
కులగణన నిర్ణయం చారిత్రాత్మకం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా 60 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉండి కులగణన చేయలేదని విమర్శించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, పొన్నాల తిరుపతిరెడ్డి, గజభీంకార్ చందు, కొండ నరేశ్, చొప్పదండి శ్రీనివాస్, దుమాల శ్రీకాంత్, వంతడుపుల సుధాకర్, సిరిసిల్ల వంశీ, మోర శ్రీహరి, ఊరగొండ రాజు, గుడ్ల విష్ణు పాల్గొన్నారు.
వాహనపత్రాలు వెంట ఉంచుకోవాలి
● జిల్లా రవాణాశాఖ అధికారి వంశీధర్
బోయినపల్లి(చొప్పదండి): వాహనాల పత్రాలను వెంట ఉంచుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి వంశీధర్ పేర్కొన్నారు. మండలంలోని కొదురుపాక చౌరస్తాలో శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించిన లైసెన్స్లు పరిశీలించారు. డ్రైవర్లు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. కండక్టర్ లైసెన్స్ లేని రెండు ఆర్టీసీ బస్సుల కండక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సరైన వాహన పత్రాలు లేని మూడు సరుకు రవాణా వాహనాలను సీజ్ చేసి స్థానిక పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. పీసీలు సౌమ్య, ప్రశాంత్, హోమ్గార్డు ఎల్లయ్య ఉన్నారు.
సమ్మె నోటీస్ అందజేత
సిరిసిల్లటౌన్: సార్వత్రిక సమ్మె నోటీస్లను జిల్లా అధికారులకు అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలలో 29 చట్టాలను మార్చి 4 కోడ్లుగా విభజించి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు కడారి రాములు, అన్నల్దాస్ గణేష్, గొట్టె రుక్మిణీ, వెంగల శ్రీనివాస్, చిట్యాల మధు పాల్గొన్నారు.
వేములవాడలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
వేములవాడ: కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(కేడీసీఏ) ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి జూన్ 6 వరకు వేములవాడలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆగంరావు, ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు శనివారం ప్రకటనలో తెలిపా రు. 13 నుంచి 23 సంవత్సరాల్లోపు బా లురు, బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 3 వరకు ఆసక్తి గల వారు పేర్లు నమో దు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 91772 59935లో సంప్రదించాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
● బీసీ సాధికారిత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేందర్
సిరిసిల్ల: స్థానిక సంస్థలకు 14 నెలలుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారి త సంఘం అధ్యక్షుడు పొలాస నరేందర్ విమర్శించారు. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ద్వారా పల్లెలకు విడుదల కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చే శారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక.. నిధులు రాక పల్లెల్లో వసతులు కరువయ్యాయని పే ర్కొన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి కేంద్రం నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కులగణన నిర్ణయం చారిత్రాత్మకం

కులగణన నిర్ణయం చారిత్రాత్మకం