
వైభవంగా వార కల్యాణం
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యాన వార కల్యాణా న్ని అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వైభవంగా నిర్వహించారు. వేడుకను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు హైదరాబాద్కు చెంది న చాగంటి రామకృష్ణ–కృష్ణవేణి దంపతులు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీ ర్యం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు యాటల సోమన్న, సుంచు విజేందర్, అన్నబోయిన రాజు, చిట్యా ల సోమన్న, జోగు ప్రకాష్, బూడిద ప్రశాంత్, తాండ్ర ఆనందం, బత్తిని వెంకన్న పాల్గొన్నారు.
కేసీఆర్తోనే తెలంగాణ సాకారం
దేవరుప్పుల : కేసీఆర్ ఉద్యమంతోనే తెలంగా ణ కల సాకారం అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆమెరికా దేశం వాషింగ్టన్, సియాటిల్లోని వాటా, వాట్జ్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని రాజకీయ అడ్డంకులు వచ్చినా అధిగమించేందుకు సమస్త తెలంగాణ సమాజాన్ని కూడగట్టుకొని ప్రత్యేక రాష్ట్రం సాధించి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్.. మొన్న కేసీఆర్ విజన్తో పరిపాలన సాగిస్తే.. కొందరు విమర్శలు చేయడం శోచనీయమన్నా రు. విదేశాలకు వచ్చినా స్వదేశీ అభివృద్ధిపై ఎన్ఆర్ఐల తోడ్పాటు అభినందనీయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు, ఎన్ఆర్ఐలు వంశీరెడ్డి, రాజేష్, సందీప్, గణేష్ వీరమనేని, మాణిక్యం, ప్రదీప్ పాల్గొన్నారు.

వైభవంగా వార కల్యాణం

వైభవంగా వార కల్యాణం