
మరికొన్న గంటల్లో(జూన్ 27) మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచు ఫ్యామిలీ, ముఖ్యంగా విష్ణు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ (దాదాపు రూ. 250 కోట్లు) పెట్టి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అదే రేంజ్లో ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు.
దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లోనూ సినిమా ఈవెంట్స్ నిర్వహించారు. విష్ణు పడిన కష్టానికి ఫలితం తగ్గింది. ఈ సినిమాకు కావాల్సినంత రీచ్ అయితే వచ్చినట్లు ఉంది. అందుకే రిలీజ్కి ముందే భారీగా టికెట్స్ అమ్ముడు పోతున్నాయి. ఈ సినిమా టికెట్స్ని ఆన్లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోనే 1,15,000 టికెట్స్ సేల్ చేసి కన్నప్ప రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
‘24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్ అయిపోయాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. సినిమా రిలీజ్కు ముందే ఇంత గొప్ప ప్రేమను పొందడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ప్రేమ చూపుతున్న ప్రతీ మూవీ లవర్కు థాంక్స్. ఇది సినిమా కాదు మహా శివుడి మహిమ.. కన్నప్పకు అంకితం’ అంటూ విష్ణు ట్వీట్ చేశాడు.
కన్నప్ప విషయానికొస్తే.. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్తో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్ కీలక పాత్రలు పోషించారు.
115,000 tickets sold in just 24 hours.
My heart is racing! 🙏🏽
To witness this kind of pre-release love and anticipation is truly humbling.
I’m deeply grateful to every movie lover for the unwavering support.
This is not just a film, This is all glory to Lord Shiva and #Kannappa…— Vishnu Manchu (@iVishnuManchu) June 26, 2025