
ఉన్నత లక్ష్యంతో చదవాలి
సిరిసిల్ల: విద్యార్థులు పక్కా ప్రణాళిక చదివి ఉన్నత స్థానాలకు చేరాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆకాంక్షించారు. పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శనివారం అభినందించారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట మోడల్స్కూల్ విద్యార్థులు విష్ణుప్రియ 580, విగ్నారెడ్డి 573, వైష్ణవి 553, అలేఖ్య 551 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్ జెడ్పీ స్కూల్ విద్యార్థులు సాయిహర్షిత్ 573, భానుతేజ 562, నవజీత్ 561, సుశత 558, కావ్య 545, మైత్రి 531, భవ్య 535 మార్కులు సాధించారు. సీపీవో శ్రీనివాసాచారి, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, హెచ్ఎంలు పాల్గొన్నారు.
పేదలకు ఆర్థిక సాయం
అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మూడు పేద కుటుంబాలకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా శనివారం ఆర్థిక సహాయం అందించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్కు చెందిన దాసరి మల్లవ్వ, కోనరావుపేట మండలం కొలనూర్కు చెందిన కుమ్మరికుంట కళావతి, వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన సింగం నర్సయ్య అనారోగ్యంతో ఉన్నామని, ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్కు విన్నవించారు. చలించిన కలెక్టర్ శనివారం ఒక్కో కుటుంబానికి రూ.25వేల చొప్పున చెక్కులు అందించారు. కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
విద్యార్థులకు అభినందనలు