
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అయితే ఇటీవల'కన్నప్ప' తీసిన నిర్మాణ సంస్థ చాలా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. క్రిటిక్స్, యూట్యూబర్స్ ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లు నోట్లో రాసుకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ప్రెస్మీట్లో మంచు విష్ణు స్పందించారు.
చెన్నైలో కన్నప్ప సినిమా చూసిన ఒకతను నన్ను కౌగిలించుకుని ఏడ్వడం మొదలెట్టారు.. చివరిగంట నా లైఫ్లో చూడలేదని చెప్పాడు. మహానటుడు రజినీకాంత్ సినిమా చూసిన చెప్పిన మాట నా లైఫ్లో మర్చిపోలేనని అన్నారు. అయితే కన్నప్ప చూసిన ఒకతను రివ్యూ ఇచ్చేశాడు. ఈ రివ్యూ వచ్చిన మూడు గంటల్లో ట్విటర్లో దాదాపు 42 మంది రివ్యూలు రాసి 0.5 రేటింగ్ ఇచ్చారని తెలిపారు. అయితే కొందరు కన్నప్ప సినిమా చూడకుండానే ట్విటర్లో రివ్యూలు ఇచ్చారని అన్నారు. అందువల్లే ఇలాంటి వారిని అరికట్టడం కోసమే కాపీరైట్ స్ట్రైక్, లీగల్ ప్రొసీజర్ తప్ప ఎవర్నీ బెదిరించడం నా ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. మీ వల్లే సినిమాలు వెళ్తాయని.. సినిమా చూస్తూ రివ్యూలు పెట్టడం పైరసీ చేయడంతో సమానమన్నారు. ట్విటర్, యూట్యూబ్లో సినిమా చూసేటప్పుడు పెట్టే వాళ్లను బ్లాక్ చేశామని తెలిపారు. అంతే తప్ప వార్నింగ్ ఇచ్చే సీన్ నాకు ఎక్కడిదంటూ నవ్వుతూ అన్నారు.
కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఇందులో బాలనటులుగా చేశారు.