
‘ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆత్మహత్యలు’
సిరిసిల్లటౌన్: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్లలో నేతన్నల బలవన్మరణాలు జరుగుతున్నాయని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు కోడం రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం సుందరయ్యనగర్కు చెందిన పవర్లూమ్ అనుబంధ కార్మికుడు బత్తుల విఠల్ మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి మాట్లాడారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించి, ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతుంటే.. అధికారుల అలసత్వంతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. నిరంతరం ఉపాధి, మెరుగైన కూలీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన చీరల తయారీ ఆర్డర్కు కార్మికుల కూలి నిర్ణయించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో ఇప్పటికే దాదాపు 16 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. నేతకార్మికులకు కూలి నిర్ణయించాలని, పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2023 సంవత్సరం 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిమల్ల సత్యం, బాస శ్రీధర్ పాల్గొన్నారు.