పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 6 2025 6:21 AM | Updated on Jun 6 2025 6:21 AM

పర్యా

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

సిరిసిల్లకల్చరల్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా న్యాయస్థానం ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ సారథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు వి.పుష్పలత, లక్ష్మణాచారి, కావేటి సృజన, ఎ.ప్రవీణ్‌ తదితరులు మొక్కలు నాటారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పెంట శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, జిల్లా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ బాలమణి, లోక్‌ అదాలత్‌ సభ్యులు ఆడెపు వేణు, చింతోజు బాస్కర్‌, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

వేములవాడఅర్బన్‌: ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని వేములవాడ సబ్‌ కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్‌ జాదవ్‌ పేర్కొన్నారు. వేములవాడ కోర్టు ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణలో తమ బాధ్యతగా కోర్టు ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటినట్లు తెలిపారు. కోర్టు సిబ్బంది భూషణ్‌, రమణారెడ్డి, అంజయ్య,శంకర్‌ రెడ్డితదితరులు ఉన్నారు.

మొక్కలు పంపిణీ

సిరిసిల్లటౌన్‌: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని సిరిసిల్ల మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ పోసు వాణి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో గురువారం మొక్కల పంపిణీ, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ నరసింహస్వామి, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సాయికృష్ణ, రెవెన్యూ ఆఫీసర్‌ రామ్మోహన్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ స్వర్ణలత, టీఎంసీ మహాలక్ష్మి, పౌర సేవసమితి అధ్యక్షుడు బియ్యంకర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత1
1/1

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement