సాక్షి,విశాఖ: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై విశాఖపట్నంలో కేసు నమోదైంది. తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖలోని ఎంవీపీ కాలనీ పోలీసులు రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సదరు యువతి తన ఫిర్యాదులో రాహుల్పై పలు తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు సమాచారం. యువతి సమర్పించిన వివరాలు, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


