
సీనియర్ సిటిజన్ల అపూర్వ సమ్మేళనం
జనగామ రూరల్: జనగామలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ 1977–79 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గురువారం ఘట్కేసర్లోని ఓ రీసార్ట్లో కలుసుకున్నారు. 46 ఏళ్ల తర్వాత 65 ఏళ్లు దాటిన వారంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కష్టసుఖాలు, సాధించిన విజయాల్ని చెప్పుకున్నారు. క్లాస్ రూంలో చేసిన అల్లరి, చదువు సాగిన తీరుపై ముచ్చటించుకున్నారు. భవిష్యత్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బండిరాజుల శంకర్, అల్లాడి ఉమామహేశ్వర్, టి.సుధాకర్, సంబోజు ఆంజనేయులు, రాపాక లక్ష్మణ్, కర్కెర్ల బాలరాజు, చంద్రమోహన్, బిల్లా జనార్ధన్ రెడ్డి, కె.హరిశ్చంద్ర ప్రసాద్, లింగాల ధర్మేందర్రెడ్డి, మాదారపు సాంబమూర్తి, కొన్యాల శ్రీనివాస్రెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, మంచాల కృష్ణమూర్తి, లింగాల రవీందర్ రెడ్డి, వి.శేఖర్ రావు, మహదేవుని కృష్ణమూర్తి, మంగు శ్రీనాథ్, కందుకూరి సోమనర్సయ్య, పంగ జనార్దన్ రెడ్డి, వంటేరు జయపాల్ రెడ్డి, ఎ.సోమారెడ్డి, బత్తుల ఉపేందర్, సీహెచ్.ఉమాదేవి, పెద్ది రాణి, అనూరాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.