
కష్టపడిన వారికే గుర్తింపు
జనగామ: కాంగ్రెస్లో చెట్ల కింద కూర్చుని పదవులు ఇచ్చే రోజులు పోయాయని, కష్టపడిన వారికే గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన జనగామ నియోజకవర్గ ముఖ్యనాయకుల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చెట్ల కింద కూర్చొని పలు ఇస్తే పార్టీలో మేము కూడా సస్పెండ్కు గురవుతామన్నారు. 2017 కంటే ముందు పని చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో పని చేసిన కేడర్కు గుర్తింపు ఉంటుందన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్నవారికే మండల, గ్రామశాఖ అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి జూన్ 1 వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, అలాగే ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సంవిధాన్ బచావో పేరుతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. రేవంత్రెడ్డి రెండోసారి సీఎం కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బైకిని లింగం యాదవ్, సిద్ధిపేట జిల్లా పరిశీలకులు మల్లాడి పవన్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, నాయకులు చెంచారపు శ్రీనివాస్రెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, బడికె ఇందిర, జక్కుల అనిత, సర్వల నర్సింగరావు, వంగాల మల్లారెడ్డి, గాదెపాక రాంచందర్, బొట్ల శ్రీనివాస్, రాముని శ్రీనివాస్, కరుణాకర్రెడ్డి, మల్లేశం, మహేందర్, తదితరులు ఉన్నారు.
చెట్ల కింద కూర్చుని పదవులు
ఇచ్చే రోజులు కావు
అర్హత ఉన్న వారికే
స్థానిక ఎన్నికల టికెట్లు
జనగామ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ అద్దంకి