
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న కన్నప్ప రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా కన్నప్ప మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్టైమ్ దాదాపు 182 నిమిషాలు కాగా.. అంటే మూడు గంటల రెండు నిమిషాలుగా ఉంది. మైథలాజికల్ నేపథ్యంలో వస్తోన్న మూవీ కావడంతో రన్టైమ్ కాస్తా ఎక్కువగానే ఉంది. 195 నిమిషాల నిడివితో ఈ సినిమాను తెరకెక్కించగా.. సెన్సార్ బోర్డ్ 12 కట్స్ చెప్పింది. సీబీఎఫ్సీ నిబంధనల ప్రకారం చిత్రం మార్పులకు అంగీకరించింది. రాబందు ఓ చిన్నారిని పై నుంచి పడేయటం.. తిన్నడుకు సంబంధించిన కొన్ని సీన్స్, మూడు పాటల్లోని విజువల్స్ను తొలగించారు.
మరోవైపు కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుంచి మొదలవుతాయని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇప్పటికే ఓవర్సీస్లో బుకింగ్స్ ఓపెన్ కాగా.. తెలుగు అభిమానులకు బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నాయని విష్ణు వెల్లడించారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప సినిమా తర్వాత దాదాపు 50 ఏళ్లకు మరోసారి కన్నప్ప కథ రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది.
#Kannappa Advance bookings open in Telugu tomorrow, 25th June 🙏🔥! #HarHarMahadev
— Vishnu Manchu (@iVishnuManchu) June 24, 2025