మంచు విష్ణు కన్నప్ప.. ఏపీలో టికెట్ ధరల పెంపు | Andhra Pradesh Govt Given Ticket Price Hike For Kannappa Movie | Sakshi
Sakshi News home page

Kannappa Movie: మంచు విష్ణు కన్నప్ప.. ఏపీలో టికెట్ ధరల పెంపు

Jun 25 2025 9:16 PM | Updated on Jun 25 2025 9:16 PM

Andhra Pradesh Govt Given Ticket Price Hike For Kannappa Movie

ఏపీలో కన్నప్ప సినిమా టికెట్‌ రేట్లు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. రిలీజ్‌ రోజు నుంచి పది రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతులు జారీ చేసింది. అయితే కేవలం హయ్యర్‌ క్లాస్‌ టికెట్‌ రేట్లు మాత్రమే పెంచుకునేందుకు సడలింపు ఇచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. టికెట్ రేటుకు అదనంగా రూ.50 పెంచుకునేందుకు ఉత్తర్వులిచ్చింది. తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా టికెట్ ధరల పెంపు కోసం ఏపీ గవర్నమెంట్‌కు మంచు విష్ణు  దరఖాస్తు చేసుకోవడంతో టికెట్ పెంపునకు అనుమతిచ్చింది.

బాలీవుడ్‌ డైరెక్టర్‌ ముకేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ ‍అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement