
భూ సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
ఇల్లంతకుంట(మానకొండూర్): భూభారతి చట్టం ద్వారా భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేటలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని, సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన మ్యాపులను జతచేయాలన్నారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఎంఏ పారుఖ్, డీటీ సత్యనారాయణ పాల్గొన్నారు.
గోశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: దక్షిణకాశీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ గోశాలలో కోడెల మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝాను మంగళవారం కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. గోశాలలో అపరిశుభ్రత, అధిక సంఖ్యలో కోడెలు ఉండడంతోనే చనిపోతున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అర్హులకు డబుల్ ఇళ్లు ఇవ్వాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్
సిరిసిల్లటౌన్: గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించి డ్రాలో పేర్లు వచ్చిన వారికి డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. డ్రాలో పేర్లు రాని పేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి, నిర్మాణా నికి రూ.5లక్షలు అందించాలని కోరారు. సిరిసిల్లలో వెయ్యికి పైగా ఇల్లు లేని కుటుంబాలు ఉ న్నాయన్నారు. అద్దె కుటుంబాల్లో ఎవరైనా చని పోతే శవాన్ని రోడ్డుమీద వేసుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. నాగుల సత్యం, గాజుల మల్లేశం, స్వామి, మహేశ్ పాల్గొన్నారు.
మత్స్య సంఘాల సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: మత్స్య కార్మిక సహకార సంఘాల సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల గంగపుత్రులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ను కోరారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మత్స్య కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్భయంగా ఫిర్యాదు చేయండి
● మహిళలకు భరోసాగా షీ టీం
సిరిసిల్లక్రైం: మహిళలకు భరోసాగా ఉండేందుకు షీటీం పనిచేస్తుందని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. గత నెలలో పలువురు పోకిరీలపై 3 ఎఫ్ఐఆర్లు, 6 పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పనిచేసే ప్రదేశాలు, విద్యాలయాల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులను నిర్భయంగా తెలపాలని కోరారు. కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, జిల్లా షీటీం 87126 56425లో సంప్రదించాలని సూచించారు.

భూ సమస్యలు పరిష్కారం

భూ సమస్యలు పరిష్కారం

భూ సమస్యలు పరిష్కారం