
300 మందికి వైద్య పరీక్షలు
రఘునాథపల్లి: ఫతేషాపూర్లో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామానికి చెందిన చింత మహేష్, పయ్యావుల రఘుపతి ఆధ్వర్యంలో యశోద నేత్రాలయ ఆస్పత్రి సహకా రంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీష్చందర్రెడ్డి ప్రారంభించారు. శిబి రానికి వచ్చిన దాదాపు 300 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో గొట్టం భాస్కర్రెడ్డి, గాజులపాటి మహేందర్, ఎండీ.హయత్అలీ, గాజులపాటి నేతాజీ, ఎండీ.షబ్బీర్మియా, గొట్టం కరుణాకర్రెడ్డి, గాజులపాటి విరోజీ, చింత మదార్, యామంకి కొంరెల్లి, ఎలందర్ పాల్గొన్నారు.