నదీతీరం.. శోకసంద్రం | - | Sakshi
Sakshi News home page

నదీతీరం.. శోకసంద్రం

Jun 8 2025 1:56 AM | Updated on Jun 8 2025 1:56 AM

నదీతీ

నదీతీరం.. శోకసంద్రం

నేనూ సచ్చిపోయేవాడినే ః పట్టి శివమణి (ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి)

స్నానం చేసేందుకు మొదట నలుగురు దిగారు. తరువాత మరో ఇద్దరు దిగారు. ఒకరి వెనుక ఒకరు నీట మునిగారు. క్షణాల్లోనే అందరూ మునగసాగారు. కన్నుమూసి తీసి తెరిచే లోపే ఆరుగురు మునిగిపోయారు. మధుసూదన్‌ మునిగిపోతుంటే చేయి పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నీట మునిగాడు. దీంతో నేనే భయపడి ఒడ్డుకు చేరుకున్నా.

అడ్డుకున్నప్పుడు ఆగి ఉంటే..

ఈతకు వెళ్లిన వారిలో అంబట్‌పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్‌, శివమనోజ్‌ కూడా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, స్నానానికి వెళ్లొద్దని వెంకటస్వామి వారించాడు. అయినా వారు వినకుండా వెళ్తామనడంతో అతను కూడా వెంటవెళ్లాడు. వీరు లోపలికి వెళ్తుండగా వెళ్లొద్దని, వెనక్కి రండని పిలిచాడు. కానీ అప్పటికే లోతులోకి వెళ్లిపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్నా వెంకటస్వామిది ఏమీ చేయలేని పరిస్థితి.

కాళేశ్వరం: ఒకటే ఊరు. వారంతా 20 ఏళ్లలోపు విద్యార్థులు. సమీప బంధువులు. అదే గ్రామానికి చెందిన బంధువుల వివాహ వేడుకల్లో ఆనందంగా గడిపారు. సరదాగా గడుపుదామని కాళేశ్వరం గోదావరి నదికి వెళ్లారు. ఈతరాని వారు ఒడ్డున నీటిలో ఆడలాడుతున్నారు. నది నీటి మట్టం పెరిగిన విషయం తెలియక మోకాల్లోతు నీటిలో ఆడుకుంటుండగా ఒకరు ప్రమాదవశాత్తు లోతులో కి వెళ్లిపోతుండగా అతన్ని కాపాడబోయి మరొక రు.. ఇతన్ని కాపాడబోయి మరొకరు ఇలా ఆరుగురు గల్లంతయ్యారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లి సమీప మేడిగడ్డ ఎగువన మూడోబ్లాక్‌ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో విషాదం అలుముకుంది.

అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు..

రాత్రి 6 గంటలకు ఆరుగురు విద్యార్థులు నదిలో మునగగా, సుమారు 8 గంటల సమయంలో స్థాని కులకు, పోలీసులకు సమాచారం అందింది. వెంట నే జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమైంది. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఆరు రెస్క్యూ బృందాలతోపాటు మహారాష్ట్ర సిరొంచకు చెందిన ఆపద మిత్ర గజ ఈతగాళ్ల బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. కాగా రాత్రివేళ కావ డం, నదిలో 5,100 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండటంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాలేదు. రాత్రి 11.50 గంటలకు గాలింపు ఆపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించనున్నారు. కాగా కాటారం డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి నదిలోకి దిగి ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం గాలింపు కోసం రెస్క్యూ టీం ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది.

ఐదు కుటుంబాల్లో విషాదం...

పెళ్లి వేడుకలను సంతోషంగా గడిపిన ఐదు కుటుంబాల్లో ఒకే రోజులో విషాదం నెలకొంది. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులతో పాటు మరో నాలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు చనిపోవడంతో ఆయా కుటుంబాలతో పాటు పెళ్లింట విషాదం నెలకొంది.

బిడ్డల కోసం ఎదురుచూస్తూ...

గల్లంతైన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రాత్రి నుంచి గోదావరి నది ఒడ్డునే ఉండి వేచి చూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను నిలిపివేసి వెనుదిరిగినప్పటికీ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి రోదించసాగారు. తమ పిల్లలు ప్రాణాలతో బయటకు రాకపోతారా... అని వేచి చూస్తుండటం స్థానికులను కలచివేసింది.

మేడిగడ్డ వద్ద గోదావరిలో ఆరుగురు విద్యార్థుల గల్లంతు

గల్లంతైన వారు..

అంబట్‌పల్లి వాసులు: పట్టి మధుసూదన్‌(18), పట్టి శివమనోజ్‌(15), తొగరి రక్షిత్‌(13), కర్ణాల సాగర్‌(16)

మహాముత్తారం మండలం కొర్లకుంట వాసి బొల్లెడ్ల రాంచరణ్‌(17), స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల రాహుల్‌(19)

సాయంత్రం 6 నుంచి 11.50 వరకు సాగిన గాలింపు.. లభించని ఆచూకీ

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లిలో విషాదం

నదీతీరం.. శోకసంద్రం1
1/3

నదీతీరం.. శోకసంద్రం

నదీతీరం.. శోకసంద్రం2
2/3

నదీతీరం.. శోకసంద్రం

నదీతీరం.. శోకసంద్రం3
3/3

నదీతీరం.. శోకసంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement