మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు విష్ణు | Manchu Vishnu Visit Madhusudhan Family | Sakshi
Sakshi News home page

మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు విష్ణు

May 2 2025 11:59 AM | Updated on May 2 2025 12:10 PM

Manchu Vishnu Visit Madhusudhan Family

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులను మా అధ్యక్షులు, సినీ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలోని వారి ఇంటికి చేరుకున్న విష్ణు  కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం.. దాడి జరిగిన తీరును మధుసూధన్ సతీమణి కామాక్షి, పిల్లలను అడిగి  విష్ణు తెలుసుకున్నారు. కావలి తమ అమ్మగారి ఊరు కావడంతో ఆ ప్రాంతంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

తాను మాట్లాడాలనుకున్నది వారితో మాట్లాడానని విష్ణు అన్నారు. మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులకు ఎలాంటి భరోసా ఇచ్చాను అనేది తమ పర్సనల్ అని అన్నారు. ప్రస్తుతం తాను మీడియాతో పెద్దగా మాట్లాడలేనని చెప్పి.. ఈ విషయంలో తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దంటూ అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు.  ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. వారిలో కావలికి చెందిన మధుసూదన్‌ రావు కూడా ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement