ఓటీటీలో 'కన్నప్ప' స్ట్రీమింగ్‌.. | Manchu Vishnu Kannappa Movie OTT Streaming Postponed, See Netizens Reactions Inside | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'కన్నప్ప' స్ట్రీమింగ్‌..

Sep 4 2025 7:34 AM | Updated on Sep 4 2025 11:59 AM

Kannappa movie OTT Streaming postpone

మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన 'కన్నప్ప' (Kannappa) సెప్టెంబర్‌ 4 ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే, అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాకపోడంతో నెటిజన్లు పోస్టులు షేర్‌ చేశారు. దీంతో కాస్త ఆసల్యంగా ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన చిత్రం జూన్‌ 27న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌ వంటి స్టార్స్నటించారు. భారీ అంచనాలతో విడుదలైన చిత్రం బాక్సాఫీస్వద్ద అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది.

'కన్నప్ప' సెప్టెంబర్‌ 4నుంచి స్ట్రీమింగ్కు రానున్నట్లు సోషల్మీడియా ద్వారా మంచు విష్ణు ప్రకటించారు. అయితే, చిత్రం మొదట అమెజాన్ప్రైమ్లో అందుబాటులోకి రాకపోడంతో నెటిజన్లు సదరు ఓటీటీ సంస్థను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో కాస్త ఆలస్యంగా కన్నప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. ఈ క్రమంలో మరో పోస్టర్‌ను విడుదల చేశారు. థియేటర్‌లో చూడనివారు ఈ వీకెండ్‌లో చూసేయండి.

Advertisement
 
Advertisement
Advertisement