భూసేకరణ పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

May 31 2025 1:12 AM | Updated on May 31 2025 1:12 AM

భూసేక

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

జనగామ: జిల్లాలో దేవాదుల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పరిధిలోని భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల లిఫ్ట్‌ ఇరిగేషన్‌తోపాటు ప్యాకేజీ–7 పరిధి నవాబ్‌పేట రిజర్వాయర్‌, చీట కోడూరు, అశ్వరావుపల్లి రైట్‌ మెయిన్‌ కెనాల్‌ భూసేకరణ, రైతులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని చెప్పారు. నేషనల్‌ హైవే–365బీకి సంబంధించి జనగామ నుంచి సిద్దిపేట జిల్లా దుద్దెడ వరకు భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు ల విషయంలో ఆలస్యం చేయొద్దన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇరిగేషన్‌, ఎన్‌హెచ్‌ అధికారులు పాల్గొన్నారు.

వైద్య సేవల్లో మొదటి స్థానంలో నిలపాలి

డీహెచ్‌ డాక్టర్‌ రవీందర్‌నాయక్‌

జనగామ: వైద్య సేవల్లో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టేలా కృషి చేయాల ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌(డీహెచ్‌) డాక్టర్‌ బి.రవీందర్‌నాయక్‌ అన్నా రు. కలెక్టరేట్‌లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అంతకు ముందు డీఎంహెచ్‌ఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీహెచ్‌ మాట్లాడుతూ.. టీబీ కార్యక్రమాలకు సంబంధించి నోటిఫికేషన్లు పెంచాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. వ్యాధులు ప్రభలకుండా ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో ఫీవర్‌ సర్వే చేయించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ, ప్రోగ్రాం అధికారులు ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సబ్‌ సెంటర్లను సందర్శించాలని పేర్కొన్నారు.

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి1
1/1

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement