్కడ కూడా ఛార్జిషీట్లో దాఖలు చేయలేదన్నారు. ఇదిలా ఉండగా మోహన్బాబు, ఆయన కుమారుడు విష్ణు యూపీలో కన్నప్ప సినిమా ప్రమోషన్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిసి సినిమా కథను వివరించారు. -
యూపీ సీఎంను కలిసిన మంచు విష్ణు.. కన్నప్ప కొత్త డేట్ ఇదే..
హీరో మంచు విష్ణు, ఆయన తండ్రి మోహన్బాబు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. బుధవారం నాడు యోగిని కలిసి ఆయనకు శ్రీరాముని జ్ఞాపికను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి వెంట కన్నప్ప కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఉన్నారు.ఈ విషయాన్ని విష్ణు (Manchu Vishnu) ఎక్స్ (ట్విటర్)లో వెల్లడించాడు. నా ఫేవరెట్ హీరో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)గారిని కలిశాను. ఆయన మా కన్నప్ప సినిమా కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు రమేశ్ గొరిజాలా వేసిన పెయింటింగ్ను బహుమతిగా ఇచ్చాం. కన్నప్ప.. జూన్ 27న వస్తోంది అని ట్వీట్ చేశాడు.మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. మోహన్బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్లాల్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయంటూ సినిమాను వాయిదా వేశారు. ఏప్రిల్ 25న తన సినిమా భైరవం రిలీజ్ అవుతుందన్న భయంతోనే విష్ణు కన్నప్పను వాయిదా వేశాడని మనోజ్ ఆరోపించాడు. ఇంతలో విష్ణు.. కన్నప్ప జూన్లో రానుందని ప్రకటించాడు. Met one of my favorite Hero Sri. @myogiadityanath ji. He was gracious to launch the date announcement poster of #Kannappa. Gifted him a painting of Ramesh Gorijala. Such a Humble and powerful aura he has. Kannappa on June 27th. #HarHarMahadev pic.twitter.com/4EECXoDE9I— Vishnu Manchu (@iVishnuManchu) April 9, 2025 చదవండి: నా సినిమాకు భయపడి 'కన్నప్ప' వాయిదా: మంచు మనోజ్ -
నా సినిమాకు భయపడి 'కన్నప్ప' వాయిదా: మంచు మనోజ్
మంచు బ్రదర్స్ మధ్య మరోసారి వార్ మొదలైంది. కూతురు పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం రాజస్థాన్ వెళ్తే.. తన ఇంటికొచ్చి కారు, కొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ (Manchu Manoj) పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర బైఠాయించిన మనోజ్.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మా మధ్య ఎలాంటి గొడవల్లేవు. ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతోనే కూతురు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు జైపూర్ వెళ్లాను. మేం ఇక్కడే ఉండొచ్చని హైకోర్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయినా ఇంట్లోకి వెళ్లనివ్వట్లేదు. నా తల్లిమీద ప్రమాణం చేసి చెబుతున్నా ఏ రోజు నేను ఆస్తి కోసం గొడవపడలేదు. నేనంటే విష్ణుకి(Manchu Vishnu) కుళ్లు' 'అన్న కెరీర్ కోసం నేను సినిమాలో లేడీ గెటప్ కూడా వేశాను. ఇప్పుడు నా కారుని దొంగతనం చేశాడు. పాప నగలు ఎత్తుకెళ్లాడు. పెద్దవాళ్లని పిలిచి కూర్చుని మాట్లాడుదామని అడుగుతున్నాను. నా 'భైరవం' సినిమాకు భయపడే 'కన్నప్ప' (Kannappa Movie) వాయిదా వేసుకున్నాడు' అని మనోజ్ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం జరుగుతున్న గొడవ చూస్తుంటే మరికొన్నిరోజుల పాటు మంచు ఫ్యామిలీ గొడవలు జరుగుతాయా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనోజ్ మీడియాతో మాట్లాడాడు. మరి మోహన్ బాబు-విష్ణు వైపు నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో చూడాలి? -
నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా.. నేనంటే విష్ణుకు కుళ్లు: మనోజ్
-
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
ప్రస్తుతం సైలెంట్ అయ్యారే అనుకుంటున్న టైంలో మంచు కుటుంబంలో(Manchu Family) మరోసారి వివాదం మొదలైంది. తాను ఇంట్లో లేనప్పుడు తన కారు, ఇతర వస్తువుల్ని ఎత్తుకెళ్లారని మనోజ్(Manchu Manoj).. అన్న విష్ణుపై కేసు పెట్టాడు. జల్పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదంతా మంగళవారం జరిగింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)తాజాగా బుధవారం ఉదయం.. జల్ పల్లిలోని మోహన్ బాబు(Mohan Babu) ఇంటి ముందు మనోజ్ ఆందోళనకు దిగాడు. కూతురు పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లగా.. తన ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లారని, దీని గురించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించట్లేదని మనోజ్ చెప్పాడు. దీంతో గేటు ముందే బైఠాయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొన్నాళ్ల క్రితం విష్ణు-మనోజ్ మధ్య మొదలైన గొడవ.. చాలారోజుల పాటు నడిచింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏమైందో ఏమో మరి సైలెంట్ అయ్యారు అనుకునేంతలోపు మళ్లీ వివాదం రాజుకున్నట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!)ఇక మీడియాతో మనోజ్ మాట్లాడుతూ.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు. కావాలనే అందరినీ పిచ్చోల్లని చేస్తున్నారు. నా కూతురు బర్త్ డే చేసుకోవడానికి ఏప్రిల్ 2 న వచ్చాము. ఇక్కడ పరిస్థితులు బాగోలేక పోవడంతో జైపూర్ కు వెళ్ళాము. నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వండి. ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి, అవి ఇవ్వమని అడుగుతున్నా. ఏరోజు నేను ఆస్తి కోసం కొట్లాడలేదు. నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా. నేనంటే విష్ణుకి కుల్లు. కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను లోపలికి వెళ్ళి నివ్వడం లేదు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారు అని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. -
నార్సింగి పీఎస్ లో మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు
-
నా కారును దొంగిలించారు...
మణికొండ: నటుడు మోహన్బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన కారును దొంగిలించారని మనోజ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ నెల 1వ తేదీన రాజస్తాన్కు వెళ్లగా జల్పల్లిలోని ఫామ్హౌస్లోకి 150 మంది చొరబడి విధ్వంసం చేశారన్నారు. తన విల్లా ముందు నిలిపిన మహీంద్రా మరాజో కారును అర్ధరాత్రి దొంగిలించారని చెప్పారు. వెంటనే తన డ్రైవర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడని, పోలీసుల విచారణలో కారు మంచు విష్ణు కార్యాలయంలో లభ్యమైందన్నారు. దుండగులు తన విల్లా గోడలు దూకి వచ్చి ఇంట్లోని విలువైన వస్తువులను పగులగొట్టారని మనోజ్ ఆరోపించారు.దర్యాప్తు చేస్తున్నాం..మంచు మనోజ్కు చెందిన కారును ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దొంగిలించినట్టు అతని డ్రైవర్ సాంబశివరావు ఫిర్యాదు చేశాడని నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. 2వ తేదీన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, గుర్తు తెలియని వ్యక్తులు కారును దొంగిలించినట్టు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కారును దొంగిలించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
మోహన్ బాబు ఫ్యామిలీలో మళ్లీ వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం మొదలైంది. ఆయన కుమారుడు, హీరో మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తాను లేని సమయంలో తన ఇంటిని ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురి బర్త్ డేకు రాజస్థాన్ వెళ్లినప్పుడు మంచు విష్ణు ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు తన వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. జల్పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.గతంలోనూ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన తర్వాత వరుసగా కేసులు నమోదయ్యాయి. మంచు విష్ణు, మనోజ్కు మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద సైతం వీరి మధ్య గొడవ మొదలైంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలోనే మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్లో మరోసారి చర్చ మొదలైంది. -
ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్
మంచు విష్ణు హీరో, నిర్మాతగా చేసిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. లెక్క ప్రకారం ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేస్తామని చాలారోజుల క్రితమే ప్రకటించారు. కొన్నిరోజుల క్రితం వరకు ప్రచారం చేశారు. కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల వాయిదా వేస్తున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. కానీ తాజాగా మూవీ ప్రీమియర్ వేశారనే రూమర్స్ రాగా.. టీమ్ దీనిపై స్పందించింది.(ఇదీ చదవండి: హీరోయిన్ తమన్నా ఇంట్లో ప్రత్యేక పూజలు)'మార్చి 31న కన్నప్ప ప్రీమియర్ వేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. 15 నిమిషాల వీఎఫ్ఎక్స్ ఫుటేజీ క్వాలిటీ మాత్రమే చెక్ చేశాం. మూవీ ఫస్ట్ కాపీని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాం. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దు. త్వరలోనే ఇతర వివరాలు ప్రకటిస్తాం' అని కన్నప్ప టీమ్ చెప్పుకొచ్చింది.ప్రసాద్ ల్యాబ్ నుంచి మంచు ఫ్యామిలీ నడిచొస్తున్న విజువల్స్ కొన్ని బయటకు రావడంతోనే ఈ ప్రీమియర్ వార్తలు వచ్చాయి. ఇకపోతే కన్నప్ప మూవీలో మంచు ఫ్యామిలీకి చెందిన విష్ణు, ఇతడి కూతుళ్లు-కొడుకు నటించారు. తండ్రి మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)Official Clarification from Team KannappaContrary to rumours spreading online, there was NO premiere or screening of the full movie yesterday. The Kannappa team only reviewed a 15-minute VFX segment for quality assessment and corrections.The film’s first cut is still under…— Kannappa The Movie (@kannappamovie) April 1, 2025 -
గ్రాండ్గా మంచు ఫ్యామిలీ ఉగాది వేడుకలు (ఫోటోలు)
-
నన్ను క్షమించండి.. తప్పట్లేదు: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా (Kannappa Movie) మరోసారి వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందని విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించాడు. చెప్పిన సమయానికి రావడం లేదని, అందుకు మన్నించాలని కోరాడు. 'అత్యున్నత విలువలతో కన్నప్ప సినిమాను మీ ముందుకు తీసుకురావాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్..అయితే కొన్ని కీలక సన్నివేశాలకు ఇంకా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఫలితంగా సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుంది. మీరందరూ పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. శివ భక్తుడైన కన్నప్ప సినిమా చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ విశేషంగా కృషి చేస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని ఓ నోట్ షేర్ చేశాడు.సినిమాకన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు శివ భక్తుడు కన్నప్పగా నటించాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా యాక్ట్ చేశారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్బాబు, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించారు. నిజానికి గతేడాది డిసెంబర్లో కన్నప్ప రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పుష్ప 2 ఆగమనంతో వెనకడుగు వేసి మార్చికి రిలీజ్ చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అనుకున్న సమయానికి రాలేమంటూ మరోమారు వాయిదా వేశారు. My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025 -
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
కుటుంబ గొడవలతో ముంచు ఫ్యామిలీ పరువు రోడ్డునపడింది. విష్ణు (Vishnu Manchu)- మనోజ్ (Manoj Manchu)కు మధ్య సఖ్యత కుదరట్లేదు అనుకుంటే.. మనోజ్- మోహన్బాబు మధ్య కూడా గొడవలు జరగడం అభిమానులనే కాదు ఇండస్ట్రీని సైతం షాక్కు గురి చేసింది. ఇలా వీరింట్లో ఏదో ఒకరకంగా తగవులాడుతూనే ఉన్నారు. ఈ రచ్చ వల్ల తన పిల్లలు ఇబ్బందిపడుతున్నారంటోంది మంచు మోహన్బాబు పెద్ద కోడలు, విష్ణు సతీమణి విరానిక (Viranica Manchu). ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కుటుంబ కలహాలపై స్పందించింది. విరానిక మాట్లాడుతూ.. కుటుంబమన్నాక గొడవలు అవుతూనే ఉంటుంది. కేవలం మా ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి. కానీ చాలావరకు బయటకు రావు. దురదృష్టవశాత్తూ మా కుటుంబంలోని గొడవలు బయటకువచ్చాయి. దానికి మనమేం చేయలేం. నాకు నా పిల్లలు ముఖ్యం. వారికోసం ఏదైనా భరిస్తాను. ఒక స్పాంజిలా అన్నింటినీ ఓపికగా స్వీకరిస్తాను. పిల్లలకన్నా నాకెవరూ ముఖ్యం కాదు. కానీ జరుగుతున్న రచ్చ వల్ల నాకన్నా నా పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. భయపడిపోతున్నారు. నాలుగో ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్అసలేం జరుగుతుంది? తాతయ్యకేమైనా అవుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. అందుకే పిల్లల్ని.. వివాదాలకు చాలా దూరంగా ఉంచుతాను. నేను ధైర్యంగా ఉంటేనే వారికి ఎంతోకొంత ధైర్యం చెప్పగలను అని విరానిక చెప్పుకొచ్చింది. అలాగే తను నాలుగోసారి గర్భం దాల్చినప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేశారంది. మీకేం పని లేదా? అంటూ నోటికొచ్చినట్లు తిట్టారని బాధపడింది. విష్ణుకు, తనకు పిల్లలంటే ఇష్టమని.. అందుకే నలుగుర్ని కన్నామని విరానిక పేర్కొంది.చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత -
మంచు విష్ణు కన్నప్ప.. మరో రెండు పాత్రలు రివీల్
టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే రిలీజైన కన్నప్ప పోస్టర్లు, టీజర్లు, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం కన్నప్ప మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో రెండు పాత్రలను రివీల్ చేశారు. రఘుబాబు, శివబాలాజీ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రఘు బాబు మల్లు అనే ఓ పాత్రను పోషిస్తుండగా.. శివబాలాజీ కుమారదేవ శాస్త్రిగా కనిపించనున్నారు.కాగా.. ఈ చిత్రంలో శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్, రుద్రుడిగా ప్రభాస్, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Revealing Sivabalaji's enlightened transformation as #KumaradevaShastri and Raghubabu as #Mallu in #Kannappa🏹!A journey of wisdom and unwavering devotion etched in divine history. 🔱Har Har Mahadev 🔱Har Ghar Mahadev 🔥@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/hRO4MPWFQ5— Mukesh Kumar Singh (@mukeshvachan) March 25, 2025 -
శివభక్తుడిగా మారిపోయా: విష్ణు మంచు
‘‘నేను ఆంజనేయస్వామి భక్తుడిని. కానీ ‘కన్నప్ప’ సినిమా ప్రయాణంతో శివభక్తుడిగా మారిపోయాను. మా చిత్రం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూపొందిన సినిమా ‘కన్నప్ప’. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. కాగా హైదరాబాద్లో జరిగిన ‘రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రని ఆడియన్స్ ఎంత ఊహించుకున్నా.. అంతకుమించి ఉంటుంది’’ అని తెలిపారు.‘‘2016 జనవరిలో నేను శ్రీకాళహస్తికి వెళ్లి శివుణ్ణి దర్శించుకున్నాను. ఆ శివుడే నన్ను ‘కన్నప్ప’ప్రాజెక్ట్లోకి పంపించాడు. అదే శివ లీల’’ అని చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్. బ్రహ్మాజీ, రఘుబాబు పాల్గొన్నారు. -
'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు
మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా కన్నప్ప(Kannappa Movie). ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ మూవీపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇదివరకే విష్ణు ఈ విషయమై స్పందించగా.. ఇప్పుడు నటుడు రఘుబాబు (Raghu Babu) మాత్రం వింత కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.'ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా ఇప్పుడే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తు పెట్టుకోండి. ఎవరైనా 100 శాతం కరెక్ట్ ఇది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఫినిష్' అని నటుడు రఘుబాబు తాజాగా జరిగిన ఈవెంట్ లో అన్నారు. ఇది విన్న నెటిజన్స్ షాకవుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్)ఎందుకంటే గతంలో ఈ చిత్ర టీజర్ రిలీజైనప్పుడు దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో పలువురు యూట్యూబర్స్ పై హీరో, నిర్మాత మంచు విష్ణు (Manchu Vishnu) సీరియస్ అయ్యాడనే టాక్ వినిపించింది. ఆ తర్వాత మరో టీజర్ రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా విడుదల చేశారు. కాకపోతే ఈసారి అంత నెగిటివిటీ రాలేదు. ఎక్కడో చోట ట్రోలింగ్ జరుగుతుంది. అంతమాత్రాన దేవుడి పేరు చెప్పి శాపానికి గురవుతారని భయపెట్టడం ఏంటో అర్థం కావట్లేదు.కంటెంట్ లో దమ్ముంటే సినిమాని ఎంత ట్రోల్ చేసినా సరే హిట్ అవుతుంది. కన్నప్ప మూవీలోనూ ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. కాబట్టి హిట్ అవ్వొచ్చేమో చెప్పలేం. కానీ ఇలా శాపానికి గురవుతారని భయపెట్టడం మాత్రం కాస్త వింతగా ఉందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఆ బాలనటి గుర్తుందా? ఇప్పుడు పెళ్లికూతురయ్యింది!) -
నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్
మంచు విష్ణు (Vishnu Manchu) హిట్ అందుకుని చాలాకాలమే అయింది. ఈసారి హిట్ కాదు ఏకంగా బ్లాక్బస్టర్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు. అందుకోసం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie)ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇందులో మంచు విష్ణు కన్నప్పగా నటించాడు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్బాబు నిర్మించాడు. అక్షయ్కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.కుటుంబ నియంత్రణ?దీంతో ప్రమోషన్స్ షురూ చేశాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడికి కుటుంబ నియంత్రణ గురించి ప్రశ్న ఎదురైంది. అందుకు మంచు విష్ణు స్పందిస్తూ.. అది వ్యక్తిగత అభిప్రాయం. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నాకు నలుగురు పిల్లలున్నారు. ఇంకా పిల్లలు కావాలన్నాను. దానికి నా భార్య విరానిక (Viranica Manchu) అలాగైతే వేరొకరిని వెతుక్కుపో.. అంది. విరానిక బెదిరింపులుఅయితే సరేనన్నాను. అవునా.. అయితే వెతికి చూడు అని విరానిక బెదిరించింది.. అందుకే ఆగిపోయాను అన్నాడు మంచు విష్ణు. విష్ణు.. 2009లో విరానికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2011లో కవలలు జన్మించారు. వారికి అరియానా, వివియానా అని నామకరణం చేశారు. 2018లో కుమారుడు అవ్రమ్ పుట్టాడు. 2019లో కూతురు ఐరా జన్మించింది. కన్నప్ప సినిమాలో అవ్రమ్.. బాల తిన్నడు/కన్నప్పగా నటించాడు.చదవండి: మొదటి భార్యకు విడాకులు.. దేవదాసులా తాగుడుకు బానిసయ్యా..: హీరో -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మహదేవ శాస్త్రి గ్లింప్స్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్తో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పలువురు అగ్రతారల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆడియన్స్కు పరిచయం చేశారు. ఈ మూవీలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.(ఇది చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)అయితే ఈ చిత్రంలో మోహన్ బాబు మహదేవ శాస్త్రి పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడంతో ప్రత్యేక గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. మహదేవ శాస్త్రి పాత్రను పరిచయం చేసే సాంగ్ను గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేశారు. ఈ పాటను ఓకేసారి ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆడియన్స్కు పరిచయం చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?
మంచు బ్రదర్స్, వీళ్ల కుటుంబంలో ఏమేం జరిగిందో తెలుగు ప్రేక్షకులకు తెలియందేమీ కాదు. దాదాపు కొన్నివారాల పాటు నడిచిన హంగామా ప్రస్తుతానికైతే సైలెంట్ అయినట్లే ఉంది. కానీ ఇప్పుడు మరోసారి విష్ణు vs మనోజ్ ఉండబోతుందా అనే సందేహం వస్తోంది. సోషల్ మీడియాలో ఇందుకు తగ్గట్లే కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.మంచు విష్ణు దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టి, చాన్నాళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రలు పోషించారు. తొలుత వచ్చిన టీజర్ పై ట్రోల్స్ వచ్చాయి కానీ ఈ మధ్య రిలీజైన టీజర్, పాటలపై మాత్రం కాస్తంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 25న రిలీజ్ కి తగ్గట్లే ప్రమోషన్స్ సాగుతున్నాయి.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్)అసలు విషయానికొస్తే.. మంచు మనోజ్ కూడా సినిమాలు చేయక చాన్నాళ్లయింది. రెండో పెళ్లి, ఫ్యామిలీలో గొడవలు వల్ల కెరీర్ మీద సరిగా దృష్టి పెట్టలేకపోయాడేమో! ఇకపోతే ఇతడు నటించిన 'భైరవం' అనే మూవీ లెక్క ప్రకారం గత డిసెంబరులోనే రిలీజైపోవాలి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు దీన్ని కూడా ఏప్రిల్ 25నే థియేటర్లలో విడుదల చేయాలని అనుకుంటున్నారట.ఒకవేళ ఇదే జరిగితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచు బ్రదర్స్ పోటీ అన్నట్లు ఉంటుంది. తాజాగా ఓ ఉగాది ఈవెంట్ లో పాల్గొన్న మనోజ్ కూడా.. 'భైరవం' సరైన తేదీకే వస్తుందని చెప్పాడు. మరి ఈ రూమర్స్ లో నిజమెంతో చూడాలి?(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
రూ.200 కోట్లు ఇస్తా.. ఆస్కార్ తెప్పిస్తారా? : మంచు విష్ణు
మంచు విష్ణు(Manchu VIshnu ) ప్రస్తుతం కన్నప్ప(kannappa) సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో మంచు విష్ణు దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని యూట్యూబ్ ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తనపై వస్తున్న ట్రోలింగ్ కూడా స్పందించాడు. కన్నప్ప టీజర్కు తమిళ, కన్నడ, మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని, తెలుగులో మాత్రం 15-20 శాతం మంది పని గట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారని మండి పడ్డారు.ఈ నెగటివిటీ కావాలని చేస్తున్నదే అని ఆయన ఆరోపించారు. తనపైనే కాదు రాజమౌళి లాంటి వారిపై కూడా వీళ్లు ఇలానే ట్రోలింగ్ చేస్తారని చెప్పారు.‘ఆర్ఆర్ఆర్’(RRR)కి ఆస్కార్ అవార్డు వస్తే తెలుగువారంతా గర్వంగా కాలర్ ఎగరేసి ఎంజాయ్ చేశారు. కానీ కొంతమంది మాత్రం విమర్శించారు. ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు పెడితే వస్తది కదా అన్నారు. నేను 200 కోట్లు ఇస్తా.. ఆ విమర్శలు చేసినవాళ్లు ఆస్కార్ తీసుకొస్తారా? ఆర్ఆర్ఆర్`కి ఆస్కార్ రావడమనేది ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ మూమెంట్.అసలు ఎంత మందికి అక్కడ ఇన్విటేషన్ ఉంటుంది. ఇలాంటి మూమెంట్లని గర్వించాలి. కాలర్ ఎగరేసుకోవాలి. భారతదేశంలో ఎవరూ ఇలాంటి ఘనత సాధించలేదు. ఇండియాలో డైరెక్ట్ గా ఏ సినిమాకి ఆస్కార్ రాలేదు. సత్యజిత్ రేకి గౌరవంగా లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ పురస్కారం అందించారు తప్పితే, సినిమాలకు ఇవ్వలేదు. ఇండియాలో ఇండియా టెక్నీషియన్లు చేసిన ఏ మూవీకి ఆస్కార్ రాలేదు. కేవలం `ఆర్ఆర్ఆర్`కి మాత్రమే సాధ్యమైంది. మన తెలుగు పాటని ఆస్కార్ స్టేజ్ పై వేశారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. దానికన్న గొప్పతనం ఏం కావాలి?అని ట్రోలర్స్పై మంచు విష్ణు మండిపడ్డారు.ఇక కన్నప్పలోని ‘లవ్ సాంగ్’ పై వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. ‘నేను సినిమా తీస్తున్నా.. డాక్యుమెంటరీ కాదు. అందుకే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి’అని అన్నారు. -
భక్త కన్నప్ప గుడిని అభివృద్ధి చేస్తా: మంచు విష్ణు
సాక్షి, రాజంపేట: హీరో మంచు విష్ణు (Vishnu Manchu) అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలోని ఊటుకూరు భక్తకన్నప్ప గుడిని శనివారం సందర్శించాడు. కన్నప్ప చిత్రబృందంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తమ గ్రామానికి విచ్చేసిన విష్ణుకు.. స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.చరిత్ర తెలియజేయాలనే..ఆలయ దర్శనానంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. భక్తకన్నప్ప చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే కన్నప్ప సినిమా (Kannappa Movie) తీశాం. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఊటుకూరు భక్త కన్నప్ప గుడి అభివృద్ధికి కృషి చేస్తాను. ఆలయ పెద్దలతో మాట్లాడి గుడికి కావాల్సిన అవసరాలను తీరుస్తాను అని హామీ ఇచ్చాడు.కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్ కథానాయిక. కన్నప్ప పాత్రలో విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. మోహన్బాబు, మోహన్లాల్ కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల -
'కన్నప్ప'తో మంచు విష్ణు అంత రిస్క్ చేస్తారా?
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువొచ్చాయి. కానీ కొన్నాళ్ల ముందు విడుదల చేసిన మరో టీజర్ కి మాత్రం పర్లేదు బాగుందనే టాక్ వచ్చింది. దీనికి తోడు రెండు పాటలు కూడా వినసొంపుగా అనిపించాయి. ఇలా ఓ మాదిరి బజ్ ఏర్పడింది. ఇలా 'కన్నప్ప' గురించి కాస్తోకూస్తో అంచనాలు పెరుగుతున్న టైంలో మంచు విష్ణు రిస్క్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చాలా వాటి ఓటీటీ డీల్స్ ముందే పూర్తవుతున్నాయి. తద్వారా పెట్టిన బడ్జెట్ కొంతమేర రికవర్ చేయొచ్చనేది నిర్మాతల ప్లాన్.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)కానీ 'కన్నప్ప' విషయంలో మాత్రం మంచు విష్ణు రిస్క్ తీసుకోవాలని ఫిక్సయ్యాడట. మూవీ రిలీజ్ కి ముందు డీల్ కుదుర్చుకుంటే ఓటీటీలు ఇచ్చినంత తీసుకోవాలి. అదే రిలీజ్ తర్వాత మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే మనం డిమాండ్ చేయొచ్చని విష్ణు ప్లాన్ అట. మరి ఇందులో నిజమెంతో?కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారని టాక్. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
కన్నప్ప: నెమలితో తిన్నడి ప్రేమగీతం.. ముచ్చటగొలిపిస్తున్న జంట (ఫోటోలు)
-
'కన్నప్ప' నుంచి లవ్ సాంగ్ రిలీజ్
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలుత టీజర్ రిలీజైనప్పుడు విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ కొన్నాళ్ల క్రితం శివయ్య అంటూ సాగే పాట రిలీజ్ చేసినప్పుడు మంచి స్పందనే వచ్చేసింది. ఇప్పుడు మూవీ నుంచి మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఈ సినిమాలో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్రలో కనిపిస్తాడు. ఇతడి ప్రేయసి నెమలి అనే పాత్రలో ప్రీతి ముకుందన్ నటించింది. వీళ్లిద్దరి మధ్య తీసిన ప్రేమగీతాన్నే ఇప్పుడు రిలీజ్ చేశారు. వినడానికి, చూడటానికి ఇది బాగానే ఉండటం విశేషం.ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతున్న 'కన్నప్ప'లో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్, మోహన్ బాబు తదితరులు నటించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?) -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవలే రెండో టీజర్ విడుదల చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ మూవీ మేకింగ్కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఇందులో మంచు విష్ణు పలు అంశాలపై టీమ్తో చర్చిస్తూ కనిపించారు. ఈ సినిమా తెర వెనుక సంగతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The making of Kannappa#kannappa pic.twitter.com/hZCBKbjjYK— Vishnu Manchu (@iVishnuManchu) March 9, 2025 -
మంచు విష్ణు 'ఢీ' కొట్టగలడా..?
మంచు విష్ణు కెరీర్లో ‘ఢీ’ సినిమాది ప్రత్యేకమైన స్థానం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్ తదితరులు నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.కొంతకాలంగా ఇండస్ట్రీలో రీరిలీజ్ల ట్రెండ్ కొనసాగుతుంది. గతంలో సూపర్ హిట్ అందుకున్న చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ థియేటర్స్లలో సందడి చేసింది. ఇప్పుడు ఢీ సినిమాను మార్చి 28 రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ సమయంలో పెద్ద సినిమాలు ఉండటంతో వాటిని ఢీ కొట్టగలదా అనే సందేహాలు ఉన్నాయి.మార్చి 28 రెండు కొత్త సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. నితిన్ ‘రాబిన్ హుడ్’ విడుదల కోసం మైత్రి మూవీస్ భారీ స్కెచ్ వేసి ఉంది. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అదే సమయంలో ‘మ్యాడ్ స్క్వేర్’ రంగంలోకి దిగుతుంది. సితార బ్యానర్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. మార్చి 27న విక్రమ్ ‘వీరధీర శూర పార్ట్ 2’ విడుదల కానుంది. అదే తేదీన మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ విడుదల కానుంది. ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి బజ్ ఉంది. ఇలాంటి సమయంలో 'ఢీ' కొట్టడం చాలా కష్టం అని నెట్టింట అభిమానులు చర్చించుకుంటున్నారు. మరో తేదీ చూసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి కలెక్షన్స్ తప్పకుండా రాబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. -
'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్.. ఈసారి మాత్రం
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి కొత్త టీజర్ రిలీజైంది. ఎనిమిది నెలల క్రితం రిలీజైన టీజర్ తో పోలిస్తే ఈసారి ట్రోల్ చేసేంతలా ఏం లేదు. సినిమాలోని కీలక పాత్రధారుల్ని చూపిస్తూ కన్నప్ప ప్రపంచం ఎలా ఉందనేది చూచాయిగా చూపించారు.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')1:24 నిమిషాల టీజర్ లో విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్.. ఇలా అందరిని చూపించేశారు. నాస్తికుడు అయిన తిన్నడు.. అలియాస్ మన హీరో శివయ్య భక్తుడిగా ఎలా మారాడు అనేదే స్టోరీ అని తెలుస్తోంది.ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గానే ముంబైలో ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీకాళహస్తిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఉంటుందని మంచు విష్ణు చెప్పారు. టీజర్ అంతా ఏమో గానీ చివర్లో ప్రభాస్ ని కాసేపు అలా చూపించి అతడి అభిమానులని అయితే ఆకట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
జనరేటర్ లో పంచదార గొడవపై ప్రశ్న.. విష్ణు ఏమన్నాడంటే?
మంచు ఫ్యామిలీలో కొన్నిరోజుల ముందు వరకు గొడవలు జరిగాయి. ఈ మధ్య కాస్త శాంతించినట్లు ఉన్నారు. మరోవైపు తన కొత్త సినిమా 'కన్నప్ప' కోసం విష్ణు ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. తమ్ముడు మనోజ్ తో గొడవ గురించి స్వయంగా విష్ణునే అడిగాడు. దీనికి విష్ణు కూడా చాలా చాకచక్యంగా సమాధానం చెప్పాడు.కొన్నిరోజుల క్రితం మంచు మనోజ్ తన ఇంట్లో ఉండగా.. విష్ణు, అతడి మనుషులు వెళ్లి జనరేటర్ లో పంచదార పోశారని అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజంగా అక్కడేం జరిగిందనేది పక్కనబెడితే అసలు జనరేటర్ లో షుగర్ ఎందుకు పోశావ్ అన్నా? అని స్వయంగా విష్ణుని ఓ నెటిజన్ అడిగేశాడు.(ఇదీ చదవండి: ముందే చెప్తున్నా.. మా సినిమాలో లాజిక్స్ వెతకొద్దు: నాగవంశీ)ఆస్క్ విష్ణు పేరుతో ట్విటర్ లో జరిగిన చాటింగ్ సందర్బంగా ఇదంతా జరిగింది. అయితే ఏం చెప్పినా సరే మళ్లీ వివాదం అయ్యే అవకాశముంది కాబట్టి.. 'ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివా' అని విష్ణు చాలా సెటైరికల్ గా సమాధానమిచ్చాడు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.భక్త కన్నప్ప స్టోరీతో తీసిన 'కన్నప్ప' మూవీలో విష్ణు ప్రధాన పాత్రధారి కాగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించడం విశేషం. ఏప్రిల్ 25న ఇది థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: Bigg Boss 9: నాగార్జున ఔట్.. హోస్ట్గా మరో స్టార్ హీరో!)Ra anna kooda intha manchiga reply ichina manasu needi , mari aaroju generator lo sugar enduk vesav bhaaii pic.twitter.com/nPj5cZRB5R— 🄳🄴🅅🄰 (@deva_cutzz) February 28, 2025 -
నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు
తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో ప్రభాస్ అంత బిజీగా మరొకరు ఉండరు. ఎందుకంటే చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో రెండింటి షూటింగ్ జరుగుతోంది. ఇంత బిజీగా ఉన్నా సరే మంచు విష్ణు 'కన్నప్ప'లో అతిథి పాత్ర చేశాడు. తాజాగా ప్రభాస్.. ఈ మూవీలో నటించడం గురించి హీరో మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.'కన్నప్ప' సినిమాలో నటించమని అడిగేందుకు ప్రభాస్ కి ఫోన్ చేయగా.. మరో క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాడని మంచు విష్ణు బయటపెట్టాడు. తొలుత నాన్న (మోహన్ బాబు) ఫోన్ చేసి అడగడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడని, అదే విషయాన్ని తనకు చెప్పిన విషయాన్ని విష్ణు రివీల్ చేశాడు. ఏదైనా పనుంటే నువ్వే (విష్ణు) కాల్ చేయ్ అని తనతో ప్రభాస్ చెప్పినట్లు పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: కన్నప్పలో భాగమవడం గౌరవం: అక్షయ్ కుమార్)మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'కన్నప్ప'. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్.. అలా ఇండియన్ మూవీ స్టార్స్ కూడా ఇందులో కీలకపాత్రల్లో నటించారు. మార్చి 1న టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నాన్న ఫోన్ చేస్తే ప్రభాస్ భయపడిన విషయాన్ని మంచు విష్ణు బయటపెట్టాడు.రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిన కన్నప్ప.. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతుంది. ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా.. అది అలరిస్తోంది. చిత్ర విడుదలకు ఇంకా టైముంది కాబట్టి ప్రమోషనల్ కంటెంట్ మరింత రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: సిద్దార్థ్కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్)Rebel Star #Prabhas okka kshanam kooda aalochinchakunda idhi chayyadam anukunnaru ❤️🔥 #Kannappa #ManchuVishnu pic.twitter.com/ewtDFYkoZG— prabhas_garu_taluka (@varmadatla2) February 27, 2025 -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు, శివ బాలాజీ (ఫోటోలు)
-
ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం.. గొడవలు ఆగిపోతే బాగుండు: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie). ఇందులో విష్ణు (Vishnu Manchu) హీరోగా నటిస్తుండగా ప్రీతి ముకుందన్ కథానాయికగా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి టీజర్ వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇటీవల విడుదలైన శివ శివ శంకరా.. పాటతో ట్రోలింగ్ అంతా కొట్టుకుపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. ఎన్ని జన్మలెత్తినా..శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా మోహన్బాబు (Mohan Babu) నాకు తండ్రిగా ఉండాలని కోరుకుంటాను. మా కుటుంబంలోని కలహాలకు త్వరగా ఫుల్స్టాప్ పడితే బాగుండనిపిస్తోంది. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలని నాకిష్టం. ట్రోలింగ్ విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్రవర్తించాలి. నాకేం తెలీదుమాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని అవతలివారి స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి భంగం కలిగించకూడదు. హీరోల గురించి ఎందుకు అసభ్యంగా మాట్లాడతారు? సీనియర్ నటులు చనిపోయారని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? కోట శ్రీనివాసరావు గురించి ఇలాంటి ప్రచారమే జరిగినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి విపరీతంగా బాధపడ్డారు. ఇకపోతే ప్రభాస్ పెళ్లి గురించి, కాబోయే భార్య గురించి నాకెలాంటి విషయాలు తెలియవు.గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయికన్నప్ప సినిమా బడ్జెట్ విషయంలో ఇప్పటికీ నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. సినిమాపై నమ్మకంగా ఉన్నా. అయినా సక్సెస్- ఫెయిల్యూర్ రెండూ మోసగాళ్లే! ఎవరూ మనతో శాశ్వతంగా ఉండరు అన్నాడు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో మోహన్బాబు, శరత్ కుమార్, మోహన్లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?! -
తెలుగువారికి గొప్ప బహుమతిని అందించారు: మంచు విష్ణు
సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి మరణం పట్ల మా అధ్యక్షుడు మంచు విష్ణు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమాలో ఒక చిరు దీపం వెలిగించిన లెజెండరీ కృష్ణవేణి.. నందమూరి తారక రామారావును బిగ్ స్క్రీన్కి పరిచయం చేసి మన ఇండస్ట్రీకి ఒక అమూల్యమైన బహుమతి ఇచ్చారు. ఆమె జ్ఞాపకాలు ఎప్పుడు మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతాయన్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని మంచు విష్ణు పోస్ట్ చేశారు.కాగా.. కృష్ణవేణి సినిమాల్లోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేశారు. 1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో దాదాపు 15 చిత్రాలలో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించారు. కృష్ణవేణికి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా మేకా రంగయ్యతో వివాహం జరిగింది. కేవలం నటిగానే కాదు.. తానే స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేశారు.ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. 1957లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషికి గానూ 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. ఆమె భర్త స్థాపించిన సంస్థ జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్నారు.కృష్ణవేణి నిర్మించిన సినిమాలుమన దేశం (1949)లక్ష్మమ్మ (1950)దాంపత్యం (1957)గొల్లభామ (1947)భక్త ప్రహ్లాద (1042) Telugu cinema lo oka chiru deepam veliginchina Legendary Krishnaveni Garu kalasina tidhi 🙏. Aame parishrama tho Nandamuri Taraka Rama Rao Garu ni big screen ki introduce chesi, mana industry ki oka amulya mayina gift icharu. Aame gnapakalu eppudu mana hrudayallo undipothayi.… pic.twitter.com/dYYqz6nmxK— Vishnu Manchu (@iVishnuManchu) February 16, 2025 -
స్పిరిట్లో విష్ణు
‘స్పిరిట్’(spirit) సినిమా కోసం స్పెషల్ అప్లికేషన్ పెట్టుకున్నారు హీరో మంచు విష్ణు(Manchu Vishnu). ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న మూవీ ‘స్పిరిట్’. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు ప్రభాస్(Prabhas). ఈ వేసవిలో ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణను ప్రారంభించనుంది యూనిట్. దీంతో నటీనటుల కోసం ‘ఎక్స్’లో ఓ నోట్ను షేర్ చేసింది.‘‘ఫిల్మ్ అండ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్లో అనుభవం ఉన్న నటీనటులు మా సినిమాలో యాక్ట్ చేసేందుకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటూ కొన్ని షరతులతో ‘స్పిరిట్’ టీమ్ ఓ నోట్ను షేర్ చేసింది. ఈ నోట్ను ‘ఎక్స్’లో షేర్ చేసి, తాను ‘స్పిరిట్’ సినిమా కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని, ఏం జరుగుతుందో చూడాలన్నట్లుగా విష్ణు మంచు పేర్కొన్నారు.మరోవైపు విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’లో రుద్రగా ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి... ప్రభాస్ ‘స్పిరిట్’ లో నటించే చాన్స్ విష్ణు మంచుకు దక్కుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ ‘స్పిరిట్’ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
‘కన్నప్ప’కోసం ప్రభాస్, మోహన్లాల్ ఎంత తీసుకున్నారంటే..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’(Kannappa). అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించిన ఈమూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ని ముమ్మరం చేశారు మేకర్స్. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇస్తున్నారు. దీంతో పాటు మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కోసం ఏడేళ్లుగా పని చేస్తున్నామని, దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్తో సినిమాను తెరకెక్కించామని చెప్పాడు. ఇందులో నటీనటులు పారితోషికాలతో కలిపి చూస్తే.. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరగాల్సింది. కానీ చాలా మంది నటీనటులు డబ్బులు తీసుకోకుండానే నటించారట. మోహన్ లాల్, ప్రభాస్ అయితే ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారట. ఈ విషయాన్ని మంచు విష్ణునే చెప్పారు.‘ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal) పోషించిన పాత్రలు చాలా కీలకం. వాళ్లను కథ చెప్పగానే ఒప్పుకున్నారు.ఈ సినిమా కోసం వాళ్లిద్దరూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదు. నాన్నగారిపై(మోహన్ బాబు)పై ఉన్న అభిమానంతో వారిద్దరు నటించారు. మోహన్లాల్ దగ్గరకు వెళ్లి కథ చెప్పిన తర్వాత పారితోషికం గురించి మీ మేనేజర్తో మాట్లాడమంటారా అని అడిగితే..‘అప్పుడే అంత పెద్ద వాడివయ్యావా?’ అన్నాడు. ఇక ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు. అతని వల్ల నాకు స్నేహంపై నమ్మకం పెరిగింది. నా కోసం ప్రభాస్ ఇందులో నటించాడు. అలాగే అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర కూడా కీలకమే. శివుని పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తే.. రెండు సార్లు సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి ఆయనను ఒప్పించాం. చాలా అద్భుతంగా నటించాడు’ అని విష్ణు చెప్పుకొచ్చాడు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, పార్వతీదేవిగా కాజల్ నటిస్తున్నారు. శివరాజ్కుమార్, ఆర్.శరత్కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
మనసు నిన్ను తెలుసుకుందయ్యా...
‘‘తెలివి కన్ను తెరుసుకుందయ్యా... శివలింగామయ్యా... మనసు నిన్ను తెలుసుకుందయ్యా...’’ అంటూ మొదలవుతుంది ‘కన్నప్ప’ సినిమాలోని ‘శివ శివ శంకరా...’పాట. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్. మోహన్బాబు, శరత్కుమార్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు మోహన్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది.కాగా బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఈ చిత్రంలోని ‘శివ శివ శంకరా...’పాటను రిలీజ్ చేశారు. మోహన్ బాబు, విష్ణు మంచు, ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్లైన్ వెంకటేశ్, నటి సుమలత, భారతీ విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, రామజోగయ్య శాస్త్రి తదితరులుపాల్గొన్నారు. ‘‘రవిశంకర్ గురూజీ ఈ పవిత్ర గీతాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాను.‘కన్నప్ప’ అనేది శివునితో మమేకం చేయబడిన చిత్రం. ఇదే మా ప్రయాణానికి అ΄ారమైన ఆధ్యాత్మిక విలువను జోడిస్తుంది’’ అని తెలి΄ారు మోహన్బాబు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ స్వరపరచిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, విజయ్ ప్రకాశ్ ఆలపించారు. న్యూజిల్యాండ్లో చిత్రీకరించిన ఈపాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈపాటను హిందీలో జావేద్ అలీపాడగా, శేఖర్ అస్తిత్వ సాహిత్యాన్ని అందించారు. -
ముఖ్యమంత్రిని కలిసిన మంచు మోహన్బాబు
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్బాబు (Mohan Babu) తన కుమారుడు విష్ణుతో పాటుగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ని (Bhupendra Patel) కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ పేజీలో వారు షేర్ చేశారు. తెలుగు కళాకారుడు రమేశ్ గొరిజాల వేసిన పెయింటింగ్ను సీఎం భూపేంద్ర పటేల్కు విష్ణు కానుకగా అందించారు. వారితో పాటు శరత్ కుమార్, శ్రీ ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి ఉన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ని కలవడం తమకు చాలా సంతోషంగా ఉందని మోహన్బాబు అన్నారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అభివృద్ధిలో గుజరాత్ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసిస్తూనే ఆయన ఎన్నో విజయాలు అందుకోవాలని మోహన్బాబు కోరారు. అయితే ఆయన ఏ కారణం వల్ల సీఎంను కలిశారో అనేది మాత్రం తెలుపలేదు.ప్రస్తుతం మోహన్బాబు, శరత్కుమార్ ఇద్దరూ ‘కన్నప్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్లాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్తో ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.It was a pleasure meeting the Hon’ble Chief Minister of Gujarat, Shri Bhupendra Patel Ji, along with Vishnu Manchu, Mr. Sarath Kumar, Mr. Mukesh Rishi, and Mr. Vinay Maheshwari. I thank him for the warm reception and praise the Almighty for his good health and prosperity. As a… pic.twitter.com/iDdQDh9oLV— Mohan Babu M (@themohanbabu) January 29, 2025 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అక్షయ్కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి పలువురు స్టార్స్ నటిస్తున్నారు. అంతేకాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 3న తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.టీజర్కు ఊహించని రెస్పాన్స్..ఇప్పటికే కన్నప్ప టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Here’s a glimpse of the Darling-Rebel Star '𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬' in #Kannappa!🌟 🎬Experience the beginning of an epic journey, and don’t miss the full reveal on 3rd February. Stay tuned for more updates! 🙌 #Prabhas #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/ujJMFf93W8— Kannappa The Movie (@kannappamovie) January 27, 2025 -
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
అన్నదమ్ముల గొడవ వల్ల మోహన్బాబు ఏళ్లతరబడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అంతా బజారుకెక్కింది. పెదరాయుడిగా అందరి సమస్యలు తీర్చే మోహన్బాబు ఇంటి గొడవను చక్కదిద్దలేక డీలా పడిపోయాడు. రోజుకో వివాదం, ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతోనే రోజులు గడుస్తున్నాయి. కానీ, ఇంతవరకు వీరి సమస్య ఓ కొలిక్కి వచ్చిందే లేదు.నాన్న మనసు విరిగిందితాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు (Vishnu Manchu) తన ఇంట్లో జరుగుతున్న కలహాలపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. తండ్రిగా మోహన్బాబు (Mohanbabu).. మనోజ్ను, నన్ను సమానంగా ప్రేమించాడు. మా ఇంటి గొడవ రోడ్డుకెక్కడం వల్ల నాన్నగారి మనసు విరిగిపోయింది. ఆస్తుల గరించి ఒకటి చెప్పాలి. మా నాన్న మమ్మల్ని చదివించారు. తర్వాత ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. రేప్పొద్దున నా పిల్లలు కూడా నాపై ఆధారపడకుండా వారి కాళ్లపైనే నిలబడాలి. వారే సంపాదించుకోవాలి. ఎవరైనా సరే.. తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన ఆస్తి, ఇల్లు అడగకూడదు.అమ్మ కొడుతుందేమో..కుటుంబ విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నన్ను కొడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మతో పది నిమిషాల పైన మాట్లాడితే చాలు తిట్టడం మొదలుపెడుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ వివాదంలో ఎక్కువ నలిగిపోయింది అమ్మ. ఏదో ఒకరోజు అమ్మ మా అందర్నీ కొడుతుందేమోననిపిస్తోంది. ఇంటి గొడవ వీధిన పడ్డప్పుడు అందరం బాధపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో దగ్గరివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఇతర ఇండస్ట్రీకి చెందిన మోహన్లాల్, ప్రభుదేవా.. వంటివారు కూడా ఫోన్లు చేసి బాధపడ్డారు అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇంటి నుంచి మనోజ్ను బయటకు పంపాలంటూ మోహన్బాబు ఫిర్యాదు)మనోజ్తో కలిసిపోతా..మనోజ్ (Manchu Manoj)కు భయపడి దుబాయ్కు షిఫ్ట్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు నేను ఎవ్వరికీ భయపడను. ఈ జన్మలో భయపడటమనేదే జరగదు. జీవితంలో ఎవరికీ జంకొద్దనుకునే టైంలో నా భార్యకు భయపడాల్సి వస్తుంది. పిల్లల్ని దుబాయ్లో చదివించాలనుకుంటున్నానంతే! అన్నాడు. మనోజ్తో కలిసిపోతారా? అన్న ప్రశ్నకు.. అది కచ్చితంగా జరుగుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాలమే అన్నింటినీ మార్చేస్తుంది. చాలావరకు అన్నీ సద్దుమణిగాయి అన్నాడు. కుటుంబంజెనరేటర్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. జెనరేటర్లో చక్కెర పోస్తే ఫిల్టర్ ప్రాసెస్లోనే ఆగిపోతుంది తప్ప పేలదు. ఇది చాలా సిల్లీ అని నవ్వేశాడు. మోహన్బాబు కుటుంబ విషయానికి వస్తే.. ఈయన మొదటగా విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు లక్ష్మీ ప్రసన్న, విష్ణు జన్మించారు. విద్యా దేవి మరణించాక ఆమె సోదరి నిర్మలా దేవిని మోహన్బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మనోజ్ పుట్టాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విశేషాలుకన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఏడెనిమిది సంవత్సరాలపాటు దీనిపై అధ్యాయం చేశాను. శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్ను సంప్రదించినప్పుడు ఆయన ఆఫర్ రిజెక్ట్ చేశారు. మూడుసార్లు అడిగినా ఒప్పుకోలేదు. దర్శకురాలు సుధా కొంగరతో మాట్లాడించి తనను ఒప్పించాను. ప్రభాస్ సినిమాలో భాగమవడానికి నాన్నే కారణం అని చెప్పాడు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.చదవండి: సైఫ్ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
ఇంటి నుంచి మనోజ్ను బయటకు పంపాలంటూ మోహన్బాబు ఫిర్యాదు
మోహన్బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu Family) లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన మరువక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్కు మోహన్బాబు (Mohan Babu) శనివారం ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలో ఉన్న ఆస్తులను కొంతమంది ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించేసి ఆ ఇంటిని తనకు అప్పగించాలని కోరాడు.కాగా గత కొన్ని రోజుల నుంచి మోహన్బాబు తిరుపతిలోనే ఉంటున్నాడు. జల్పల్లిలోని ఇంట్లో భార్య, కూతురితో కలిసి మనోజ్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్బాబు కోరాడు. పోలీసుల దగ్గరి నుంచి మోహన్బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.. జల్పల్లిలోని ఇంట్లో ఉంటున్న మనోజ్కు నోటీసులు ఇచ్చారు.మోహన్బాబు ఫిర్యాదుతో మనోజ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లాడు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ను కలిశాడు. జల్పల్లిలోని ఇంటికి అక్రమంగా చొరబడలేదని తెలిపాడు. తమకు ఆస్తి తగాదాలు ఏమీ లేవని, విష్ణు (Manchu Vishnu).. తండ్రిని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడని ఆరోపించాడు. న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు.గత నెలలో మొదలైన గొడవమోహన్బాబు కుటుంబంలో కలహాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజులుగా మనోజ్ (Manchu Manoj), విష్ణు మధ్య వైరం పెరుగుతూనే వస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో మనోజ్ తనపై దాడి జరిగింది. మోహన్బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. నడవలేని స్థితిలో మనోజ్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో ఏం జరిగిందన్న ఉత్కంఠ నెలకొంది. అటు మంచు కుటుంబం మాత్రం అలాంటిదేం జరగలేదని ప్రకటించింది.జల్పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకున్న మనోజ్కానీ తర్వాత హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న మోహన్బాబు ఫామ్హౌస్ను మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నాడు. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే మోహన్బాబు.. అసాంఘిక శక్తుల నుంచి తనకు ప్రాణహాని అని చెప్తూ మనోజ్-మౌనికపై ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలోని తన నివాసం నుంచి మనోజ్, మౌనికను బయటకు పంపండి అని కోరాడు.చక్కెర గొడవ.. ర్యాలీతో రభసతర్వాత ఓ రోజు మనోజ్ ఇంట్లో పార్టీ చేసుకుంటే విష్ణు జనరేటర్లో చక్కెర పోశాడని గొడవ చేశాడు. అలాంటిదేం లేదని తల్లి స్వయంగా స్పందించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. రెండు రోజుల క్రితం మోహన్బాబు యూనివర్సిటీకి 200 మందితో ర్యాలీగా వెళ్లాడు మనోజ్. యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ కోర్టు ఉత్తర్వులు చూపించినా మనోజ్ వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో గొడవ జరగడంతో మనోజ్, మౌనికపై కేసు నమోదు అయింది. అటు మనోజ్ ఫిర్యాదుతో ఎంబీయూ సిబ్బంది, మోహన్బాబు బౌన్సర్లపైనా కేసు నమోదైంది.కుక్క తిట్లుఇంతలో శుక్రవారం విష్ణు, మనోజ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అన్న సినిమా డైలాగ్ను విష్ణు ట్వీట్ చేశాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని కౌంటరిచ్చాడు.మాట్లాడుకుందాం.. అంతలోనే ట్విస్ట్ఈ రోజు ఉదయం కలిసి మాట్లాడుకుందాం. నాన్నను, ఇంట్లోని ఆడవారిని, సిబ్బందిని అందర్నీ పక్కన పెట్టి రా. నేనూ ఒంటరిగానే వస్తాను. అన్ని విషయాలు చర్చించుకుందాం అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇంతలోనే మోహన్బాబు మెజిస్ట్రేట్ను ఆశ్రయించడం.. మనోజ్ కలెక్టరేట్కు వెళ్లి న్యాయం కోసం పోరాడతాననడం జరిగిపోయింది. ఇక ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి!చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా -
సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ వివాదాలు
-
'నువ్వు ఈ జన్మలోనే తెలుసుకుంటావ్'.. మంచు ఫ్యామిలీలో ట్విటర్ వార్!
మంచు వారి ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ దంపతులు వెళ్లగా మరోసారి వివాదం మొదలైంది.మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డితో కలిసి తాత, నానమ్మకు నివాళులర్పించేందుకు రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లకుండా వారిని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ అనుచరులు గేటు పైకి ఎక్కి లోనికి దూసుకెళ్లారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గతనెలలో తలెత్తిన వివాదం మరవకముందే మరోసారి గొడవ మొదలైంది.తాజాగా ఈ వివాదం తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. మొదట మంచు విష్ణు ట్వీట్ తన రౌడీ సినిమాలో డైలాగ్ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్ను పోస్ట్ చేశారు.అయితే దీనికి అదే స్టైల్లో మంచు మనోజ్ కౌంటరిచ్చారు. కన్నప్ప సినిమాలో కృష్ణం రాజులా అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్' అంటూ కృష్ణం రాజు సినిమాల పోస్టర్లను పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో అన్నదమ్ముల వార్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. అయితే ఇన్డైరెక్ట్గా మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న కన్నప్ప మూవీని మంచు మనోజ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025 ఇరువురిపై కేసులు..ఇప్పటికే మనోజ్, మోహన్బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు.#Kannapa lo #RebelStar Krishnam raju garu laga, Simham avalli ani prathi fraud kukkaki vuntudhi,e vishyam nuvu idhe janamlo telusukuntav. #VisMith (crack this guys) Clue (his Hollywood venture) pic.twitter.com/iJXIdEx59y— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 17, 2025 -
మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం వేళ.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. గతంలో జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో మోహన్ బాబు ఆస్పత్రి పాలయ్యారు. ఓ ప్రైవేట్ చికిత్స తీసుకుని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల సంక్రాంతి వేడుకల్లో కూడా మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అంత బాగుందనుకున్న తరుణంలో మరోసారి వివాదం మొదలైంది.ఈ పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబుకు యూనివర్సీటికి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. మనోజ్ దంపతులను లోపలికి అనుమతించక పోవడంతో ఆయన అనుచరులు గేటు పైకి ఎక్కి లోపలికి ప్రవేశించారు. మనోజ్కు అనుమతి లేదని వారు చెప్పడంతో ఇరువర్గాల వారు దూషణకు దిగారు. మనోజ్ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు. ఆపై ఎంబీయూలో పని చేస్తున్న కిరణ్ కుమార్పై దాడి చేశారు.మంచు విష్ణు ట్విటర్ పోస్ట్ వైరల్..ఈ గొడవల నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్ ఆడియోను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. నా ఫేవరేట్ డైలాగ్స్లో ఇది ఒకటి.. నా ఫేవరేట్ డైరెక్టర్ ఆర్జీవీ ఈ సినిమాను అందించాడు. ఇందులో ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ అంటూ ఇండస్ట్రీలో మోహన్ బాబు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో చూసేద్దాం.'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్ను మంచు విష్ణు షేర్ చేశారు. అయితే వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటి పోస్ట్ చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్ను ఉద్దేశించే చేశారా? అనే తెగ చర్చించుకుంటున్నారు. కేసులు నమోదు..ఈ వివాదంతో చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు అయ్యాయి. మనోజ్, మోహన్బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురిపై పోలీసులు నమోదు చేశారు.తాత, నానమ్మకు మంచు మనోజ్ దంపతుల నివాళులు..తిరుపతికి వెళ్లిన మంచు మనోజ్.. తన భార్యతో కలిసి తాత, నానమ్మల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు. శ్రీవిద్యానికేతన్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంచు మనోజ్ చెప్పారు. ఆపై సుమారు 200 మందితో కలిసి ర్యాలీగా శ్రీవిద్యానికేతన్ మీదుగా నారావారిపల్లెకు చేరుకున్న మనోజ్.. అక్కడ మంత్రి నారా లోకేశ్తో సుమారు 25 నిమిషాల పాటు భేటీ కావడం విశేషం. One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025 -
సంక్రాంతి రభస: మోహన్బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు
తన అభిమానులపై దాడి చేయించినందుకుగానూ తండ్రి మోహన్బాబు (Mohan Babu), సోదరుడు విష్ణుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచు మనోజ్ (Manchu Manoj) జనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా కూతురు పుట్టాక వచ్చిన మొదటి పండగకు కూడా ఇంటికి రానివ్వడం లేదు. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. మా ఇంటి విషయాన్ని ఎవరితో చర్చించడం నాకు ఇష్టం ఉండదు. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లాను. కానీ మా కుటుంబ విషయాలేవీ ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు అన్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత మనోజ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కడుపులో ఎడమవైపు నొప్పి రావడంతో పోలీస్ స్టేషన్ వెనక కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.ఏం జరిగిందంటే? మనోజ్, భార్య మౌనికతో కలిసి బుధవారం నాడు తిరుపతికి వెళ్లాడు. నారావారిపల్లెకు వెళ్లి మంత్రి నారా లోకేశ్తో 25 నిమిషాలపాటు భేటీ అయ్యాడు. అనంతరం శ్రీవిద్యానికేతన్ స్కూల్కు 200 మందితో ర్యాలీగా వెళ్లాడు. అప్పటికే సిబ్బంది గేట్లు మూసివేయగా పోలీసులు భారీగా మెహరించారు. ఆయన స్కూల్ లోపలకు వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు కోర్టు ఉత్తర్వులను చూపించారు.సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా..?పండుగ పూట తాత, నానమ్మల సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా అని మనోజ్ అసహనం వ్యక్తం చేశాడు. తనను అనుమతించకపోతే రోడ్డుపై బైఠాయిస్తానన్నాడు. మోహన్బాబు యూనివర్సిటీ సమీపంలోని డెయిరీ వద్దకు భార్యతో కలిసి వెళ్లాడు మనోజ్. అక్కడ అతడి అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసరడంతో వారిపై మోహన్బాబు బౌన్సర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ మనోజ్.. భార్యతో కలిసి నానమ్మ, తాతల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు.చదవండి: మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో -
ఏడాదిన్నర క్రితమే తీసుకున్నా.. మీలో స్ఫూర్తి కోసమే చెబుతున్నా: మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఉన్న మాతృశ్య ఫౌండేషన్కు చెందిన 120 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితమే వారిని దత్తత తీసుకున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఈ విషయాన్ని సంక్రాంతి సందర్భంగా ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.మంచు విష్ణు తన ట్వీట్లో రాస్తూ..' ఏడాదిన్నర క్రితం తిరుపతిలోని(Tirupati) శ్రీమతి శ్రీదేవి గారు నిర్వహిస్తున్న మాతృశ్య ఫౌండేషన్కు వచ్చా. ఇక్కడ ఉన్న 120 మంది పిల్లలను దత్తత తీసుకున్నా. వారి విద్యతో పాటు కొత్త బట్టలు అందిస్తున్నా. మనలాగే వారికి కూడా పండుగలు ఆనందకరమైన క్షణాలుగా ఉండేలా చూసుకుంటున్నా. ఈ విషయాన్ని నేను అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రపంచానికి కూడా ఇలాంటి స్టోరీస్ తెలియజేయాలని భావిస్తున్నా. ఇది నేను చేసిన గొప్ప పనేం కాదు.. సమాజానికి ఓ చిన్నసేవ మాత్రమే. ఇది మీకు స్ఫూర్తినిస్తే.. మీ శక్తితో అవసరంలో ఉన్న ఎవరికైనా మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నా' అని పోస్ట్ చేశారు.సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ రోజు పిల్లలను అల్పాహారానికి ఆహ్వానించినట్లు మంచువిష్ణు తెలిపారు. ఈ పండుగ స్ఫూర్తిని నింపుతూ వారితో ఆనందాన్ని పంచుకున్నానని వెల్లడించారు. పిల్లల చిరునవ్వు ఆశీర్వాదం..ఈ చిన్నపిల్లలే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదిగి.. అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేస్తారనే నమ్మకముందని మంచు విష్ణు పోస్ట్ చేశారు.కన్నప్పలో మంచు విష్ణు..మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్బాబు, మోహన్లాల్, శరత్కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలో కిరాట పాత్రలో మలయాళ స్టార్ నటుడు మోహన్లాల్ నటిస్తున్నారు.కన్నప్ప కథేంటంటే..కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నదిఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నామని మోహన్బాబు వెల్లడించారు.టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్..మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. కన్నప్ప టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్లా అనిపించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో రికార్డ్ స్థాయిలో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. A year and a half ago, I adopted 120 children from Matrusya Foundation, Tirupati, run by Ms. Sridevi garu. I take care of their education, provide them with new clothes, and ensure festivals are moments of joy for them.I wasn’t keen to share this with the world, but I feel the… pic.twitter.com/A80PwnRhR9— Vishnu Manchu (@iVishnuManchu) January 14, 2025 -
120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు
హీరో మంచు విష్ణు (Manchu Vishnu) గొప్ప మనసు చాటుకున్నాడు. 120 మంది అనాథలను దత్తత తీసుకున్నాడు. ఒక కుటుంబసభ్యుడిలా వారికి అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటానన్నాడు. సంక్రాంతి పండగ సైతం చిన్నారులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. పిల్లలకు నచ్చిన బొమ్మలు కూడా కొనిపెడతానన్నాడు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమను అందరూ కుటుంబసభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా..సాధారణంగా కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ ఈ సంక్రాంతికి నేను చేసిన ఓ చిన్న పని మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను చేసిన పనిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పక్కన ఉన్నవాళ్లకు సాయం చేస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. తిరుపతిలో మోహన్బాబు యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారాలను నేను చూసుకుంటూ ఉంటాను. ఓ రోజు తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా మాతృశ్య అనాథాశ్రమం నిర్వహిస్తున్న శ్రీదేవి పరిచయమయ్యారు. (చదవండి: డాకు మహారాజ్లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?)120 మంది చిన్నారుల బాధ్యత నాదేఒకసారి తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించారు. ఏ స్వలాభం లేకుండా సహృదయంతో 120 మందికి పైగా చిన్నారుల బాగోగులు చూసుకుంటోంది. ఏడాదిన్నర క్రితం ఆ అనాథాశ్రమానికి వెళ్లాను, పిల్లలందర్నీ దత్తత తీసుకుంటానని చెప్పాను. చెప్పిన మాట ప్రకారం చిన్నారులను దత్తత తీసుకున్నాను. వారికి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే పిల్లలందరి చదువుకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. పండగలకు వారితో కలిసుందామని సంక్రాంతికి ఇక్కడికి వచ్చాను.బర్త్డే రోజు అనవసర ఖర్చులు పక్కన పెట్టండివీళ్లంతా నా కుటుంబసభ్యులే.. ఒక అన్నగా, ఇంటిపెద్దగా పిల్లలతో పండగ జరుపుకున్నాను. ఇది మీకూ నచ్చితే ఎవరినైనా దత్తత తీసుకోండి. పుట్టినరోజు అనవసర ఖర్చులు చాలా ఉంటాయి. అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అవసరం ఉన్నవారికి సాయపడితే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు.. కాబట్టి నేను ఇప్పుడు సాయపడగలుగుతున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దవాళ్లయ్యాక.. వారు మిగతావారికి సాయపడాలి. అది ఇప్పటినుంచే నేర్పిస్తున్నాను అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.చదవండి: 50 ఏళ్ల వయసులో హీరోయిన్ డేటింగ్? నిజమిదే! -
నిన్న జరిగింది మర్చిపోను.. రేపటి గురించి ఆలోచించను: మోహన్ బాబు
తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో (Mohan Babu University) బుధవారం నాడు సంక్రాంతి (Sankranthi) వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ విద్యార్థులు ముగ్గుల పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, ఈ సంక్రాంతి వేడుకల్లో యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు సినీ డైలాగ్స్తో అక్కడి విద్యార్థులను ఆనందపరిచారు. వేదికపై ఆయన మాట్లాడాతూ.. గతం గతః అనే వ్యాఖ్యలు చేశారు.యూనివర్సిటీ వేదికపై మోహన్బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. తాను నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. 'నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వెయ్యను, రేపటి గురించి ఆలోచించను' అని మెప్పించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏడాది విద్యార్థులతో కలిసి బోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని మోహన్ బాబు అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి యువత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సంక్రాంతి అంటే రైతు అని, రైతు బాగుంటేనే మనంందరం బాగుంటామని ఆయన గుర్తుచేశారు. కాబట్టి సంక్రాంతి అనేది మనందరి పండుగ అన్నారు.ఈ క్రమంలో మోహన్బాబును కన్నప్ప సినిమా పనుల గురించి మీడియా వారు ప్రశ్నించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు ఆయన తెలిపారు. 'ఏఫ్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సినిమాపై నమ్మకంతో మేము ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాం. శ్రీకాళహస్తీశ్వరుడిపై ఇప్పటివరకూ విడుదలైన సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. పరమశివుడి వరంతో నేను జన్మించాను.(ఇదీ చదవండి: హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్ ) అందుకే నా పేరు భక్తవత్సలం అని మా తల్లిదండ్రుల పెట్టారు. కాబట్టి ఆయనే మమ్మల్ని ఆదుకుంటాడు. సినిమా పరిశ్రమలో జయాపజయాలు సహజం. కానీ, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రకృతిని కూడా కోరుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్పై నా బిడ్డ విష్ణు ఎన్నో కలల కన్నాడు. ఒకరకంగా ఇది అతనికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెబుతాను. కాబట్టి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్బాబు, మోహన్లాల్, శరత్కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్బాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. -
కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కనిపించనున్నారు.ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ చూస్తే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను అలరించింది. యూట్యూబ్లోనూ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో పార్వతి దేవి పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ మేరకు నాలుగు భాషల్లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు క్యారెక్టర్ను పరిచయం చేశారు. పార్వతి దేవి లుక్లో కాజల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా పోస్టర్ను చూసేయండి.కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ.. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇందులో కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్లాల్ నటిస్తున్నారు. గతంలోనే ఆయన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు.కన్నప్ప కథేంటంటే..పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం అన్నారు మోహన్బాబు.విజువల్ వండర్గా కన్నప్ప..ఈ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్గా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు. ఆడియన్స్ను మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ను పాన్ ఇండియాలో ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. 🌟 Divine Grace Personified 🌟Here is the glorious full look of @MsKajalAggarwal as '𝐌𝐀𝐀 𝐏𝐚𝐫𝐯𝐚𝐭𝐢 𝐃𝐞𝐯𝐢'🪷 the divine union with '𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, in #Kannappa🏹. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025 -
మంచు విష్ణు ముద్దుల తనయుడు.. బాల కన్నప్ప బర్త్డే (ఫోటోలు)
-
మంచు ఫ్యామిలీలో అడవి పంది వివాదం
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులంతా కనిపించనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు క్యారెక్టర్లను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నెమలి అనే రాకుమార్తెగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రీతి ముకుందన్ తన గ్లామర్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. అంతకుముందు ప్రీతి టాలీవుడ్ చిత్రం ఓం భీమ్ బుష్లో నటించింది. ఈ మూవీలో జలజ అనే పాత్రలో మెరిసింది.(ఇది చదవండి: 'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!) పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న కన్నప్ప చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమాతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కుమార్తెలు కూడా కన్నప్పలో నటిస్తున్నారు. ఇటీవల వారిద్దరి పోస్టర్లను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.✨ Behold the mesmerizing look of Preity Mukhundhan as Princess 𝐍𝐞𝐦𝐚𝐥𝐢 in #Kannappa 🏹✨ Sharing the screen with @iVishnuManchu, she adds grace and charm to this divine tale. 🌺Experience the magic and splendor of divinity! 🙏 #HarHarMahadevॐ@themohanbabu @Mohanlal… pic.twitter.com/UVgiPVwL4K— Kannappa The Movie (@kannappamovie) December 30, 2024 -
ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది: మంచు విష్ణు
కొద్దిరోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సంఘటనలు జరగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడితే... కుటుంబంలో విభేదాలు రావడంతో మంచు ఫ్యామిలీలో కేసుల వరకు గొడవలు వెళ్లాయి. దీంతో పలువురు చిత్ర పరిశ్రమ నుంచి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షునిగా మంచు విష్ణు అధికారిక ప్రకటన చేశారు.'మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం,సాన్నిహిత్య సంబంధాలతో కలిగి ఉంటారు. సహకారం, సృజనాత్మకత పై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన ఇండస్ట్రీ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రత్యేకంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి.ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం గానీ నివారించండి.కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను.' అని విష్ణు ఒక ప్రకటన చేశారు. -
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో స్టార్ హీరోహీరోయిన్స్ (ఫొటోలు)
-
మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ.. అన్నపై మనోజ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో మళ్లీ ముసలం మొదలైంది. మంచు మనోజ్.. తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మోహన్బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తిపైనా కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఏడు పేజీల ఫిర్యాదును సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు.ఏం జరిగిందంటే?కాగా డిసెంబర్ 8న మోహన్బాబు (Mohan Babu) ఇంట్లో హైడ్రామా నడిచింది. మనోజ్పై మోహన్బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరలవగా.. అంతలోనే నడవలేని పరిస్థితిలో మనోజ్ ఓ ఆస్పత్రిలో చేరాడు. మనోజ్ తనపై దాడి జరిగిందంటూ డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్బాబు, మనోజ్ (Manchu Manoj) ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు.ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9న రాత్రి మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్బాబు.. తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబుకు ఫిర్యాదు చేశాడు. మనోజ్, అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరాడు. జర్నలిస్ట్పై దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే.. ఇటీవల తన ఇంటి జనరేటర్లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురి చేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలో నిజం లేదని మోహన్బాబు సతీమణి నిర్మల వివరణ ఇచ్చింది.చదవండి: శ్రీదేవి నాతో ఉన్నట్లే ఉంది.. అప్పుడెంతో ప్రయత్నించా, కానీ..: బోనీ కపూర్ -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవల కన్నప్ప కామిక్ బుక్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యానిమేటెడ్ సిరీస్కు సంబంధించిన తొలి ఎపిసోడ్ను మంచు విష్ణు విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. 🌟 Unveil the saga of '𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚' 🌟Dive into the epic tale of #Kannappa🏹 in our first Animated Comic Book—devotion, bravery, and sacrifice brought to life.Episode 1 is streaming now on YouTube! 🎥✨🔗Telugu: https://t.co/iolkS7zeS3🔗Tamil: https://t.co/sQP4xKrQGG… pic.twitter.com/pqJf9ZXPSm— Vishnu Manchu (@iVishnuManchu) December 23, 2024 -
'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తోంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. మోహన్ బాబు- మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం దగ్గర నుంచి తాజాగా మోహన్ బాబు భార్య నిర్మల.. మనోజ్ చేసిందని తప్పంటూ లేఖ విడుదల చేయడం వరకు వచ్చింది. దీని వల్ల మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓ నెటిజన్కి ట్వీట్కి విష్ణు ఆసక్తికర రిప్లై ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'కన్నప్ప'. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు-కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.'కన్నప్ప'లో ప్రభాస్ కూడా అతిథి పాత్ర చేస్తున్నాడు. తాజాగా ఓ నెటిజన్.. విష్ణుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. 'అన్నా.. మూవీ ఎలా ఉన్నా పర్లేదు. ప్రభాస్ లుక్స్, పాత్ర తేడా రాకుండా చూస్కో. ఐదు సార్లు వెళ్తా మూవీకి' అని రాసుకొచ్చాడు. దీనికి రిప్లై ఇచ్చిన విష్ణు.. '100 శాతం మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్. కాస్త ఓపిగ్గా ఉండు. త్వరలో బోలెడన్ని విషయాలు చెబుతా' అని అన్నాడు. (ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల)My brother, I am 100% sure you will love my brother #prabhas character and I wish I can tell you more. Exciting to reveal more. Patience please 🙏 🤗🥰 https://t.co/956puAYJ4X— Vishnu Manchu (@iVishnuManchu) December 17, 2024 -
విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు : నిర్మల మోహన్ బాబు
-
నా కుమారుడు మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన నిర్మల
మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల పహాడీషరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. డిసెంబర్ 14న నిర్మల పుట్టినరోజును మనోజ్ సెలబ్రేట్ చేశారు. ఆ సమయంలో విష్ణు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే, విష్ణు .. తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తాజాగా నిర్మల ఒక లేఖ ద్వారా ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు తెలిపారు.పహాడీషరీఫ్ పోలీసులకు మంచు నిర్మల ఇలా తెలిపారు. 'డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకుని జల్పల్లిలోని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు సీసీ ఫుటేజ్ని బయట పెట్టి, ఆపై విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేశాడు. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కానీ, ఆరోజు అలాంటి ఘటన ఏమీ జరగలేదు. కేక్ కట్ చేయడం పూర్తి అయిన తర్వాత విష్ణు తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. నా చిన్న కుమారుడైన మనోజ్కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కుమారుడు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. ఆ సమయంలో విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ ఫిర్యాదు చేసిన దానిలో ఎలాంటి నిజం లేదు. ఇంట్లో పని చేసే వాళ్లు కూడా 'మేమిక్కడ పని చేయలేమని' వాళ్లే వెళ్లిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు.' అని తెలుపుతున్నాను అంటూ నిర్మల ఒక లేఖ విడుదల చేశారు.మనోజ్ చేసిన ఫిర్యాదు ఏంటి..?తన తల్లి నిర్మల పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చారని మనోజ్ తెలిపారు. ఆ సమయంలో వారు ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మంచు ఫ్యామిలీ గొడవపై RGV కామెంట్స్
-
కన్నప్పలో 'కిరాట'గా మలయాళ స్టార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్బాబు, మోహన్లాల్, శరత్కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్లాల్ నటిస్తున్నారని వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘కన్నప్ప’ సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు మోహన్బాబు. -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మోహన్ లాల్ క్యారెక్టర్ రివీల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు.ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024 -
కేక్ వంకతో విష్ణు ఇంట్లోకి వచ్చారు: మనోజ్
-
మంచు ఫ్యామిలీలో ‘పంచదార’ గొడవ
ప్రముఖ నటుడు మంచు మోహన్బాబు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జల్పల్లిలోని మంచు మోహన్బాబు నివాసంలో మనోజ్, విష్ణుల మధ్య మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. తన తల్లి పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చి ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు హైడ్రామా చోటు చేసుకుంది. తండ్రి మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గేట్లు తోసుకుని బలవంతంగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. మరోవైపు జర్నలిస్ట్పై దాడి ఘటనపై మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
జర్నలిస్ట్ రంజిత్కు మోహన్ బాబు పరామర్శ (ఫొటోలు)
-
జర్నలిస్ట్పై దాడి.. రంజిత్కు మోహన్బాబు పరామర్శ
జర్నలిస్ట్ రంజిత్కు సీనీ నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ని కలిసి పరామర్శించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యలను కలిసి.. తన వల్లే తప్పిదం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా రంజిత్ని కొట్టలేదని చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, రంజిత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తనపై దాడి జరిగితే.. జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణలు మీడియాకే చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మోహన్ బాబుతో పాటు మంచు మిష్ణు కూడా ఆస్పత్రికి వెళ్లి రంజిత్ను పరామర్శించాడు. కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. మరోవైపు తన కొడుకు మనోజ్తో ప్రాణ హానీ ఉందని మంచు మోహన్ బాబు కూడా కేసు పెట్టాడు. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేశాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్టులంతా ధర్నాకు దిగారు. పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మోహన్బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్బాబు కనపడుటలేదు…! అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రంజిత్ని కలిసి పరామర్శించాడు. -
Mohan Babu: గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబును కోరిన పోలీసులు
-
హాలీవుడ్ నటుడితో మంచు విష్ణు భాగస్వామ్యం
ప్రముఖ హీరో-నిర్మాత మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఓవైపు కుటుంబ సమస్యలతో సతమవుతున్న ఇతడు.. తరంగ వెంచర్స్ పేరుతో మీడియా-ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. 50 మిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టనున్నారు. హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్.. ఇందులో భాగస్వామి అయ్యేందుకు సుముఖంగా ఉన్నారని స్వయంగా విష్ణునే బయటపెట్టాడు. త్వరలో శుభవార్త వింటారని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మోహన్ బాబు పరారీలో ఉన్నాడా? ట్వీట్ వైరల్)విష్ణు ఆధ్వర్యంలోని తరంగ వెంచర్స్.. ఓటీటీ, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చెయిన్, సరికొత్త టెక్నాలజీలైన ఏఆర్, వీఆర్, ఏఐ వంటి సాంకేతికతకు సంబంధించిన సేవలను అందించనుంది. ఇందులో మంచు విష్ణు, ఆది శ్రీ, ప్రద్యుమన్ ఝాలా, వినయ్ మహేశ్వరి, విల్స్మిత్, దేవేష్ చావ్లా, సతీష్ కటారియాలు భాగస్వాములుగా ఉన్నారు. వీళ్లతో పాటు మరికొందరు కూడా ఆసక్తి చూపుతున్నారట.మంచు విష్ణు లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. రాబోయే ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ ఉంటుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీలో విష్ణుతోపాటు మోహన్బాబు, శరత్కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నారు. (ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?) -
మద్యం మత్తులో దురుసు ప్రవర్తన? క్లారిటీ ఇచ్చిన మనోజ్
మద్యం మత్తులో హీరో మంచు మనోజ్ ఓ పెద్దాయనతో దురుసుగా ప్రవర్తించాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. దీనిపై మనోజ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన బిడ్డను ఇంట్లో బంధించి, తన దగ్గరకు వెళ్లనివ్వకపోతే ఇంకెలా ప్రవర్తిస్తానని ప్రశ్నించాడు. అలాగే తాను మద్యం సేవించలేదని స్పష్టం చేశాడు.నేనే మీడియాను పిలిచా'తెలంగాణ డీజీపీ ఆఫీస్కు వెళ్లిన తర్వాత జరిగిన ఓ బాధాకర సంఘటన గురించి చెప్పాలి. దానివల్ల నేను, నా భార్య ఎంతో నరకం అనుభవించాం. మా తొమ్మిది నెలల కుమార్తెను ఇంట్లో బంధించి మమ్మల్ని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మాపై దాడి చేశారు. ఆ సమయంలో నా చొక్కా కూడా చిరిగిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను మీడియా సాయం కోరాను. మా ఇంటి ఆవరణలోకి రావడంలో వాళ్లది ఏమాత్రం తప్పులేదు.నా ఛాతీపై కొట్టడంతో..దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయాలని విష్ణు భాగస్వామి రాజ్ కొందూరును కోరుతున్నాను. ఇప్పటికే కిరణ్, విజయ్లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణ పూర్తయితే నిజాలు బయటకు వస్తాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో విషయానికి వస్తే.. తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి నా ఛాతీపై కొట్టాడు. నన్ను నేను రక్షించుకునే క్రమంలో ఆయన్ను వెనక్కు నెట్టేశాను. రెండురోజుల్లో నాపై జరిగిన రెండో దాడికి ఇదే నిదర్శనం. మీరైతే ఏం చేస్తారు?అయినా మీ తొమ్మిది నెలల చిన్నారి నుంచి మిమ్మల్ని దూరం చేస్తే మీరేం చేస్తారో చెప్పండి.. ఆ సమయంలో నేను తాగి ఉన్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ రోజంతా నేను పోలీసులతో, మీడియాతోనే ఉన్నాను. అలాంటి సమయంలో నేనెక్కడ మందు తాగాను? వినయ్ కావాలనే నాపై ఈ పుకార్లు సృష్టించాడు. ఆస్తి కోసం డిమాండ్ చేస్తున్నానన్నాడు. నా పరువు మర్యాదలకు భంగం కలిగించి నా నోరు నొక్కేయాలని చూస్తున్నాడు. కానీ నేను వెనక్కు తగ్గను.ఆయుధాలతో భయపెట్టాలని చూసిన విష్ణుఇదంతా జరుగుతున్నప్పుడు నా సోదరుడు విష్ణు ఎక్కడా కనిపించలేదు. మా నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే కనిపించాడు. దీనికంటే ముందు నాకు సపోర్ట్గా వచ్చినవారిని తన బౌన్సర్లతో భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలు కూడా తీసుకువస్తానన్నాడు. అయినప్పటికీ వారు ఏమాత్రం జంకకుండా నా కూతురికి రక్షణగా నిలబడ్డారు.నేను పారిపోవడం లేదువినయ్ నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇది అన్యాయం, అనైతికం. నేను ఏ తప్పూ చేయలేదు. సాక్ష్యాధారాలతో నాపై చేసిన ప్రతి ఆరోపణను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. నిజం నిప్పులాంటిది.. కచ్చితంగా బయటకు వస్తుంది అని మనోజ్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు.Press NoteI wish to address the deeply distressing incident that occurred following my visit to the Telangana DGP office. My wife and I were subjected to immense trauma when we were locked out of our own home, with our 9-month-old daughter left inside.After forcing our way… https://t.co/dlwU6wLcgS— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 13, 2024చదవండి: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ -
అలా చేయాల్సిన అవసరం నాకు లేదు: మోహన్ బాబు సంచలన కామెంట్స్
ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన మోహన్ బాబు మరో ఆడియో సందేశం రిలీజ్ చేశారు. ఈ ఘటన జరిగినందుకు తాను ఎంతో చింతిస్తున్నట్లు ఆడియో సందేశమిచ్చారు. మొదట తాను నమస్కారం పెట్టానని.. అయినప్పటికీ అతను మైక్ పెట్టాడని అన్నారు. జర్నలిస్టును కొట్టాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. మీడియాపై దాడి ఘటనపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు.నా కన్నుకు మైక్ తగలబోయిందని.. తృటిలో తప్పించుకున్నానని మోహన్ బాబు వెల్లడించారు. ఇలా మీడియా ప్రతినిధులపై దాడి చేయాల్సి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం తనకు లేదన్నారు. నా ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం న్యాయమేనా?అని ప్రశ్నించారు. నేను చేసింది న్యాయమా? అన్యాయమా? అనేది ప్రజలు, నాయకులు ఆలోచించాలని మోహన్ బాబు కోరారు.(ఇది చదవండి: ఆస్పత్రి నుంచి టాలీవుడ్ నటుడు మోహన్ బాబు డిశ్చార్జ్)నా ఇంట్లోకి వచ్చింది మీడియా వాళ్లు అవునో, కాదో తనకు తెలియదని మోహన్ బాబు చెప్పారు. నా ఇంటి లోపలికి వచ్చి ఏకాగ్రత, ప్రశాంతతను భగ్నం చేశారని అన్నారు. ఆవేశంలో తాను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందని.. ఈ ఘటనకు బాధపడుతున్నానని వివరించారు. జర్నలిస్టును కొట్టాలని ఆ దేవుడి సాక్షిగా తాను అనుకోలేదని మోహన్ బాబు వెల్లడించారు. మా కుటుంబ సమస్యకు మధ్యవర్తులు అవసరం లేదని.. నా పిల్లలతో కలిసి తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.పోలీసులపై సంచలన వ్యాఖ్యలు..పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు. పోలీసుల ప్రవర్తనను ప్రజలంతా గమనించాలని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఎవరి కుటుంబంలోనైనా ఇలాంటి గొడవలు సహజమేనని ఆడియో సందేశంలో మాట్లాడారు. -
మోహన్ బాబు కొత్త ఆడియో విడుదల
-
రాష్ట్రంలో తొలిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్: రాచకొండ సీపీ
మంచు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు మేనేజర్ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ వివాదంపై మొత్తం మూడు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా సెలబ్రిటీ బైండోవర్ తీసుకొచ్చామని అన్నారు. దీంతో పాటు మనోజ్ను ఏడాదిపాటు బైండోవర్ చేసినట్లు సీపీ వివరించారు. ఆయన నుంచి లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ తీసుకున్నామని పేర్కొన్నారు.మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన ఘటనపై కూడా కేసు నమోదు చేసినట్లు సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని.. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు బౌన్సర్లు గొడవ పడటమే వివాదానికి కారణమని సీపీ అన్నారు.బైండోవర్ అంటే ఏంటో తెలుసా?ఎవరి వల్ల అయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తే ఆ వ్యక్తిని తహసీల్దార్, ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. చట్ట వ్యతిరేక పనులు చేయనని బాండ్ పేపర్పై అతనితో లిఖితపూర్వకంగా సంతకం తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. దీన్నే బైండోవర్ అంటారు. బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్. బాండ్ ఇచ్చిన రోజు నుంచి ఆరు నెలల వరకు ఎలాంటి నేరాలు చేయకూడదు. ఈ ఆరు నెలల్లో ఏదైనా నేరం చేసినా, కేసు నమోదైనా బైండోవర్ సమయంలో చేసిన డిపాజిట్ డబ్బులను ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. భారత శిక్షాస్మృతి చట్టం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు బైండోవర్ అయితే అతనిపై రౌడీషీట్ తెరవొచ్చు. -
ఉదయం మనోజ్.. రాత్రి విష్ణు
సాక్షి, హైదరాబాద్/పహాడీషరీఫ్: మంచు మోహన్బాబు కుటుంబంలో గొడవలు, పరస్పర ఫిర్యా దులు, జల్పల్లిలోని మంచు టౌన్ షిప్లో మూడు రోజు లుగా చోటు చేసుకున్న ఘటనలపై రాచకొండ పోలీసు కమిషనర్ సుదీర్బాబు బుధవారం మోహన్బాబు కుమారులు, సినీనటులు మనోజ్, విష్ణులను విచారించారు. ఉదయం మనోజ్, రాత్రి విష్ణు నేరేడ్మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. పోలీసు కమిషనర్ సు«దీర్బాబు అదనపు జిల్లా మేజి్రస్టేట్ హోదాలో వారిని విచారించారు. దాదాపు గంటన్నర చొప్పున వారిని ప్రశ్నించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఘటనలతో జల్పల్లిలో ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరి స్థితి మరోసారి నెలకొనకుండా ఉండాలంటే.. చట్టానికి లోబడి వ్యవహరించాలని వారికి స్పష్టం చేశా రు. మంచు టౌన్íÙప్ పరిసరాల్లో శాంతియుత వాతావరణానికి ఆటంకం కలిగించొద్దని ఆదేశించా రు. ఈ మేరకు మనోజ్, విష్ణు ఇద్దరూ ఏడాది పాటు అదనపు జిల్లా మేజి్రస్టేట్, సీపీ సు«దీర్బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని విడివిడిగా బాండ్ రాసి ఇచ్చారు. రూ.లక్ష చొప్పున పూచీకత్తు చెల్లించారు. ఈ మేరకు మనోజ్, విష్ణులను పోలీసులు బైండోవ ర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధన లను పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. బౌన్సర్లు, బయటి వ్యక్తులను పంపేసిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం మంచు టౌన్షిప్లోని బౌన్సర్లు, బయటి వ్యక్తులను పహాడీషరీఫ్ పోలీసులు బయటికి పంపించారు. మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డిల పర్యవేక్షణలో భద్రత చర్యలు చేపట్టారు. ఆ నివాసంలో కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకులు మాత్రమే ఉండాలన్నారు. బయటివారు ఎవరూ ఉండకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ప్రతి రెండు గంటలకు ఒక సారి ఆ ప్రాంతంలో భద్రత పరిస్థితిని సమీక్షించారు. మోహన్బాబు సహాయకుడు వెంకట కిరణ్ అరెస్ట్ మంచు మనోజ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు బుధవారం పహాడీషరీఫ్ పోలీసులు వెంకట కిరణ్ను అరెస్ట్ చేశారు. ఆదివారం తనపై జరిగిన దాడికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీల హార్డ్డిస్క్లు ఎత్తుకెళ్లారంటూ వెంకట కిరణ్పై మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మోహన్బాబుకు వెంకట కిరణ్ సహాయకుడని సమాచారం. మరోవైపు మంగళవారం రాత్రి మోహన్బాబు ఇంటి వద్ద పలువురు జర్నలిస్ట్లపై దాడి ఘటనకు సంబంధించి.. బుధవారం ఉదయం మంచు టౌన్షిప్ ముందు జర్నలిస్టులు ఆందోళన చేశారు. మోహన్బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాం డ్ చేశారు. ఇంట్లోనే ఉన్న మనోజ్ బయటికి వచ్చి జర్నలిస్ట్ల ఆందోళనకు మద్దతు తెలిపారు. అంతా ఆ ఇద్దరే చేస్తున్నారు: మనోజ్ ‘‘మా నాన్న దేవుడు.. కానీ ఈ రోజు చూస్తున్న నాన్న కాడు. నాపై మా అన్న విష్ణు, అతడి అనుచరుడు విజయ్ లేనిపోనివి మా నాన్నకు నేర్పుతూ నన్ను విలన్గా చిత్రీకరించారు. నా వ్యక్తిగత జీవితంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది. నాన్న చెప్పిన అన్ని పనుల కోసం గొడ్డులా కష్టపడ్డాను. ఒక్క రూపాయి కూడా అడగట్లేదు..’’అని మంచు మనోజ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఒంటరిగా ఉన్నామని, తన భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. అమ్మ, నాన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారని, అన్న దుబాయ్కు షిఫ్ట్ అయ్యారని.. తన భార్య మౌనికకు తన తల్లి అండ ఉండాలని తండ్రి స్నేహితులు కొందరు చెప్పడంతోనే ఇంటికి తిరిగి వచ్చానని మనోజ్ చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటన్నింటినీ సాక్ష్యాధారాలతో బయటపెడతానని పేర్కొన్నారు. ‘‘నా భార్య వచ్చాక నేను చెడ్డవాడినయ్యానని ఆరోపిస్తున్నారు. తల్లితండ్రి లేని నా భార్యకు అన్నీ నేనై చూసుకోవాలి. తాను సొంతంగా టాయ్ కంపెనీ పెట్టుకుంది. స్నేహితుల సహకారంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారాన్ని కొనసాగించగలుగుతున్నాం..’’అని తెలిపారు. తనపై దాడి జరిగిన రోజు ఇంట్లో పది కార్లు ఉన్నప్పటికీ.. తాను 108 అంబులెన్స్లో ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మోహన్బాబు ముఖంపై గాయాలు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు ఆయన ఛాతీపైనా గాయాలు.. కంటి కింద వాపు హైబీపీ, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్టు వెల్లడి సాక్షి, హైదరాబాద్: కుటుంబ కలహాలతో తీవ్ర అస్వస్థతకు గురైన నటుడు మోహన్బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ గురు ఎన్.రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం మోహన్బాబు ఆస్పత్రిలో చేరారని.. ఆ సమయంలో ఆయనకు బీపీ ఎక్కువగా ఉందని, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు. మోహన్బాబు ముఖం, ఛాతీపై కొన్ని గాయాలు ఉన్నాయని.. కంటి కింద వాపు ఉన్నట్టు గుర్తించామని వివరించారు. ఈసీజీ, ఈకో నివేదికలు సాధారణంగానే ఉన్నాయని, సీటీ స్కాన్ చేశాక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అంచనాకు వస్తామని తెలిపారు. చిరునవ్వులతో మంచు లక్ష్మి కుమార్తె వీడియో: మంచు కుటుంబంలో మంటలు రేగుతున్న వేళ.. మోహన్బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న సామాజిక మాధ్యమంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ముంబైలో ఉన్న మంచు లక్ష్మి తన ఇన్స్ట్రాగామ్ ఖాతాలో తన కుమార్తె విద్యా నిర్వాణ చిరునవ్వులు చిందిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు ‘పీస్ (ప్రశాంతత)’అని క్యాప్షన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. -
మంచు విష్ణు VS మంచు మనోజ్ మాటల యుద్ధం
-
హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!
హైకోర్టులో మంచు మోహన్బాబు భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్బాబు ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. నిన్న జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబం వ్యవహారం అని ధర్మాసనం అభిప్రాయపడింది. మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా, మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.కాలి నొప్పితో బాధపడుతున్న మోహన్ బాబుఅనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఆయన మెడ, కాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గురునాథ్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతు ఇదే విషయాన్ని చెప్పారు. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. -
వివాదంలో మంచు ఫ్యామిలీ.. రాజీకి మనోజ్, విష్ణు రెడీ?
క్రమశిక్షణకు మారుపేరైన మంచు కుటుంబంలో.. వివాదం రాజుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పైగా మీడియా మీద మోహన్బాబు దాడి తర్వాత వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. -
నాకు సీపీని కలవాల్సిన అవసరం లేదు.. కానీ కలుస్తా..
-
అమ్మ ఇంట్లోనే ఉంది.. మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా: మనోజ్
రాచకొండ సీపీ ముందు విచారణకు హాజరైన మంచు మనోజ్ కీలక విషయాలు వెల్లడించారు. తానెప్పుడూ ఆస్తులు అడగలేదని.. నాపై కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. జల్పల్లిలోని మా ఇంట్లోనే అమ్మ ఉందని.. ఆస్పత్రికి వెళ్లలేదని.. ఈ విషయంపై అబద్ధాలు చెబుతున్నారని మనోజ్ తెలిపారు.కూర్చోని మాట్లాడుకోవడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని మంచు మనోజ్ వెల్లడించారు. సిపీని కలిసి జరిగిందంతా వివరించినట్లు తెలిపారు. నా వైపు నుంచి ఎలాంటి గొడవ జరగదని సీపీకి చెప్పినట్లు వివరించారు. మీడియా ప్రతినిధులపై దాడి జరగడం దురదృష్టకరమని.. నాన్న తరఫున నేను క్షమాపణలు కోరుతున్నానని మనోజ్ అన్నారు. ఇవాళ సాయంత్రం ప్రెస్మీట్లో అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.కాగా.. మంగళవార మోహన్ బాబు ఇంటి వద్ద గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద మనోజ్ను సెక్యూరిటీ అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఫ్యామిలీలో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు గన్స్ సీజ్ చేశారు. అంతేకాకుండా సీపీ ముందు హాజరవ్వాలని మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మనోజ్కు నోటీసులు జారీ చేశారు. -
మోహన్ బాబు సంచలన ఆడియో లీక్..!
-
LIVE: మా ఫ్యామిలీ సమస్యల గురించి నేను మాట్లాడను: Manchu Vishnu
-
'మంచు' ఫ్యామిలీలో గొడవ.. తొలిసారి స్పందించిన విష్ణు
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి. చిన్నకొడుకు మనోజ్.. తండ్రిపై కేసు పెట్టడం, మంగళవారం రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి తలుపులు తోసుకుని మరీ లోపలికి వెళ్లడం.. ఈ క్రమంలో జర్నలిస్టులతో మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించడం. కాసేపటికే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరడం.. ఇలా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి.(ఇదీ చదవండి: నటుడు మోహన్ బాబు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?)ప్రస్తుతానికి మీడియాలో మనోజ్ కనిపిస్తున్నాడు. మరోవైపు మోహన్ బాబు మాత్రం ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు తమ కుటుంబంలో జరుగుతున్న రచ్చపై మంచు విష్ణు స్పందించాడు. తండ్రికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న ఆస్పత్రి నుంచే మీడియాతో మాట్లాడాడు. ఇలాంటి పరిస్థితి తన కుటుంబానికి వస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.(చదవండి: ఆ విషయంలో సీపీకి హామీ ఇచ్చా: మంచు మనోజ్)'ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందని ఊహించలేదు. మూడు తరాలుగా నాన్నగారు ఏంటనేది మీకు తెలుసు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సాధారణమే. అవి పరిష్కారమవుతాయని పెద్దలు కోరుకుంటారు. నేను ఎమోషనల్ పెయిన్ఫుల్గా ఉన్నాను. మా నాన్న చేసిన తప్పు మమల్ని విపరీతంగా ప్రేమించటం. మీడియా వారు.. మీకు కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి. కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు''మా అమ్మ బాధలో ఉంది. నాన్నకు దెబ్బలు తగిలాయి. లాస్ ఏంజెల్స్లో 'కన్నప్ప' మూవీ పనుల్లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసింది. దీంతో అన్నీ వదిలి వచ్చేశాను. మీడియా వ్యకికి గాయాలు తగలటం బాధాకరం. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. మీడియా వారికి నమస్కరిస్తూ వచ్చారు. మోహం మీద ఏదో పెట్టారని.. అలా జరిగిపోయింది. గాయమైన వ్యక్తి కుటుంబంతో టచ్లో ఉన్నాం. పోలీసులు మా కంటే ముందు మీడియాకు లీక్ ఇస్తున్నారు. నోటీసులు ఈ రోజు 9:30కి జారీ చేశారు. దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను'(ఇదీ చదవండి: మా నాన్న దేవుడు: మంచు మనోజ్)'మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు. నాకు కలవాల్సిన అవసరం లేదు. కానీ వారిని గౌరవించి కలుస్తాను. ప్రేమతో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు. మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేదేం లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను. నేను ఇక్కడ ఉంటే ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. తమ్ముడు పెళ్లి శుభకార్యం.. బిడ్డను కన్నారు. దాని గురించి ఎవరు ఫీలవరు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయంకృషితో గొప్ప స్దాయికి ఎదిగారు. కుటుంబం పరంగా నాన్న ఏది అనుకుంటే అదే ఉండాలి''మీడియాలో కొందరు హద్దు మీరుతున్నారు. పబ్లిక్ ఫిగర్స్పై రిపోర్ట్ చేయటం మీడియా బాధ్యత. లోపల తండ్రి స్దాయి వ్యక్తి ఉంటే తలుపులు బద్దలు కొడతారా? మా కుటుంబంలో బయటి వ్యక్తులు ఇన్ వాల్వ్మెంట్ ఉంటే వారికి ఈవెనింగ్ దాకా సమయం ఇస్తున్నాం. లేదంటే అందరి పేర్లు నేనే బయడపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చెస్తాను. కానీ నా తమ్ముడిపై నేనిప్పుడు దాడులు చేయను. కాలమే అన్నింటికీ సమాధానాలు ఇస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఎడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు' అని విష్ణు తన ఆవేదనని బయటపెట్టారు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
మా నాన్న దేవుడు: మంచు మనోజ్
సాక్షి, హైదరాబాద్: మీడియా మిత్రులపై మా నాన్న(మంచు మోహన్బాబు) దాడి చేయడం బాధాకరమని, ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు మంచు మనోజ్. మీడియాపై మోహన్బాబు చేసిన దాడిని ఖండిస్తూ ధర్నాకు దిగిన జర్నలిస్టులకు ఆయన మద్దతు తెలిపారు. తన కోసం వచ్చిన మీడియా మిత్రులపై దాడి చేయడం దారుణమన్నారు. తనపై మోహన్బాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నేను ఆస్తుల కోసం ఏ రోజు కూడా గొడవ చేయలేదు. నా సొంత కాళ్లపై నిలబడుతున్నాను. నేను మద్యానికి బానిసై కొడుతున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా నాన్న దేవుడు.. ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు. ఆయన భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాలుస్తున్నారు. మా బంధువులపై దాడి చేశారు. నా భార్య, ఏడు నెలల పాపను గొడవలోకి లాగుతున్నారు. ఈ గొడవల మధ్య మా అమ్మ నలిగిపోతుంది. ఇన్ని రోజులు ఆగాను.. ఇక ఆగలేను. అసలేం జరిగింది? గొడవ దేనికోసం అనేది ఈ రోజు(డిసెంబర్ 11) సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను’ అని మంచు మనోజ్ అన్నారు.(చదవండి: నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు)కాగా, సీనియర్ నటుడు మోహన్బాబు ఫ్యామిలీ గొడవలు మంగళవారం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి వరకు హైడ్రామా నడిచింది. మంచు విష్ణు, మనోజ్ల బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలతో ‘మంచు టౌన్’హీటెక్కింది. ఈ గొడవను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్బాబు దాడి చేశాడు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్టులు అక్కడే ధర్నాకు దిగారు. -
రాచకొండ సీపీ నోటీసులు
-
హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఆస్తుల విషయమై చిన్న కొడుకు మంచు మనోజ్ రచ్చ చేస్తున్నాడు. గత రెండు రోజుల నుంచి చూస్తే తొలుత మోహన్ బాబు-మనోజ్ ఒకరిని ఒకరు కొట్టుకున్నారని.. హైదరాబాద్లోని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారని న్యూస్ వచ్చింది. ఇదంతా పక్కనబెడితే మంగళవారం రాత్రి మాత్రం పెద్ద గొడవ జరిగింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడం, గేట్ల మూసేసరికి వాటిని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.(ఇదీ చదవండి: 'నిన్నే బాగా చూసుకున్నా.. కానీ నా గుండెలపై తన్నావ్': మోహన్ బాబు ఆవేదన)మరోవైపు ఇంటి దగ్గరకొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం, ఇది జరిగిన కాసేపటికి మనోజ్ని ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఆడియో విడుదల చేయడం.. ఇలా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆడియోలో చెప్పినట్లు ఈ గొడవల వల్ల మోహన్ బాబు భార్య ఆస్పత్రిలో చేరింది. ఇప్పుడు ఈయన కూడా పలు అనారోగ్య సమస్యలతో గచ్చిబౌలిలోనూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. హైబీపీ, గుండెలో నొప్పి సమస్యతో మోహన్ బాబు బాధపడుతున్నారు.ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నాడు. మరి ఈ వివాదంలో బుధవారం ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే ఇద్దరి దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్స్ తమకు సరెండర్ చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులు మోహన్ బాబుతో పాటు అతడి కొడుకుల్ని ఆదేశించారు.బీపీ ఎక్కువ కావటంతో మోహన్ బాబుకు అస్వస్థత.. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో మోహన్ బాబు pic.twitter.com/V0GHBVpSUJ— Telugu Scribe (@TeluguScribe) December 11, 2024(ఇదీ చదవండి: ముదిరిన మంచు ఫ్యామిలీ గొడవ.. పోలీసుల కీలక నిర్ణయం!) -
మంచు ఫ్యామిలీలో మంటలు!
సాక్షి, హైదరాబాద్/పహాడీ షరీఫ్: సీనియర్ నటుడు మంచు మోహన్బాబు కుటుంబంలో గొడవలు మంగళవారం తారస్థాయికి చేరాయి. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్బాబు నివాసం ‘మంచు టౌన్’వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఓవైపు పోలీసులు, మరోవైపు వ్యక్తిగత బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలు.. దూషణలు.. మీడియా ప్రతినిధులపై దాడితో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విష్ణు ఇన్... మనోజ్ ఔట్... దుబాయ్ నుంచి ‘మంచు టౌన్’కు తిరిగి వచి్చన మోహన్బాబు పెద్ద కుమారుడు విష్ణు తొలుత తన సోదరుడు మనోజ్తో ఇటీవలి పరిణామాలపై చర్చించారు. అయితే ఆ చర్చలు సఫలం కాకపోవడంతో ఇంటిని అ«దీనంలోకి తీసుకొని మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి సిబ్బంది, బౌన్సర్లను బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ నేపథ్యంలో ఆయా బౌన్సర్ల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణలు జరిగాయి. ఆ ఇల్లు మోహన్బాబు పేరిట ఉండటంతో అక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేకపోయారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న మనోజ్..తనపై దాడి జరిగిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా తనకు రక్షణ కల్పించకుండా పహాడీషరీఫ్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. తాను ఆస్తి, డబ్బు కోసం పోరాటం చేయట్లేదని.. ఆత్మగౌరవం, భార్యాపిల్లల రక్షణ కోసం పోరాడుతున్నానన్నారు. ఈ విషయంలో న్యాయం కోసం ప్రపంచంలో ఎవరినైనా కలుస్తానంటూ వ్యాఖ్యానించారు. అనంతరం శాంతిభద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్తోపాటు ఇంటెలిజెన్స్ డీజీ బి. శివధర్రెడ్డిని సతీసమేతంగా వెళ్లి వేర్వేరుగా కలిశారు. తనకు అన్యాయం జరుగుతోందని.. న్యాయం చేయాలని.. రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు సోమవారం మనోజ్, మోహన్బాబు ఇచి్చన పరస్పర ఫిర్యాదులపై వేర్వేరు కేసులు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు కోసం ‘మంచు టౌన్’కు వెళ్లారు. మోహన్బాబు నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రానికి హీటెక్కిన వాతావరణం... మోహన్బాబు, విష్ణు తమ అనుచరులతో కలిసి మనోజ్ దంపతుల సామగ్రిని బయటకు తరలించడానికి రెండు వాహనాలను సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్, మౌనిక తిరిగి ‘మంచు టౌన్’కు వెళ్లారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన ఏడు నెలల పాప ఇంట్లో ఉందంటూ వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు. బలవంతంగా గేట్లు తెరుచుకుని లోపలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు మంచు టౌన్ వద్ద అదనపు బలగాలను మోహరించారు. అక్కడి నుంచి బౌన్సర్లను బయటకు పంపారు. ఈలోగా మోహన్బాబు తన చిన్నకుమారుడి తీరును ఆక్షేపిస్తూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అనంతరం గేటు బయటకు వచ్చి అక్కడున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు. దాడిని ఖండించిన జర్నలిస్టులు.. మోహన్బాబు క్షమాపణ చెప్పాలంటూ అక్కడే ధర్నా చేశారు. మరోవైపు మోహన్బాబు కాలికి గాయం కావడంతో విష్ణు ఆయన్ను గచి్చ»ౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఉదంతంలో గాయపడ్డ జర్నలిస్టును పోలీసులు శంషాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, టీవీ9 విలేకరి రంజిత్ ఫిర్యాదు మేరకు మోహన్బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు పోలీసుల ఎదుటకు.. మోహన్బాబు, ఆయన కుమారులను బుధవారం ఉదయం 10:30 గంటలకు స్వయంగా తన ఎదుటహాజరుకావాలని రాచకొండ సీపీ సు«దీర్బాబు నోటీసులు జారీ చేశారు. అలాగే ముగ్గురి తుపాకులతోపాటు రూ. లక్ష చొప్పున పూచికత్తు సమర్పించాలని ఆదేశించారు.గారాబంగా పెంచిన నా గుండెలపై తన్నావుమనోజ్ను ఉద్దేశించి ఆడియో సందేశంలో మోహన్ బాబు సాక్షి, హైదరాబాద్: కుటుంబ తగాదాను రచ్చకీడ్చావంటూ చిన్న కుమారుడు మంచు మనోజ్పై మోహన్బాబు మండిపడ్డారు. మనోజ్ ప్రవర్తన మొదలు, ఆస్తుల పంపకం వరకు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆడియో సందేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. గారాబంగా పెంచిన నా గుండెలపై తన్నావు. ఆస్తులు ముగ్గురికీ సమపాళ్లు ఇస్తానా.. గంగపాలు చేస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా వ్యక్తిగతం. అది నా కష్టార్జితం. ఇంట్లో పనిచేసే వాళ్లను ఎందుకు కొడుతున్నావ్? పొట్టకూటి కోసం వచ్చిన వారిని కొట్టడం మహాపాపం. సినీ పరిశ్రమలో మోహన్బాబు పరుషంగా ఉంటాడేమో కానీ ఇంట్లో అలా కాదు. గతంలో ఇలాంటి పొరపాట్లు జరిగాయి. బయటకు వెళ్లావు.. మళ్లీ చేయనని వచ్చావు. నీ భార్య, నువ్వు, మీ అమ్మ... ఇలాంటి పొరపాట్లు చేయమని చెబితే ఇంట్లోకి ఆహ్వానించా. కానీ ఈ విషయం ప్రజలు నమ్ముతారో లేదో. విద్యాసంస్థల బ్యాంకు లావాదేవీల్లో ఏమైనా అవకతవకలు జరిగితే అందుకు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది లేదా ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. మన విద్యాసంస్థలను ప్రపంచ ఖ్యాతికి తీసుకువెళ్లడానికి విష్ణు తీవ్రంగా కృషి చేశాడు. విద్యాసంస్థలను అభివృద్ధి చేయడానికి వినయ్ అనే వ్యక్తి వస్తే నువ్వు అతనిపై చేయి చేసుకోవడం ఎంతవరకు సబబు? మీ నాన్నకు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్లను అడ్డుకుంటున్నావ్. ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా? వినయ్, నీకు మధ్య జరిగిన గొడవలో మీ అన్న విష్ణు అడ్డుపడితే అతన్ని కూడా కొట్టడానికి సిద్ధపడ్డావ్’అని మోహన్బాబు ఆరోపించారు. -
ముదిరిన మంచు ఫ్యామిలీ గొడవ.. పోలీసుల కీలక నిర్ణయం!
మంచు ఫ్యామిలీ గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు, మంచు విష్ణు లైసెన్స్ గన్స్ సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం మొదలైన ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది. దీంతో ఒకరిపై ఒకరు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని వారిని అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీకి, మనోజ్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బలవంతంగా గేటు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ గొడవ మరింత తీవ్రరూపం దాల్చడంతో అప్రమత్తమైన పోలీసులు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఆదేశించారు. రేపు ఉదయం తమ ముందు హాజరు కావాలని రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం గం. 10.30ని.లకు గన్ సరెండర్ చేయాలని ఆదేశించారు. -
‘మంచు’ ఫ్యామిలీ వార్.. కీలక విషయాలు బయటపెట్టిన పని మనిషి
మంచు ఫ్యామిలీ వివాదంపై కీలక విషయాలు బయటకు వచ్చాయి. మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు గొడపడ్డారని వారింటి పని మనిషి తెలిపారు. ఇద్దరు ఒకరినొకరు నెట్టుకున్నారని, ఆ సమయంలో మనోజ్ భార్య మౌనికతో పాటు అతని తల్లి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. తండ్రికొడుకుల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లకు అది బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు. (చదవండి: మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత)‘మోహన్ బాబు ఫ్యామిలీలో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మనోజ్ వ్యవహార శైలీ మోహన్ బాబుకు అస్సలు నచ్చదు. మౌనికను పెళ్లి చేసుకోవడం కూడా ఆ కుటుంబంలో ఎవరికి నచ్చలేదు. అప్పటి నుంచే ఈ గొడవలు మరింత ఎక్కువైయ్యాయి. ఆదివారం గొడవ జరిగిన సమయంలో మనోజ్ భార్య, తల్లి అక్కడే ఉన్నారు. మోహన్ బాబు, మనోజ్ ఒకరినొకరు నెట్టుకున్నారు. మంచు లక్ష్మి వచ్చి మనోజ్కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. మోహన్ బాబు అంటే విష్ణుకు చాలా ఇష్టం. ఆయనను ఏమైనా అంటే ఊరుకోరు’ అని పని మనిషి చెప్పారు. కొనసాగుతున్న సస్పెన్స్మంచు కుటుంబ వివాదంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తనపై దాడి చేశారని మంచు మనోజ్.. కొడుకుతో ప్రాణ హానీ ఉందని మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. మంచు లక్ష్మి రంగంలోకి దిగి తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక నేడు మంచు విష్ణు విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. వచ్చీ రావడంతోనే మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్న మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించేశాడు. ఇది మా ఇంటి గొడవ అని, మేమే పరిష్కరించుకుంటామని విష్ణు, మోహన్ బాబు చెప్పినా.. ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. మరికాసేపట్లో మంచు మనోజ్ డీసీపీని కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు మోహన్ బాబుపై ఇటు మనోజ్పై కేసులు నమోదయ్యాయి. ఆస్తి కోసం మోహన్ బాబు, ఆస్థిత్వం కోసం మనోజ్ చేసిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టారు. -
Breaking News: మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ
-
మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
-
Manchu Manoj: ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా
-
మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత
మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ మొదలైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలని మంచు మనోజ్ బౌన్సర్లను విష్ణు ఆదేశించాడు. అయినా కూడా వాళ్లు అక్కడే ఉండడంతో.. తన బౌన్సర్లలో వారిని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి బౌన్సర్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా మంచు విష్ణునే రంగంలోకి దిగి మనోజ్ బౌన్సర్లను బయటకు తోసేశాడు. ప్రస్తుతం మనోజ్ బౌన్సర్లు మోహన్ బాబు ఫాంహౌస్ బయట ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గొడవ విషయం తెలియగానే పహడి షరీఫ్ పోలీసులు హుటాహుటిన మోహన్ బాబు ఫాం హౌస్కి వెళ్లి.. పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి: ఆస్తుల కోసం కాదు.. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా : మంచు మనోజ్)మంచు ఫ్యామిలీలో జరుగున్నతున్న వివాదం ఆదివారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ.. తనకు, తన భార్యకు ప్రాణహానీ ఉందని మంచు మనోజ్.. చిన్న కొడుకు మనోజ్తో తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక నిన్నటి వరకు విదేశాల్లో ఉన్న మంచు విష్ణు.. నేడు తిరిగి హైదరాబాద్కు రావడంతో ఈ గొడవ మరింత ముదిరింది. పెద్ద కొడుకు విష్ణుతో కలిసి మోహన్ బాబు నేరుగా తన ఫాంహౌస్లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ మనోజ్, విష్ణుల బౌన్సర్లు ఉన్నారు. విష్ణు రావడంతోనే మనోజ్ భార్యతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తాను ఆస్తులు, డబ్బుల కోసం పోరాటం చేయడంలేదని..ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని మనోజ్ మీడియాతో తెలిపారు. న్యాయం కోసం ఎంతమందినైనా కలుస్తానని చెప్పారు. (చదవండి: చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు) -
ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా : మంచు మనోజ్
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తనపై దాడి చేశారని మంచు మనోజ్.. చిన్న కొడుకు మనోజ్తో ప్రాణ హానీ ఉందని మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసుకు ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఫామ్హౌస్ ‘మంచు టౌన్’కి మనోజ్తో పాటు మంచు విష్ణు కూడా బౌన్సర్లను పంపించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి బౌన్సర్లను బయటకు పంపించారు.(చదవండి: చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు) అయితే తన అనుచరులను మాత్రమే పోలీసులు బెదిరిస్తున్నాడని మంచు మనోజ్ ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరుల పేర్లు రాసుకొని మరీ బయటకు పంపిస్తున్నారని, వాళ్ల(మోహన్ బాబు, విష్ణు) బౌన్సర్లను మాత్రం లోపలికి పంపిస్తున్నారని ఆరోపించారు. ‘నేను డబ్బు కోసమో, ఆస్తుల కోసమో పోరాటం చేయడం లేదు.. ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. న్యాయం కోసం అందరిని కలుస్తాను’ అని మంచు మనోజ్ మీడియాతో తెలిపారు. అనంతరం భార్యతో కలిసి మోహన్బాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. -
మనోజ్, కోడలు మౌనికతో ప్రాణహాని ఉందన్న మోహన్ బాబు
-
చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదంపై మోహన్ బాబు స్పందించారు. తమ ఇంట్లో జరుగుతున్నది చిన్న తగాదా అని.. అది తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన పెద్ద కొడుకు మంచు విష్ణుకు స్వాగతం పలికేందుకు మంగళవారం ఉదయం మోహన్ బాబు ఎయిర్పోర్ట్కు వెళ్లారు. అనంతరం విష్ణుతో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయి. మా ఇంట్లో కూడా అలాంటి చిన్న గొడవే జరిగింది. అది అంతర్గతంగా చర్చించుకుంటాం. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను నేను పరిష్కరించాను. అందరిని కలిపే ప్రయత్నం చేశాం. మా ఫ్యామిలీ సమస్యను కూడా త్వరనే పరిష్కరించుకుంటాం’అని అన్నారు.కొడుకుపై ఫిర్యాదు.. స్పందించిన మనోజ్గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ సోమవారం పోలీసుకుల ఫిర్యాదు చేయడంతో మంచు ఫ్యామిలీ గొడవ మరింత పెద్దదైంది. మనోజ్ ఫిర్యాదు చేసిన గంటలోనే మోహన్ బాబు కొడుకు మనోజ్పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చిన్న కుమారుడు మనోజ్తో ప్రాణహానీ ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మనోజ్తో పాటు అతని భార్య మౌనికపై కూడా చర్యలు తీసుకోవాలని కోరాడు.తండ్రి ఫిర్యాదుపై మనోజ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తనపై, తన భార్య మౌనికపై మోహన్ బాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నా పరువు తీయడానికి, నా గొంతు నొక్కడానికే మా నాన్న మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు’ అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ సుదీర్గమైన పోస్ట్ పెట్టారు. -
విదేశాల నుంచి తిరిగొచ్చిన విష్ణు.. మనోజ్,మౌనికలపై కేసు నమోదు
టాలీవుడ్ సినీ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు ఫ్యామిలీలో విభేదాలు రావడంతో మనోజ్, మౌనికల నుంచి తనకు ప్రాణహాణి ఉందని మోహన్బాబు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మనోజ్పై క్రైం నెంబర్ 644/2024 కింద 329,351,115 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో విజయ్రెడ్డి, కిరణ్లపై కేసు నమోదైంది.విదేశాల నుంచి తిరిగొచ్చిన విష్ణుకుటుంబంలో వివాదాలు జరుగుతుండటంతో మంచు విష్ణు కొంత సమయం క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి చేరకున్న మోహన్బాబు.. విష్ణుతో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో కూడా వారు పూర్తి భద్రత సిబ్బంది మధ్య వెళ్లడం గమనార్హం. ఆపై కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్బాబు నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.కుటుంబ వ్యవహారాన్ని పెద్దగా చిత్రీకరించడం సరికాదని విష్ణు తెలిపారు. త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.మోహన్ బాబు ఫిర్యాదు తర్వాత మనోజ్ పత్రికా ప్రకటన చేశారు. 'నాపై, నా భార్య మౌనికపై నా తండ్రి డాక్టర్ ఎం. మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన, తప్పుడు ఆరోపణలు నాకు చాలా బాధ కలిగించింది. నా తండ్రి చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవాలు. నా పరువు తీయడానికి, నా గొంతును నొక్కడానికి,కుటుంబ కలహాలు సృష్టించడానికి ఉద్దేశపూర్వక చేసే ప్రయత్నంలో ఇదొక భాగం. నాకు, నా భార్యకు వ్యతిరేకంగా ఆయన చేసిన వాదనలు పూర్తిగా కల్పితం. అంటూ మనోజ్ కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. -
మంచు ఫ్యామిలీలో ముదిరిన వివాదం
-
మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ రియాక్షన్ ఇదే..
సినీ నటుడు మంచు మోహన్బాబు కుటుంబంలో వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సోమవారం రాత్రి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. కానీ, తనపై దాడి చేసింది ఎవరో ఆయన పేర్కనలేదు. అయితే, అది జరిగిన గంటలోనే మోహన్బాబు వాట్సాప్ ద్వారా రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబుకు ఫిర్యాదు పంపారు. తన కుమారుడు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ క్రమంలో మనోజ్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మోహన్బాబు కోరారు. దీంతో పోలీసులు మనోజ్పై 329,351,115 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఆపై క్రైం నెంబర్ 644/2024 పహడి షరీఫ్ పోలీసులు కేటాయించారు. తండ్రి చేసిన ఆరోపణలపై తాజాగా మంచు మనోజ్ సోషల్మీడియాలో ఒక పోస్ట్ చేశారు.మోహన్ బాబు ఫిర్యాదు తర్వాత మనోజ్ పత్రికా ప్రకటన చేశారు. 'నాపై, నా భార్య మౌనికపై నా తండ్రి డాక్టర్ ఎం. మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన, తప్పుడు ఆరోపణలు నాకు చాలా బాధ కలిగించింది. నా తండ్రి చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవాలు. నా పరువు తీయడానికి, నా గొంతును నొక్కడానికి,కుటుంబ కలహాలు సృష్టించడానికి ఉద్దేశపూర్వక చేసే ప్రయత్నంలో ఇదొక భాగం. నాకు, నా భార్యకు వ్యతిరేకంగా ఆయన చేసిన వాదనలు పూర్తిగా కల్పితం. అంటూ మనోజ్ కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చారు.నేను ఎప్పుడూ ఆర్థిక సహాయం కోసం నా కుటుంబంపై ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తులను కోరలేదు. నేను ప్రస్తుతం ఒక సంవత్సరం నుండి మా నాన్న ఇంట్లోనే నివసిస్తున్నాను.నా సోదరుడు దుబాయ్కి వెళ్లిన తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉన్నందున నన్ను ఇంటికి రమ్మని మా నాన్న పిలిచారు. అప్పుడు నేను మా నాన్నకు చెందిన ఇంట్లోకి మారాను. ఏడాదికిపైగా అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. నేను తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చినట్లు నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. ఫిర్యాదులో నన్ను, నా భార్యను తప్పుగా ఇరికించే ఉద్దేశ్యంతో ఆరోపణ చేశారు. నేను ఆ ఇంట్లో నివసిస్తున్నానని నిర్ధారించుకోవడానికి గత సంవత్సరం నుంచి నా మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ను ధృవీకరించాల్సిందిగా అధికారులను అభ్యర్థిస్తున్నాను.ఈ గొడవలోకి నా 7నెలల కుమార్తెను లాగడం చాలా బాధకరమైనది, అమానవీయం ఘటన. ఇలాంటి వివాదంలోకి నా పిల్లలను లాగడం వెనకున్న ఉద్దేశం ఏంటి..?కుటుంబ పెద్దల పట్ల అత్యంత గౌరవం చూపే నా భార్యకు ఉద్దేశాలు ఆపాదించబడడం దురదృష్టకరం.ఇంట్లో పనిచేసే మహిళాలపై మా నాన్న చాలా ఎక్కువగానే తిడుతూ ఉంటారు. దీంతో వారు భయపడిపోవడమే కాకుండా తీవ్రమైన మనోవేదనకు గురయ్యేవారు కూడా.. ఇంట్లో మా నాన్న అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో జీవిస్తారు. అందుకు అవసరమైన అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశామని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మా అమ్మ పర్యవేక్షణతో పాటు ఆయా వద్ద మా కూతురిని ఉంచాం. నా భార్య, నేను కేవలం నాకు తగిలిన గాయాల వైద్య చికిత్స కోసం ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళాం.విష్ణుకు సహచరులు విజయ్రెడ్డి, కిరణ్లు సీసీటీవీ డ్రైవ్లను ఎందుకు తొలగించారు..? ఈ వివాదంలో వారు ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు..? ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరుతున్నాను.నేను ఎల్లప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను, నా కృషి, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల ఆశీర్వాదం వల్ల నా వృత్తిని నిర్మించుకున్నాను. నేను ఎనిమిదేళ్లకు పైగా మా నాన్న, సోదరుల చిత్రాల కోసం అవిశ్రాంతంగా పని చేశాను. ఈ క్రమంలో అనేక పాటలు, ఫైట్లు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. తరచుగా కమర్షియల్ హీరోగా నా స్థాయికి తగ్గ పాత్రలను పోషిస్తున్నాను. ఒక్క రూపాయి తీసుకోకుండా, పూర్తిగా నా కుటుంబ ప్రయోజనాల కోసమే ఇదంతా చేశాను. అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా విధ్వంసానికి గురయ్యాయి. నా సోదరుడు విష్ణు… ఇప్పటికీ నాన్న నుంచి మద్దతు, ప్రయోజనం పొందుతూనే ఉన్నాడు.నేను ఎప్పుడూ ఆస్తులు లేదా వారసత్వం ఆస్తులు కోసం అడగలేదు. నేను అడిగి ఉంటె సాక్ష్యాలు అందించమని నేను ఎవరినైనా సవాలు చేస్తున్నాను. నా జీవితం, నా స్వంత యోగ్యతతో కుటుంబ సంపదపై ఆధారపడకుండా నా పిల్లలను గౌరవంగా పోషించుకుంటుంన్నందుకు నేను గర్వపడుతున్నాను.విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా మోహన్బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారు. వారికి మద్దతుగా నేను బహిరంగంగా మాట్లాడటంతోనే ఈ ఫిర్యాదు చేశారు. వారి ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తాను.నా తండ్రి ఎప్పుడూ కూడా విష్ణుకు మద్దతుగానే ఉంటూ వచ్చారు. కుటుంబ విషయంలో నా త్యాగాలు ఉన్నప్పటికీ ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. ఇప్పటికే పరువు నష్టంతో పాటు పలుమార్లు వేధింపులకు గురయ్యాను. విష్ణు స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకుంటూ వచ్చాడు. కానీ, నేనెప్పుడూ స్వతంత్రంగానే జీవిస్తూ వస్తున్నాను. నేను పైన చెప్పిన వాటి విషయంలో అధికారులకు పూర్తి ఆధారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024 -
మంచువారి అమ్మాయిలు..అరీ & వివీ హ్యాపీ బర్త్డే: తాతను మించిపోతారా!(పోటోలు)
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు మనవరాళ్లను చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ భారీ బడ్జెట్తో అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ను కన్నప్ప టీమ్ రివీల్ చేసింది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, స్టన్నింగ్ విజువల్స్తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Immerse yourself in the spirit of devotion with #Ariaana & #Viviana Manchu, and witness their full-look in #Kannappa🏹 — A perfect blend of talent and spirituality dedicated to Lord Shiva.🎬✨#HarHarMahadevॐ @themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/vquzPB6b6s— Kannappa The Movie (@kannappamovie) December 2, 2024 -
మంచు విష్ణు 'కన్నప్ప' రిలీజ్ డేట్ ప్రకటన
మంచు విష్ణు ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా 'కన్నప్ప'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ.. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. లెక్క ప్రకారం ఈ డిసెంబరులోనే రావొచ్చనే రూమర్స్ వచ్చాయి. కానీ చిత్రీకరణ ఆలస్యం కావడంతో ఇది కేవలం రూమర్ మాత్రమే అని తేలిపోయింది.(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్లో ఓపెన్ అయిపోయిన రష్మిక)దీంతో 'కన్నప్ప' ఎప్పుడు థియేటర్లలోకి వస్తాడా అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 25న వస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. అయితే శివరాత్రి కానుకగా వచ్చుంటే కంటెంట్కి కలిసి వచ్చేదేమో అనిపించింది.ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్ర చేయగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరుల కూడా నటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
అనుకోని తప్పటడుగులు.. లేదంటే ఓ రేంజ్ హీరో అయ్యేవాడేమో! (ఫొటోలు)
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు లుక్ చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు. ఇందులో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటుల పోస్టర్లను విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ లాంటి అగ్రహీరో కూడా కనిపించనున్నారు. అంతేకాకుండా మోహన్ లాల్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నారు. కాగా.. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనుంది. Unveiling the divine look of @themohanbabu garu as 'Mahadeva Shastri' in #Kannappa🏹. Witness the devotion and grandeur as they come to life! 🌟✨ #HarHarMahadevॐ#MohanBabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan… pic.twitter.com/Z8XbIV3ccd— Kannappa The Movie (@kannappamovie) November 22, 2024 -
ప్రభాస్ ఫొటో లీక్.. కేసు పెట్టిన 'కన్నప్ప' టీమ్
అరడజనుకి పైగా సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటితో పాటే మంచు విష్ణు 'కన్నప్ప' మూవీలోనూ శివుడి పాత్రలో నటిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం రిలీజైన టీజర్లో ప్రభాస్ కళ్లు మాత్రమే చూపించారు. తాజాగా ప్రభాస్ ఫుల్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో ఎవరో లీక్ చేశారు. ఇది తెగ వైరల్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్కి ఖరీదైన గిఫ్ట్)ఇప్పుడు ఈ విషయం 'కన్నప్ప' మూవీ టీమ్ దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ కేసు పెట్టారు. అలానే నిందితుడిని పట్టుకునేందుకు ఏకంగా క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు. ఈ సినిమా కోసం 2000 మందికి పైగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారని.. ఈ లీకైన ఫొటో వల్ల వాళ్ల పనిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.ఇప్పటికే ఫొటో లీక్ విషయమై కేసు పెట్టామని, అయితే ఈ పని ఎవరో చేశారో కనుగొని ఆ వివరాలు మాకు చెబితే రూ.5 లక్షల రివార్డ్ ఇస్తామని 'కన్నప్ప' టీమ్ చెప్పింది. లీకైన ఫొటోని షేర్ చేసినా చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందనని ప్రభాస్ అభిమానులతో పాటు అందరు హీరోల అభిమానులకు 'కన్నప్ప' టీమ్ రిక్వెస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్) -
అందుకే జ్యోతిర్లింగాలను సందర్శించాం: మంచు విష్ణు
‘‘పరమ శివుడి పరమ భక్తుడి కథగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అందుకే ఈ చిత్రం విడుదలకు ముందే 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్కు రావడం ఆనందంగా ఉంది. మా ఎపిక్ యాక్షన్ చిత్రమైన ‘కన్నప్ప’ విడుదల కోసం యూనిట్ అంతా ఎదురుచూస్తున్నాం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రయూనిట్ పన్నెండు జ్యోతిర్లింగాల సందర్శన యాత్రను చేపట్టింది. రిషికేశ్ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. ఈ యాత్రలో మోహన్బాబు, విష్ణు, ముఖేష్ కుమార్ సింగ్, నటుడు అర్పిత్ రంకా పాల్గొన్నారు. ‘‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి ఇతిహాసాల స్ఫూర్తితో ‘కన్నప్ప’ రూపొందింది. భక్తి, శౌర్యం, ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ప్రయాణంగా ఈ మూవీ ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
కేదారేశ్వరుని సేవలో కన్నప్ప టీమ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని షూటింగ్ను విదేశాల్లో చిత్రీకరించారు. కన్నప్పలో ప్రభాస్తో పాటు పలువురు స్టార్ నటులు కనిపించనున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్లో పాన్ ఇండియాలో విడుదల చేయడానికి కన్నప్ప టీమ్ సన్నాహాలు చేస్తోంది.తాజాగా కన్నప్ప టీమ్ ఆలయాల సందర్శనకు బయలుదేరింది. మంచువిష్ణు, మోహన్ బాబుతో సహా పలువురు చిత్రబృంద సభ్యులు బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శివుని భక్తుడైన కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని కేదారాశ్వరుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే కన్నప్ప టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధి వ్యూస్ సాధించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.Seeking blessings for an epic tale! @ivishnumanchu and team #Kannappa’s sacred journey to #Kedarnathॐ and #Badrinathॐ. #HarHarMahadevॐ@themohanbabu @mukeshvachan @arpitranka_30 @24FramesFactory @avaentofficial @KannappaMovie #TeluguFilmNagar pic.twitter.com/nHwehDTfO7— Telugu FilmNagar (@telugufilmnagar) October 25, 2024 -
కేదార్నాథ్ను సందర్శించిన మంచు విష్ణు,మోహన్బాబు (ఫొటోలు)
-
'అతను ఒక పవర్హౌస్'.. మంచువిష్ణు స్పెషల్ విషెస్!
రెబల్ స్టార్ ప్రభాస్కు మా అధ్యక్షుడు మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. భారతీయ సినిమాకు ప్రభాస్ ఒక పవర్హౌస్ లాంటివాడని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నాడని కొనియాడారు. నా సోదరుడు ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని మంచు విష్ణు ట్విటర్లో రాసుకొచ్చారు.కాగా.. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ సైతం కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ డిఫరెంట్ స్టైల్లో విషెస్ తెలిపారు.(ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. మారుతి డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ మోషన్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాల పాటు ఉన్న వీడియో ఈ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Wishing the powerhouse of Indian cinema, my brother #Prabhas, a very happy birthday! #Prabhas continues to conquer hearts and screens worldwide with his unmatched talent and dedication. Here’s to many more years of greatness! 🏆 #HappyBirthdayPrabhas pic.twitter.com/xX3Z26pApw— Vishnu Manchu (@iVishnuManchu) October 23, 2024 -
దర్శకుడిగా ది డీల్.. నటనే తన జీల్..
నాంపల్లి: సినిమాలకు మూలం నాటకం.. తొలితరం నటులందరూ నాటకరంగం నుంచి వచ్చిన వారే.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఎన్వి రంగారావు, సావిత్రి వంటివారెందరో ఈ రంగంలోకి వచ్చినవారే. ఇతర భాషల్లోనూ అనేక మంది నటులు నాటక రంగం నుంచి వెండితెరకు పరిచయమైనవారే. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బిఏ.యాక్టింగ్, ఎంఏ దర్శకత్వం పూర్తి చేసి ఆధునిక తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న డాక్టర్ హనుకోట్ల మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎంఏ పూర్తి చేసిన వెంటనే ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్గా మూగ పాత్రలో అందరినీ మెప్పించాడు. ఆ తర్వాత అదే వర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి ప్రొఫెసర్గా, రంగస్థల కళల శాఖాధిపతిగా, లలిత కళాపీఠం పీఠాధిపతిగా(డీన్) ఎందరో నటులను తీర్చిదిద్దుతున్నారు. దర్శకుడిగా, రచయితగా... తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులతో కలిసి స్వీయ రచన, దర్శకత్వంలో కె2 నాటకాన్ని ప్రదర్శించి ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత కళ్యాణి నాటకానికి తన బృందంతో ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు వెండి నందిని అందుకున్నారు. నాటక రంగ ఆచార్యుడిగా తెలుగులో నాయకురాలు, గంగిరెద్దు, జయ జయహే తెలంగాణ, రామప్ప వంటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాటకాలను నిర్మించారు. తెలుగులో మొట్టమొదటి నాటకత్రయం ‘ప్రతాపరుద్రమ’ దర్శకత్వం వహించి మెప్పించారు. రచయితగా గంగిరెద్దు, కాశీ్మర్ టు కన్యాకుమారి, గబ్బర్సింగ్, ధనత్రయోదశి, నాటకాలలో నూతన థోరణులను ప్రవేశపెట్టాడు. మరోసారి వెండితెరకు.. కేవలం రంగస్థలానికే పరిమితం కాకుండా రేడియో జాకీగా, టెలివిజన్ నటుడిగా, దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించి ఈటీవీ– 2లో ప్రసారమైన ‘మాయాబజార్’ రాజకీయ వ్యంగ్య రూపకంతో పాటు దూరదర్శన్లో అనేక ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. ఈశ్వర్ సినిమా తర్వాత ఆగిపోయిన తన సినీ ప్రస్థానాన్ని తిరిగి కొనసాగిస్తూ తన స్వీయ దర్శకత్వంలో హెచ్.పద్మారమాకాంతరావు, రామకృష్ణ నిర్మాతలుగా ‘ద డీల్’ అనే సినిమాతో అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ నిర్మాత దిల్రాజు పోస్టర్ లాంచ్ చేయగా, ప్రముఖ హీరో మంచు విష్ణు ఈ సినిమా పాటను విడుదల చేశారు. దసరా సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, ద డీల్ టైటిల్ సాంగ్ని విడుదల చేశారు. -
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన మా అధ్యక్షుడు విష్ణు
-
దయచేసి 'మా' వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దు: మంచు విష్ణు లేఖ
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సినిమా వాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు. సినీ పరిశ్రమ పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుందని తెలిపారు. రాజకీయ లాభాల కోసం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం నిరాశ కలిగించిందన్నారు. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటామని.. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతమని మా తరఫున మంచు విష్ణు నోట్ విడుదల చేశారు.'సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటివల్ల కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని భావిస్తున్నా. మన పరిశ్రమ కూడా ఇతర రంగాల్లాగే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. నిజం కాని కథనాలను రాజకీయ లబ్ధి కోసం వాడటం చాలా నిరాశను కలిగించింది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం.. కానీ మా కుటుంబాలు మాత్రం వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం.. వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావాలని ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.'నోట్లో ప్రస్తావించారు.(ఇది చదవండి: నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్)'రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజకీయాల కోసం, ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా సినిమాకు చెందిన వారి పేర్లు, కుటుంబాల పేర్లు వాడకండి. చిత్రపరిశ్రమలో పనిచేసేవారు వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు. మా వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలోకి లాగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా.. మనుషులుగా కూడా మన కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైంది. ఇలాంటి సంఘటనల బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిద్దాం. సినీ ఇండస్ట్రీ తరపున మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. అవసరమైతే మేమంతా ఏకమై నిలబడతాం' అంటూ లేఖ విడుదల చేశారు. Official Statement from Movie Artists Association (MAA) pic.twitter.com/vc4SWsnCj6— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2024 -
‘ది డీల్’ హిట్ కావాలి: మంచు విష్ణు
‘ఈశ్వర్’ఫేం హనుకోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ నిర్వహణలో పద్మా రమకాంత రావు, రామకృష్ణ కొళివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని ఏమయ్యిందో ఏమయ్యిందో" పాటని ప్రముఖ హీరో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగామంచు విష్ణు మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీలో యాక్టింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఎంతో మందికి శిక్షణనిస్తున్న డా. హను కోట్ల గారికి అల్ ది బెస్ట్ చెబుతూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అభినందించారు.ఈ కార్యక్రమంలో డిజిక్వెస్ట్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పూర్వ అధ్యక్షులు శ్రీ K. బసిరెడ్డి, ప్రముఖ నిర్మాత శ్రీ PLK రెడ్డి, "ది డీల్ " చిత్ర నిర్మాత రామకృష్ణ కొళివి, చిత్ర సమర్పకులు డా. అనితారావు, దర్శకులు డా. హను కోట్లతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. -
Manchu Vishnu: మంచు విష్ణుకు సైబర్ వేధింపులు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు సైబర్ వేధింపులు తప్పలేదు. సోషల్మీడియా ద్వారా ఈ పని చేస్తున్న విజయ్ చంద్రహాసన్ దేవరకొండను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నోటీసులు జారీ చేసి పంపారు. నేరం నిరూపణకు అవసరమైన ఆధారాలు సేకరించి, నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. విజయ్ చంద్రహాసన్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వివిధ సోషల్మీడియా ఖాతాల్లో అనేక వీడియోలు అప్లోడ్ చేశారు. వీటిలో మంచు విష్ణు, ఆయనకు సంబంధించిన నిర్మాణ సంస్థ, ‘మా’లతో పాటు సినీ రంగాన్నీ కించపరిచే, అవమానించే, అభ్యంతరకరంగా చిత్రీకరించే అంశాలను పొందుపరిచాడు. ఇతను పదేపదే ఇదే పంథా అనుసరిస్తుండటాన్ని ‘మా’ సీరియస్గా తీసుకుంది. సంస్థ ట్రెజరర్ శివబాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ కె.మధులత సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడికి నోటీసులు జారీ చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే అవసరమైన ఆధారాలను సేకరించి, న్యాయస్థానంలో చార్జ్ïÙట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. -
మంచు విష్ణు కుమారుడి సినీ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని సెట్ చేశాడు విష్ణు. సౌత్ నుంచి నార్త్ దాకా పేరుమోసిన యాక్టర్స్ అందరినీ ఈ ప్రాజెక్టులో భాగం చేశాడు. తన కుమారుడు సైతం సినిమాలో ఉన్నట్లు వెల్లడించాడు. నేడు (ఆగస్టు 26) శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కన్నప్ప నుంచి అవ్రమ్ మంచు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇందులో అవ్రమ్.. తిన్నడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ తిన్నడే పెద్దయ్యాక భక్త కన్నప్పగా కీర్తి గడించాడు.మాటలు రావట్లేదుఈ సందర్భంగా విష్ణు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు.. కన్నప్పలో అవ్రమ్ లుక్ లాంచ్ చేసినందుకు గర్వంగా ఉంది. ఈ ప్రపంచానికి తను నటుడిగా పరిచయం అవుతున్నందుకు మాటలు రావడం లేదు అని పేర్కొన్నాడు. సినిమా విషయానికి వస్తే మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. సినిమా..ఈ పాన్ ఇండియా మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తున్నాడు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, మధుబాల, దేవరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమా రిలీజ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
ప్రభాస్ కు అండగా మంచు విష్ణు..
-
MAA అసోసియేషన్ సీరియస్... మరి ప్రభాస్ ని అంటే కన్నప్ప ఊరుకుంటాడా...
-
ప్రభాస్పై అర్షద్ వార్సీ కామెంట్స్..
-
ప్రభాస్పై చిన్నచూపు.. మనోభావాలు దెబ్బతిన్నాయన్న మంచు విష్ణు
ఒక్కసారి మాట అనేస్తే వెనక్కు తిరిగి తీసుకోలేం. అందుకే సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలి. ఏమాత్రం నోరుజారినా విమర్శలపాలవడం ఖాయం. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కల్కి సినిమా తనకు నచ్చలేదన్నాడు. అక్కడితో ఆగకుండా అందులో ప్రభాస్ లుక్ జోకర్లా ఉందని కామెంట్ చేయడంతో విమర్శలపాలయ్యాడు. తాజాగా ఈ వివాదంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించాడు.మంచు విష్ణు లేఖప్రభాస్పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసిన విష్ణు.. సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు. ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. దాన్ని మేము గౌరవిస్తాము. కానీ, అర్షద్.. ప్రభాస్ గురించి చులకనగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో, అభిమానులలో చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది.బాధేసిందినేటి సోషల్ మీడియా యుగంలో, చిన్న పదం కూడా పెద్ద చర్చకు దారి తీస్తోంది. కాబట్టి.. పబ్లిక్ ఫిగర్స్గా మన భావాలను వ్యక్తీకరించడంలో జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. వార్సి వ్యాఖ్యలు సినీ ప్రేమికులలో, సినీ సోదరులలో అనవసరమైన ఆందోళనను సృష్టించింది. తన మాటలు మాకెంతో బాధ కలిగించాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడని అర్షద్ వార్సీని కోరుతున్నాము.అందరిదీ ఒకే కుటుంబంగౌరవాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. సినీ ఇండస్ట్రీ అనే ఒక కుటుంబం కింద అందరం ఉన్నాం.. సినిమా పట్ల మనకున్న అభిరుచికి కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోండి. మన బలం మన ఐక్యతలో ఉంది. ఈ ఐక్యతను కాపాడుకోవడం మన సమిష్టి బాధ్యత. ఇండస్ట్రీలో ప్రశాంత వాతావరణం ఉండేట్లు చూస్తారని ఆశిస్తున్నాను అని ఆ లేఖలో పేర్కొన్నాడు. -
కంపడు, గవ్వరాజు ఎవరో చెప్పిన 'కన్నప్ప'
డైనమిక్ హీరో మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ ప్రమోషన్స్ అప్టేట్స్ను నిరంతరం అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్ది నెలలుగా ప్రతి సోమవారం చిత్రం నుంచి ముఖ్యమైన అప్డేట్ను ప్రకటిస్తున్నారు. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ, వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ సినిమా పట్ల అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ముఖేష్ రుషి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్లుక్తో పాటు మరో ప్రముఖ నటుడు బ్రహ్మజీ పాత్రకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ ఈ చిత్రంలో కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ముఖేష్ రిషితో పాటు బ్రహ్మాజీ కూడా కనిపించారు. పోస్టర్లో వారి లుక్ ఫెరోషియస్గా కనిపిస్తుంది. కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. "కన్నప్ప" అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్గా రాబోతోంది. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందే విధంగా, మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఇక సినిమా పట్ల అంకితభావంతో.. ఇష్టంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకుడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ విజువల్ వండర్ను డిసెంబర్లో పాన్ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
‘మా’కు మంచు విష్ణు రూ. 10 లక్షల విరాళం!
మంచు విష్ణు మరోసారి మంచి గొప్ప మనసు చాటుకున్నాడు. తన కూతురు ఐరా విద్యా బర్త్డే సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అసోసియేషన్లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.గత మూడేళ్లుగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతూ.. అసోసియేషన్ మెంబర్లకు అండగా నిలుస్తున్నాడు. సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు.నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు.విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది.