-
ఓటెత్తిన జనం!
పోలింగ్ శాతంలో.. (ప్రతీ రెండు గంటలకోసారి)కరీంనగర్: నియోజకవర్గం ఓటర్లు 9.00 11.00 1.00 3.00 5.00 కరీంనగర్ 3,67,353 10.23 20.78 37.95 47.45 60.35 చొప్పదండి 2,33,546 10.9 29.09 48.4 61.58 75.71 వేములవాడ 2,26,188 12.1 30.17 50.11 62.45 74.43 సిరిసిల్ల 2,46,547 7.23 27.8 46.19 55.67 74.86 మానకొండూర్ 2,25,386 10.06 24.96 49.1 62.55 77.73 హుజూరాబాద్ 2,50,429 9.45 22.89 39.66 60.15 73.01 హుస్నాబాద్ 2,47,701 11.84 30.35 48.83 63.98 76.93 నోట్: కరీంనగర్ నియోజకవర్గంలో సగటు పోలింగ్ 72.33 శాతం నమోదైంది.పెద్దపల్లి : నియోజకవర్గం ఓటర్లు 9.00 11.00 1.00 3.00 5.00 6.00 చెన్నూరు 19,3778 9.49 26.35 45.45 58.65 68.00 68.13 బెల్లంపల్లి 17,6514 12.12 30.52 50.42 63.00 70.53 70.53 మంచిర్యాల 27,8738 10.49 24.87 41.40 52.97 59.78 59.78 ధర్మపురి 23,0786 8.70 28.11 47.15 60.23 69.83 73.34 రామగుండం 21,9723 7.64 21.46 38.78 47.10 55.18 61.59 మంథని 23,9699 10.17 27.41 48.21 56.2 61.55 69.90 పెద్దపల్లి 25,7192 9.24 25.57 44.40 55.6 64.80 71.34 మొత్తం 15,96,430 9.69 26.33 45.12 56.25 63.86 67.80నిజామాబాద్ : నియోజకవర్గం ఓటర్లు 9.00 11.00 1.00 3.00 5.00 కోరుట్ల 2,45,249 10.75 29.1 47.77 60.44 70.07 జగిత్యాల 2,36,675 10.42 30.1 45.94 58.93 68.55 నోట్: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సాయంత్రం 5.00 గంటల వరకు సగటు పోలింగ్ 67.96 శాతం నమోదైంది. -
‘దివ్య’మైన ఏర్పాట్లు
● పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, సహాయకులు సిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా అధికారులు ఈసారి దివ్యాంగులు, వయోవృద్ధులకు వీల్చైర్లను ఏర్పాటు చేశారు. వీల్చైర్లపై వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు సహాయకులను నియమించారు. దీంతో వయోభారంతో ఉన్న వారు, దివ్యాంగులు సులభంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ర్యాంప్లు నిర్మించడంతో వారు నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటేశారు. ఓటు వేసిన అనంతరం తిరిగి వారిని తాము వెళ్లే వాహనం వద్దకు వీల్చైర్లోనే దింపారు. పోలీసులు మానవత్వంతో వృద్ధులకు సహాయం అందించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా పోలీసులు, ఎన్నికల సిబ్బంది, సహాయకులు వృద్ధులకు, దివ్యాంగులకు ‘దివ్య’మైన ఏర్పాట్లు చేయడం విశేషం. -
మేము సైతం...
వేములవాడఅర్బన్: వేములవాడ మండలంలోని చంద్రగిరి పరిధిలోని తెట్టకుంటలో ట్రాన్స్జెండర్స్ ఓటు వేశారు. అంగన్వాడీ కేంద్రంలో క్యూలైన్లో వేచి ఉండి ఓటేశారు.ప్రశాంతంగా ఎన్నికలు బోయినపల్లి(చొప్పదండి): ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఏఎస్పీ చంద్రయ్య అన్నా రు. బోయినపల్లి హైస్కూల్లో పోలింగ్ సరళి పరిశీలించారు. వేములవాడరూరల్ సీఐ శ్రీని వాస్, సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, ఎస్సై పృథ్వీధర్, కార్యదర్శి రాజసులోచన ఉన్నారు. పోలింగ్ పరిశీలన తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలంలో పోలింగ్ బూత్లను ట్రెయినీ ఎస్పీ రాహుల్రెడ్డి పరిశీలించారు. బూత్లకు సమీపంలో గుమిగూడిన వారిని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రానికి నిర్ధేశిత దూరంలోనే ఉండాలని గుంపులుగా ఉండకూడదని సూచించారు. -
పకడ్బందీగా సిద్ధం
సిరిసిల్ల/వేములవాడ: జిల్లాలో లోక్సభ ఎన్నికల ని ర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల జూ నియర్ కళాశాల, వేములవాడలోని జెడ్పీ స్కూల్లోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఆది వారం తరలివెళ్లారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యానాయక్ పరిశీలించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, ఈవీఎం కేటాయింపులను వేములవాడ, సిరిసిల్ల ఎన్నికల అధికారులు రాజేశ్వర్, రమేశ్ పర్యవేక్షించారు. స్వేచ్ఛగా ఓటు వేయండి: కలెక్టర్ జిల్లా ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. సిరిసిల్ల, వేములవాడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద చల్లని తాగునీరు, టెంట్లు, కూలర్లు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. దివ్యాంగుల కోసం ర్యాంప్లు, ట్రైసైకిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు, మన పోలీసు అధికారులతో భద్రత ఏర్పా టు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని, 50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. 6 గంటల వరకు పోలింగ్ ఎండలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడగించిందని తెలిపారు. పోలింగ్ ముగిసిన త ర్వాత రిసెప్షన్ కేంద్రాల వద్ద పోలింగ్ సామగ్రిని సేకరించి కరీంనగర్ ఎస్సారార్ కాలేజీలోని స్ట్రాంగ్రూమ్లకు తరలిస్తామని వివరించారు. ప్రలోభా లకు గురికాకుండా ప్రజలు ఆలోచించి ఓటు వేయా లని కోరారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ లైవ్ సెక్టార్ ఆఫీసర్ జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల వివరాలు పరిశీలించారు. మోడల్ పోలింగ్ కేంద్రాలు ఇవే.. సిరిసిల్లలోని దివ్యాంగుల కోసం గీతానగర్స్కూల్, మహిళల కోసం గోపాల్నగర్ స్కూల్, మహిళా సంఘం భవనం శాంతినగర్లో మోడల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడ చింతలఠాణా, దివ్యాంగుల కోసం వేములవాడలో, యూత్ కోసం చందుర్తి మండలం ఎన్గల్, మహిళల కోసం మేడిపల్లి మండలం కల్వకోట, భీమారం మండలం దేశాయిపేట, వేములవాడరూరల్ మండలం జయవరం, వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి, కోనరావుపేట మండలం ఎక్లాస్పూర్ మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు సిరిసిల్లక్రైం: ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక కేంద్ర బలగాల పహారా ఉంటుందని తెలిపారు. 57 రూట్ మొబైల్స్, 13 క్విక్ రియాక్షన్ టీమ్స్, 6 స్ట్రైకింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్ట్రైకింగ్టీమ్స్తోపాటు కేంద్ర బలగాలు, ట్రెయినీ కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారని తెలిపారు. ఇప్పటి వరకు రూ.82,11,362 నగదు సీజ్ చేయగా, 1,664.93 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు వివరించారు. గంజాయి 16 కేసులు నమోదుచేసి, 9.209 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. వివిధ కేసుల్లో 1,078 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 16 కేసులు నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో 23 ఆయుధాలు డిపాజిట్ చేసినట్లు వివరించారు. జిల్లాలో ఎన్నికల స్వరూపంపోలింగ్ కేంద్రాలు 547 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 58 ఓటర్లు 4,72,735 మహిళలు 2,44,856 పురుషులు 2,27,840 థర్డ్ జెండర్ 39 పోలింగ్ సిబ్బంది 2,738 పోలింగ్రూట్లు 57 భద్రతకు పోలీస్ సిబ్బంది 1000 పోస్టల్ బ్యాలెట్లు 749 జిల్లాలో 547 పోలింగ్ కేంద్రాలు 4,72,735 మంది ఓటర్లు 2,738 మంది పోలింగ్ సిబ్బంది స్వేచ్ఛగా ఓటేయండి కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్మహాజన్ -
నేడే లోక్సభ పోలింగ్
సోమవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2024సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో నేడు(సోమవారం) జరిగే పోలింగ్కు అన్నిఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం ప్రచారం ముగిసింది. గతనెల 18న నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ మూడుస్థానాల్లో ఎక్కడా రెబల్స్ లేకపోవడం గమనార్హం. కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ (బీజేపీ), వెలిచాల రాజేందర్ రావు (కాంగ్రెస్), మాజీ ఎంపీ వినోద్కుమార్ (బీఆర్ఎస్)లతో కలిపి 28 మంది, పెద్దపల్లిలో గడ్డం వంశీ (కాంగ్రెస్), కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్), గోమాస శ్రీనివాస్ (బీజేపీ)లతో కలిపి 42 మంది, ఇక నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ అర్వింద్ (బీజేపీ), ఎమ్మెల్సీ జీవన్రెడ్డి (కాంగ్రెస్), బాజిరెడ్డి గోవర్దన్ (బీఆర్ఎస్)లతో సహా 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్లో పార్లమెంట్ ఎన్నికలకు కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 2,194 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు ఆదివారం సాయంత్రం పోలింగ్ అధికారులు, సిబ్బంది ఈవీఎంలను తీసుకెళ్లారు. పోలీసు భద్రత మధ్య ఈవీఎంలు పోలింగ్స్టేషన్లకు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికలకు పోలీసు యంత్రాంగం 2500 మందితో భద్రత కల్పిస్తోంది. పార్లమెంట్ పరిధిలో 17లక్షల 97 వేల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్లో వీల్చైర్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, నీడ వసతి కూలర్లు, ప్రత్యేక క్యూలైన్ ఏర్పాట్లు పూర్తి చేశారు. మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం చేశారు. మొత్తం 10,200మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మొత్తం బ్యాలెట్ యూనిట్స్ 5500, కంట్రోల్ యూనిట్స్ 2743, వీవీ ప్యాట్స్ 3077 ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఐదు మోడల్ పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1,012 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు దాటిన వారందరూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మొత్తం 15.96లక్షల ఓటర్లు, 1,462 మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు. 139 లోకేషన్లలో 221 క్రిటికల్ పోలింగ్కేంద్రాలను, 38 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఇక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో మొత్తం 497 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్, 131 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ ఒక్క ఓటరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఆశ.. నిరాశ శనివారం ప్రచారం ముగియగానే.. ప్రలోభాలు మొదలైనా అవి ఆశించిన స్థాయిలో లేవని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే డబ్బు, మందు పంపిణీ ప్రభావం చాలా తక్కువగానే జరిగిందని తెలిసింది. సాయంత్రం మూడు సెగ్మెంట్ల పరిధిలో కొన్ని చోట్ల మాత్రం డబ్బుల పంపిణీ జరిగింది. సిరిసిల్ల జిల్లాలో పంచమని ఇచ్చిన క్వార్టర్ బాటిళ్లలో మండల నాయకులు చేతివాటం ప్రదర్శించారు. జగిత్యాలలో పలుచోట్ల చికెన్, క్వార్టర్ బాటిళ్లు, ఓటుకు రూ.300 చొప్పున పంపిణీ జరిగింది. ఇక పెద్దపల్లిలో డబ్బుల పంపిణీ అంతగా జరగలేదు. కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం క్వార్టర్లు పంచారని సమాచారం. ఇక కరీంనగర్ జిల్లాలో కులసంఘాలకు కొన్నిచోట్ల మందు పార్టీలు జరిగాయి. జిల్లాలో చాలా చోట్ల నాయకులు తమకు తాయిలాలు ఇస్తారని రాత్రి ఒంటి గంట వరకు ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. చాలామంది ఇంటి ఎదుట లైట్లు ఆర్పేస్తే.. నేతలు అటు నుంచి అటే వెళ్లిపోతారన్న ఆందోళనతో రాత్రి ఒంటి గంట వరకు వాకిట్లో లైట్లు వేసే ఉంచారు. అయినా నేతలు రాకపోవడం కొసమెరుపు. మూడు ఎంపీ స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ పెద్దపల్లి జిల్లా మంథనిలో సాయంత్రం 4 గంటలకే ముగింపు కరీంనగర్లో 28, పెద్దపల్లిలో 42 మంది, నిజామాబాద్లో 29మంది పోటీ భారీ పోలీసు బందోబస్తుతో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ పోలింగ్ కేంద్రాలకు తరలిన ఈవీఎంలు, సిబ్బంది డబ్బులు అందక తీవ్ర నిరాశలో పలువురు రాత్రి వరకు వేచి చూసినా రాని నాయకులు మొత్తం ఓటర్లు అభ్యర్థులు కరీంనగర్ 17.90లక్షలు 28పెద్దపల్లి 15.96లక్షలు 42నిజామాబాద్ 17.04లక్షలు 29 -
బైక్ నడిపి.. చాయ్ తాగి
వేములవాడ/వేములవాడఅర్బన్/సిరిసిల్లటౌన్: వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం బైక్పై తిరిగి కార్యకర్తల్లో జోష్ నింపారు. వేములవాడ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా బైక్ నడిపారు. అనంతరం రాజన్న ఆలయం ముందు ఉడిపి హో టల్లో చాయ్ తాగారు. గుడి నుంచి వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు ఆటోలో ప్రయాణించారు. అక్కడి నుంచి సిరిసిల్ల వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లా రు. బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. తల్లులను గౌరవించని మూర్ఖులకూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ కరీంనగర్ పార్లమెంటరీ ప్రజలకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలి పారు. తల్లులను గౌరవించని మూర్ఖులకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అంటూ.. వ్యాఖ్య లు చేయడం చర్చనీయాంశమైంది. రాజన్నసిరిసిల్లలో వస్త్ర వ్యాపారులు ఆయనను కలువగా.. రాబో యే కాలం మంచి రోజులు వస్తున్నాయని, వస్త్రపరి శ్రమకు రైల్వేఆర్డర్లు వచ్చేలా ఉన్నాయంటూ వస్త్రోత్పత్తి పెద్దలతో ముచ్చటించారు. ముందుగా మంత్రి పొన్నం తనకు ఇష్టమైన మలాయ్ చాయ్తో ఆదివారం సాయంత్రం ఎంజాయ్ చేశారు. వేములవాడ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తోపాటు ప్రయాణించి సిరిసిల్ల పాతబస్టాండుకు చేరుకున్నారు. మంత్రి, ప్రభుత్వ విప్లకు కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, టీపీసీసీ సభ్యులు నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, రమాదేవి, వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, కోడం అమర్ స్వాగతం పలికారు. మంత్రి వస్తున్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు వందల సంఖ్యలో తరలివచ్చారు. పాతబస్టాండ్లో కలియ తిరిగిన మంత్రి బస్టాండు కాంప్లెక్సులోని జయంత్ చాయ్ హోటల్కు వెళ్లి అందరినీ పలకరిస్తూ.. మలాయ్ చాయ్ ఆర్డర్ చేసి కార్యకర్తలు, నాయకులతోపాటు తాగారు. సరదాగా గడిపిన మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ మాతృదినోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు -
ఓటరూ.. ఒక్క నిమిషం..!
● మనసు ఊరుకో‘లేఖ’ ● ఎన్నికల వేళ ఓటరుకో మాట సిరిసిల్ల: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమంటుండు. ఏంచేస్తాం మరీ.. ఇది ఎండాకాలం.. సూర్యుడు ‘మండే’ కాల మే. కానీ ఐదేళ్లకోసారి వచ్చే అరుదైన అవకాశం. అందుకే విధిగా ఓటేయాలి. ధనికుడు, పేద అని తేడా లేకుండా రాజ్యాంగం మీకు ఓటుహక్కును ఇచ్చింది. బాధ్యత అని మరువద్దు. ఐదేళ్లు మనల్ని పాలించే నాయకుడిని ఎంచుకునే సదావకాశం. మన పార్లమెంట్ సభ్యుడిని ఎన్నుకునేది ఈరోజే. ఇది ఓట్ల పండగ. ఈ ఒక్క రోజు నువ్వే మహా రాజువి. నాకెందుకులే అనే నిర్లక్ష్యాన్ని వీడు. ఓటు అనే ఆయుధాన్ని సంధించు. నీ ఓటు మంచి పాలనకు బాటలు వేయాలి. స్వార్థపరులకు వేటు కావా లి. వంగి వంగి దండాలు పెట్టిన నేతలంతా మట్టి కరువాలి. ఎన్నికల వేళ నీ ఓటు ఎంత అమూల్య మైంతో గుర్తుంచుకో. ఎన్నికల వేళ నా మనసు ఊ రుకో‘లేఖ’.. నీకో విన్నపం చేస్తున్నా. ఇంతకీ నేను ఎవరో చెప్పనే లేదు కదా.. నేను మీ పల్లె తల్లిని. ‘అరచేతిలో వైకుంఠం చూపించే నేతలను నమ్మకండి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన ఓటుహక్కును ఐదు వందలకో, వెయ్యికో, రెండు వేలకో.. మద్యం సీసాకో, ఓ చీరకో అమ్మకండి. 77 ఏళ్లుగా మిమ్మల్ని.. నాలాంటి ఊర్లను పాలిస్తున్న నాయకులు ఏం ఒరగబెట్టారు. ఇంకా తాగునీటి సమస్య, సాగునీటి కష్టాలు.. ఆరోగ్యసమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రలు అయినట్లు.. మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు.. వాళ్లు అబద్ధపు వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. ఏవేవో ఇస్తామని ఆశలు పెడుతుండ్రు. కులం, ప్రాంతం, ప్రగతి పాఠాలను బోధిస్తూ మీ ముందుకొచ్చిన నేతల అసలు రూపాలను గమనించండి. లోతుపాతుల్ని, ఆ నవ్వు వెనక ఉన్న నయవంచనను గుర్తించండి. మీ ఓట్లుతో ఎందరో గద్దెనెక్కి రాజ్యమేలారు. కానీ ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. ఎన్నికల్లో ఎన్నెన్నో హామీలిచ్చి గెలిచాక ఒక్కసారైనా మీ ముఖం చూడని నాయకులను గెలిపించాలా ? మన నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకోకుండా కాంట్రాక్టులు చేసి సంపాధించుకునే వారిని, కమీషన్లు దండుకునే వారిని ఎన్నుకోవాలా? పని పడి నేతల వద్దకు పోతే ఇంటి గేట్ అవుతల నిలబెట్టే లీడర్లను గెలిపించాలా? కళ్లు తెరవండి. దండం పెట్టాడని ఓటేస్తే... మళ్లీ ఓట్ల సీజన్ వచ్చే దాకా కనిపించరు. అందుబాటులో ఉండి సేవ చేసే నిస్వార్థ నాయకుడిని ఎన్నుకోండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోడు... రేపు చేస్తానంటే నమ్మేదెలా? అందుకే ఎన్నికల వేళ మీ అందరికీ ఓ విన్నపం. మీకు మంచి చేసే నేతల్ని ఎన్నుకోండి. మేలు చేసే వారిని మరువద్దు. తెలంగాణలో ఓ సామెత ఉంది.. ‘కూట్లో రాయి తీయనోడు.. ఏట్లో రాయి తీస్తడా..’ అని.. ఇవన్నీ మీకు తెలియనివి కావు. తిన్న రేవును తలవాలంటారు.. అందుకే చెబుతున్నా... మీకు కాస్తో కూస్తో మంచి చేసిన వారిని విస్మరించవద్దు. కులమనో.. ప్రాంతమనో... ఓటేస్తే ఫలితం ఎలా ఉంటుందో నా కంటే మీకే ఎక్కువ తెలుసు. ఏ పార్టీ వాడన్నది ముఖ్యం కాదు. ఏపాటి వాడో ఆలోచించండి. బీడువారిన భూములకు నీళ్లు కావాలి. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలి. చేస్క బతికేందుకు ఉపాధి చూపాలి. గల్ఫ్ దేశాలకు బత్కవోయే బాధలు పోవాలి. సింగరేణి కార్మికుల చీకటి బతుకుల్లో వెలుగులు నిండాలి. సిరిసిల్ల నేతన్నలకు భరోసా కావాలి. రైతన్న మోముల్లో చిరునవ్వు రావాలి. పొగచూరిన బీడీ కార్మికుల బతుకుల్లో వెలుగులు నిండాలి. ఆత్మగౌరవంతో బతికేలా శాంతిభద్రతలుండాలి.. ఇవి నెరవేర్చే నేతలకు ఓటేయాలి. ఇక లే లెవ్వు. ఎండాకాలమని, ఉక్కపోస్తుందని సెలవు దినమని ఓటు వేయడాన్ని నిర్లక్ష్యం చేస్తే నష్టం నీకే. మీ ఓటే మీ వజ్రాయుధం. నీతివంతులకు పట్టం కడితే మీ ఊరూ, వాడ బాగవుతుంది. అవినీతి పరులను, డబ్బులిచ్చినోడికి ఓటేస్తే ఇక ఐదేండ్లు అతడి అవినీతికి లైసెన్సిచ్చినట్లవుతుంది. చివరిగా ఒక్క మాట కాళేశ్వరం నీళ్లు బీడు భూములకు చేరాలి. మెట్టభూములన్నీ తడి భూములవ్వాలి. గోదావరి జలాలు మన ఊర్లకు రావాలి. మనోహరాబాద్ రైల్వేలైన్ మన కరీంనగర్కు చేరాలి. బీడీకార్మికులకు సంక్షేమ పథకాలు, వైద్యసేవలు దరిచేరాలి. సింగరేణి కార్మికులకు మేలు జరగాలి. రైతన్నలకు గిట్టుబాటు ధర దక్కాలి. చదువుకున్న పోరగాళ్లకు ఉపాధికావాలి. రోడ్లు బాగవ్వాలి.. విద్య, వైద్యం మెరుగుపడాలి. ఇవన్నీ చేసే దమ్మున్న నాయకుడిని ఎన్నుకోండి. పోటీలో ఉన్నవాళ్లలో మంచి అభ్యర్థిని గుర్తించండి. మీ అంతరాత్మ శ్రీసాక్షిశ్రీగా ఓటేయండి. పోలింగ్ కేంద్రానికి వెళ్లి వచ్చే ఐదేళ్ల పాలకులను ఎన్నుకోండి. ఇంతసేపు మీ విలువైన సమయాన్ని కేటాయించి నా విన్నపాన్ని ఆలకించిన మీ అందరికీ పేరు పేరున పదివేల దండాలు. ఈవీఎంలో ఓటు మీట నొక్కే ముందు.. ఒక్క నిముషం ఆలోచించి ఓటేయండి.. ఇక ఉంటాను... ఇట్లు సదా మీ అందరి సంక్షేమాన్ని కోరే.. మీ ఊరు -
ఉరుములు.. మెరుపులు
● ఎల్లారెడ్డిపేటలో దంచికొట్టిన వర్షం ● నిలిచిన విద్యుత్ సరఫరాఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు మండలంలోని పలు గ్రామాల్లో రేకులు ఎగిరిపడ్డాయి. నారాయణపూర్లోని కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో సెస్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సాయంత్రం మరోసారి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అకాల వర్షాలతో రైతులకు మాత్రం అపార నష్టం వాటిల్లింది. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం ఇల్లంతకుంట మండలం రేపాకలో కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవరూ గుంపుగా బయట తిరగవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సదన్కుమార్, ఇల్లంతకుంట ఎస్సై ఎల్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి చందుర్తి/బోయినపల్లి: ప్రజలు సేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్లాగ్మార్చ్ నిర్వహిస్తున్నామని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. శనివారం చందుర్తి మండలం మల్యాల, చందుర్తి గ్రామాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ప్రజ లు ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓ టు హక్కు వినియోగించుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందరూ ఎన్నికల మార్గదర్శకాలు పా టించాలన్నారు. సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, విలాసాగర్ గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు. రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై పృథ్వీధర్ ఉన్నారు. ప్రతీ పౌరుడు బాధ్యతగా ఓటెయ్యాలి సిరిసిల్ల: ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటువేయ డం బాధ్యతగా గుర్తించాలని స్వీప్ నోడల్ అధికారి, డీఆర్డీఏ ఏపీడీ గొట్టె శ్రీనివాస్ అ న్నారు. సిరిసిల్ల పాత బస్టాండులో శనివారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటరు జాబితాలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అమూల్యమైందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ అఽ దికారులు నవీన్, కిష్టస్వామి, కళాజాత కళా కారులు శ్రీధర్రెడ్డి, పర్శరాములు, రా మచంద్రం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్తోనే అభివృద్ధి: ఆగయ్య
సిరిసిల్లటౌన్: జిల్లా వ్యాప్తంగా కారు జోరు కనిపిస్తుందని రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్కుమార్ గెలువడం ఖాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శనివారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో మాట్లాడారు. కాంగ్రెస్ అబద్ధాల పాలనపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిందన్నారు. సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షోకు హాజరైన ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రచార పర్వం ముగిసిందని రాబోయే రెండు రోజుల్లో ప్రజలు మంచి ఆలోచన చేసి బీఆర్ఎస్కు మెజార్టీ ఇవ్వాలని కోరారు. తెలంగాణ వాణి పార్లమెంటులో వినిపించే సత్తా వినోద్కుమార్కే ఉందన్నారు. అంతకముందు సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మ్యాన రవి, మల్లారెడ్డి, పూర్ణచందర్, రాములు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ అభివృద్ధే నా ధ్యేయం -
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిద్ధం
● ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లువేములవాడ నియోజకవర్గం ప్రొఫైల్..వేములవాడ: వేములవాడ నియోజకవర్గంలోని 260 బూత్లకు ఎన్నికల సామగ్రి తరలింపు, సిబ్బందిని నియామకం, ఎన్నికలు ముగిశాక తిరిగి సామగ్రిని భద్రపరిచేందుకు వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిద్ధమైంది. అయితే మూడురోజులుగా వాతావరణంలో ఏర్పడుతున్న పరిణామాలతో అధికారులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సైతం సిద్ధమై ఉండాలని అధికారులు పునరాలోచనలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయించి వారికి కావాల్సిన ఎన్నికల సామగ్రి అందించి పోలింగ్ కేంద్రాలకు పంపించేందుకు శనివారం అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి పోలింగ్ బూత్లో ఎన్నికల సిబ్బందికి మౌలిక వసతులు, ఓఆర్ఎస్ పాకెట్లు, భోజన వసతి కల్పించాం. – రాజేశ్వర్, వేములవాడ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మొత్తం ఓటర్లు 2,26,188 బూత్లు 260 పోలింగ్ సిబ్బంది 1,236 సెక్టార్లు 27 రూట్ ఆఫీసర్లు 27 క్రిటికల్ లొకేషన్లు 25 క్రిటికల్ కేంద్రాలు 32 వాహనాలు 69 -
‘గుర్తు’ంచుకోండి
● చివరి రోజు.. ప్రచార హోరు ● ఓటు వేయాలంటూ విన్నపాలు ● ప్రలోభాలు షురూసిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఓటేయమంటూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు జిల్లాలో పక్షం రోజులుగా ప్రచారం సాగించారు. శనివారం సాయంత్రం 6గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడింది. చివరిరోజు అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇంటింటా తిరుగుతూ పార్టీ అభ్యర్థుల పేరు, గుర్తును ఓటర్లు గుర్తుంచుకునేలా పదేపదే చెబుతూ కరపత్రాలు అందించారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. దీంతో ఎవరికి వారు తమ అభ్యర్థులను గెలిపించేందుకు తెరచాటు ప్రయత్నాలు ప్రారంభించారు. పల్లె నుంచి పట్టణం వరకు..జిల్లాలోని అన్ని గ్రామాల్లో పార్టీలు ఎన్నికల ప్రచారం చేశాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం కాస్త తగ్గినా.. అగ్రనేతల రాకతో ఆర్భాటపు ప్రచారాలు సాగించారు. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు పల్లె నుంచి పట్టణం దాక తిరిగాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని సిరిసిల్లలోనే శనివారం ముగించారు. వేములవాడలో ప్రధాని మోదీ సభ, జిల్లా వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించగా, బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పలు సభలు, సమావేశాలు, మార్నింగ్ వాక్లు నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్రావు సైతం వేములవాడ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు వేములవాడ, సిరిసిల్ల పట్టణాలతో పాటు వివిధ మండలాల్లో ప్రచారం చేశారు. సిరిసిల్లలో సీఎం రేవంత్రెడ్డి సభను నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం సాగించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలో పలుమార్లు పర్యటించి ప్రచారం చేశారు. ద్వితీయశ్రేణి నాయకుల ఆరాటం అన్ని పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ముఖ్య నాయకులతో పాటు ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండలాల అధ్యక్షులు ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చే మహిళలు, యువకులకు డబ్బులు ఇచ్చి రోజుల తరబడి వారితో ప్రచారం చేయించారు. చివరిరోజు ఎక్కువ మందితో ర్యాలీలు నిర్వహించి తమ పట్టును వీధుల్లో ప్రదర్శించారు. ఓటర్లకు ఎర.. ప్రచార పర్వం నిలిచిపోవడంతో ప్రలోభాలకు తెరలేసింది. సోమవారం జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తెరచాటు ఒప్పందాలకు తెరతీశారు. మహిళా సంఘాలను మచ్చిక చేసుకునేందుకు నోట్లను ఎరగా చూపుతున్నారు. ఇప్పటికే కుల సంఘాలతో ఒప్పందం చేసుకున్న నాయకులు మందు విందులిస్తూ ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. చివరిరోజు ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే అన్ని ప్రాంతాల్లోనూ మందు, విందులతో ప్రలోభాల పర్వం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆయా పార్టీల శ్రేణులతో మంతనాలు జరుపుతూ భారీగా ఓట్లు సాధించేందుకు ఎవరికివారు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఓటింగ్ శాతం పక్కాగా నమోదు చేయాలి
సిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. సోమవారం(13న) జరిగే లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసి వేగంగా సమాచారం అందించాలని ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడ ఏఆర్వోలు, ఎన్నికల నోడల్ ఆఫీసర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఓటింగ్ శాతం నమోదుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఉదయం, రాత్రి వేళలో ఉండేలా చూసుకోవాలని, ఇంటర్నెట్, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో లోపాలుండొద్దు వేములవాడ: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని, సిబ్బంది, ఓటర్లకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను శనివారం పరిశీలించారు. అనంతరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్కు పలు సూచనలు చేశారు. ఎన్నికలు సజావుగా సాగడంతోపాటు విజయంవంతం చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఎన్.ఖీమ్యానాయక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేశ్, రాజేశ్వర్, జెడ్పీ సీఈవో ఉమారాణి, డీఆర్డీవో శేషాద్రి, నోడల్ ఆఫీసర్ రఫీ, సీపీవో శ్రీనివాసాచారి, ఏవో రాంరెడ్డి, తహసీల్దారు మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ అనురాగ్ జయంతి -
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు
● కలెక్టర్ అనురాగ్ జయంతిసిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. మూడో విడత రాండమైజేషన్ పూర్తి అయిందన్నా రు. సిరిసిల్ల నియోజకవర్గ పరిధి లో 287 పోలింగ్ కేంద్రాలు ఉండగా 1,376 మంది సిబ్బందిని నియమించామని, వేములవాడ పరిధిలో 260 కేంద్రాలుండగా, 1,232 మంది పీవో లు, ఏపీవోలు, ఓపీవోలను నియమించినట్లు వెల్ల డించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎన్నికల ప్రచారంపై నిషేధం ఉంటుందని, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో ఏర్పాటు చేసి డిస్టిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఆదివారమే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని వివరించారు. -
No Headline
బండి సంజయ్ తాను లోకల్, మీరు నాన్లోకల్ అంటున్నారు కదా? నేను పుట్టింది కరీంనగర్ మిషన్ హాస్పిటల్లో. చది వింది సెయింట్జాన్స్ స్కూల్. 50ఏళ్ల నుంచి కరీంనగర్లో మాకిండ్లున్నయి. పక్కాలోకల్ అంటే ఏందో సంజయ్ చెప్పాలే. ఎంపీగా గెలిచి ప్రజలకు అందుబాటులో లేకపోవడం, నియోజకవర్గానికి చెందినవారి ఫోన్లు ఎత్తకపోవడం, 40స్థానిక సంస్థల్లో 600 జనరల్ బాడీ సమావేశాలైతే ఒక్క మీటింగ్కూ హాజరుకాకపోవడమే లోకలా? బండి లోకల్ కాదు .. పొలిటికల్ టూరిస్టు అని ప్రజలే అంటున్నారు. కరీంనగర్ అభివృద్ధి– సమస్యలపై మీకున్న వ్యూహాలేంటి?కరీంనగర్ అభివృద్ధిపై నాకు ప్రత్యేక కార్యాచరణ ఉంది. ప్రభుత్వ పరంగా అభివృద్ధితో పాటు నా సొంత మేనిఫెస్టో కూడా సిద్ధం చేశాను. ‘కరీంనగర్ సహాయక’ అనే యాప్ రూపొందించి, ప్రజల నుంచి వచ్చే సమస్యలు పరిష్కరిస్తా. టీ హబ్ తరహాలో కే– హబ్ కరీంనగర్ ఇన్నోవేషన్, డెవలప్మెంట్, స్టార్టప్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తీసుకొస్తా. ‘యంత్ర చేయూత’ పేరుతో సొంతంగా రూ.3 కోట్ల విలు వైన యంత్రాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతా. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఉచితంగా సాయం అందిస్తా. ఐఐఐటీ, సిరిసిల్లకు హ్యాండ్లూమ్ టెక్స్టైల్, నవోదయ తీసుకువస్తా. పొన్నం ప్రభాకర్ తెచ్చిన తిరుపతి రైలును ప్రతిరోజు నడిచేలా చేస్తా. గెలిచిన మూడేళ్లలో సిద్దిపేట–కరీంనగర్ రైల్వేలైన్ కనెక్టివిటీ చేస్తా. లేదంటే పదవికి రాజీ నామా చేస్తా. డంప్యార్డ్ను మూడు నెలల్లో క్లియర్ చేస్తా. జాతీయ రహదారులకు నిధులు తెస్తా. కరీంనగర్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తా. 40 మండలాల్లో సొంతంగా 40 అంబులెన్స్లు అందుబాటులో ఉంచుతా. డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తా. ఆరుగ్యారంటీల అమలులో విఫలమయ్యారనే విమర్శలపై ఏమంటారు? అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశాం. మిగతా గ్యారంటీలు కోడ్ ముగియగానే అమలు చేస్తామని సీఎం చెప్పా రు. గ్యారంటీల అమలులో విఫలమైతే ప్రజలు నిలదీసే వాళ్లు. మేం ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. 120నెలల కాలంలో హామీలు అమలు చేయని కేసీఆర్, నాలుగు నెలలకే మమ్మల్ని అమలు చేయలేదంటున్నాడు. ప్రతి గ్యారంటీ అమలు చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది. కేంద్రం గోదావరి– కావేరి అనుసంధానం చేస్తే ఉమ్మడి కరీంనగర్ జలవనరులపై ప్రభావం చూపదా, మీ వైఖరి ఏమిటి? ఇది సాంకేతిక సమస్య. సాంకేతిక నిపుణులు దీనితో ప్రజలకు లబ్ధి ఎంత? నష్టం ఎంత? అనేది బేరీజు వేస్తారు. మన ప్రాంతానికి, ప్రజలకు నష్టం వాటిల్లితే తప్పకుండా వ్యతిరేకిస్తాం. లాభం చే కూరుతుందంటే స్వాగతిస్తాం. ఆలస్యంగా రావడం వల్ల ప్రచారంపై ఏమైనా ప్రభావం చూపింది? మాది టీ–20 బ్యాచ్. ప్రచారంలో మేమే ముందున్నాం. ముందు పరుగెత్తే గుర్రాన్ని వెనుకొచ్చే రేసుగుర్రం వేగంగా దాటినట్లు మేము ప్రత్యర్థులను ప్రచారంలో దాటి వేశాం. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎక్కువగా మేమే కలుసుకున్నాం. బండి సంజయ్ మీకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు పరోక్షంగా సంబంధాలు ఆపాదించడంపై ఏమంటారు?దీంతోనే సంజయ్ మానసికస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన చిన్నమెదడు చితికిపోయింది. పోటీయే లేదనుకున్న బండికి కాంగ్రెస్కు ప్రజల్లో వస్తున్న విపరీత ఆదరణను చూసి మతిభ్రమించి ఏవేవో మాట్లాడుతున్నాడు. నేను ప్రభాకర్రావు అనే వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు. సంజయ్ ఆరోపణలను చూసి ప్రజలు నవ్వుతున్నారు. మైనార్టీలు కాంగ్రెస్కు ఓటు వేయొద్దని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏమంటారు? మైనార్టీలు ఎవరికి ఓటు వేయాలో వారు నిర్ణయించుకుంటున్నారు. మైనార్టీల సంక్షేమానికి కృషి చేసే లౌకిక పార్టీ, అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు. అవినీతి మచ్చ లేని అభ్యర్థినే వారు ఎన్నుకొంటారు. మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి?ప్రజల ఆశీస్సులతో వందశాతం మాకే ఉన్నాయి. పల్లెల నుంచి పట్టణం వరకు ప్రజలంతా కాంగ్రెస్కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బండి సంజయ్ కన్నా కనీసం 50వేల మెజార్టీ ముందున్నాం. భార్య మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానన్న బండి సంజయ్ ఐదేళ్లలో రూ.వేల కోట్లకు ఎలా చేరాడో ప్రజలు ఆలోచిస్తున్నారు. స్మార్ట్ సిటీలో 30 శాతం కమీషన్లో బండి వాటా 15 శాతం. అలాంటి సంజయ్కు ఓటు వేసే పరిస్థితి లేదు. -
నేను గరీబుల బిడ్డను: బండి
ఆదివారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2024వేములవాడలో మహిళలను ఓట్లు అభ్యర్థిస్తున్న విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్ల: ‘కరీంనగర్ పార్లమెంట్ బరిలో నిలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు గడీల వారుసులు.. నేను గరీబుల బిడ్డను’ అని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం భారీ బైక్ ర్యాలీ నిర్వహించి గాంధీచౌక్లో ఎన్నికల ప్రచార ముగింపు సభ నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు వ్యాపారులని, ఇద్దరూ చుట్టపోళ్లని, వారు స్థానికేతరులన్నారు. కానీ తాను లోకల్ అని వెల్లడించారు. వాళ్ల వద్ద కోట్లు ఉంటే.. తనపై 109 కేసులు ఉన్నాయని, వాళ్లు ఏనాడైనా ప్రజల కోసం, ప్రజాసమస్యలపై కొట్లాడారా..? అని ప్రశ్నించారు. ఈ రెండు రోజులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిద్రపోకుండా నిఘా ఉంచాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు ఓట్లకు నోట్లు పంచాలని చూస్తున్నారని, ఎక్కడైనా పంచితే.. వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి ఆ డబ్బులను లాక్కుని పేదలకు పంచాలని పిలుపునిచ్చారు. రైతులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికుల కోసం తాను జైలుకెళ్లాలని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ/వేములవాడఅర్బన్: దేశంలో ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రజల మధ్య మతాల చిచ్చు పెట్టిస్తున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించా లని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కోరారు. శని వా రం వేములవాడ పట్టణం పాపన్నచౌక్, భగవంతరావునగర్, గాంధీనగర్లో కరీంనగర్ కాంగ్రెస్ అ భ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా ప్ర చారం చేశారు. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలన ను పక్కన పెట్టినట్లు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని కూడా పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. ఈసారి రాజేందర్రావుకు ఒక్క అవకాశమివ్వాలన్నారు. రాజేందర్రావు గెలిస్తే తామి ద్దరం జోడెడ్లలాగా పనిచేస్తూ ఈప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రధాని మోదీ వేములవాడ రాజన్న సన్నిధికి వస్తే గుడి అభివృద్ధికి నిధులు ఇస్తారని అనుకుంటే ఉట్టి చేతులతో వెళ్లారని విమర్శించారు. కేసీఆర్ మాయమాటలు నమ్మొద్దన్నారు. అలాగే వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లి, తిప్పాపూర్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, చిలివేరి శ్రీనివాస్, నరేశ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
No Headline
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధిపై తనకు ప్రత్యేక కార్యచరణ ఉందని, అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేసి, సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. ప్రతీరోజు తిరుపతికి రైలు, హైదరాబాద్కు రైల్వే కనెక్టివిటీ తన బాధ్యత అన్నారు. ఆలస్యంగా వచ్చినా రేసులో దూసుకెళ్లి అందరి కన్నా ముందు నిలిచానని, ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్రంలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని ఎన్నికలవగానే ఆరోదీ పూర్తి చేస్తాం అని తెలిపారు. ఈమేరకు శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. -
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు
● ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్యానాయక్ సిరిసిల్లటౌన్: పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్సైడే నడుస్తోందని, కాంగ్రెస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్యానాయక్ అన్నారు. శనివారం సిరిసిల్లలో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, ఆ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. ప్రధానిగా రాహుల్గాంధీని యావత్ దేశం ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం నయాపైస ఇవ్వలేదు మాజీ సీఎం కేసీఆర్ నేతన్నలను తాను ఏమో చేసినట్లు ఒక అభూతకల్పన చేస్తున్నారని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. నేతన్నల ఆత్మహత్యల నేపథ్యంలో వారికి ఆర్థికంగా అండగా ఉండాలన్న లక్ష్యంతో రూ. 50లక్షలు కేసీఆర్ ఇచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. అప్పట్లో తాను కూడా టీఆర్ఎస్లో ఉన్నానని కరీంనగర్లో జరిగిన సభలో ఆపార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, తాను, మరికొంత మంది డబ్బు విరాళం ఇచ్చి రూ. 50లక్షలు సేకరించామన్నారు. అవే డబ్బులను తన ఇంట్లోంచి ఇచ్చినట్లు కేసీఆర్ పదేపదే చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై కేసీఆర్, కేటీఆర్లకు మాట్లాడే అర్హత లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, నాయకులు గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, సూర దేవరాజు, మ్యాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జవాన్లను అవమానిస్తారా..!?
సిరిసిల్ల/కరీంనగర్టౌన్: కరీంనగర్లో ముస్లిములంతా ఒక్కటై తనను ఓడించాలని కేసీఆర్ అన్నారని, ‘నేను హిందువుల ఓటు బ్యాంకుతో బంపర్ మెజార్టీతో గెలుస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే పార్టీ దుకాణం బంద్ చేస్తావా? మగాడివైతే, హిందువైతే నీ శరీరంలో మందు కాకుండా రక్తమే ప్రవహిస్తే నా సవాల్ను స్వీకరించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.దేశ రక్షణ కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన జవాన్లను అవమానించిన కాంగ్రెస్కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం బీజేపీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల గాం«దీచౌక్లో ఆయన మాట్లాడుతూ..సర్జికల్ స్ట్రయిక్స్ను సమర్థించే వారంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలన్నారు. గాడిద గుడ్డూ పెట్టదు..కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలూ చేయదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు సర్వనాశనం చేసేస్తారు మోదీ ప్రధాని కాకపోతే కాంగ్రెస్ వాళ్లు దేశాన్ని సర్వనాశనం చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ 12ఎంపీ సీట్లు గెలవబోతోందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో సంజయ్కు మద్దతుగా ‘మహా బైక్ ర్యాలీ’నిర్వహించగా, ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతారనే భయంతో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను ధ్వంసం చేశారని, అలాంటి కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమారెడ్డి, మట్ట వెంకటేశ్వర్రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి
సిరిసిల్లక్రైం/కోనరావుపేట/బోయినపల్లి/గంభీరా వుపేట/ఎల్లారెడ్డిపేట/వేములవాడరూరల్: స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్మహాజన్ కోరారు. ఓటుహక్కు వినియోగంలో భయపడొద్దని తామున్నామంటూ సిరిసిల్లలో శుక్రవారం కవాతు నిర్వహించారు. జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 1500 మందితో ఎన్నికల బందోబస్తు చేపడుతున్నట్లు తెలిపారు. రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్బాక్స్లకు రక్షణ కల్పించాలని, ప్రతీ రూట్ మొబైల్ అధికారి వద్ద అధికారుల నంబర్లు ఉంచుకోవాలన్నారు. రూట్ మొబైల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారం చేయకుండా చూడాలన్నారు. వైన్షాపులు, లేట్నైట్ దాబాలను మూసివేయించాలని సూచించారు. రెస్టారెంట్లు, లాడ్లీను తనిఖీ చేసి ఇతర ప్రాంతాల వ్యక్తులు ఉండకుండా చూడాలన్నారు. ట్రెయినీ ఐపీఎస్ రాహుల్రెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్రెడ్డి, నాగేంద్రచారి మురళీకృష్ణ, సర్వర్ పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తిరగొద్దు ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్మహాజన్ హెచ్చరించారు. కోనరావుపేట ఠాణా పరిధిలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సూచనలు చేశారు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత, రెచ్చగొట్టే సందేశాలు పోస్టు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, కోనరావుపేట ఎస్సై ఆంజనేయులు, మాజీ వైస్ఎంపీపీ ఎల్లయ్య, సంజీవ్, సుంకరిరెడ్డి పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి చెక్పోస్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్మహాజన్ సూచించారు. కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో ఉన్న బోయినపల్లి మండలంలోని కొదురుపాక చెక్పోస్టును తనిఖీ చేశారు. చెక్పోస్టులోని సిబ్బంది అప్రమత్తంగా ఉంటేనే మద్యం, డబ్బు అక్రమ రవాణా జరుగవన్నారు. బోయినపల్లి మండలం కోరెం, మాన్వాడ, గంభీరావుపేట మండలం ముస్తఫానగర్, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామాల్లో ఎస్పీ అఖిల్మహాజన్ పర్యటించారు. వేములవాడరూరల్ మండలం వట్టెంల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు గుంపులుగా తిరగొద్దని సూచించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, ఎస్సై మారుతి, వేములవాడరూరల్ సీఐ శ్రీనివాస్, బోయినపల్లి ఎస్సై పృధ్వీధర్ తదితరులు ఉన్నారు. సోషల్మీడియాలో విద్వేష పోస్టులు పెట్టొద్దు 1500 మందితో బందోబస్తు ఎస్పీ అఖిల్ మహాజన్ -
సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు బకాయిలు విడుదలు చేయడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీచౌక్లో శుక్రవారం వస్త్రపరిశ్రమ, అనుబంధ రంగాలు జేఏసీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల్లో గతంలో రూ.50కోట్లు, ప్రస్తుతం మరో రూ.100 కోట్లు, నేతకార్మికులకు యారన్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలపై ప్రేమ చూపుతున్న కాంగ్రెస్ను పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. నిధుల విడుదలకు కృషి చేసినందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు గోలి వెంకటరమణ, పంతం రవి, మండల సత్యం, వెల్దండి దేవదాసు, గోవిందు రవి, బూట్ల నవీన్, బండారి అశోక్, వెల్దండి శంకర్, పిస్క మధు, గౌడ రాజు పాల్గొన్నారు. ఓటింగ్ శాతాన్ని యాప్లో నమోదు చేయాలిసిరిసిల్ల: ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ రూపొందించిన యాప్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. కలెక్టరేట్లో సెక్టార్ ఆఫీసర్స్కు సీఈవో తెలంగాణ రూపొందించిన టీ–టీయారా యాప్పై శుక్రవారం అవగాహన కల్పించారు. యాప్ డౌన్లోడ్ విధానం, దానిలో వివరాలు నమోదు చేసే పద్ధతిపై వివరించారు. సెక్టార్ ఆఫీసర్స్ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎంత ఓటింగ్ శాతం నమోదైందో తెలుసుకొని, దానిలో అప్లోడ్ చేయాలని కోరారు. యాప్ వినియోగం, వివరాల నమోదు, మిగితా అంశాలను నోడల్ అధికారి మొహమ్మద్ రఫీ తెలిపారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, సీపీవో శ్రీనివాసాచారి, తదితరులు పాల్గొన్నారు. ఓటు మరువద్దు.. సిరిసిల్ల: ఓటు మరవద్దని, నిర్లక్ష్యం చేయొద్దని స్వీప్ నోడల్ అధికారి గొట్టె శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల, వేములవాడ బస్టాండుల్లో శుక్రవారం ఓటరు అవగాహన సదస్సులు నిర్వహించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల బృందంతో అవగాహన కల్పించారు. ఈనెల 13న లోక్సభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘ఐ ఓటు ఫర్ ష్యూర్’ ‘ఓటుహక్కు నా బాధ్యత’ అనే అంశంపై కళాకారులు పాటలు పాడారు. కళాకారులు పొత్తూరి రాజు, గడ్డం దేవయ్య, పూడూరి సంజీవ్, అంతడుపుల ఝాన్సీ, అంతడుపుల లావణ్య, కిన్నెర శ్రీలత, అనుముల శిరీష, సిరిసిల్లలో జరిగిన ప్రదర్శనలో కళాకారులు ఎడమల శ్రీధర్రెడ్డి, శ్రీరాముల రామచంద్రం, గడ్డం శ్రీనివాస్, వంతడుపుల గణేష్, గుగ్గిళ్ల పర్శరాములు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షం.. తడిసిన ధాన్యం ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలో అకాల వర్షాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. శుక్రవారం కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ముస్తాబాద్, పోతుగల్, గూడెం, తెర్లుమద్ది కేంద్రాల్లోని ధాన్యం రాశులు తడిసిపోయాయి. రైతులు టార్పాలిన్లు, కవర్లు కప్పేందుకు ఇబ్బందులు పడ్డారు. బందనకల్, వెంకయ్యకుంట, మోహినికుంటల్లో మామిడితోటలకు నష్టం జరిగింది. విత్తనాల షాపుల తనిఖీలకు టాస్క్ఫోర్స్ బృందం సిరిసిల్ల: జిల్లాలో నకిలీ విత్తనాలను గుర్తించేందుకు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేసేందుకు టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ శుక్రవారం తెలిపారు. ఈ బృందంలో ఎల్లారెడ్డిపేట ఏవో చాడ భూమిరెడ్డి(72888 94139), సీసీఎస్ ఎస్సై ఎం.రవీందర్నాయుడు(87125 80425, 94412 07997), సీడ్ సర్టిఫికేషన్ అధికారి కె.నాగరాజు(72888 79672) ఉన్నారని వివరించారు. జిల్లాలో ఎక్కడైనా పత్తి విత్తనాలు లైసెన్స్ ఉన్న డీలర్ కాకుండా ఇతరులు విక్రయిస్తే టాస్క్ ఫోర్స్ బృందానికి సమాచారం ఇవ్వాలని కోరారు. -
రాజన్న సేవలో ప్రముఖులు
వేములవాడ: రాజన్నను ఎస్బీఐ డీజీఎం వివేక్ జైస్వాల్, సినీ దర్శకుడు ఎల్దండి వేణులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, ఎస్బీఐ ఆర్ఎం వెంకటేశ్, స్థానిక బ్రాంచ్ మేనేజర్ సుబ్బారావు పాల్గొన్నారు. వీర్నపల్లి మోడల్స్కూల్లో డీఎస్పీ విచారణ వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో శుక్రవారం డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి విచారణ చేశారు. గత నెల 18న సమస్యలతోపాటు నిధుల వివరాలను విద్యార్థి సంఘం నాయకుడు హరీశ్ ప్రిన్సిపాల్ను నిలదీశాడు. దీనికి కోపోద్రిక్తుడైన ప్రిన్సిపాల్ హరీశ్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. -
బతుకమ్మ చీరలతో బతుకులేకుండా చేశారు
● నేతన్నల సమస్యలకు బీఆర్ఎస్ పాలనే కారణం ● రెండో స్థానం కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ ● బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ ప్రచారంసిరిసిల్ల/సిరిసిల్లటౌన్/వేములవాడ: వస్త్రపరిశ్రమకు బతుకుమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు బతుకు లేకుండా చేశారని, పరిశ్రమకు కోట్ల బకాయిలు పెట్టారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ విమర్శించారు. సిరిసిల్లలోని లహరీ గ్రాండ్ ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతీ కార్యకర్త ఇంటింటికీ తిరిగి మోదీ ప్రధాని కావాలని ప్రచారం చేయాలని కోరా రు. సంక్షేమ పథకాల గురించి వివరించి, పువ్వు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు లోపాయికారి ఒప్పందంతో డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని పన్నాగం పన్నుతున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని పన్నాగాలు పన్నినా.. ధర్మం కోసం దేశం కోసం ఓటర్లు బీజేపీకి అండగా నిలుస్తున్నారని వివరించారు. నేతన్నల సమస్యలకు బీఆర్ఎస్ కారణం సిరిసిల్ల నేతకార్మికుల దీనస్థితికి పదేళ్ల కేసీఆర్ పాలన కారణమని, పవర్లూమ్ రంగానికి 50 శాతం విద్యుత్ రాయితీ ఎత్తివేశారని, వస్త్రోత్పత్తి ఆర్డర్లకు సంబంధించి రూ.270కోట్లు బకాయిలు పెట్టారని సంజయ్కుమార్ గుర్తుచేశారు. మెగా టెక్స్టైల్పార్క్ను వరంగల్ తరలించారని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని మధ్యలో వదలేశారన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న కేటీఆర్ నేతన్నల శాశ్వత ఉపాధికి ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ నీ భాష, యాసలతో నేతన్నలను మరోసారి మోసం చేయలేవన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు పత్తా లేకుండా పోతారన్నారు. సమావేశం అనంతరం గాంధీచౌక్, మెయిన్ బజారులలో ప్రచారం చేశారు. రెడ్డబోయిన గోపి, ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్, పత్తిపాక సురేశ్, అన్నల్దాస్ వేణు, బర్కం నవీన్యాదవ్, బర్కం లక్ష్మి పాల్గొన్నారు. ప్రతీ బూత్పై నజర్ పెట్టాలి పోలీంగ్ రోజు ప్రతీ బూత్పై నజర్ పెట్టాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బూత్ కమిటీల ఇన్చార్జీలకు సూచించారు. వేములవాడలోని భీమేశ్వరగార్డెన్లో నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గం పో లింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు వికాస్రావు, రేగుల మల్లికార్జున్, మార్త సత్తయ్య, బండ మల్లేశం, కోడిపెల్లి గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
● వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అనురాగ్ జయంతిసిరిసిల్ల: లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువు ముగిసిందని, పోస్టల్ బ్యాలెట్లను ఎక్స్చేంజ్ చేసుకొని, 12వ తేదీ నాటికి రిపోర్ట్ అందజేసి, స్ట్రాంగ్రూములకు తరలించాలని సూచించారు. 48 గంటల ముందే ప్రచారం బంద్ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ ప్రారంభమవుతుందని తెలిపా రు. సైలెన్స్ పీరియడ్లో ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలు లేదని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్దుల వద్ద భద్రత పెంచాలని సూచించారు. సిబ్బందికి వసతులు కల్పించాలి పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్ష న్ కేంద్రాల వద్ద సిబ్బంది వసతులు కల్పించాలని సూచించారు. పోలింగ్ బృందాలకు ఎన్నికల సామగ్రి అందజేసి వాహనాల ద్వారా కేంద్రాలకు మే 12వ తేదీ సాయంత్రం నాటికి చేరుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మహిళా, దివ్యాంగులు, మోడల్, యూత్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు. పోలింగ్ శాతం పెంచాలి జిల్లాలో పోలింగ్శాతం పెంచాలని కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు అమిత్ కటారియా పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో పోలింగ్ కేంద్రాలను, సిరిసిల్ల జూనియర్ కాలేజీలో స్ట్రాంగ్రూమ్ను, వేములవాడ జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈవీఎం యంత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు అమిత్ కటారియా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సదుపాయాలు కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు ఉండేలా చూడాలన్నారు. వికలాంగులు, వయోవృద్ధుల కోసం ప్రతీ పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు, వీల్చైర్స్ అందుబాటులో ఉంచాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు కలెక్టరేట్లోని కంట్రోల్రూమ్, ఎంసీఎంసీ మీడియా సెంటర్లను పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి.గౌతమి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు ఎల్.రమేశ్, రాజేశ్వర్, డీపీఆర్వో వి.శ్రీధర్ పాల్గొన్నారు. -
సిరిసిల్ల జిల్లా ఉండాల్నా.. వద్దా?
నేతన్నచౌక్ లో కేసీఆర్ బస్సుకు స్వాగతం పలుకుతున్న పార్టీ నాయకులు, ప్రజలుసిరిసిల్ల: ‘దేవుని పేరుమీద ఉండాలని రాజన్నసిరిసిల్ల జిల్లాను చేసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్రెడ్డి సిరిసిల్ల జిల్లాను తీసేస్తా అంటుండూ.. జిల్లా ఉండాల్నా వద్దా..?’ అని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి నేతన్నచౌక్లో రోడ్షోలో ప్రసంగించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఉండాలంటే.. వినోద్కుమార్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. గోదావరి నీళ్లు నర్మాల ఎగువమానేరుకు, మధ్యమానేరుకు రావాలన్నా.. మన హక్కులు కాపాడుకోవాలంటే.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. మొన్ననే ప్రధాని నరేంద్రమోదీ వేములవాడకు వచ్చిండు.. దేవస్థానాన్ని బాగుచేస్తానని, ఒక్క మాటనన్నా చెప్పిండా.. అని ప్రశ్నించారు. ‘సిరిసిల్ల చేనేత కార్మికులకు రూ.371కోట్లు బకాయిలు ఉన్నాయి.. ఈ ప్రభుత్వం కట్టమంటే కట్టకుండా నేతకార్మికులను పాపడాలు, నిరోధ్లు అమ్ముకోండంటే.. కోపం వచ్చి నేనోటి అంటే.. నా మీద 48 గంటల నిషేధం పెట్టారు..’ కేసీఆర్ వివరించారు. తెలంగాణ రాక ముందు సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు చూసి చలించి రూ.50లక్షలను తమ పార్టీ పరంగా తెచ్చి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నేతన్నల బతుకులు మార్చేందుకు బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాల ఆర్డర్లు ఇచ్చినం.. మరీ ఇప్పుడు అవన్నీ ఎటుపాయే అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు ఎందుకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వదని అడిగారు. నేతకార్మికులు అంటే.. అంత అలుసా అని ప్రశ్నించారు. పని లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే.. ఆర్డర్లు ఇవ్వకుండా.. బకాయిలు ఇవ్వకుండా కార్మికుల బతుకులతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చించి ఓటు వేయాలే... ఇప్పుడు కీలక సమయమని, ఇంకా మూడు రోజుల సమయం ఉందని.. ఇంటికెళ్లి మీరంతా చర్చించి ఓటు వేయాలే.. అని కేసీఆర్ కోరారు. మరమగ్గాలు(పవర్లూమ్స్) బంద్ అయిపోయి, కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల కవులు, రచయితలు, మేధావులకు నిలయని, పెద్దింటి అశోక్కుమార్ లాంటి రచయితలు ఉన్నారని, అందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రైతుభరోసా ఎటుపాయే.. ధాన్యం కొంటలేరు.. కాంగ్రెస్ పాలనలో ఎన్ని గోసలు పడుతున్నమో.. మీరే చూస్తున్నారన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేస్తే.. రెండు లక్షల మెజార్టీ ఇచ్చి ఉద్యమాన్ని నిలబెట్టారని, ఈ కీలక సమయంలో అండగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు, ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వుచ్చిడి మోహన్రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమా, వేములవాడ బీఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీ నర్సింహారావు, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళాచక్రపాణి, రామతీర్థపు మాధవి, బీఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సింగిల్విండో చైర్మన్లు, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. గులాబీ శ్రేణుల్లో జోష్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో సిరిసిల్లలో సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండింది. గులాబీ బాస్కు నీరా‘జనం’ సిరిసిల్ల కొత్త చెరువు కట్ట నుంచి జనం కేసీఆర్కు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా శుక్రవారం 7 గంటలకు సిరిసిల్ల నేతన్న చౌక్కు కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. జనం అరుపులు కేకలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కట్టడి చేశారు. కేసీఆర్ ప్రసంగం ముగించే దశలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కలుగజేసుకుని జిల్లాను రద్దు చేసే అంశాన్ని గుర్తు చేశారు. దీంతో కేసీఆర్ జిల్లా ఉండాలా.. వద్దా అంటూ.. జనాన్ని ప్రశ్నించగా.. ఉండాలే అని జనం నుంచి స్పందన వచ్చింది. మాట్ల తిరుపతి, శిరీష కళాకా రుల పాట, ఆటలు అలరించాయి. వెయ్యి మంది కళాకారులు వీధుల్లో కవాతు నిర్వహించారు. కళాకారులు బోనాలు ఎత్తుకుని, బతుకమ్మలతో, డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement