
ప్రభుత్వ స్కూల్కు టీచర్ కూతురు
వేములవాడఅర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన కూతురును ప్రభుత్వ స్కూల్లో చేర్పించాడు. కథలాపూర్లో టీచర్గా విధులు నిర్వర్తించే కిష్టయ్య.. 9వ తరగతి చదువుతున్న తన కూతురు మధురిమను వేములవాడలోని ప్రభుత్వ స్కూల్ చేర్పించాడు. ఈమేరకు శని వారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు. కిష్టయ్యను మండల విద్యాధి కారి బన్నాజీ, ఉపాధ్యాయులు హరికృష్ణ, బా లరాజు, కృష్ణ తదితరులు అభినందించారు.
‘ఇసుక ట్రాక్టర్లు వెళ్లేందుకు వీల్లేదు’
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తమ గ్రామంలోని ఇరుకురోడ్లపై ఇసుక ట్రాక్టర్లు తిరిగేందుకు వీల్లేకుండా ఉందని కస్బెకట్కూర్ అనుబంధ చింతాలపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్రామంలో నుంచి ఇసుక ట్రాక్టర్లు వెళ్లేందుకు వీల్లేదన్నారు. ఈమేరకు శనివారం ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అనంతరం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ సమస్యను పోలీసులకు విన్నవించారు. చింతాలపల్లి నుంచి కా కుండా గండిలచ్చపేట నక్కవాగు బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
నిధులు మంజూరు చేయండి
బోయినపల్లి(చొప్పదండి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను మండల బీజేపీ అధ్యక్షుడు ఎడపల్లి పరశురాం ఆధ్వర్యంలో బోయినపల్లి రజక సంఘం నాయకులు శనివారం కలిశారు. తమ కుల సంఘ భవనం అభివృద్ధి, మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఉదారి నరసింహాచారి, రజక సంఘం అధ్యక్షుడు గంగిపెల్లి మొండయ్య, దుడ్డెల మల్లేశం, గంగిపెల్లి రాజశేఖర్, గంగిపెల్లి శ్రీనివాస్, దుడ్డెల లచ్చయ్య, కొత్తకొండ రమేశ్ తదితరులు ఉన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
రుద్రంగి(వేములవాడ): క్రీడలతో మానసికోల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం కలుగుతుందని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రుద్రంగిలోని జెడ్పీ హైస్కూల్లో జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన వాలీబాల్ ఉచిత వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి అతిథులుగా సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగం మహేశ్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు కర్ణవత్తుల చందు, దేశవేని శ్రీనివాస్, అంబటి శంకర్, దయ్యాల శ్రీనివాస్, అంబటి శ్రీనివాస్, రోమాల అశోక్, అక్కెనపల్లి శ్రీనివాస్, కోచ్లు ఆరిపళ్లి రవి, సుంచు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పెద్దమ్మ కల్యాణం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్లలో పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాట్ల మధు, బీజేపీ నాయకులు సుధాకర్, రాజేందర్, రమేశ్, నరేశ్, సందీప్, జిల్లెల్ల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్ల మల్లేశం, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూల్కు టీచర్ కూతురు

ప్రభుత్వ స్కూల్కు టీచర్ కూతురు

ప్రభుత్వ స్కూల్కు టీచర్ కూతురు

ప్రభుత్వ స్కూల్కు టీచర్ కూతురు