
ప్రమాదం మాటున ప్రయాణం
జనగామ: జనగామ పట్టణంలో ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. డ్రెయినేజీలు, నాలాలపై కప్పులు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలపై సర్వీసు వైర్లు, కేబుల్స్ ఒకేచోట నుంచి వెళ్లడంతో గాలి దుమారం సమయంలో రాపిడికి గురయ్యే ప్రమాదం ఉంది. పట్టణంలో అనేక చోట్ల ట్రాన్స్ఫార్మర్ గద్దెల కింద చిరు వ్యాపారాలు చేస్తున్నారు. ఓవర్ లోడ్ పెరిగే సమయంలో జరిగే ప్రమాదాలకు బాధ్యులు ఎవరనే ప్రశ్న ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాలను సాక్షి పరిశీలన చేసింది. ఇందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పడితే పరలోకానికే..
ధర్మకంచ–అంబేడ్కర్నగర్ ప్రధాన చౌరస్తా చమన్ హనుమాన్ ఆలయం వద్ద లింకును కలిపే నాలా నోరు తెరుచుకుని రెడీగా ఉంది. రెండు రోడ్ల నుంచి వాహనాలపై వచ్చే వారి పాలిట పెను శాపంగా మారింది. ప్రమాదవశాత్తు పడితే పరలోకానికి పయనంలా మారిపోయింది.
రక్షణ కవచం ఏదీ..?
కప్పులు లేని నాలాలు
రక్షణ కవచం లేని ట్రాన్స్ఫార్మర్లు

ప్రమాదం మాటున ప్రయాణం