
వానాకాలం సాగులో సందేహాలా..
● ‘సాక్షి’ ఫోన్ఇన్లో నివృత్తి చేసుకోండి ● సమాధానాలు ఇవ్వనున్న జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం
సిరిసిల్ల: వర్షా కాలం మొదలైంది. రోహిణి కార్తె ప్రవేశించింది. వానాకాలం(ఖరీఫ్) ప్రారంభంలోనే తొలకరి జల్లులు పలకరించాయి. జిల్లాలోని రైతులు మరికొద్ది రోజుల్లో విత్తనాలు వేసుకునేందుకు, నారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసుకున్నారు. వానాకాలం సీజన్లో పంటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి? వర్షాలు ఆలస్యమైతే.. ఏ పంటలు వేసుకోవాలి? అనే సందేహాల నివృత్తికి ‘సాక్షి’ ఫోన్ఇన్లో కాల్ చేయండి. ఈనెల 4న నిర్వహించే ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు.
సమయం: బుధవారం
ఉదయం 9 నుంచి 10 గంటలు
తేదీ: 04–06–2025
ఫోన్ నంబర్: 89777 55264

వానాకాలం సాగులో సందేహాలా..