
అడవిని చూసొద్దాం
● సిరిసిల్ల అర్బన్ ఫారెస్ట్ పార్క్లో పిల్లల సందడి ● వేసవిలో సందర్శనీయ ప్రాంతం ● అడవిపై అవగాహన.. జంతువుల సందర్శన ● ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
సిరిసిల్ల: విద్యార్థులకు అడవిని పరిచయం చేయడం.. ఫారెస్ట్ ద్వారా కలిగే లాభాలు వివరించడం.. జంతువులను చూడడం.. వీటన్నింటికీ సిరిసిల్ల అర్బన్ ఫారెస్ట్ పార్క్ వేదికగా నిలుస్తోంది. 125 ఎకరాల్లో రూ.6కోట్ల ప్రతిపాదనలతో పనులు ప్రారంభించగా.. సుమారు రూ.2కోట్లతో చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్ శివారులో కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారిని ఆనుకుని ఫారెస్ట్ పార్క్ ముఖద్వారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అర కిలోమీటరు అడవిలోకి వెళ్లగానే.. పిల్లలకు ఆట వస్తువులు, చెరువులో వంతెన.. ఊయలలు, నీటి కొలనులను ఏర్పాటు చేశారు. వేసవి కావడంతో ఎండిన అడవి కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మేత కోసం వచ్చే వన్యప్రాణులను దూరం నుంచే చూడవచ్చు.
ఫారెస్ట్లో పిల్లల సందడి
అర్బన్ ఫారెస్ట్పార్క్లో ఇటీవల సిరిసిల్లలోని ఓ ప్రైవేటు పాఠశాల పిల్లలు సందడి చేశారు. పార్క్ను సందర్శించి అడవి అందాలను ఆస్వాదించారు. అడవిలోని వివిధ రకాల చెట్లు, వన్యప్రాణులు, వాటి లక్షణాలు తెలుసుకున్నారు. సిరిసిల్ల ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణులు, అడవి వాటి ప్రాముఖ్యతను పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. వర్షాకాలంలో పచ్చగా ఉండే అటవీ అందాలు మరింత కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఆకులు ఎండి, నీరు అడుగంటి బోసిపోయి ఉంది. అయినా పిల్లలను ఆకర్షిస్తోంది.

అడవిని చూసొద్దాం

అడవిని చూసొద్దాం