హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు ఇవ్వాలి

Jun 3 2025 12:08 AM | Updated on Jun 3 2025 12:08 AM

హైకోర

హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు ఇవ్వాలి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మధ్యాహ్న భోజన కార్మికులకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు పెంచి ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హన్మండ్లు డిమాండ్‌ చేశారు. ముస్తాబాద్‌లో సోమవారం వంట కార్మికుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా హన్మండ్లు మాట్లాడుతూ.. కార్మికులకు ప్రభుత్వం కేవలం రూ.3వేల వేతనాలు మాత్రమే ఇస్తోందన్నారు. రూ.17వేల వేతనాలు ఇవ్వాలని గత ఫిబ్రవరి 24న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రధా న కార్యదర్శి బాబాయి, జిల్లా అధ్యక్షురాలు సంతోష, దివ్య, నర్సవ్వ, నిమ్మల దేవవ్వ, లక్ష్మీనర్సవ్వ,మణెమ్మ, ఎల్లవ్వ పాల్గొన్నారు.

అమ్మమాట అంగన్‌వాడీ బాట

వేములవాడరూరల్‌: వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ సెంటర్లలో అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి వి.లక్ష్మిరాజం సూచించారు. వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని చెక్కపల్లి, అర్బ న్‌ పరిధిలోని కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు బడికి రాని పిల్లలను గుర్తించి సెంటర్‌లో చేర్పించాలన్నారు. సెంటర్‌లో చదువుకుంటున్న పిల్లల ఎదుగుదలపై దృష్టిపెట్టాలని సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్‌ రోజా అన్నారు. సూపర్‌వైజర్లు నిర్మల, అంజమ్మ పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలను అరికట్టాలి

సిరిసిల్లటౌన్‌: మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్మకుండా వ్యవసాయశాఖ అఽధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో సోమవారం మాట్లాడుతూ.. వానా కాలం సీజన్‌ ప్రారంభమవుతున్నందున రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారన్నారు. వ్యాపారులు నాణ్యమైన విత్తనాలను అందించే విధంగా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, నకిలీవి అమ్మితే పీడీయాక్టు నమోదు చేయాలన్నారు. పత్తి విత్తనాల అమ్మకంలో మోసపూరితమైన వ్యాపారాలు చేస్తున్నారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యురాలు సూరం పద్మ పాల్గొన్నారు.

యారన్‌ సబ్సిడీ అందించాలి

సిరిసిల్లటౌన్‌: ప్రభుత్వం నుంచి నేత కార్మికులకు రావాల్సిన యారన్‌ సబ్సిడీ డబ్బులు వెంటనే అందించాలని పవర్‌ లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌ శుక్లా భవన్‌లో సోమవారం మాట్లాడుతూ.. 2023 బతుకమ్మ చీరలకు సంబంధించి గత నెలరోజుల క్రితం మొదటి విడతగా 3,000 మంది కార్మికుల ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. ఇంకా 2200 మందికి సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. వెంటనే సబ్సిడీ అందించాలని జూన్‌ 4న సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదు ట ధర్నా చేపట్టడం జరుగుతుందన్నారు. పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్‌, స్వర్గం శేఖర్‌, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు.

విదేశీ విద్యకు స్కాలర్‌షిప్‌

సిరిసిల్లకల్చరల్‌: విదేశాల్లో విద్యాభ్యాసం చేసే మైనార్టీ విద్యార్థులకు చీఫ్‌ మినిస్టర్‌ ఓవర్సీస్‌ పథకం ద్వారా ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయనున్నట్లు జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి ఎంఏ భారతి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్న మైనారిటీ అభ్యర్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. అర్హత, ఆసక్తి గల వారు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు  వేతనాలు ఇవ్వాలి1
1/3

హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు ఇవ్వాలి

హైకోర్టు ఉత్తర్వుల మేరకు  వేతనాలు ఇవ్వాలి2
2/3

హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు ఇవ్వాలి

హైకోర్టు ఉత్తర్వుల మేరకు  వేతనాలు ఇవ్వాలి3
3/3

హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement