Jangaon
-
మెరుగైన వైద్యం అందించాలి
జనగామ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి సర్కారు ఆస్పత్రులపై మరింత నమ్మకం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావుతో కలిసి పలు విభాగాలను పరిశీలించారు. జనరల్, ఎమర్జెన్సీ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి ఆస్పత్రిలో వసతులు, అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, అపరిశుభ్రతకు తావులేకుండా శానిటేషన్ పనులను పర్యవేక్షించాల ని చెప్పారు. నూతన సీటీ స్కాన్ సేవలను త్వరగా అందుబాటులోకి తేవాలని, లాప్రోస్కోపీ, డెంటల్ విభాగంలో రూట్ కెనాల్ సేవలను మరింత ఇంప్రూవ్ చేయాలని సూచించారు. పలు వార్డుల్లో ఉన్న ఏసీలు పనికి రాకుండా పోగా.. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూడీఐడీ కేటాయింపునకు దివ్యాంగులను వెంట వెంట నే పరీక్షిచి పంపించాలన్నారు. రోగుల సౌకర్యార్థం ఎంసీహెచ్లో లిఫ్టు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ చాంబర్లో హెచ్ఓడీలు, వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రిలో కొరత ఉన్న వైద్య పరికరాలను కొనుగోలు చేయాలని, రోగుల కు అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించా రు. అక్కడి నుంచి మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ వసంత ఉన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
‘సెల్లార్’ బిజినెస్
జనగామ: వరుస అగ్ని ప్రమాదాలతో అమాయక ప్రజలు మృత్యువాత పడుతున్నారు.. వందల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గి పాలవుతోంది.. అయినా అధికార యంత్రాంగం మేల్కోవడం లేదు. నిబంధనలను ఉల్లంఘించి సెల్లార్ల నిర్మాణంతో వ్యాపారా లు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే మంటలు ఆర్పే పరిస్థితి కనిపించడం లేదు. ఇరుకై న రోడ్లు.. అందులోనే వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వహణ ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు, బాంక్వెట్ హాళ్లు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, లాడ్జీలు, బార్ అండ్ రెస్టాంట్లు, బ్యాంకులు, విద్యాసంస్థలు, ఫంక్షన్ హాళ్లు సూపర్ మార్కెట్లు, వాహన షోరూంలలో ఫైర్ సేఫ్టీ గాలిలో దీపంలా మారింది. పురపాలిక అనుమతులు జారీ చేసే సమయంలో కళ్లు మూసుకుని పర్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా సెల్లార్ల నిర్మాణం పట్టణంలో సుమారు 1,950 వరకు వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉండగా.. 11వేల పైచిలుకు గృహాలు(మొదటి, రెండవ, మూడవ, పెంటౌస్) ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు అపార్టుమెంట్ల నిర్మాణ సమయంలో పురపాలిక, అగ్నిమాపక తదితర శాఖల అనుమతులు తీసుకో వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీతో పాటు ప్రమాదం జరిగితే ఎగ్జిట్ ఉండేలా చూసుకోవాలి. అయితే.. పట్టణంలో సెల్లార్లకు అనుమతులు లేకున్నా.. పార్కింగ్ కోసమంటూ ‘కొంతమంది’ని మేనేజ్ చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. కొద్ది రోజుల పాటు సెల్లార్ ఖాళీగా ఉంచి.. ఆ తర్వాత వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తున్నారు. ఇందులో ఎలక్ట్రికల్ దుకాణాల గోదాంలు, ప్రైవేట్ ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న లేబొరేటరీలు, బిగ్ జబార్, ఫ్యాన్సీ స్టోర్, ఏజెన్సీలు తదితర షోరూంల నిర్వహణ సాగిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ వ్యాపార సంస్థల్లో పదుల సంఖ్యలో కస్టమర్లు, అందులో పని చేసే కార్మికులు ఉంటారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని చెలరేగితే తప్పించుకునే పరిస్థితి ఉండదు. వరుస ఘటన.. అయినా మేల్కొని అధికారులు జనగామ పట్టణంలో గతంలో షాపింగ్మాల్, ఎలక్ట్రిల్ షాపులో మంటలు చెలరేగి లక్షలాది రూపాయల ఆస్తి నష్టంతోపాటు తృటిలో ప్రాణాపాయం తప్పిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ బైక్ షోరూంలో రాత్రి సమయంలో మంటలు వ్యాపించగా.. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. సెల్లార్లను వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తున్నారు. వాటిలో ఎలక్ట్రికల్, పేయింట్స్, ప్లాస్టిక్, డోర్లు, కరెంటు సామగ్రి, బిగ్ బజార్, కెమికల్, ఆయిల్ తదితర దుకాణాదారులు స్టాక్ను భద్ర పరుస్తున్నారు. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరిగితే కనీసం నివారించే పరిస్థితి లేకుండా పోయింది. భారీగా మంటలు చెలరేగిన సమయంలో పక్కనే ఉన్న భవనాలు, నివాస ప్రాంతాలకు వ్యాపిస్తాయి. ఇటీవల పట్టణంలో బాంక్వెట్ హాళ్ల కల్చర్ పెరిగింది. వీటిలో చిన్న చిన్న ఫంక్షన్లు చేయడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకువస్తున్నారు, బాంక్వెట్ హాల్లోకి ప్రవేశించిన వారు తిరిగి అదే దారిన లేదా లిఫ్టు నుంచి కిందకు రావాల్సి ఉంటుంది. ఒక్కో ఫంక్షన్లో కనీసం 150 మంది నుంచి 250 మంది వరకు ఉంటారు. అనుకోకుండా సంభవించే ప్రమాదాలతో అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం. అక్కడ ఫైర్ సేఫ్టీ కూడా ఉండదు. ప్రతీ చోట ఫైర్ సేఫ్టీ ఉండాలి ఫంక్షన్ హాళ్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, షాపింగ్మాల్స్, బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, లాడ్జీలు, ఇండస్ట్రియల్, కాటన్ మిల్లులు ఇలా ప్రతీచోట ఫైర్ సేఫ్టీ ఉండాలి. పట్టణంలో చాలా చోట్ల ఫైర్ సేఫ్టీ లేదు. అన్ని వర్గాల వ్యాపార, వాణిజ్య సంస్థలకు గతంలోనే నోటీసులు జారీ చేశాం. అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజన్ వచ్చే వరకు మంటలను అదుపు చేసేందుకు ఫోర్టబుల్ అగ్నిమాపక యంత్రాలు తప్పక అమర్చుకోవాలి. ఇందుకు సంబంధించి 8 అంశాలతో కూడిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించాం. – రేమండ్బాబు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి2024 ఏప్రిల్ నుంచి 2025 మే వరకు జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాద వివరాలు ప్రాణాలతో చెలగాటం నిబంధనలకు నీళ్లు.. అడ్డగోలుగా అనుమతులు..? ఫైర్ ఇంజన్ వెళ్లలేని ఇరుకై న రోడ్లు.. ఫైర్ స్టేఫీ లేకుండానే అద్దెలకు.. మామూళ్ల మత్తులో అధికారులునియోజకవర్గం ప్రమాదాలు నష్టం సేవ్(నగదు) జనగామ 52 రూ.24.33కోట్లు రూ.42.90కోట్లు పాలకుర్తి 33 రూ.28.05లక్షలు రూ. 2.07కోట్లు స్టేషన్ఘన్పూర్ 16 రూ.8.10లక్షలు రూ.34లక్షలు -
యుద్ధ ప్రాతిపదికన రిజర్వాయర్ల పనులు
పాలకుర్తి టౌన్: చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ధ్యేయని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం చెన్నూరు రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఆమె మాట్లాడుతూ చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని, పనులు పూర్తి చేస్తే సుమారు 77వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. భూసేకరణకు చర్యలు చేపట్టాల ని అధికారులను ఆదేశించారు. చెన్నూరు రిజర్వాయర్ తూము సమస్య పరిష్కరించి రైతులను ఆదుకుంటామని అన్నారు. మాజీ ఎంపీపీ కారుపోల శ్రీనివాస్గౌడ్, మదాసు హరీశ్, గుగులోతు యాకూబ్నాయక్ తదితరులు పాల్గొన్నారు పేదల సంక్షేమమే ధ్యేయం కొడకండ్ల: ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పల్లెల అభివృద్ధి, నిరుపేదల సంక్షేమమే తన ధ్యేయమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నా రు. బుధవారం మండలంలోని రామన్నగూడెం, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో రూ.కోటికి పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు సురేష్నాయక్, రాజేష్నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ ఈరంటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు న్యాయం పాలకుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు సరైన న్యాయం జరిగిందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం చెన్నూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ధాన్యం విక్రయానికి వచ్చిన రైతులతో మాట్లాడారు. మద్దతు ధర గురించి ఆరా తీసి సమస్యలు తెలుసుకున్నారు. తూకంలో పారదర్శకత ఉండాలని, తడిసిన ధాన్యాన్ని తిరస్కరించే పద్ధతి కాదని నిర్వాహకులకు సూచించారు. కారుపోతుల శ్రీనివాస్, మాదాసు హరిష్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
రెండు రోజులు.. భారీ వర్షాలు
జనగామ: అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ హెచ్చరించి న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడి న వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైందని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం తెల్లవారు జాము 5 గంటల వరకు 6.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి 7 గంటల వరకు 10 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీవర్షాల నేపథ్యంలో జిల్లాలోని కుంటలు, చెరువుకట్టలపై అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలు చెరువులు, కాలువల వద్ద జాగ్రత్తగా ఉండాలని, వర్షం కురుస్తున్న సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్ల కూడదని కలెక్టర్ సూ చించారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అధి కారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం నుంచి బుధవారం రాత్రి వరకు జిల్లాలో కురిసిన వర్షపాతం (మిల్లీమీటర్లలో)ఇలా.. హెచ్చరించిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా మండలం లొకేషన్ వర్షపాతం బచ్చన్నపేట పడమటికేశ్వాపూర్ 32.8 పాలకుర్తి గూడూరు 34.0 బచ్చన్నపేట బచ్చన్నపేట 22.5 స్టేషన్ఘన్పూర్ స్టేషన్ఘన్పూర్ 16.8 పాలకుర్తి వావిలాల 16.0 పాలకుర్తి పాలకుర్తి 20.0 దేవరుప్పుల దేవరుప్పుల 7.8 జఫర్గఢ్ జఫర్గఢ్ 7.3 కొడకండ్ల కొడకండ్ల 6.5 -
జనగామ డిపో సేవలు భేష్
జనగామ: ఆర్టీసీ జనగామ డిపో సోవలు బాగున్నాయి.. ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నదని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలమన్ అన్నా రు. బుధవారం రీజినల్ మేనేజర్ విజయ భాను, డిప్యూటీ రీజినల్ మేనేజర్ భానుకిరణ్తో కలిసి ఆయన స్థానిక డిపోను సందర్శించారు. డీఎం ఎస్.స్వాతి వారికి స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటి నీరు పోసిన తర్వాత ఉద్యోగులు, సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ డిపో పరిధిలో ఉన్న అన్ని విభాగాల సిబ్బంది ఉత్తమ సేవలు అందిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రయాణికుల మన్ననలు పొందడంతోపాటు సంస్థకు మరింత మంచి పేరు తేవాలని సూచించారు. క్రమశిక్షణతో పని చేయడం వల్లే ఉత్తమ ఫలితాలు వచ్చాయని వివరించారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్ -
చెట్ల తొలగింపు పనులు షురూ
జనగామ: ఐదు రాష్ట్రాల వారధిపై వృక్షాలుగా మారుతున్న రావి చెట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ‘వారధికి ముప్పు’ శీర్షికన సాక్షిలో ఈ నెల 19న ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందించారు. చెట్ల తొలగింపునకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లను ఆదేశించగా.. స్పెషల్ ఆఫీసర్ పులి శేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం పనులను ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులు భారీ క్రేన్ల సహాయంతో బ్రిడ్జికి ఇరువైపులా మహా వృక్షాలుగా పెరిగిన రావి చెట్లను తొలగిస్తున్నారు. చెట్లను పూర్తి స్థాయిలో తొలగించాలంటే రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రావి చెట్ల వేర్లు బ్రిడ్జి లోనకు చొచ్చుకుని పోవడంతో కార్మికులకు కష్టతరంగా మారింది. చెట్టు కొన వరకు కటింగ్ చేసి అక్కడికే వదిలేస్తున్నారు. దీంతో కొద్ది రోజుల్లో మొండెం కాస్తా మొలకెత్తే అవకాశం లేకపోలేదు. ఏదేమైన ప్లై ఓవర్పై చెట్ల తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. కుంగిన ఫుట్పాత్కు మరమ్మతు ఎప్పుడు? బ్రిడ్జిపై కుంగిన ఫుట్పాత్, కూలుతున్న రేలింగ్, పెచ్చులూడి పోతున్న స్లాబ్ పరిస్థితి ఏంటనే అనుమానాలను పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి ఫుట్పాత్పై బాటసారులు నడవకుండా ఏర్పాటు చేసిన పూలకుండీలను నేటికి తొలగించలేదు. అదే సమయంలో ఫుట్పాత్కు సమాంతరంగా రోడ్డు పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడింది. అలాగే బ్రిడ్జి కింద ఎలాంటి వ్యాపారాలు, పనులు, దుకాణాల నిర్వహణ ఉండొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ, పురపాలిక అధికారుల పర్యవేక్షణ కరువవడంతో అన్ని వ్యాపారాలు అక్కడే జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ఎప్పుడూ వందలాది మంది ఉంటారు. జరగరాని ప్రమాదం జరిగితే ఏంటనే సందేహాలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి నాణ్యత, సామర్థ్యం లెక్కించి రోజువారీగా వాహనాల రవాణా, లోడ్ ఎంత మేర వెళుతుందనే దానిపై దృష్టి సారించాలి. కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందించి బ్రిడ్జిపై ఉన్న పూలకుండీలను తొలగించి, కుంగిన ఫుట్పాత్కు మరమ్మతు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కుంగిన ఫుట్పాత్.. కూలుతున్న రేలింగ్ పరిస్థితి ఏంటి? -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్న జనగామ రూరల్: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్న డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లను తీసుకువచ్చి వాటిని అమలు చేయాలని చూస్తుందన్నారు. జూలై 9వ తేదీన తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లాలో పని చేస్తున్న ఆశవర్కర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ సూపరింటెండెంట్కు అందజేశారు. ఈ కార్యక్రమలో బూడిద ప్రశాంత్, ఆశ వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ముదాం రాజమణి, జిల్లా కోశాధికారి పసులాది శోభ, స్వప్న మంజుల, కవిత, అనిత, కల్పన, మమత, మల్లేష్ రాజ్, శివరాత్రి రాజు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా అష్టదళ పాదపద్మారాధన పూజ
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం భక్త జనసందోహం నడుమ ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు–కిరణ్మయి దంపతుల ఆధ్వర్యంలో అష్టదళ పాద పద్మారాధన పూజ వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో 108 బంగారు పుష్పాలు, వెండి పాదపద్మంను అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామివారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, భక్తులు పాల్గొన్నారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు స్టేషన్ఘన్పూర్: ఎరువులు, విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, తిరుమల ఫర్టిలైజర్స్ షాపులను అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువుల క్రయవిక్రయాలు, రైతులు కొనుగోలు చేసిన వివరాల రిజిస్టర్లను తనిఖీ చేసి రోజూవారి విక్రయాల గురించి అడిగారు. రైతులకు కొనుగోళ్ల బిల్లులను అందించాలని, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. స్టాక్ నిల్వలు, ధరల పట్టిక తప్పనిసరిగా బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. ఆయన వెంట డీఏఓ రామారావునాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఓ చంద్రన్కుమార్ తదితరులున్నారు. సమాజ చైతన్య నిర్మాణం కోసమే బాల సంస్కార శిక్షణ ● వీహెచ్పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత జనగామ: జాగృతమైన హిందూ సమాజ చైతన్య నిర్మాణం కోసమే బాల సంస్కార శిక్షణ ఉద్ధేశ్యమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హిందూ బాల సంస్కార శిక్షణవర్గకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పిల్లలకు భక్తిగీతాలు, నీతికథలు, ఆధ్యాత్మిక విషయాలపై బోధించడం గొప్పవిషయమన్నారు. ఉత్సాహంతో వందలాది పిల్లలు తరగతులకు హాజరు కావ డం హిందూ ధర్మం గొప్పదనమన్నారు. ఈ కార్యక్రమంలో చిలువేరు హర్షవర్ధన్, మైలారం శ్రీనివాస్, ఉల్లెంగుల రాజు, ఝాన్సీ, మణి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
లండన్లో చదువుకున్నా..మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డెపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు సాంస్కృతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశ్రామిక పరంగా అభివృద్ధి జరిగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. కాకతీయుల కాలంలో సాంస్కృతిక జీవనం విలసిల్లిందని, ఇప్పుడు ఆ సంస్కృతి, కలలు కాపాడడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా అని ప్రజలు అడిగారు. కమల్ చంద్ర భంజ్దేవ్ స్పందిస్తూ తనకు కళలు, కళాకారులన్నా చాలా ఇష్టమని, సాధ్యమైనంతవరకు సంస్కృతిని కాపాడుతానన్నారు. తాను లండన్లో విద్యనభ్యసించే సమయంలో తమ వద్ద జరిగే దసరా వేడుకలకు కాలేజీ మానేసి వచ్చేవాడినన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం తనకు ఇష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.శివాజి, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, సేవా టూరిజం అండ్కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు కుసుమ సూర్యకిరణ్, పర్యాటక శాఖ ఉద్యోగులు జై నరేష్, రాజు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్భాస్కర్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులదే..
జనగామ రూరల్: విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కలెక్టర్ రిజ్వాన్ బా షా అన్నారు. మంగళవారం మండలంలోని యశ్వంతాపూర్ పరిధిలోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజుల పాటు జరగనున్న రెండో విడత జిల్లా స్థాయి ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ స్థాపనలో విద్యార్థులను ఉన్నతమైన, ఆదర్శవంతమైన విద్యార్థులుగా సిద్ధం చేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణలో అందిస్తున్న అంశాలను అర్థం చేసుకొని విద్యార్థుల్లో ఆశించిన మార్పుల సాధనే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఏఎంఓ శ్రీనివాస్, ఏసీజీఈ రవి కుమార్, జీసీడీఓ గౌసియా బేగం, కో ర్సు ఇన్చార్జ్లు మల్లిఖార్జున్, యాదగిరి, ఆనంద్బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే కడవెండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బడిబాట కరపత్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఈఓ భోజన్న ఆవిష్కరించారు. పోస్టర్లతో ప్రభుత్వ పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలను ప్రచారం చేయాలన్నారు. జల్ శక్తి అభియాన్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి ఈనెల 31వ తేదీ లోగా జల్ శక్తి అభియాన్ పోర్టల్లో వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి జల్ శక్తి అభియాన్పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భ జల శాఖ తదితర శాఖల సమన్వయంతో జల సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ మాధురి షా, సరిత, డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, డీఈఓ భోజన్న, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి స్టేషన్ఘన్పూర్: భూసమస్యల పరిష్కారంలో వేగం పెంచుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రతీ మాడ్యూల్లో వచ్చిన భూసమస్యల పరిష్కారానికి దిశా నిర్దేశం చేశారు. సక్సెషన్, పెండింగ్ మ్యుటేషన్, మిస్సింగ్ నంబర్, భూసేకరణ, కోర్టు కేసులు, డిజిటల్ సంతకం తదితర మాడ్యుల్లోని సమస్యల పరిష్కారానికి సూచనలు ఇచ్చారు. మొత్తంగా భూ భారతి సదస్సు, తహసీల్దార్ కార్యాలయంలో 1,900 దరఖాస్తులు వచ్చాయని, ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ వేగంగా పరిష్కరించాలన్నా రు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమనాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ మండలాల రెవెన్యూ అఽధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా వృత్యంతర శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి -
డబ్బులిచ్చి రోగాలు కొనుక్కోవడమే..
వేసవిలో చల్లదనం కోసం ఐస్ క్రీంలను కొనుక్కోవడమంటే డ బ్బులిచ్చి రోగాలను తెచ్చుకోవడమే. ఈకొలయ్ అనే బ్యాక్టీరి యా కూల్ వెదర్లో మల్టీప్లే అ వుతుంది. ఈ వైరస్తో పేగు ఇన్ఫెక్షన్కు గురి చే స్తోంది. లూజ్మోషన్స్, డయేరియా, వాంతులతో పాటు టైఫాయిడ్కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఐస్క్రీం 24 గంటల పాటు చల్లదనంలో ఉండడం వల్ల బ్యాక్టీరియా సజీవంగా ఉంటుంది. దానిని తినే సమయంలో అది కాస్త కడుపులోకి వెళ్లి, చిన్న, పెద్ద పేగు సంబంధిత రోగాలు, గొంతు, పొట్ట ఇన్ఫెక్షన్కు గురి చేస్తూ, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇది పిల్లలపై అధికంగా ప్రభావం చూపిస్తుంది. అపరిశుభ్ర వాతావరణం, కలుషితమైన వాటర్, నాణ్యత లేని పాలను ఉపయోగించే క్రమంలో ఐస్ క్రీంలో ఈ బ్యాక్టీరియా చేరుతోంది. పిల్లలు మారం చేస్తే.. అనారోగ్యం బారిన పడతామని నచ్చ చెప్పాలి. – డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్, ప్రముఖ సర్జన్ పలు రకాల ఐస్ క్రీంలు● -
షాపు నుంచి గెంటేశాడు..
జనగామ బస్టాండ్లోని స్టాల్ నంబర్ 03లో జగదాంబ పాప్కార్న్ షాపునకు జనగా మకు చెందిన గుగులోత్ వెంకట్తో కలిసి టెండర్ వేయగా వెంకట్ పేరున టెండర్ వచ్చింది. ఆయనతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాను. షాపు అద్దె రూ.50 వేలు కూడా చెల్లించాను. అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరంపాటు భాగస్వాములుగా ఉండాల్సి ఉండగా రెండు నెలల తర్వాత షాపు నుంచి గెంటేశాడు. పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే కానిస్టేబుళ్లను పంపించి నన్నే షాపు నుంచి బయటికి పంపించేశారు. అట్రాసిటీ కేసు పెడుతామని బెదిరిస్తున్నారు. న్యాయం చేయాలి. – నామాల రాజు, వడ్లకొండ -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు. కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరున్ని దర్శించుకునేందుకు గంట ల కొద్దీ క్యూలో వేచి చూశారు.– వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu -
ప్రతీఒక్కరు భక్తిభావాన్ని కలిగి ఉండాలి
పాలకుర్తి: ప్రతీఒక్కరు భక్తిభావాన్ని కలిగిఉండాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ముది రాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్ అన్నారు. మండలంలోని వల్మిడి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించగా.. మాజీ మంత్రి దయాకర్రావుతో కలిసి బండా ప్రకాశ్ సోమవారం ద ర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రకాశ్ మా ట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, ముదిరాజ్ మహాసభ నాయకులు నీరటి చంద్రయ్య, మాచర్ల ఎల్లయ్య, ఉత్సవ కమిటీ మోకాటి కొమురయ్య, వంగ సైదులు, నీరటి సోమయ్య, తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి కృషి పాలకుర్తి టౌన్: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మామి డాల యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వ రాయితీపై అందించిన జీలుగ విత్తనాలను ఎమ్మెల్యే.. రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కిందన్నా రు. ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పెంచుకునేందుకు జీలుగ విత్తనాలు దోహదపడతాయని తెలిపారు. రైతుల ఆర్ధికంగా నష్టపోకూడదని జీలుగ విత్తనాలు రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ పాలకుర్తి సబ్ డివిజన్ ఉపసంచాలకులు అజ్మీరా పరుశరామ్నాయక్, మండల వ్యవసాయ అధికారి శరత్చంద్ర, నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, యాకాంతరావు, నాగన్న, సలీం, రైతులు పాల్గొన్నారు. రక్తహీనత లేని సమాజాన్ని నిర్మిద్దాం జనగామ: రక్తహీనత లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు పిలుపునిచ్చా రు. జిల్లా కార్యాలయంలో ఫార్మసీ ఆఫీసర్స్తో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో 50 నుంచి 60 శాతం మేర మహిళలు, చిన్న పిల్లలు రక్త హీనతతో బాధపడుతున్నారన్నారు. మహిళలకు ఐరన్ ఫొలిక్ మాత్రలు, పిల్లలకు ఐరన్ సిరప్లను అందించేందుకు జిల్లాకు ఇండెంట్తోపాటు సరఫరా చేసే విధానంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. రక్తహీనతకు సంబంధించి మాత్రలు, సిరప్ల కొరత లేకుండా ఫార్మసీ ఆఫీసర్స్ అలర్ట్గా ఉండాలన్నారు. పీహెచ్సీల వారీగా నిల్వ ఉన్న మందుల సమాచారం ఫిజికల్, ఆన్లైన్లో సరిగ్గా ఉండే విధంగా చూసువాలన్నారు. జిల్లా ఫార్మసీ ఆఫీసర్ రాజేందర్ తదితరులు ఉన్నారు. ప్రొటోకాల్ పాటించకుంటే చర్యలు తప్పవుజనగామ: కాంగ్రెస్ పార్టీలో ప్రొటోకాల్ పాటించకుంటే ఎంతటి వారైనా చర్యలు తప్పవని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో జనగామ, చేర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు గౌడ్, మల్లేష్తో కలిసి మాట్లాడారు. జనగామలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి, ప్రతి ఒక్కరూ పార్టీ ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి సూచన మేరకు పార్టీ కా ర్యక్రమాలు చేపట్టాలన్నారు. నాగపురి కిరణ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరులో కమీషన్లకు తెరలేపుతున్నాడని ఆరోపించారు. కిరణ్పై టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో నాయకులు గంగం నరసింహారెడ్డి, ఆలేటి సిద్ధిరాములు, బక్క శ్రీని వాస్, లక్ష్మీనారాయణ, యాదగిరిగౌడ్, సాయిలు, బన్సీ నాయక్, అనిల్ పాల్గొన్నారు. -
పాత స్టాక్.. కొత్తధరలు
జనగామ: తెలంగాణ ప్రభుత్వం పెంచిన లిక్కర్ ధరలు.. మద్యం దుకాణాలకు కాసులు కురిపించా యి. పాత స్టాక్.. పాత ధరలకే విక్రయించాలని ప్ర భుత్వం సర్క్యులర్ జారీ చేసినా.. వ్యాపారులు పెడచెవిన పెట్టారు. ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన లిక్కర్ దుకాణాలు.. మధ్యాహ్నం 12.30 గంటలు దాటినా మూసే ఉంచారు. డిపోల ద్వారా నూతన బిల్లింగ్ పూర్తయ్యే వరకు కొన్ని చోట్ల షాపులు తెరవలేదు. లిక్కర్ దుకాణాలకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లు షాపులు మూసి ఉండడంతో ఆందోళనకు గురి కాగా, పాత స్టాక్ను కొత్తగా అమ్ముకునేందుకే ఇలా చేశారనే ప్రచారం జరిగింది. ఇదంతా ఎకై ్సజ్ శాఖ చూసీ.. కూడా చూడనట్టు వ్యహరిస్తూ మద్యం దుకాణాదారులకు సహకారం అందించిందనే ఆరోపణలు బాహాటంగానే వినిపించాయి. మద్యం ప్రియుల జేబులు లూటీ..! రాష్ట్ర ప్రభుత్వం క్వార్టర్పై రూ.10, ఆఫ్ రూ.20, ఫుల్ బాటిల్ లిక్కర్పై రూ.40 వరకు పెంచుతూ ఈ నెల 18వ తేదీన జీఓ జారీ చేసింది. వైన్స్లో ఉన్న పాత స్టాక్కు కొత్త రేట్లు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఓల్డ్ స్టాక్పై ఎంతో కొంత వెనకేసుకోవాలనే ఆలోచనతో దుకాణాదారులు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలు దాటిన తర్వాత వైన్స్ తెరిచి కొత్త ధరలతో స్టాక్ విక్రయించారు. ఇదేంటని మద్యం ప్రియులు నిలదీస్తే ‘ఎకై ్సజ్ అధికారులు వచ్చారు.. పాత స్టాక్ వివరాలు రాసుకున్నారు.. వీటికి చలానా రూపంలో అదనపు డబ్బులు వసూలు చేస్తారు’ అని చెప్పి కొత్త ధరలకు లిక్కర్ విక్రయించారు. కానీ, ప్రభుత్వం పాత స్టాక్ పూర్తయ్యే వరకు ఓల్డ్ రేట్లు మాత్రమే తీసుకోవాలని స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఎకై ్సజ్ అధికారుల బూచీ చూపెడుతూ.. మద్యంవ్యాపారులు మద్యం ప్రియుల జేబులను ఖాళీ చేశారు. ఇదిలా ఉండగా లిక్కర్ ధరలు పెంచుతూ ప్రభుత్వం 18వ తేదీ సాయంత్రం సర్క్యులర్ జారీ చేయగా, అదే రోజు జిల్లాలోని చాలా చోట్ల గంట ముందుగానే వైన్స్ మూసివేశారు. కాగా, జిల్లాలో 47 మద్యం దుకాణాలు ఉండగా, రోజు వారీగా రూ.1.10 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. పాత ధరలపై కొత్త రేట్లతో విక్రయించడంతో సుమారు రూ.5లక్షల వరకు మద్యం బాబులపై అదనపు వడ్డన పడింది. కానరాని ఎకై ్సజ్ శాఖ ధరల పెంపు సమయంలో విక్రయాలపై ఎకై ్సజ్ శాఖ నిఘా ఉండాలి. దుకాణాలు ఎప్పుడు తెరుస్తున్నారు.. అదనపు ధరలు తీసుకుంటున్నారా.. లేదా.. అని చెక్ చేసుకోవాలి. పాత స్టాక్ పాత ధరలకే విక్రియించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. జిల్లాలో ఎవరూ పాటించలేదు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఎకై ్సజ్ శాఖ నిమ్మకుండిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్ మధ్యాహ్నం 12.30 గంటల వరకు తెరుచుకోకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికితోడు ఏ ఒక్క వైన్స్ వద్ద కూడా కొత్త ధరలు సూచించే ఫ్లెక్సీ కన్పించకపోవడం గమనార్హం.సమీపించినా మూసి ఉన్న మద్యం దుకాణం ధరలు పెరగడంతో ఆలస్యంగా తెరిచిన వైన్స్ మద్యం ప్రియుల మండిపాటు కనిపించని ధరల పట్టిక పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు -
ఘనంగా మహంకాళి విగ్రహ ప్రతిష్ఠాపన
● హాజరైన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి స్టేషన్ఘన్పూర్: మండలంలోని సముద్రాల గ్రామంలో శ్రీమహంకాళి అమ్మవారు, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనో త్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, నిర్మాణకర్త కుందూరు సోమిరెడ్డి, నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఎంపీకి, ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన ధర్మకర్త సోమిరెడ్డికి, ఆలయ నిర్మాణానికి నిధుల కేటాయించిన ఎంపీ కావ్యకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో సముద్రాల గ్రామపరిధిలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నాగమణి, సోమిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వెంకటేశ్వర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇనుగాల లలితాదేవి, గుండె విమలనర్సయ్య, కుమారస్వామి, నాయకులు భాస్కుల కిరణ్, రాజు, నారాయణ, హరిప్రసాద్, రవీందర్, రాజు, నర్సింహులు, కిషన్రాజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తిచేయాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని, ఇళ్ల పెండింగ్ దరఖాస్తుల సర్వే, మార్కింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్లతో కలిసి సోమవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 90 శాతం ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. పైలట్ మండలాల కింద 12 గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ మార్కింగ్ ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అదే విధంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతోందని, 20 శాతం ధాన్యం కొనుగోలు మిగిలి తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కేంద్రాలను తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. తాగునీటి సరఫరాలో వేసవి కార్యాచరణ ప్రణాళికను సక్రమంగా అమలు చేయాలని తెలిపారు. ఎరువుల దుకాణాలను తహసీల్దార్లు, ఏఈఓలు, ఎంఏఓలు, మండల ప్రత్యేక అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, జిల్లాకు సరిపడా విత్తనాలు వచ్చాయని, విత్తనాల కొరత రాకుండా, నాణ్యమైన విత్తనాల క్రయ విక్రయాలు జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి దుకాణంలో ధరల పట్టిక బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జనగామ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఘనపూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హనుమాన్ నాయక్, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, డీసీఎస్ఓ సరస్వతి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
దేశం గర్వించేలా పాకిస్తాన్తో పోరాడాం
జనగామ రూరల్: పహల్గాం ఉగ్రదాడికి బదులుగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైనికులు దేశం గర్వించేలా పాకిస్తాన్తో పోరాడడం గొప్ప విషయమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని స్మరించుకుంటూ సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో జనగామ రైల్వేస్టేషన్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ రాజేందర్ మాట్లాడుతూ.. భరతమాత నుదిటి మీద తిలకం తుడిచిన వారిని మట్టు పెట్టడానికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో చాలా మంది తప్పుడు ప్రచారం చేసినా.. మోదీ భయపడలేదన్నారు. దేశాన్ని ప్రపంచంలో విశ్వ గురువు స్థానానికి తీసుకువెళ్తున్నారని వివరించారు. కాజీపేట రైల్వేస్టేషన్కు కోచ్ ఫ్యాక్టరీ రాబోతుందని, జనగామ రైల్వేస్టేషన్ను రూ.26 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ నంద రెడ్డి, మాజీ ఎంపీ గుండె విజయరామారావు, ఆరుట్ల దశమంత్ రెడ్డి, ఉడుగుల రమేష్, కేవీఎల్ఎన్.రెడ్డి, శివరాజ్, కత్తుల లక్ష్మి, దేవరాయ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న మోదీ ఎంపీ ఈటల రాజేందర్ -
మా సమస్యలు పరిష్కారమయ్యేనా..?
జనగామ రూరల్: కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్లో సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలి తం లేదని, తిరుగుడు తప్ప పరిష్కారం కావడంలేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సుమారు 74 వినతులు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బా షా సైతం గ్రీవెన్స్లో వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై అధికారులు, సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రో హిత్ సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, స్టేషన్ ఘనపూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హనుమాన్ నాయక్, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీ ఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, డీసీ ఎస్ఓ సరస్వతి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని ఇలా.. ● దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడేనికి చెందిన నాగిడి మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్లిన సమయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేశారు. మళ్లీ సర్వే చేసి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ● రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామం చెందిన జట్టి వెంకటయ్య, తన 4.5 ఎకరాల వ్యవసాయ భూమికి దారి లేక ఇబ్బంది పడుతున్నానని పరిష్కారం చూపాలని కోరాడు. ● బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామం చెందిన గీస పోశమ్మ తనకు ఎలాంటి పనిలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉండని వృద్ధాప్య ఫించన్ మంజూరు చేయాలని కోరింది. ● జనగామ మండలం మరిగడి పరిధిలోని టాక్యతండాకు చెందిన రామావత్ శంకర్ తమ ఊరిలో మిషన్ భగీరథ ద్వారా నీరు రావడం లేదని, తండాకు నీరందించాలని కోరాడు. గ్రీవెన్స్లో బాధితుల ఆవేదన ప్రజల నుంచి 74 వినతుల స్వీకరణ -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
జనగామ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు మరోసారి బయటపడింది. నాగపురి –కొమ్మూరి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు తోపులాడుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్గౌడ్ ఆధ్వర్యంలో రూ.10లక్షల విలువ చేసే 24 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి వర్గీయులు అడ్డుకున్నారు. జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ప్రోటోకాల్, అనుమతి లేకుండా కిరణ్ చెక్కులను పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట, ఒకరిపై ఒకరు చేయి వేసుకునే వరకు వెళ్లింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని సముదాయించి పంపించారు. చెక్కులను పంపిణీ చేసేందుకు నాగపురి కిరణ్ తన వర్గీయులతో కలిసి సిద్ధిపేటరోడ్డు గాయత్రి గార్డెన్కు చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షులు లేకుండా చెక్కులను ఎక్కడా పంపిణీ చేయొద్దని కొమ్మూరి వర్గీయులు వచ్చి అడ్డుకున్నారు. పార్టీ పౌరు తీస్తున్నారంటూ కొమ్మూరి అనుచరవర్గం కిరణ్ వర్గంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరగంటపాటు మాటల యుద్ధంతో కొట్టుకున్నంత పని చేశారు. ఏఎస్పీ చేతన్ నితిన పండేరీ ఆధ్వర్యంలో సీఐ దామోదర్రెడ్డి, ఎస్సైలు.. నాగపురి కిరణ్ కు మార్గౌడ్తోపాటు కొమ్మూరి వర్గీయులను అక్కడ నుంచి పంపించారు. అనంతరం షామీర్పేటలోని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గనిపాక మహేందర్ నివాసం వద్ద కిరణ్ చెక్కులను పంపిణీ చేశారు. నాగపురి వర్సెస్ కొమ్మూరి వర్గం ఇరు వర్గాల మధ్య తోపులాట ఉద్రిక్తత, పోలీసుల రంగ ప్రవేశం -
ప్రజా ఉద్యమాలే ఊపిరిగా పోరాటం..
● సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి జఫర్గఢ్: ప్రజా ఉద్యమాలే ఊపిరిగా సీపీఐ పోరాటాన్ని సాగిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో సీపీఐ మహాసభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం పోరాటాలు సాగిస్తున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాల సబ్సిడీతో పాటు పంట పొలాలకు సాగునీరు అందించే విషయంలో సాగించిన పోరాటం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్లో కూడా ఇదే తరహాలో పోరాటాలను సాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి జువారి రమేష్, నాయకులు ఎండీ యాకుబ్పాష, పెండ్యాల సమ్మయ్య, కూరపాటి చంద్రమౌళి, మంద బుచ్చయ్య, బుల్లె దూడయ్య, ఎండీ జాఫర్, గట్టుమల్లు, అన్నెపు అజయ్, నరహరి, రడపాక సత్యం, సాయిలు, యాదగిరి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో చీటకోడూరు రికార్డ్
జనగామ రూరల్: స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన చీటకోడూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ సీజన్ కొనుగోళ్లలో రికార్డు సృష్టించిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేవాల మేరకు జిల్లాలో సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుకోళ్లకు ఐకేపీ, పీఏసీఎస్ కలిపి మొత్తం 258 కేంద్రాలను ఏర్పాటు చేసి సజావుగా కొనుగోళ్లను చేపట్టడం జరిగిందన్నారు. గత రజీ సీజన్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి. ఎస్ చౌహాన్ జిల్లాలోని పలు కేంద్రాలను సందర్శించి అక్కడ ఉత్పన్నమైన సమస్యల పరిష్కార మార్గాలను అధికారులకు వివరించారు. అవే సూచనలు ఈ సీజన్లో కూడా పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను చేపట్టడం జరిగిందన్నారు. ఈ రబీ సీజన్లో 497 మంది రైతుల నుంచి ఇప్పటి వరకు 38,104 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలోనే అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రంగా రికార్డు సృష్టించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతీ గింజను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. -
అగ్ని ప్రమాదాల నివారణలో ప్రభుత్వం విఫలం
జనగామ: వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పాతబస్తీలో గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఇప్పటికై న అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాద మృతు ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషి యా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 17 మంది మృతి బాధాకరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
వారధికి ముప్పు
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025– 8లోu బ్రిడ్జికి ఇరువైపులా పెరిగిన మహావృక్షాలుజనగామ ఫ్లై ఓవర్పై మహావృక్షాలు ● పగుళ్లు పడుతున్న బ్రిడ్జి ● కుంగిపోతున్న ఫుట్పాత్.. కూలిన మెట్లమార్గం ● ఆందోళనలో పట్టణ ప్రజలుజనగామ: ప్రమాదాన్ని పక్కనే బెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఆర్అండ్బీ నాది కాదంటారు, ఎన్హెచ్ పట్టించుకోరు, పురపాలిక నాకేంటిలే అని వదిలేశారు. అందరూ కలిసి జనగామ ఫ్లై ఓవర్ ఆలనా పాలన గాలికి వదిలేస్తున్నారు. దీంతో ఫ్లై ఓవర్ కు ఇరువైపులా రావి చెట్లు మహా వృక్షాలుగా మారిపోతూ.. సిమెంట్ దిమ్మెల లోనకు చొచ్చుకు పోతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయాందోళనలో పట్టణ ప్రజలు, వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ ఐదు రాష్ట్రాలకు వారధిగా ఉన్న జనగామ జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ నిర్మాణం చేసి మూడు దశాబ్ధాలు గడిచి పోతుండగా, వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు, ప్రస్తుత మరమ్మతు గురించి అధికార యంత్రాంగం ఆలోచన చేయడం లేదు. బ్రిడ్జికి ఇరువైపులా మహావృక్షాలు.. జనగామ జిల్లా కేంద్రం పాతబీటు బజారు నుంచి రైల్వే గేటు మీదుగా రాకపోకలు సాగించే వారు. ఐదు రాష్ట్రాలకు జనగామ ప్రధాన హైవే. నిత్యం రైళ్ల రాకపోకలతో గేటు మూసి వేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో నాటి ప్రభుత్వం ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టింది. మూడు దశాబ్ధాల క్రితం ఫ్లై ఓవర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు భారీ వాహన రాకపోకలకు ఇబ్బందులు తప్పాయి. ప్రస్తుతం ఫ్లై ఓవర్ కు ఇరువైపులా రావి చెట్లు మహా వృక్షాలుగా పెరగడంతో పాటు బ్రిడ్జి రేలింగ్, మెట్ల మార్గం కూలిపోయి, ఫుట్పాత్ కుంగిపోతుంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోననే భయాందోళనలో స్థానికులు ఉన్నారు. ఫుట్పాత్పై పూలకుండీలను ఏర్పాటు చేయడంతో పాదాచారులు నడవలేని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై వెళుతున్నారు. నిత్యం భారీ వాహనాలు కాకినాడ పోర్టుతో పాటు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ప్రధాన హైవే కావడంతో నిత్యం వందలాది వాహనాలకు ఫ్లై ఓవర్ ఒక్కటే దిక్కు. ఆయా రాష్ట్రాల్లో ఇండస్ట్రీయల్గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విశాఖపట్టణం, చైన్నె నుంచి మహారాష్ట్ర, గుజరాత్, అక్కడ నుంచి ఇటువైపుగా యంత్ర పరికరాలకు సంబంధించిన మెటీరియల్ తీసుకు వెళ్లే భారీ కంటైయినర్లు ఇటీవల కాలంలో పెరిగాయి. బ్రిడ్జి సామర్థ్యానికి మించి ఓవర్లోడ్తో ఇసుక, కంకర, ధాన్యం బస్తాలు, ఇతర వాహనాలు ప్రయాణం చేస్తుండడంతో దానిపై అధిక భారం పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ పోర్టేషన్ జరుగుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. జనగామ, చుట్టు పక్కల జిల్లాకు చెందిన అనేక మంది ప్రజలు, వ్యాపారులు, అన్ని వర్గాల వారు పనుల కోసం జిల్లా కేంద్రానికి వస్తుంటారు. వాహనాలతో బ్రిడ్జి ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది. న్యూస్రీల్గాలిలో దీపంలా.. ఫ్లై ఓవర్ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు నిద్ర నుంచి మేలుకోవడం లేదు. 8 ఏళ్ల క్రితమే బ్రిడ్జి ప్రమాదంలో ఉందని అప్పటి ఇంజనీరింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హెచ్చరించిన పట్టించుకోవడంలేదనే ఆరోపణలు లేకపోలేదు. జనగామ ఫ్లై ఓవర్ పరిస్థితిని అంచనా వేసి... ప్రస్తుత అవసరాల మేరకు కొత్తగా నిర్మాణం చేస్తారా, లేక దీనికి రిపేర్లు చేసి సామర్థ్యం పెంచేలా ప్లాన్ చేస్తారా అంటూ ప్రజల సందేహాలను అధికారులు నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా మొదటగా బ్రిడ్జికి ఇరువైపులా పెరిగిన మహా వృక్షాలను తొలగించి, ప్రమాద నివారణను కొంతమేరకై న తగ్గించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మద్యం ప్రియులకు షాక్
జనగామ: తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. నైన్టీ వేయకుండానే మత్తెక్కిచే వార్త చెప్పింది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన సర్కారు.. ఆదివారం అర్థరాత్రి నుంచి లిక్కర్ రేట్లను పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో మందు ప్రియులు ఒకింత కినుకుగా ఉన్నారు. జిల్లాలో 47 మద్యం దుకాణాలు, ఐదు బార్లు ఉన్నాయి. రోజు వారీగా రూ.1.10 కోట్ల మేర లిక్కర్, బీర్ల వ్యాపారం జరుగుతుంది. ఇటీవల లైట్ బీర్, స్ట్రాంగ్ బీర్లపై రూ.30 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లిక్కర్ వంతు వచ్చేసింది. పలు బ్రాండ్లకు సంబంధించి క్వార్టర్పై రూ.10, ఆఫ్కు రూ.20, ఫుల్పై రూ.40 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆదివారం అర్థరాత్రి నుంచి కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయని సూచనలు చేసింది. ప్రతీరోజు క్వార్టర్, ఆఫ్ చొప్పున తీసుకునే మ ద్యం ప్రియులు పెరిగిన ధరలను ఆదా చేసుకునేందుకు ఒక్కసారే నెలకు సరిపడా స్టాక్ కొనుగోలు చేస్తున్నారు. బెల్ట్ దుకాణదారులు రోజు వారి స్టాక్ కంటే రెట్టింపు కొనుగోలు చేశారు. ధరల పెరుగుదలతో ఆవరేజ్గా ప్రతీరోజు మద్యం ప్రియులపై రూ.10లక్షల మేర అదనపు భారం పడనుంది. లిక్కర్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం -
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
జనగామ రూరల్: జీపీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహులు అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కారోబార్లు, బిల్ కలెక్టర్లను పంచాయతీ అసిస్టెంట్లుగా నియమించాలని, జీఓ 51ని ఎత్తివేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలన్నారు. ఈ డిమాండ్లను సాధించుకునేందుకు ఈ నెల 25న రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో పని చేస్తున్న అన్ని సంఘాల బాధ్యులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చొల్లేటి శ్రీనివాసాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, కంజర్ల భాస్కర్, కోశాధికారి పిల్లి రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీధర్ యాదవ్, సహాయ కార్యదర్శి తిరుపతి, నాయకులు బాలనర్సయ్య, పాషా, మురళి, ప్రభాకర్, బాబుగౌడ్, శ్రీనివాస్, సురేశ్, గూడూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులు -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే కడియం
స్టేషన్ఘన్పూర్: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్డ్డిని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధిపై సీఎంతో చర్చించారు. ఘన్పూర్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్ప న, కార్యాలయాల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు సంబంధించి రూ.87 కోట్లతో ప్రతిపాదనలను అందించారు. అలాగే మున్సిపాలిటీలో తాగునీటి అవసరాలకు సంబంధించి రూ.20 కోట్లతో ప్రతిపాదనలు అందించారు. ఆయా ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించారని, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులున్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.87 కోట్లు, తాగునీటి వసతికి రూ.20 కోట్ల ప్రతిపాదనలు -
సోమేశ్వరాలయానికి వెండి కలశాల బహూకరణ
పాలకుర్తి టౌన్: శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయానికి రెండు వెండి కలశా లను (చెంబులు) భక్తులు శనివారం బహూక రించినట్లు ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. స్వామి వారి పూజా కార్యక్రమాల్లో వినియోగించేందుకు వరంగల్కు చెందిన భ క్తుడు అనంతుల రవి కుమార్, స్వప్న కుటుంబ సభ్యులు రూ.1,35,000 విలువైన 1.34 కేజీల వెండి కలశాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మ న్న, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. మధ్యవర్తిత్వ కేంద్రాలతో సమస్యల పరిష్కారం●జనగామ రూరల్: మధ్యవర్తిత్వ కేంద్రాలతో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీనియర్ సివిల్ జడ్జి సి. విక్రమ్ అన్నారు. శని వారం ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ ఆదేశాల మేరకు పట్టణంలోని కురుమవాడలో జనహిత కౌండిన్య మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతీ చిన్న సమస్యకు పోలీస్స్టేషన్, కో ర్టుకు వెళ్లడం సరికాదని, మధ్యవర్తిత్వ కేంద్రాల్లో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ దామోదర్ రెడ్డి, మధ్యవర్తి మేకపోతుల ఆంజనేయులు పాల్గొన్నారు. ఉప్పల్ డీలక్స్ బస్సు సర్వీసులకు రిజర్వేషన్జనగామ: జనగామ డిపో నుంచి ఉదయం 6.20 (8552) బస్సు నంబర్), 7.10 (8554) గంటలకు ఉప్పల్కు వెళ్లే డీలక్స్ బస్సు సర్వీసులకు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు డిపో మేనేజర్ ఎస్.స్వాతి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఉప్పల్కు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఇంటి నుంచే టీజీఎస్ఆర్టీసీబస్.ఇన్ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చన్నారు. తిరంగా యాత్రను విజయవంతం చేయాలిజనగామ రూరల్: ఆర్మీ జవాన్లకు సంఘీభావంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. శనివారం పట్టణంలో తిరంగా యాత్ర కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషప్ సిందూర్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు గాను నేడు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు నిర్వహించే తిరంగా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు 2025–26 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 1వ, 5వ తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు జిల్లాకు చెందిన ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ అధికారి డాక్టర్ విక్రమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతులు, 7, 10వ తరగతిలో 90శాతం పైగా ఉత్తీర్ణత కలి గి ఉండాలన్నారు. ఆసక్తిగల ఇంగ్లిష్ మీడి యం పాఠశాలల యాజమాన్యాలు ఈ నెల 19 వ తేదీలోగా కలెక్టరేట్లోని ఎస్సీ సంక్షేమ కా ర్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. సబ్సిడీపై జీలుగ విత్తనాలుజనగామ రూరల్: ప్రభుత్వ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో జీలుగు విత్తనాలు సబ్సిడీతో అందుబాటులో ఉన్నాయని క లెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 కిలోల బస్తా పూర్తి ధర రూ.4,275కి గాను 50శాతం సబ్సిడీ పోను రూ.2,137.5లకు రైతులకు అందిస్తున్నామన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్తో సంబంధిత ఏఈఓలను సంప్రదించాలన్నారు. జిలుగ సాగుతో భూమిలో సారవంతం పెరిగి వచ్చే వర్షాకాలంలో పంట దిగుబడి పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లోనే మెరుగైన బోధన
జనగామ రూరల్: విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ నెల ఒకటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు విఽ దించింది. పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదల కాగా జిల్లాలో 4,924 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళా శాలల్లోనే చేరాలని విద్యార్థులకు అధికారులు సూచి స్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లకు కళాశాల అధ్యాపకులు ఇంటింటా తిరుగుతూ వివరాలు సేకరిస్తూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలలు జిల్లాలో అనుబంధ గుర్తింపు కళాశాలల్లో ప్రవేశాలు చేపడుతున్నారు. తమ కళాశాలల్లో ముందు చేరితే ఫీజుల్లో రాయితీ ఇస్తామంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 7 ప్రభుత్వ కళాశాలలు.. జిల్లాలో 7 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో నర్మెట, కొడకండ్ల, ప్రభుత్వ బాలికల కళాశాల జనగామ, ప్రభుత్వ కళాశాల జనగామ, దేవరుప్పుల, స్టేషన్ ఘన్పూర్, జఫర్గఢ్ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో సెక్షన్లో 44 మందిని మాత్రమే చేర్చుకోవాలి. ఒక్కో కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఐసీలో 80 సీట్ల చొప్పున భర్తీ చేయనున్నారు. గుర్తింపు ఉంటేనే ప్రవేశాలు ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే చేరాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రభుత్వ కళాశాలలకు ఫైర్సెఫ్టీ పరికరాలను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ సరఫరా చేసింది. శానిటైజేషన్, స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుంది. ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అనుబంధ గుర్తింపునకు అన్ని సౌకర్యాలు ఉంటేనే అనుమతి ఇస్తారు. నిబంధనల ప్రకారం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ), ఆటస్థలం, అగ్నిమాపక అనుమతులు, కాలుష్యం, శబ్ధ నియంత్రణ, భవనం పటిష్టత, ట్రాఫిక్ తదితర ధ్రువీకరణ పత్రాలు, బోధకులు, సిబ్బంది వివరాలు ఉంటేనే అనుబంధ గుర్తింపు లభిస్తుంది. కొన్ని కళాశాలల్లో ఫైర్ సేఫ్టీ లేకపోవడం, మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉండడం ప్రధాన సమస్య కాగా, అప్లియేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఫిక్స్డ్ అగ్రిమెంట్ సేల్ డీడ్ అగ్రిమెంట్ వంటివాటితో ప్రభుత్వానికి అప్లియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకుని అనుమతుల కోసం వేచి చూస్తూనే ప్రవేశాలు చేపడుతున్నాయి. ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింటా ప్రచారం ఈ నెల 31వ తేదీ వరకు అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 7 ప్రభుత్వ కళాశాలలుసద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి. ప్రైవేట్ కళాశాలల పునరుద్ధరణకు దరఖాస్తులు మాత్రమే సమర్పించాయి. అన్ని అనుమతులు ఉంటేనే అనుమతి ఇస్తారు. ప్రభుత్వ కళాశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. –జితేందర్రెడ్డి, డీఐఈఓ -
దరఖాస్తుల పరిశీలన వేగంగా జరగాలి: కలెక్టర్
తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం జిల్లాలో జరుగుతున్న దరఖాస్తుల వెరిఫికేషన్కు సంబంధించి ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని.. వెరిఫికేషన్ ఏ మేరకు పూర్తి చేశారనే విషయం అడిగి తెలుసుకున్నారు. ప్రతీ మండలం వారీగా వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తూ ... ఎంత మేరకు వెరిఫికేషన్ జరిగిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూమ్ మీటింగ్లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్.మాధవిలత, బీసీ సంక్షేమ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకుకు నిప్పంటించి నిరసన
స్టేషన్ఘన్పూర్: పొగాకు పంటను కంపెనీ వారు కొనుగోలు చేయడం లేదని శనివారం ఛాగల్లు గ్రామంలో జాతీయ రహదారిపై పొగాకుకు నిప్పంటించి రైతులు నిరసన, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతులు ఆకుల నర్సింగం, వడ్లకొండ యాదగిరి, పొన్నబోయిన రాజు, కె.యాకయ్య తదితరులు మాట్లాడారు. ఛాగల్లుకు చెందిన పొగాకు రైతులకు వీఎస్టీ, డెక్కన్ కంపెనీలకు చెందిన ఉద్యోగి మాయమాటలు చెప్పి పొగాకు పంట సాగు చేశాక క్వింటాకు రూ.18వేలకు తీసుకుంటామని నమ్మబలికారని చెప్పారు. దీంతో ఛాగల్లు క్లస్టర్ పరిధిలో దాదాపు 300 ఎకరాల్లో పొగాకు సాగుచేశామన్నారు. తీరా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశాక ప్రస్తుతం ఆయా కంపెనీల వారు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వృథాగా పోతుందని, ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కుల యాదగిరి, ఐలయ్య, శేషు తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ నివారణకు కృషి చేయాలి
జనగామ రూరల్: డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెంగీ లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులవు అవుతుందని, ఈ మేరకు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమ తెరలు వినియోగించాలని సూచించారు. వ్యాధి సోకినట్లు అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా మేరకు మందలతోపాటు సమతుల పౌష్టికాహారం తీసుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి అశోక్, యూపీహెచ్సీ అధికారి డాక్టర్ శ్రీతేజ, ప్రభాకర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.ఆట పాటలతో నేర్పించాలిలింగాలఘణపురం: విద్యార్థులకు వారికి ఇష్టమైన వాటిని ఆట పాటలతో నేర్పించాలని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ జి.ఉషారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని నెల్లుట్ల, లింగాలఘణపురం పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులను పరిశీలించిన అరంతరం ఆమె మాట్లాడారు. క్యాంపులో విద్యార్థులు నేర్చుకున్న డాన్స్లు, పాటలు, కథలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా సంఘం సభ్యులతో ఏర్పాటు చేసిన ‘బడిబాట’ సమావేశాన్ని సందర్శించిన ఆమె.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తున్న పాఠశాలలను బలోపేతం చేయడానికి ముఖ్యంగా మహిళలు కృషి చేయాలని కోరారు. చదువురాని నిరక్షరా స్య మహిళలకు చదువు నేర్పించాలని చెప్పా రు. అడిషనల్ డైరెక్టర్తో పాటు డిప్యూటీ డైరెక్టర్ నూమాన్, డీఈఓ భోజన్న, విజయ్కుమార్రెడ్డి, ఎంఈఓ విష్ణుమూర్తి, హెడ్మాస్టర్లు విద్యారాణి, మార్తా పాల్గొన్నారు. కడియం నాయకత్వంలోనే స్టేషన్ అభివృద్ధి : కొమ్మూరిజనగామ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వంలోనే స్టేషన్ఘన్పూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జనగామలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన 18 నెలల కాలంలోనే సీఎం రేవంత్రెడ్డి సహకారంతో ఘన్పూర్కు కడియం శ్రీహరి రూ.800ల కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారని, ఆయనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అసత్యపు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతీ పనికి కమీషన్లు తీసుకున్న రాజయ్య.. నీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కడియంపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నా రు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మోసాలకు కేరాఫ్ అడ్రస్ మాజీ సీఎం కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కేటీఆర్కు బీఆర్ఎస్ పగ్గాలు అప్పగించిన వెంటనే మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ వీడబోతున్నారని జోస్యం చెప్పారు. కేటీఆర్కు బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని అనడం వెనుక కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. సమావేశంలో జనగామ ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, నాయకులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, వంగాల మల్లారెడ్డి, గాదెపాక రాంచందర్ పాల్గొన్నారు. కార్యదర్శులకు శిక్షణజనగామ రూరల్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం కలెక్టరేట్లో ఆర్టీఐ గ్రామసభలపై పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణ కార్యక్ర మం చేపట్టారు. ఈ సందర్భంగా కార్యదర్శులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు, సవాళ్లపై డీపీఓ స్వరూప చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీ కర్ణాకర్, ఎంపీఓ ప్రకాశ్ మాస్టర్ ట్రైనర్లు, జిల్లాకు చెందిన 35 మంది కార్యదర్శులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాల నియంత్రణపై దృష్టి పెట్టాలి
జనగామ: గంజాయి, మత్తు పదార్థాల క్రయ విక్రయాల నియంత్రణపై స్టేషన్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వెస్ట్జోన్ పోలీసు అధికా రుల సమావేశ ప్రాంగణాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి పండ్ల మొక్కలు నాటి నీరు పోశా రు. అక్కడి నుంచి వెస్ట్జోన్న్ పరిధి జనగామ పోలీస్స్టేషన్తో పాటు డీసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు, బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరు, రౌడీ షీటర్లు, నమోదవుతున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి స్టేషన్ అధికారి తప్పనిసరిగా రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలని సూచించారు. ఆర్థిక, సైబర్ నేరాలకు సంబంధించి నేరస్తుల మూలాలను సైతం దర్యాప్తులో కనిపెట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనగామ ఏఎస్పీ చైతన్య నితిన్ పండేరీ, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, సీఐలు దామోదర్రెడ్డి, అబ్బయ్య, శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు. విజుబుల్ పోలిసింగ్ అవసరం చిల్పూరు: నేరాల నియంత్రణకు విజుబుల్ పోలీ సింగ్ అవసరం.. ఇందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి పోలీస్స్టేషన్ను ఆయన శుక్రవారం సందర్శించారు. జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై నవీన్కుమార్ సీపీకి పూలబొకె అందజేశారు. అనంతరం ఆయన మొక్క నాటారు. చెక్పోస్టును పరిశీలించిన సీపీ లింగాలఘణపురం : మండల పరిధిలోని కుందారం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టును శుక్రవారం వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ పరిశీలించారు. రౌడీ షీటర్ల ఇళ్లను సందర్శించాలి సైబర్ నేరస్తుల మూలాలను కనిపెట్టాలి వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ -
సామరస్య పరిష్కారానికే మధ్యవర్తిత్వ కేంద్రాలు
రఘునాథపల్లి: కుటుంబ సభ్యులు, ఇతరులతో జరిగే చిన్న తగాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకే మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రం అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపూర్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సర్వజన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ మీడియేటర్ మేకల శంకరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడు తూ.. జీవితం వెయ్యేళ్లు కాదుకదా.. ఉన్నన్నాళ్లు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.. గొడవలు, తగాదాలతో కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి సమయం, డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. మధ్యవర్తిత్వ కేంద్రంలో సమస్యలు పరిష్కరించుకుంటే బంధాలు బలపడతాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ మీడియేటర్ పెద్దమనిషిగా వివాదాలను స్వచ్ఛందంగా పరిష్కరిస్తారని చెప్పా రు. నిజామాబాద్, కరీంనగర్లో మధ్యవర్తిత్వ కేంద్రాలు విజయవంతంగా పని చేస్తున్నాయని, జిల్లాలో మొదట ఇబ్రహీంపూర్లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై నరేష్, కమ్యూనిటీ మీడియేటర్లు ధర్మయ్య, కృష్ణారెడ్డి, రమేశ్, నర్సయ్య, వైష్ణవి గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు అంబీరు అరుణ, వీఓఏలు మౌనిక, వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్ రాజమణి, పరపతి సంఘం అధ్యక్షుడు మోర్తాల మహేందర్, మేకల శ్రీనివాస్, గాజులపాటి మైసారావు, దామెర వెంకన్న, బండ్ర రామచంద్రం, మేకల శ్రీనివాస్రెడ్డి, గాజులపాటి లక్ష్మయ్య,, దొరగొల్ల కుమార్, మల్లయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి విక్రం -
మైనార్టీ గురుకులంలో నాణ్యమైన విద్య
జనగామ: తెలంగాణ ప్రభుత్వం నిరుపేద మైనార్టీ విద్యార్థులకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్ల ప్రవేశానికి సంబంధించిన పోస్టర్ను ఆయన శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మైనార్టీ గురుకులాల్లో 100 శాతం ఫలితాలు సాధించడం సంతోషకరమన్నారు. జిల్లాలోని మైనార్టీ విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం గురుకులంలో అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విక్రమ్కుమార్, పాఠశాల, కళాశాల ప్రిన్సిపాళ్లు కె.కుమారస్వామి, అనిల్ బాబు, మాధవీలత పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణ పనులను పర్యవేక్షించిన కలెక్టర్ జనగామ: హనుమకొండ బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద జనగామకు వెల్కం చెబుతూ స్వాగత తోరణం నిర్మిస్తున్నారు. శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం స్వాగత తోరణం పనులతో పాటు హైదరాబాడ్ రోడ్డు, పెంబర్తి బైపాస్ జంక్షన్ అభివృద్ధి, బతుకమ్మకుంట సుందరీకరణ పనులను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ మహిపాల్తో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి మరింత కృషి జనగామ రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి మరింత కృషి చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నేషనల్ ట్రస్ట్ చట్టం–1999 ప్రకారం, దివ్యాంగుల కోసం లీగల్ గార్డియన్ షిప్ పొందడానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో లోకల్ లెవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార పత్రాలను సమగ్రంగా పరిశీలించి నేషనల్ ట్రస్ట్ చట్టం విధానాల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్న్స్ దివ్యాంగుల సంఘం ప్రతినిధి బిట్ల గణేష్, మల్లికాంబ మనోవికాస కేంద్రం జనరల్ సెక్రటరీ రామలీల పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
చివరి గింజ వరకూ మద్దతు ధర
జనగామ రూరల్: రైతులు పండించిన చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, హమాలీలు, రవాణా వాహనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించగా జిల్లాలో కలెక్ట ర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ అవుతున్నదని చెప్పారు. రానున్న 15 రోజులు ఎంతో కీలకమని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికా రులను ఆదేశించారు. అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. మీ–సేవా కేంద్రాలు, ప్రజాపాలన కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హులకు రేషన్ కార్డులను జారీ చేయాలని మంత్రి వెల్లడించారు. వీసీలో డీఎం సీఎస్ హాతీరాం, డీసీఎస్ఓ సరస్వతి, డీఎంఓ నరేందర్, డీఏఓ రామారావు నాయక్, డీసీఓ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
పుష్కర స్నానం.. సకల పాప హరణం
● రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు ● సుమారు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరణ ● కిటకిటలాడిన సరస్వతి ఘాట్, దేవస్థానం ● పుష్కర స్నానం చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పలువురు వీఐపీలుభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలకు రెండో రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు పండ్లు, పూలతో పాటు, పసుపు, కుంకుమ, చీరె, సారెను సమర్పించారు. దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి ఆరాధన చేశారు. పితృతర్పనాలు, పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణ ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలని కోరుతూ కాళేశ్వరాలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదపండితులు రెండోరోజు హోమాలు, విశేష పూజలు చేశారు. రాత్రి కాశీపండితుల ఆధ్వర్యంలో నదికి నవరత్నమాల హారతి ఇచ్చారు. నిండిన పార్కింగ్ స్థలాలు, చలువ పందిళ్లు.. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్, ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు కిటకిటలాడాయి. వరంగల్, భూపాలపల్లి మీదుగా తరలి వస్తున్న భక్తులు, వాహనాలను వీఐపీఘాట్, ఇప్పలబోరు వైపు పార్కింగ్లకు పోలీసులు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మంచిర్యాల వైపునుంచి వచ్చే వాహనాలను బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి ఘాట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ షటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు కూడా అనుమతివ్వడంతో భక్తులను పార్కింగ్స్థలాలనుంచి సరస్వతి ఘాట్, అక్కడినుంచి ఆలయానికి తరలిస్తున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులు చలువ పందిళ్లకింద సేదదీరడం కనిపించింది. వీఐపీల రాక.. రెండవ రోజు శుక్రవారం సరస్వతినదిలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి, భూపాలపల్లి ఇన్చార్జ్ జడ్జి పట్టాభిరాంలు వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి, శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. పుష్కరాల మరిన్ని వార్తలు, ఫొటోలు – IIలోu -
రాణి రుద్రమ పౌరుషాన్ని దెబ్బతీశారు
జనగామ: సుందరీమనుల కాళ్లు కడగడం క్షమించరాని నేరం.. సమ్మక్క–సారక్క స్ఫూర్తి, రాణి రుద్రమదేవి పౌరుషాన్ని దెబ్బతీశారని జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ మండలం యశ్వంతాపూర్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, నన్ను కోసుకుతిన్నా పైసా లేదంటూ సీఎం రేవంత్రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలకు కోట్లు కుమ్మరించడంపై విమర్శించారు. అందాలబామల కాళ్లు కడగడం తెలంగాణ మంత్రులు మన సంప్రదాయంగా సమర్థించ డం సరికాదని.. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు పుణ్యక్షేత్రాలను సందర్శించిన సమయంలో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ మేధావులు ఎక్కడ పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఐరన్ లెగ్గా పేరు తెచ్చుకున్నాడని, నియోజకవర్గ ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రేషన్ దుకాణాల్లో ఆరు కిలోల బియ్యం పంపిణీకి 60 మంది పోలీసులను కాపలా పెట్టుకు ని తిరిగే పరిస్థితిలో కడియం ఉన్నారని ఎద్దేవా చేశా రు. ఆయన తిన్నింటి వాసాలు లెక్కించే విధంగా కేసీఆర్, పల్లా రాజేశ్వర్రెడ్డిని విమర్శిస్తున్నాడని అన్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి, నాయకులు ఇర్రి రమణారెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పోకల జమునలింగయ్య, బాల్దె సిద్ధి లింగం, మేకల కలింగరాజు, పగిడిపాటి సుధసుగుణా కర్రాజు, జూకంటి శ్రీశైలంలక్ష్మి, దయాకర్, కిష్టయ్య, మధు, స్వరూప, శారద, సదీప్, దేవునూరి సతీష్, గుర్రం నాగరాజు ఉన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
ప్రత్యేక తరగతులు
టెన్త్ ఫెయిల్ విద్యార్థులకుసర్కారు స్కూళ్లలో 62.. ప్రైవేట్లో 12 మంది ● అడ్వాన్స్డ్ పరీక్షలకు సన్నద్ధం ● తెలుగులో తప్పిన ఎక్కువ మంది విద్యార్థులుజిల్లాలో 10 వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల బడులుజనగామ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థు ల కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. జిల్లాలోని 37 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో 62, ప్రైవేట్ స్కూళ్లలో 12 మంది మొత్తం 74 మంది ఫెయిల్ అయ్యారు. వీరు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా డీఈఓ భోజన్న నేతృత్వంలో ప్రత్యేక తరగతులు ఇప్పిస్తున్నారు. వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులకు ఉదయం రెండు గంటలపాటు ఫెయిల్ అయిన సబ్జెక్టుకు సంబంధించి బోధన చేస్తూ.. రిటన్ టెస్ట్ సైతం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పర్యవేక్షణ జిల్లాలో ఫెయిల్ అయిన టెన్త్ విద్యార్థులకు సంబంధించి డాటా తయారు చేసి.. ఆయా పాఠశాలల హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లకు అందజేశారు. రోజూ సదరు విద్యార్థులకు ఫోన్ చేసి బడికి వచ్చేలా చూడాలి. సబెక్జులకు సంబంధించి బోధనతో పా టు పరీక్ష నిర్వహించి ఎన్ని మార్కులు వస్తున్నాయో పరిశీలించారు. రోజువారి కార్యాచరణకు సంబంధించి ఫొటో రూపంలో డీఈఓ వాట్సప్ గ్రూప్లో షేర్ చేయాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థుల కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడకుండా విద్యాశాఖ తీసుకున్న ప్రత్యేక తరగతుల నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో అత్యధికంగా.. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థుల్లో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి అత్యధికంగా 51 మంది ఉన్నారు. సైన్స్లో 17, సాంఘికశాస్త్రంలో 16, గణితంలో 9, ఇంగ్లిష్లో 12, హిందీలో 4 మంది ఉన్నారు. జూన్ 3వ తేదీ నుంచి పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానుండగా, అప్పటి వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. మండలం పాఠశాలల సంఖ్య బచ్చన్నపేట 4 చిల్పూరు 1 దేవరుప్పుల 4 స్టేషన్ఘన్పూర్ 4 జనగామ 9 కొడకండ్ల 1 లింగాలఘణపురం 2 నర్మెట 1 పాలకుర్తి 4 రఘునాథపల్లి 3 జఫర్గఢ్ 4వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం.. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వందశాతం ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జిల్లాలో 37 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 62 మంది ఫెయిల్ అయ్యారు. సబ్జెక్టుల వారీగా పిల్లలకు ప్రతీ రోజు బోధన, ఆ తర్వాత స్లిప్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. పిల్లవాడి పఠనా సామర్థ్యాన్ని బట్టి బోధన చేయిస్తున్నాం. – భోజన్న, డీఈఓ, జనగామ -
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
స్టేషన్ఘన్పూర్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్ స్టేషన్ఘన్పూర్ డీఈ రాంబాబు అన్నారు. స్థానిక సబ్స్టేషన్ ఆవరణలో నిర్మించనున్న డీఈ కార్యాలయ శంకుస్థాపన పనులను ఆయన గురువారం పరిశీలించారు. ప్రస్తుతం డీఈ కార్యాలయం అద్దె భవనంలో ఉండడం ఇబ్బందిగా మారిందని, ఎమ్మె ల్యే శ్రీహరి చొరవతో నూతన కార్యాలయ నిర్మాణా నికి నిధులు మంజూరయ్యాయని డీఈ చెప్పారు. ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈలు భువనేశ్వరి, శంకర్, లైన్మన్లు శ్రీధర్, అన్వర్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
రఘునాథపల్లి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం మండలంలోని గోవర్ధనగిరి, కుర్చపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించారు. నాణ్యత కలిగిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా కాంటా వేసి బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పా రు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. ఓపీఎంఎస్లో రైతుల, ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. తహసీల్దార్ ఎండీ.మోహ్సిన్ముజ్తబ, సీసీలు రీనావతి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం
జనగామ: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు అధికారులు పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఫస్టియర్ 2,383, సెకండియర్ 1,560 మొత్తం 3,943 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరు కానుండగా.. 10 సెంటర్లు కేటాయించా రు. ఈ మేరకు గురువారం కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా పరీక్షలకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. 22 నుంచి పరీక్షలు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు ఉన్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పది మంది చొప్పున, అదనపు చీఫ్ సూపరింటెండెంట్, కస్టోడియన్ ఒకరి చొప్పున, ఫ్లయింగ్ స్క్వాడ్ పరీక్షలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు www.trbie.cff.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, సందేహాలుంటే టెలీ మానస్ టోల్ ఫ్రీ నంబర్–14416లో సంప్రదించాలని సూచించారు. ఈనెల 22 నుంచి 28 వరకు.. 3,943 మంది విద్యార్థులు 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సమీక్షసీసీ కెమెరాల పర్యవేక్షణలో.. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని, సంబంధింత అధికారులు సెంటర్లలో కెమెరాలను సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు నడిపించాలని పేర్కొన్నా రు. సెంటర్ల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచుకో వాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థులకు స్క్రైబ్ సౌకర్యం కోసం అవసరమైన పత్రాలు సమర్పించాలని, ప్రతి కేంద్రంలో ర్యాంప్ తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఐఈఓ జితేందర్రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్ ఎదుట 10 గంటల ధర్నా
జనగామ: పట్టణంలో బాణాపురం మూడో విడతలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాల యం ఎదుట సీపీఎం ఆధ్వర్యాన లబ్ధిదారులు గురువారం 10 గంటల పాటు ఆందోళన చేపట్టా రు. పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అధ్యక్షతన ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు బైఠాయించారు. ఇంటి నంబర్లు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాలనీలో కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడు తూ ఏడాది కాలంగా ఇంటి నంబర్లకు ఆదేశాలు ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ కాలయాపన చేస్తూ నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అర్బన్ డబుల్ బెడ్రూం పథకంలో జీప్లస్ టూ పద్ధతిన 144 నిళ్ల నిర్మాణం మొదలు పెట్టడంతోపాటు 2003 ఆగస్టులో అదే భూమిని అండర్ టేకింగ్ చేసుకున్నట్లు పురపాలిక అధికారులు చెప్పారని తెలిపారు. ఆర్డీఓ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ప్లాట్లు కేటాయించి ఇప్పుడు తమ పరిధి కాదనడం సబబుకాదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు వేసి, కనీస సదుపాయాలు కల్పించే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. రాత్రి 7 గంటలకు కమిషనర్ వెంకటేశ్వర్లు వచ్చి వారితో మాట్లాడడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు రాపర్తి రాజు, ఉపేందర్, అజహరొద్దీన్, భూక్య చందునా యక్, బిట్ల గణేష్, కల్యాణం లింగం, పాముకుంట్ల చందు, పగిడిపల్లి బాలమణి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని లబ్ధిదారుల డిమాండ్ -
సమర్థులకే పార్టీ పదవులు
రఘునాథపల్లి/కొడకండ్ల:కాంగ్రెస్ పార్టీలో సమర్థులకే పదవులు వస్తాయని పీసీసీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గురువారం జనగామ మండలం యశ్వంతాపూర్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆధ్వర్యాన జరిగిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడా రు. బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసి కేసీఆర్ సీఎం అవుతారని బీజేపీ నేతలు వాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఆ హామీ నెరవేర్చలేదని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకై నా దళితుడిని అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీల అమలుతో పాటు విద్య, వైద్యం ఉచితంగా అందించాల ని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ, మండ ల, జిల్లా, రాష్ట్ర పదవులు కావాలనుకునే వారు ఎమ్మెల్యే కార్యాలయం, పార్టీ జిల్లా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇరిగేషన్, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు నియోజకవర్గ ప్రజలకు అందించడమే తన ఎజెండా అని పేర్కొన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్తోనే దేశ రక్షణ సాధ్యమని, నాడు ఇందిరాగాందీ ఫలితం సాధించాకే యుద్ధం ఆపినట్లు పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్ను పాషా, రాష్ట్ర గంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్, ‘కూడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, పీసీసీ పరిశీలకులు లింగంయాదవ్, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కొడకండ్లలో.. కొడకండ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ దయాకర్ మాట్లాడుతూ జిల్లా పార్టీలో క్రమశిక్షణ, సమన్వయం ఉంది.. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు.. అదే బాట లో పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఝాన్సీ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ పాలమూరు బిడ్డగా పాలకుర్తి కోడలుగా మాట ఇస్తున్నాను.. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనులను తన హాయంలోనే పూర్తి చేయిస్తానని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదే అన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ -
ముహూర్తం ప్రకారం 5.44 గంటలకు..
జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలను వేదపండితులు శాస్త్రోకంగా గణపతిపూజతో ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున 5.44గంటలకు కాళేశ్వరంలోని సరస్వతిఘాటుకు చేరుకొని ముహూర్తం ప్రకారం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదికి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందసరస్వతిస్వామి ముందుగా పుష్కరునికి ఆహ్వాన పూజ చేశారు. పండితులు సరస్వతిమాతకు పూలు, పండ్లు, పాలు, చీరసారెతో నైవేద్యం సమర్పించారు. మాధవా నందసరస్వతిస్వామి పుష్కరినిలో స్నానం ఆచరించి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయ కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఆర్జేసీ రామకృష్ణారావు, ఈఓ మహేశ పుష్కర ప్రారంభ స్నానాలు ఆచరించారు. అనంతరం వేదపండితులు ఐదు కలశాలలో గోదావరి జలాలను తీసుకుచ్చి శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. -
కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు : సీఎం రేవంత్రెడ్డి
మంత్రి శ్రీధర్బాబు కోరినట్లుగా కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్బాబును, అధికారులను అభినందించారు. మంత్రులు ఏమన్నారంటే.. ● మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫు ష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. ● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. ● రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కర స్నానాలను భక్తులు ఆచరించాలని సూచించారు. – మరిన్ని పుష్కర వార్తలు, ఫొటోలు 8లోu -
‘సఖి’ సేవలపై అవగాహన కల్పించాలి
జనగామ: మహిళలకు సఖి సెంటర్ ద్వారా అందజేసే సేవలపై అవగాహన కల్పించాలని మహిళా కమిషన్ సభ్యురాలు జి.పద్మ అన్నా రు. జిల్లా కేంద్రం వడ్లకొండ ఇంటిగ్రేటెడ్ ప్రభు త్వ కార్యాలయాల సముదాయంలోని సఖి సెంటర్ను ఆమె బుధవారం సందర్శించారు. సెంటర్లోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం బాధితులకు అందించే సేవలపై ఆమె ఆరా తీశారు. మహిళా కమిషన్ వాట్సాప్ నంబర్–94905 55533, హెల్ప్లైన్ నంబర్–181ను సద్వినియోగం చేసుకునేలా విస్రృత ప్రచారం కల్పించాలని కోరారు. అనంతరం పద్మను సఖిసెంటర్ నిర్వాహకులు సత్కరించారు.రేపటి నుంచి నెట్బాల్ పోటీలుజనగామ: జిల్లా కేంద్రం బతుకమ్మకుంటలో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు స్టేట్ లెవల్ 8వ సబ్ జూనియర్ నెట్బాల్ చాంపియన్ షిప్–2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, సహాయ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమతుందని, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు రానున్నారని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలిజనగామ: ఆర్టీసీ ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేరవేస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతూ సంస్థకు మంచి పేరు తేవాల ని స్థానిక డిపో మేనేజర్ ఎస్.స్వాతి అన్నారు. డిపోలో పరిధిలో ఏప్రిల్ నెలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రగతి రథ చక్రం అవార్డులతో పాటు ప్రశంసాపత్రాలను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. లైసెన్స్ సర్వేయర్ శిక్షణ●జనగామ: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హులు దరఖాస్తు చేసుకో వాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలో 50 రోజుల పనిది నాలతో పాటు సర్వేపై ప్రత్యేక శిక్షణ ఉంటుంద ని చెప్పారు. ఇంటర్మీడియట్లో(గణిత శాస్త్రం ఒక అంశంగా) కనీసం 60 శాతం మార్కులతో పాటు ఐటీఐ డ్రాప్ట్స్మెన్ (సివిల్), డిప్లొమా(సివిల్), బీటెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన కోర్సులు చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ వరకు రూ.100 ఫీజుతో పాటు ఓసీ అభ్యర్థులు రూ.10వేలు, బీసీ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,500 మీ–సేవా కేంద్రంలో చెల్లించి అప్లై చేసుకోవాలన్నారు. లైసెన్స్ కలిగిన సర్వేయర్లుగా బాధ్యతలు చేపట్టేందుకు ఇది సువర్ణ అవకాశమని, జిల్లాలో ఇప్పటి వరకు 37 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. -
రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తిచేయాలి
పాలకుర్తి టౌన్: పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పాలకుర్తి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనుల తక్షణ సమాచారం కోరుతూ ప్యాకేజ్ 6 వివరాలను తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు ముగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్ఈ సుధీర్, ఈఈలు ప్రవీణ్, సీతారాం, డీఈలు శ్రీకాంత్ శర్మ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా స్టేషన్ఘన్పూర్: భూ భారతి రెవెన్యూ సదస్సులు ముగిసినందున అందులో వచ్చిన భూసమస్యల దరఖాస్తులను త్వరగా పరి ష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. స్థానిక తహసీల్దా ర్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో 1,060 దరఖాస్తులు రాగా ప్రత్యేకంగా ఇప్పటి వరకు తహసీల్దార్ కార్యాలయానికి 300 వచ్చాయ ని చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే నేరుగా వచ్చి దరఖాస్తు సమర్పించాలని సూచించారు. సక్సేషన్ పెండింగ్ మ్యుటేషన్, మిస్సింగ్ నంబర్, భూసేకరణ, కోర్టు కేసులు, డిజిటల్ సంతకం వంటి మాడ్యూల్లోని సమస్యల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. అనంతరం స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీ లించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, హనుమాన్నాయక్ ఉన్నారు. -
వచ్చే మూడేళ్లలో హామీలన్ని నెరవేరుస్తా..
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిల్పూరు: వచ్చే మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా.. నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి గౌరవం పెంచేలా పనిచేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గార్లగడ్డతండాలో ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకం ఆవిష్కరణ, మండల కేంద్రం కొత్తపల్లిలో సీసీరోడ్డు పనుల ప్రారంభం, చిన్నపెండ్యాల, నష్కల్ గ్రామాల్లో నూతన ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడు తూ.. పేద ప్రజల కలలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాకారం అవుతున్నాయని అన్నారు. పదేళ్లు పాలించిన వారు అభివృద్ధి చేయకున్నా ఇప్పుడు చేస్తున్న వారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ సరస్వతి, వ్యవసాయ మార్కెట్, చిల్పూరు ఆలయ కమిటీ చైర్మన్లు శిరీష, శ్రీధర్రావు, నాయకులు గడ్డమీది సురేష్, ఎడవెళ్లి మల్లారెడ్డి, బొమ్మిశెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ వెలుగులు, వేదిక జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభంకానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్లో పుణ్య స్నానం ఆచరించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ముఖ్యులు పాల్గొననున్నారు. – కాళేశ్వరం నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ ● సరస్వతిఘాట్లో పుణ్యస్నానం ఆచరించ నున్న సీఎం రేవంత్రెడ్డి దంపతులు ● లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం– వివరాలు 8లోu -
కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు
రవిని తలపించే మోము.. తారల వెలుగులు నిండిన కనులు.. నుదుటిపై బొట్టు.. తలనిండా మల్లె, కనకాంబర పూలు, నెలవంక కట్టగా నెమలంచు చీర.. కన్నెపిల్లలు చుట్టగా కలువ రేకుల చీర.. ఆరు మూరల చీర కట్టిన అరిందలు.. ఓరుగల్లులో విహరించారు. ఫ్యాన్సీ దుస్తులు వదిలేసి పదహారణాల తెలుగమ్మాయిల్లా మారి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధ్ధులను చేశారు. రెడ్కార్పెట్పై హొయలొలుకుతూ చిరునవ్వులతో తమ అందాలను ఆరబోశారు. ● తెలుగింటి ఆడపడుచుల్లా ముస్తాబు ● ఫ్యాన్సీ డ్రెస్లు వదిలి అంచుల చీరలు, పట్టుపరికిణీలు కట్టిన భామలు ● హైదరాబాద్ నుంచి నేరుగా హరిత కాకతీయకు.. ● వేయిస్తంభాలు, రామప్ప ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు ● అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ● సుందరీమణులకు ప్రత్యేక బహుమతుల అందజేతసాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్/హన్మకొండ చౌరస్తా/వెంకటాపురం(ఎం) : మిస్ వరల్డ్–2025 పోటీదారులు బుధవారం వరంగల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హనుమకొండకు చేరుకున్న వారు హరిత కాకతీయలో దిగారు. హోటల్ వద్ద వారికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, సీపీ సన్ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హోటల్లో సుమారు గంటకుపైగా గడిపిన వారు వేయిస్తంభాల ఆలయానికి వెళ్లే ముందు చీర కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల్లా తయారయ్యారు. సుందరీమణుల రాకతో చారిత్రక ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. ముందుగా తూర్పు ద్వారం వద్ద గల ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఏకశిలాశాసనాన్ని టూరిజం గైడ్ సూర్యకిరణ్ క్లుప్తంగా వివరించారు. చారిత్రక ఆలయాన్ని చూసి మురిసిపోయారు.నందీశ్వరుడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో పాదాలను శుభ్రం చేసుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగిన సుందరీమణులకు కల్యాణమంటపం విశిష్టతను గైడ్ వివరించారు. మంటపం వద్ద మరోసారి ఫొటోషూట్తో సందడి చేసి, ఆలయం చుట్టూ ప్ర దక్షిణలు చేశారు. ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ సుందరీమణులకు సన్నాయి మేళాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఖిలావరంగల్కు బయలుదేరి వెళ్లారు. కోట చారిత్రక అందాలకు ఫిదా విశ్వసుందరి పోటీదారులు ఖిలావరంగల్ కోటకు రాత్రి 7.20గంటలకు చేరుకొని కాకతీయ కళా వైభవాన్ని తెలుసుకొని మంత్రముగ్ధులయ్యారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్ను సందర్శించి చేనేత కలంకారి దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు, హ్యాండ్ బ్యాగులు, బంగారు వర్ణంలో మెరిసిన హ్యాండ్ క్రాఫ్ట్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించడంతో ఆసక్తిగా విన్నారు. కాకతీయుల నాలుగు కీర్తితోరణాల నడు మ నళ్ల రాతిలోని శిల్ప కళ సంపదను అందాల భా మలు మరింత ఆసక్తిగా తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. టీజీ టీడీసీ ఆధ్వర్యంలో 45 నిమిషాల నిడివిగల సౌండ్ అండ్ లైటింగ్ షోను ఇంగ్లిష్లో ప్రదర్శించగా... ఆసక్తిగా వీక్షించారు. అంతకుముందు కాకతీయుల తోరణం ఎదుట గ్రూపు ఫొటో దిగారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలో పేరిణి నృత్య కళాకారుడు గంజల రంజిత్ శిష్య బృందం ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. చివరగా సుందరీమణులకు చేనేత కలంకారి దర్రీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్తో కూడిన బహుమతులు అందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామప్ప అందాలు వీక్షించి.. రామప్ప సరస్సుకట్టపై ఉన్న హరితహోటల్ వద్దకు సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న మిస్వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తులు ధరించారు. 5:50గంటలకు రామప్ప ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలికారు. కలెక్టర్ దివాకర టీఎస్తో పాటు అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆలయానికి చేరుకున్న తరువాత రెండు బృందాలుగా విడిపోయారు. 18 మంది, 15 మంది వేర్వేరుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావుతో పాటు టూరిజం గైడ్లు విజయ్కుమార్, వెంకటేష్ వారికి వివరించగా శిల్పకళ సంపదను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. ముఖ్య అతి థిగా వచ్చిన మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆల య ఆవరణలో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం గార్డెన్లో పేరిణి నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆసక్తిగా తిలకించారు. -
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025
పున్నమి వెలుగుల్లో రామప్పసుందరీమణుల రాక సందర్భంగా రామప్ప ఆలయం జిగేల్మంటోంది. విదేశీ వనితలు భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయం చుట్టూ గ్రీన్ మ్యాట్ వేశారు. ప్రత్యేక విద్యుత్దీపాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గార్డెన్లో స్టేజీ నిర్మించారు. సరస్సు కట్టపై ఉన్న హరి త కాటేజీలను ముస్తాబు చేశా రు. వెయ్యి మంది సిబ్బందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి మంగళవారం రాత్రి నుంచే పోలీసులు విధుల్లో చేరారు. పర్యాటకులకు బుధవారం రామప్ప సందర్శనకు అనుమతి లేదు.● వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన ● రామప్పలో సందడి చేయనున్న అందాలభామలు ● అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా.. 3వేల మందికి పైగా పోలీసులు ● మూడంచెల భద్రత.. సీనియర్ అధికారుల పర్యవేక్షణ● 4గంటలకు రామప్పకు చేరుకుంటారు. 4:40 గంటలకు రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్లో పాల్గొంటారు. ● 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్ప ఎంట్రెన్స్ గేట్ వద్ద కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. ● 5:10 నుంచి 6 గంటల వరకు సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని శిల్పకళాసంపదను తిలకిస్తారు. ● 6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రామప్ప గార్డెన్లో అలేఖ్య శాసీ్త్రయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షించిన అనంతరం ప్రముఖులు అతిథులను సన్మానిస్తారు. ● రాత్రి 7.20 గంటలకు ఇంటర్ప్రిటిషన్ సెంటర్కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిన్నర్ చేసి 8:15 గంటలకు హైదరాబాద్ ప్రయాణమవుతారు. ● హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరుతారు. ● ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది. ● సుమారు గంటపాటు హోటల్లోనే గడిపి సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు. ఏయే దేశాల సుందరీమణులంటే.. ప్రపంచంలోని 19 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నట్లు సమాచారం. వారిలో అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, కెనడా, చీలి, కొలంబో, ఈక్వెడార్, ఈ సాల్వడార్, గౌతమాల, మెక్సికో, పనామా, పరాగ్వే, పెరు, యునైటెడ్ స్టేట్స్, వెనిజులా, హైతీ, హోందురాస్, నికరగ్వా, సురినామే తదితర దేశాల సుందరీమణులు ఉన్నారు. ● 40 నిమిషాలు పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ● సాయంత్రం 6.25 వరంగల్ కోటకు చేరుకుంటారు. 7.30 గంటలకు వరకు అక్కడే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్కు చేరుకుంటారు. ● 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతారు. డిన్నర్లో ఇవే.. సుందరీమణులకు హనుమకొండ నక్కలగుట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయ ముస్తాబైంది. హోటల్కు చేరుకున్న బృందానికి స్వాగత పలకరింపుగా నారింజ జ్యూస్ అందిస్తారు. స్టాటర్గా ప్రెలూడే ప్లేట్–స్టార్టర్ ట్రియో, గోల్డెన్ కోస్ట్ ఫిష్ బైట్స్ లేదా చీజ్ అండ్ హెర్బ్ మిలాంజ్ క్రాక్వెట్స్, సీసర్స్ గార్డెన్, మెయిన్ ఆఫెయిర్– సిగ్నేచర్ ప్లేట్స్గా నాన్ వెజిటేరియన్గా హర్బ్ గ్రిల్డ్ చికెన్ సుప్రీం, వెజిటేరియన్గా గ్రిల్డ్ కాటేజ్ చీస్ స్టీక్, మెడిటెర్రానీన్ వెజిటబుల్ గ్రాటిన్, టస్కాన్ పెన్న అర్రాబిటా, గోల్డెన్ చిప్స్, స్వీట్ ఇప్రెషన్గా చాక్లెట్ మౌసెస్, సాఫ్రాన్ ఫిర్ని, సీసన్స్ బౌంటి అందిస్తారు. న్యూస్రీల్అందాల భామలకు ఆహ్వానంరామప్ప ఆలయంలో ఇలా..4.35 గంటలకు వరంగల్కు.. -
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు. ముస్తాబైన నగరం.. వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో జిగేల్మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో వేయిస్తంభాల గుడి -
వెరిఫికేషన్ వేగంగా పూర్తి చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక పరిశీలన వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి అన్ని మండలాల స్పెషల్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ పీడీ, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు, ఎస్సీ కార్పొరేషన్, ఎల్డీఎం, ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంత మందిని అర్హులుగా గుర్తించ్చారో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధునిక పద్ధతులను పాటించాలి రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచి గుణాత్మక, ఆధునిక విద్యనందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభు త్వ, ఆదర్శ, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ కొడకండ్ల, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులకు క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి వృత్యంతర శిక్షణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠ్యంశాల బోధనలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. శిక్షణ మెలుకువలను పాఠశాల స్థాయికి తీసుకెళ్లి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు అధునాతన టెక్నాలజీకి తగ్గట్టు విద్యార్థుల మేథాశక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఏఎంఓ శ్రీనివాస్ కోర్సు ఇంచార్జ్లు మల్లికార్జున్, యాదగిరి, ఆనంద్ బాబు పాల్గొన్నారు. అక్షరాస్యతలో అంతరాన్ని తగ్గించి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరెట్లో అక్షరాస్యతా కార్యక్రమం మీద తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖల సంయుక్త సమావేశం నిర్వహించారు. చదువు రాని, మధ్యలో బడి మానేసిన వారి వివరాల సర్వే 19వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనర్ నాగరాజు, మండల విద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే సహించం
బచ్చన్నపేట: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తొందరగా మిల్లులకు తరలించాలని.. నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. మండలంలోని కొడవటూర్, ఆలింపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడుతూ.. రైతుల ధాన్యం తేమ శాతం రాగానే తూకం వేసి, మిల్లులకు తరలించాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల ధాన్యం తడిసి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గన్నీ బ్యాగులు సరిపడా లేకున్నా, లారీలు రాకున్నా తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడుతామన్నారు. మిల్లర్లు రైతుల ధాన్యంపై కొర్రీలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలింపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి మూడు రోజులు అవుతున్నా.. లారీలు రావడంలేదని రైతులు ఆయనకు తెలియజేయడంతో వెంటనే లారీ యాజ మాన్యంతో మాట్లాడి లారీని పంపించాలని చెప్పారు. తహసీల్దార్ ప్రకాశ్రావు, ఎంఆర్ఐ వంశీకృష్ణ, సీసీ సత్యనారాయణ పాల్గొన్నారు.సాధారణ ప్రసవాలను పెంచాలిస్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేదిశగా వైద్య, ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. స్టేషన్ఘన్పూర్, మల్కాపూర్, ఇప్పగూడెం, తాటికొండ పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలతో స్థానిక సీహెచ్సీలో మంగళవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ప్రతినెలలో సీహెచ్సీ పరిధిలో కనీసం యాభై సాధారణ ప్రసవాలను చేపట్టాలన్నారు. ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణ చేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలపై ఏఎన్ఎంలు, సూపర్వైజరీ స్టాఫ్ ప్రజలకు వివరించాలన్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ వీరాంజనేయులు, మాతా, శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి డాక్టర్ రవీందర్గౌడ్, ఘన్పూర్ సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య, డాక్టర్లు సునీత, రుబీనా, ప్రణీత, జ్యోతి, కుషాలి, శ్రావన్, అజయ్కుమార్, సీహెచ్ఓ వెంకటస్వామి, ప్రభాకర్ పాల్గొన్నారు.అసోసియేషన్ ఎన్నికజనగామ: జనగామ జిల్లా ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్, సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలను పట్టణంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫర్టిలైజర్ సీడ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీశెట్టి ము నిందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జూరి రవీందర్ హాజరయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పజ్జూరి గోపయ్య, ప్రధాన కార్యదర్శిగా సదానందం, కోశాధికారి కాసర్ల రవీందర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా మునిందర్ మాట్లాడుతూ.. సీడ్స్ లైసె న్స్ రెండు సంవత్సరాల కాలపరిమితి నుంచి మూడేళ్లకు పెంపు, ఫెస్టిసైడ్స్ లైసెన్స్కు సంబంధించి రెగ్యులర్గా ఉండే విధంగా ఆల్ ఇండియా అసోసియేషన్ భాగస్వామ్యంతో కలిసి భారత ప్రభుత్వాన్ని ఒప్పించి హక్కులను సాధించుకున్నామన్నారు. కార్యక్రమంలో గూ డెల్లి మధుసూదన్రెడ్డి, నడిపెల్లి సీతారాంరెడ్డి, ధనుంజయ, మహేష్, సురేందర్ ఉన్నారు.అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలుజనగామ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో జనగామ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం అ ర్హులకు మాత్రమే పథకాలు అందిస్తోందన్నా రు. సంక్షేమ పథకాలు అందుకున్నవారు విని యోగించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ రాజకీయలకు అతీతంగా, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనను పార్టీ కేడర్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అవినీతికి పాల్పడినా పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. -
ప్రశాంతంగా పాలీసెట్
జనగామ: టీజీ పాలీసెట్ –2025 ప్రవేశ పరీక్ష జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించగా.. జిల్లాలో 1,416 మంది విద్యార్థుల కోసం మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు. 1,343 మంది ప్రవేశ పరీక్షకు (94.84 శాతం) హాజరయ్యారు. 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షల కో ఆర్డినేటర్ డాక్టర్ ఏ.నర్సయ్య వెల్లడించారు. వివిధ కేంద్రాల్లో హాజరు శాతం.. జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్లో 576 మంది విద్యార్థులకు 553 మంది (96 శాతం) హాజరుకాగా.. 23మంది గైర్హాజరయ్యారు. హైదరాబాద్ రోడ్డులోని సెయింట్ మెరీస్ హైస్కూల్ కేంద్రంలో 480 మందికి 450మంది (94 శాతం)హాజరుకాగా.. 30 మంది గైర్హాజరయ్యారు. స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లో 360 మంది విద్యార్థులకు 340మంది (94.44శాతం) హాజరుకాగా.. 20 మంది గైర్హాజరయ్యారు. మొత్తం పరీక్ష కేంద్రాల్లో బాలురకంటే బాలికలే ఎక్కువమంది పరీక్షకు హాజరయ్యారు. 9 గంటల నుంచి లోనికి అనుమతి పాలీసెట్ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచే సెంటర్ల వద్దకు విద్యార్థుల రాక ప్రారంభమైంది. 9 గంటల నుంచి అధికారులు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. సెంటర్ల వద్ద డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తుతోపాటు 144 సెక్షన్ అమలు చేశారు. జిరాక్స్ సెంటర్లను మూసి వేశారు. అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే సెంటర్లోకి పంపించారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. నిమిషం నిబంధన అమలు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష ప్రశాంతంగా ముగియగా, పోలీసుల బందోబస్తు నడుమ పరీక్ష సామగ్రిని స్ట్రాంగ్ రూంకు తరలించారు. 1,343 మంది విద్యార్థుల హాజరు.. 73 మంది గైర్హాజరు పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు -
తల్లి ఆసరా లేనిదే నడవలేడు..
జనగామ పట్టణం గ్రేయిన్ మార్కెట్ ఏరియాకు చెందిన రావుల సత్తెమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. కాళ్లు చచ్చుపడ్డాయి. తొమ్మిదేళ్ల వయసు వచ్చినా తల్లి ఆసరా లేకుండా నిలబడలేడు. ఈ పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తున్నా పింఛన్ కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నామని సత్తెమ్మ వాపోయింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. పింఛన్ మంజూరు చేస్తే కొంత ఆసరాగా ఉంటుందని సత్తెమ్మ కోరింది. నడవలేని కొడుకు ను తీసుకుని ఆమె కలెక్టరేట్కు వచ్చింది.అర్హులకు అన్యాయం చేశారు.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హులతో పాటు దివ్యాంగులకు అన్యాయం చేశారని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్, గన్నోజు మధు, జోగు సురేష్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారులు పంపించిన జాబితాలో తన పేరు ఉన్నా ఫైనల్ నివేదికలో కనిపించ లేదని దివ్యాంగుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని అర్జీలో పేర్కొన్నాడు. భూమి కోసం పదేళ్లుగా తిరుగుతున్న.. మాకు మండల కేంద్రంలో 62/8లో ఎకరం భూమి ఉంది. 2019 వరకు ఆన్లైన్లో తమ పేరు చూపించింది. ధరణి వచ్చిన తర్వాత 27 గుంటలు మాత్రమే కనిపిస్తోంది. సమస్య పరిష్కరించాలని పది సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. – ఏనుగుల శంకరయ్య, నర్మెట -
నేడే టీజీ పాలీసెట్
● జిల్లాలో మూడు సెంటర్లు ● అమలులో నిమిషం నిబంధన జనగామ: పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో అడ్మిష న్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం(నేడు) నిర్వహించే టీజీ పాలీసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని సిద్ధిపేటరోడ్డున ఉన్న ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైదరాబాద్రోడ్డులోని సెయింట్ మేరీ హైస్కూల్, స్టేషన్ఘన్పూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంట ర్లు కేటాయించారు. మొత్తం 1,416 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచి సెంటర్లోకి అనుమతి స్తారు. సమయం 11 గంటలు కాగానే గేట్లు క్లోజ్ చేస్తారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ఎట్టిపరి స్థితుల్లోనూ అనుమతించరని పరీక్ష డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.నర్సయ్య తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్తో పాటు హెచ్బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి. హాల్ టికెట్పై ఫొటో లేకపోతే గెజిటెడ్తో సంతకం చేయించి ఆధార్ తీసుకు రావాల్సి ఉంటుందని, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని కోఆర్డినేటర్ స్పష్టం చేశారు. వ్యాయామంతో ఆరోగ్యంపాలకుర్తి టౌన్: వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సీఐ జి.మహేదర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన 5కే రన్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలీసులు నిత్యం ఒత్తిడిలో పని చేస్తారని వ్యాయామంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. -
సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి
జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల క్షేత్ర స్థాయి పరిశీలన త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటి వరకు వెరిఫికేషన్ పూర్తయినవి ఆన్లైన్లో నమోదయ్యేలా చూడాలని చెప్పారు. రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేసి, సంక్షేమ శాఖ అధికారులు తుది జాబితా ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, ఈ స్థానం కొనసాగాలంటే మరో 15 రోజుల పాటు పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు. ప్రస్తుత వేసవిలో తాగు నీటికి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల తుది జాబితా సిద్ధం చేయాలని, నగదు చెల్లించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేయాలని అన్నారు. మీటింగ్లో అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
విద్యుత్ వినతులపై ప్రత్యేక దృష్టి●
● గ్రీవెన్స్లో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ జనగామ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం గ్రీవెన్స్ నిర్వహించడంతో పాటు వినతులపై ప్రత్యే క దృష్టి సారిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ తెలిపారు. సోమవారం జిల్లా పరిధి మండలాలతో పాటు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో వినతులు స్వీకరించారు. 2024 జూన్ 17 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామ ని.. 426 ఫిర్యాదులు రాగా 361 పరిష్కరించినట్లు చెప్పారు. ప్రతీ సోమవారం డివిజన్, ఈఆర్వో, సబ్డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, సర్కిల్ ఆఫీస్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తామని చెప్పారు. గ్రీవెన్స్ నిర్వహించే రోజు ఉద్యోగులు అందుబాటులో ఉండి వినియోగదారుల సమస్యలకు పరిష్కారం చూపించాలని ఆదేశించారు. -
పద్దెనిమిదేళ్లకు ఇంటికి చేరిన మహిళ
రఘునాథపల్లి : మతిస్థిమితం కోల్పోయి 18 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మండల పరిధి కన్నాయపల్లికి చెందిన మంతపురి ఎల్లమ్మ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సోమవారం కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. దేవరుప్పులకు చెందిన చింత సోమయ్య–వెంకటమ్మ దంపతుల కూతురు ఎలమ్మ ను కన్నాయపల్లికి చెందిన యాదయ్యకు ఇచ్చి వివా హం చేశారు. ఇద్దరు కుమారులు జన్మించాక మతిస్థిమితం కోల్పోయిన ఎల్లమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం కుటుబ సభ్యులు ఎక్కడ వెతికినా జాడ లభించక విసిగిపోయారు. కేరళకు వెళ్లిన ఎల్లమ్మను అక్కడి ఆకాష్ ప్రవల్ స్వచ్ఛంద సంస్థ చేరదీసి మానసిక వ్యాధి నిపుణుల వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించింది. అదే స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి వాసి బాషిపెల్లి యాకయ్యతో తాను జనగామ జిల్లా కన్నాయపల్లికి చెందిన మహిళగా చెప్పుకుంది. దీంతో ఎల్లమ్మ పూర్తి వివరాలు తెలుసుకున్న యాకయ్య దేవరుప్పుల, కన్నాయపల్లి గ్రామస్తుల కు సమాచారం అందించాడు. సంస్థ ప్రతినిధులు ఎలిషాబెత్, బి.సుభాషి, జెత్రుదీ సోమవారం ఎల్లమ్మను గ్రామానికి తీసుకొచ్చి పంచాయతీ కార్యదర్శికి, కుమారుడు అరవింద్కు అప్పగించారు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో కుటుంబం చెంతకు -
అభివృద్ధి పనులు చూసి బుద్ధి తెచ్చుకోవాలి
స్టేషన్ఘన్పూర్: అదేపనిగా అసత్యపు ఆరోపణలు, విమర్శలు చేసే వారు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్లో చేపట్టిన వంద పడకల ఆస్పత్రి, బంజారా భవన్ నిర్మాణ పనులను ఆయన సోమవారం పరి శీలించారు. ముందుగా సంబంధిత శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించి అక్కడున్న అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఎన్నికై న ఏడాదిలోపే సీఎంను ఒప్పించి నియోజకవర్గానికి రూ.800 కోట్ల నిధులు తీసుకువచ్చానని చెప్పారు. కళ్ల ముందు అభివృద్ధి పనులు కనిపిస్తుంటే మాజీ ఎమ్మెల్యే రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు ఒక్కపైసా అభివృద్ధి జరగలేదని తప్పుడు ప్రచారం చే యడం సిగ్గుచేటన్నారు. పనులను చూసైనా కొందరికి జ్ఞానం రావడం లేదని విమర్శించారు. త్వరలో స్టేషన్ఘన్పూర్ రూపురేఖలు మారనున్నాయని, మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.70కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్రెడ్డి, కొలిపాక సతీష్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, గిరిజన శాఖ జేఈ వినీల్, ఈఈ వీరభద్రం, డీఈ ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ధాన్యం త్వరగా తరలించాలి
బచ్చన్నపేట : కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జనగామ ఆర్డీఓ గోపీరాం అన్నారు. సోమవారం మండల పరిధి పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అలాగే వివాదాస్పద భూములను పరిశీ లించారు. అనంతరం మాట్లాడుతూ భూ భారతి ద్వారా ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. భూసమస్యలు ఉన్న వారు నేరుగా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని, దళారుల వద్దకు వెళ్లకూడదని తెలిపా రు. ఆయన వెంట తహసీల్దార్ ప్రకాశ్రావు, ఎంఆర్ ఐ గోపీ, సర్వేయర్ నర్మద ఉన్నారు. -
ప్లాట్ల సమస్య పరిష్కరించండి
జిల్లా కేంద్రం హనుమకొండ రోడ్డులోని ఓ వెంచర్లోని ప్లాట్లను సుమారు 150 నుంచి 200 మంది కొనుగోలు చేసి రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన పలు కుటుంబాల్లో తగాదాల మూలంగా 2012లో వారు కోర్టుకు వెళ్లగా 2023లో ఆ కేసును కోర్టు కొట్టి వేసింది. అయినా హద్దు రాళ్లు తొలగించి తమను ఇబ్బంది పెడుతున్నారని కాలనీ అధ్యక్షుడు కె.నానాజీ, గొట్టం శ్రీధర్రెడ్డి, ఎల్ల స్వామి, నరసింహ, స్వప్న, లక్ష్మి, సోమశేఖర్, నోముల మహేందర్, బిక్షపతి, సునీత, హరికిషన్, పురుషోత్తం తెలిపారు. ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పించడంతో పాటు ఇంటి నిర్మాణ అనుమతులు ఇప్పించాలని కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నారు. -
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
జనగామ/జనగామ రూరల్: ‘ఆసరా లేనిదే నడవలేని కొడుక్కు పింఛన్ కోసం ఓ మాతృమూర్తి.. తలదాచుకోవడానికి నీడలేక ఇందిరమ్మ ఇల్లు మంజూ రుకు నిరుపేద మహిళ.. ఇళ్ల మంజూరులో అన్యా యం చేశారని ఓ దివ్యాంగుడు.. ఆన్లైన్లో భూమి కనిపించక పదేళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కరించడంలేదని మరో బాధితుడు’.. ఇలా.. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వచ్చిన ప్రజలు అధికారులకు తమ గోడు చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా పరిష్కా రం కావడంలేదని వాపోయారు. వివిధ సమస్యలపై 47 వినతులు రాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, జిల్లా స్థాయి అధికారులు స్వీకరించారు. అర్జీలు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కారం చూపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్కు 47 వినతులు అర్జీలు పెండింగ్లో ఉండొద్దు అధికారులకు కలెక్టర్ ఆదేశం -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జనగామ: పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బతుకమ్మకుంట, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏరియా లేబర్ ఆఫీస్, చీటకోడూరులో జరుగుతున్న ఇంట్రా పైపులైన్ పనులను సోమవారం ఆయన పరిశీ లించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్కుమార్, ఏఈ మహిపాల్ పాల్గొన్నారు.‘నైటింగేల్’కు నివాళిజనగామ: చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. వైద్య రంగంలో నర్సు వృత్తికి గౌరవం తీసుకువచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు 31 వరకు పొడిగింపుజనగామ: ప్రభుత్వం అందించే 25 శాతం రా యితో ప్లాట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకా శం కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ రెండు సార్లు అవకాశం ఇవ్వగా.. గడువు ముగిసినప్పటికీ.. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించింది. ప్లాట్ల యజమానులు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూ చించింది. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సి పాలిటీలతోపాటు మండలాల పరిధిలో ఇటీవ ల గడువు ముగిసే నాటికి 13,332 అప్లికేషన్ల ఎల్ఆర్ఎస్ పూర్తి కాగా, రూ.24.67 కోట్ల మేర ఆదాయం సమకూరింది.‘గాలికుంటు’ నివారణే లక్ష్యంలింగాలఘణపురం: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యమని వీబీఆర్ఐ(వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) మాని ట రింగ్ ఆఫీసర్ డాక్టర్ సుధారాణి అన్నారు. సోమవారం రామచంద్రగూడెంలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. వ్యాక్సిన్ భద్రపరిచే కోల్డ్స్టోరే జీ, పశువైద్యశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ గాలికుంటు నివారణకు ఏటా రెండుసార్లు వ్యాక్సినేషన్ చేస్తున్నామని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. టీకా వేయకపోతే వ్యాధి సోకిన పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గడమే కాకుండా నష్టం జరుగుతుందని చెప్పారు. జిల్లా పశువైద్యాధికారి రాధాకిషన్ మాట్లాడుతూ జిల్లాలో 1,35,000 పశువులు ఉండగా.. 87,779 పశువులకు టీకాలు వేశామన్నారు. ఉమ్మడి జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ నాగమణి, డాక్టర్లు నేహా, అనిత, భగవాన్రెడ్డి పాల్గొన్నారు. -
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
లింగాలఘణపురం: మండలంలోని బండ్లగూడెం బండగుట్ట లక్ష్మీనర్సింహ్మస్మామి కల్యాణం వేదపండితులు కృష్ణమాచార్యుల వేదమంత్రోచ్ఛారణలతో మధ్య ఆదివారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఢోలువాయిధ్యాలతో భక్తుల నృత్యాలతో ఆటపాటలతో ఊరేగించారు. మండల కేంద్రంలోని చేనేత కార్మికులు ట్రాక్టర్పై మగ్గాన్ని ఏర్పాటు చేసుకొని ఉత్సవ మూర్తుల ఊరేగింపు కొనసాగుతుండగా మగ్గంపై పట్టువస్త్రాన్ని నేస్తూ కల్యాణోత్సవంలో లక్ష్మీనర్సింహ్మస్వామికి సమర్పించారు. కార్యక్రమ నిర్వాహకులు బండ్లగూడెంకు చెందిన వంచ మహేశ్వర్రెడ్డి, రాంరెడ్డి, మండల కేంద్రానికి చెందిన లింగాల దీపక్రెడ్డిల ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహించారు. చేనేత కార్మికులు వంగ ఉప్పలయ్య, బింగి స్వామి, కారంపురి చంద్రయ్య, బాల్నె సత్యనారాయణ, రమేష్, యాదగిరి తదితరులు చేనేత వస్త్రాన్ని నేసి కల్యాణోత్సవంలో సమర్పించారు. 17 మంది పుణ్యదంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్
జనగామ: సర్కారు బడులకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్. వేసవి సెలవులు ముగిసిన వెంటనే... అడ్మిషన్ల ప్రారంభం నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం వేసవిసెలవులు కొనసాగుతున్న నేపధ్యంలో.. జూన్ 12వ తేదీ నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. అంతకు ముందే జిల్లాల వారీగా విద్యాశాఖ విద్యార్థుల సంఖ్య ఆధారంగా నివేదికలను పంపించగా, ప్రభుత్వం దాని ఆధారంగా పాఠ్యపుస్తకాలను జిల్లాకు పంపించింది. గత పది రోజుల క్రితమే జిల్లాకు పుస్తకాలు చేరకోగా... డీఈఓ భోజన్న ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల సమక్షంలో స్కూల్స్కు అందజేస్తున్నారు. మొదటి విడతలో 81 శాతం.. జిల్లాలో ప్రభుత్వ, లోకల్ బాడీ, గురుకులాలు కలుపుకుని 558 విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64, ఉన్నత 103, మోడల్ 8, కేజీబీవీ 12, యూఆర్ఎస్ 1, ఎయిడెడ్ 10, రెసిడెన్షియల్ 19 ఉండగా.. 45 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడిబాట కార్యక్రమంతో పాటు రెగ్యులర్గా వచ్చే కొత్త అడ్మిషన్లతో 10 నుంచి 20 శాతం మేర విద్యార్థుల సంఖ్య పెరగనుంది. 1వ తరగతి నుంచి 10 వరకు జిల్లాకు 2,14,460 పాఠ్యప్తుస్తకాలు (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ) అవసరం ఉండగా, ఇప్పటి వరకు 1,73,730 (81శాతం) వచ్చాయి. వీటిని వీవర్స్ కాలనీ ఓల్డ్ డీఈఓ కార్యాలయ గోదాంలో నిల్వ చేశారు. ప్రైవేట్కు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం తదితర వాటిని ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహంగా అందిస్తోంది. ప్రైవేట్కు దీటుగా డిజిటల్ తరగతులు, సైన్స్ ప్రయోగాలతో ఉత్తమ బోధన చేస్తూ పేద విద్యార్థుల జీవితాలకు బంగారు భవిష్యత్ను అందిస్తుంది. ప్రస్తుతం 81శాతం మేర పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుగా, బడులు పునఃప్రారంభమయ్యే లోపు మిగతా 19 శాత పాఠ్యపుస్తకాలను కూడా రానున్నాయి. పాఠశాలలు తెరుచుకున్న తర్వాత విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఒకవేళ పుస్తకాల సంఖ్య తక్కువగా ఉంటే... పై తగతులకు వెళ్లే పిల్లల నుంచి తీసుకుని వాటిని అందించేలా ప్లాన్ చేస్తున్నారు. పాఠశాలలకు పంపిణీ 2025–26 నూతన విద్యా సంవత్సరానికి గాను సర్కారు బడుల పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను జిల్లాలో పలు మండలాల ఎమ్మార్సీ కార్యాలయాలకు పంపించారు. జనగామ మండలం(28,645), బచ్చన్నపేట (10,570), నర్మెట (7,77 6), దేవరుప్పుల (7,385) మొత్తంగా 54,376 రకాల పుస్తకాలను మండలాలకు పంపించారు. ఇంకా 8 మండలాలకు 1,19,354 పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఎమ్మార్సీల నుంచి విద్యార్థుల ఇండెంట్ ప్రకారం పాఠ్యపుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు.జిల్లాలో విద్యాసంస్థల వివరాలుపీఎస్ 341 యూపీఎస్ 64 ఉన్నత 103 గురుకులాలు 19 కేజీబీవీ 12 యూఆర్ఎస్ 01 మోడల్ 8 ఎయిడెడ్ 10 జిల్లాకు 2.14 లక్షలు అవసరం ఇప్పటివరకు చేరుకున్నవి 1.73 లక్షలు రెండో విడతలో వందశాతం 155 స్కూల్స్, గురుకులాలు 45 వేల మంది విద్యార్థులురెండో విడతలో పూర్తిస్థాయిలో.. సర్కారు బడులు, గురుకులాల పిల్లలకు ఉచితంగా అందించే ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను మండలాల వారీగా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకు నాలుగు మండలాలకు 54,376 పుస్తకాలను అందించాం. జిల్లాకు ప్రభుత్వం నుంచి 81 శాతం మేర పాఠ్యపుస్తకాలు రాగా, రెండో విడుతలో పూర్తి స్థాయిగా రానున్నాయి. – భోజన్న, డీఈఓ -
గ్రామాభివృద్ధే లక్ష్యం
దేవరుప్పుల: జన్మనిచ్చిన గ్రామ అభివృద్ధి లక్ష్యంగా విద్య, వైద్య రంగాల్లో ట్రస్టు పక్షాన నిరంతర తోడ్పాటు అందిస్తామని సీతారాంపురం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ అంబటి యాకన్న అన్నారు. ఆదివారం మండలంలోని సీతారాంపురం గౌడ కమ్యూనిటీ హాల్లో పగిడిపల్లి సతీష్ అధ్యక్షతన తొలుత ఇటీవల పాకిస్తాన్ సరిహద్దులో దేశం కోసం అశువులు బాసిన వీరజవానుల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలు అందించి తల్లిదండ్రులను సన్మానించారు. చైతన్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించి పలు సందేహాలకు నివృత్తి చేశారు. అలాగే ట్రస్టు సభ్యుడు పోరండ్ల శ్రీనివాస్ ఽఆధ్వర్యంలో అనాథ శరణాలయంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఉపాధ్యక్షుడు డాక్టర్ హనుమాన్జీ, ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి సతీష్, కోశాధికారి ఆవుల రాజు, సంయుక్త కార్యదర్శులు బస్వ నాగరాజు, దొడ్డి రమేష్, పుప్పల సోమేశ్వర్, భాషిపాక సుధాకర్, కార్యవర్గ సభ్యులు అనంతుల శివ, పెండెం ఉపేందర్, బస్వ మల్లేషమ్ తదితరులు పాల్గొన్నారు.భూమాత రైతు సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారిగా పద్మారెడ్డిస్టేషన్ఘన్పూర్: భూమాత రైతు సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారిగా మండలంలోని తానేదార్పల్లికి చెందిన దుంపల పద్మారెడ్డిని నియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సమ్మయ్యయాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు చెవుల యాదగిరి ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.కేజీబీవీలో డిజిటల్ క్లాస్ మానిటర్ చోరీతరిగొప్పుల: మండలకేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో గుర్తుతెలియన వ్యక్తులు శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో హాస్టల్ విద్యార్థులు వారి ఇంటికి వెళ్లిపోయారు. నైట్ వాచ్ ఉమెన్ ఉన్నప్పటికీ రాత్రివేళలో ఒంటరిగా విధులు నిర్వర్తించలేక ఉదయం సమయంలోనే విధులు నిర్వర్తించి రాత్రి సమయంలో విధుల్లో ఉండడంలేదు. ఇది గమనించిన దుండగులు శనివారం రాత్రి పాఠశాల తాళం పగులకొట్టి సీసీ కెమెరా హార్డ్డిస్క్, డిజిటల్ తరగతులు బోధించే 100 అంగుళాల ఎల్ఈడీ మానిటర్ ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం యథావిధిగా సిబ్బంది విధులకు రాగా పాఠశాల తాళం పగులగొట్టి ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ మేరకు చోరీ విషయమై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఓ తెలిపారు. -
రోడ్డుపైనే సిట్టింగ్
● సోమేశ్వర ఆలయ పరిసరాల్లో మందుబాబుల ఓపెన్ సిట్టింగ్ ● పట్టించుకోని పోలీసులు పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో మందుబాబు లు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. సోమేశ్వర ఆలయం, గిరిప్రదక్షిణ రోడ్డు, పంచగుళ్లు, ఆలయం ఘాట్రోడ్డు, పాల్కురికి సోమనాథుడి స్మృతివనం తదితర ప్రాంతాలు సాయంత్రం అయి తే చాలు మందుబాబులతో హడావుడిగా మారిపోతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటిబాట పట్టిన మహిళలు రోడ్డుపై మందుబాబులు సిట్టింగ్తో ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాలు జారీ చేసిన స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న స్థానిక పోలీసులు మందుబాబులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, భక్తులు, మహిళలు కోరుతున్నారు. -
తగిన గుణపాఠం చెప్పాలి
యుద్ధ విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్పై జిల్లా పౌరుల స్పందన ● పహల్గాం దాడికి రెట్టింపు చర్య జరగాల్సిందే! జనగామ: ప్రజాసమస్యలను పక్కన బెట్టి.. దేశసంపదతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. భారత్తో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న దాయాది దేశం పాకిస్తాన్పై జిల్లా ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. అమెరికా మధ్య వర్తిత్వంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించిన మూడు గంటల వ్యవధిలో పాకిస్తాన్ భారత్పై క్షిపణి దాడులు చేయడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కుయక్తులను తిప్పకొట్టిన భారత ఆర్మీకి జేజేలు పలుకుతూ... పహల్గాం దాడికి రెట్టింపు ట్రీట్మెంట్ ఉండాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. కాల్పుల విరమణ.. పాకిస్తాన్ కవ్వింపు.. భారత్ ఎదురుదాడికి సంబంధించి ఆయా వర్గాల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.జవాన్లకు అండగా ఉంటాం.. ఉగ్రవాదం పేరుతో అమాయకులను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సిందూర్తో గుణపాఠం చెప్పాలి. ప్రతిసారి పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి దేశంపై దాడి చేస్తూ అమాయక ప్రజలను చంపుతున్నారు. ఇందుకు పహల్గాం ఘటనే నిదర్శనం. దేశ సరిహద్దులో పాకిస్తాన్తో పోరాడుతున్న వీర జవాన్లకు మేమంతా అండగా ఉంటాం. – తోట రమేష్, రైతు, జఫర్గఢ్ శివారు వడ్డెగూడెందీటైన సమాధానం చెప్పిన ఆర్మీ.. ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ, ప్రశాంతంగా ఉన్న భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడిన పాకిస్తాన్పై ఆర్మీ యుద్ధభేరి సరైన నిర్ణయం. యుద్ధంతోనే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి తోక ముడిచింది. యుద్ధం అనేది లేకుండా శాంతి నెలకొనాలి. కానీ రెచ్చిపోతే తగిన గుణపాఠం చెప్పక తప్పదు. – గజ్జెల దామోదర్, మండలం కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు, చిల్పూరుతీవ్రవాదం లేకుండా నిర్మూలించాలి ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ అనేది మన ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు అనిపిస్తుంది. మనకు ఆర్థికంగా, జననష్టం కాకుండా, పాకిస్తాన్ను ప్రపంచంలో ఒక దోషిగా, తీవ్రవాద దేశంగా అందరికీ తెలిసేటట్లు భారత ప్రభుత్వం చేసింది. కానీ అమెరికా జోక్యం చేసుకోకుంటే పీఓకేను ఆక్రమించి పాకిస్తాన్కు బుద్ధి చెప్తే బాగుండేది. – పోతుగంటి నరసయ్య, ఎంఈఓ, పాలకుర్తిశాంతిని కోరుకోవడం శుభ పరిణామం యుద్ధం నుంచి శాంతిని కోరుకోవడం శుభ పరిణామం. ఇరు దేశాలతో చర్చలు జరిపి కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అభినందనలు. మొదటగా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు మానుకోవాలి. ఉగ్ర సంస్థలను నిర్మూలన చేసి, అభివృద్ధి కోసం భారత్తో స్నేహసంబంధమైన వాతావరణం నెలకొనేలా చేసుకోవాలి. – డాక్టర్ సుగుణాకర్రాజు, దళిత రత్న, జనగామకవ్వింపు చర్యలు సహించరానివి అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో భారత దేశం, పాకిస్తాన్ సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఇంకా సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటం సహించరానిది. ఒప్పందం ప్రకారం యుద్ధ విరమణ, సీజ్ ఫైర్ను అమలు చేయాల్సిందే. –మంగు జయప్రకాశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, స్టేషన్ఘన్పూర్ -
కళల విశిష్టతను నలువైపులా చాటాలి
● అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ హన్మకొండ కల్చరల్: ఓరుగల్లు ఖ్యాతిని, కళల విశిష్టతను నలువైపులా చాటాలనే సంకల్పంతో ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ అన్నారు. అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్ సౌజన్యంతో తెలుగు వాగ్గేయకారులు, పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంత్యుత్సవం, అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ వా ర్షికోత్సవం ఘనంగా నిర్వహించా రు. ఆదివారం ఉదయం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో సూత్రపు అభిషేక్ అధ్యక్షతన జరి గిన కార్యక్రమాల్లో నగరానికి చెందిన కళాకారులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వందకుపైగా కళాకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ప్రదర్శించిన సంగీ త, నృత్యాలు అలరించాయి. -
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
కొడుకు చెప్పగానే ఒప్పేసుకున్న తల్లి.. ఖానాపురం: దేశంపై ఎనలేని ప్రేమ.. వ్యవసాయం చేస్తూ ఇరువురు కుమారులను పెంచింది.. డిగ్రీ వరకు చదివించింది.. కుమారుడు సైన్యంలోకి వెళ్తానంటే ఒప్పుకుంది.. వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలిచింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గ్రామానికి చెందిన ఎల్ది పద్మ. దేశరక్షణలో భాగస్వామి కావాలని కుమారుడు ఎలేందర్గౌడ్కు సూచించింది. మొదటి ప్రయత్నంలో సెలక్ట్ కాకపోవ డంతో కొంత నిరుత్సాహపడ్డాడు. మళ్లీ ఎలేందర్గౌడ్ను తల్లి పద్మతోపాటు అన్న మురళి ప్రోత్సహించారు. రెండో ప్రయత్నంలో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం దేశరక్షణలో భాగంగా రాజస్థాన్లో విధులు నిర్వరిస్తున్నాడు. పాకిస్థాన్తో శనివారం వరకు జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులతో పోరాడాడని తల్లి సంతోషం వ్యక్తం చేసింది. న్యూస్రీల్ -
బిడ్డకు ఆశీర్వాదం
జనగామ: ‘బిడ్డా దేశం నీకోసం ఎదురు చూస్తుంది.. తుపాకీ ఎక్కుపెట్టు.. భరత మాత జోలికి వచ్చే ఉగ్రమూకల భరతం పట్టాలి’ అంటూ బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లికి చెందిన జవాన్ బేజాటి వెంకట్రెడ్డిని అతడి తల్లి నాగలక్ష్మి నిండు మనసుతో ఆశీర్వదించి సాగనంపారు. సెలవులపై గత నెల 30న స్వగ్రామానికి వచ్చిన వెంకట్రెడ్డి.. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి పిలుపు రావడంతో శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా కశ్మీర్కు బయలు దేరాడు. 2005 సంవత్సరంలో సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్స్కు ఎంపికై న వెంకట్రెడ్డికి 2007లో మొదటి పోస్టింగ్లో జమ్మూకశ్మీర్ శాంతి భద్రతల విభా గంలో బాధ్యతలు అప్పగించారు. 2009–15 వరకు అస్సాంలో విధులు నిర్వహించగా.. ఉత్తమ సేవలకు 2014లో కామెండేషన్ డిస్క్తో సత్కరించారు. 140 కోట్ల భారత ప్రజలకు కాపలా ఉండే అవకాశం మా ఇంట్లో నుంచి కొడుక్కు రావడం తల్లిగా గర్విస్తున్నానంటూ ఆనంద భాష్పాలతో నాగలక్ష్మి తనలోని సంతోషం.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
ఆర్మీబాట
అమ్మమాట.. – ఎడ్ల ఝాన్సీ, మానుకోటతల్లి వెంకటమ్మతో ఝాన్సీ(ఫైల్)దేశరక్షణకు పిల్లలను సైన్యంలోకి పంపిన ఓరుగల్లు తల్లులు ● భర్త మిలటరీలో మరణించినా.. బిడ్డలను కూడా పంపిన మరికొందరు.. ● సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఉమ్మడి జిల్లా యువత ● గర్వంగా ఫీలవుతున్న మాతృమూర్తులు నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం -
సైనికులకు ఆశీర్వచనాలతో ప్రత్యేక పూజలు
జనగామ: సైనికులు, ప్రధాని మోదీకి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఆలయ ప్రధాన అర్చకులు దత్తుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు జాతీయ జెండాతో దేశ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు చుంచు శ్రీకాంత్ మాట్లాడుతూ ఇండో–పాక యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అనుమతిస్తే సైన్యంలో చేరేందుకు తనతో పాటు కిరణ్, రాజు, వినయ్, సంతోష్ తదితరులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలులింగాలఘణపురం: పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నా రు. శనివారం మండలంలోని జనగామ–సూర్యాపేట రోడ్డులోని కుందారం క్రాస్ రోడ్డు వద్ద పశువుల అక్రమ రవాణాను నివారించేందుకు చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పురష్కరించుకొని ఇష్టారాజ్యంగా పశువులను అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని, పశువైద్యాధికారి ధ్రువీకరించిన పశువులను మాత్రమే తీసుకెళ్లాలన్నారు. బక్రీద్ వరకు చెక్పోస్టు 24 గంటలు పని చేస్తుందని తెలిపారు. సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై శ్రావణ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.పద్మశ్రీ సమ్మయ్యకు సన్మానందేవరుప్పుల : మండల పరిధి అప్పిరెడ్డిపల్లెకు చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్యను బీఆర్ఎస్ అనుబంధ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్మానించారు. శనివారం హైదరాబాద్లో ఆమె స్వగృహానికి సమ్మయ్యను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గ్రామీణ సాంస్కృతిక కళారంగానికి వన్నెతెచ్చేందుకు వందలాది ప్రదర్శనలు ఇచ్చిన సమ్మయ్యను ప్రశంసించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాముయాదవ్, సమ్మయ్య కుటుంబ సభ్యులు గడ్డం సోమరాజు, మురళీకృష్ణ, హిమగిరి తదితరులు పాల్గొన్నారు.జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాము ఎంపికరఘునాథపల్లి: మహారాష్ట్రలో వార్దా జిల్లా డియోలి పట్టణంలో ఈనెల 12 వరకు జరిగే 51వ జాతీయ స్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలకు మండలంలోని రామరాయనిబంగ్లా గ్రామానికి చెందిన సీహెచ్.రాము ఎంపికయ్యాడు. గత నెల 28న రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన పోటీల్లో రాము అత్యున్నత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారపాక రాజయ్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా రామును అసోసియేషన్ బాధ్యులు చిట్ల ఉపేందర్రెడ్డి, గాండ్ల మల్లికార్జున్, కొయ్యడ మల్లేష్, శాగ తిరుమలేష్, ఎడ్ల శ్రీనివాస్, గొంగల్ల కుమార్, రాజశేఖర్ తదితరులు అభినందించారు.లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నిర్వహించే లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మీ–సేవ కేంద్రాల్లో ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంట ర్మీడియట్లో గణిత శాస్త్రం ఒక అంశంగా ఉన్నవారు, కనీసం 60శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్) పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. -
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..
వెంకటాపురం(ఎం)/ఖిలావరంగల్: ఉమ్మడి వరంగ ల్ జిల్లాలో ఈనెల14న పర్యటించనున్న ప్రపంచ అందాలభామలకు మన సంస్కృతీ సంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. మొత్తంగా 116 దేశాల సుందరీమణులు ముందుగా హనుమకొండలోని హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరాక.. వేయిస్తంభాల దేవాలయం చేరుకుని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడినుంచి రెండు బృందాలుగా విడిపోయి.. ఒక బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప చేరుకోనుంది. మరోబృందం కాకతీయు రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు వెళ్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సుందరీమణులు హిందూ సంప్రదాయ దుస్తుల్లోనే సందర్శించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న వారికి గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతారు. కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అలరిస్తారు. వివిధ పూజా, ఇతరత్రా కార్యక్రమాల తరువాత గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, పేరిణి నృత్య ప్రదర్శన ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాకతీయుల కళా సంస్కృతిని చాటేలా.. ఖిలావరంగల్ కోటలోని శిల్పాల ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గజ్జల రంజిత్కుమార్ నేతృత్వంలో 5 నిమిషాల నిడివిగల పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. కాకతీయుల కళా సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అందాలభామలను.. అబ్బురపరిచేలా ప్రదర్శనలు.. రామప్ప వద్ద గిరిజన, కొమ్ముకోయ నృత్యాలు ఖిలావరంగల్ కోటలో పేరిణి శివతాండవం ఏర్పాట్లు చేస్తున్న టూరిజం, జిల్లాల అధికారులు సంప్రదాయ దుస్తుల్లో రామప్పకు సుందరీమణులు -
ఇద్దరు పిల్లలను ఆర్మీలోకి ..
స్టేషన్ఘన్పూర్: ఇప్పగూడెం గ్రామానికి చెందిన జిట్టెబోయిన రాజు, శ్రీకాంత్ భారత ఆర్మీలో సేవలు అంది స్తున్నారు. సుభద్ర, వెంకటయ్య దంపతుల కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించి వివాహం చేశారు. కాగా పిల్లలకు తల్లి చిన్నప్పటి నుంచే దేశభక్తిని నూరిపోసింది. దేశ రక్షణకు మించిన సేవ లేదని చెప్పిన మాతృమూర్తి ఆశయం మేరకు కొడుకులిద్దరూ డిగ్రీ వరకు చదివి పదేళ్ల క్రితం భారత ఆర్మీకి సెలక్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. ‘మా పిల్లలు రాజు, శ్రీకాంత్ చిన్నవయస్సు నుంచే భారత సైన్యం అంటే ఇష్టపడేవారు. ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధం ఆందోళనగా ఉంది. మా పిల్లలతోపాటు భారత ఆర్మీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాం.’ అని తల్లి సుభద్ర తెలిపింది. -
ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలి
బచ్చన్నపేట : కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ అన్నారు. శుక్రవారం కొడవటూర్ వన నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులతోపాటు ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో త్వరగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నా రు. మిల్లర్ల నుంచి ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలియ జేయాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహిచాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి బృంగి రూపాచైతన్య, ఐకేపీ సీసీ సత్యనారాయణ, ఏఈఓ రాజు పాల్గొన్నారు. -
పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జనగామ రూరల్: జిల్లాలో ఈనెల 13న నిర్వహించే పాలీసెట్–2025 అవసరమైన ఏర్పాట్లు చేశామని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.నర్సయ్య తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించే ఈ పరీక్షకు మొత్తం 1,416 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. జిల్లాలో మొత్తం మూడు సెంటర్లు కేటాయించినట్లు చెప్పారు. పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 576 మంది, సెయింట్ మేరీ హైస్కూల్లో 480 మంది, స్టేషన్ ఘన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 360 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. నిమిషం నిబంధన అమలులో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి నిర్దేశిత సమయానికి గంట ముండే రావాలని సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్, బ్లాక్ పెన్సిల్తో మాత్రమే రావాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 1,416 మంది విద్యార్థులు మూడు పరీక్ష కేంద్రాలు అమలులో నిమిషం నిబంధన -
పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకం
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ జనగామ: పట్టణ స్వచ్ఛతలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలమకని, పారుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ఎలాంటి లోపాలు ఉండొద్దని, సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు. పట్టణ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ వివరాలను త్వరగా ఆన్లైన్ చేయాలన్నారు. పట్టణంలో ట్రేడ్ లైసెన్సులు కలిగిన వారే వ్యాపారా లు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన ప్లాట్ల యజమానులకు ప్రొసీడింగ్ కాపీలను అందించాలని ఆదేశించారు. సమీక్ష అనంత రం 154 మంది పారిశుద్ధ్య కార్మికులకు రెండు జతల దుస్తులు, టవల్స్ అందజేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ ప్రసవాలు పెంచాలి
● డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్గౌడ్బచ్చన్నపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాతీయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా అధికార విభాగం సిబ్బంది.. మహిళలు, పిల్లల చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
మనకంటూ ఓ బ్రాండ్ వచ్చేలా..
నిర్మల్, పోచంపల్లి వంటి ప్రాంతాలకు వచ్చిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చేలా వెదురు బొంగులతో ప్రత్యేక అందాన్ని ఇచ్చే విధంగా బొమ్మలను తయారు చేయిస్తున్నాం. రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చే అందాల తారలకు బహుమతులుగా ఇవ్వాలా.. స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలా అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పటికే 30 మంది మహిళలకు 20 రోజులపాటు శిక్షణ ఇచ్చాం. వారు తయారుచేసిన బొమ్మలు చూడముచ్చటగా, సహజసిద్ధంగా ఉన్నాయి. కచ్చితంగా అందరినీ ఆకర్షిస్తాయని భావిస్తున్నాం. – రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్ఓ, ములుగు -
సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడి హేయమైన చర్య
జనగామ: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని వ్యతిరేకిస్తూ జనగామ జర్నలిస్టులు నిరసన తెలిపా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జనగామ జర్నలిస్టు సంఘాల ఆధర్యాన చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడు తూ.. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఏపీ పోలీసులు వ్యవహరించడం సరికాదన్నారు. ఏపీ సర్కారు తీరు మార్చుకోకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వాస్తవాలను వెలికి తీసి పత్రికల్లో రాస్తే కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి వేధించటం మానుకోవాని హితవు పలికారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలి స్టులు ఇర్రి మల్లారెడ్డి, సురిగల భిక్షపతి, శ్రీభాష్యం శేషాద్రి, హింగే మాధవరావు, భాస్కర్, బిట్ల మధు, బండి శ్రీనివాస్, ఉల్లెంగుల మనీ, కన్నారపు శివశంకర్, శశిధర్, నేతి ఉపేందర్, మహిపాల్రెడ్డి, గోవర్ధ నం వేణుగోపాల్, కేమెడి ఉపేందర్, చౌదరిపల్లి ఉపేందర్, యూసఫ్, పన్నీరు భానుచందర్, ఆశిష్, ఉపేందర్, మణికుమార్, బజాజ్, క్రాంతి, హరీష్, వినయ్, సాగర్, కిరణ్, నవీన్, ఓంకార్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండీ.షరీఫ్, ఇప్ప రాంరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ భోజన్నకు విజ్ఞప్తి చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఈఓను సంఘం జిల్లా కమిటీ బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిసి డీటీఎఫ్ డైరీ, జీఓల పుస్తకం అందజేశారు. ఈ కార్యక్రమంలో చొక్కయ్య, శ్రీనివాస్, యాదయ్య, శివరాం, దివాకర్రెడ్డి, జగ్గారెడ్డి, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.గోవులను రక్షించాలిజనగామ: గోరక్షణ చట్టాలను అమలు చేసి గోవుల రక్షణకు పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏసీపీ పండేరే చేతన్ నితిన్కు వివిధ అంశాలతో కూడిన వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గోవధశాలలను మూసివేసి, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు.టీచర్ల శిక్షణకు డీఆర్పీలు సిద్ధంగా ఉండాలివిద్యారణ్యపురి: త్వరలో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల శిక్షణకు డిస్ట్రిక్ట్ రిసోర్స్పర్సన్ (డీఆర్పీ)లు సిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి కోరారు. ఐదురోజులుగా హనుమకొండ జిల్లా కాజీపేటలోని బాలవికాస్లో రాష్ట్రస్థాయిలో గణితం, సోషల్ స్టడీస్ జిల్లా రిసోర్స్పర్సన్ల కు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. సమావేశంలో ఎస్సీఈఆర్టీ కోర్సు కో–ఆర్డినేటర్లు ఎల్లయ్య, గణపతి, రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం అధ్యక్షుడు రథంగాపాణిరెడ్డి పాల్గొన్నారు.రామప్పను సందర్శించిన హనుమకొండ జిల్లా జడ్జివెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటా పురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పట్టాభి రామారావు, ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్తో కలిసి శుక్రవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పూజారులు తీర్థప్రసాదా లు, ఆశీర్వచనం అందజేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్ వివరించగా.. రామప్ప శిల్పకళాసంపద బాగుంద ని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సై జక్కుల సతీశ్ తదితరులు ఉన్నారు. -
‘ఆపరేషన్ సిందూర్’కు సంపూర్ణ మద్దతు
జనగామ రూరల్: ఉగ్రవాదం నుంచి దేశానికి శాశ్వతంగా విముక్తి జరగాలి.. అలాగే ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను స్వాగతిస్తూ సంపూర్ణ మద్దతను తెలియజేస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ జనగామ పట్టణ 4వ మహాసభల్లో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం అనే బేధం లేదని, పాకిస్థాన్ పాలకులు, ఉగ్రవాదులు ఒకరిపై ఒకరు ఆధారపడి భారత్లో నరమేధాన్ని సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను ఆసరాగా చేసుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంద ని, దానికి సరైన గుణపాఠం చెప్పాలిందేనన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే ఈదేశ పౌరులైన మావోయిస్టులను ఏరివేసేందకు ఆపరేషన్ కగార్ చేపట్టడం సరైంది కాదని, తక్షణమే దీనిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకునేదిలేదని కేంద్ర మంత్రి నియంతలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి, పాతూరి సుగుణమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్, నాయకులు చొప్పరి సోమయ్య, మోతె శ్రీశైలం, చామకుర యాకూబ్, కెమిడి మల్లయ్య, గుగులోత్ సఖి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలి టీ సమగ్రాభివృద్ధికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని తన నివాసంలో శుక్రవారం మున్సిపాలిటీ అఽధికారులు, స్థానిక నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యర్థాల సేకరణ, నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, చెత్త సేకరణ కు స్వచ్ఛ ఆటోలు, చెత్తకుండీల ఏర్పా టు, డ్రెయినేజీల శుభ్రత, పారిశుద్ధ్య కార్మికుల నియామకం తదితరాలు వెంటనే చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ట్యాంకర్లు, అదనంగా అవసరమైతే అంచనాలు సిద్ధం చేయాలని, అంతర్గత పైపులైన్లు వేయాలని చెప్పారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, కాలనీల్లో వీధి దీపాలు, ఇంటింటికీ మీటరు, కూడళ్లలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నా రు. మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి, ఛాగల్లులో బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి గ్రామాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
వానాకాలం పంటల ప్రణాళిక ఖరారు
3.49 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..జనగామ రూరల్: జిల్లాలో యాసంగి పంటలు ముగుస్తున్న క్రమంలో రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. యాసంగి సీజన్ చివరలో జిల్లాకు దేవాదుల ద్వారా నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోయి చాలామంది రైతులకు నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడులు సైతం రాక ఇబ్బందులు పడ్డారు. ఈ వానాకాలంలోనైనా మంచి దిగుబడి వస్తుందనే ఆశతో ముందుకుసాగుతున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. వానాకాలంలో సుమారు 3,49,930 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే గత సీజన్తో పోలిస్తే ఈసారి 40 నుంచి 50 వేల ఎకరాల్లో అదనంగా సాగయ్యే అవకాశం ఉన్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పండ్ల తోటలు, ఇతర పంటల సాగుకు సంబంధించి ప్రణాళికను సైతం రూపొందించారు. ఈసారి వర్షాలు సైతం ముందుగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో కొంత మంది రైతులు వేసవి దుక్కులు మొదలుపెట్టారు. సీజన్ ప్రారంభం నాటికి ఎరువులు రైతులు సాగు చేసే పంటలకు అనుగుణంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు, విత్తనాలు అవసరమవుతాయో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాకు సంబంధించి వివిధ రకాల ఎరువులు 95,691 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. యూరియా 26వేలు అవసరం ఉండగా ప్రస్తుతం 4 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీ 5వేల మెట్రిక్ టన్నులకు 790 మెట్రిక్ టన్నులు, పోటాష్ 3,529 మెట్రిక్ టన్నులకు 450, ఎస్ఎస్పీ 1,783 మెట్రిక్ టన్నులకు 590, కాంప్లెక్స్ ఎరువులు 10 వేల మెట్రిక్ టన్నులకు 2వేల మెట్రిక్ టన్నులతోపాటు ఎరువలు అందుబాటులో ఉన్నా యి. అయితే సీజన్ ప్రారంభం వరకు నెలవారీ కోటా వస్తుందని, ఆ మేరకు రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంచుతాం.. వానాకాలం సాగుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక రూపొందించాం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఎరువులకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవే కాకుండా సీజన్ ప్రారంభం వరకు నెలవారీ కోటా తెప్పించి అందుబాటులో ఉంచుతాం. జిల్లాలో ఈసారి 3లక్షల 49 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశాం. – రామారావు నాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఈ ఏడాది అత్యధికంగా వరి, పత్తికి అవకాశం అందుబాటులో 25 శాతం విత్తనాలు, ఎరువులు సీజన్ నాటికి అందించేలా అధికార యంత్రాంగం కసరత్తు దుక్కులు సిద్ధం చేసుకుంటున్న అన్నదాతలువిత్తనాల అంచనా.. ఈసారి జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి సాగవుతుండగా ఇందుకు అనుగుణంగా ముందుగానే అధికారులు అవసరమయ్యే విత్తనా ల అంచనాలు సిద్ధం చేశారు. పత్తి 5లక్షల ప్యాకెట్లు, వరి 44,012 క్వింటాళ్లు, రెడ్గ్రాం 70 క్వింటాళ్లు, పల్లికాయ 50 క్వింటా ళ్లు, మొక్కజొన్న 367వేల క్వింటాళ్లు, మినుములు 1.5 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని భావిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో పాటు విత్తనాలు, ఎరువుల విక్రయాలపై ఆన్లైన్ పద్ధతి, రశీదుల జారీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. -
లక్ష్య సాధనలో ముందుండాలి
జనగామ: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్య సాధనలో ముందుండాలి.. ఇందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నా రు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పని తీరుపై గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి నెలా ప్రసూతి సేవలతో పాటు డెలివరీలు 50, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 15కు తగ్గకుండా చేయాలన్నారు. మొదటి నెల చెకప్ నుంచి గర్భిణి రిజిస్ట్రేషన్ మొదలు డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, జీరో మాతృమరణాల కోసం అంకితభావంతో పని చేయాలని చెప్పారు. ఎన్సీడీ ప్రోగ్రాంలో తప్పులు లేకుండా వివరాలను రికార్డు చేయాలని, టీబీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సబ్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న కంటిపరీక్షల వైద్య శిబిరాలు జూన్ 15లోగా పూర్తి చేయాలని అన్నారు. ఎండా కాలంలో వడ దెబ్బ నివా రణపై అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య సలహా లు ఇవ్వడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూ చించారు. సమీక్షలో డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ వీరాంజనేయులు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ డి.రవీందర్గౌడ్, డాక్టర్ స్వర్ణకుమారి, డాక్టర్ సుధీర్, డాక్టర్ అశోక్కుమార్, డాక్టర్ కమల్హసన్ పాల్గొన్నారు. తాగునీటి ఇబ్బందులు రావొద్దు వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం మండలాల వారీగా వివిధ శాఖల అధికారులతో తాగునీటి సరఫరాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి సరఫరాకు సంబంధించి మోటా ర్లు, పైపులు రిపేరుకు వస్తే తమ దృష్టికి తీసుకొచ్చి మరమ్మతు చేయించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషామాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలిజనగామ రూరల్: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టరెట్లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ‘నషా ముక్తి అభియాన్’ కింద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం.. కంచి వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ ఎన్జీఓ ఆధ్వర్యాన అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అటెండర్లు, ఆశ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, తిరుమల బ్యాంకు మేనే జర్ నంగునూరు చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
జూన్ లోపు పనులు పూర్తిచేయాలి
జనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డు నుంచి జ్యోతినగర్ కాలనీ మీదుగా 3వ వార్డులో నిర్మాణం చేపట్టిన అండర్ గ్రౌండ్ నాలా పనులు జూన్లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. వార్డు మాజీ కౌన్సిలర్ పగిడిపాటి సుధాసుగాణాకర్రాజుతో కలిసి ఆయన పనులను గురువారం పరిశీలించారు. ప్రతీ వారం వచ్చి పనులను పరిశీలిస్తానని, జాప్యం చేయొద్దని సూచించారు. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని అన్ని మీ–సేవ కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ వరకు అపప్లై చేసుకోవచ్చని, ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలో 50 పని దినాలు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ గణిత శాస్త్రం అంశంగా, కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా(సివిల్), బీటెక్(సివిల్) పూర్తి చేసి ఉండాలన్నారు. 13న జాబ్ మేళాజనగామ రూరల్: జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈనెల 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి పి.సాహితి ఒక ప్రకటనలో తెలిపారు. వీటుసీ స్కిల్ డెవలప్మెంట్ సెంట ర్ ట్రైనింగ్ కం ప్లెస్మెంట్ కోసం ఇంటర్వ్యూ లు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న జనగామతోపాటు ఉమ్మడి వరంగల్ నిరుద్యోగ యువతీ యువకులు బయోడేటా లేదా రెస్యూమ్, విద్యార్హతల సర్టిఫికట్స్ జిరాక్స్తో ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని 8వ నంబర్ గదికి రావాలని సూచించారు. వివరాల కు సీనియర్ అసిస్టెంట్ జె.గీతను 79954 30401 నంబర్లో సంప్రదించాలన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’జనగామ రూరల్: ఆర్టీసీ జనగామ డిపోలో శుక్రవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, మద్దూరు, పాలకుర్తి మండలాల్లోని గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలతో పాటుగా సూచనలు సలహాలను ఇవ్వాలని సూచించారు. ఇందుకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 9959226050 నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. కోర్టుకు హాజరైన పొన్నాల లక్ష్మయ్య జనగామ రూరల్: జిల్లా ఉద్యమ కేసులో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం జనగామ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం గిర్నిగడ్డ ప్రాంతంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దుర్గమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్, నాయకులు ఆకుల సతీష్, జంగిటి అంజయ్య, గురువయ్య, ఎండీ.మాజీద్, సౌడ మహేష్, యాట క్రాంతికుమార్ తదితరులున్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం పనితీరును మెరుగుపర్చేందుకు ‘ర్యాప్’ పథకంలో భాగంగా జిల్లాకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కేటాయించారని జిల్లా పరిశ్రమల మేనేజర్ శివకృష్ణ ఠాకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఈనెల 10 తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. -
పోస్టుమార్టం అంతా గోప్యం!
● ఎంజీఎం మార్చురీ వద్ద కమాండర్ల పేర్లు వెల్లడించని అధికారులు ● డీజీపీ వచ్చాక సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల ● ప్రత్యేక బందోబస్తుతో హెడ్క్వార్టర్స్కు మృతదేహాల తరలింపుఎంజీఎం/మామునూరు: తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులోని పేరూరు–లంకపల్లి అడవుల్లో గురువారం తెల్లవారు జామున జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్ కమాండర్లు మందుపాతర పేలి చనిపోయారని పోలీసులు ప్రకటించారు. వారి మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు తీసుకువచ్చారు. అక్కడినుంచి మామునూరు ఏసీపీ తిరుపతి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్లో ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు, ముగ్గురు తహసీల్దార్లు, గ్రేహౌండ్స్ అధికారులు నాలుగు గంటలపాటు రహస్యంగా పోస్టుమార్టం చేయించారు. కనీసం మార్చురీ వద్ద మృతి చెందిన పోలీసుల పేర్లు వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ తర్వాత డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నక్సలైట్ల దాడిలో గ్రే హౌండ్స్కు చెందిన కమాండర్లు వడ్ల శ్రీధర్, ఎన్.పవన్ కల్యాణ్, టి.సందీప్ చనిపోయినట్లు సాయంత్రం మీడియాకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం మృతదేహాలను చాపల్లో చుట్టి ప్రత్యేక బందోబస్తు నడుమ పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలించారు. అక్కడ కమాండర్ల మృతదేహాలకు రాష్ట్రమంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సీపీ సన్ ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ నివాళులర్పించారు. కాగా, ముగ్గురు జవాన్లలో ఇద్దరు హైదరాబాద్, మరొకరు కామారెడ్డికి ప్రాంతానికి చెందిన వారు. బుల్లెట్ గాయాలతోనే మృతి.. బుల్లెట్ గాయాలతోనే జవాన్లు మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టంగా వెల్లడైంది. ల్యాండ్మైన్ పేలడంతోనే జవాన్లు చనిపోయి ఉంటే మృతదేహాలు చెల్లాచెదురయ్యేవి. కాగా, ముగ్గురు జవాన్లకు ఐదు బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. మెడ, పక్కటెముకలు, కడుపులోకి బుల్లెట్లు వెళ్లడంతో వారు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిపల్లికి చెందిన ఆర్ఎస్సై రణధీర్ను అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్చురీ వద్ద కనిపించని కుటుంబ సభ్యులు.. సాధారణంగా మార్చురీ వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ, పోలీస్ సిబ్బంది, గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు ముగ్గురు జవాన్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోస్టుమార్టం వద్దకు రానివ్వకుండా పోలీసు హెడ్క్వార్టర్స్కు తరలించారు. -
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు
సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.వాతావరణం జిల్లాలో ఉదయం ఎండ వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత పెరుగుతుంది. – 10లోu● 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు ● సిగ్నల్ పడితే ఒకటిన్నర నిమిషాల నిరీక్షణ ● జంక్షన్లో వాహనదారుల అవస్థలుజనగామ: వేసవి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. 44 డిగ్రీల సెల్సిఎస్ పైచిలుకు టెంపరేచర్ నమోదవుతోంది. ఉదయం 8 గంటలకే చెమటలు కక్కిస్తు న్న సూరీడు.. 10 గంటల కల్లా భగ్గున మండిపోతున్నాడు. ఫ్యాన్ గాలి వేడెక్కి పోతుంటే.. ఏసీలు, కూలర్లు ఏమాత్రం ఉపశమనం కలిగించలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జంక్షన్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో ద్విచక్రవాహన చోదకులు.. ప్రజలు ఎండ వేడికి డీ హైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. జనగామ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. జనగామతో పాటు సమీప జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తుంటారు. కలెక్టరేట్కు కొందరైతే.. వ్యాపార పరంగా సరుకుల కొనుగోలుకు మరికొందరు.. ఆస్పత్రులు, బ్యాంకులు తదితర పనుల కోసం వచ్చే వారితో నిత్యం రద్దీగా ఉంటుంది. హనుమకొండ, సూర్యాపేట, హైదరాబాద్, సిద్ధిపేటరోడ్డు నుంచి వచ్చే ప్రతీ ఒక్కరు ఆర్టీసీ చౌరస్తా కూడలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నల్ వద్ద రెడ్లైట్ వెలిగితే ఒకటిన్నర నిమిషాలు ఆగాలి. ఉద యం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బైక్, సైకిల్, ఆటోలో వెళ్లే వారు ఎండ దెబ్బకు గురవుతున్నారు. బైకిస్టులు సొమ్మసిల్లి పడిపోయిన సంఘటనలున్నాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆర్టీసీ చౌరస్తా సిగ్నల్ జంక్షన్ వద్ద వాహన చోదకులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. బస్టాండ్ ఏరియా వైపు.. -
పాడి పరిశ్రమపై నీలి నీడలు
జనగామ: కరువుకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న జనగా మలో ఓ వెలుగు వెలిగిన పాడి పరిశ్రమపై ప్రస్తు తం నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పాడి రైతులకు ప్రోత్సాహం అందించి, భరోసా కల్పించాల్సిన పాలకులు.. ఉన్న డీడీ (డిప్యూటీ డైరెక్టర్) పోస్టుకు మంగళం పాడేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. పాపిరెడ్డి పోరాటంతో పాల వెల్లువ జనగామలో పాడి పరిశ్రమ అభివృద్ధికి దివంగత మర్రి పాపిరెడ్డి చేసిన పోరాటంతో నాటి మంత్రి పొ న్నాల లక్ష్మయ్య సంపూర్ణ సహకారం అందించారు. పల్లె పల్లెన పాడిని అభివృద్ధి చేసేందుకు పాపిరెడ్డి నాటిన విత్తనం.. నేడు జిల్లా పాల వెల్లువలా మా రింది. మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు సబ్సిడీపై పాడి గేదెలు, దాణా, రుణాలు అందిస్తూ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించారు. అలాగే ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ కరువు ప్రాంతంలో పాడి పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విజయ డెయిరీ నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు, పాడి గేదెలకు సబ్సిడీ రుణాలు తదితర ప్రోత్సాహకాలను నిలిపి వేశారు. రోజూ 34వేల లీటర్ల సేకరణ జిల్లాలో 5,500 మంది రైతుల నుంచి 225 విజయ పాల కేంద్రాల ద్వారా రోజువారీగా 34వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. పాల సేకరణలో రాష్ట్రంలో జనగామ 3వ స్థానంలో ఉంది. జిల్లా కేంద్రంలో 20వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ కేంద్రం అందుబాటులో ఉండగా.. బచ్చన్నపేటలో 6వేలు, నర్మెట 3 వేలు, 2వేలు(రెండు), పాలకుర్తి 3వేలు, స్టేషన్ఘన్పూర్ 5వేలు, లింగాలఘణపురం 2వేలు, సింగరాజుపల్లి 2వేలు, చిల్పూరు వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న మినీ శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు ప్రతినెలా రూ.5కోట్ల వరకు చెల్లిస్తున్నారు. ప్రోత్సాహం అందిస్తే పాల సేకరణ 50వేల లీటర్లకు చేరే అవకాశం ఉంది. విజయ డెయిరీ డీడీ పోస్టు ఎత్తివేతకు రంగం సిద్ధం..? పాల సేకరణలో రాష్ట్రంలో జనగామకు గుర్తింపు రోజుకు 34 వేల లీటర్ల పాల సేకరణ ప్రోత్సాహం అందిస్తే 50వేల లీటర్లకు చేరే అవకాశంపోస్టు ఎత్తివేతకు కుట్రలు.. పాడి పరిశ్రమతో రైతులు అదనపు ఆదాయం ఆర్జిస్తున్న సమయంలో వారిని ప్రోత్సాహించా ల్సిన తరుణంలో డిప్యూటీ డైరెక్టర్(డీడీ) పోస్టును ఎత్తి వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీడీ పర్యవేక్షణలో జనగామ విజయ పాల శీతలీకరణ కేంద్రం కొనసాగుతోంది. డెయిరీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇక్కడి డీడీ పోస్టును ఉమ్మడి వరంగల్ జిల్లాకు తరలించాలనే నిర్ణయం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అలాగే దీనిపై ఇటీవల పాడి పరిశ్రమాభివృద్ధి కమిటీలోని పలువురు హైదరాబాద్లో ఉన్నతా ధికారులతో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి డీడీ పోస్టు తరలించ వద్దని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ఐదేళ్ల క్రితం పాలతో తయారు చేసే ఉత్పత్తులు, టెట్రా ప్యాకెట్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడే నెలకొలిపేందుకు ప్లాన్ చేయగా.. దీనిని సైతం పక్కన పెట్టారు. డీడీ పోస్టును తరలించి పాడి పరిశ్రమను నిర్వీర్యం చేయాలని చూస్తే పాపిరెడ్డి ఆశయానికి విలువ ఉండదని రైతులు అంటున్నారు. -
డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీ ఒకేషనల్ తదితర కోర్సుల్లోని 2,4,6 సెమిస్టర్ల, బ్యాక్లాగ్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షల టైంటేబుల్ను గురువారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సెమిస్టర్ల వారీగా ఇలా.. ● రెండో సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 14నుంచి నిర్వహించనున్నారు. ఈనెల 14, 16, 19, 21, 23, 2 6, 28, 30 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ● నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15, 17, 20, 22, 24, 27, 29, 31, జూన్ 4వ తేదీల్లో ఉద యం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు. ● ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17, 20, 22, 24, 27, 29, 31, జూన్ 4, 10, 11, 12, 13, 16వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటాయి. ● 6వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 14, 16, 19, 21, 23, 26, 28, 30. జూన్ 3, 5, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు. ● మొదటి సెమిస్టర్ పరీక్షలు జూన్ 17,18, 20, 21, 23, 24, 25వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటలవరకు జరుగుతాయి. ● మూడవ సెమిస్టర్ పరీక్షలు జూన్ 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటాయి. 14నుంచి సెమిస్టర్ల పరీక్షలు -
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు ఇబ్బంది పడేలా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్.. మందుబాబులను హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాల ముందు, రోడ్డుపై మద్యం సేవిస్తుండటంతో వచ్చిపోయే ప్రజలు, చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్న వైనంపై ఈ నెల 4వ తేదీన సాక్షిలో ప్రత్యేక విజిట్ కథనం ప్రచురితమైంది. దీంతోపాటు పోలీసులకు పలు ఫిర్యాదులు రావడంలో సీపీ స్పందించారు. బహిరంగ మద్యపానంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పగలు, రాత్రి సమయాల్లో మద్యం దుకాణం పరిసరాలతోపాటు నిర్మానుష్య ప్రదేశాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. దీంతోపాటు నిర్మాణంలో ఉన్న భవనాలు, మనుషులు నివాసం లేని పురాతన భవనాల్లో తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. దీనిలో భాగంగానే బుధవారం రాత్రి కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 221 మంది మందుబాబులను అదుపులోకి తీసుకొని వారిపై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా జనగామ డివిజన్ పరిధిలో 57 కేసులు నమోదు కాగా, హనుమకొండ డివిజన్ పరిధిలో 42 , ఘన్పూర్ 40, కాజీపేట 24, వర్ధన్నపేట 24, నర్సంపేట 24, వరంగల్ 10 కేసులు నమోదైనట్లు వివరించారు. మద్యం దుకాణాల పరిసరాల్లో ఎవరూ బహిరంగంగా మద్యం సేవించకుండా దుకాణ యజమానులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
ముగిసిన విద్యుత్ భద్రతా వారోత్సవాలు
జనగామ: విద్యుత్ ప్రమాదాల నివారణకు జిల్లాలో వారం రోజులుగా నిర్వహించిన భద్రతా వారోత్సవాలు ముగిశాయని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సీఎండీ వ రుణ్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు ఊరూరా భద్రతా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. టోల్ ఫ్రీ 1912, వాట్సాప్ నంబర్ 7901628348 ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ రేటు సాధించామన్నారు. ఉద్యోగుల భద్రతకు సేఫ్టీ బెల్ట్, గ్లోవ్స్, ఎర్త్ డిశ్చార్జ్ రాడ్స్, హెల్మెట్లను అందించినట్లు చెప్పారు. అవగాహన సదస్సులతో ప్రమాదాలను తగ్గించగలిగామన్నారు. ఎస్ఈ వెంట జనగామ, స్టేషన్ఘన్పూర్ డీఈలు లక్ష్మీ నారాయణరెడ్డి, రాంబాబు, టెక్నికల్ ఇంజనీర్ గణేష్, ఎంఆర్టీ డివిజనల్ ఇంజనీర్ విజయ్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జయరాజు తదితరులు ఉన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
జనగామ రూరల్: కేంద్రం అవలంభించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రాపర్తి రాజు, సుంచు విజేందర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులకు సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని, కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాల రాయబడ్డాయన్నారు. దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నబోయిన రాజు, జోగు ప్రకాష్, మల్లేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జనగామ రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యమని గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, దరఖాస్తుదారుల పరిశీలన ప్రక్రియపై అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏఈలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులు ఎక్కువ కాకుండా, 400 చదరపు అడుగుల తక్కువ కాకుండా నిర్మించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి నూతన పద్ధతులు ఉపయోగించాల, వాటిపై అవగాహన పెంపొందించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని, ఎప్పటికప్పుడు సర్వే చేసిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల అర్హుల ఎంపికకు చేపట్టిన సర్వేను వేగవంతం చేయాలన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద పైలట్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాల మంజూరుకు పోర్టల్లో వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపీరాం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చైతన్య కుమార్, ఎంపీడీఓలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాల పరిశీలన లింగాలఘణపురం: మండలంలోని కొత్తపల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, వనపర్తిలో రెండో విడత లబ్ధిదారుల జాబితాలో అధికారులు చేపట్టిన విచారణ ఏ విధంగా జరుపుతున్నారనే విషయాలను బుధవారం గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పూర్తి చేసుకోవాలని సూచించారు. వనపర్తిలో రెండో విడత లబ్ధిదారుల జాబితాలో అధికారులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. కలెక్టర్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్, పీడీ మాతృనాయక్, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ -
సకాలంలో లారీలను పంపించండి
● అదనపు కలెక్టర్ రోహిత్సింగ్జనగామ రూరల్: సకాలంలో లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మినీ సమావేశ మందిరంలో డీసీపీ రాజ మహేంద్రనాయక్తో కలిసి ధాన్యం తరలింపుపై రైస్ మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్స్తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులను సరైన విధంగా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు, తదితర అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ కొనుగోలు కేంద్రాల వద్ద లారీలను అందుబాటులో ఉంచాలని లారీ కాంట్రాక్టర్స్ను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ సరస్వతి, డీఎం సీఎస్ హాతీరాం, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, రైస్ మిల్ల ర్లు, లారీ కాంట్రాక్టర్స్, తదితరులు పాల్గొన్నారు. -
సోమేశ్వరాలయంలో భక్తుల సందడి
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, కొడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హుండీ ఆదాయం రూ.97,143 వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ. 97,143 వచ్చినట్లు ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు 48 రోజుల ఆదాయాన్ని బుధవారం ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప్పలమ్మ టెంపుల్ ఈఓ కేకే రాములు పర్యవేక్షణలో లెక్కించారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. బెట్టింగ్లకు దూరంగా ఉండాలి: ఎమ్మెల్యేజనగామ రూరల్: యువత క్రికెట్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్టిన్ గ్రౌండ్లో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత ఆటలతో ఉత్సాహంగా ఉంటారన్నారు. ప్రస్తుతం సమాజాన్ని డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్లు పట్టి పీడిస్తున్నాయని యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్ పాల్పడొద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు, ప్రవర్తనపై శ్రద్ధ పెట్టాలన్నారు. మార్కెట్ సిబ్బందికి డ్రెస్కోడ్ జనగామ/జనగామ రూరల్: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా డ్రెస్కోడ్ పాటించి విధులకు హాజరు కావాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ సూచించారు. బుధవారం సెక్యూరిటీ గార్డులకు నూతన యూనిఫామ్స్ను అందజేశారు. వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులు, వ్యాపారులు, ప్రజలకు కమిటీ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మార్కెట్కి భవిష్యత్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఏఎంసీకి లాభాలు వచ్చే విధంగా ప్రణాళికలు తయారుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సూపర్వైజర్లు బోట్ల శ్రీనివాస్, డైరెక్టర్లు బోట్ల నర్సింహారావు, బంద కుమార్, పర్శ సిద్దేశ్, అడ్తి అసోసియేషన్ అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు. క్యాడ్, క్యామ్ ల్యాబ్ ఎంతో ఉపయోగకరం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సి టీలోని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్(క్యాడ్) అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫ్యాక్చరింగ్(క్యామ్) ల్యాబ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి అన్నారు. ల్యాబ్ను బుధవారం రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక డిజైన్ ప్లానింగ్తో ఏర్పాటుచేసి ల్యాబ్ మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ మాట్లాడుతూ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ రెండు విడతల్లో అందించిన కంప్యూటర్లతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు మనిషా, సాబూ, పద్మజ, రమణి, ముత్యం వంశీలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్.రాధిక, అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.నేతాజీ, లైబ్రరీ అసిస్టెంట్ డాక్టర్ ఎస్.సుజాత పాల్గొన్నారు. -
నంబర్
నగదు చెల్లింపుల్లో... రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల్లో జనగామ ముందంజజనగామ: ధాన్యం కొనుగోళ్ల నగదు చెల్లింపులో జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలుస్తోంది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన జిల్లాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో రైతుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయిస్తూ.. అన్నదాతలకు పూర్తి భరోసా కల్పించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లు 276 (దొడ్డు, సన్నరకం) ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత నెల 19వ తేదీ వరకు వందశాతం సెంటర్లు ప్రారంభం కాగా.. కొనుగోళ్లు పట్టాలెక్కాయి. యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి కరువు నేపధ్యంలో 25 శాతం మేర పంట దిగుబడి తగ్గినట్లు అంచనా వేశారు. జిల్లాలో ప్రభుత్వ సెంటర్లు ప్రారంభం కాకముందు జనగామ వ్యవసాయ మార్కెట్తో పాటు మండల కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారం జోరుగా సాగింది. జనగామ ఏఎంసీలో 20 రోజులు పాటు రికార్డు స్థాయిలో ధాన్యం సరుకు వచ్చింది. ఒకదశలో సరకు అంచనాలకు మంచి దాటి పోవడంతో కొనుగోలు భారంగా మారింది. ప్రభుత్వ సెంటర్లను ప్రారంభించడంతో మార్కెట్కు వచ్చే సరుకు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. క్వింటా ధాన్యం ఏ గ్రేడు రూ.2,320 మద్దతు ధర ఉండడంతో.. మెజార్టీ రైతులు తమ సరుకును కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తున్నారు. ముందస్తుగా అధికారులు వేసుకున్న అంచనాలకు మించి సెంటర్లకు ధాన్యం వచ్చినప్పటికీ.. కొనుగోళ్లలో ఎక్కడా కూడా అవాంతరాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నేటికి ధాన్యం కోతలు జరుగుతుండడంతో మరో 15 రోజుల పాటు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా చివరిస్థానం.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల నగదు చెల్లింపుల్లో జిల్లా 82.24 శాతంతో మొదటి స్థానంలో నిలువగా, రెండో స్థానంలో పెద్దపల్లి జిల్లా 81.63, మూడవ స్థానంలో ఖమ్మం 78.65, నాలుగవ స్థానంలో నిజామాబాద్ 74.37, వికారాబాద్ జిల్లా 65శాతంతో చిట్ట చివర స్థానంలో నిలిచింది. ఓపీఎంఎస్లో ఎప్పటికప్పుడు.. జిల్లాలో ప్రభుత్వ ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ఇప్పటి వరకు 16,192 మంది రైతుల వద్ద సన్న, దొడ్డు రకం ధాన్యం 80,990 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను రూ.192.63 కోట్లు రైతులకు నగదు రావాల్సి ఉండగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.127.84 కోట్ల మేర వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇంకా రూ.64.79 కోట్లు రావాల్సి ఉంది. సెంటర్ల వారీగా కొనుగోలు చేసిన ధాన్యంలో 75,518 మెట్రిక్ టన్నుల సరుకు రైస్ మిల్లుకు తరలించగా, ఇంకా 11,030 మెట్రిక్ టన్నుల సరుకు సెంటర్లలో ఉంది. సన్న ధాన్యం 10,186 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేయగా, అసలు నగదు బ్యాంకులో జమ కాగా, రూ.500 బోనస్ రావాల్సి ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఆన్లైన్ చేయడంతో రైతులకు వచ్చే నగదును త్వరగా బ్యాంకులో జమ చేయగలిగారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు వివరాలు 80వేల మెట్రిక్ టన్నుల సన్న,దొడ్డు ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో రూ.127 కోట్లు జమ కొనుగోళ్లపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సంతోషంలో అన్నదాతలు -
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
జనగామ రూరల్: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి కలెక్టర్ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు విజయోస్తు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పది ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. జిల్లాలోని 129 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయన్నారు. స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్ విద్యార్థులకు ఎంతగానో దోహదపడిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అనంతరం జిల్లా రైస్ మిలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకట్నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో 23 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. సమావేశంలో డీఈఓ భోజన్న, బీసీ సంక్షేమ అధికారి రవీందర్, ఎస్సీ సంక్షేమ అధికారి విక్రమ్, డీఐఈఓ జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ–పాస్ యంత్రాలను సక్రమంగా వినియోగించాలివిత్తన డీలర్లు ఎరువులు, విత్తనాల విక్రయాల్లో ఈ–పాస్ యంత్రాలను సక్రమంగా వినియోగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో సీఐఎల్ కంపెనీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ–పాస్ యంత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 249 ఎరువుల డీలర్లకు యంత్రాల పంపిణీ చేస్తామన్నారు. లైసెన్స్ కాలపరిమితి సరిచూసుకొని అందులో చేర్చిన కంపెనీ ఉత్పత్తులను, స్టాక్లను మాత్రమే విక్రయించాలన్నారు. షాప్లో ఉన్న ఫిజికల్ స్టాక్కు, మిషన్లో పొందుపరిచిన స్టాక్కు తేడాలేకుండా ఉండాలన్నారు. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సూచించిన ధరలకే అమ్మాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రామరావు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వసంత సుగుణ, వ్యవసాయ సహాయ సంచాలకులు కె.నిర్మల, సీఐఎల్ ప్రతి నిధులు సజ్జన్, శ్రీధర్రెడ్డి, డీలర్లు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు అందజేత -
అపార నష్టం
అకాల వర్షం..● ఏఎంసీ ఐకేపీ సెంటర్లో తడిసిన వేలాది బస్తాల ధాన్యం ● జిల్లా వ్యాప్తంగా మామిడికి తీవ్రనష్టం ● కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం, తడిసిన బస్తాలు ● కన్నీటి పర్యంతమవుతున్న అన్నదాతలు ● తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ ● క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్, ఉన్నతాధికారులుజనగామ: వరిగింజ పొట్టదశలో మొహం చాటేసిన వరణుడు, ధాన్యం అమ్ముకునే సమయంలో అకాల వర్షాలు వెంటాడుతున్నాడు. దిగుబడులు తగ్గి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్న రైతుల ఆశలను అడియాశలవుతున్నాయి. వరికోతలు ప్రారంభమైన నాటి నుంచి అడపదడపా వర్షాలు కురుస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి 9 నుంచి రెండు గంటల పాటు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో వరి, మామిడి, కూరగాయల తోటలకు తీవ్ర నష్టం జరిగింది. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి వరదకు కొట్టుకుపోయాయి. వందలాది ఎకరాల్లో మామిడి కాయలు రాలి పోగా.... విద్యుత్ శాఖకు అపార నష్టం మిగిల్చింది. ఏఎంసీ ఐకేపీ సెంటర్లో తడిసిన ధాన్యం జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన చీటకోడూరు ఐకేపీ సెంటర్లో వందలాది బస్తాల ధాన్యం తడిసి పోయింది. ఎగువ ప్రాంతం నుంచి వరదతో సుమారు 15 నుంచి 20 బస్తాల గింజలు కొట్టుకుపోయాయి. యార్డులో ధాన్యం రాశుల చుట్టూ వరద నిలిచిపోవడంతో చిన్నపాటి కుంటలను తలపించాయి. సెంటర్కు వచ్చి 10 నుంచి 20 రోజులు గడిచి పో తున్నా.. ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, తహసీల్దార్ హుస్సేన్తో కలిసి ఆర్డీఓ గోపీరామ్ సెంటర్కు వచ్చి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తామని భరోసా కల్పించారు. నేలరాలిన మామిడి జిల్లాలో కురిసిన భారీ వర్షంతో వరి, మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. సుమారు 3 వందల ఎకరాల మామిడి తోటల పరిధిలో కాయలు రాలినట్లు హార్టీకల్చర్ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. స్టేషన్ఘన్పూర్ మండలం తానేదార్పల్లి ధాన్యం కొనుగోలు సెంటర్ను రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ భాషా సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే జిల్లాలోని మాదాపురం, సింగరాజుపల్లి, లింగాలఘణపురం, చీటూరు, పటేల్గూడెం, కుందారం, వెంకటాద్రిపేట, వడ్లకొండ, అడవికేశ్వాపూర్, తిమ్మంపేట, విస్నూరు, చెన్నూరు, మంచుప్పుల, కన్నెబోయినగూడెం తదితర గ్రామాల్లోని ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లను ఆర్డీఓ, తహసీల్దార్లు, ఉన్నతాధికారులు సందర్శించి, అక్కడి పరిస్థితిని అంచనా వేసి కలెక్టర్కు రిపోర్టు చేశారు. తరిగొప్పుల మండలం అబ్దులనాగారం, రఘునాథపల్లి, పాలకుర్తి, బచ్చన్నపేట, నర్మెట, స్టేషన్ఘన్పూర్ మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొ ట్టుకుపోగా, పలు చోట్ల మామిడికాయలు రాలి పోయాయి. నర్మెట మండలంలో ఓ రైస్ మిల్లు రేకులు ఎగిరి పోగా, గోడలు కూలిపోయాయి. జిల్లాలో వర్షపాతం వివరాలు (మి.మీలో)వర్షపు నీటిని తొలగిస్తున్న రైతుజిల్లాలో 22.4 మిల్లీ మీటర్లు వానాకాలంలో పత్తాలేని వరణుడు, 43 డిగ్రీల ఉష్ణోగ్రతల సమయంలో అకాల వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాడు. 5వ తేదీ రాత్రి జిల్లాలో 22.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైయింది. ధా న్యం తడిసి పోగా, విద్యుత్ స్తంభాలు నేలకొరి గి, కరెంటు తీగలపై చెట్ల కొమ్మలు విరిగి పడడంతో ఆ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.పాలకుర్తి(గూడూరు) 62.8 పాలకుర్తి 46.0 తరిగొప్పుల 37.3 తరిగొప్పుల(అబ్దుల్ నాగారం) 33.8 నర్మెట 33.8 జఫర్గఢ్ 31.3 దేవరుప్పుల 27.8 లింగాఘణపురం 27.3 దేవరుప్పుల 26.0 బచ్చన్నపేట 25.0 జనగామ 20.0 స్టేషన్ఘన్పూర్ 20.0 రఘునాథపల్లి 17.5 కొడకండ్ల 1.3 -
డిగ్రీ పరీక్షలపై అయోమయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సులకు సంబంధించి 2, 4,6 సెమిస్టర్లు, బ్యాక్లాగ్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 14వ తేదీనుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు గడువు విధించారు. అయినప్పటికీ ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు పరీక్షల విభాగానికి చెల్లించలేదు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, అధికారులు మాత్రం ఫీజులు చెల్లించిన కళాశాలల విద్యార్థులకు మాత్రం ఈనెల 14నుంచి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 107 కాలేజీలు ఫీజుల చెల్లింపు.. కేయూ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అటానమస్, గురుకులాలు కలిపి 292 డిగ్రీకాలేజీలు ఉన్నాయి. అందులో 217 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు రెండు సార్లు టైంటేబుల్ను ప్రకటించి ఫీజులు చెల్లించాలని కోరారు. ఎక్కువశాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తమకు ప్రభుత్వంనుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, అందువల్ల పరీక్షల నిర్వహణకు సహకరించబోమని బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీ అధికారులు రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశారు. అయినా చాలా కాలేజీలు ముందుకు రాకపోవటంతో ఈనెల 4న కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏయే ప్రైవేట్ కాలేజీలు ఇప్పటివరకు పరీక్షల ఫీజులు చెల్లించలేదో గుర్తించారు. ఇటీవల దోస్త్ నోటిఫికేషన్.. 2025–2026 విద్యాసంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్కు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. కేయూ అధికారులు పరీక్షల ఫీజులు చెల్లించని 138 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పేర్లను దోస్త్నుంచి తొలగించారు. దీంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేదు. దీంతోనైనా పరీక్ష ఫీజులు చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకువస్తాయని భావించారు. మంగళవారం పరీక్ష ఫీజు గడువు ముగిసే వరకు 138 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే చెల్లించాయి. మొత్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి మంగళవారం వరకు 107కాలేజీలు ఫీజులు చెల్లించాయి. సెమిస్టర్ల పరీక్షలు జరిగేనా ? తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో వారు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. ప్రధానంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ఆరవ సెమిస్టర్ కీలకమైంది. ఈ పరీక్షలు జరగకుంటే వారు ఉన్నత చదువులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వారు టీజీ ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీసెట్లకు ప్రిపేరవుతున్నారు. ఆ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ విద్యార్థులనుంచి వినిపిస్తోంది. డిగ్రీ వివిధ సెమిస్టర్ల పరీక్షలకు సుమారు 1.70లక్షలమందికిపైగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఫీజు రీయంబర్స్మెంటు ఫీజులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంపై కూడా విమర్శలొస్తున్నాయి. ఫీజులు చెల్లించిన కాలేజీలకే పరీక్షలు నిర్వహిస్తే, చెల్లించని కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏమిటనే చర్చ నడుస్తోంది. ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు కేయూ పరిధిలో విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసి కూడా ఫీజు రీయంబర్స్మెంటు రాలేదని ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశాం. వారికి సమయం కూడా ఇచ్చాం. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు ఫీజులు చెల్లించిన అన్ని యాజమాన్యాల కాలేజీల్లో ఈ నెల14నుంచి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తాం. రెండు, మూడు రోజుల్లో హాల్టికెట్లు జారీ చేస్తాం. ఇప్పటికై నా ఫీజులు చెల్లించని కాలేజీలు ఒకటి, రెండు రోజుల్లోనైనా ఫీజులు చెల్లించి నామినల్రోల్స్ ఇవ్వాల్సింటుంది. – కె.రాజేందర్, పరీక్షల నియంత్రణాధికారి కేయూ పరిధిలో ఫీజులు చెల్లించని 138 కళాశాలలను దోస్త్నుంచి తొలగింపు వీటిలో ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలే.. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు వాయిదా ముగిసిన ఫీజు చెల్లింపు గడువు ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటీ? -
ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
జనగామ: ప్రమాదాలపై అప్రమత్తంగా ఉంటూ పనులు చేస్తే అన్నింట్లో సక్సెస్ సాధించవచ్చని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని యశ్వంతాపూర్ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ అధ్యక్షతన జరిగిన విద్యుత్ భద్రతా వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో డీసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. మొబైల్ ఫోన్లో వచ్చే ఆన్లైన్ యాప్లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ద్విచక్రవాహనంపై వెళ్లే సమయంలో హెల్మెట్, కారులో సీటు బెల్ట్ తప్పనిసరి అన్నారు. ఎన్పీడీసీఎల్ కమర్షియల్ డైరెక్టర్ సదర్లాల్ మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా సంస్థ ఇచ్చిన సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్, కల్నల్ భిక్షపతి, మోటివేటర్ స్వప్న, జనగామ, స్టేషన్ఘన్పూర్ డివిజనల్ ఇంజనీర్లు లక్ష్మీనారాయణరెడ్డి, రాంబాబు, టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ గణేష్, ఏఆర్టీ డీఈ విజయ్, సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ జయరాజు, జిల్లా ఏడీఈ, ఏఏఓ, ఏఈ, సబ్ ఇంజనీర్లు తదితరులు ఉన్నారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో డీసీపీ రాజమహేంద్రనాయక్ -
భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం
స్టేషన్ఘన్పూర్: భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. భూభారతి చట్టం అమలు నేపథ్యంలో జిల్లాలో పైలట్ మండలం స్టేషన్ఘన్పూర్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా రెండో రోజు మంగళవారం మండలంలోని రాఘవాపూర్, తానేదార్పల్లి గ్రామాల్లో సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి రెండు గ్రామాల్లో సదస్సుల నిర్వహనతీరును పరిశీలించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులతో భూసమస్యలపై అవగాహన వస్తుందన్నారు. మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 13వ తేదీ వరకు సదస్సులు ఉంటాయని, భూ సమస్యలు ఉన్నవారు సదస్సులలో పాల్గొని దరఖాస్తులను సమర్పించాలన్నారు. గతంలో ప్రజలు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం అధికారులే గ్రామాల్లోకి వచ్చి ప్రజలనుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారన్నారు. భూరికార్డుల్లో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూసమస్యలు, సర్వే నంబర్ల మిస్సింగ్, పట్టా పాసుబుక్కులు లేకపోవడం, సాదాబైనామా, హద్దుల నిర్ధారణ తదితర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి నిర్ధేశిత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ బియ్యం పారదర్శకంగా అందించాలి స్టేషన్ఘన్పూర్: రేషన్ బియ్యం పారదర్శకంగా అందించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా ఆదేశించారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని రేషన్షాపును, శివునిపల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టాక్ నిల్వలను, స్టాక్ బోర్డులు, బయోమెట్రిక్ ఈపాస్ యంత్రాలను పరిశీలించారు. ప్రజలకు పారదర్శకంగా రేషన్ అందుతుందా, పంపిణీపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనే విషయమై క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలోని తానేదార్పల్లి గ్రామంలోకి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుందన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు శ్రీకాంత్, సతీష్ తదితరులున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా రెండోరోజు రాఘవాపూర్, తానేదార్పల్లిలో రెవెన్యూ సదస్సులు -
వైభవంగా అష్టదళ పాద పద్మారాధన
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం భక్త జనసందోహం నడుమ ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, కిరణ్మయి దంపతుల ఆధ్వర్యంలో అష్టదళ పాద పద్మారాధన పూజ వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో 108 బంగారు పుష్పాలు, వెండి పాదపద్మాలను అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామివారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, భక్తులు పాల్గొన్నారు. లారీలు రాకుంటే సమాచారమివ్వండి డీసీపీ రాజమహేంద్రనాయక్ రఘునాథపల్లి: లారీలు సకాలంలో రాకుంటే తమకు సమాచార అందించాలని, కొనుగోలు కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తామని డీసీపీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. మంగళవారం మండలంలోని నిడిగొండ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రికార్డులు, నిల్వ ఉన్న ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలన్నారు. తూకంలో తేడా ఉండొద్దన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్ధతు ధర పొందాలన్నారు. ఆయన వెంట జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, సొసైటీ సీఈఓ అఖిల్, రైతులు మాసంపల్లి సంతోజి, నేతాజీ, పెసరు నాగరాజు తదితరులు ఉన్నారు. క్రీడలతో మానసికోల్లాసం డీఈఓ భోజన్న జనగామ రూరల్: క్రీడలతో విద్యార్థులకు శారీరక మానసిక పెరుగుదలతో పాటు నైపుణ్యాల అభివృద్ధి అవుతాయని డీఈఓ భోజన్న అన్నారు. మంగళవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లా అవాస వేసవి క్యాంప్ను డీఈఓ భోజన్న, జీసీడీఓ గౌసియా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. గౌసియా మాట్లాడుతూ సాంస్కృతిక, విద్యాపరమైన అంశాల్లో ప్రతిభ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రజిత, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి శిక్షణను జయప్రదం చేయాలి జనగామ రూరల్: న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో మే 10, 11 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులకు న్యాయవాదులు హాజరై జయప్రదం చేయాలని జిల్లా నాయకులు గాజుల రవీందర్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో శిక్షణ తరగతుల కరపత్రాలను న్యాయవాదులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకుంటేనే రాణించగలుగుతారన్నారు. ఈ శిబిరంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, ప్లీడింగ్ అండ్ డ్రాప్టింగ్స్, నూతన చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దండబోయిన యుగేందర్, అశోక్ వర్ధన్రెడ్డి, బద్రీనాథ్, బిట్ల గణేష్, వై.భిక్షపతి, సీహెచ్. చంద్రశేఖర్, జి.అమృత రావు, బి.మధుసూదన్, ఎండీ.జమాల్ షరీఫ్, జి.నర్శింహులు, ప్రశాంత్, రవి, కవిత, రేఖ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రతిభావంతులు
జనగామ రూరల్: ప్రభుత్వ బడుల్లోనే ఉపాధ్యాయుల కృషితో ప్రతిభావంతులైన విద్యార్థులు తయారవుతారని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులను పీఆర్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ గార్డెన్లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్నారు. సీఎంతో చర్చించి పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ త్వరలో వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఏబీవీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకరాజు మాట్లాడుతూ కార్పొరేట్ కంటే ధీటుగా స్థానిక కాలేజీలు ఉత్తమ విద్యనందిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి -
ఓరుగల్లుకూ ‘గొర్రెల స్కాం’ సెగ!
సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల బాగోతంపై మళ్లీ విచారణ ఉమ్మడి వరంగల్లో కలకలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీలో అక్రమాల కేసును సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది క్రితం వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీలు వేర్వేరుగా పలుకోణాల్లో విచారణ చేపట్టాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ స్థాయి మొదలు ఆ శాఖ కీలక అధికారుల వరకు సుమారు 42 మందిపై మూడు శాఖలు అభియోగాలు మోపాయి. ఇందులో ఎనిమిది మంది ఉమ్మడి వరంగల్లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. సుమారు రూ.700 నుంచి రూ.1,200 కోట్ల వరకు స్కాం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చిన నిఘావర్గాలు.. కొందరినీ అరెస్టు చేసి.. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశాయి. ఆ కేసుల్లో ఉండి ఏడాదిలో ఉద్యోగ విరమణ చేసిన నలుగురు అధికారుల బెనిఫిట్స్ కూడా నిలిపి వేశారు. తాజాగా ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా కాంట్రాక్టర్ మొయీనొద్దీన్ దుబాయికి పరారు కావడంతో అక్కడ బ్రేక్ పడింది. తాజాగా మొయీనొద్దీన్కు సంబంధించిన ఇంటిపై దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. ఆయన దగ్గర, ఆయన ద్వారా కొనుగోలు చేసిన పలువురిని విచారణకు పిలుస్తుండటం ఆశాఖలో కలకలం రేపుతోంది. యూనిట్ల వివరాలపై ఈడీ నోటీసులు.. గొర్రెల పంపిణీలో గోల్మాల్ వ్యవహారం మనీ ల్యాండరింగ్గా భావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఆ స్కాం గుట్టు తేల్చేందుకు చివరి ప్రయత్నంగా జిల్లాల వారీగా పంపిణీ చేసిన యూనిట్ల వివరాలు కోరింది. 2017 నుంచి 2024 వరకు పంపిణీ చేసిన యూనిట్ల సమాచారం కావాలని ఈ మేరకు జిల్లా వెటర్నరీ, పశుసంవర్దకశాఖ అధికారులకు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ వివరాలు గత నెలాఖరు వరకే ఈడీకి సమర్పించాల్సి ఉండగా, కొందరు అబ్స్ట్రాక్టు మాత్రమే ఇచ్చి, మరికొందరు సంపూర్ణంగా ఇవ్వగా.. రెండు జిల్లాల నుంచి సమాచారం వెళ్లలేదని తెలిసింది. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వివరాలు పంపించని అధికారులు ఈనెల 10 వరకు ఇవ్వాలని మరోసారి రిమైండర్ లేఖ పంపించినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై దృష్టి ఇదిలా ఉండగా 2017 నుంచి 2024 వరకు గొర్రెల పంపిణీ పథకంలో కీలకంగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై మళ్లీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులపై రెండు నెలల క్రితం హనుమకొండ డీవీఏహెచ్ఓ కార్యాలయంలో ఆరా తీశారు. అలాగే గతంలో అరోపణలు ఎదుర్కోవడంతో పాటు సస్పెన్షన్కు గురై తిరిగి కొలువులో చేరిన కొందరికీ హైదరాబాద్ నుంచి ఏసీబీ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పశుసంవర్థకశాఖలో మళ్లీ కలకలం యూనిట్ల వివరాలు ఇవ్వాలని ఈడీ నోటీసులు డీవీఏహెచ్ఓలను ఆరా తీస్తున్న ‘విజిలెన్స్’ కొందరు వీఏఎస్లను విచారణకు పిలిచిన ఏసీబీ? రిటైర్ అయినా తప్పని ఎంకై ్వరీ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్పైనా పేచీ..వీటిలోనే అక్రమాల లెక్కలు.. ఉమ్మడి వరంగల్లో 2017 జూలైలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లోని గొల్ల, కురుముల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ సంఘంలో సభ్యత్వం ఉన్న వారికి రెండు విడతల్లో గొర్రెలు పంపిణీ చేశారు. మొదటి విడతలో 50 శాతం, రెండో విడతలో మరో 50 శాతం మంది చొప్పున 575 సహకార సంఘాలకు చెందిన 60 వేల మందికి మొదటి విడత(ఎ–లిస్టు)లో 49,276 యూనిట్లు పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది కమిటీగా.. ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ చేపట్టారు. రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్ రూరల్లో 12,748, మహబూబాబాద్లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామ జిల్లాలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 12,123 యూనిట్ల తర్వాత అక్రమాలు వెలుగుచూడటంతో నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా విచారణకు ఆదేశించడం.. ఏడాది క్రితం అంతా అయిపోయిందని భావించిన తరుణంలో రెండు రోజులుగా మళ్లీ విచారణ స్పీడందుకుంది. ఉమ్మడి వరంగల్ అక్రమాలపైన మళ్లీ నోటీసులు జారీ కావడం లాంటి పరిణామాల నేపథ్యంలో బాధ్యులైన అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ ఆయా శాఖల అధి కారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో భాగంగా సర్వే ప్రక్రియను పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల ప్రత్యేక అధికారులపై ఉందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాబోయే 15 రోజులు కీలకమని, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, సహకార, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రతీరోజు సెంటర్లను పరిశీలించి, నివేదికను సమర్పించాలన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వేసవి కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్, ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
నేడు అవగాహన సదస్సు
జనగామ: జనగామ మండలం యశ్వంతాపూర్ శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో నేడు (మంగళవారం) విద్యుత్ భద్రతా వారోత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎన్పీడీసీ ఎల్ ఎస్ఈ వేణుమాధవ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని కట్టర్లు, ఆర్జిజియన్స్, ఓ అండ్ ఎం, ప్రొవెన్షనల్ స్టాఫ్, ఇంజ నీర్లు, యూనియన్ నాయకులు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు, ప్రజా ప్రతినిధులు హా జరై సదస్సును విజయవంతం చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తాం లింగాలఘణపురం: ఉపాధ్యాయ, ఉద్యోగుల అపరిష్కృత సమస్యల సాధనకు తెలంగాణ ఉద్యోగ జేఏసీతో కలిసి పని చేస్తామని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని నెల్లుట్ల పాఠశాలలో టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు జూన్ 9వ తేదీ జరగబోయే మహాధర్నాను విజయవంతం చేస్తామని తీర్మానించినట్లు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, 2024 మార్చి నుంచి ఏర్పడిన ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీని నిర్వహించాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లచ్చుమల్ల వెంకన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దార గణేష్, జిల్లా అధ్యక్షుడు రావుల వెంకటేశ్వర్లు, తదితరులుపాల్గొన్నారు. రేపు ‘విజయోస్తు’ సన్మాన సభ జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా 3వ స్థానంలో నిలువగా.. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ సమావేశ హాలులో విజయోస్తు సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ భోజన్న సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది ఫలితాల్లో జిల్లాను అత్యుత్తమ స్థానంలో నిలిపిన టీచర్లు, విద్యార్థులు, ప్రతీఒక్కరికి కృతజ్ఞతగా జిల్లా విద్యాశాఖను అభినందిస్తూ జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులు, 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సత్కరించనున్నట్లు తెలిపా రు. కలెక్టర్ రిజ్వాన్ భాషా అధ్యక్షతన జరిగే కార్యాక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. అలాగే జిల్లా, మండల, మేనేజ్మెంట్, సంక్షేమ వసతి గృహాల వారీగా అత్యుత్తమ మార్కులు పొందిన 23 మంది విద్యార్థులకు సన్మానంతో పాటు సైకిళ్లను బహుమతిగా అందజేయనున్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ జనగామ రూరల్: వచ్చే విద్యాసంవత్సరానికి గాను జిల్లా కేంద్రం నుంచి మండలాలకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీని జిల్లా విద్యాశాఖాధికారి డి.భోజన్న సోమవారం ప్రారంభించారు. పట్టణంలోని వీవర్స్ కాలనీలోని గోదాంను సందర్శించారు. జిల్లాకు 2,14,460 రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,45,742 వచ్చాయన్నారు. ఇందులో జనగామ మండలానికి 10,510 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామని, మిగతా మండలాలకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. అలాగే జనగామ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు 32,938 నోటు పుస్తకాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠ్యపుస్తకాల మేనేజర్ సంపత్, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ వాసులను వెనక్కి పంపాలి జనగామ రూరల్: పాకిస్తాన్, బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తులను గుర్తించి వెనక్కి పంపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రమేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం బీజేపీ నాయకులతో కలిసి అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ భారత్లో నివాసం ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు తెరలేపుతున్నారన్నారు. పౌరసత్వ లేకున్నా తప్పుడు పత్రాలు సృష్టించి నివాసం ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అనిల్, లద్దలూరు మహేష్, నారాయణ, లక్ష్మీనరసయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడిన వారికే గుర్తింపు
జనగామ: కాంగ్రెస్లో చెట్ల కింద కూర్చుని పదవులు ఇచ్చే రోజులు పోయాయని, కష్టపడిన వారికే గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన జనగామ నియోజకవర్గ ముఖ్యనాయకుల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చెట్ల కింద కూర్చొని పలు ఇస్తే పార్టీలో మేము కూడా సస్పెండ్కు గురవుతామన్నారు. 2017 కంటే ముందు పని చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో పని చేసిన కేడర్కు గుర్తింపు ఉంటుందన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్నవారికే మండల, గ్రామశాఖ అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి జూన్ 1 వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, అలాగే ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సంవిధాన్ బచావో పేరుతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. రేవంత్రెడ్డి రెండోసారి సీఎం కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బైకిని లింగం యాదవ్, సిద్ధిపేట జిల్లా పరిశీలకులు మల్లాడి పవన్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, నాయకులు చెంచారపు శ్రీనివాస్రెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, బడికె ఇందిర, జక్కుల అనిత, సర్వల నర్సింగరావు, వంగాల మల్లారెడ్డి, గాదెపాక రాంచందర్, బొట్ల శ్రీనివాస్, రాముని శ్రీనివాస్, కరుణాకర్రెడ్డి, మల్లేశం, మహేందర్, తదితరులు ఉన్నారు. చెట్ల కింద కూర్చుని పదవులు ఇచ్చే రోజులు కావు అర్హత ఉన్న వారికే స్థానిక ఎన్నికల టికెట్లు జనగామ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ అద్దంకి -
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పాలకుర్తి టౌన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, ఆమార్ ఆలీఖాన్, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి ఎంపీ కావ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీకార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందంజలో ఉంచుతామన్నారు. కార్యకర్తలు పాత, కొత్త తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జనగామ, వరంగల్, మహబూబాబాద జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, భరత్చందర్రెడ్డి, అనుమాండ్ల ఝాన్సీరెడ్డి, రవళిరెడ్డి, బైకిని లింగం యాదవ్, పోట్ల నాగేశ్వర్రావు, మేడి రవిచంద్ర, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం కాగా ఈ సన్నాహక సమావేశానికి దేవరుప్పులకు చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం ఉపాధ్యక్షుడు ఉప్పుల సాయిప్రకాశ్ తన అనుచరులతో కలిసి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే టీపీసీసీ సభ్యుడు, డాక్టర్స్ సెల్ జనగామ జిల్లా కన్వీనర్ లక్ష్మీనారాయణనాయక్ను వేదికపైకి పిలవకపోవడంతో ఆయన కొంతసేపు చూసి అక్కడినుంచి వెళ్లిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
ఎక్కడి సమస్యలు అక్కడే..
జనగామ రూరల్: సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కన్నీటితో వేడుకున్నా.. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోయారు. పది నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నామని పార్ట్ టైం సిబ్బంది, కుమారులు తిండి పెట్టడం లేదని వృద్ధ దంపతులు, వితంతు, దివ్యాంగ పింఛన్ రావడం లేదని, కాల్వ కింద భూమి పోతే నష్టపరిహారం రాకుండా అడ్డుకున్నారని ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు పలువురు వినతులు సమర్పించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ ప్రజల నుంచి 60 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికై అన్ని మండలాల సంబంధిత తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగిన చర్యలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, జిల్లా పౌరసరఫరాల అధికారిణి సరస్వతి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీఏఓ రామారావు నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● పాలకుర్తి మండలం, ముత్తారం గ్రామానికి చెందిన కె.మంగమ్మ, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా తమ పేరు మంజూరు జాబితాలో లేదని, తమకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● దేవరుప్పుల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన తోరిపూరి రాములు తన 1.2 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని, వారిపై తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ● లింగాలఘణపురం మండలం, కళ్లెం గ్రామానికి చెందిన ఆరె లక్ష్మీనర్సమ్మ తమ నలుగురు కుమారులు ఆస్తి మొత్తాన్ని వారి పేరు మీద చేసుకున్నారు. ఇప్పుడు తమను పోషించడం లేదని వినతిపత్రం సమర్పించారు. ● జిల్లా కేంద్రంలోని 11వ వార్డుకు చెందిన బిర్రు మల్లేష్ 15 ఏళ్లుగా కిరాయికి ఉంటున్నారని, తనకు వీవర్స్ కాలనీలో 100 గజాల స్థలం ఉందని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి అందజేశారు. ● జనగామ పట్టణానికి చెందిన బడికే శ్రీకాంత్కు దివ్యాంగ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నాడు.కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు సమస్యలు పరిష్కారం కావడం లేవని మండిపాటు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా గ్రీవెన్స్కు 60 వినతులుఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ నర్మెట మండలం అమ్మపురానికి చెందిన వైద్యం సునీత, భర్త రాజ్కుమార్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలు. రోజూ జనగామకు వచ్చి హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. తమది పేద కుటుంబమని, గ్రామంలో ఇల్లు కూడా లేదని, వితంతు పెన్షన్ మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది.పక్క ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడు చిల్పూర్ మండలం శ్రీపతిపల్లికి చెందిన చెట్టబోయిన వెంకటకిష్టయ్య. ఈయనకు నలుగురు కుమారులు ఉండగా తనకున్న పది ఎకరాల భూమిని నాలుగు సమాన భాగాలుగా ఇచ్చాడు. ప్రస్తుతం చిన్న కుమారుడి ఇంటి వద్ద ఉంటున్నాడు. నలుగురు కుమారులు ఉన్నా.. తనను చూసుకోవడం లేదని, గతంలో ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే పెద్ద మనుషుల సమక్షంలో నెలకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి గ్రామంలో తమకు ఎలాంటి ఆస్తులు లేవు. భార్యభర్తలు ఇద్దరం దివ్యాంగులం. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకోగా అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు వచ్చాయి. దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యతగా ఇల్లు మంజూరు చేయాలి. – వాతాల యాదగిరి, దివ్యాంగుడు, నిడిగొండ నష్టపరిహారం రాకుండా అడ్డుపడుతున్నారు.. దేవాదుల కాల్వ కింద 29 గుంటల భూమి పోయింది. ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.10లక్షలు మంజూరయ్యాయి. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు విచారణ జరిపి నష్టపరిహారం ఇప్పించాలి. – అరకల రజిత, జఫర్గఢ్ -
‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోవాలి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. సోమవారం పైలట్ మండలం స్టేషన్ఘన్పూర్లోని కొత్తపల్లి, విశ్వనాథపురం గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భాగంగా దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 13వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామని, రైతులు భూ సమస్యలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు రశీదులు అందిస్తారన్నారు. మొదట పైలట్ ప్రాజెక్టుగా స్టేషన్ఘన్పూర్ మండలంలో పూర్తి చేసి ఇక్కడి ఫీడ్ బ్యాక్తో జూన్ మొదటివారంలో జిల్లావ్యాప్తంగా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమశాతం రాగానే కొనుగోళ్లు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రం, మండలంలోని విశ్వనాథపురంలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కొనుగోలు కేంద్రాల్లో నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, ఓపీఎంఎస్లో కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్, తదితరులు ఉన్నారు. కొత్తపల్లి, విశ్వనాథపురంలో సదస్సులను పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
రైతులకు బాసటగా నిలుద్దాం
దేవరుప్పుల: గత ప్రభుత్వం పేదలకు పంచిన భూ పంపిణీ పట్టా రైతులకు అన్యాయం జరగకుండా న్యాయపరమైన రీతిలో బాసటగా నిలుద్దామని హైకోర్టు న్యాయవాది ఎండీ సాధిక్అలీ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని చిన్నమడూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని రంబోజిగూడెం శివారులో భూపంపిణీ పట్టాలను రద్దు చేసే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులతో కలిసి ఆందోళన చేశారు. అనంతరం ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరెంటి విజయ్ మాదిగ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తిరిగి తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ కొమ్ముల సురేందర్, జనగామ జిల్లా ఇన్చార్జ్ కన్నారపు పరుశురాములు, చిన్నమడూరు గ్రామ దళిత నాయకులు మేడ సోమనర్సయ్య, పాలడుగు యాదగిరి, దుబ్బాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాది సాధిక్అలీ -
భద్రకాళి అమ్మవారికి పల్లకీసేవ
అమ్మవారి పల్లకీసేవలో ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయంలో అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారికి నిత్య పూజలు, అలకరణ అనంతరం ఉత్సవమూర్తికి ఉదయం పల్ల కీసేవ, సాయంత్రం శేషవాహనసేవ నిర్వహించారు. మహిళలు కుంకుమపూజలు, లలితాసహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. సేవా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృసంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్య వహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్కుమార్, డాక్టర్ లాల్కోట వెంకటాచారి, రాగిఫణి రవీంద్రాచారి, చొల్లేటి కృష్ణమాచారి, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నారోజు సత్యమనోరమ, శశిధర్శిల్పి తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల సాధనకు సంతకాల సేకరణ
జనగామ రూరల్: ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ల సాధనకు పోరాటాలు ఉధృతం చేస్తామని, ఇందుకోసమే లక్ష సంతకాలు సేకరిస్తున్నట్లు ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్ల గణేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని దుర్గమ్మ గుడి ఆవరణలో జిల్లా అధ్యక్షుడు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులను ఐక్యం చేసి పార్లమెంట్ వేదికగా సమస్యలను చర్చించి అనేక సమస్యలను పరిష్కారం చేసేందుకు ఎన్పీఆర్డీ కృషి చేసిందన్నారు. దివ్యాంగులకు 5శాతం ఉద్యోగాల కేటాయింపు తదితర సమస్యల సాధనకు మే 19న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల రాజేశ్వరి, పిట్టల కుమార్, మాలోతు రాజ్ కుమార్, మోతె వెంకటమ్మ, భైరగోని మహేష్, రాజు, గోదల ఐలయ్య, జానకి, సతీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కడవెండిలో భక్తిశ్రద్ధలతో బోనాలు
దేవరుప్పుల: మండలంలోని కడవెండిలో యాదవ సామాజిక వర్గం ఇలవేల్పు గంగాదేవి, కాటమరా జు కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి వేర్వేరుగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలను ఎర్రబెల్లి అలంకరించి దేవతమూర్తులకు ప్రదర్శనగా వెళ్లి సమర్పించారు. అలాగే ఝాన్సీరెడ్డి గంగాదేవికి కుల సాంప్రదాయాల మేరకు జలగంప మొక్కులను సమర్పించారు. ఒగ్గు కళాకారులు ఆటపాటతో దేవతమూర్తుల విశిష్టతపై ప్రదర్శనలు ఇవ్వగా శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో పెద్దగొల్ల, సారగొల్ల ప్రతినిధులు సుడిగెల కొమురయ్య, తోటకూరి మల్లయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు మారసాని శ్రీనివాస్, పీఏసీఎసీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి, నక్క రమేష్, కాంగ్రెస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నల్ల శ్రీరామ్, తీగల దయాకర్, మాజీ సర్పంచ్ హన్మంతు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు కొర్రీలు
జనగామ: మద్దతు ధరకు ఆశపడి ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు వస్తున్న రైతులు ధాన్యం అమ్ముకోలేక చుక్కలు చూస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కన బెట్టి.. సొంత ఎజెండాను అమలు చేస్తున్నారు. సరుకులో తేమ వచ్చిన తర్వాత కొనుగోళ్లలో ఆలస్యం చేయొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించినా పట్టించుకోవడం లేదు. కాంటా వేసిన సరుకు లిఫ్టు అయ్యే వరకు కొత్త కొనుగోళ్లు ఉండవు.. సారు వచ్చి టోకెన్ ఇచ్చే వరకు నిరీక్షణ తప్పదంటూ జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అన్నదాతలను ఇబ్బందులు పెడుతున్నారు. జనగామ మండలంలోని పలు గ్రామాల రైతుల సౌకర్యం కోసం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని కాటన్ యార్డులో ప్రభుత్వ ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేశారు. జనగామతో పాటు రఘునాథపల్లి, లింగాలఘణపురం సమీప మండలాల పరిధి నుంచి సైతం రైతులు తమ సరుకును అమ్ముకునేందుకు ఇక్కడకు వస్తున్నారు. కాటన్ యార్డులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండడంతో ధాన్యం ఆరబోసుకునేందుకు వెసలుబాటు ఉండడంతో ఈ సెంటర్కు డిమాండ్ పెరిగింది. ధాన్యం ఆరబోసుకుంటూ.. 17 తేమ శాతం వచ్చిన తర్వాత మద్దతు ధరకు అమ్ముకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. కానీ ఇక్కడే తిరకాసు పెడుతున్నారు. కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ... టోకెన్ నంబర్ ఇష్యూ, కాంటా వేయడంలో జాప్యం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించి, అమ్ముకునేందుకు వస్తే రైతులకు కనీస గౌరవం దక్కడం లేదు. సారూ తేమ శాతం వచ్చింది.. ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారంటూ సెంటర్ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో గౌరవ ప్రదంగా మాట్లాడుతుంటే... కాటన్ యార్డు ఐకేపీ సెంటర్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు రైతులు. తేమ వచ్చి వారం రోజులు ధాన్యం తిర్లేసి.. మర్లేసీ ఒకటికి రెండు సార్లు ఆరబోసి ప్రభుత్వ నిబంధనల మేరకు 17శాతం వచ్చినా... కాటన్ యార్డు ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేయడం లేదు. తేమ వచ్చి వారం గడిచినా టోకెన్ కూడా ఇవ్వడం లేదు. కాంటా వేసిన బస్తాలు లిఫ్టు చేసిన తర్వాతనే గన్నీ బ్యాగులు ఇచ్చి కొనుగోళ్లు స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు. కోపమొచ్చిన రైతులు నిలదీస్తే, ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అనే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు ధాన్యం కొనుగోలుకు అర్హత సంపాదించినా... పదిరోజులుగా సెంటర్లోనే పడిగాపులు కాస్తున్నారు. కేంద్రంలో రైతులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడుతున్నారు. కాటన్ యార్డులో దూర భారముందంటూ బస్తాకు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చినుకులు పడుతున్నా.. టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదంటున్నారు.తేమశాతం వచ్చినా కొనుగోలు చేయరు కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ తాగునీరు ఉండదు.. టార్పాలిన్లు ఇవ్వరు దూర భారమంటూ అదనపు వసూళ్లు ఇబ్బందుల్లో అన్నదాతలు -
జనగామకు తాగునీరందించాలి
జనగామ: నియోజకవర్గంలో ఆగిపోయిన దేవాదుల పెండింగ్ పనులు పూర్తి చేసి జనగామకు తాగునీరు అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కోరారు. శనివారం దేవన్నపేట పంపుహౌస్ వద్ద దేవాదుల మూడో దశ పనులను పరిశీలించిన అనంతరం మంత్రులను కలిసిన వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకువచ్చే పనులు 25 శాతం పూర్తయ్యాయని, మొత్తం పూర్తి చేస్తే ధర్మసాగర్ నుంచి గండిరామారం మీదుగా తపాస్పల్లి వెళ్లే భారాన్ని తగ్గించడమే కాకుండా స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి ప్రాంతాలకు కూడా నీరు ఎక్కువగా విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. బచ్చన్నపేట, చేర్యాల ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కెనాల్ పనులు రెండేళ్లుగా నిలిచి పోయాయని, భూసేకరణ సమయంలో కొంతమంది రైతులకు పరిహారం అందజేయగా.. మిగతావారి కారణంగా పనులు నిలిచిపోయినట్లు చెప్పారు. అలాగే జనగామ మండలం చీటకోడూరు డ్యామ్కు గోదావరి జలాలను మళ్లించి పట్టణానికి సరపడా తాగునీరు అందించాలని కోరారు. తరిగొప్పుల, చిల్పూరు, వేలేరు మండలాలకు సంబంధించి లిఫ్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటికి ఎమ్మెల్యే ‘పల్లా’ విజ్ఞప్తి -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
జనగామ రూరల్: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇందుకు ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి ఇందిరమ్మ ఇళ్లపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, పరిశీలన అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో భాగంగా జనగామ నియోజకవర్గంలో 13, ఘనపూర్ 17, పాలకుర్తిలో 10 మంది అధికారులు సర్వే చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు. పరిశీలన పూర్తి కాగానే అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని వెల్లడించారు. సమీక్షలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రైతులకు యునికోడ్ కేటాయింపు ఆధార్తో దేశంలోని ప్రతీ పౌరుడికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీ రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య (యునికోడ్) కేటాయించాలని కేంద్రం నిర్ణయించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని, రైతులు తమ భూముల వివరాలతో కూడిన సమాచారంతో ఇ–ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతున్నదన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఇ–ఫార్మర్ ఐడీ కేటాయిస్తారని పేర్కొన్నారు. రైతు భరోసా, రుణమాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఫార్మర్ ఐడీ పొందడానికి రైతులు ఆధార్, భూ యాజమాన్య పాస్బుక్, ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్ తీసుకొని సమీప వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
కోర్టుకు హాజరైన జిల్లా ఉద్యమ నాయకులు
జనగామ రూరల్: జనగామ జిల్లా సాధన ఉద్యమకారులు శనివారం కోర్టుకు హాజరయ్యారు. పోరాడి జిల్లా సాధించుకున్నామే కాని అక్రమ కేసులు తొలగించలేదని నాయకులు అన్నారు. కోర్టుకు హాజరైన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఇనుగాల ప్రభాకర్రెడ్డి, ఉపేందర్రెడ్డి, వీరేందర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, చౌడ రమేశ్, ఆకుల సతీష్, దశమతరెడ్డి, ఉడుగుల రమేశ్, కేవీఎల్.రాజు, మేడ శ్రీనివాస్, బక్క శ్రీనివాస్, హరిశ్చంద్ర ప్రసాద్, మేకల రాంప్రసాద్, గుజ్జుల నారాయణ, జగదీష్, మంగళంపల్లి రాజు, మజిత్, ఎల్లయ్య, కృష్ణ ఉన్నారు. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి జనగామ రూరల్: మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ పిలుపునిచ్చారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు రాపర్తి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించి బ్రిటిష్ కాలం నాడు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేలా కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తోందని, ఇందుకు నిరసనగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరారు.అన్నబోయిన రాజు, చిట్యాల సోమన్న, బాలరాజు, మల్లేష్ రాజ్, ఐలయ్య రేణుక పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు రాలేదని అధికారుల నిలదీతలింగాలఘణపురం: మండల పరిధి జీడికల్లో అర్హులైన తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదంటూ శనివారం జీడికల్లో ఎంపీడీఓ జలేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ను పలువు రు గ్రామస్తులు జీపీ కార్యాలయం వద్ద నిలదీశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాను చివరి దశలో విచారణ జరిపేందుకు శనివారం ఎంపీడీఓ జీడికల్ గ్రామానికి వెళ్లారు. పంచా యతీ కార్యాలయం వద్ద అప్పటికే కొంత మంది గుమికూడి జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయని తెలుసుకుని అర్హులైన తమకు ఇళ్లు ఎందు కు రాలేదని మండిపడ్డారు. తమకు ఖాళీ జాగా ఉందని, అధికారులొచ్చి చూశారని, ఫొటోలు దింపారని ఇప్పుడు మాత్రం తమ పేర్లు రాలేద ని, ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని మహేందర్, బాబు, శ్రీనివాసు, నగేశ్, నిర్మల తదితరులు ఎంపీడీఓను ప్రశ్నించారు. గ్రామంలో 91 మంది అర్హులున్నారని, మొదటి విడతగా 21 మందిని ఎంపిక చేశారని, మిగిలిన అర్హులకు రెండో విడతలో వస్తాయని సమాధానం చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులను దూషించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి ఏదైనా సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవాలని గొడవ చేయొద్దని చెప్పి వెళ్లారు. అప్పటికే గ్రామంలో మరో విచారణ ఉందని, ఎంపీడీఓ, కార్యదర్శి గ్రామ పంచా యతీ నుంచి వెళ్లిపోయారు. నో రిజిస్ట్రేషన్లు కాజీపేట అర్బన్ : కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం ఒక దస్తావేజు కూడా రిజిస్ట్రేషన్కు నోచుకోలేదు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో ట్రీ కటింగ్ చేసిన నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా లేదు. దీంతోపాటు ఇంటర్నెట్వైర్లు తెగిపోవడంతో సర్వర్ పని చేయలేదు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నారు. చివరికి రిజిస్ట్రేషన్లు లేక వెనుదిరిగారు. ఇదిలా ఉండగా.. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్లకు జాయింట్–1గా పదోన్నతి లభించింది. మల్టీజోన్లో భాగంగా ఆడిట్ విభాగం సబ్ రిజిస్ట్రార్ తిరుమల్, అడక్ ప్రమోషన్లో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆనంద్కు జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్గా పదోన్నతి లభించింది. -
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శనివారం హనుమకొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం 1 గంటనుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పర్యటన కొనసాగింది. హసన్పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్హౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్, భద్రకాళి చెరువును సందర్శించారు. చివరగా హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ ● ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్రెడ్డి పర్యటన ● దేవాదుల పంపుహౌజ్, రిజర్వాయర్లపై రివ్యూ... ● భద్రకాళి పూడికతీత, సుందరీకరణ పనులపై సీరియస్ ● హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ ● పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష– వివరాలు IIలోu -
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025
– IIలోuజనగామ: పట్టణంలో మద్యం దుకాణాలు.. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు. ఇరుకు గల్లీల్లో రోడ్లకు ఇరువైపులా మందుబాబులు వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో అటుగా వెళ్లే మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘బహిరంగ మద్యపానం–వైన్స్ ల ఎదుట సామాన్య ప్రజల ఇబ్బందులపై’ శనివా రం రాత్రి 7 గంటల నుంచి 9 వరకు ‘సాక్షి’ చేపట్టిన విజిట్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. ● బస్టాండ్ చిన్నగేటు ఏరియాలోని భువన బార్ అండ్ రెస్టారెంట్ వెనుక గల్లీ పూర్తిగా వాహనాల పార్కింగ్తో నిండిపోయింది. మధ్యలో మిగిలిన చిన్న సందు నుంచి కూరగాయల మార్కెట్, ఇతర పనుల కోసం వచ్చిన మహిళలు ఇబ్బంది పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ● రైల్వేస్టేషన్ అమ్మబావి ప్రాంతం దుర్గావైన్స్ సమీపంలో కనీసం వీధి దీపాలు సరిగా లేవు. వైన్స్కు వచ్చే వారితో పాటు అందులో మద్యం సేవించి బయటకు వెళ్లిపోయే వారితో గుండ్లగడ్డ, అంబేడ్కర్నగర్, ధర్మకంచ తదితర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, సాధారణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ● ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలోని సింధు వైన్స్, లిక్కర్ మార్టుకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డుపైనే అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో సిద్దిపేట ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. కూరగాయల కొనుగోలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే కుటుంబాలు వైన్స్ను దాటేసి రావాలంటే భయపడి పోతున్నారు. ● సూర్యాపేట ప్రధాన రహదారిపై ఉన్న బాలాజీబార్కు వచ్చే వాహనాలతో సింగిల్ లేన్ రోడ్డు పూర్తిగా నిండిపోతోంది. ● హైదరాబాద్ రోడ్డులోని బాలాజీబార్కు వచ్చే వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం తప్పడం లేదు. తరుచూ ప్రమాదాలు సైతం జరుగుతుంటాయి. దుకాణా లు, ఆస్పత్రులకు వచ్చే మహిళలు, కుటుంబాలు భయంభయంగానే వెళ్తున్నారు. ● ఆర్టీసీ జంక్షన్లోని ఎస్ఎస్ఎస్ వైన్స్ ఎదుట ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్డుపై రెండు లేన్లలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ● ఇదిలా ఉండగా నెహ్రూపార్కు ఏరియా నుంచి 60ఫీట్ల రోడ్డు, వడ్లకొండ రూట్, ప్రెస్టన్ ఏరియా, వీవర్స్కాలనీ, పెద్ద మోరీ తదితర ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చాలా మంది మద్యం సేవిస్తూ కనిపించారు. వైన్స్, బార్లు, లిక్కర్ మార్టుల వద్ద మాత్రం పట్టణంలోని ప్రధాన రోడ్లను ఆక్రమించి వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో రాకపోకల కు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. సూర్యాపేట రోడ్డు బాలాజీబార్ వద్ద రోడ్డు సగభాగానికి వచ్చిన వాహనాల పార్కింగ్ న్యూస్రీల్మద్యం దుకాణాలు, బార్ల నిర్వహణ అస్తవ్యస్తం బహిరంగ ప్రదేశాల్లో సిట్టింగ్లు విచ్చలవిడిగా వాహనాల నిలిపివేత దారివెంట వెళ్లే మహిళలకు ఇబ్బందులు ‘సాక్షి’ విజిట్లో వెలుగులోకి సమస్యలు -
అమ్మానాన్నే నాకు ప్రేరణ..
‘మా కుటుంబం న్యాయవిద్యతో ముడిపడినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. చిన్ననాటి నుంచి న్యాయశాస్త్రాన్ని చూసి పెరిగిన నేను, ఇప్పుడు అదే కుటుంబ పరంపరలో భాగంగా న్యాయం కోసం పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉంది. ఇది నాకు బాధ్యతను గుర్తు చేస్తోంది, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న కర్తవ్యం కలిగిస్తోంది.’ అని అంటున్నారు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన దారా మేఘన. ఇటీవల వెలువడిన న్యాయశాస్త్ర ఫలితాల్లో వరంగల్ దర్గా కాజీపేటకు చెందిన మేఘన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి 2023 న్యాయశాస్త్రం పట్టా పొంది న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ప్రయాణంపై ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ఎల్ఎల్బీని ఎందుకు ఎంచుకున్నారు?నేను న్యాయశాస్త్రాన్ని ఎంచుకోవడానికి కారణం మా నాన్నగారు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే న్యాయవిద్యను నా వృత్తిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. జీవితమంతా ఆయన నాకు మోటివేషన్గా నిలిచారు. మా నాన్న నల్సార్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే నాకు లా స్కూల్ వాతావరణాన్ని, విద్యార్థులను చూడగల అవకాశం కలిగింది. ఇదంతా న్యాయశాస్త్రం పట్ల నాలో ఆసక్తిని, అభిమానం పెంచింది.మీకు ప్రేరణ ఎవరు. మా తల్లిదండ్రులే నాకు ప్రేరణ. మా నాన్న న్యాయశాస్త్ర ప్రొఫెసర్, అమ్మ ఎల్ఐసీలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. వారి శ్రద్ధ, క్రమశిక్షణ నన్ను జీవితాన్ని సరిగ్గా ముందుకు నడిపించడంలో కలిసి వచ్చింది. ఏ రంగాన్ని ఎంచుకున్నా, దానికి ప్రోత్సాహం, స్వేచ్ఛను ఇచ్చారు. ఇక తమ్ముడు వంశీకృష్ణ ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచి, విద్యార్థినిగా ఎదుర్కొన్న కష్టాల్లో తోడుగా ఉన్నాడు. అలాగే, ప్రముఖ సీనియర్ అడ్వొకేట్ సి.విద్యాసాగర్ రెడ్డితో పనిచేసే అవకాశం నాకు లభించింది. ఆయననుంచి న్యాయశాస్త్రం ప్రాయోగిక అంశాల్లో మార్గదర్శనం పొందాను. ఈ రంగాన్ని ఎంపిక చేసుకోవాలని ఆయన అప్పట్లో ఇచ్చిన సలహా నా జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఇంకా, మా కళాశాల నుంచి పెద్దగా విజయాలు సాధించిన మా సీనియర్లు తరణి వేముగంటి, నేహా అగర్వాల్ విజయాలను దగ్గరగా చూసే అవకాశం లభించింది. తరణి ప్రస్తుతం సిద్దిపేటలో జూనియర్ సివిల్ జడ్జిగా, అదనపు జేఎంఎఫ్సీగా పనిచేస్తున్నారు. నేహా అగర్వాల్ డీఎస్పీ పదవిని పొందారు. వారి మాటలు నాకు దిక్సూచి చూపాయి. ఎందుకు న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. న్యాయశాస్త్రం ద్వారా న్యాయం సాధించడమే కాక సమాజానికి సేవ చేయవచ్చని నమ్మి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను మీరు ఎదుర్కొన్న సవాళ్లు.నా ప్రయాణంలో ఒత్తిడి, ఆందోళన ఎదుర్కోవాల్సి వచ్చింది. సమయం కూడా చాలా పరిమితంగా ఉండటంతో, ఆ సమయంలోనే అన్ని విభాగాలను కవర్ చేయాలన్న ఒత్తిడితో ఉన్నా. ఇదే సమయంలో, మా తమ్ముడు అమెరికాకు మాస్టర్స్ కోసం వెళ్లిపోవడం కూడా నాకు భావోద్వేగపూరితంగా కష్టంగా అనిపించింది. అయితే, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అండగా నిలిచి నా అడ్డంకులను అధిగవిుంచడంలో సహాయం చేశారు. మీ నెక్ట్స్ గోల్? ఇప్పటినుంచి నా లక్ష్యం అత్యంత నిజాయితీగా, సమగ్రతతో సేవ చేయడం. న్యాయం వేగంగా అందించడానికీ, ఆలస్యం లేకుండా ప్రజలకు న్యాయం చేసేందుకు కట్టుబడి పని చేయాలనుకుంటున్నాను. నాకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, తమ్ముడికి, స్నేహితులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ విజయాన్ని నాతో కలిసి పంచుకున్న బంధువులకు కూడా ధన్యవాదాలు. -
హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
లింగాలఘణపురం: మండలంలోని జనగామ–సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల నుంచి కుందారం క్రాస్ రోడ్డు వరకు తరుచూ ప్రమాదాలు జరుగుతుండగా రూరల్ సీఐ శ్రీనివాసురెడ్డి ఆధ్వర్యాన శుక్రవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశా రు. నెల్లుట్ల–కుందారం క్రాస్రోడ్డు వరకు మూడు కిలోమీటర్ల దూరంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ‘డేంజర్ జోన్’ శీర్షికన గత నెల 29న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే ఎస్సై శ్రావణ్కుమార్ ఆధ్వర్యాన డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. -
‘నీట్’కు సర్వం సిద్ధం
రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష● 582 మంది విద్యార్థులు.. రెండు సెంటర్లు ● అరగంట ముందే గేట్లు క్లోజ్ ● అడ్మిట్ కార్డు, ఐడీ ఉంటేనే అనుమతి ● సీసీ కెమెరాల నిఘా.. మూడంచెల భద్రత ● ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్జనగామ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్–2025) ఈ నెల 4న నిర్వహించడానికి జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పరీక్ష నిర్వహణపై కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీఎస్ ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాని కి నిర్వహించే ఈ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెనీ(ఎన్టీఏ) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నీట్ యూజీ అధి కారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ సహాయంతో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండు సెంటర్లు.. 582 మంది విద్యార్థులు జిల్లాలో ‘నీట్’ నిర్వహణకు రెండు సెంటర్లను కేటాయించారు. మొత్తం 582 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. పట్టణంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్లో 504 మంది, పెంబ ర్తి ఎంజేపీ గురుకులం సెంటర్లో 78 మంది విద్యార్థులను కేటాయించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో చీఫ్సూపరింటెండెంట్ల ఆధ్వర్యాన 49 మంది ఇన్విజిలేటర్లు ‘నీట్’ విధులు నిర్వర్తించనున్నారు. డీసీపీ రవీంద్రనాయక్ నేతృత్వంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఏ, జిల్లా అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉంటుంది. బయోమెట్రిక్.. సీసీ కెమెరాల నిఘా ఎన్టీఏ పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘా మధ్య ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించే ‘నీట్’ పరీక్ష కోసం మధ్యాహ్నం 1.30 గంటల లోపు వచ్చిన విద్యార్థులను మాత్రమే సెంటర్లోకి అనుమతిస్తారు. అడ్మిట్ కార్డు, ఐడీ కార్డు తప్పనిసరి వెంట తెచ్చుకోవాలి. విద్యార్థులు సెంటర్లోకి వెళ్లిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటికి అనుమతి లేదు పరీక్ష కేంద్రంలోకి డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్, ఇతర వాచ్లు, నిబంధనలకు లోబడిన వివిధ ఆభరణాలు, కర్చీఫ్ తదితరాలకు అనుమతి లేదు. ఇదిలా ఉండగా పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ల బాధ్యతలు, విధులపై నేడు(శనివారం) సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ల ఆధ్వర్యాన అవగాహన కల్పించి, ఐడీ కార్డులు అందజేయనున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ జిల్లాలో ‘నీట్’ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులు 1.30 గంటల లోపు హాజరు కావాలన్నారు. ఆ తర్వాత వచ్చిన వారిని లోనికి అనుమతించరని, అడ్మిట్, ఐడీ కార్డులు లేకుంటే పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అబ్జర్వర్ గౌసియాబేగం, సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు రవీందర్నాయక్, అనిత తదితరులు పాల్గొన్నారు.పటిష్ట బందోబస్తు: సీపీ వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో ఈనెల 4న(ఆదివారం) జరిగే నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రా ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో మొత్తం 13 పరీక్ష కేంద్రాలున్నాయని, ఇందులో వరంగల్, హనుమకొండలో 11, జనగా మలో 2 పరీక్ష కేంద్రాలున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు, గుంపులుగా తిరగడం నిషేధమని, పరీక్ష పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసేయాలని ఈ సందర్భంగా కోరారు. -
పంచాయతీ కార్యదర్శి అవినీతిపై విచారణ
రఘునాథపల్లి: ఇటీవల రఘునాథపల్లి జీపీ కార్యదర్శిగా పనిచేసిన కవిత రూ.9.20లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీపీఓ నాగపురి స్వరూప విచారణ చేపట్టారు. ప్రస్తుతం వెల్ది పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కమిత.. రఘునాథపల్లి కార్యదర్శిగా పనిచేసిన సమయంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల రూపంలో వసూలు చేసిన నగదును ఎస్టీఓలో జమ చేయకుండా నేరుగా ఖర్చు చేశారని, ఇది చట్టవిరుద్ధమని డీపీఓ పేర్కొన్నారు. ఖర్చు చేసే ముందు గ్రామసభ తీర్మానం తీసుకోవాల్సి ఉంటుందని, అంతేకాకుండా స్థాయికి మించి ఖర్చు చేసినట్లు వివరించారు. రూ.5వేలకు మించి ఖర్చు చేసే అధికారం కార్యదర్శికి లేదని, వసూలైన మొత్తాన్ని పంచాయతీ పను ల నిమిత్తం ఖర్చు చేసి ఆ తర్వాత బిల్లులు సడ్మిట్ చేసినట్లు చెప్పారు. ఇందులో ఏదైనా అవినీతి జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపా రు. ఆమె వెంట ఎంపీఈఓ వెంకటేశ్వర్లు, పంచాయ తీ కార్యదర్శి బాలకిషన్ ఉన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి కవిత మాట్లాడుతూ.. తాను ఒక్క పైస కూడా దుర్వినియోగం చేయలేదని, గ్రామ సమస్య ల పరిష్కారం నిమిత్తం వసూలైన డబ్బుల నుంచి నేరుగా ఖరు చేయాల్సి వచ్చిందని వివరించారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
దేవరుప్పుల/కొండకండ్ల/పాలకుర్తి: భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన ‘జై భీమ్, జై బాపు, జై సంవిధాన్’ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శుక్రవారం దేవరుప్పుల మండలం రామరాజుపల్లి, కొడకండ్ల మండలం రామవరం, పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేడ్కర్ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ సర్కారు మతం మసుగులో దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ గత పాలకుల తీరుపై అర్థరహిత విమర్శలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, కొడకండ్ల, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ల చైర్పర్సన్లు ఆండాలు, మంజులభాస్కర్, కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు నల్లా శ్రీరామ్, పులిగిళ్ల వెంకన్న, కృష్ణ, గణేష్, నాగరాజు, రసూల్, సత్యనారాయణ, సురేష్నాయక్, రాజేష్నాయక్, యాకేష్యాదవ్, రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, హర్వీశ్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
ఆలయ అభివృద్ధికి రూ.1.50లక్షల విరాళం
స్టేషన్ఘన్పూర్: హనుమకొండకు చెందిన కానిస్టేబుల్ రఘునాయకుల రవిప్రసాద్రెడ్డి, అతడి కుమార్తె రశ్మితరెడ్డి ఆధ్వర్యాన స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండలోని శివాల యం అభివృద్ధికి రూ.1.50లక్షలు విరాళం అందజేశారు. భగవంతుడి కృపతో తన కుమార్తె రశ్మితరెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నదని, గతంలో మొక్కుకున్న విధంగా ఆలయ అభివృద్ధికి విరాళంగా శుక్రవారం ఆ మొత్తాన్ని అందజేసినట్లు రవిప్రసాద్రెడ్డి తెలి పారు. కానిస్టేబుల్ గుంజ కుమారస్వామి, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన జనగామ రూరల్: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టరేట్లోని ప్రధాన ఈవీఎం గోదాంను కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమో దు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, నియంత్రణ పద్ధతులను తెలుసుకున్న ఆయన భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాల ని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జనగామ తమాసీల్దార్ హుస్సేన్ పాల్గొన్నారు. వేసవి క్రీడా శిక్షణను వినియోగించుకోవాలిపాలకుర్తి టౌన్: ప్రభుత్వం క్రీడాకారులను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లా పరిధి ఏడు మండలాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని, సెలవులను వృథా చేయకుండా క్రీడలను ఆస్వాదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, ఉన్న త పాఠశాల హెచ్ఎం శైలజ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు గోర్సింగ్, పీడీ చిట్యాల యాదగిరి, ఎస్సై పవన్కుమార్, చెరిపెల్లి యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలు లేని జిల్లా లక్ష్యం : ఎస్ఈజనగామ: విద్యుత్ ప్రమాదాలు లేని జిల్లా లక్ష్యం.. భద్రతను అందరు బాధ్యతగా తీసుకుంటే ఇది సాధ్యమని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ అన్నారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం జనగామ మండలం గానుగుపహా డ్లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ అధికారులు చేపట్టిన పొలం బాట కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నద ని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అన్ని రకాల భద్రత పరికరా లు అందించామని చెప్పారు. విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైన సమయంలో 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం విద్యుత్ ప్రమాదాల నివారణ వివరాల పోస్టర్ ను ఆవిష్కరించారు. సదస్సులో డీఈ లక్ష్మీనా రాయణ తదితరులు పాల్గొన్నారు. మెరిట్ ఆధారంగానే నియామకాలు : డీఎంహెచ్ఓ జనగామ: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యాన జాతీయ ఆరోగ్య మిషన్ స్కీంలో పలు కేటగిరీ లకు సంబంధించి ఉద్యోగ నియామకాలను మెరిట్ ఆధారంగా చేపట్టినట్లు డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు తెలిపారు. శుక్రవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ చిల్పూరు మండలం కృష్ణాజీగూడెంకు చెందిన మారపాక ప్రేమ్కుమార్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజ ర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా.. ఆయన కు సంబంధించి అర్హతలతో కూడిన ఎంపీహెచ్ఏ(ఎం) సర్టిఫికెట్ 2021 ఏప్రిల్తో కాలపరిమి తి ముగిసిందని, రెన్యువల్ చేయించుకుని గడువులోగా సమర్పించక పోవడంతో పరిగణలోకి తీసుకోలేదన్నారు. మెరిట్ జాబితాలో నంబ రింగ్లో ఒకటి నుంచి 11 వరకు ఉన్న అభ్యర్థు లను ఉద్యోగానికి అవసరమైన అర్హతలు లేని కారణంగా ఎంపిక చేయలేదని తెలిపారు. ప్రేమ్కుమార్కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ము గ్గురు అధికారులతో కమిటీని నియమించామ ని, పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగిన ట్లు నిర్థారించినట్లు తెలిపారు. -
ఖైదీలకు హక్కులు తెలియాలి..
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: ఖైదీలకు తమ హక్కులు తెలియాలి.. ఈ మేరకు జైలు, జైలు బయట వివరా లతో కూడిన పోస్టర్లను అంటించాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైలును శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. జైలులో వసతులు, భోజనం, అలాగే ఖైదీల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జైలు సిబ్బందితో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలపాలని, ప్రతి ఒక్కరికీ న్యాయవాది ఉండాలని చెప్పారు. సమస్యలు ఉంటే రాసి సబ్ జైలులోని బాక్స్లో వేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో సబ్జైలు సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి మించి రుణం
మహిళల ఆర్థిక పరిపుష్టికి కృషి ● స్వయం సహాయక సంఘాలకు రుణాలు ● బ్యాంకు లింకేజీ ద్వారా రూ.532.84 కోట్లు ● సీ్త్రనిధి ద్వారా రూ.19.95 కోట్ల చెల్లింపులు ● రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిన జిల్లాజనగామ రూరల్: స్వయం సహాయ క సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల చెల్లింపుల్లో జిల్లా అధికారులు ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే లక్ష్యాన్ని అధిగమించి జిల్లాను రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిపారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించా లనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా స్వయం సహాయక సంఘాల కు రుణాలు మంజూరు చేస్తోంది. అవసరాల మేరకు వారికి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలతో పాటు సీ్త్రనిధి రుణాలు అందజేస్తున్నారు. మహిళలు ప్రతినెలా ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తున్నారు. లక్ష్యానికి మించి రుణాల పంపిణీ జిల్లాలో 5,777 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.476.47 కోట్ల రుణాల పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెలరోజుల సమయం ఉండగానే లక్ష్యం చేరుకున్నారు. మొత్తం రూ.532.84 కోట్ల రుణాలు(111.83 శాతం) పంపిణీ చేశారు. మరోవైపు సీ్త్రనిధి ద్వారా రూ.19.95 కోట్ల రుణాలు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు రూ.20 కోట్ల రుణాలు అందజేశారు. జిల్లాలో అత్యధికంగా చిల్పూరు మండలంలో 441 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.93.92 కోట్ల రుణాలు పంపిణీ చేసి మొదటిస్థానంలో నిలిచారు. అలాగే అత్యల్పంగా తరిగొప్పుల మండలంలో 170 సంఘాలకు రూ.14.46 కోట్లు అందజేసి చివరిస్థానంలో నిలిచింది. రికవరీ ఇలా. బ్యాంకు లింకేజీ ద్వారా అందజేసిన రుణాల్లో దాదాపు రూ.50 కోట్ల వరకు మొండి బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సీ్త్రనిధి రుణాల్లో ఈ ఏడాదిలో రూ.20 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.62 శాతం రికవరీ అయినట్లు పేర్కొన్నారు. రుణాల పంపిణీతోపాటు రికవరీ కోసం క్షేత్రస్థాయిలో ఐకేపీ సిబ్బంది నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ.. తీసుకున్న రుణం డబ్బులు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు.2024–25 సంవత్సరం మండలాల వారీగా రుణ పంపిణీ వివరాలు(రూ.కోట్లలో)మండలం సంఘాలు రుణ లక్ష్యం పంపిణీ బచ్చన్నపేట 886 45.51 39.69 చిల్పూర్ 828 45.84 93.92 దేవరుప్పుల 859 48.56 35.56 స్టేషన్ఘన్పూర్ 917 44.28 51.53 జనగామ 709 36.15 51.59 కొడకండ్ల 578 25.56 42.39 లింగాలఘణపురం 818 41.31 40.14 నర్మెట 363 20.21 15.81 పాలకుర్తి 1087 54.06 46.81 రఘునాథపల్లి 1066 50.25 67.02 తరిగొప్పుల 419 24.24 14.46 జఫర్గఢ్ 748 40.50 34.46 మొత్తం 9,278 476.47 532.84రుణాలను సద్వినియోగం చేసుకోవాలి మహిళా సంఘాల సభ్యులకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.476 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు లక్ష్యానికి మించి రూ.532 కోట్ల రుణాలు అందజేశాం. రికవరీ కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. – వసంత, డీఆర్డీఓ -
సివిల్ సప్లయీస్కు ‘సీఎంఆర్‘ చిక్కులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ● హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైసుమిల్లుకు 2021–22, 2022–23 సంవత్సరాలకు కేటాయించిన సీఎంఆర్ కింద 4,310 మె.టన్నుల బియ్యానికి 1,889 మె.టన్నులు మాత్రమే సరఫరా చేశారు. సుమారు రూ.7.50 కోట్ల విలువైన బియ్యం ఎగవేయడంతో అప్పట్లో సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి బియ్యం లేకపోవడంతో కేసులు నమోదు చేసి డిఫాల్టర్ లిస్టులో చేర్చారు. ● మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో గత సీజన్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. అదే విధంగా కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించి కేసులు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద రైసుమిల్లర్లకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఈసారి డిఫాల్టర్లకు ఇవ్వొద్దని ప్రభుత్వంనుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. 20 శాతం మిల్లర్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. సివిల్ సప్లయీస్ అధికారులు వాటిపై పునరాలోచన చేస్తూ మిగతా మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నారు. ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్లో 987 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పాక్షికంగా సాగుతుండగా.. మిగతా జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధాన్యం అమ్ముకుంటున్న రైతులకు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మెనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) ద్వారా డబ్బు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. దాడులు, కేసులు పెట్టినా అదే మొండివైఖరి... సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని పలు జిల్లాల్లో కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. గత రబీ సీజన్లో సీఎంఆర్ కోసం కూడా హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. వరంగల్ జిల్లాలోని ఓ మిల్లులో రూ.3.79 కోట్ల విలువైన 12,360 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు గుర్తించి కేసు పెట్టారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్లో జరిపిన తనిఖీల్లో ఆరేడు సంవత్సరాలకు సంబంధించిన రూ.201 కోట్లకు పైగా విలువైన బియ్యం బకాయి ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేశామని, 6ఏ కేసులు కూడా నమోదు చేశామని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు కూడ పెడతామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ సీఎంఆర్ ఆచితూచి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాయిల్డ్, రా రాస్ మిల్లులు 328 వరకు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాలోని మిల్లుల నుంచి బకాయిలు సుమారు లక్షా 20వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు రావాల్సి ఉందని ఫైనల్గా తేల్చారు. సీఎంఆర్ బకాయి ఉన్న డిఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వరాదన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ 10.24 లక్షల మె.టన్నుల మేరకు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేసిన అధికారులు 987 కొనుగోలు కేంద్రాల కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇన్టైమ్లో సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లకే సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫాల్టర్గా ఉన్న రైసుమిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్ ఇచ్చిన మిలర్లకు తరలించడమా... లేక ఈ సీఎంఆర్ బకాయి రాబట్టుకుని అదనంగా జమానత్లు తీసుకుని వారికే ఇవ్వడమా... అన్న కోణంలో కసరత్తు చేస్తున్నారు. పెండింగ్లో గత రబీ, ఖరీఫ్ సీఎంఆర్ బియ్యం లక్ష్యానికి దూరంగా చాలామంది రైసుమిల్లర్లు గడువు పెంచినా కదలని సీఎంఆర్ బకాయి ఊపందుకున్న రబీ ధాన్యం కొనుగోళ్లు డిఫాల్టర్లకు సీఎంఆర్ ఇవ్వద్దని సర్కారు ఆదేశం.. ‘ప్రత్యామ్నాయం’పై కసరత్తు -
5 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిజనగామ రూరల్: పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్గా తీసుకొని గ్రామాల్లో ఈనెల 5వ తేదీ నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నా రు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్మిట్టల్తో కలిసి వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించగా.. జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో పొజిషన్లో ఉన్న రైతుల దరఖాస్తులు పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పోజిషన్లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పట్టాలు ఉండి పొజిషన్లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలని, హైకోర్టు నుంచి అనుమతి రాగానే సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలన్నారు. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు విక్రయిస్తే ముందు ఆ పట్టాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసినవారు భూమి లేని నిరుపేదలైతే ఎంత భూమి క్రమబద్ధీకరించాలో ప్రభుత్వం నిర్ణయిరస్తుంన్నా రు. ఈ సందర్భంగా ‘నీట్’ నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు. -
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి
● సీపీ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులను గురువారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సన్ప్రీత్సింగ్ ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలను అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో ఎస్సైలు యుగేందర్, రాజశేఖర్రెడ్డి, కృష్ణారావు, ఎలిషా, ఏఎస్సై కుమారస్వామి, హెడ్కానిస్టేబుల్ రాంరెడ్డి ఉన్నారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ సుదీర్ఘంగా కాలంగా పోలీస్ శాఖకు అందించిన సేవలు మరిచిపోమని తెలిపారు. భవిష్యత్లో శాఖాపరమైన సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ఏసీపీలు సురేంద్ర, నాగయ్య, అంతయ్య, ఆర్ఐలు స్పర్జన్రాజ్, సతీష్, శ్రీధర్, ఏఓ రామకృష్ణస్వామి, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్ తదితరులు ఉన్నారు. నీటిని ఒడిసి పట్టాలి ● డీపీఓ స్వరూపారాణి బచ్చన్నపేట: గ్రామాల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చే నీటిని ఒడిసి పట్టాలని అందుకు.. ఇంకుడు గుంతలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. గురువారం మండలంలోని నారాయణపురంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిని భూమిలో ఇంకేలా చూస్తే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అలాగే గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని అందుకు గ్రామస్తులు తడి, పొడి చెత్తను వేరు చేసి జీపీ ట్రాక్టర్లలో వేసేలా చూడాలన్నారు. నర్సరీల్లో వంద శాతం మొక్కలు రక్షించాలని, పార్కులలో కూడా మొక్కల్ని రక్షించాలన్నారు. గ్రామాల్లో అన్ని రకాల పన్నులు వసూలు చేస్తూ వాటి నిర్వాహణ రికార్డులను సక్రమంగా రాయాలని పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు. -
జిల్లాలో మండలాల వారీగా ఫలితాలు
మండలం విద్యార్థులు ఉత్తీర్ణత ఫెయిల్ శాతం బచ్చన్నపేట 557 549 8 98.56 చిల్పూరు 294 293 1 99.96 దేవరుప్పుల 361 356 5 98.61 స్టేషన్ఘన్పూర్ 890 880 10 98.88 జనగామ 1,382 1,372 20 98.56 కొడకండ్ల 359 358 1 99.72 లింగాల ఘణపురం 334 332 2 99.40 నర్మెట 368 366 2 99.46 పాలకుర్తి 668 656 12 98.20 రఘునాథపల్లి 480 473 7 98.54 తరిగొప్పుల 113 113 – 100.00 జఫర్గఢ్ 418 412 6 98.56 మొత్తం 6,224 6,160 74 98.81మొదటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. – రాజేందర్, ఉపాధ్యాయుడు,కొడకండ్ల2023–24 పరీక్ష రాసిన వారు: 6692ఉత్తీర్ణత: 6569బాలురు: 3076బాలికలు: 3493శాతం: 98.16ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాం.. పదో తరగతిలో జనగామ జిల్లా ఉత్తమ ర్యాంకు సాధించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా విజయోస్తు కార్యక్రమం చేపట్టి నిత్యం పర్యవేక్షించారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో టీచర్లు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించారు. స్లిప్టెస్ట్లు నిర్వహించి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. రాష్ట్రంలో జనగామకు 3వ స్థానం దక్కేలా కలెక్టర్ చేసిన కృషి.. టీచర్ల శ్రమ విజయాన్ని ముంగిట నిలిపాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం మరింత మెరుగైన ర్యాంకు కోసం కష్టపడతాం. – డి.ఓజన్న, డీఈఓ -
ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలి
చిల్పూరు: ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు ఉన్నా.. చాలా మంది పేదలు విషయం తెలియక అనవసర ఖర్చులతో ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, ఇక నుంచి ప్రభుత్వాస్పపత్రుల్లోనే కాన్పులు జరిగేలా సిబ్బంది పాటుపడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మల్కాపూర్లోని పీహెచ్సీని గురువారం మధ్యాహ్నం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ కుశాలితో మాట్లాడుతూ.. నార్మల్ డెలివరీ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు డబ్బుల కోసం ఆపరేషన్ల పేరిట రోగుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారన్నారు. ఇక నుంచి డెలివరీకి ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వాస్పత్రుల్లోనే చేర్పించేలా చూడాలన్నారు. అనంతరం చిల్పూరు, మల్కాపూర్, రాజవరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, తహసీల్దార్ సరస్వతి, ఎంపీఓ మధుసూదన్, ఏఈఓలు నరసింహులు, వినయ్, యాకూబ్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ను కలిసిన డీఈఓ జనగామ రూరల్: నూతనంగా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భోజన్న గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను మార్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు. ఆయన వెంట ఏపీఓ రమేశ్ ఉన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ -
కుల గణనపై ఫలించిన రాహుల్గాంధీ పోరాటం
జనగామ: దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటం ఫలించిందని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధినేత రాహుల్, సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అనంతనం శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. కుల గణనతో పాటు జనగణనను వేగవంతం చేయాలన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నర పాలనలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, ప్రకాశ్ యాదవ్, బన్సీ నాయక్, మోటే శ్రీనివాస్, సుధగాని కృష్ణ, తుపాకుల రాములు, మిద్దెపాక స్టాలిన్, మంతపురి ప్రకాశ్, భూష పర్వతాలు, మధు, అర్షద్, అశోక్ పాల్గొన్నారు. -
కడియం శ్రీహరిది గోబెల్స్ ప్రచారమే
చిల్పూరు: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అబివృద్ధి చేసింది తానేనంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో గురువారం మండల ఇన్చార్జ్ మాలోతు రమేశ్నాయక్ అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 15 ఏళ్లలో కడియం శ్రీహరిని ప్రజలు మర్చిపోయారని, అందుకు మాజీ సీఎం కేసీఆర్ చేసిన అబివృద్ధే కారణమన్నారు. ప్రస్తుతం ఏసమావేశంలో మాట్లాడినా తానే అబివృద్ధి చేశానని చెప్పుకుంటున్న కడియం చిల్పూరుగుట్ట కింద సమావేశం పెడదామని.. ప్రజలే తీర్పు చెబుతారని అందుకు సిద్ధమా? అని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో తాను ఎంతో అబివృద్ధి చేశానని అందుకు నిదర్శనం శిలాఫలకాలే అన్నారు. కార్యక్రమంలో నాయకులు కేశిరెడ్డి మనోజ్రెడ్డి, రాకేశ్రెడ్డి, జనగాం యాదగిరి, నారగోని రాజు, రవిచంద్ర, రంగు హరీశ్, అరూరి రవిచంద్ర, రైతు వెంకన్న, వెంకటస్వామి, పోలు రమ తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
ఫలించిన ‘విజయోస్తు’
కోర్టు ఆదేశాలు బేఖాతర్ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చినా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.– 8లోuశుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు అందజేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.– 8లోuన్యూస్రీల్ -
క్రీడలతో మానసిక వికాసం
జనగామ రూరల్: యువతకు విద్యార్థులకు క్రీడలతో మానసిక, శారీరక వికాసం కలుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌడారంలో స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో క్రీడల శాఖ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులు వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర జాతీయ స్థాయి అథెటిక్స్లో పాల్గొనేలా నైపుణ్యాలు నేర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి గంగిశెట్టి మనోజ్కుమార్, శిక్షకులు మునిగె సురేశ్, గ్రామస్తులు కర్ణాకర్, కర్ల శ్రీకాంత్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలిజనగామ రూరల్: కార్మికులు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి విక్రమ్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, వారికి సంబంధించిన చట్టాలు, ఆరోగ్య పథకాల గురించి తెలుసుకోవాలన్నారు. కార్మికులు పనిచేస్తున్న ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. లేబర్ కార్డు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు, పెయింటర్స్, చిరు వ్యాపారస్తులు, మెకానిక్లు, వడ్రంగులు, సోషల్ వర్కర్స్, ఐటీఐ విద్యార్థులు, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు చరిష్మజఫర్గఢ్: మండలంలోని హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన విద్యార్థి తాటికాయల చరిష్మ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) బాక్సింగ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ ఆర్గనైజర్ సెక్రటరీ శీలం పార్థసారధి గురువారం తెలిపారు. హిమ్మత్నగర్కు చెందిన చరిష్మ మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతోందని.. రెండేళ్ల నుంచి హైదరాబాద్లోని టీజీఎస్డబ్ల్యూఆర్ పాఠశాల బాక్సింగ్ అకాడమీలో కోచ్ కృష్ణ తాప దగ్గర ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 30 నుంచి 5వ తేదీ వరకు న్యూఢిల్లీలో ఛత్రసల్ స్టేడియంలో 68వ (ఎస్జీఎఫ్) జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈపోటీల్లోనూ ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. కాగా.. విద్యార్థిని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి, ఫిజికల్ డైరెక్టర్ పద్మ, పీఈటీ సరిత, రమేశ్, శాంసన్ అభినందించారు.‘యువ వికాసం’ పత్రాలు అందజేయాలి..జనగామ రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు పత్రాలను సంబంధిత కార్యాలయంలో అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతం వారు మండల ప్రజాపాలన కేంద్రాల్లో, పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 3 వతేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలని సూచించారు. -
సీనియర్ సిటిజన్ల అపూర్వ సమ్మేళనం
జనగామ రూరల్: జనగామలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ 1977–79 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గురువారం ఘట్కేసర్లోని ఓ రీసార్ట్లో కలుసుకున్నారు. 46 ఏళ్ల తర్వాత 65 ఏళ్లు దాటిన వారంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కష్టసుఖాలు, సాధించిన విజయాల్ని చెప్పుకున్నారు. క్లాస్ రూంలో చేసిన అల్లరి, చదువు సాగిన తీరుపై ముచ్చటించుకున్నారు. భవిష్యత్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బండిరాజుల శంకర్, అల్లాడి ఉమామహేశ్వర్, టి.సుధాకర్, సంబోజు ఆంజనేయులు, రాపాక లక్ష్మణ్, కర్కెర్ల బాలరాజు, చంద్రమోహన్, బిల్లా జనార్ధన్ రెడ్డి, కె.హరిశ్చంద్ర ప్రసాద్, లింగాల ధర్మేందర్రెడ్డి, మాదారపు సాంబమూర్తి, కొన్యాల శ్రీనివాస్రెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, మంచాల కృష్ణమూర్తి, లింగాల రవీందర్ రెడ్డి, వి.శేఖర్ రావు, మహదేవుని కృష్ణమూర్తి, మంగు శ్రీనాథ్, కందుకూరి సోమనర్సయ్య, పంగ జనార్దన్ రెడ్డి, వంటేరు జయపాల్ రెడ్డి, ఎ.సోమారెడ్డి, బత్తుల ఉపేందర్, సీహెచ్.ఉమాదేవి, పెద్ది రాణి, అనూరాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల పనుల్లో వేగం పెంచండి
కాళేశ్వరం: ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి నది పుష్కరాల పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరేలతో కలిసి పుష్కరాల పనులను పరిశీలించారు. ముందుగా త్రివేణిసంగమం వద్ద వీఐపీ (జ్ఞాన సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న సరస్వతి మాత విగ్రహం, ఘాటు విస్తరణ పనులు, మరుగుదొడ్లు, శ్రాద్ధమండపం నిర్మాణాలను పరిశీలించారు. మంత్రికి ఎస్పీ వీఐపీ ఘాటుకు వచ్చే రోడ్డు మ్యాపును వివరించారు. గోదావరిలో నీటిమట్టం పుష్కరాల నాటికి తగ్గుతుందా? అని ఇరిగేషన్శాఖ ఈఈ తిరుపతిరావును అడుగ్గా కొంత తగ్గుతుందని, అయితే భక్తులకు ఇబ్బంది లేదన్నారు. సరస్వతిమాత విగ్రహం బేస్ కింద రివిట్మెంట్ కరెక్ట్ ఉందా అని ఎండోమెంట్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. వీఐపీ ఘాటు వద్ద టెంట్సిటీ నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఇక్కడ టెంట్సిటీని మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నామని, జాయ్రైడ్స్ కోసం కన్నెపల్లి వద్ద కాకుండా దేవస్థానం లేదా ఘాటు పరిసరాల్లో మూడు హెలిపాడ్లు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్కు తెలిపారు.పారిశుద్ధ్యంపై దృష్టి సారించండిపుష్కరాలకు వచ్చే భక్తులకు అందంగా కనిపించాలని, వ్యర్థాలు, చెత్తచెదారం లేకుండా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లుకు ఆదేశించారు. పుష్కరాల్లో పారిశుద్ధ్యం పెద్దపీట వేస్తుందని, ఎక్కువ సంఖ్యలో కూలీలను పెంచాలన్నారు. అలాగే ప్రధాన ఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు గోదావరిలో బండరాళ్ల తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మళ్లీ పుష్కరాల పనులు పరిశీలించేందుకు నిత్యం వస్తుంటానని, అధికారులు అందుబాటులో ఉంటూ పనులు పూర్తి చేయించాలన్నారు. అలాగే గోదావరిలో బోట్లు తిప్పేందుకు అనుమతి ఇవ్వాలని, మరిన్ని బోట్లు పెంచి గంగపుత్రులకు ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం హరితహోటల్లో శాఖల వారీగా సమీక్ష చేశారు. మంత్రి వెంట సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఈఓ మహేష్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రామచందర్రావు, ఎస్సై తమాషారెడ్డి, నాయకులు కోట రాజబాపు, మాజీ ఎంపీపీ రాణిబాయి, అశోక్, శ్రీనివాసరెడ్డి, ఎల్.రాజబాపు, శకీల్, సత్యనారాయణ, జానీ, శ్యాందేవుడా తదితరులు పాల్గొన్నారు. -
పురాతన విగ్రహం తల భాగం లభ్యం
జనగామ రూరల్: జనగామ మండల పరిధి శామీర్పేట గ్రామ శివారులోని ఆవునూరి మల్లారెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో బుధవారం కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా ఓ పురాతన విగ్రహం తల భాగం బయటపడింది. ఇది 17వ శతాబ్దానికి చెందిన వైష్ణవ భక్తుడి శిల్పంగా తెలుస్తోందని డిస్కవరీ మ్యాన్, పురావస్తు నిపుణుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. ఇక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు ప్రస్తుతం లభించిన ఈ విగ్రహం తల భాగం ఆధారంతో అవగతమవుతోందని అన్నారు. గ్రామంలో ఒక శాసనం ఉందని, దానిపై శివుడు, వినాయకుడు, సూర్యుడి విగ్రహాలు ఉన్నట్లు పేర్కొన్న ఆయన.. దీని ద్వారా ఇక్కడ త్రికూటాలయం ఉందని తెలుస్తున్నదని చెప్పారు. గ్రామంలో గతంలో డంగు సున్నంతో చేసిన పాత్రలు, సున్నపు రాయి లభించాయని వివరించారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: గ్రామాల్లో కమ్యూనిటీ మీడియేటర్లకు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. బుధవారం లీగల్ సెల్ ఆధ్వర్యాన కోర్టు ఆవరణలో చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేసులు ఎలా పరిష్కరించాలో ముందు తెలుసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ మీడియేటర్లుగా శిక్షణ తీసుకున్న వారు 31 మంది ఉన్నారని, ఇందులో చాలామంది రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తోపాటు వివిధ వృత్తుల్లో అనుభవం కలిగిన వారు ఉన్నట్లు పేర్కొన్నారు. వారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మొత్తంలో కేసులను పరిష్కరించాలని సూచించారు. లీగల్గా తెలియని విషయాలు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మండలం, గ్రామాల్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు ఓపెన్ చేయాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు ● ఈనెల 3వ తేదీ వరకు అవకాశం జనగామ: ఎల్ఆర్ఎస్ పథకం కింద 25 శాతం రాయితీతో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు అవకాశం కల్పిస్తూ బుధవారం జీఓ జారీ చేసింది. మొదటి విడతలో మార్చి 31 వరకు, రెండోసారి ఏప్రిల్ 2 నుంచి 30 వరకు అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించే సమయంలో సర్వర్ డౌన్, సర్వే నంబర్లపై తగాదా లు, కోర్టు కేసుల నేపథ్యంలో ప్రోహిబిటెడ్ ఆప్షన్ ఉండడం కారణంగా రెగ్యులరైజేషన్ సమయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామపంచా యతీ, పురపాలిక పరిధిలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తులు ఇబ్బడి, ముబ్బడిగా వచ్చినా.. అవి పెండింగ్లో ఉండడంతో మే 3వ తేదీ వరకు మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.23 కోట్ల ఆదాయం జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, 12 మండలాల పరిధిలో 12,996 దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు రూ.23.87 కోట్ల ఆదాయం ఫీజు రూపంలో ప్రభుత్వానికి వచ్చింది. ఏఎంసీ సూపర్వైజర్ సరెండర్ జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ కార్యాలయ సూపర్వైజర్ వి.నాగార్జునపై వచ్చిన పలు ఆరోపణలతో పాటు పాలకవర్గం తీర్మానం మేరకు ఆయనను హెడ్ ఆఫీస్కు సరెండర్ చేస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున పనిచేసే సమయంలో అతనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నాగార్జునను రాష్ట్ర మార్కెటింగ్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు వివరించారు. -
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
ఫలితాల నమోదు ఇలా.. జిల్లాలో మొత్తం 180 పాఠశాలలు ఉండగా.. అందులో ఎయిడెడ్ 93.2 శాతం, జెడ్పీ 98.11, సర్కారు స్కూళ్లు 98.80, ఆశ్రమ, మోడల్ 98.98, కేజీబీవీలు 99.07, ప్రైవేట్ 99.28, సోషల్ వెల్ఫేర్ 99.32, ట్రైబల్ వెల్ఫేర్ 99.34, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్, మైనార్టీ పాఠశాలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వంద శాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ స్కూళ్లు 127 ఉన్నాయి.‘పది’ ఫలితాల్లో 98.81శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రంలో జిల్లాకు మూడో స్థానం ● గత ఏడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత ● వంద శాతం సాధించిన పాఠశాలలు 127 జనగామ రూరల్: పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు హవా కొనసాగించారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా 98.81 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు, మైనార్టీ, కస్తూర్బాగాంధీ, సాంఘిక సంక్షేమ, మహాత్మాజ్యోతిబా పూలే, బీసీ వెల్ఫేర్, ఆశ్రమ, ఎయిడెడ్, మోడ ల్, గిరిజన పాఠశాలలు మొత్తం 180 ఉండగా.. 6,234 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,160 మంది ఉత్తీర్ణత సాధించగా.. వీరిలో బాలు రు 2,948, బాలికలు 3,212 ఉన్నారు. 2018–19 విద్యాసంవత్సరం 97 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకుని రాష్ట్రంలో ముందంజలో ఉన్న జిల్లా గత ఏడాది 98.16 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా.. ఈసారి 3వ స్థానంలో నిలిచింది. కలెక్టర్ కృషితో మెరుగైన స్థానం పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాను ఉత్తమంగా నిలపాలనే కలెక్టర్ రిజ్వాన్ బాషా సంకల్పం నెరవేరింది. పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ‘విజయోస్తు’ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రక్రియ ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, గురుకులాల్లో ఉదయం, సాయంత్రం సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల ను పరీక్షలకు సన్నద్ధం చేశారు. జెడ్పీ విద్యార్థుల ప్రతిభ టెన్త్ ఫలితాల్లో పట్టణంలోని ధర్మకంచ విద్యార్థులు ప్రతిభ చాటారు. మొత్తం 53 మంది విద్యార్థులకు 52 మంది ఉత్తీర్ణత సాధించారు. అవదూ త దీక్షిత 575, ఎస్.వెంకటేష్ 562, కె.ఐశ్వర్య 550 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచారు. మైనారిటీ బాలుర జోరు జనగామ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎండీ.ఫిరోజ్ 564, కె.హర్షవర్ధన్ 563, జమీల్ 558, టి.వర్షిత్ 552, ఎం.చందు 549 మార్కులు సాధించారు. అలాగే 16 మంది విద్యార్థులకు 500లకు పైన మార్కులు వచ్చినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కర్రె కుమారస్వామి తెలిపారు. మెరిసిన ఎంజేపీ విద్యార్థులు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 73 మంది విద్యార్థుల కు 73 మంది 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. కె.శ్రీజ 580, బి.సింధు 574, ఎన్.వర్షిత 570, ఎన్.భువనేశ్వరీ 570, బిందుశ్రీ 569, మార్కులు తెచ్చుకున్నారని ఎస్ఓ ఎం.అనిత తెలిపారు. సోషల్ వెల్ఫేర్ ప్రభంజనం జిల్లాలో అయిదు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉండగా.. జఫర్గఢ్, నర్మెట, పాలకుర్తి గురుకులాలు 100 శాతం, జనగామ, స్టేషన్ఘన్పూర్ 98 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైనట్లు సమన్వయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఎం.తరుణ్ 573, పి.హేమ 571, బి.శ్రావణి 571, కె.నరేష్ 568, డి.శశాంక్ 550 మార్కులు సాధించినట్లు వివరించారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. గడిచిన మూడు నెలల నుంచి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశారు. సమష్టిగా నిరంతర కృషి చేయడంతో మంచి ఫలితాలు సాధించాం. భవిషత్లో మొదటి స్థానం లక్ష్యంగా కృషి చేస్తాం. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు అభినందనలు. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ గత ఎనిమిదేళ్లలో జిల్లాలో పదోతరగతి ఉత్తీర్ణత వివరాలు శాతంలో.. సంవత్సరం బాలికలు బాలురు మొత్తం 2016–17 93.98 93.13 93.56 2017–18 88.50 88.27 88.38 2018–19 97.51 96.59 97.15 2019–20, 2021 కరోనాతో 100 శాతం ఉత్తీర్ణత 2021–22 96.01 93.39 94.72 2022–23 91.17 92.58 91.90 2023–24 98.68 97.59 98.16 2024–25 99.20 98.40 98.81అవదూత దీక్షిత/575 -
‘పది’లో షైన్ విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ: పదో తరగతి ఫలితాల్లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ తెలిపారు. బుధవారం వెలుబడిన ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేల విద్యారంగంలో విశిష్ట సంస్థగా పేరొందిన షైన్ విద్యార్థులు జిల్లాకే తలమానికంగా నిలిచారన్నారు. షైన్ అంటే కేవలం ‘ఐఐటీ’నే కాదని అన్నిరంగాల్లో ముందుంటామని మరోసారి రూఢీ అయ్యిందన్నారు. జిల్లాలోనే తమ పాఠశాల విద్యార్థి బి.ఆదిత్య దీక్షిత్ 588 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారన్నారు. జి.జ్ఞానదీప్ 580, పి.హాసిని, మణికంఠ, రింషా జైనబ్ 579, సాయిశ్రీ 578, మణిచందన 577, కార్తీక, త్రిషిక పటేల్ 576, సంప్రీత్ 575, రాజేష్ 574 మార్కులు సాధించారన్నారు. 23 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా, 53 మంది 560 మార్కులకు పైగా, 92 మంది 550 మార్కులకు పైగా, 371 మంది 500 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. వరంగల్ మహానగరంతో పాటు రాష్ట్రస్థాయిలో షైన్ విద్యార్థులు ముందువరుసలో నిలిచారన్నారు. తెలుగులో 155 మంది, హిందీలు 90 మంది, ఇంగ్లిష్లో 299 మంది, గణితంలో 242 మంది, సైన్స్లో 217 మంది, సోషల్లో 154 మంది ఏ1 గ్రేడ్ సాధించారన్నా రు. డైరెక్టర్ పి.రాజేంద్రకుమార్ మాట్లాడుతూ దే శంలోని ప్రతీ ప్రతిష్టాత్మక కళాశాలలో షైన్ విద్యార్థులున్నారని, దానికి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన కారణమన్నారు. బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు పి.రాజేంద్రకుమార్, మూగల రమ, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేష్, షైన్ ఎర్రగట్టు గుట్ట చైర్మన్ జె.శ్రీనివాస్, ప్రి న్సిపాల్లు జి.రాజ్కుమార్, పి.విశాల్, ప్రగతి రెడ్డి, కవితా రాణి, ఉపాధ్యాయుల అభినందించారు. -
విద్యుత్ ప్రమాదాలను నివారించాలి
హన్మకొండ: విద్యుత్ ప్రమాదాలను నివారించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నా టి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం మే 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యుత్ భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్లు, కరపత్రాలను సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, ఇన్చార్జ్ డైరెక్టర్లు, సీజీఎంలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం మే మొదటి వారంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించడంతో పాటు సిబ్బందికి, ప్రజలకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతీ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్లో విద్యుత్ విని యోగదారులకు, రైతులకు విద్యుత్ భద్రత ప్రాముఖ్యతను వివరించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలని ఎస్ఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశో క్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, బికంసింగ్, వెంకట రమణ, జాయింట్ సెక్రటరి కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ