
తిరుమల గిరులు జల సోయగాలతో పరవశిస్తున్నాయి. నిత్యం గోవిందనామస్మరణతో మార్మోగే కైలాసగిరులు జలజలరావాలతో మార్మోగుతున్నాయి.

ప్రకృతి ప్రేమికులను ఆనందడోలికల్లో ముం చెత్తుతున్నాయి. శ్రీవారి భక్తులను సంతోష సాగరంలో హోలలాడిస్తున్నాయి.

జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలతో జలపాతలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం, కపిలతీర్థం పరిసర ప్రాంతాలు పర్యాకుల మనసు దోచుకుంటున్నాయి.

ఆకాశం నుంచి ఉవ్వెత్తున దుముకుతున్న జలపాతాలను పలువురు తమ సెల్ ఫోన్లలో బంధిస్తుండగా.. మరికొందరు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.







మోహనకృష్ణ కేతారి- సాక్షి ఫొటో గ్రాఫర్,తిరుపతి